ప్రధాన వార్తలు

మళ్లీ ఐపీవో హవా..!
ఓవైపు సెకండరీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు సందడి చేస్తున్నాయి. వెరసి ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య ఐపీవోల ద్వారా అన్లిస్టెడ్ కంపెనీలు రూ. 45,350 కోట్లు సమీకరించాయి. ఇది 45 శాతం వృద్ధికాగా.. మరో 118 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ బాటలో వచ్చే వారం 3 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. తద్వారా రూ. 6,200 కోట్లు సమీకరించనున్నాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభంకానుంది. ఆగస్ట్ 1న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ధరల శ్రేణి ప్రకటించవలసి ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 29న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా 5.01 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. వీటిని సంస్థలో ప్రధాన వాటాదారులైన స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈతోపాటు.. బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సూటీ(ఎస్యూయూటీఐ) విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో నిధులు ప్రస్తుత వాటాదారుల సంస్థలకు చేరనున్నాయి. 2017లోనే ఐపీవోకు వచ్చిన సెంట్రల్ డిపాజిటరీ సరీ్వసెస్(సీడీఎస్ఎల్) ఇప్పటికే ఎన్ఎస్ఈలో లిస్టయిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా డిపాజిటరీ సరీ్వసులందించే రెండో సంస్థగా ఎన్ఎస్డీఎల్ లిస్ట్కానుంది. 1996 నవంబర్లో డీమెటీరియలైజేషన్కు తెరతీయడంతో కంపెనీ డీమ్యాట్ సేవలలో భారీగా విస్తరించిన విషయం విదితమే. 2024–25లో కంపెనీ ఆదాయం 12% పైగా ఎగసి రూ. 1,535 కోట్లను తాకింది. నికర లాభం 25% జంప్చేసి రూ. 343 కోట్లకు చేరింది.

ఐఆర్డీఏఐ కొత్త చైర్మన్ అజయ్ సేత్
న్యూఢిల్లీ: బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కొత్త చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ సేత్ను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల కాలానికి లేదా 65 ఏళ్లు వచ్చేంత వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు సేత్ను ఈ పదవిలో నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. అజయ్ సేత్ 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. నాలుగేళ్ల పాటు కేంద్ర ఆర్థిక శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలు అందించిన అనంతరం ఈ ఏడాది జూన్లో పదవీ విరమణ చేశారు. దేవాశిష్ పాండా పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగియగా, అప్పటి నుంచి ఐఆర్డీఏఐ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది.

ప్రమాణాలను పెంచండి, విశ్వాసాన్ని గెలవండి
న్యూఢిల్లీ: విధానాలను సకాలంలో అమలు చేయడం ద్వారా కొత్త ప్రమాణాలను సృష్టించాలని.. పన్ను చెల్లింపుదారుల విశ్వాసాన్ని చూరగొనాలని ఆదాయపన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆరు నెలల్లోనే కొత్త ఆదాయపన్ను చట్టం ముసాయిదాను రూపొందించడం పట్ల అధికారులను అభినందించారు. ‘‘మంచి విధానాలు ఉండడంతోనే సరిపో దు. సకాలంలో వాటిని అమ లు చేయడమే కీలకం. ఇటీవలి కాలంలో మీరు ఎంతో గొప్ప గా పనిచేశారు. ఈ ప్రమాణాలను మరింత పెంచాల్సిన సమయం వచి్చంది’’అని 166వ ఆదాయపన్ను శాఖ దినోత్సవం సందర్భగా పేర్కొన్నారు.

బాలాజీ ఫౌండేషన్ దాతృత్వం
హైదారాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలాజీ ఫౌండేషన్ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.10 లక్షలు వెచ్చించి మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ... నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండులో తాగునీటి సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. బాలాజీ ఫౌండేషన్ వ్యాపారంతో పాటు సేవారంగంలోనూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. తన తండ్రి బాలాజీ చౌదరి నెల్లూరు నుంచే తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారని, అలాంటి ప్రాంతంలో బాలాజీ ఫౌండేషన్ సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని బీ న్యూ మొబైల్స్ అండ్ ఎల్రక్టానిక్స్’, బాలాజీ సంస్థ సీవోఈ సాయి నిఖిలేష్ తెలిపారు.

అపోలో హాస్పిటల్స్, సీమెన్స్ భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాలేయ వ్యాధుల చికిత్సకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా అపోలో హాస్పిటల్స్, సీమెన్స్ హెల్తినీర్స్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా వ్యాధులను ముందుగా గుర్తించడం, పర్యవేక్షణ, చికిత్స మొదలైన వాటికి కృత్రిమ మేథ (ఏఐ), అల్ట్రాసౌండ్ ఇమేజింగ్లాంటి సాంకేతికతలను ఉపయోగిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ఫలితాలను సాధించడంపై దృష్టి పెడతాయి. ఏఐని ఉపయోగించి, గాటు పెట్టకుండా కాలేయ వ్యాధికి చికిత్సను అందించే దిశగా సీమెన్స్ హెల్తినీర్స్తో భాగస్వామ్యం కీలక ముందడుగు కాగలదని అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. వ్యాధులను సకాలంలో కచి్చతంగా గుర్తించేందుకు, మెరుగైన చికిత్సను అందించేందుకు, పేషంట్లకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు అధునాతన టెక్నాలజీలు తోడ్పడతాయని సీమెన్స్ హెల్త్కేర్ ఎండీ హరిహరన్ సుబ్రమణియన్ చెప్పారు.

పెరిగిన గగనతల ప్రయాణికుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశీయంగా విమానయాన సంస్థలు ఈ ఏడాది జూన్లో 1.36 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. మే నెలలో నమోదైన 1.32 కోట్ల మందితో పోలిస్తే ఇది 3 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో దేశీ ఎయిర్లైన్స్లో 8.51 కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 7.93 కోట్ల మంది ప్యాసింజర్లతో పోలిస్తే ఇది 7.34 శాతం అధికం. ఫ్లయిట్ల జాప్యాల వల్ల 1,20,023 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. ఫ్లయిట్ల రద్దు వల్ల 33,333 ప్రయాణికులపై ప్రభావం పడగా, పరిహారం, ఇతరత్రా సదుపాయాల కల్పన కింద విమానయాన సంస్థలు రూ. 72.40 లక్షలు వెచ్చించాయి. ఇక, మే నెలలో 64.6 శాతంగా ఉన్న విమానయాన సంస్థ ఇండిగో మార్కెట్ వాటా జూన్లో 64.5 శాతానికి పరిమితమైంది. ఎయిరిండియా గ్రూప్ వాటా 26.5 శాతం నుంచి 27.1 శాతానికి చేరింది. ఆకాశ ఎయిర్ వాటా పెద్దగా మార్పు లేకుండా 5.3 శాతం స్థాయిలోనే ఉంది. స్పైస్జెట్ వాటా మాత్రం 2.4 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది.
కార్పొరేట్

ఐఆర్డీఏఐ కొత్త చైర్మన్ అజయ్ సేత్

బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు మరింత వాటా

పెరిగిన గగనతల ప్రయాణికుల సంఖ్య

అపోలో హాస్పిటల్స్, సీమెన్స్ భాగస్వామ్యం

బాలాజీ ఫౌండేషన్ దాతృత్వం

వాణిజ్య యుద్ధాలు తాత్కాలికమే!

ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!

అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు

ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు

ఆడ్కాక్ వాటాలపై నాట్కో కన్ను

‘డబ్బా ట్రేడింగ్’ చట్ట విరుద్ధం
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డబ...

నష్టాలకు బ్రేక్.. లాభాల్లో మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...

పసిడి.. మళ్లీ రూ.లక్ష పైకి!
న్యూఢిల్లీ: పుత్తడి మరోసారి జిగేల్మంది. కొనుగోళ్ల...

రిలయన్స్, ఐటీ షేర్లు పడేశాయ్..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు మంగళవా...

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ ఇండియాలోనే..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ...

అమెరికాతో వాణిజ్య చర్చలు.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయమై భారత్...

భారత్లోకి ప్రత్యామ్నాయ పెట్టుబడుల వెల్లువ
కోల్కతా: దేశీయంగా ప్రత్యామ్నాయ పెట్టుబడుల మార్కెట...

అడుగు దూరంలో ట్రేడ్ డీల్
భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ...
ఆటోమొబైల్
టెక్నాలజీ

టెస్లా డైనర్ రెస్టారెంట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
టెస్లా లాస్ ఏంజిల్స్లో టెక్నాలజీని మిళితం చేస్తూ వినియోగదారులకు సరికొత్త డైనర్, డ్రైవ్-ఇన్ అనుభవాన్ని అందించాలని కొత్త అవుట్లెట్ను ఆవిష్కరించింది. శాంటా మోనికా బౌలేవార్డ్లో టెస్లా టెక్ ఔత్సాహికులతోపాటు సాధారణ ప్రజలకు సాంకేతికత సాయంతో ఫుడ్ సర్వీసులు ప్రారంభించింది. క్లాసిక్ కంఫర్ట్ ఫుడ్ను ఈ అవుట్లెట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు టెస్లా తెలిపింది.టెక్ కంటెంట్ సృష్టికర్త జాక్లిన్ డల్లాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డైనర్ కేవలం ఒక హోటల్గా మాత్రమే కాకుండా 45 అడుగుల స్క్రీన్ అమర్చిన డ్రైవ్ ఇన్ థియేటర్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో బర్గర్లు, హాట్ డాగ్స్, చికెన్ వింగ్స్ హ్యాండ్ స్పిన్డ్ మిల్క్ షేక్స్ లభిస్తాయన్నారు. అయితే కస్టమర్లు చేసే ఆర్డర్లు అన్నీ టెస్లా సైబర్ ట్రక్ థీమ్ బాక్స్ల్లో అందిస్తారని తెలిపారు.My kids ❤️ @Tesla_Optimus #TeslaDiner pic.twitter.com/Kt6t8gsHOL— Prime the pump (@whistingbhole) July 20, 2025ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో భారీగా కొలువుల కోతలుఈ టెస్లా డైనర్లో భోజనం చేయాలనుకునే కస్టమర్లు కార్లలోని టెస్లా స్క్రీన్ల నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా ఆడియో సింక్ చేయడం ద్వారా అయినా ఆర్డర్ బుక్ చేయవచ్చు. ఇందులో సర్వీసు చేసేందుకు టెస్లా ఆప్టిమస్ రోబోట్లను వినియోగిస్తున్నట్లు డల్లాస్ చెప్పారు. దాంతోపాటు టెస్లా కార్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2023 చివరిలో ప్రారంభమైంది.Inside @Tesla ‘s NEW Diner!! pic.twitter.com/yOPdQEEXwZ— Jacklyn Dallas (@NBTJacklyn) July 20, 2025

టెక్ కంపెనీల్లో భారీగా కొలువుల కోతలు
టెక్నాలజీ అభివృద్ధి అనేది రెండు వైపులా పదనున్న కత్తిగా వ్యవహరిస్తోందనే వాదనలున్నాయి. ఆర్థికాభివృద్ధి, టెక్ వ్యవస్థలను ముందుకు నడిపేందుకు కొత్త ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడుతుంటే.. దీనివల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. 2025 ప్రథమార్ధం ముగిసిన నేపథ్యంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇతర టెక్ దిగ్గజాల్లోని వేలాది మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడమే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.టాప్ కంపెనీల్లో..2025 జనవరి-జులై మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రధాన టెక్ కంపెనీలు సుమారు 91,000 ఉద్యోగాలను తొలగించగా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ గణనీయంగా తమ సిబ్బందిని తగ్గించాయి. స్టార్టప్లు, యునికార్న్లతోపాటు ఆధునిక కంప్యూటింగ్కు మార్గదర్శకత్వం వహిస్తున్న, కృత్రిమ మేధ రేసులో ముందున్న సంస్థల నుంచి ఈ ఉద్యోగ కోతలు ఎక్కువయ్యాయి.ఎవరేం చెప్పినా కోతలే ప్రధానంలాజిస్టిక్స్, ఏడబ్ల్యూఎస్ సపోర్ట్, ఇంటర్నల్ ఆపరేషన్స్ విభాగాల్లో ఇప్పటివరకు అమెజాన్ సుమారు 23,000 ఉద్యోగాలను తగ్గించింది. సేల్స్, కస్టమర్ సపోర్ట్, నాన్ ఏఐ ఆర్ అండ్ డీ విభాగాల్లో 17,500 ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ తొలగించింది. సీఈఓ సత్య నాదెళ్ల ఈ చర్యను ‘తదుపరి తరం ఉత్పాదకత దిశగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడం’గా అభివర్ణించారు. అడ్వర్టైజింగ్, హెచ్ఆర్, లెగసీ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం టీమ్లతో సహా ప్రపంచవ్యాప్తంగా 21,000 ఉద్యోగాలను గూగుల్ తొలగించింది. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్’ విధానంతో కంపెనీ ట్రాన్సఫర్మేషన్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సుందర్ పిచాయ్ తెలిపారు.ఏఐ ఆర్ అండ్ డీలో పెట్టుబడిఈ కోతల వల్ల కంపెనీలకు భారీగా వ్యయం మిగులుతుంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం దీన్ని వెచ్చిస్తున్నాయి. ఈ మూడు సంస్థలు కలిసి 2026 నాటికి ఏఐ ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాలకు 150 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హెడ్ కౌంట్ పడిపోవడంతో కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు పెరిగాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ సంస్థల షేర్ల ధరలు ఇటీవల 18-27 శాతం మధ్య పెరిగాయి.ఇదీ చదవండి: ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభంకొన్ని ఉద్యోగాలకు డిమాండ్ఏఐ పెరుగుతున్నా కొన్ని ఉద్యోగాలకు మాత్రం డిమాండ్ అధికమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్, మోడల్ ట్రైనర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలున్న వారికి కంపెనీలు ఎంతైన వెచ్చించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇటీవల మెటా ప్యాకేజీల వల్ల తెలుస్తుంది. ఏఐ టెక్ నిపుణులకు సుమారు రూ.830 కోట్ల ప్యాకేజీలను సైతం ప్రకటిస్తోంది.

ఎల్రక్టానిక్స్ ఎగుమతులు జూమ్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ ఎగుమతులు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్/క్యూ1) బలమైన పనితీరు చూపించాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఏకంగా 47 శాతం పెరిగి 12.41 బిలియన్ డాలర్లకు (రూ.1.05 లక్షల కోట్లు సుమారు) చేరాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ముఖ్యంగా అమెరికా, యూఏఈ, చైనా టాప్–3 ఎగుమతి గమ్యస్థానాలుగా ఉన్నాయి. నెదర్లాండ్స్, జర్మనీ తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ‘‘భౌగోళికంగా వివిధ దేశాల మధ్య ఎగుమతుల్లో వైవిధ్యం, అంతర్జాతీయ ఎల్రక్టానిక్స్ సరఫరా వ్యవస్థతో పెరుగుతున్న భారత్ అనుసంధానతను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఆసియాలో విశ్వసనీయ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా భారత్ అవతరిస్తున్నదానికి నిదర్శనం’’అని వాణిజ్య శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. అమెరికాకే 60 శాతం భారత ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో 60 శాతం మేర అమెరికాకే వెళ్లాయి. ఆ తర్వాత యూఏఈకి 8 శాతం, చైనాకి 3.88 శాతం, నెదర్లాండ్స్కు 2.68 శాతం, జర్మనీకి 2.09 శాతం చొప్పున జూన్ త్రైమాసికంలో ఎగుమతులు నమోదయ్యాయి. భారత రెడీమేడ్ వ్రస్తాల ఎగుమతుల్లోనూ (ఆర్ఎంజీ) అమెరికాయే అగ్రస్థానంలో ఉంది. 34 శాతం రెడీమేడ్ వస్త్ర ఎగుమతులు అమెరికాకు వెళ్లాయి. ఆ తర్వాత యూకేకి 8.81 శాతం, యూఏఈకి 7.85 శాతం, జర్మనీకి 5.51 శాతం, స్పెయిన్కు 5.29 శాతం చొప్పున ఆర్ఎంజీ ఎగుమతులు నమోదయ్యాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం రెడీమెడ్ వస్త్ర ఎగుమతులు 4.19 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఆరి్థక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇవి 3.85 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జూన్ క్వార్టర్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 19 శాతానికి పైగా పెరిగి 1.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 37.63 శాతం మేర అమెరికాయే దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత 17 శాతం చైనాకి, 6.63 శాతం వియత్నాంకి, 4.47 శాతం జపాన్కు వెళ్లాయి.

8 వేల మంది ప్రొఫెషనల్స్కి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్లో 8,000 మంది ప్రొఫెషనల్స్కు కృత్రిమ మేధ (ఏఐ) సంబంధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికాకు చెందిన బీపీవో సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (వీజీఎస్) తెలిపింది. కాంటాక్ట్ సెంటర్ ప్రక్రియలను మెరుగుపర్చే వీఅసిస్ట్ టూల్తో ఈ శిక్షణా కార్యక్రమం తమ సంస్థ అంతర్గతంగా సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. కస్టమర్ల నుంచి వచ్చే క్వెరీలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, విశ్లేషించుకుని, సముచిత కేటగిరీల కింద వర్గీకరించడం (కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సర్వీస్, వ్యాపార అవసరాలు) ద్వారా కంపెనీ సిబ్బంది తగిన పరిష్కార మార్గాలను అందించేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ఏఐ రాకతో దేశీ బీపీవో రంగంలో కూడా శరవేగంగా పెను మార్పులు వస్తున్నాయని వీజీఎస్ ప్రెసిడెంట్ గగన్ ఆరోరా తెలిపారు. అధునాతన టెక్నాలజీలు, ఏఐ దన్నుతో 2033 నాటికి ఈ విభాగం 280 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం 2025లో ఇది 139.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులు, ఏఐ మధ్య సమతూకం సాధించడం ద్వారా ఏజెంట్ల పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు కస్టమర్లకు కూడా మరింత సంతృప్తికరమైన సేవలు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
పర్సనల్ ఫైనాన్స్

ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!
దేశంలో ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సీజన్ నడుస్తోంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడం భారతీయ పన్ను చెల్లింపుదారులందరికీ కీలకమైన బాధ్యత. అన్ని ఆదాయ మార్గాలను ప్రకటించడం, అర్హత వ్యయాలను మినహాయించడం, పన్ను బాధ్యతలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడంతో పాటు పన్ను చట్టాలను పాటించడం అవసరం.ఐటీఆర్ దాఖలుకు కొత్త డెడ్లైన్2024–25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025–26) నాన్ ఆడిట్ పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి సాధారణంగా జూలై 31 వరకూ గుడువు ఉంటుంది. అయితే ఈసారి గడువును 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఒకవేళ గడువు దాటితే ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి 2025 డిసెంబర్ 31లోగా లేట్ రిటర్న్ దాఖలు చేయవచ్చు.గడువు దాటిపోతే పర్యవసానాలుఐటీఆర్ దాఖలు చేయకుండా గడువు దాటిపోతే సెక్షన్ 234ఏ కింద తీవ్రమైన జరిమానాలు, అభియోగాలు, సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.వడ్డీ: గడువు తర్వాత మీరు మీ రిటర్న్ సబ్మిట్ చేస్తే, సెక్షన్ 234ఎ కింద చెల్లించని పన్ను మొత్తంపై నెలకు 1% లేదా ఒక నెలలో కొంత భాగం వడ్డీ చెల్లించాలి.ఆలస్య రుసుము: సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము వసూలు చేస్తారు. రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉంటే రూ.5,000, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.1,000 ఆలస్య రుసుము వసూలు చేస్తారు.నష్టాల సర్దుబాటు: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇళ్లు లేదా మీ వ్యాపారాల నుండి మీకు నష్టాలు వచ్చి ఉంటే వాటిని మరుసటి సంవత్సరం మీ ఆదాయానికి వ్యతిరేకంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల తరువాతి సంవత్సరాలలో మీరు చెల్లించాల్సిన పన్ను గణనీయంగా తగ్గుతుంది. అయితే గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఈ నష్టాలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉండదు.👉 ఇదీ చదవండి: రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. అంత ట్యాక్స్ కట్టి అవసరమా?

అవీవా కొత్త పాలసీ.. బాల వికాస్ యోజన
న్యూఢిల్లీ: అవీవా ఇండియా నూతనంగా అవీవా భారత్ బాల వికాస్ యోజన పేరుతో బీమా ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది ఈక్విటీ మార్కెట్తో సంబంధం లేని, నాన్ పార్టిసిపేటింగ్ జీవిత బీమా ప్లాన్. తమ పిల్లల భవిష్యత్ భద్రతకు ఇది భరోసానిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రీమియం నెలకు రూ.1,000 నుంచి మొదలవుతుంది.జీవిత బీమా రక్షణకుతోడు హామీతో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. 3 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు పరిధిలోని వారు.. 12–30 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. గరిష్ట కాల వ్యవధి పాలసీదారుడికి 80 ఏళ్ల వరకు ఉంటుంది.నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధ సంవత్సరం లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లింపు ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. గ్యారంటీడ్ సమ్ అష్యూర్డ్ పేరుతో కాల వ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే ప్రయోజనం పిల్లల భవిష్యత్ అవసరాలకు ఆర్థిక భరోసానిస్తుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వినీత్ కపాహి తెలిపారు.

వారెన్ బఫెట్ ప్రకారం.. ఆ 5 తప్పులివే...
అమెరికాకు చెందిన వారెన్ బఫెట్, ప్రపంచంలోని అత్యాధునిక అత్యంత తెలివైన పెట్టుబడిదారుల్లో ఒకరు. ఆయన గురించి తెలియని విద్యావంతులు ఉంటారేమో కానీ ఆర్ధికవేత్తలు ఉండరు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాలపై ఆయన తరచుగా చెప్పే సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు ఓ రకంగా పాఠాల లాంటివే నని చెప్పాలి. సంపన్నులు కాలేకపోయిన మధ్య తరగతి జీవులు తరచుగా చేసే తప్పుల గురించి ఆయన చెప్పిన కొన్ని విషయాలివి...కొత్త కారు...పెద్ద వృధా..చాలా మంది తమ స్థాయి మెరుగుపరచడం కోసం కాకుండా మెరుగైందని చెప్పుకోవడం కోసం ఎక్కువ ఆరాట పడతారు. అలాంటి వారికి బఫెట్ చెబుతున్న సలహా ఏమిటంటే...కొత్త కారు షోరూం నుంచి బయటకి తీసుకొచ్చిన రెండో నిమిషం నుంచే విలువ తగ్గిపోవడం మొదలవుతుంది, ఐదు సంవత్సరాల్లో దాని విలువ 60% వరకు కోల్పోతుంది. వేల కోట్ల ఆస్తులున్న బఫెట్ 2014 మోడల్ క్యాడిల్లాక్ ఎక్స్టిఎస్ ను వినియోగిస్తుంటారు. అదీ జనరల్ మోటార్స్ వాళ్లు భారీ డిస్కౌంట్ ధరపై ఇస్తేనే కొనుగోలు చేశారు. ఆయనేమంటారంటే... ‘‘కారును ఒక విజయంలా కాదు, ఒక ప్రయాణ మార్గంగా మాత్రమే చూడాలి’’.క్రెడిట్ కార్డ్ ఓ వల...బహుశా భారతదేశంలో ఇప్పుడు క్రెడిట్ కార్డు గురించి తెలియని వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో కానీ... క్రెడిట్ కార్డ్ వల్ల వచ్చే నష్టాలు మాత్రం లెక్కలేనన్ని అంటున్నారు బఫెట్.. దాని అప్పులపై అత్యధికంగా 30% వడ్డీ చెలించాల్సి వుంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష తీసుకుంటే రూ.30 వేల దాకా వార్షిక వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ‘‘మీరు తెలివిగా ఉంటే, అప్పు బాధ వదిలిపోవచ్చు’’ అంటారాయన. క్రెడిట్ కార్డ్ను అత్యవసర సమయాల్లో ఉపకరించేదిగా మాత్రమే చూడాలి తప్ప అత్యధిక వ్యయానికి అవకాశంగా చూడకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు.లాటరీ, జూదం రెండూ ప్రమాదమే..జూదం, లాటరీలను ‘‘మ్యాథ్ ట్యాక్స్’’ అని పేర్కొంటారు బఫెట్, అంటే మ్యాథమేటిక్స్, లాజిక్ తెలియని వారికి వడ్డించే అదనపు పన్ను అని అర్ధం. ఇవి వ్యక్తుల్ని వారి మేధా శక్తిని నిర్వీర్యం చేసి చివరకు అదృష్టం మీద ఆధారపడే దుస్థితికి చేరుస్తుందని ఆయన అంటున్నారు.ఇల్లు...అవసరమా? విజయమా?అవసరానికి ఇల్లు కొనవచ్చు. అయితే అవసరానికి మించి పెద్ద ఇల్లు ఉంటే అది నష్టమే అంటున్నారు బఫెట్. ఆయన తాను 1958లో కొనుక్కున్న పాత ఇంటిలోనే ఆయన ఇప్పటికీ జీవిస్తున్నారు. ఇల్లు జీవించడానికి రెండు పడకగదుల ఇల్లు సరిపోయేవారు 4 పడక గదుల ఇల్లు కొనడం అంటే రూ.లక్షలు ఏటా వృధా చేస్తున్నట్టే వారికి పన్నులు, నిర్వహణ, సిబ్బంది ఖర్చులు, మెయిన్టెనెన్స్ అన్నీ డబుల్ అవుతాయి. కాబట్టి ఇల్లు కొనుగోలులో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని సూచిస్తున్నారాయన.అవగాహన లేని చోట ఎప్పుడూ పెట్టుబడి పెట్టవద్దుమనకు ఉన్న అదనపు సొమ్మును లాభాల కోసం రకరకాల మార్గాల్లో పెట్టుబడులుగా మార్చడం సరైనదే. అయితే మనం దేనిలో పెట్టుబడి పెడుతున్నాం? అనేది పూర్తి అవగాహన ఉండాలి. అలా కాకుండా ఏ మాత్రం తెలియని వ్యాపారం, రంగంలో పెట్టుబడి పెడితే... అది ఎప్పటికైనా నష్టాలే తెస్తుంది. ముందు పొదుపు చెయ్యి, ఆ తర్వాత ఖర్చు చెయ్యి తెలివిగా ఇన్వెస్ట్ చెయ్యి...అంటూ సూత్రీకరించే బఫెట్.. మనకు.వందల వేల కోట్ల ఆస్తులున్నా సరే.. ఆర్ధిక భధ్రత కోసం రెండే రూల్స్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అవి 1. ఎప్పుడూ డబ్బును నష్టపోవద్దు. 2.మొదటి రూల్ని ఎప్పటికీ మరచిపోవద్దు.

మెడికల్.. ఇన్సూరెన్సూ.. సెక్షన్ 80 మినహాయింపులు
ఈ వారం సెక్షన్ 80లో పొందుపర్చిన అంశాలు... వైద్యానికి సంబంధించిన మినహాయింపులు గురించి తెలుసుకుందాం. ముఖ్య విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా కేవలం పాత పద్ధతిని అనుసరించిన వారికే మాత్రమే వర్తిస్తాయి.80డీ – మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ సెక్షన్ వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి తన కోసం, జీవిత భాగస్వామి కోసం తన మీద ఆధారపడ్డ పిల్లల కోసం చెల్లించే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 పరిమితిని మించి మినహాయింపు ఇవ్వరు. తల్లిదండ్రులు 60 సంవత్సరాల లోపు వారయితే అదనంగా రూ.25,000 వారి నిమిత్తం చెల్లించే ప్రీమియంలపై, మొత్తం మీద రూ.50,000 మినహాయింపు ఇస్తారు. కుటుంబంలో ఏ వ్యక్తి చెల్లిస్తాడో... ఆ వ్యక్తి ఇన్కంలోంచి మినహాయింపు ఇస్తారు. ఇతరులకు ఇవ్వరు. నగదులో చెల్లించిన ప్రీమియంలకు మినహాయింపు దొరకదు. చెక్కు ద్వారా, డీడీ ద్వారా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.వ్యక్తి, అతని తల్లిదండ్రులు.. అందరూ 60 సంవత్సరాల్లోపు ఉంటే మొత్తం రూ.50వేలు, వ్యక్తి 60 సంవత్సరాల్లోపు ఉండి, తల్లిదండ్రులు అరవై ఏళ్లు దాటిన వారు అయితే రూ.25,000 కాకుండా అదనంగా రూ.50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వ్యక్తి, తల్లిదండ్రులు 60 ఏళ్లు దాటితే రూ.50వేలు + 50వేలు = మొత్తం రూ. 1,00,000 ఇస్తారు. ఇవన్నీ కాకుండా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ నిమిత్తం రూ.50 వేలు ఖర్చు పెట్టొచ్చు. ఈ మేరకు నగదు చెల్లించవచ్చు. కానీ ఖర్చు మొత్తం గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది. రెండో అంశం 80డీడీ ఒక వ్యక్తి మీద ఆధారపడ్డ మనిషి దివ్యాంగుడైతే, అతని వైద్యం నిమిత్తం చేసిన ఖర్చులకు మినహాయింపు ఉంది. ఈ అంగవైకల్యాన్ని శాతాల్లో చెప్పాలంటే ... 40% లోపల ఉంటే రూ.75,000; 80 శాతానికిపైన ఉంటే రూ.1.25 లక్షల మినహాయింపు ఉంటుంది. వైద్య ఖర్చులే కాకుండా, ఈ వ్యక్తుల మీద చేసిన జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు కూడా వర్తిస్తుంది. వైద్య ఖర్చులు, నర్సింగ్, పునరావాస నిమిత్తం మొదలైనవి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. మానసిక, చెవుడు, బుద్ధి మాంద్యం, మస్తిష్క పక్షవాతం, ఆటిజం, గుడ్డితనం, చూపుతక్కువ, లోకోమోటర్ వైకల్యం (అవయవాలు లేదా శరీరభాగాలు కదలికలకు సంబంధించింది) కుష్టు వ్యాధి మొదలైన వాటికి మినహాయింపు ఉంది. ఫారం 101ఏ జతపరచాలి. వైద్య అధికారులు సర్టిఫై చేయాలి.ఇది కాకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంగవైకల్యం మారుతూ ఉంటుంది. తేడాలు వస్తాయి. సర్టిఫికెట్లలో ధృవీకరించిన శాతాన్ని బట్టే మినహాయింపు ఉంటుంది. దివ్యాంగుడు ముందుగా మరణిస్తే, స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని, ఏ వ్యక్తి అకౌంటులోకి వస్తుందో, ఆ వ్యక్తి ఆదాయంలో కలుపుతారు. దివ్యాంగుడు జీవించి ఉన్నప్పుడు, 60 సంవత్సరాలు తర్వాత వచ్చే యాన్యుటీకి మినహాయింపు ఉంది. ఈ సెక్షన్లో మినహాయింపును తీసుకున్న వ్యక్తి, ఈ ప్రయోజనాన్ని సెక్షన్ 80యూ ప్రకారం పొందకూడదు. 80 డీడీబీదీని ప్రకారం వ్యక్తి తన కోసం లేదా తన మీద ఆధారపడిన వ్యక్తి నిర్దేశిత జబ్బుల చికిత్సకు అయిన ఖర్చు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి రూ.40 వేలు (60 ఏళ్ల లోపల) రూ.1,00,000 సీనియర్ సిటిజన్లకు తగ్గిస్తారు. 11 డీడీ రూల్ ప్రకారం క్లెయిమ్ చెయ్యాలి. న్యూరాలజిస్ట్, అంకాలజిస్ట్, యూరాలాజిస్ట్, హెమొటాలాజిస్ట్, ఇమ్యూనోలాజిస్ట్, మొదలైన స్పెషలిస్టులు ధృవీకరించాలి. పూర్తి వివరాలు ఇవ్వాలి. సంతకం కచ్చితంగా ఉండాలి. అసెస్సీతో సంబంధం లేకుండా పేషెంటు వయస్సుని బట్టి మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు రూ.1 లక్ష దాకా, ఇతరులకు రూ.40,000 ఇస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినట్లయితే ఆ విలువ మేరకు మినహాయిపు తగ్గుతుంది. చివరిగా మరొకటి.. 80యూదీని ప్రకారం మినహాయింపు. మెడికల్ ఆధారిటీతో సర్టిఫై చేయిస్తే అంగవైకల్యం 40% దాటి ఉంటే రూ.75 వేలు, 80% దాటి ఉంటే రూ.1.25 లక్షల మినహాయింపు ఇస్తారు. ఫారం 101ఏ ఫైల్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లోని సివిల్ సర్జన్లు/ చీఫ్ మెడికల్ అధికారి సర్టిఫై చేయాలి. అంగవైకల్యం సర్టిఫికెట్ కొత్తది జతపర్చాలి. అంధత్వం, కుష్టు, చెవుడు, మానసిక వైకల్యం, మానసిక మాంద్యం... వీటి విషయంలోనే ఇస్తారు. డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు.చివరగా హెచ్చరిక ఏమిటంటే.. సరైన ధృవపత్రాలుండాలి. నకిలీ డాక్టర్లు, నకిలీ పత్రాలు వద్దు. అన్నింటికి రికార్డు స్పష్టంగా ఉండాలి.