ప్రధాన వార్తలు
ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు
నేటి డిజిటల్ యుగంలో పెట్టుబడి లేకుండా, ఇంట్లో కూర్చుని లక్షల్లో సంపాదించే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. అయితే వీటికి మీ నైపుణ్యాలు, సమయాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారిత ప్లాట్ఫామ్లను ఉపయోగించుకునే చాలా వ్యాపారాలు సాగుతున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎలాంటి శ్రమ లేకుండా నిజానికి లక్షల రూపాయలు సంపాదించడం అనేది సాధ్యంకాదు. నిరంతర కృషి, సరైన వ్యూహం, మార్కెటింగ్ సామర్థ్యం, కొత్త ట్రెండ్లను ఉపయోగించుకుంటే డబ్బు సంపాదన తేలికవుతుంది. నగదు రూపేణా పెద్దగా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించడానికి అవకాశం ఉన్న కొన్ని వ్యాపార ఆలోచనలు చూద్దాం.ఫ్రీలాన్సింగ్ సేవలుమీకు ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉంటే దాన్ని సర్వీసుగా మార్చి డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు కంటెంట్ రైటింగ్ (తెలుగు/ఇంగ్లీష్), గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, డేటా ఎంట్రీ, ట్రాన్స్లేషన్ (అనువాదం) వంటి నైపుణ్యాలు ఉన్నాయంటే ఆన్లైన్లోని Fiverr, Upwork, Freelancer వంటి ప్లాట్ఫామ్ల్లో మీ సర్వీసులు అందించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. స్థానిక చిన్న వ్యాపారాలు లేదా స్టార్టప్ల కోసం డిజిటల్ మార్కెటింగ్ లేదా కంటెంట్ సేవలు అందిస్తూ డబ్బు సమకూర్చుకోవచ్చు.ఆన్లైన్ ట్యూటరింగ్/ కోచింగ్ఏదైనా అకడమిక్ సబ్జెక్ట్లో పరిజ్ఞానం (గణితం, సైన్స్), సంగీతం, యోగా, వంట, ప్రోగ్రామింగ్, భాషా నైపుణ్యాలు ఉంటే డిజిటల్ వేదికగా ఆన్లైన్ ట్యూటరింగ్ కోసం చాలా ప్లాట్ఫామ్లున్నాయి. లేదా సొంతంగా వీడియో కాల్స్ ద్వారా ట్యూషన్ చెప్పవచ్చు.Udemy, Skillshare వంటి వేదికల్లో ఆన్లైన్ కోర్సులను రికార్డ్ చేసి అమ్ముకోవచ్చు. కోర్సు అమ్మకాలు ఎక్కువైతే లక్షల్లో సంపాదన సాధ్యమవుతుంది.డ్రాప్షిప్పింగ్డ్రాప్షిప్పింగ్ అంటే ఉత్పత్తిని ముందే కొనుగోలు చేయకుండా ఆర్డర్ వచ్చిన తర్వాత నేరుగా సరఫరాదారు నుంచి కస్టమర్కు పంపే విధానం. ఇందుకోసం ఆన్లైన్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై అవగాహన పెంచుకోవాలి. మీరు ఒక ఆన్లైన్ స్టోర్ను సృష్టించి ఇతర కంపెనీల ఉత్పత్తులను అందులో ఉంచాల్సి ఉంటుంది. కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు ఆ ఆర్డర్ను సరఫరాదారుకు పంపితే వారు నేరుగా కస్టమర్కు డెలివరీ చేస్తారు. కొనుగోలు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని లాభంగా మీకు వస్తుంది.అనుబంధ మార్కెటింగ్ (Affiliate Marketing)సోషల్ మీడియా (YouTube, Instagram..) లేదా వెబ్సైట్ ద్వారా భారీ ఫాలోయింగ్/ట్రాఫిక్ ఉంటే ఈ అనుబంధ మార్కెటింగ్లో మంచిగానే సంపాదించవచ్చు. ఒక ఉత్పత్తికి సంబంధించిన ప్రత్యేక లింక్ను (Affiliate Link) మీ వెబ్సైట్లో లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆ లింక్ ద్వారా ఎవరైనా వస్తువులు కొనుగోలు చేస్తే మీకు నిర్దిష్ట శాతం కమీషన్ వస్తుంది.విజయానికి ముఖ్య అంశాలుపెట్టుబడి లేకుండా లక్షల్లో సంపాదించడానికి కేవలం ఆలోచన సరిపోదు. ఆన్లైన్ వ్యాపారాలలో విజయం సాధించడానికి రోజూ క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరం. మీ సర్వీసులు లేదా కంటెంట్ ఎక్కువ మందికి చేరడానికి సోషల్ మీడియా మార్కెటింగ్ తప్పనిసరి. మీరు అందించే సర్వీసు నాణ్యతగా ఉంటేనే కస్టమర్లు లేదా వీక్షకులు మిమ్మల్ని నమ్ముతారు. ఇంట్లో కూర్చొని పని చేసేటప్పుడు ఏకాగ్రతతో సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ముఖ్యం.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సూత్రాలు
మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సూత్రాలు
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో వారెన్ బఫెట్కు ప్రత్యేక స్థానం ఉంది. మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా భారతదేశంలోని సాధారణ వేతన జీవులు ఆర్థికంగా ఎదగడానికి, సంపదను సృష్టించడానికి ఉపయోగపడే అత్యంత విలువైన, ఆచరణాత్మక ఆర్థిక సూత్రాలను సూచించారు.ముందుగా పొదుపు, తర్వాతే ఖర్చుప్రతినెల జీతం వచ్చిన వెంటనే ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయడం కంటే ముందుగా పొదుపు చేయదలిచిన మొత్తాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత మిగిలిన దానితో ఖర్చులను సరిపెట్టుకోవాలి. ఈ సూత్రం ద్వారా పొదుపుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుంది. మధ్యతరగతి వారికి ఇది ఒక బలమైన ఆర్థిక పునాదిని ఏర్పరుస్తుంది.అనవసరమైన రుణాలను నివారించడంఅధిక వడ్డీ రేట్లు ఉండే రుణాలకు (ముఖ్యంగా క్రెడిట్ కార్డు రుణాలు) దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి సంపదను హరించివేస్తాయి. రుణాలను నివారించడం లేదా వీలైనంత త్వరగా వాటిని తీర్చేయడం ద్వారా వడ్డీ రూపంలో పోయే డబ్బు ఆదా అవుతుంది. దాన్ని పెట్టుబడికి ఉపయోగించవచ్చు. ఇది సంపద సృష్టి వేగాన్ని పెంచుతుంది.దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడిస్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు భయపడకుండా బలమైన వ్యాపార నమూనా, మంచి నిర్వహణ ఉన్న కంపెనీలను ఎంచుకుని దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టాలి. స్వల్పకాలిక లాభాల కోసం వెంపర్లాడకుండా సహనంతో ఉంటే కాలక్రమేణా చక్రవడ్డీతో చిన్న పెట్టుబడులు కూడా భారీ మొత్తంగా మారతాయి. మధ్యతరగతి వారికి సంపద సృష్టిలో ఇది అత్యంత కీలకమైన సూత్రం.తెలిసిన వాటిలో మాత్రమే పెట్టుబడి పెట్టడంమీకు పూర్తిగా అర్థం కాని లేదా అవగాహన లేని వ్యాపారాలు/పరిశ్రమలలో పెట్టుబడి పెట్టవద్దు. మధ్యతరగతి వారు నష్టాలను భరించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందుకే తాము అర్థం చేసుకోగలిగే, భవిష్యత్తులో వృద్ధి చెందే సామర్థ్యం ఉన్న వాటిలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి.సాధారణ వేతన జీవులకు సలహాలుప్రతి నెల బడ్జెట్ను పాటించాలి. అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించి అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. ధనవంతులుగా కనిపించడానికి లగ్జరీ వస్తువులు (పెద్ద ఇల్లు, ఖరీదైన కారు) కొనడానికి అప్పులు చేయవద్దు. విలువ తగ్గే ఆస్తులపై (ఉదా: కొత్త కారు) అధికంగా ఖర్చు పెట్టకుండా ఉండాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, జ్ఞానాన్ని నిరంతరం పెంచుకోవడం ద్వారా సంపాదన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. మంచి విద్య, నైపుణ్య శిక్షణ, నిరంతర అభ్యాసం ద్వారా ఉద్యోగంలో మెరుగైన స్థానం, అధిక జీతం పొందవచ్చు.ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు!
‘ఏరో-ఇంజిన్’ రాజధానిగా తెలంగాణ: మంత్రి
తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో-ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.ఆదిభట్లలో న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీటాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్(TASL), సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ ఫెసిలిటీ ద్వారా ఎయిర్బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజిన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపోనెంట్), లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్ (రోటేటివ్ కాంపోనెంట్)లు తయారు కానున్నాయి.ఈ కొత్త యూనిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్ అంటే కేవలం ‘సిటీ ఆఫ్ పెరల్స్’ మాత్రమే కాదని ‘ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్’ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.రాష్ట్రంలో ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు 2023-24లో రూ.15,900 కోట్లు ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరిగాయని మంత్రి చెప్పారు. విమాన తయారీ కంపెనీలకు రాష్ట్రం గమ్యస్థానంగా ఉందని, ఇక్కడ తామ కార్యకలాపాలు చేపట్టాలని అంతర్జాతీయ దిగ్గజ ఏరో సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. ఇంజిన్స్, కాంపోనెంట్స్, కన్వర్షన్స్, స్పేస్, డ్రోన్స్, డిజిటల్, ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వైస్ ప్రెసిడెంట్ డొమినిక్ డూప్, టీజీఐఐసీ ఎండీ శశాంక తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు!
తెలుగు రాష్ట్రాల్లో జియో టాప్
రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది. సెప్టెంబర్ 2025లో సంస్థ వైర్లెస్, వైర్లైన్ రెండు విభాగాల్లోనూ వృద్ధి సాధించినట్లు తెలిపింది. టెలికాం రెగ్యులేటర్ సంస్థ (TRAI) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, వైర్లైన్ విభాగంలో జియో 40,641 కొత్త యూజర్లను చేర్చుకొని తన సబ్స్క్రైబర్ సంఖ్యను 17.87 లక్షల నుంచి 18.28 లక్షలకు పెంచుకుంది. ఇది అన్ని ఆపరేటర్లలో అత్యధికం.ఈ వృద్ధి ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో జియోఫైబర్ బ్రాడ్బ్యాండ్, ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భారతి ఎయిర్టెల్ సెప్టెంబర్లో 12,043 మంది కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకోగా, బీఎస్ఎన్ఎల్ తక్కువ స్థాయిలో మాత్రమే వృద్ధి నమోదు చేసింది. వొడాఫోన్ ఐడియా మాత్రం 1,310 మంది యూజర్లను కోల్పోయింది.వైర్లెస్ విభాగంలో జియో 1.17 లక్షల కొత్త మొబైల్ సబ్స్క్రైబర్లను చేర్చుకొని తన మొత్తం యూజర్ బేస్ను సెప్టెంబర్ 2025 నాటికి 3.18 కోట్లకు చేర్చుకుంది. ఎయిర్టెల్ 39,248 కొత్త యూజర్లను యాడ్ చేసుకుంది. బీఎస్ఎన్ఎల్ చవక ధర ప్లాన్లతో 80,840 యూజర్లను సాధించింది. అయితే వొడాఫోన్ ఐడియా దాదాపు 70,000 యూజర్లను కోల్పోయింది.ఇదీ చదవండి: ఆరేళ్లు పూర్తి చేసుకున్న తొలి ప్రైవేట్ రైలు
ఆరేళ్లు పూర్తి చేసుకున్న తొలి ప్రైవేట్ రైలు
భారతీయ రైల్వే ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి విస్తృత శ్రేణి సేవలను అందిస్తున్నప్పటికీ, 2019లో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలును ప్రవేశపెట్టి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే ఈ రైలు ఆరేళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ రైలును పూర్తిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తుంది.మొదటి ప్రైవేట్ రైలుదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్.న్యూఢిల్లీ నుంచి లఖ్నవూ వరకు ఈ రైలు నడుస్తుంది.ఈ సర్వీసును అక్టోబర్ 4, 2019న ప్రారంభించారు.ఈ సర్వీసు ప్రారంభించి ఆరేళ్లు పూర్తయినప్పటికీ, అదే మార్గంలో నడుస్తున్న రాజధాని, శతాబ్ది, వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి ఇతర ప్రీమియం సేవల కంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.న్యూఢిల్లీ - లఖ్నవూ మధ్య టిక్కెట్ ఛార్జీల పోలికరైలు సర్వీసుతరగతిటికెట్ ధర (రూ.)IRCTC తేజస్ ఎక్స్ప్రెస్ఏసీ చైర్ కార్రూ. 1,679IRCTC తేజస్ ఎక్స్ప్రెస్ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 2,457శతాబ్ది ఎక్స్ప్రెస్ఏసీ చైర్ కార్రూ. 1,255శతాబ్ది ఎక్స్ప్రెస్ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 1,955వందే భారత్ ఎక్స్ప్రెస్ఏసీ చైర్ కార్రూ. 1,255వందే భారత్ ఎక్స్ప్రెస్ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 2,415రాజధాని ఎక్స్ప్రెస్ఏసీ థర్డ్ టైర్ (3A)రూ. 1,590రాజధాని ఎక్స్ప్రెస్ఏసీ సెకండ్ టైర్ (2A)రూ. 2,105రాజధాని ఎక్స్ప్రెస్ఏసీ ఫస్ట్ క్లాస్ (1A)రూ. 2,630 తేజస్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకతలుతేజస్ ఎక్స్ప్రెస్ అనేది ఆధునిక సదుపాయాలతో కూడిన సెమీ హై స్పీడ్ రైలు. ఈ కోచ్లను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడవగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే రైలు పట్టాలకు సంబంధించిన అడ్డంకుల కారణంగా ఈ కోచ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. స్టీల్ బ్రేక్ డిస్క్, సింటెర్డ్ ప్యాడ్లు, ఎలక్ట్రో-న్యూమాటిక్ అసిస్ట్ బ్రేక్ సిస్టమ్ ఇందులో ఉంది.ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు!
60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు!
ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు అందించింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచేలా 8వ వేతన కమిషన్కు కేంద్ర కేబినెట్ మంగళవారం (అక్టోబర్28) ఆమోదం తెలిపింది. ఎనిమిదో సెంట్రల్ పే కమిషన్ విధి విధానాలకు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) రూపొందించేందుకు కేబినెట్ ఆమోదించింది.8వ పే కమిషన్8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు జరిపింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి త్వరగానే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.ఎవరిపై ప్రభావం?ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)కు తాజాగా ఆమోదం తెలిపింది. ఇది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(కొత్త బేసిక్పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.ఇదీ చదవండి: అధిక సంఖ్యలో టీకాల వల్ల పిల్లల్లో ఆటిజం: శ్రీధర్ వెంబు60 ఏళ్లలో 260 రెట్లు పెరుగుదలకేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గత ఆరు దశాబ్దాలలో (1956 నుంచి 2016 వరకు) భారీగా వృద్ధి చెందాయి. మొదటి వేతన సంఘం (1956) కాలంలో ఒక ఉద్యోగికి రూ.100 మూల వేతనం ఉంటే, అది ఏడో వేతన సంఘం (2016) నాటికి సుమారు రూ.26,000కి చేరింది. అంటే 60 ఏళ్ల కాలంలో జీతం సుమారు 260 రెట్లు పెరిగింది. 8వ పే కమిషన్ అమల్లోకి వస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.వేతన సంఘాల వారీగా జీతాల వృద్ధి (1956లో రూ.100 మూల వేతనంగా పరిగణించి)వేతన సంఘం (CPC)సంవత్సరంసవరించిన తర్వాత బేసిక్ జీతంముఖ్య అంశాలు1వ CPC1956రూ.100వ్యవస్థీకృత వేతన స్కేళ్ల (Structured Pay Scales)ను ప్రవేశపెట్టారు.2వ CPC1960రూ.105–110ద్రవ్యోల్బణం కోసం సర్దుబాట్లు చేశారు.3వ CPC1973రూ.180–200ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరగడం వల్ల పెంపు.4వ CPC1986రూ.700–750కరువు భత్యం (DA) విలీనం, భారీ పెంపు.5వ CPC1996రూ.2,500–3,00030–35% పెంపును సిఫార్సు చేశారు.6వ CPC2006రూ.7,000–8,000పే బ్యాండ్ (Pay Band) + గ్రేడ్ పే (Grade Pay) విధానం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సుమారు 1.86గా నిర్ణయించారు.7వ CPC2016రూ.25,000–26,0002.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్
కార్పొరేట్
‘ఏరో-ఇంజిన్’ రాజధానిగా తెలంగాణ: మంత్రి
ఆరేళ్లు పూర్తి చేసుకున్న తొలి ప్రైవేట్ రైలు
‘అధిక సంఖ్యలో టీకాల వల్ల పిల్లల్లో ఆటిజం’
ఇరవై ఏళ్లుగా మైక్రోసాఫ్ట్లో జాబ్.. లేఆఫ్ తర్వాత ఏం చేస్తున్నారంటే..
ఎలాన్ మస్క్ టెస్లాకు బై..బై?
2030 నాటికి 80 బిలియన్ డాలర్లు!: అమెజాన్
ఇంటర్నేషనల్ నంబర్లతో యూపీఐ చెల్లింపులు
2022 తరువాత.. అతిపెద్ద లేఆఫ్స్!
ఐపీవోకు 5 కంపెనీలు సై
రూ. 299తో 35జీబీ డేటా: ఉచితంగా జియోఫై డివైజ్
పసిడి పతనం.. కొనుగోలుదారులకు మంచి తరుణం
పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బం...
300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
ఫెడ్ నిర్ణయాలపై మార్కెట్ల దృష్టి
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస...
మారిన విధి.. ఖాతాలోకి రూ.2,817 కోట్లు!
లక్ష్మీదేవి తలుపు తట్టిందా అన్నట్లు.. మధ్యప్రదేశ్...
ఈ–20 ప్రణాళికపై స్పష్టతనివ్వండి
ప్రస్తుతం వినియోగిస్తున్న ఈ–20 (పెట్రోల్లో 20 శాత...
బ్యాంక్ ఖాతాకు ఇక నలుగురు నామినీలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులు, డిపాజిటర్లు ఇకపై ...
ఎంఎస్ఎంఈ రుణాలకు టారిఫ్ల దెబ్బ
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్...
భారతీయ మహిళల వద్ద ఇంత బంగారం ఉందా?
భారతీయులు అలంకార ప్రియులనే విషయాన్ని చరిత్ర కారులు...
ఆటోమొబైల్
టెక్నాలజీ
మ్యాజిక్ కవర్స్.. ఫోన్ను ఫుల్ చార్జ్ చేస్తుంది
ఫోన్ మన ఫ్రెండ్, మన స్టయిల్, కొన్నిసార్లు మన సీక్రెట్ కీపర్ కూడా! అలాంటి ఫోన్ను కాపాడే కవర్స్, ఫోన్ కేస్లను తక్కువ అంచనా వేయొద్దు! ఇవి కేవలం ప్రొటక్షన్ కోసం మాత్రమే కాదు. స్మార్ట్నెస్, సౌలభ్యం అన్నీ కలిపిన మ్యాజిక్ కవర్స్ కూడా!సోలార్ కేస్!ఫోన్ ‘లో బ్యాటరీ’ అని అరుస్తుందా? పైగా పవర్బ్యాంక్ కూడా మర్చిపోయారా? టెన్షన్ వద్దు! బయటకి వెళ్లి సూర్యుడి వైపు మీఫోన్ను చూపించండి. అప్పుడు ఈ కేస్ చెప్తుంది ‘ఓకే బ్రో, నేను ఉన్నా కదా!’ ఎందుకంటే ఇది సాధారణ ఫోన్ కవర్ కాదు. ‘అయాన్ సోలార్ కేస్’ మార్కెట్లో కొత్తగా వచ్చిన ఈఫోన్ కేస్ ఒక గంట సూర్యరశ్మిని ఉపయోగించి మీ ఫోన్ను ఫుల్ చార్జ్ చేస్తుంది. వైర్లు లేవు, ప్లగ్ లేదు. పైగా క్యూట్గా క్లాసీగా స్టయిలిష్ డిజైన్తో కూడా వస్తుంది. ఇది తొంభై ఐదు శాతం పవర్ను సమర్థంగా ట్రాన్స్ఫర్ చేయగలదు. అంటే ఎక్కడైనా, చార్జింగ్ ఎఫిషియెన్సీ పూర్తి అయితే, తర్వాతి రోజులకు ఇది, ఒక పవర్బ్యాంక్ లాగా బ్యాటరీని స్టోర్ కూడా చేస్తుంది. ధర 99 డాలర్లు అంటే రూ. 8,778.సెల్ఫీ స్టార్ఫోన్లో ఫొటో తీసుకుంటే వెలుతురు తక్కువగా ఉందా? వీడియో తీయాలంటే ముఖం స్పష్టంగా కనిపించడం లేదా? ఇక ఆ సమస్యలకు పూర్తి లైట్ సొల్యూషన్ వచ్చేసింది! అదే ఈ ‘సెల్ఫీ ఎల్ఈడీ రింగ్ లైట్ కేస్’. ఫోన్ కవర్లా కనిపించే ఈ కేస్లోనే లైట్ దాగి ఉంటుంది. బటన్ నొక్కగానే గుండ్రంగా వెలిగే రింగ్ లైట్ బయటకి వస్తుంది. ఒక్కసారి నొక్కితే లైట్ ఆన్, తర్వాతి ఆప్షన్లతో మీ ఇష్టానికి సరిపోయేలా వెలుతురు తక్కువగా లేదా ఎక్కువగా సర్దుకోవచ్చు. సెల్ఫీలు, వీడియోలు, మేకప్, రీల్లు ఏదైనా సరే, మిమ్మల్ని ఒక స్టార్లా మెరిపించే బాధ్యత ఇది తీసుకుంటుంది. అదనపు వైర్లు, బ్యాటరీల అవసరం లేకుండా, దీనిని యూఎస్బీ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ధర బ్రాండ్, డిజైన్ బట్టి మారుతుంది.పాకెట్లో గేమ్ పార్ట్నర్పెద్ద గేమ్ కంట్రోలర్ను జేబులో పెట్టుకొని వెళ్లడం సాధ్యం కాదు. కాని, ఫోన్కు ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే కేస్లో దాచేస్తే ఎలా ఉంటుంది ? అదే ఈ ‘ఎమ్కాన్ కంట్రోలర్’. ఇది బయటకి సాధారణ ఫోన్ కేసులా కనిపించినా, లోపల మాత్రం గేమింగ్ మాయ దాగి ఉంటుంది. దీని సైడ్లో ఉన్న రెండు బటన్లను ఒకేసారి నొక్కగానే అసలు సరదా మొదలవుతుంది! అప్పటిదాకా, ఫోన్ వెనుక దాగి ఉన్న గేమ్ కంట్రోలర్ ఒక్కసారిగా బయటకి వచ్చేస్తుంది. కనెక్ట్ చేయడం చాలా సులభం. స్క్రీన్ను గేమింగ్ కోణంలో సెట్ చేసి, గ్రిప్స్ను లాక్ చేస్తే, ఇక దీనికున్న స్మూత్ బటన్లతో ఆట నిశ్శబ్దంగా, స్మూత్గా సాగిపోతుంది. తక్కువ బరువుతో, స్టయిలిష్గా పాకెట్లో సులభంగా ఇమిడిపోయేలా దీని డిజైన్ ఉంటుంది. ధర 129 డాలర్లు, అంటే సుమారు రూ. 11,439.
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: హై-స్పీడ్ డేటా, ఫ్రీ కాలింగ్స్
జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే.. హై-స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించేవారు కొరకు.. మూడు అద్భుతమైన ఫ్యాక్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డేటా మాత్రమే కాకుండా.. ఫ్రీ టీవీ ఛానెల్స్, ఓటీటీ యాప్లకు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.రూ. 599 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడంతో.. మీకు 30Mbps ఇంటర్నెట్ వేగం.. 1000GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఫ్రీ వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా.. 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్లు, జియో హాట్స్టార్, సోనీ లివ్, జీ5 తో సహా 11 ఓటీటీ యాప్లకు యాక్సెస్ను పొందవచ్చు.రూ. 899 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. 1000GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. కాగా ఈ ప్లాన్ 800కి పైగా టీవీ ఛానెల్లు, జియో హాట్స్టార్, సోనీ లివ్ & జీ5 తో సహా 11 ఓటీటీ యాప్లకు యాక్సెస్ పొందవచ్చు.రూ. 1199 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. మీకు మొత్తం 1000GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో వస్తుంది. 800కి పైగా టీవీ ఛానెల్స్, నెట్ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్స్టార్తో సహా 15 ఓటీటీ యాప్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: అరట్టైను తెలుగులో ఎలా పిలవాలంటే?: శ్రీధర్ వెంబు
ఏఐ నిపుణులకు భారీగా డిమాండ్
ముంబై: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గ్లోబల్ హైరింగ్ ప్లాట్ఫాం ఇండీడ్లో ఈ ఏడాది సెప్టెంబర్లో ఏఐ సంబంధ జాబ్ పోస్టింగ్స్ 11.7 శాతం మేర పెరగడం ఇందుకు నిదర్శనం. గతేడాది సెప్టెంబర్లో ఇది 8.2 శాతంగా నమోదైంది. తమ ప్లాట్ఫాంలో జాబ్ పోస్టింగ్ల ఆధారంగా ఇండీడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం సెప్టెంబర్లో 11.7 శాతం పోస్టింగ్స్లో ప్రత్యేకంగా ఏఐని ప్రస్తావించారు. తమకు కీలకమైన భారత మార్కెట్ తర్వాత సింగపూర్లో మాత్రమే ఏఐ నిపుణులకు ఈ స్థాయిలో డిమాండ్ కనిపించినట్లు ఇండీడ్ ఏపీఏసీ సీనియర్ ఎకానమిస్ట్ క్యాలమ్ పికరింగ్ తెలిపారు. ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలు ప్రధానంగా టెక్ రంగంలోనే ఉన్నప్పటికీ, క్రమంగా ఇతర రంగాల్లోను పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → దాదాపు 39 శాతం డేటా, అనలిటిక్స్ ఉద్యోగాల పోస్టింగ్స్లో ఏఐ ప్రస్తావన ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (23 శాతం), బీమా (18 శాతం), సైంటిఫిక్ రీసెర్చ్ (17 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. → పలు ఇంజినీరింగ్ కేటగిరీల్లో సర్వసాధారణంగా ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (17 శాతం), మెకానికల్ ఇంజినీరింగ్ (11 శాతం), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (9.2 శాతం) ఈ కేటగిరీల్లో ఉన్నాయి. → దేశీయంగా ఉద్యోగులు క్రమంగా సంఘటిత ఉద్యోగాల వైపు మళ్లుతున్నారు. → ఏఐ కారణంగా హైరింగ్ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అత్యధిక నైపుణ్యాలున్న, స్పెషలైజ్డ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మటుకు సంస్థలు, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్ మొదలైన ఏఐ సంబంధ టూల్స్పై గట్టి పట్టున్న అభ్యర్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
400 సెల్ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా?
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా కొత్త కోణాన్ని గుర్తించాయి. ప్రమాదానికి ఇతర అంశాలు కారణమైనా, బస్సు లగేజీ క్యాబిన్లో ఉన్న సుమారు 400 మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలిపాయి.ఘటన జరిగిందిలా..కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం.. బస్సు ఒక బైకును ఢీకొట్టగానే ఆ బస్సు కింద బైకు ఇరుక్కుపోయింది. దాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ మంటలు తొలుత లగేజీ క్యాబిన్కు అంటుకున్నాయి. ఆ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉంది. అధిక వేడి వల్ల ఈ ఫోన్లలో వాడే బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి.బ్యాటరీలు పేలడం వల్ల భారీ శబ్దం వచ్చి మంటలు మరింత తీవ్రమయ్యాయి. ఈ మంటలు లగేజీ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్కు వేగంగా వ్యాపించాయి. లగేజీ క్యాబిన్ పైభాగంలో, అంటే బస్సు మొదటి భాగంలో ఉండే సీట్లు, బెర్తుల్లో ఉన్నవారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో బయటపడలేకపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ మాత్రం తన సీటు పక్కన ఉండే కిటికీ నుంచి తప్పించుకున్నాడు. ప్రాథమికంగా ఫొరెన్సిక్ అధికారులు చెప్పిన పైవివరాల ప్రకారం బస్సు ఢీకొనడం వల్ల మంటలు ప్రారంభమైనప్పటికీ మొబైల్ ఫోన్లలోని బ్యాటరీల పేలుడే ప్రమాద తీవ్రతను పెంచింది.లిథియం అయాన్ బ్యాటరీలుమొబైల్ ఫోన్లలో సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ బ్యాటరీలు అధిక శక్తి సాంద్రత కలిగి ఉండటం వల్ల చిన్న పరిమాణంలో ఎక్కువ శక్తిని నిల్వ చేయగలవు. అయితే ఇవి వేడెక్కినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయి.ఈ బ్యాటరీలు పేలేందుకు కారణాలుఈ బ్యాటరీలకు వేడి తగిలితే పేలే అవకాశం ఉంటుంది. బస్సు ప్రమాదంలో జరిగింది ఇదే. బయట నుంచి అగ్ని ప్రమాదం కారణంగా వేడి ఎక్కువై పార్శిల్ క్యాబిన్లోకి వచ్చింది. దాంతో ఫోన్లలోని బ్యాటరీలు వేడై పేలిపోయాయి.బ్యాటరీ పూర్తిగా నిండిన తర్వాత కూడా ఛార్జింగ్ కొనసాగడం వల్ల బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది.బ్యాటరీ లోపల అనోడ్, కాథోడ్ పొరలు దెబ్బతినడం లేదా పటిష్టమైన తయారీ విధానాలు అనుసరించకపోవడంతో అవి ఒకదానితో ఒకటి తాకితే పేలిపోతాయి.పూర్తిగా బ్యాటరీ అయిపోయేంత వరకు వేచి చూసి ఒక్కసారిగా ఛార్జింగ్ పెట్టినా పేలే అవకాశం ఉంటుంది.బస్సు ఢీకొన్న సందర్భంలో పార్శిళ్లు, అందులోని వస్తువులు గట్టిగా కొట్టుకోవడం వల్ల బ్యాటరీ నిర్మాణంలో మార్పులు వచ్చి అంతర్గత షార్ట్ సర్క్యూట్కు దారితీయవచ్చు.బ్యాటరీ పేలుడు వెనుక రసాయన చర్యలులిథియం అయాన్ బ్యాటరీ పేలడాన్ని ‘థర్మల్ రన్అవే’ అని కూడా పిలుస్తారు. అధిక వేడిమి లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ సెల్లో ఉష్ణోగ్రత నిర్ణీత పరిమితి దాటినప్పుడు థర్మల్ రన్అవేకు దారి తీస్తుంది. మొదట కాథోడ్, అనోడ్లను వేరు చేసే సెపరేటర్ (పాలిమర్) కరిగిపోతుంది. సెపరేటర్ కరగడం వల్ల కాథోడ్, అనోడ్ నేరుగా ఒకదాంతో ఒకటి తాకి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. దీనివల్ల మరింత ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద అందులోని కెమికల్స్ విచ్ఛిన్నం కావడం మొదలవుతుంది. అదే సమయంలో ఎలక్ట్రోలైట్ (బ్యాటరీ లోపల ఉండే ద్రవం) వేడెక్కి ఆవిరై మండే స్వభావం గల హైడ్రోకార్బన్ వాయువులను విడుదల చేస్తుంది.ఈ చర్యలో విడుదలైన ఆక్సిజన్, ఇతర మండే వాయువులు అధిక వేడి వల్ల మరింత తీవ్రంగా పేలిపోతాయి. ఒక సెల్ పేలడం వల్ల విడుదలైన వేడి పక్కనే ఉన్న ఇతర మొబైళ్లకు వ్యాపించి అవి కూడా థర్మల్ రన్అవేకు గురవుతాయి. ఈ గొలుసుకట్టు చర్య కారణంగా బస్సు లగేజీ క్యాబిన్లో వందల కొద్దీ ఫోన్లు వరుసగా పేలి భారీ శబ్దంతో అగ్ని తీవ్రత పెరగడానికి కారణం కావచ్చు.లిథియం బ్యాటరీలతో జాగ్రత్త - నాగసాయి, ఏసీపీ, సిటీ సెక్యూరిటీ వింగ్, సైబరాబాద్కర్నూలు బస్సు అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరం. క్లూస్ టీమ్ ప్రాథమికంగా విచారించిన అంశాలను బట్టి బస్సు బైక్ను ఢీకొట్టడంతో కింద ఇరుక్కుపోయి మంటలు చెలరేగాయి. అవికాస్తా పార్శిల్ క్యాబిన్కు వ్యాపించి అందులోని మొబైళ్లు ఒక్కసారిగా పేలాయి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. సాధారణంగా ఫోన్లలో వాడే లిథియం అయాన్ బ్యాటరీలకు పేలే గుణం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అవి పేలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఫోన్లు వాడటం జీవితంలో భాగమైంది. ఈ క్రమంలో యూజర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఛార్జింగ్ చేసేటప్పుడు లేదా సాధారణంగా ఉపయోగించేటప్పుడు ఫోన్ను ఎండలోగానీ, కారు డాష్బోర్డ్ల్లో, స్టవ్ లేదా రేడియేటర్ వంటి అధిక వేడిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో పెట్టకూడదు. వేడి పెరిగితే బ్యాటరీ పేలే ప్రమాదం ఉంటుంది.ఎల్లప్పుడూ ఫోన్ తయారీదారు సిఫార్సు చేసిన ఒరిజినల్ ఛార్జర్, కేబుల్ను మాత్రమే ఉపయోగించాలి.నాసిరకం ఛార్జర్లు ఓవర్ఛార్జింగ్కు లేదా అధిక వేడికి దారితీయవచ్చు.ఫోన్ను రాత్రంతా లేదా ఎక్కువ సేపు ఛార్జింగ్లో ఉంచడం మానుకోండి. 80 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ అయిన తర్వాత తీసివేయడం ఉత్తమం.ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ను వాడడం మానుకోవాలి. దీనివల్ల వేడి పెరిగే ప్రమాదం ఉంది.ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ను దుప్పటి, దిండు లేదా మంచం వంటి గాలి ఆడకుండా ఉండే మెత్తటి ఉపరితలాలపై కాకుండా గట్టి, చల్లటి ఉపరితలం (టేబుల్)పై ఉంచండి.బ్యాటరీ స్థాయి 20 శాతం కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోవడం మంచిది.ఫోన్ను కింద పడేయడం, బలంగా కొట్టడం లేదా వంచడం వంటివి చేయకండి. దీనివల్ల బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్కు దారితీయవచ్చు.మీ ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే లేదా ఫోన్ వెనుక భాగం ఉబ్బినట్లయితే వెంటనే దాన్ని ఉపయోగించడం ఆపివేసి సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లండి. ఉబ్బిన బ్యాటరీలు చాలా ప్రమాదకరం.ఒక్క మొబైళ్లలోనే కాదు, ఇంట్లో వాడే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈవీ వాహనాల్లోనూ లిథియం బ్యాటరీలు వాడుతున్నారు. వీటిని వాడే సమయంలో నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పర్సనల్ ఫైనాన్స్
ధర్మ మార్గాన ధనార్జన
నేటి ఆధునిక యుగంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించడం ప్రతి ఒక్కరి కల. అయితే కొందరు వ్యక్తుల్లో ‘ఎదుటివారిని మోసం చేస్తేనే ధనవంతులు కాగలం’ అనే తప్పుడు అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. ఈ విధమైన అక్రమ సంపాదన ధోరణి తాత్కాలికంగా ఫలించినా అది ఎప్పుడూ స్థిరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వలేదు. నిజమైన, నిలకడైన సంపదను, గౌరవాన్ని సాధించాలంటే కచ్చితంగా ధర్మబద్ధమైన మార్గాలనే అనుసరించాలి. సగటు ఉద్యోగి, వ్యాపారి లేదా ఇతర రంగాల్లో ఉన్నవారు నైతిక విలువలను పాటిస్తూ సరైన ఆర్థిక ప్రణాళికతో ధనవంతులు ఎలా కావాలో చూద్దాం.ఆదాయాన్ని పెంచే నైపుణ్యాలపై దృష్టిఉద్యోగులు తమ వృత్తిలో అత్యంత విలువైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా జీతం పెరిగే అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంస్థకు లాభాలను తెచ్చిపెట్టే లేదా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టాలి.వ్యాపారులు, ఇతర నిపుణులు తమ ఉత్పత్తులు లేదా సర్వీసుల్లో నిరంతరం కొత్త ఆవిష్కరణలు తీసుకురావడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడం ద్వారా వ్యాపార విస్తరణ, లాభాల పెంపు సాధ్యమవుతుంది. నాణ్యత, నమ్మకమే విజయానికి పునాది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఖర్చులపై నియంత్రణ, పొదుపుధనవంతులు కావడానికి కేవలం ఎక్కువ సంపాదించడం మాత్రమే మార్గం కాదు. సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయడం చాలా ముఖ్యం. నెలవారీ ఖర్చులను ట్రాక్ చేస్తూ దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి. అనవసరమైన, ఆడంబరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. జీతం రాగానే మొదట కొంత మొత్తాన్ని పొదుపు/ పెట్టుబడి ఖాతాలోకి మళ్లించాలి. మిగిలిన దానితోనే ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. ఈ అలవాటు ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుంది.తెలివైన పెట్టుబడులుకాలంతో పాటు డబ్బు విలువ తగ్గకుండా వృద్ధి చెందేలా పెట్టుబడి పెట్టడం అవసరం. పదవీ విరమణ, పిల్లల చదువులు వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్లాన్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు, రియల్ ఎస్టేట్, బంగారంలో క్రమబద్ధంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా వడ్డీ, రాబడి రూపంలో సంపద పెరుగుతుంది. వీటిలో ఇన్వెస్ట్ చేసేముందు నిపుణుల సలహా తీసుకోవాలి. అధిక వడ్డీ ఉన్న అప్పులను (ముఖ్యంగా క్రెడిట్ కార్డు అప్పులు) వీలైనంత త్వరగా తీర్చేయాలి. మంచి అప్పులు (వ్యాపార విస్తరణకు లేదా విలువ పెంచే ఆస్తుల కొనుగోలుకు) మాత్రమే చేయడం తెలివైన నిర్ణయం అవుతుంది.ఇదీ చదవండి: కాలంతో మారిన కంపెనీలు.. అందుకు కారణాలు
‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’
ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బిట్కాయిన్, బంగారం(Gold), వెండి పెట్టుబడులకు సంబంధించి తాజాగా మరో ట్వీట్ చేశారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి చాలా మంది యూట్యూబ్ జాకీలు భయాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.రాబర్ట్ కియోసాకి తన తాజా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) పోస్ట్లో "ఫియర్ క్లిక్ బైటింగ్" గురించి విమర్శించారు. వ్యూస్, సబ్స్కైబర్లను పెంచుకోవడానికి ఆన్ లైన్ కంటెంట్ క్రియేటర్లు ఆర్థిక మార్కెట్ల గురించి ముఖ్యంగా బిట్ కాయిన్, బంగారం, వెండి గురించి భయంకరమైన అంచనాలను పోస్ట్ చేస్తున్నారన్నారు."చాలా మంది యూట్యూబ్ జాకీలు... 'ఫియర్ క్లిక్ బైట్స్' తో మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.. 'బిట్ కాయిన్ క్రాష్ కాబోతోంది.. లేదా బంగారం, వెండి పతనం కానున్నాయి' వంటి అంచనాలను చెబుతున్నారు. తర్వాత 'నా వెబ్ సైట్ కు సబ్ స్క్రైబ్ చేయండి' అంటూ అడుక్కుంటున్నారు. ఎంత మోసం?" అంటూ కియోసాకి రాసుకొచ్చారు.నిజమైన ఆస్తులను కలిగి ఉండటంపై తన నమ్మకాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కియోసాకి, ఆ మార్కెట్లలో భవిష్యత్తులో ఏదైనా తిరోగమనం వస్తే మరింత కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. "వాళ్లు చెబుతున్నట్లు ఒకవేళ బిట్కాయిన్, ఎథేరియం, బంగారం, వెండి వంటివి క్రాష్ అయితే ఆ తగ్గిన ధరలకు మరింత ఎక్కువ కొనుగోలు చేస్తాను" అన్నారు.ఇదీ చదవండి: షేర్ల విక్రయాలు – పన్ను మినహాయింపు"అసలు సమస్య నకిలీ డబ్బు, అసమర్థ నాయకులు.. లక్షల కోట్లలో ఉన్న జాతీయ రుణం." అని పేర్కొన్న రాబర్ట్ కియోసాకి యూఎస్ డాలర్ "ఫేక్ మనీ" అని చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి రియల్ మనీ అని చెప్పే బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం వంటివాటిని పోగుచేసుకోవాలని తన ఫాలోవర్లకు సూచించారు.FEAR CLICK BAITING:Many You Tube jockeys, vs old time Radio Disc Jockies….lure you in with “Fear Click Baits.” They state such predictions as “Bitcoin to crash.” Or “Gold and silver to crash.”Then they say “ Subscribe to my website.” How phoney. How fake?”If the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 27, 2025
షేర్ల విక్రయాలు – పన్ను మినహాయింపు
ప్ర. మా దగ్గర ఈక్విటీ షేర్లు ఉన్నాయి. అవన్నీ లిస్టెడ్..లాంగ్ టర్మ్. వాటిని అమ్మితే ఏర్పడ్డ లాభాలను గుర్తింపు పొందిన బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు లభిస్తుందా? – ఎ.వి. రమణ మూర్తి, విశాఖపట్నంజ. మూలధన లాభాల నుంచి మినహాయింపు పొందాలంటే సెక్షన్లలో నిర్దేశించిన విధంగా ఇన్వెస్ట్ చేస్తేనే మినహాయింపు ఇస్తారు. ఉదాహరణకు, ఇల్లు, భూమి.. రెండూ.. ఇటువంటివి అమ్మి, షరతులకు లోబడి మళ్లీ ఇళ్లు కొంటే మినహాయింపు ఇస్తారు. ఇలాంటి మినహాయింపు షేర్ల విషయంలో ఒక ఇంటికి తప్ప దేనికి లేదనే చెప్పాలి. బాండ్లకి మినహాయింపు లేదు. ఇల్లు అమ్మి, ఇల్లు కొంటే మినహాయింపు.. అలాగే ల్యాండ్, ఇండస్ట్రియల్ హబ్. కానీ బంగారం అమ్మి బంగారం కొంటే మినహాయింపు లేదు. అలాగే, వెండి, ఆభరణాలు కూడా.అయితే, మినహాయింపు విషయంలో ఒక్క గుర్తింపు పొందిన బాండ్లకు మాత్రం అవకాశం ఉంటుంది. అవేమిటంటే, నేషనల్ హైవే, రూరల్ ఎలక్ట్రిఫికేషన్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్లు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ బాండ్లు. ఇళ్లు మళ్లీ కొనుక్కోకపోయినా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే మినహాయింపు దొరుకుతుంది. ఇదొక మంచి అవకాశం. ఇక షేర్స్ విషయానికొస్తే..అవి లిస్టెడ్ షేర్లు అయి ఉండాలి.లాంగ్ టర్మ్ అయి.. అంటే ఏడాది దాటి ఉండాలి ఇటువంటివి అమ్మితే ఏర్పడ్డ లాభాలకు సంబంధించి విషయాలను తెలుసుకుందాం.అలా ఏర్పడ్డ లాభాల మీద మొదటి రూ. 1,25,000లకు మినహాయింపు, బేసిక్గా దొరుకుతుంది. జీతంలో స్టాండర్డ్ డిడక్షన్లాగా.మిగతా లాభం మీద 12.5 శాతం పన్ను విధిస్తారు.మీ ఆలోచన లిస్టెడ్ షేర్ల మీదే ఉండాలి. హోల్డింగ్ పీరియడ్ ఏడాది దాటాలి.ఇక మీ చేతిలో ఉన్న మొత్తం మీ ఇష్టం. బంగారమే కొంటారో. వెండి కొంటారో .. పిల్ల పెళ్లో.. అబ్బాయి చదువో.. ల్యాండో.ఎలాగూ అమ్మే ముందు లాభం తెలుస్తుంది, కాబట్టి ఆ లాభం సుమారుగా రూ. 1,12,500 లోపల ఉంటుంది. కాబట్టి ఎటువంటి పన్ను భారం ఉండదు.ట్రెండింగ్లో కొన్న షేర్లు నష్టాలబాటలో ఉంటాయి. వాటిని వదిలించుకోండి. నష్టం ఏర్పడుతుంది. ఆ నష్టాన్ని మిగతా, మూలధన లాభంతో (షేర్ల మీద) సర్దుబాటు చేసుకోవచ్చు. మొత్తం మీద బేసిక్ లిమిట్ దాటకుండా ఉంటే, ఇప్పుడు మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేయండి. పన్ను భారం ఉండదు.అమ్మగా వచ్చిన మొత్తం, పన్ను చెల్లించి మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేయండి. కొత్త షేర్లు బాగా పెరిగితే, మీకు లాంగ్ రేంజిలో ప్రయోజనం ఉంటుంది. డివిడెండ్లతో పాటు ఆస్తి విలువ పెరిగిపోతుంది.కొంత మంది త్వరలో పెళ్లి చెద్దామనుకుంటున్నవారు బంగారం, వెండి కొంటున్నారు.80సీలో ఉన్న ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.. ఉత్తరోత్తరా మినహాయింపు దొరుకుతుంది.ఒక అవకాశం, ఇల్లు తప్ప ఏ ఆస్తి అమ్మినా, బంగారం, ల్యాండ్, షేర్లు వల్ల ఏర్పడ్డ క్యాపిటవ్ గెయిన్స్తో సెక్షన్ 54 ఎఫ్ కింద ఒక ఇల్లు కొనవచ్చు/కట్టుకోవచ్చు. అమ్మకాల విలువలోనుంచి కాస్ట్ తీసివేసి, మిగతా పరిహారం ఇన్వెస్ట్ చేయాలి. చేసినంత మేరకే మినహాయింపు ఇస్తారు. నిర్దేశిత వ్యవధిలోపల కొనాలి/కట్టించాలి. ఆఇంటి మీద ఖర్చు రూ. 10 కోట్లు దాటకూడదు. దాటినా మినహాయంపు రూ. 10 దాటి ఇవ్వరు. షేర్లు అమ్మిన వ్యక్తి పేరు మీదే ఇల్లు కొనాలి.ముఖ్యంగా ఇల్లు కొనే వేళకు ఆ వ్యక్తి పేరుమీద ఇల్లు ఉండదు. అంటే ఈ రిలీఫ్ ఇల్లు లేని వాళ్లు కొనుక్కోంటేనే వస్తుంది.చివరిగా చెప్పాలంటే..లిస్టెడ్ షేర్లు లాంగ్ టెర్మ్లో అమ్మితే, బేసిక్ లిమిట్ రూ. 1,25,000 తప్ప ఎలాంటి మినహాయింపు లేదు. మీరు చెప్పిన బాండ్లు కొనడం వల్ల ఎలాంటి మినహాయింపు లేదు. కొంత మంది ట్యాక్స్ హార్వెస్టింగ్ అని అంటున్నారు. అది ప్లానింగ్లో భాగం మాత్రమే. వృత్తి నిపుణులను సంప్రదించండి.మామూలుగా బేసిక్ లిమిట్ రూ. 3,00,000 లేదా రూ. 4,00,000 .. ప్లానింగ్ పేరున మీ ఆదాయాన్ని బేసిక్ లిమిట్కి తీసుకురాగలమా.. అది కుదరని పని. దాని కన్నా కేవలం ఆర్థికంగా లాభనష్టాలు అంచనా వేసి, చట్టప్రకారం మసులుకోవడమే మంచి పని.
వడ్డీ ఆదాయంపై పన్ను ఏ మేరకు..?
2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపన్ను నిబంధనల కింద.. ఆదాయపన్ను శ్లాబులు, మూలం వద్దే పన్ను మినహాయింపు (టీడీఎస్) పరిమితుల్లో మార్పులు వచ్చాయి. నేను సీనియర్ సిటిజన్. వడ్డీ ఆదాయంపై ఆధారపడి ఉన్నాను. ఈ మార్పుల ప్రభావం నాపై ఎలా ఉంటుంది? – లక్ష్మీ నర్సింహ. వి ఆదాయపన్ను కొత్త విధానంలో పన్ను శ్లాబులు, టీడీఎస్ పరిమితుల్లో మార్పులు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది నిజమే. ఇందులో టీడీఎస్ పరిమితి ఒకటి. సీనియర్ సిటిజన్ (60 ఏళ్లు నిండిన వారు), నాన్ సీనియర్ సిటిజన్కు సంబంధించి టీడీఎస్ పరిమితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్దేశిత పరిమితికి మించినప్పుడు మూలం వద్దే 10 శాతం మినహాయిస్తారు. మీరు వడ్డీ ఆదాయంపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. బ్యాంక్ ఎఫ్డీలు, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.50,000 మించితే గతంలో 10 శాతం టీడీఎస్ (తగ్గించేవారు) మినహాయించేవారు. ఇకపై వీటిపై వడ్డీ ఆదాయం రూ.1,00,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది.డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ను రూ.10,000 మించినప్పుడే అమలు చేయనున్నారు. టీడీఎస్ మినహాయించారు కదా అని చెప్పి, వడ్డీ ఆదాయంపై పన్ను తప్పించుకోవడం కుదరదు. మీ మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చినట్టయితే అప్పుడు రిటర్నులు దాఖలు చేసి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో వయసుల వారీ వేర్వేరు శ్లాబుల్లేవు. ఆదాయం రూ.4–8 లక్షల మధ్య ఉంటే 5 శాతం, రూ.8–12 లక్షల మధ్య ఉంటే 10 శాతం, రూ.12–16 లక్షల మధ్య ఉంటే 15 శాతం, రూ.16–20 లక్షల మధ్య ఉంటే 20 శాతం, రూ.20–24 లక్షల మధ్య ఆదాయంపై 25 శాతం, రూ.24 లక్షలకు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలి. ఉద్యోగులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం ఉంటుంది. మినహాయింపు అనంతరం నికర ఆదాయం రూ.12 లక్షలకు మించనప్పుడు సెక్షన్ 87ఏ కింద ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. వార్షిక ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినప్పటికీ.. స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై వచ్చే స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం ఈక్విటీల్లో ఉన్నాయి. మిగిలిన 30 శాతం ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాల్లో ఉన్నాయి. ఈక్విటీ కేటాయింపులు అధికంగా ఉన్నందున, ఇందులో నుంచి 10 శాతాన్ని వెనక్కి తీసుకుని, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. పదేళ్ల కాలంలో వీటి నుంచి ఎంత రాబడి ఆశించొచ్చు? – వినీ ఆనంద్రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ/రీట్)లు అన్నవి వాణిజ్య అద్దె ఆదాయం వచ్చే ఆస్తులపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటి అద్దె రాబడులు వచ్చే పదేళ్ల కాలంలో మెరుగుపడతాయని అంచనా వేస్తున్నాను. ఇక ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ, స్టాక్స్ పట్ల ఎంతో ఆశావహంతో ఉన్నాను. దీర్ఘకాలంలో గొప్ప పనితీరుతో సంపద సృష్టించిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా చూస్తే రీట్ల కంటే సెన్సెక్స్ విషయంలోనే నేను ఎక్కువ సానుకూలంగా ఉన్నాను.ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్లానింగ్లో చేయకూడని తప్పులు


