ప్రధాన వార్తలు
భారీగా జీతాల పెంపు ఈ రంగాల్లోనే..
భారతీయ కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల జీతాల పెరుగుదల నిలకడగా కొనసాగుతోంది. కనీసం వచ్చే ఏడాదైనా వేతనాల పెంపు ఆశించినమేర ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ నిర్వహించిన ‘టోటల్ రెమ్యునరేషన్ సర్వే’ ప్రకారం, 2026 సంవత్సరంలో భారతదేశంలోని కంపెనీలు సగటున 9 శాతం వేతన పెంపును అమలు చేసే అవకాశం ఉంది. దాదాపు 1,500 కంటే ఎక్కువ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.రంగాల వారీగా అంచనాలుఈ పెంపులో కొన్ని రంగాలు ఇతర విభాగాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు 9.5 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల(జీసీసీ)లో పని చేసే ఉద్యోగులకు సుమారు 9 శాతం మేర పెంపు ఉంటుందని అంచనా.ఈ సందర్భంగా మెర్సర్ ఇండియా రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ మాలతి కేఎస్ మాట్లాడుతూ..‘భారతదేశంలో మెరిట్ ఆధారిత వేతన పెంపు స్థిరంగా ఉండటం అనేది ఆర్థిక వాతావరణం పట్ల సంస్థల నమ్మకాన్ని సూచిస్తుంది. వ్యయ నియంత్రణ పాటిస్తూనే అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు.ఇన్సెంటివ్లపై ఫోకస్ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కంపెనీలు తమ రివార్డ్ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. కేవలం వార్షిక పెంపుపైనే కాకుండా స్వల్పకాలిక ప్రోత్సాహకాలపై కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుతూనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులను నిలుపుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.నియామకాల్లో తగ్గుదల..వేతనాల పెంపు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొత్త నియామకాల విషయంలో కంపెనీలు కొంత అప్రమత్తత పాటిస్తున్నాయి. 2024లో 43 శాతంగా ఉన్న నియామక విస్తరణ ప్రణాళికలు 2026 నాటికి 32 శాతానికి తగ్గే అవకాశం ఉంది. సుమారు 31 శాతం కంపెనీలు నియామకాలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ ఏడాదిలో అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలను వదిలి వెళ్లే రేటు) గణనీయంగా తగ్గింది. 2023లో 13.1 శాతంగా ఉన్న అట్రిషన్ 2025 మొదటి అర్ధభాగం నాటికి 6.4 శాతానికి పడిపోయింది.ఇదీ చదవండి: సామాన్యుడికి ఆర్బీఐ ఈ ఏడాది గిఫ్ట్!
సామాన్యుడికి ఆర్బీఐ ఈ ఏడాది గిఫ్ట్!
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొన్నేళ్లుగా వడ్డీ రేట్ల భారంతో సతమతమవుతున్న మధ్యతరగతి వర్గాలకు 2025 సంవత్సరంలో ఊరటకల్పించింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ ఏకంగా 125 బేసిస్ పాయింట్ల (1.25%) మేర రెపోరేటును తగ్గించింది.ఫిబ్రవరిలో 6.5%కి చేరిన రేటు వరుస కోతలతో ఇప్పుడు 5.25 శాతం వద్ద స్థిరపడింది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్ తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు గణనీయంగా తగ్గాయి. కొత్తగా అప్పులు తీసుకునే వారికి కూడా ఇది శుభవార్తే. 2025-26 నాటికి 7.3% జీడీపీ వృద్ధిని సాధించడమే లక్ష్యంగా గవర్నర్ సంజయ్ మల్హోత్రా బృందం ఈమేరకు పనిచేస్తోంది.మానిటరీ పాలసీ సమావేశంరెపోరేటులో మార్పు(బేసిస్ పాయింట్లు)ప్రస్తుత రెపోరేటుఫిబ్రవరి 2025256.25%ఏప్రిల్ 2025256.00%జూన్ 2025505.50%డిసెంబర్ 2025255.25% ఆర్బీఐ దీర్ఘకాలిక లక్ష్యాలుఆర్బీఐ కేవలం వడ్డీ రేట్లను తగ్గించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2025 అక్టోబర్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25%కి పడిపోయింది.ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని 2% వద్ద స్థిరీకరించాలని భావిస్తోంది. తక్కువ ధరల వల్ల సామాన్యుడి వస్తు కొనుగోలు శక్తి పెరుగుతుంది.దేశీయ డిమాండ్ను పెంచడం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 7.3%కి పెంచింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు పుంజుకుంటాయని అంచనా.బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచడానికి ఆర్బీఐ దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్ల కొనుగోలును ప్రకటించింది.సవాళ్లు - వ్యూహాత్మక నిర్ణయాలుఅమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును తాకినప్పటికీ ఆర్బీఐ రేట్ల తగ్గింపునకే మొగ్గు చూపింది. బలమైన విదేశీ మారక నిల్వలు ఉండటంతో రూపాయి పతనంపై ఆందోళన చెందకుండా దేశీయ వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది.అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాల వల్ల భారత ఎగుమతులపై కొంత ప్రభావం ఉన్నప్పటికీ అది భారత ఆర్థిక వ్యవస్థపై స్వల్పంగానే ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. దీన్ని ఎదుర్కోవడానికి దేశీయంగా ఉత్పాదకతను పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించారు.తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ద్రవ్యోల్బణం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇది భారతదేశాన్ని ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా అడుగులు వేయిస్తోంది.ఇదీ చదవండి: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం..
భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం..
ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. మరొకటి వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తి. వ్యూహాత్మకంగా చూస్తే ఇద్దరిదీ విడదీయరాని బంధం. కానీ, వ్యాపారం విషయానికి వస్తే మాత్రం నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ప్రతిసారీ చర్చలు కొలిక్కి వచ్చే సమయానికి ఏదో ఒక అడ్డంకి పలకరిస్తూనే ఉంది.అమెరికా విధిస్తున్న కఠినమైన టారిఫ్ రూల్స్ ఒకవైపు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని వాషింగ్టన్ జీర్ణించుకోలేకపోవడం మరోవైపు.. ఈ రెండింటి మధ్య ట్రేడ్ డీల్ దోబూచులాడుతోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న పేచీ ఎక్కడ? అగ్రరాజ్యం ఆంక్షల నడుమ భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటోంది? ఈ ప్రతిష్టంభనకు గల కారణాలపై ప్రత్యేక విశ్లేషణ..టారిఫ్ యుద్ధం.. అమెరికా అభ్యంతరంభారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు కలిగిన మార్కెట్లలో ఒకటి అని అమెరికా వాదిస్తుంది. ముఖ్యంగా హార్లే డేవిడ్సన్ వంటి బైకులు, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న పన్నులను తగ్గించాలని కోరుతోంది.భారత్ వాదనభారత్ తన దేశీయ పరిశ్రమలను (Make in India) కాపాడుకోవడానికి ఈ పన్నులు అవసరమని చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో భారత్ను ‘టారిఫ్ కింగ్’ అని పిలవడం, ప్రస్తుతం మళ్లీ అధికారం చేపట్టాక అదే ధోరణి కొనసాగుతోంది.రష్యా నుంచి చమురు కొనుగోళ్లుఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఇది అమెరికాలోని కొందరు రాజకీయ నాయకులకు నచ్చలేదు. రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని అమెరికా భావిస్తుండగా భారత్ తన స్ట్రాటజిక్ అటానమీ(వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి) వైఖరిని స్పష్టం చేసింది. ఈ భౌగోళిక రాజకీయ భేదాభిప్రాయాలు వాణిజ్య చర్చలపై ప్రభావం చూపుతున్నాయి.జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) హోదాగతంలో అమెరికా భారత్కు జీఎస్పీ హోదా ఇచ్చేది. దీని ద్వారా కొన్ని భారతీయ ఉత్పత్తులు సుంకం లేకుండానే అమెరికాలోకి ప్రవేశించేవి. ట్రంప్ మొదటి హయాంలో ఈ హోదాను రద్దు చేశారు. దీన్ని పునరుద్ధరించాలని భారత్ పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం భారత మార్కెట్లలో తమ డెయిరీ, మెడికల్ డివైజ్లకు(Stents etc..) మరింత వెసులుబాటు ఇస్తేనే ఆలోచిస్తామని అంటోంది.డేటా గోప్యత, ఈ-కామర్స్ విధానాలుఅమెరికన్ దిగ్గజాలైన అమెజాన్, వాల్మార్ట్ (ఫ్లిప్కార్ట్), గూగుల్ వంటి కంపెనీలు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. భారత్ తీసుకొస్తున్న డేటా లోకలైజేషన్(భారతీయ వినియోగదారుల సమాచారం ఇక్కడే ఉండాలి), ఈ-కామర్స్ నిబంధనలు అమెరికాకు ఇబ్బందికరంగా మారాయి. తమ కంపెనీలకు భారత్ ‘లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్’(పోటీలో ఉన్న అందరికీ సమాన అవకాశాలు కల్పించడం) కల్పించడం లేదని అమెరికా వాణిజ్య శాఖ తరచుగా ఆరోపిస్తోంది.ఫార్మా రంగంలో..అమెరికన్ ఫార్మా కంపెనీలు తమ మందుల పేటెంట్ హక్కుల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. తక్కువ ధరకే జనరిక్ మందులను ఉత్పత్తి చేసే భారత విధానం తమ లాభాలను దెబ్బతీస్తోందని వారి వాదన.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారత్తో ట్రేడ్ డీల్ను వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, ట్రంప్ శైలిని పరిశీలిస్తే దీని వెనుక ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.ప్రతికార సుంకాలుభారత్ అమెరికా వస్తువులపై ఎంత పన్ను విధిస్తుందో, అమెరికా కూడా భారత వస్తువులపై అంతే పన్ను విధించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దాంతో 2025 ఆగస్టులో భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 25% రెసిప్రోకల్ సుంకాన్ని విధించింది. భారత్ తన వైపు నుంచి పన్నులు తగ్గించే వరకు ఈ డీల్పై సంతకం చేయకూడదనేది ఆయన ఉద్దేశం.క్రూడాయిల్.. ఎస్-400 పేచీఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాలను (S-400 వంటివి) కొనుగోలు చేయడం ట్రంప్నకు నచ్చడంలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు భారత్పై అదనంగా మరో 25% పెనాల్టీ సుంకాన్ని విధించారు. అంటే ప్రస్తుతం కొన్ని భారతీయ ఉత్పత్తులపై మొత్తం 50% సుంకం అమలవుతోంది. భారత్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికి ఈ డీల్ను ఒక ఆయుధంగా వాడుతున్నారు.అమెరికా రైతుల ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ పనిచేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల భారతీయ బియ్యం ఎగుమతులపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూ అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారత రైతుల ప్రయోజనాల దృష్ట్యా మన ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు. దీంతో చర్చలు నిలిచిపోయాయి.వ్యక్తిగత ప్రతిష్ఠ, మధ్యవర్తిత్వంకొన్ని విశ్లేషణల ప్రకారం (ఉదాహరణకు: జెఫరీస్ గ్రూప్ నివేదిక), భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కానీ భారత్ దాన్ని సున్నితంగా తిరస్కరించడం ఆయనకు నచ్చలేదని, ఆ అసహనం కూడా వాణిజ్య చర్చల జాప్యానికి ఒక కారణమని భావిస్తున్నారు. ట్రంప్ తన మద్దతుదారులకు (MAGA - Make America Great Again) తాను ఇతర దేశాలతో వాణిజ్యం పరంగా ఒక కఠినమైన బేరసారాలాడే వ్యక్తి(Tough Negotiator) అని నిరూపించుకోవాలి. భారత్తో అరకొర ఒప్పందం చేసుకుంటే అది తన రాజకీయ ఇమేజ్కు దెబ్బని ఆయన భావిస్తున్నారు. భారత్ నుంచి భారీగా రాయితీలు పొందితేనే అది తనకు రాజకీయంగా విజయం అని ఆయన నమ్ముతున్నారు.ప్రస్తుత పరిస్థితిఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తిగా ఆగిపోలేదు. ఇటీవల కూడా అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్లో పర్యటించింది. అమెరికా పట్టుబడుతున్న మొక్కజొన్న (Corn), సోయా వంటి ఉత్పత్తులను భారత్లోకి అనుమతించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇరు దేశాలు ఈ విషయంలో ఒక అంగీకారానికి వస్తే 2026 ప్రారంభంలో ఈ సుంకాలు తగ్గే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..
Rupee fall: జీతం తగ్గుతుందా.. EMI పెరుగుతుందా?
భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకీ బలహీనపడుతోంది.. డాలర్ మారకంలో భారత రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరడంతో సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అంశాలపై ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా జీతాలు, ఈఎంఐలు (EMIs), రోజువారీ ఖర్చులు అన్నీ ఒకేసారి ఒత్తిడిలో పడుతున్నాయి.ఈఎంఐలపై ప్రభావం ఇలా..రూపాయి విలువ పడిపోతే లోన్లపై ప్రభావం రెండు విధాలుగా కనిపిస్తుంది.విదేశీ కరెన్సీ లోన్లుడాలర్లు లేదా ఇతర విదేశీ కరెన్సీలో లోన్ తీసుకున్నవారికి నేరుగా దెబ్బ పడుతుంది. ఉదాహరణకు డాలర్ ధర రూ.80 నుంచి రూ.90కి పెరిగితే, రీపేమెంట్ భారం సుమారు 12.5 శాతం పెరుగుతుంది.దేశీయ లోన్లుఇక్కడ ప్రభావం పరోక్షంగా ఉంటుంది. రూపాయి బలహీనపడటంతో దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా ఇంధనం, మందులు, ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనిని నియంత్రించేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచితే, ఫ్లోటింగ్ రేట్ లోన్ల ఈఎంఐలు పెరుగుతాయి.ఉదాహరణకు మీరు రూ.50 లక్షల హోం లోన్ తీసుకున్నారనుకోండి.. 20 ఏళ్లు టెన్యూర్, 8% వడ్డీతో ప్రస్తుతం ఈఎంఐ సుమారు రూ.41,045 గా ఉంటే వడ్డీ రేటు 0.5% పెరిగితే ఈఎంఐ రూ.42,366కి చేరుతుంది. అంటే నెలకు రూ.1,321 అదనపు భారం. మొత్తం కాలంలో రూ.3.17 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుందన్న మాట.జీతాలపై రూపాయి ప్రభావంరూపాయి పతనం వల్ల జీతాలు వెంటనే తగ్గవు కానీ సమస్య అక్కడే మొదలవుతుంది.ప్రైవేట్ ఉద్యోగులకుకంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లు ఆలస్యం కావచ్చు.కొత్త నియామకాలు తగ్గే అవకాశంకొన్నిచోట్ల బోనసులు, వేరియబుల్ పే తగ్గవచ్చుఐటీ, ఎగుమతి రంగాలలోని డాలర్లలో ఆదాయం వచ్చే కంపెనీలకు కొంత లాభం ఉన్నా, ఆ ప్రయోజనం ఉద్యోగుల జీతాల పెంపులోకి వెంటనే రావడం కష్టంప్రభుత్వ ఉద్యోగులకుజీతాలు స్థిరంగానే ఉన్నా, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల జీతం విలువ తగ్గినట్లే అవుతుంది. డీఏ పెంపు ఆలస్యమైతే భారమవుతుంది.రూపాయి పతనం అంటే కేవలం ఎగుమతులు–దిగుమతుల సమస్య కాదు. ఇది జీతం విలువను తగ్గించి, ఈఎంఐ భారం పెంచి, కుటుంబ బడ్జెట్ను కుదించే నిశ్చబ్ద దెబ్బ. నేరుగా అయినా, పరోక్షంగా అయినా సామాన్యుడిపై ప్రభావం తప్పదు.
ఇన్సూరెన్స్ మార్కెట్లో ఎందుకింత ఒత్తిడి?
డిజిటల్ స్వీకరణ, నియంత్రణ మార్పులు, విదేశీ పెట్టుబడులు భారత బీమా రంగాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. అయాన్ (Aon) విడుదల చేసిన ‘గ్లోబల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఇన్సైట్స్ రిపోర్ట్’ ప్రకారం.. కొన్ని విభాగాల్లో కొనుగోలుదారులకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, సైబర్, ప్రాపర్టీ బీమాల్లో ఒత్తిడి పెరుగుతోంది.చాలా బీమా విభాగాలు ఇప్పటికీ “సాఫ్ట్ మార్కెట్”లో ఉన్నాయి. అంటే పోటీ ధరలు విస్తృత కవరేజ్ లభిస్తున్నాయి. అయితే, సైబర్ బీమాలో క్లెయిమ్స్ సంఖ్య, వ్యయం గణనీయంగా పెరగడంతో బీమా సంస్థలు కఠిన అండరైటింగ్ విధానాలు, అధిక డిడక్టిబుల్స్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ, భారతదేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్ కారణంగా సైబర్ బీమా అత్యధిక వృద్ధి అవకాశాలు కలిగిన రంగంగా మారింది.ప్రాపర్టీ బీమాలో 2025లో అమలులోకి వచ్చిన క్వాసీ-టారిఫ్ ధర విధానాలు డబుల్ డిజిట్ ప్రీమియం పెరుగుదలకు దారితీశాయి. దీంతో ఖర్చు తగ్గించుకునే అవకాశాలు కొనుగోలుదారులకు తగ్గాయి. మరిన్ని రీ-ఇన్సూరెన్స్ సంస్థలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, ఈ విభాగంలో అస్థిరత కొనసాగనుంది.ఇదిలా ఉండగా, భారత బీమా మార్కెట్లో సామర్థ్యం పెరుగుతోంది. కొత్త బీమా సంస్థలు, విదేశీ రీ-ఇన్సూరర్లు ప్రవేశించడం, అలాగే బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల పోటీ, ఆవిష్కరణలు పెరిగాయి.ఈ పరిణామాలపై స్పందించిన అయాన్ ఇండియా చీఫ్ బ్రోకింగ్ ఆఫీసర్ శాంతనూ సక్సేనా.. “2025లో భారత బీమా మార్కెట్ వేగంగా ఎదుగుతున్న, అవకాశాలతో నిండిన వాతావరణాన్ని చూపిస్తోంది. ఇది కొనుగోలుదారులకు మరింత ఎంపికలను అందిస్తోంది” అని పేర్కొన్నారు.
ఈవీ విడిభాగాల తయారీ ఇక ఇక్కడే: మారుతి సుజుకీ
మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కార్ల దిశగా బలమైన ప్రణాళికలతో ఉంది. ఎలక్ట్రిక్ కార్ల కోసం కీలకమైన విడిభాగాలను రానున్న సంవత్సరాల్లో ఇక్కడే తయారు చేసే ప్రణాళికతో ఉన్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, విక్రయాలు) పార్థో బెనర్జీ తెలిపారు. భారత్లో ఈవీ ఎకోసిస్టమ్ను బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమన్నారు.ప్రస్తుతం బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుండగా, వీటిని సైతం ఇక్కడే తయారు చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇ–విటారాను విడుదల చేయనున్న మారుతి సుజుకీ.. కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచే దిశగా స్థానికంగానే ఈవీ తయారీ ఎకోసిస్టమ్పై దృష్టి సారించినట్టు చెప్పారు. ఇంటి కోసం ప్రాథమిక వాహనంగా ఎలక్ట్రిక్ కారును వినియోగదారులు నమ్మకంగా కొనుగోలు చేసినప్పుడే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ వేగాన్ని అందుకుంటుందన్న అభిప్రాయాన్ని బెనర్జీ వ్యక్తం చేశారు.‘‘ఈవీల విషయంలో కస్టమర్లు నమ్మకంగా లేరు. ఆరంభంలో వచ్చిన ఉత్పత్తులకు సంబంధించిన అనుభవంతో, ప్రయాణ దూరం పరంగా వారి మనసుల్లో ప్రతికూల ధోరణి ఏర్పడింది. తగిన ప్రజా మౌలిక సదుపాయాలు లేవు. విక్రయానంతర సేవలు, రీసేల్ (తిరిగి విక్రయించే) విలువ ఈవీల వినియోగానికి ఉన్న పెద్ద సవాళ్లు. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన వారు, వాటిని సెకండరీ వాహనంగానే వినియోగిస్తున్నారు’’అని వివరించారు. కనుక వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై నమ్మకం కల్పించకపోతే వారు కొనుగోళ్లకు ముందుకురారని అభిప్రాయపడ్డారు. ఐదు మోడళ్లు: 2030 మార్చి నాటికి ఐదు ఈవీ మోడళ్లను కలిగి ఉండాలన్నది మారుతి సుజుకీ ప్రణాళికగా బెనర్జీ పేర్కొన్నారు. అప్పటికి ఎలక్ట్రిక్ కార్ల పరిమాణం 55–60 లక్షలుగా ఉండొచ్చని, ఈవీ విస్తరణ 13–15 శాతానికి చేరుకోవచ్చని చెప్పారు. మారుతి సుజుకీకి దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లోని 1,500 వర్క్షాపులు ఎలక్ట్రిక్ వాహన సర్వీసులకు అనుకూలంగా ఉన్నట్టు, ఇప్పటికే 2,000 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కార్పొరేట్
ఇన్సూరెన్స్ మార్కెట్లో ఎందుకింత ఒత్తిడి?
ఇది సక్సెస్ కాదు.. గిగ్ కార్మికుల గొడ్డు చాకిరీ!
ఈ వింటర్ వెకేషన్కు అంతా అక్కడికే!
వేదాంతా విడదీతకు ఓకే
వంతారాలో లియోనెల్ మెస్సీ
ఐఐటీ చదివి.. మీషో: బిలినీయర్ జాబితాలోకి విదిత్ ఆత్రే
భారీగా పెరిగిన సంపద: మస్క్ నెట్వర్త్ ఎంతంటే?
బీమాలో 100 శాతం విదేశీ పెట్టుబడులు
గ్రామీణ ఉపాధి పథకం: కొత్త పేరు ఇదే..
కో–లివింగ్.. ఇన్వెస్ట్మెంటే!
ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు
ఇదివరకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల...
రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్!
భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే చారిత...
భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే..
అమెరికా బాటలోనే మెక్సికో కూడా భారత్, చైనా సహా ఇతర ...
ఎగుమతులకు మెక్సికో టారిఫ్ల దెబ్బ
న్యూఢిల్లీ: దేశీ ఎగుమతులపై మెక్సికో ప్రకటించిన టార...
ఆటోమొబైల్
టెక్నాలజీ
చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, విప్రో
దేశీ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపింది. ఎంటర్ప్రైజ్లకు ఏఐ సొల్యూషన్లు అందించేందుకు వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బెంగళూరులోని పార్ట్నర్ ల్యాబ్స్లో మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ కేంద్రం(హబ్)ను ఏర్పాటు చేయనుంది.మూడేళ్లపాటు అమల్లోఉండే సహకారం ద్వారా ఎంటర్ప్రైజెస్కు కీలక కార్యకాలపాలలో ఏఐ అమలుకు వీలు కల్పించనుంది. ఒప్పందం ద్వారా విప్రోకున్న కన్సల్టింగ్, ఇంజినీరింగ్ ఆధారిత సామర్థ్యాలకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ స్టాక్ను జత కలుపుకోనుంది.ఏఐ స్టాక్లో భాగంగా అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్హబ్ కోపైలట్, అజ్యూర్ ఏఐ ఫౌండ్రీ తదితరాలను భాగం చేసుకోనుంది. వెరసి ఎంటర్ప్రైజ్లకు కార్యకలాపాలలో టెక్నాలజీ వినియోగానికి వీలుగా విభిన్న ఏఐ సొల్యూషన్లు సమకూర్చనుంది.
ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టాలంటే!
టెక్ దిగ్గజాల దృష్టి అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పైనే ఉంది. లాభాలు స్థిరంగా ఉన్నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జెనరేటివ్ ఏఐపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకుని 300 బిలియన్ల పెట్టుబడులు పెట్టినప్పుడు ఒరాకిల్ స్టాక్ప్రైస్ 335 డాలర్లకు పెరిగింది. ఆ తరువాత రెండు మూడు నెలల్లోనే 190 కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ విభాగంలో పెట్టుబడులు లాభాలుగా మారడానికి ఎంత సమయం పడుతుంది? ఈ టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలంటే కంపెనీలు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? స్థిరమైన లాభాల కోసం ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలో విశ్లేషిద్దాం.ఏఐ పెట్టుబడులుటెక్ దిగ్గజాలు ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాలపై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులు తక్షణమే కాకుండా, దీర్ఘకాలంలో మాత్రమే ఫలితాలనిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల నుంచి గరిష్ట లాభాలను పొందడానికి కంపెనీలు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించాలి.కేవలం ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయకుండా నిర్దిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించే సర్వీసులను పెంచాల్సి ఉంటుంది. ఉదాహరణకు: కస్టమర్ సేవల్లో ఆటోమేషన్, కోడ్ డెవలప్మెంట్ వేగవంతం చేయడం, లేదా కచ్చితమైన డేటా అనలిటిక్స్ అందించడం వంటి విభిన్న సర్వీసులపై దృష్టి సారించాలి.ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి నిర్దిష్ట పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో సర్వీసులను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంటుంది.వ్యూహాత్మక భాగస్వామ్యాలుఐటీ కంపెనీలు స్టార్టప్లతో సహకారం కలిగి ఉంటూ తమ సొంత ఆర్ అండ్ డీపైనే ఆధారపడకుండా వినూత్న ఏఐ స్టార్టప్లతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి లేదా వాటిని కొనుగోలు చేయడం ద్వారా టెక్నాలజీని త్వరగా మార్కెట్లోకి తీసుకురావచ్చు. క్లయింట్లతో కలిసి పనిచేస్తూ వారి వ్యాపార ప్రక్రియల్లో ఏఐని ఏకీకృతం చేయడం ద్వారా ఆయా ప్రాజెక్టుల నుంచి నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు.మానిటైజేషన్ మోడల్స్ఏఐ ఆధారిత టూల్స్కు నెలవారీ లేదా వార్షిక సబ్స్క్రిప్షన్ మోడల్ను అమలు చేయాలి. క్లయింట్ ఏఐ సర్వీసును ఎంత ఉపయోగించారో దాని ఆధారంగా ధరను నిర్ణయించడం ద్వారా తక్కువ వినియోగం ఉన్న క్లయింట్లను కూడా ఆకర్షించవచ్చు.మానవ వనరుల పెంపుఏఐ టెక్నాలజీని ఉపయోగించే, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న ఉద్యోగుల శిక్షణలో పెట్టుబడి పెట్టాలి. దానివల్ల ఏఐ ప్రాజెక్టుల అమలు వేగం, నాణ్యత పెరుగుతుంది.ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా క్లయింట్ కంపెనీలు టెక్ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సేవలకు డిమాండ్లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి.ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నైపుణ్యాల కొరత ప్రాజెక్టుల వేగాన్ని తగ్గిస్తోంది.జెనరేటివ్ ఏఐ టూల్స్ కొన్ని సంప్రదాయ ఐటీ పనులను (ఉదా: ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్) ఆటోమేట్ చేయగలవు. ఇది ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రస్తుత వ్యాపార నమూనాకు సవాలుగా మారుతోంది.డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం కావడంతో సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతోంది. భద్రతకు సంబంధించిన వ్యయం అధికమవుతోంది.పోటీ పెరగడం, క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవాలని చూడడంతో ఐటీ సేవలకు ధరలను తగ్గించాల్సిన ఒత్తిడి కంపెనీలపై పెరుగుతోంది.సవాళ్లు అధిగమించాలంటే..పైన పేర్కొన్న సవాళ్లను అధిగమించి లాభాల వృద్ధిని కొనసాగించడానికి ఐటీ కంపెనీలు కొన్ని మార్గాలను అనుసరించాలి. అంతర్గత ప్రక్రియల్లో, క్లయింట్ ప్రాజెక్టుల్లో ఆటోమేషన్ ఉపయోగించడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించాలి. తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న ప్రాంతాల నుంచి సేవలు అందించే మోడల్ను బలోపేతం చేయాలి. పాత నైపుణ్యాలు గల ఉద్యోగులను ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ వంటి భవిష్యత్తు టెక్నాలజీలలోకి తిరిగి శిక్షణ ఇవ్వాలి. దీని ద్వారా నైపుణ్యాల కొరతను అధిగమించవచ్చు. ఉద్యోగులకు ఏఐ ఫస్ట్ ఆలోచనా విధానాన్ని అలవాటు చేయాలి.ఇదీ చదవండి: రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్!
చాట్జీపీటీలో డిస్నీ పాత్రలు
వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన 200కి పైగా ప్రసిద్ధ పాత్రలు ఇకపై కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో అత్యంత విలువైన స్టార్టప్ల్లో ఒకటైన ఓపెన్ఎఐలో దర్శనం ఇవ్వనున్నాయి. ఓపెన్ఏఐ తమ టెక్స్ట్-టు-వీడియో సాధనం ‘సోరా’లో ఈ పాత్రలను ఉపయోగించుకునేందుకు లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద డిస్నీ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9000 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కూడా అంగీకరించింది.ఒప్పందంలోని అంశాలుమిక్కీ మౌస్, ఫ్రోజెన్, మాన్స్టర్స్ ఇంక్., టాయ్ స్టోరీ పాత్రలు, మార్వెల్, లూకాస్ ఫిల్మ్ ఫ్రాంచైజీలైన ‘బ్లాక్ పాంథర్’, స్టార్మ్ ట్రూపర్స్, యోడా.. వంటి 200కి పైగా డిస్నీ పాత్రలను ఉపయోగించుకునేందుకు ఓపెన్ఎఐకి మూడేళ్ల లైసెన్స్ లభించింది.వచ్చే ఏడాది ప్రారంభంలో వినియోగదారులు సోరాలో ప్రాంప్ట్లు సృష్టించడం ద్వారా డిస్నీ పాత్రలున్న చిన్న వీడియోలను సృష్టించడానికి చాట్జీపీటీ ఇమేజెస్ సాధనాన్ని ఉపయోగించవచ్చు.సోరా ద్వారా రూపొందించిన కొన్ని వీడియోలను డిస్నీ+ స్ట్రీమింగ్ సేవలో కూడా ప్రదర్శిస్తారు.డిస్నీ ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్లు చెప్పింది. దాంతో డిస్నీ ఉద్యోగులకు చాట్జీపీటీ యాక్సెస్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఒప్పందంలో నటీనటుల పోలికలు లేదా స్వరాలు ఉపయోగించడం లేదని ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి.డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వేగవంతమైన పురోగతి నేపథ్యంలో ఓపెన్ఎఐతో ఈ సహకారం ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా కంటెంట్, ఇమేజ్ సృష్టికర్తలను, వారి రచనలను గౌరవిస్తూ వాటిని పరిరక్షిస్తూనే జనరేటివ్ ఏఐ ద్వారా ఈ సర్వీసులను బాధ్యతాయుతంగా విస్తరిస్తాం’ అని తెలిపారు. ఓపెన్ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఈ ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేస్తూ ‘సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏఐ కంపెనీలు, సృజనాత్మక సంస్థలు బాధ్యతాయుతంగా కలిసి పని చేస్తాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే..
ఉద్యోగాలకు స్పేస్ టెక్ దన్ను
ముంబై: దేశీ ఏరోస్పేస్, డ్రోన్స్, స్పేస్ టెక్ పరిశ్రమ 2033 నాటికి అయిదు రెట్లు వృద్ధి చెందనుంది. 44 బిలియన్ డాలర్లకు చేరనుంది. అదే సమయంలో 2 లక్షలకు పైగా ఇంజనీర్లు, పరిశోధకులు, డేటా సైంటిస్టులకు ఉద్యోగావకాశాలు సృష్టించనుంది. వర్క్ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా ఒక నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన గణాంకాలకు మార్కెట్పై పరిశోధనల ఫలితాలను జోడించడం ద్వారా అడెకో దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్కరణలు, ప్రైవేట్ రంగం, అంతర్జాతీయ భాగస్వామ్యాల దన్నుతో పరిశోధనల ఆధారిత ధోరణి నుంచి ఏరోస్పేస్, డ్రోన్స్, స్పేస్ టెక్ పూర్తి స్థాయి పరిశ్రమగా ఎదిగింది. ఈ నేపథ్యంలో స్పేస్ పాలసీ అనలిస్టులు, రోబోటిక్స్ ఇంజనీర్లు, ఏవియోనిక్స్ స్పెషలిస్టులు, జీఎన్సీ (గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్) నిపుణుల్లాంటి కొత్త రకం ఉద్యోగాలు వస్తున్నాయని నివేదిక తెలిపింది. వీరంతా అంతరిక్ష రంగంలో దేశ లక్ష్యాల సాధనలో కీలకంగా నిలుస్తున్నారని వివరించింది. ‘ప్రభుత్వ దార్శనికత, క్రియాశీలకమైన స్టార్టప్ వ్యవస్థ దన్నుతో భారత్ అంతర్జాతీయ స్పేస్ హబ్గా ఎదగనుంది. దీనితో ఇంజనీరింగ్, రీసెర్చ్, డేటా, బిజినెస్ తదితర విభాగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు రానున్నాయి’ అని అడెకో ఇండియా డైరెక్టర్ దీపేష్ గుప్తా తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పుణేలాంటి ప్రాంతాల్లో అత్యధికంగా అవకాశాలు రానున్నాయి. → ఏవియోనిక్స్, క్రయోజెనిక్స్, ఏటీడీసీ (యాటిట్యూడ్ డిటరి్మనేషన్, కంట్రోల్ సిస్టమ్స్), రిమోట్ సెన్సింగ్ నిపుణులు, స్పేస్ హ్యాబిటాట్ ఇంజనీర్లకు భారీ వేతనాలు లభించనున్నాయి. సాధారణ టెక్నికల్ ఉద్యోగులతో పోలిస్తే 20–30% అధికంగా ఉండనున్నాయి. → భారతీయ అంతరిక్ష పాలసీ 2023 లాంటి సంస్కరణలు, 250 పైచిలుకు స్పేస్ స్టార్టప్లు, ఇన్–స్పేస్ కింద రూ. 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దన్నుగా నిలుస్తాయి. కొత్త ఆవిష్కరణలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు తోడ్పడనున్నాయి. → అంతరిక్ష రంగంలో సిబ్బందిపరంగా వైవిధ్యం పెరగనుంది. ఇస్రో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం (యువికా), విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రాం, సమృద్ధ్ లాంటి స్కీములతో ఎంట్రప్రెన్యూర్íÙప్, సాంకేతిక, పరిశోధన విభాగాల్లోకి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. → గగన్యాన్ మిషన్, యాక్సియోమ్–4 ఐఎస్ఎస్ ప్రోగ్రాంలో భారత్ భాగం కావడం, సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణంపై కసరత్తు చేస్తుండటం మొదలైన వాటి వల్ల ఆయా రంగాల్లో ప్రతిభావంతులకు డిమాండ్ మరింతగా పెరగనుంది. → ప్రస్తుతం అంతర్జాతీయ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా సుమారు 2 శాతంగా ఉంది. 2033 నాటికి 11 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పాటు తన మార్కెట్ను 44 బిలియన్ డాలర్లకు పెంచుకోవడంపై భారత్ దృష్టి పెడుతోంది. తద్వారా గ్లోబల్ స్పేస్ ఎకానమీలో 7–8% వాటాను సాధించాలని నిర్దేశించుకుంది.
పర్సనల్ ఫైనాన్స్
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా.. కొత్త డెడ్లైన్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా స్పందించారు.2026 మార్చిలోపు ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు. మీరు ఇప్పటికే 75 శాతం పీఎఫ్ను విత్డ్రా చేసుకోవచ్చు. దీనిని మరింత సరళతరం చేయడంలో భాగంగానే ఏటీఎం విత్డ్రా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.ప్రస్తుత ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని కూడా మాండవియా హైలైట్ చేశారు. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ను ఉపసంహరించుకోవడానికి అనేక ఫామ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంది సభ్యులకు ఇబ్బందిగా మారుతుందని, ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేస్తోందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: బఫెట్ సూత్రాలు: స్టాక్ మార్కెట్లో విజయం!అక్టోబర్ 2025లో, ప్రావిడెంట్ ఫండ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ప్రధాన సంస్కరణలను ఆమోదించింది. ఈపీఎఫ్ ఉపసంహరణ నియమాలు గందరగోళంగా ఉన్నాయని, దీని వల్లనే కొన్నిసార్లు పీఎఫ్ ఉపసంహరణ ఆలస్యం, తిరస్కరణ జరుగుతోందని కార్మిక మంత్రి వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఉపసంహరణ చట్రాన్ని సరళీకృతం చేయడానికి మంత్రిత్వ శాఖ 13 వర్గాలను విలీనం చేసి 3 విభాగాలుగా వర్గీకరించారు. ఇది పీఎఫ్ ఉపసంహరణను మరింత సులభతరం చేసింది.
ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..
ఉద్యోగం చేసేవారికి కోటీశ్వరులు కావాలనే కల నెరవేర్చుకోవడానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రణాళిక చాలా ముఖ్యం. కేవలం పొదుపు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందుకే పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. దీనికి తోడు చక్రవడ్డీ (Compounding) శక్తిని అర్థం చేసుకోవడం, వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం, రిస్క్ను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి వివిధ మార్గాల్లో పెట్టుబడులను విభజించడం చాలా అవసరం. పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు ఏమిటో చూద్దాం.మ్యూచువల్ ఫండ్స్ఉద్యోగులకు కోటీశ్వరులయ్యే లక్ష్యాన్ని చేరేందుకు మ్యూచువల్ ఫండ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సిప్ విధానం అనుకూలంగా ఉంటుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి జీతం పెరిగే కొద్దీ సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.ఈక్విటీ ఫండ్స్దీర్ఘకాలంలో (10-15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) అధిక రాబడిని ఆశించేవారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్) అనుకూలం. ఇవి అధిక రిస్క్తో కూడినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే శక్తిని కలిగి ఉంటాయి.డెట్ ఫండ్స్ఇవి బాండ్లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. తక్కువ రిస్క్, స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ఇవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్. పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. అయితే వీటికి కనీసం మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.ఈక్విటీ, స్టాక్ మార్కెట్పెట్టుబడిపై అధిక నియంత్రణ, అధిక రాబడిని కోరుకునే వారికి స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టాలంటే మార్కెట్పై, కంపెనీల ఫండమెంటల్స్పై మంచి అవగాహన ఉండాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే అధిక రిస్క్తో కూడుకున్నది. దీర్ఘకాలికంగా బలంగా ఉన్న మంచి వృద్ధి సామర్థ్యం కలిగిన నాణ్యమైన కంపెనీల షేర్లను ఎంచుకోవడం వల్ల అద్భుతమైన రాబడిని పొందే అవకాశం ఉంది. మీ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని మాత్రమే డైరెక్ట్ ఈక్విటీకి కేటాయించడం, ఒకే రంగంలో లేదా ఒకే షేరులో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.రియల్ ఎస్టేట్భౌతిక ఆస్తులుఇళ్లు, అపార్ట్మెంట్లు లేదా వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. అద్దెల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం, ఆస్తి విలువ పెరగడం ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి లభిస్తుంది. అయితే నిర్వహణ ఖర్చులు, లిక్విడిటీ లేకపోవడం (అంటే అవసరమైనప్పుడు త్వరగా నగదుగా మార్చలేకపోవడం) వంటి సవాళ్లు ఉంటాయి.రీట్స్(Real Estate Investment Trusts)రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇదొక సులభమైన మార్గం. రీట్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. వీటి ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, భారీ వాణిజ్య ఆస్తుల యజమాన్యంలో భాగస్వామి కావచ్చు. అద్దెల ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఇది తక్కువ రిస్క్తో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను అందిస్తుంది.చిన్న వ్యాపారాలుపెట్టుబడి పెట్టడం ద్వారా కాకుండా మీ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉద్యోగానికి భంగం కలగకుండా మీ నైపుణ్యాలు లేదా అభిరుచులకు అనుగుణంగా ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ సేవలు, కన్సల్టింగ్, లేదా చిన్న ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు.ఈ సైడ్ బిజినెస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని పైన పేర్కొన్న పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవచ్చు. కొంతమంది విజయవంతమైన చిరు వ్యాపారాల్లో చిన్న మొత్తంలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. కానీ దీనికి ఆ వ్యాపారంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇది కొంత రిస్క్తో కూడుకుంది.ఇతర ముఖ్యమైన పెట్టుబడి మార్గాలుపీపీఎఫ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం మద్దతుతో నడిచే సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. రాబడి స్థిరంగా, పన్ను రహితంగా ఉంటుంది. ఇది తక్కువ రిస్క్ కోరుకునే వారికి అనుకూలం.ఎన్పీఎస్: జాతీయ పింఛను పథకం అనేది ఉద్యోగులకు దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు కోసం ఉద్దేశించింది. ఇది ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. సెక్షన్ 80సీ, 80సీసీడీ(1బీ) కింద అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది.బంగారం: భౌతిక బంగారం లేదా సావరీన్ గోల్డ్ బాండ్లు (SGBs), గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. బంగారం తరచుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జింగ్గా(ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మార్కెట్ పడుతున్నప్పడు బంగారం పెరుగుతుంది. ఈక్రమంలో మార్కెట్ పడినప్పుడు బంగారంలోని పెట్టుబడి తీసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు) పనిచేస్తుంది. పోర్ట్ఫోలియో వైవిధ్యీకరణకు సహాయపడుతుంది.ఇదీ చదవండి: బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే..
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025: అమల్లోకి ఎప్పుడంటే?
ఒకప్పుడు స్వాతంత్రం రాక ముందు ఆదాయపు పన్ను చట్టం 1922, స్వాతంత్రం వచ్చిన తరువాత చట్టం 1961 అమలులోకి వచ్చింది. మధ్యలో ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు, నాలుగైదు సార్లు పెనుమార్పులు. తీసివేతలు, కలిపివేతలు, 65 సార్లు 4,000 మార్పులు చేశారు. ఈ సంవత్సరం కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారు.ఆదాయపు పన్ను చట్టం 2025.. 47 చాప్టర్లను 23కు కుదించారు. 819 సెక్షన్లను 536కి తగ్గించారు. ఇప్పుడు షెడ్యూళ్లు లేవు. ఇప్పుడు వాటి సంఖ్య 16. ప్రస్తుతం అంకెలకు ఇంగ్లీషు అక్షరాలు తగిలించి.. మూడు అక్షరాల రైలుబండిలా పెట్టి వ్యవహారం నడుపుతున్నారు. ఇకపై అలా ఉండదు. కేవలం నంబర్లే... సెక్షన్ 10లో ఉండే అన్ని మినహాయింపులను షెడ్యూల్స్లో అమర్చారు. క్లారిటీ కోసం కొన్ని టేబుల్స్, ఫార్మూలాలు ప్రవేశపెట్టారు. అదేదో సినిమా డైలాగు గుర్తొస్తోంది. ‘అయితే నాకేంటి’? ఈ మార్పుల వలన మనకు ఒరిగేది ఏమిటి? 1.4.2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ చట్టం ప్రత్యేకతలు ఏమిటంటే...?సరళీకృతంగా ఉంటుంది. వాడుకలో లేనివాటిని తీసివేశారుకొన్ని అంశాలను నెంబరింగ్ ఇచ్చి క్రమబద్ధీకరించారు. కొన్ని అంశాలను పునర్నిర్మాణం చేశారు. రాబోయే పదం ‘‘పన్ను సంవత్సరం’’. ప్రస్తుత అకౌటింగ్ సంవత్సరం, ఫైనాన్సియల్ సంవత్సరం, ఆదాయపు సంవత్సరం, గత సంవత్సరం, ఇవన్నీ మనకు అర్ధం అయ్యేలా చెప్పాలంటే మనం ఆదాయం సంపాదించిన సంవత్సరం. ఈ ఆదాయాన్ని సంవత్సరం తరువాత అస్సెస్సుమెంట్ సంవత్సరం అంటే ఆ తరువాత సంవత్సరంలో అస్సెస్సు చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అస్సెస్సుమెంట్ సంవత్సరం అని అంటారు.రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి అవుతుందని అడిగినట్లు... 64 ఏళ్లు దాటినా టాక్స్ ప్లేయర్కి ఈ రెండు సంవత్సరాల మధ్య తేడా తెలియదు. కన్ఫ్యూజన్ పోలేదు. ఎన్నో పొరపాట్లు జరిగేవి. ఇన్కం టాక్స్ చెల్లించేటప్పుడు చలాన్లో సంవత్సరానికి సంబంధించిన కాలమ్ నింపేటప్పుడు తికమక అయ్యేవారు. ఇకపై తికమక అవసరం ఉండదు. 1.4.2026 నుంచి నుంచి ఒకే పదం వాడుకలోకి వస్తుంది. అదే ‘‘పన్ను సంవత్సరం’’. టీడీఎస్కి సంబంధించిన అంశాలను చాలా పద్ధతి ప్రకారం ఎటువంటి తికమక రాకుండా చేశారు. ఒక సెక్షన్ ద్వారా జీతాలకు సంబంధించిన అంశాలు పొందుబరిచారు. ఒకే ఒక సెక్షన్ ద్వారా మిగతా అన్ని టీడీయస్ అంశాలు పొందుబరిచారు. ఈ పట్టిక సమగ్రం.., సంపూర్ణం. క్రమసంఖ్య ఏ ఆదాయం మీద చేయాలి? ఎవరికి వర్తిస్తుంది? పరిమితులు... ఇలా ఉంటాయి వివరాలు... రెసిడెంట్లకు, నాన్ రెసిడెంట్లకు, టీసీఎస్.. ఎవరికి అక్కర్లేదు.? ఇలా అన్నీ టేబుల్స్ ద్వారా చక్కగా వివరించారు. పాతకాలపు పదజాలానికి స్వస్తి పలికారు. పాతవాటికి మంగళం పలికి, ప్రపంచంలో ఆచరించే మంచి పద్ధతులకు చట్టంలో చోటిచ్చారు.వర్చువల్, డిజిటల్ ఆస్తులను నిర్వచించారు. క్రిప్టో కరెన్సీ, టోకనైజ్డ్ ఆస్తులు, టెక్నాలజీ ద్వారా ఏర్పడే హక్కులు మొదలైనవి వివరించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా పరిష్కారం చేస్తారు. టెక్నాలజీని ఆసరా తీసుకొని అధికార్లకువిస్తృత అధికారాలు కల్పించారు. ఇన్నాళ్లు సెర్చ్లు అంటే ఇంటినో, ఆఫీసునో, ఫిజికల్ ఏరియా మాత్రమే ఉండేవి. ఇక నుంచి మీ ఈ–మెయిల్స్, క్లౌడ్ సర్వర్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వెబ్సైట్లు అన్నింట్లోనూ చొరబడతారు ఎగబడతారు. ఇకపై బుకాయించలేము. ఈ నగదు నాది కాదు మా మామగారిది అనలేము. అధికారులకు విస్తృత సమాచారం ఇవ్వడం వల్ల మీకు సంబంధించిన సమాచారం వారి చెంతనే ఉంటుంది. కాబట్టి కొత్త చట్టంలోని అంశాలకు అనుగుణంగా నడుచుకుందాం. చట్ట ప్రకారం మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి. ఫిబ్రవరిలో బడ్జెటుకు కసరత్తు జరుగుతోంది. అందులో శ్లాబులు, రేట్లు మారవచ్చు. మారకపోవచ్చు. ఈ రాబోయే మార్పులు తప్ప, మిగతా అంతా కొత్త చట్టం మనకు అందుబాటులో ఉంటుంది.కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య
డిజిటల్ పేమెంట్లు.. చీఫ్ రిస్క్ ఆఫీసర్ చిట్కాలు
డిజిటల్ పేమెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి, ఇవి భారతదేశాన్ని డిజిటల్–ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకెళ్తున్నాయి. ఇవి భద్రతతో పాటు, వినియోగదారులకు చెల్లింపుల్లో సౌకర్యాన్ని అందిస్తాయి. అయితే, డిజిటల్ పేమెంట్లను సురక్షితంగా ఉపయోగించడం, ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా ఉండటం ఈరోజుల్లో అత్యంత కీలకం.సంభవించే మోసాలను ముందుగానే గుర్తించగలిగితే అది మీతోపాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఆన్ లైన్ మోసాల నుంచి కాపాడడమే కాకుండా అందరికీ సురక్షితమైన, తక్కువ నగదు వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. ఆధునిక టెక్నాలజీ చెల్లింపులను వేగంగా జరిపేలా, సులభతరంగా మార్చినప్పటికీ, ఆన్లైన్ మోసాల నుండి పూర్తి స్థాయి రక్షణ అవగాహనతోనే సాధ్య పడుతుంది. ఆన్లైన్ మోసాలు, ముఖ్యంగా సామాజిక ఇంజినీరింగ్ ద్వారా జరిగేవి ఇటీవలి కాలంలో చాలా ఆందోళనగా కలిగిస్తున్నాయి. దురాశ, భయం, అత్యవసరం వంటి భావోద్వేగాలను సాధనాలుగా ఉపయోగించి ఆన్లైన్ మోసగాళ్లు వినియోగదారులను వంచిస్తారు.ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతున్న ధోరణుల్లో ఒకటి ‘‘డిజిటల్ అరెస్టు‘ తమను పోలీసులమని చెప్పుకుంటూ ఎవరో కాల్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మీ బ్యాంక్ ఖాతా దర్యాప్తులో ఉందని, డబ్బును ‘సురక్షిత’ ఖాతాకు మార్చాలని వారు చెబుతారు. వెంటనే మానసిక ఒత్తిడికి గురైన వినియోగదారులు వారి ట్రాప్లో పడి అంతా పోగొట్టుకుని చాలా ఆలస్యంగా అది మోసమని గ్రహిస్తారు. నిజమైన ప్రభుత్వ సంస్థలు, నియంత్రణ సంస్థలు ఎప్పుడూ ఫోన్లు, వీడియో కాల్ ద్వారా డబ్బు అడగవు, కేసులను దర్యాప్తు చేయవు. డబ్బు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు కాల్ చేసిన వ్యక్తి నిజస్వరూపాన్ని నిర్ధారించుకోవడం, నమ్మకమైన ప్రభుత్వ సంస్థలను సంప్రదించడం చాలా ముఖ్యం.వేగంగా పెరుగుతున్న పెట్టుబడి మోసాలు ఆరి్ధక నిపుణులుగా పరిచయం చేసుకుని మోసంచేసే వారు ఇటీవలి బాగా పెరిగారు. పేరున్న సంస్థలను, నకిలీ రిఫరెన్సులను అమాయక, ఔత్సాహిక ఇన్వెస్టర్లను మోసగించేందుకు వీరు ఉపయోగిస్తారు.అసాధారణ లాభాలు , ప్రత్యేక పెట్టుబడి అవకాశాలను అందిస్తామని వాగ్దానం చేస్తారు. బదులుగా డబ్బు అందుకున్న వెంటనే అదృశ్యమైపోతారు. అందుకే ఎల్లప్పుడూ సెబీ, ఆర్బీఐ ఇతర అధికారిక నియంత్రణ సంస్థల వెబ్సైట్లలో నమోదైన సంస్థల జాబితాలను తనిఖీ చేస్తుండాలి.వినియోగదారులు సురక్షితంగా ఎలా ? డిజిటల్ పేమెంట్లను ఆమోదించే ముందు వినియోగదారులు ఎల్లవేళలా యాప్ నోటిఫికేషన్లను జాగ్రత్తగా పరిశీలించాలి, మోసం జరిగితే వెంటనే తమ బ్యాంకుకు తెలియజేయాలి లేదా 1930 (సైబర్ సెక్యూరిటీ హెల్ప్లైన్)కు కాల్ చేయాలి, అలాగే నిర్ధారించని యాప్లను డౌన్లోడ్ చేయకూడదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కూడా తక్షణ చెల్లింపు వ్యవస్థ –యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(UPI) వ్యవస్థలో అనేక భద్రతా చర్యలను అమలు చేస్తోంది. తెలియని యూపీఐ ఐడీలకు డబ్బు పంపేటప్పుడు హెచ్చరిక సందేశాలతో ప్రారంభ అలర్ట్లు, అలాగే డివైస్ బైండింగ్ లాంటి రెండంచెల ధృవీకరణతో కూడిన భద్రతా వ్యవస్థను అమల్లోకి తెచ్చింది.‘మే మూర్ఖ్ నహీ హూన్’’ వంటి ప్రచార వీడియోల ద్వారా ప్రజల్లో అవగాహనను పెంచడానికి కూడా ఎన్పీసీఐ కృషి చేస్తోంది. డిజిటల్ భద్రతగా ఉండడం, ఆన్లైన్ మోసాల విషయంలో అప్రమత్తతతో ఉండే సంస్కృతిని వినియోగదారుల్లో పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది. డిజిటల్ పేమెంట్లు ప్రతి వినియోగదారుడికి సులభంగా సురక్షితంగా ఉండేలా చేస్తోంది.


