ప్రధాన వార్తలు
జనవరి 1 నుంచి ఈ కార్ల ధరల పెంపు
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. వాహన మోడల్, వేరియంట్ను బట్టి పెంపు 2% వరకు ఉంటుందని వివరించింది. ముడిసరకు ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎమ్డబ్ల్యూ వాహన ధరలు సైతం జనవరి 1 నుంచి పెరుగనున్న సంగతి తెలిసిందే. అటు బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా తమ బైక్ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. డాలరు, యూరోలతో పోలిస్తే రూపాయి మారకం కొద్ది నెలలుగా గణనీయంగా పడిపోతుండటం, ముడి పదార్థాలు .. లాజిస్టిక్స్ వ్యయాలు పెరిగిపోతుండటం రేట్ల పెంపునకు కారణమని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.భారత్లో తయారు చేసే జీ 310 ఆర్ఆర్, సీఈ 02 బైక్లతో పాటు ఎఫ్ 900 జీఎస్, ఎఫ్ 900 జీఎస్ఏలాంటి దిగుమతి చేసుకున్న ప్రీమియం బైక్లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 2.81 లక్షల నుంచి రూ. 48.63 లక్షల వరకు ఉంది.
ఫుడ్ డెలివరీ యాప్లు వద్దు బాబోయ్..
దేశంలో ఫుడ్ డెలివరి యాప్లు విస్తృతంగా పెరిగిపోయాయి. వాస్తవంగా ఈ యాప్లు రెస్టారెంట్ పరిశ్రమకు కస్టమర్లను, ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ యాప్స్ను నమ్ముకుని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయా.. లేక రెస్టారెంట్లపై ఆధారపడి ఫుడ్ డెలివరి యాప్లు పనిచేస్తున్నాయా అంటే చెప్పడం కష్టం.అయితే ఇవే ఫుడ్ డెలివరి యాప్లు రెస్టారెంట్లకు ఆర్థికంగా, కార్యాచరణపరంగా ఒత్తిళ్లను కూడా తెస్తున్నాయి. ప్రోసస్ సౌజన్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం ఫుడ్ డెలివరి యాప్లు, రెస్టారెంట్ల మధ్య నలుగుతున్న వివాదాస్పద ఘర్షణను వెలుగులోకి తెచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, ప్రాంతాల్లోని రెస్టారెంట్లతో నిర్వహించిన వివరణాత్మక సర్వేలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్లను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లలో 35 శాతం అవకాశం ఉంటే ఈ యాప్ల నుండి నిష్క్రమించాలనే అనుకుంటున్నాయి. అదే సమయంలో దాదాపు మూడింట రెండు వంతుల రెస్టారెంట్లు మాత్రం ఫుడ్ డెలివరీ యాప్లతో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నాయి.రెస్టారెంట్ల బేజారుకు కారాణాలివే..అధిక కమీషన్లు ఫుడ్ డెలివరీ యాప్లపై రెస్టారెంట్ల అసంతృప్తికి ప్రధాన కారణం ప్రతి ఆర్డర్పై అవి వసూలు చేపసే కమీషన్. నివేదిక ప్రకారం.. ప్లాట్ ఫామ్ కమీషన్లు కొన్నాళ్లుగా పెరిగిపోయాయి. బిల్లు మొత్తంలో వాటి వాటా గణనీయంగా ఉంటోంది. చాలా మంది రెస్టారెంట్ యజమానులకు, ఆర్డర్ వాల్యూమ్లు బలంగా ఉన్నప్పటికీ, కమీషన్ల కారణంగా ఆర్డర్కు వచ్చే నికర ఆదాయాలు తగ్గిపోయాయి. "సగటు 'పర్ ఆర్డర్' కమిషన్ 2019లో 9.6 శాతం ఉండగా 2023 వచ్చేసరికి అది 24.6 శాతానికి పెరిగింది. సొంత డెలివరీ యాప్ల వైపు రెస్టారెంట్లుఅధిక కమిషన్లు, నియంత్రణల కారణంగా అనేక రెస్టారెంట్లు ఇప్పుడు తమ సొంత డెలివరీ యాప్లు, వెబ్సైట్లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల అవసరం తగ్గుతుంది. కమిషన్ల భారం ఉండదు. కస్టమర్ డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. లాభాల మార్జిన్ మెరుగుపడుతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు భావిస్తున్నారు. పెద్ద చైన్ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా, మధ్యస్థ స్థాయి హోటళ్లు కూడా వాట్సాప్ ఆర్డర్లు, లోకల్ డెలివరీ బాయ్స్ సహాయంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి.బ్రాండ్ విలువకు దెబ్బఫుడ్ డెలివరీ యాప్లు తరచూ భారీ డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లు, ఫెస్టివ్ డీల్స్ వంటి వాటిని రెస్టారెంట్లపై ఒత్తిడి చేసి అమలు చేయిస్తున్నాయి. దీని వల్ల రెస్టారెంట్ ధరల స్వతంత్రత కోల్పోతుంది. బ్రాండ్ విలువ తగ్గుతోంది. ఆఫ్లైన్ కస్టమర్లతో ధరల అసమతుల్యత ఏర్పడుతుంది.
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ మారిపోతున్నాయి. తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గత వారం రోజుల్లో (డిసెంబర్ 14 – డిసెంబర్ 21) హైదరాబాద్ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయ మార్పులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు మొత్తంగా చూస్తే స్వల్పంగా పెరిగాయి.ధరల మార్పు ఇలా..డిసెంబర్ 14న రూ.1,33,910గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర.. పెరుగుతూ.. తగ్గుతూ డిసెంబర్ 21 నాటికి రూ.1,34,180 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల అనంతరం నికరంగా రూ.270 పెరిగింది.ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే డిసెంబర్ 14న రూ.1,22,750తో ప్రారంభమై, డిసెంబర్ 21న రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది. నిరకంగా చూస్తే వారం రోజుల్లో రూ.250 ఎగిసింది.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుబంగారాన్ని ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్టర్లు ‘సేఫ్-హేవెన్’గా కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం డిమాండ్.. ధరలు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ బంగారం ధరలు యూఎస్ డాలర్ బలం, అంతర్జాతీయ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ బలంగా మారితే బంగారం ఫ్యూచర్స్పై ప్రభావం పడుతుంది. ఇది స్థానిక ధరలను ప్రభావితం చేస్తుంది.డిసెంబర్లో పండుగలు, శుభదినాలు, పెళ్లి సీజన్ మొదలైన సందర్భాల నేపథ్యంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది.ఇక స్థానికంగా ఉన్న పన్నులు, సరఫరా, డిమాండ్ కూడా రోజువారీ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సీజనల్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది.
అదే బైక్.. అప్డేటెడ్ వెర్షన్
బజాజ్ ఆటో లిమిటెడ్ ‘2026 పల్సర్ 220ఎఫ్’ మోటార్సైకిల్ను కొత్త అప్డేట్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్–షోరూం ధర రూ. 1.28 లక్షలు. స్వల్ప స్టైలింగ్, రంగులతో పాటు ప్రధానంగా కాస్మెటిక్, ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. రైడింగ్ సేఫ్టీని పటిష్టం చేసేందుకు సింగిల్–ఛానల్ ఏబీఎస్ నుంచి డ్యూయల్–ఛానల్ ఏబీఎస్కి అప్గ్రేడ్ చేశారు.మరింత స్పష్టంగా కనిపించేలా, మోడ్రన్ లుక్తో ఎల్ఈడీ టర్న్–సిగ్నల్స్(ఇండికేటర్స్) అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఈ మోడల్లో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తుంది. బ్లాక్ చెర్రీ రెడ్, బ్లాక్ ఇంక్ బ్లూ, బ్లాక్ కాపర్ బీయి, బ్లాక్ కాపర్ బేజ్ గ్రీన్ లైట్ కాపర్ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.అత్యుత్తమ పనితీరుతో అభిమానులను ఆకట్టుకున్న 220సీసీ ట్విన్ స్పార్క్ డీటీఎస్–ఐ ఇంజిన్ను మాత్రం కంపెనీ యథాతథంగా ఉంచేసింది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో, ఆయిల్–కూల్డ్ సింగిల్ సిలిండర్ సెటప్లో వస్తుంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్పీఎం వద్ద 20.9 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తూ బలమైన పనితీరును ప్రదర్శిస్తుంది.‘కేటీఎం డ్యూక్ 160’ కొత్త వేరియంట్ప్రీమియం బైక్ విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కేటీఎం సంస్థ ’160 డ్యూక్’లో మరింత అధునాతన వేరియంట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 1.78 లక్షలు (ఢిల్లీ ఎక్స్–షోరూం). అయిదు అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంది. జెన్–3 కేటీఎం 390 డ్యూక్ నుంచి దీనిని ప్రేరణగా తీసుకున్నారు.రైడర్ తన అభిరుచికి తగ్గట్లు డిస్ప్లే థీమ్ను మార్చుకోవచ్చు. రైడర్ మెనూలు, కనెక్టివిటీ వంటి బైక్ ఫంక్షన్లను నియంత్రించేందుకు 4–వే స్విచ్ క్యూబ్ కూడా ఉంటుంది. నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ బైక్ను కేటీఎం మై రైడ్ యాప్కు కనెక్ట్ చేసుకోవచ్చు.
కొటక్ బ్యాంక్పై కొరడా.. ఆర్బీఐ భారీ జరిమానా
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నిబంధనలు పాటించనందుకు గానూ రూ.61.95 లక్షలు జరిమానా చెల్లించాలని కొటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది.జరిమానా ఇందుకే.. ‘బ్యాంకింగ్ సేవలు అందించడం - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా’ 'బిజినెస్ కరస్పాండెంట్లు (బీసీ) చేపట్టాల్సిన కార్యకలాపాల పరిధి'పై ఆదేశాలను పాటించనందుకు అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రూల్స్, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.2024 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితికి సంబంధించి బ్యాంక్ సూపర్వైజరీ మూల్యాంకనాన్ని (ISE 2024) తనిఖీ చేసిన ఆర్బీఐ.. ఇప్పటికే కనీస సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్లకు అలాంటి మరో ఖాతాను తెరిచినట్లు గుర్తించింది. అలాగే అనుమతించిన పరిధికి మించిన కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు అవకాశం కల్పించినట్లు కూడా గమనించింది. అంతేకాకుండా కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సిఐసి) తప్పుడు సమాచారాన్ని అందించినట్లు తేల్చింది.
ఇల్లు.. ఇక కొందామా.. తొలగిన డైలమా!
కొందామా.. మరికొన్నాళ్లు వేచి చూద్దామా..? కొనగానే ధరలు పడిపోతే..? పోనీ, ధైర్యం చేసి కొన్నా అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోతే? ..ఏడాది కాలంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఇలాంటి ఎన్నో సందేహాలు. ఏ నిర్ణయం తీసుకోకుండా తర్జన భర్జనలో పడేశాయి. 2025లో ఈ ఊగిసలాటకు తెరపడింది. స్థిరాస్తి మార్కెట్లో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి ఈ ఏడాదితో తొలగిపోవడంతో కొనుగోలుదారుల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. కొనుగోళ్లు పెరగడంతో స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు పూర్తి చేయడంలో వేగం పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ల కార్యాచరణలో వేగంగా అడుగులు వేయడంతో ఈ రంగంలో సానుకూల అడుగులు వేసేందుకు ప్రధానంగా ఊతమిచ్చాయి.భూముల ధరలు పెరగడం తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఇది. మరి అలాంటప్పుడు కొనడానికి ఎందుకు ఊగిసలాట అనే సందేహం సహజం. గతంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని అతిగా చూపించి వాస్తవ ధరకంటే ఎంతో ఎక్కువకు స్థలాలను విక్రయించారు.. ఇవి పెరగకపోగా.. అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే తక్కువ ధరకే విక్రయించి కొందరు నష్టపోయారు. సాధారణంగా కొనుగోలుదారుల మనస్తత్వం.. ధరలు పెరుగుతుంటే కొనేందుకు పోటీపడతారు. అదే తగ్గుతుందంటే మాత్రం ఎవరూ ముందుకురారు. ఇలాంటప్పుడే డిమాండ్ పడి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉంటాయి. ధరలు పెరగాలంటే అభివృద్ధి నిలకడగా ఉండటం, రాజకీయ సుస్థిరత వంటి అంశాలు ఇంధనంగా పనిచేస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తోంది. నగరంలో ఐటీ, ఫార్మాలతో పాటు విమానయాన, ఎల్రక్టానిక్స్ తదితర రంగాలలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. తద్వారా సహజంగానే ఇళ్ల నిర్మాణానికీ డిమాండ్ పెరుగుతోంది. కంపెనీల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జరిగి చుట్టుపక్కల స్థిరాస్తి రంగం వృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుంది.నలువైపులా అభివృద్ధి.. నగరం ఒకవైపే అభివృద్ధి కాకుండా నలువైపులా విస్తరించేలా ఆధ్యాత్మిక, ఐటీ, ఉత్పత్తి, ఫార్మా కారిడార్ల ప్రణాళికలు నిర్మాణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి సానుకూల దిశగా స్థిరాస్తి మార్కెట్ అడుగులు పడేందుకు ఇవి దోహదం చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సరళతరం చేసింది. నిధులు లేక సతమతమవుతున్న నిర్మాణ పరిశ్రమలో ఈ నిర్ణయంతో ఆశలు చిగురించాయి. పెద్ద ప్రాజెక్ట్లకే కాదు చిన్న ప్రాజెక్ట్లకూ ఆర్థిక అండ లభించింది. తద్వారా హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లోకి మరిన్ని పెట్టుబడులతో పాటుగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది. టౌన్షిప్ల అభివృద్ధి, గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి నిధులు సమకూరాయి.ఇది చదివారా? ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..రెరాతో జవాబుదారితనం.. స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుతో మార్కెట్పై సామాన్యుల్లో భరోసా పెరిగింది. దీంతో డెవలపర్లు, కొనుగోలుదారుల్లో సానుకూలత ఏర్పడింది. నిర్మాణం పూర్తయ్యి కొనుగోలుదారులకు అప్పగించాక ఐదేళ్లలో ఏదైనా లోపాలుంటే నిర్మాణదారుడిదే బాధ్యత వహించాలనేది స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లులోని మరో ముఖ్యమైన అంశం. నిర్మాణం మొదలుపెట్టాక ప్లాన్ను మార్చడానికి వీల్లేకుండా కొన్ని మంచి నిబంధనలలూ ఇందులో పొందుపరిచారు. వీటిని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలతో స్థిరాస్తి మార్కెట్లో జవాబుదారితనం పెరిగింది.
కార్పొరేట్
ఫుడ్ డెలివరీ యాప్లు వద్దు బాబోయ్..
కొటక్ బ్యాంక్పై కొరడా.. ఆర్బీఐ భారీ జరిమానా
50 లక్షల మందికి ఐబీఎం శిక్షణ
కొలువులు ఉంటేనే.. విదేశాల్లో చదువు..
ఫోర్బ్స్ జాబితాలో 26 ఏళ్ల కళ్యాణి రామదుర్గం
పొగమంచు గుప్పిట్లో విమానయానం
భారతీయ కస్టమర్లు ‘స్ట్రిక్ట్ టీచర్లు’ లాంటివారు
‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే..
ప్రారంభంలో ఆశావహం.. సవాళ్ల సుడిగుండం!
ఆకాశమే హద్దు
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
అందరికీ అనుకూలంగా ఫండ్స్ కొత్త నిబంధనలు
మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు సంబంధించి సెబీ సవరించ...
పసిడి ఇంకా పైకి.. వెండి మరో‘సారీ’..
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. వరుసగా...
ఆర్బీఐ జోక్యంతో కోలుకున్న రూపాయి!
న్యూఢిల్లీ: డాలర్తో రూపాయి కాస్త బలపడింది. ఫారెక్...
ఐడీఆర్బీటీలో ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ గవర...
మురిపిస్తున్న ముగింపు!
డిసెంబర్ చివరి వారం వచ్చిందంటే చాలు.. ప్రపంచమంతా క...
పార్లమెంట్లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం!
భారత ఇంధన రంగంలో చారిత్రాత్మక మార్పులకు నాంది పలుక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
అంటార్కిటికాలో భారత మైత్రి-2 పరిశోధనా కేంద్రం
మంచు ఖండం అంటార్కిటికాలో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడంలో భారతదేశం మరింత పట్టు సాధించనుంది. తూర్పు అంటార్కిటికాలో భారత్ నిర్మించదలచిన సరికొత్త పరిశోధనా కేంద్రం ‘మైత్రి-2’ 2032 నాటికి సిద్ధం కానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ముందుగా ఈ ప్రాజెక్ట్ను 2029 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడినట్లు ప్రభుత్వం చెప్పింది. సుమారు రూ.2,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మైత్రి-1 స్థానాన్ని భర్తీ చేయనుంది.మైత్రి-11981లో భారత అంటార్కిటిక్ యాత్రలు ప్రారంభమైనప్పటికీ 1989లో షిర్మాకర్ ఒయాసిస్లో స్థాపించిన మైత్రి-1 ఇండియా పరిశోధనలకు కీలకంగా నిలిచింది. అంతకుముందు ఉన్న ‘దక్షిణ గంగోత్రి’ మంచులో కూరుకుపోయిన తర్వాత మైత్రి-1 ప్రధాన కార్యస్థానంగా మారింది.మైత్రి-1 సాధించిన విజయాలుగత 35 ఏళ్లుగా నిరంతరాయంగా శాస్త్రవేత్తలకు ఆశ్రయం ఇస్తూ వాతావరణ మార్పులపై విలువైన డేటాను అందించింది. భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, హిమానీనదాల అధ్యయనంలో మైత్రి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ స్టేషన్ పాతబడటంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో మైత్రి-2 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.మైత్రి-2 భవిష్యత్ పరిశోధనల దిశగా..మైత్రి-2 అత్యాధునిక సాంకేతికతతో కూడిన శాస్త్రీయ ప్రయోగశాల. ఈ స్టేషన్ ద్వారా భారత్ చేపట్టబోయే ప్రధాన పరిశోధనలు ఇవే:ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అంటార్కిటిక్ మంచు ఫలకాలు కరగడాన్ని నిశితంగా పరిశీలించడం. ఇందుకోసం అధునాతన ‘ఐస్-కోర్ స్టోరేజ్’ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.తీవ్రమైన చలిలో జీవించే సూక్ష్మజీవులు, వృక్షజాతులపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక జీవ, సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుంది.ఓజోన్ పొరలో మార్పులు, భూకంప తరంగాల పర్యవేక్షణ, దీర్ఘకాలిక పర్యావరణ స్థితిగతులను ఈ స్టేషన్ ట్రాక్ చేస్తుంది.ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా శాస్త్రీయ కార్యకలాపాలు సాగడానికి బలమైన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థను మైత్రి-2లో రూపొందిస్తున్నారు.ప్రస్తుత స్థితి.. సవాళ్లుకేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, మైత్రి-2 నిర్మాణాన్ని కొన్ని కారణాల వల్ల 2032కి మార్చారు. దీనికి అవసరమైన ఆర్కిటెక్చరల్ డిజైన్, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ప్రభుత్వం రూ.29.2 కోట్లను ఇప్పటికే మంజూరు చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, రవాణా సవాళ్ల దృష్ట్యా ఈ నిర్మాణానికి పట్టే ఏడేళ్ల సమయం అత్యంత కీలకం.గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) ఆధ్వర్యంలో భారత్ అంటార్కిటికాలో తన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది. మైత్రి-2 అందుబాటులోకి రావడం ద్వారా కేవలం పరిశోధనల పరిధి పెరగడమే కాకుండా ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భారతదేశం తన నాయకత్వ పాత్రను చాటుకుంటుంది.ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ బోర్డులు
సామాన్యుడి చేతిలో సమస్తం!
ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే వింతగా చూసిన పల్లె ప్రజలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్తో ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యామా అని ఇప్పుడు చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చింది. చాట్జీపీటీ, జెమిని.. వంటివి కేవలం నగరాలకో, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకో పరిమితం కాలేదు. పంటకు పట్టిన తెగులును ఫోటో తీసి పరిష్కారం అడిగే రైతు నుంచి, ప్రభుత్వ పథకాల వివరాలను మాతృభాషలో అడిగి తెలుసుకునే సామాన్యుడి వరకు.. ఏఐ నేడు ఒక డిజిటల్ సహాయకుడిలా మారుతోంది. ఇంగ్లీష్ రాకపోయినా, టెక్నాలజీపై అవగాహన లేకపోయినా.. కేవలం మాటతోనే పనులు పూర్తి చేసుకునేలా ఏఐ అందుబాటులోకి వస్తోంది.సామాన్యుల కోసం టెక్ కంపెనీల వ్యూహాలుచదవడం, రాయడం రాని వారు కూడా తమ మాతృభాషలో మాట్లాడి సమాచారాన్ని పొందేలా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వాయిస్ అసిస్టెంట్లను అభివృద్ధి చేశాయి. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన భాషిణి వంటి ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులు, గూగుల్ ‘1,000 ల్యాంగ్వేజీ ఏఐ మోడల్’ ద్వారా స్థానిక మాండలికాల్లో ఏఐ సర్వీసులు అందిస్తున్నారు. కొత్త యాప్లను డౌన్లోడ్ చేయడం కష్టంగా భావించే వారి కోసం నేరుగా వాట్సాప్ చాట్బాట్ల ద్వారా ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.గ్రామ స్థాయిలో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది?వ్యవసాయానికి సంబంధించి నేల స్వభావం, వాతావరణ మార్పులను బట్టి ఏ పంట వేయాలి? ఎప్పుడు నీరు పెట్టాలి? పురుగుల మందు ఎప్పుడు చల్లాలి? వంటి అంశాలను ఏఐ ముందే సూచిస్తుంది. ఉదాహరణకు, పంట ఆకు ఫోటో తీసి ఏఐ యాప్లో పెడితే దానికి ఉన్న సమస్యలు ఏమిటో, ఏ మందు వాడాలో వెంటనే చెబుతుంది.గ్రామాల్లో డాక్టర్ల కొరత ఉంటుంది. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి నగరంలోని డాక్టర్లకు సమాచారాన్ని పంపవచ్చు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తమ సొంత భాషలో అడిగి తెలుసుకోవడానికి ఏఐ చాట్బాట్లు సహాయపడుతున్నాయి.ఏఐని సులువుగా ఎలా వాడవచ్చు?స్మార్ట్ఫోన్లో ఏదైనా ఏఐను అడగాలంటే టైప్ చేయడం కష్టమైతే కీబోర్డ్ పైన లేదా సెర్చ్ బార్లో ఉండే మైక్ బటన్ నొక్కి మీకు కావాల్సిన విషయాన్ని అడగాలి.గూగుల్ లెన్స్ వంటి ఏఐ టూల్స్ వాడి ఏదైనా తెలియని వస్తువును లేదా మొక్కను ఫోటో తీసి దాని వివరాలు తెలుసుకోవచ్చు.మీకు రాని భాషలో ఏదైనా ఉత్తరం లేదా బోర్డు ఉంటే, ఏఐ కెమెరా ద్వారా దాన్ని వెంటనే కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం చదువుకున్న వారి కోసం మాత్రమే కాదు, దీన్ని అందరి కోసం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. డిజిటల్ అక్షరాస్యత పెంచడంతో పాటు భాషా పరమైన అడ్డంకులను తొలగిస్తే ఏఐ ఒక సామాన్యుడి డిజిటల్ సహాయకుడిగా మారుతుంది.ఇదీ చదవండి: వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు
వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఏటా పెరుగుతోంది. వాహనదారుల్లో పర్యావరణంపై అవగాహన అధికమవుతోంది. భారత రోడ్లపై గతేడాది దాదాపు 15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కడం పర్యావరణ స్పృహకు నిదర్శనం. అయితే, ఈ వాహనాల్లో కీలక భాగంగా ఉన్న ‘లిథియం-అయాన్’ బ్యాటరీల ఆయుష్షు తీరిపోయాక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో ఏటా 50,000 టన్నులకు పైగా బ్యాటరీ వ్యర్థాలు పోగుపడనున్నాయి. కానీ, ఈ వ్యర్థాలను పర్యావరణ ముప్పుగా కాకుండా ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశంగా మార్చే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు (2024)’ ఈ రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కేవలం రీసైక్లింగ్ మాత్రమే కాకుండా ఈ పాత బ్యాటరీలను ‘సెకండ్ లైఫ్’ కింద కొన్ని మార్పులు చేసి మారుమూల గ్రామాల్లో సోలార్ గ్రిడ్లుగా, వ్యవసాయ పంపు సెట్లకు ఎనర్జీ సోర్స్లుగా మలచవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.పెరుగుతున్న బ్యాటరీలుప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం సాధారణంగా 8 నుంచి 10 ఏళ్లు. భారత ప్రభుత్వం ఫేమ్ 2 పథకం ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో వచ్చే దశాబ్ద కాలంలో లక్షలాది టన్నుల బ్యాటరీ వ్యర్థాలు పోగుపడతాయని అంచనా. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే అందులోని రసాయనాలు భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రమాదం ఉంది.రీసైక్లింగ్ ప్రక్రియబ్యాటరీలను కేవలం వ్యర్థాలుగా చూడకుండా రీసైక్లింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాలి. కొన్ని పద్ధతుల ద్వారా పాత బ్యాటరీల నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలను 90% పైగా తిరిగి పొందవచ్చు. భారతదేశంలో లిథియం నిల్వలు తక్కువ. రీసైక్లింగ్ పెరిగితే ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ (2022)’ ప్రకారం తయారీదారులే బ్యాటరీల సేకరణ, రీసైక్లింగ్కు బాధ్యత వహించాలి.బ్యాటరీలకు ‘సెకండ్ లైఫ్’అన్ని బ్యాటరీలను వెంటనే రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవీల్లో బ్యాటరీ సామర్థ్యం 70-80% కి పడిపోయినప్పుడు అవి వాహనానికి పనికిరావు కానీ, ఇతర అవసరాలకు అవి మెరుగ్గా పని చేస్తాయి. దీనినే సెకండ్ లైఫ్ అప్లికేషన్లు అంటారు. రీసైకిల్ చేయకుండానే ఈ బ్యాటరీలను గ్రామీణ ప్రాంతాల్లో విభిన్న అవసరాలకు ఉపయోగించవచ్చు.సోలార్ మైక్రో గ్రిడ్లు: గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ పాత ఈవీ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. పగలు నిల్వ చేసిన విద్యుత్తును రాత్రి పూట వీధి దీపాలకు, ఇళ్లకు వాడుకోవచ్చు.వ్యవసాయ పంపు సెట్లు: పొలాల్లో సోలార్ పంపు సెట్లకు బ్యాటరీ స్టోరేజ్గా వీటిని అనుసంధానిస్తే విభిన్న వాతావరణ పరిస్థితులున్న సమయంలో కూడా నీటి సరఫరా ఆగదు.బ్యాకప్ పవర్: గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఇన్వర్టర్ల స్థానంలో ఈ బ్యాటరీ ప్యాక్లను తక్కువ ధరకే ఏర్పాటు చేయవచ్చు.నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో బ్యాటరీ రీసైక్లింగ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల(సుమారు రూ.9000 కోట్లు)కు చేరుకుంటుంది. ఈ క్రమంలో పాత బ్యాటరీలను గ్రామీణ విద్యుదీకరణకు వాడటం వల్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సులభమవుతుంది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త బ్యాటరీల తయారీలో కనీసం 5% రీసైకిల్ చేసిన పదార్థాలను వాడాలనే నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లోహమ్ (LOHUM) వంటి సంస్థలు ఇప్పటికే పాత ఈవీ బ్యాటరీలను ఎనర్జీ స్టోరేజ్లుగా మార్చి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయోగాలు చేస్తున్నాయి. రీసైక్లింగ్ ద్వారా లభించే లిథియం, కోబాల్ట్ ధరలు కొత్త ఖనిజాల తవ్వకం కంటే 25% తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈవీల ధరలు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.ఇదీ చదవండి: భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్
2025లో బెస్ట్ బడ్జెట్ ఫోన్లు ఇవే..
2025 ఏడాది ముగింపునకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్చే డివైజ్ ఏదైనా ఉందంటే అది స్మార్ట్ ఫోన్. శాంసంగ్ నుంచి మొదలు పెడితే పోకో వరకూ ఇలా అనేక మొబైల్ బ్రాండ్లు ప్రతినెలా కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంటాయి.అయితే ఎక్కువ మందికి కావాల్సినవి.. కొనేవి బడ్జెట్ ఫోన్లే కాబట్టి.. రూ.20 వేల ధరలోపు 2025లో వచ్చిన బెస్ట్ స్మార్ట్ఫోన్లేవో ఈ కథనంలో చూద్దాం.. వీటిని చాలా మంది ఇప్పటికే కొని వినియోగిస్తుండవచ్చు. లేదా ఇప్పుడు కొనుక్కోవచ్చు..షియోమీ రెడ్ మీ నోట్ 14 5జీ: పనితీరు, కెమెరా, బ్యాటరీ సమతుల్య మిశ్రమంతో అద్భుతమైన ఆల్ రౌండర్. రోజువారీ ఉపయోగం, స్ట్రీమింగ్, క్యాజువల్ గేమింగ్ కోసం రూ.17,000 లోపు మంచి ఆప్షన్.రియల్మీ 14ఎక్స్ 5జీ: మంచి డిస్ప్లే, బ్యాటరీ లైఫ్తో బడ్జెట్ ఎంపిక. ధర రూ .15,000 కంటే తక్కువ. దృఢమైన రోజువారీ పనితీరు, 5జీ సపోర్ట్ కోరుకునేవారికి సరిగ్గా సరిపోతుంది.మోటరోలా మోటో జీ86 పవర్ 5జీ: మంచి పనితీరు, బ్యాటరీ లైఫ్, క్లీన్ సాఫ్ట్ వేర్ ఎక్స్పీరియన్స్తో బ్రాండ్ సపోర్ట్తో రూ.18,000 కంటే తక్కువ ధరలో అద్భుతమైన మిడ్-రేంజ్ ఫోన్ఒప్పో కే13 5జీ స్టైలిష్: డిజైన్, సులభమైన పనితీరు దీన్ని రూ.20,000 లోపు ఫోన్లలో పోటీ ఎంపికగా చేస్తుంది. డిస్ ప్లే క్వాలిటీ విషయంలో మంచి రేటింగ్స్ పొందింది.వన్ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ: తక్కువ ధర పాయింట్ (రూ.12 వేలు నుంచి రూ.15 వేలు) వద్ద క్లీన్ యూజర్ ఎక్స్పీరియన్స్, మంచి పనితీరును కోరుకుంటే ఇది మంచి ఆప్షన్.గమనిక: దాదాపు అన్ని ప్రధాన స్మోర్ట్ఫోన్ బ్రాండ్లను ఇక్కడ పేర్కొనడం జరిగింది. ధరల రేంజ్, ఫీచర్లను బట్టి పైన జాబితాను ఇవ్వడం జరిగింది.
పర్సనల్ ఫైనాన్స్
ఫండ్ పరిశ్రమకు సిప్ దన్ను
అర్థవంతమైన, దీర్ఘకాలిక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లు (సిప్), మార్కెట్ వృద్ధితో అసెట్ విలువలు పెరుగుతుండటంలాంటి అంశాలు మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో నిమేష్ షా తెలిపారు. రిటైర్మెంట్ లేదా పిల్లల చదువులాంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం సిప్ విధానంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు మదుపరులు, చివరివరకు పెట్టుబడులను కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు.యాక్టివ్ వ్యూహాలు అత్యధిక రాబడులను అందించినంత వరకు వాటిపై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతుందని షవివరించారు. దేశీయంగా యాక్టివ్ ఫండ్లు సహేతుకమైన పనితీరును కనపరుస్తున్నందున వాటిల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏదైనా ఫండ్ సంస్థకు ఇతర సంస్థల నుంచి పోటీ, లేదా నియంత్రణ నిబంధనలపరమైన రిసు్కల కన్నా పనితీరు ఆశించినంత స్థాయిలో లేకపోవడమే పెద్ద రిసు్కగా ఉంటుందని షా వివరించారు.‘‘డిజిటైజేషన్, డెమోగ్రాఫిక్స్, ఆర్థిక అసెట్ద్లోకి కుటుంబాల పొదుపు మొత్తాలు భారీగా వస్తుండటంలాంటి అంశాల దన్నుతో భారత జీడీపీ గణనీయంగా వృద్ధి నమోదు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల ఊతంతో దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కంపెనీల ఆదాయ వృద్ధి రూపంలో ఈక్విటీ మార్కెట్లలో కూడా ఇది ప్రతిఫలిస్తోంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులను కొనసాగించే వారికి సముచితమైన ప్రతిఫలం దక్కుతుందని ఇవి నమ్మకం కలిగిస్తున్నాయి’’ అని షా తెలిపారు.లిస్టయినా జవాబుదారీతనం యథాతథం.. ‘‘స్టాక్ మార్కెట్లలో కంపెనీ లిస్టయినప్పటికీ మా జవాబుదారీతనం, బాధ్యతలేమీ మారవు. ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించి, వారి సంపద వృద్ధి చెందితేనే మా ఆదాయాలు పెరుగుతాయి కాబట్టి యూనిట్హోల్డర్లకు ఒనగూరే ప్రయోజనాలతో షేర్హోల్డర్ల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. అన్నింటికన్నా ప్రధానంగా డబ్బును నిర్వహించే రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీగానే మమ్మల్ని మేము భావిస్తాం. లిస్టింగ్ తర్వాత కూడా అదే కొనసాగుతుంది. ఫండ్ పరిశ్రమ చాలా విస్తృత స్థాయి వ్యాపారం. ఇన్వెస్టర్లకు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నియంత్రణ సంస్థ వ్యయాలను క్రమబదీ్ధకరించింది. దీనితో ఇన్వెస్టర్లకు ఫండ్స్ మరింత అందుబాటులోకి వస్తాయి. అలాగే మార్జిన్లు తగ్గినా పరిమాణం పెరగడం వల్ల సంస్థకు ఆ మేరకు భర్తీ అవుతుంది. కాలక్రమేణా అధిక లాభాలకు దోహదపడుతుంది’’ అని షా చెప్పారు.ఇక ఐపీవో వల్ల కంపెనీ నిర్వహణ స్వరూపం ఏమీ మారదన్నారు. గత మూడు దశాబ్దాలుగా పెట్టుబడులు కొనసాగిస్తున్న ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ పాక్షికంగానే వాటాలను విక్రయిస్తోందని, ఐసీఐసీఐ బ్యాంకు మెజారిటీ వాటాదారుగా కొనసాగుతుందని తెలిపారు. కాబట్టి అదే మేనేజ్మెంట్, అవే పెట్టుబడి సూత్రాలు, గవర్నెన్స్తో వ్యాపారం కొనసాగుతుందన్నారు. పబ్లిక్ ఇష్యూతో లిక్విడిటీ, యాజమాన్యం పెరుగుతుందే తప్ప కంపెనీ వ్యూహంలో మార్పు ఉండదని షా తెలిపారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎంతో పేరున్న పలు దిగ్గజ సంస్థలు యాంకర్ ఇన్వెస్టర్లుగా ఈ ఇష్యూలో పాలుపంచుకుంటున్నాయని వివరించారు. తమ బిజినెస్ మోడల్, నిర్వహణ క్రమశిక్షణ, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, భారత అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమపై వాటికున్న నమ్మకానికి ఇది నిదర్శనంగా ఉంటుందని వివరించారు.
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా.. కొత్త డెడ్లైన్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా స్పందించారు.2026 మార్చిలోపు ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు. మీరు ఇప్పటికే 75 శాతం పీఎఫ్ను విత్డ్రా చేసుకోవచ్చు. దీనిని మరింత సరళతరం చేయడంలో భాగంగానే ఏటీఎం విత్డ్రా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.ప్రస్తుత ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని కూడా మాండవియా హైలైట్ చేశారు. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ను ఉపసంహరించుకోవడానికి అనేక ఫామ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంది సభ్యులకు ఇబ్బందిగా మారుతుందని, ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేస్తోందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: బఫెట్ సూత్రాలు: స్టాక్ మార్కెట్లో విజయం!అక్టోబర్ 2025లో, ప్రావిడెంట్ ఫండ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ప్రధాన సంస్కరణలను ఆమోదించింది. ఈపీఎఫ్ ఉపసంహరణ నియమాలు గందరగోళంగా ఉన్నాయని, దీని వల్లనే కొన్నిసార్లు పీఎఫ్ ఉపసంహరణ ఆలస్యం, తిరస్కరణ జరుగుతోందని కార్మిక మంత్రి వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఉపసంహరణ చట్రాన్ని సరళీకృతం చేయడానికి మంత్రిత్వ శాఖ 13 వర్గాలను విలీనం చేసి 3 విభాగాలుగా వర్గీకరించారు. ఇది పీఎఫ్ ఉపసంహరణను మరింత సులభతరం చేసింది.
ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..
ఉద్యోగం చేసేవారికి కోటీశ్వరులు కావాలనే కల నెరవేర్చుకోవడానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రణాళిక చాలా ముఖ్యం. కేవలం పొదుపు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందుకే పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. దీనికి తోడు చక్రవడ్డీ (Compounding) శక్తిని అర్థం చేసుకోవడం, వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం, రిస్క్ను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి వివిధ మార్గాల్లో పెట్టుబడులను విభజించడం చాలా అవసరం. పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు ఏమిటో చూద్దాం.మ్యూచువల్ ఫండ్స్ఉద్యోగులకు కోటీశ్వరులయ్యే లక్ష్యాన్ని చేరేందుకు మ్యూచువల్ ఫండ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సిప్ విధానం అనుకూలంగా ఉంటుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి జీతం పెరిగే కొద్దీ సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.ఈక్విటీ ఫండ్స్దీర్ఘకాలంలో (10-15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) అధిక రాబడిని ఆశించేవారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్) అనుకూలం. ఇవి అధిక రిస్క్తో కూడినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే శక్తిని కలిగి ఉంటాయి.డెట్ ఫండ్స్ఇవి బాండ్లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. తక్కువ రిస్క్, స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ఇవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్. పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. అయితే వీటికి కనీసం మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.ఈక్విటీ, స్టాక్ మార్కెట్పెట్టుబడిపై అధిక నియంత్రణ, అధిక రాబడిని కోరుకునే వారికి స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టాలంటే మార్కెట్పై, కంపెనీల ఫండమెంటల్స్పై మంచి అవగాహన ఉండాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే అధిక రిస్క్తో కూడుకున్నది. దీర్ఘకాలికంగా బలంగా ఉన్న మంచి వృద్ధి సామర్థ్యం కలిగిన నాణ్యమైన కంపెనీల షేర్లను ఎంచుకోవడం వల్ల అద్భుతమైన రాబడిని పొందే అవకాశం ఉంది. మీ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని మాత్రమే డైరెక్ట్ ఈక్విటీకి కేటాయించడం, ఒకే రంగంలో లేదా ఒకే షేరులో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.రియల్ ఎస్టేట్భౌతిక ఆస్తులుఇళ్లు, అపార్ట్మెంట్లు లేదా వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. అద్దెల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం, ఆస్తి విలువ పెరగడం ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి లభిస్తుంది. అయితే నిర్వహణ ఖర్చులు, లిక్విడిటీ లేకపోవడం (అంటే అవసరమైనప్పుడు త్వరగా నగదుగా మార్చలేకపోవడం) వంటి సవాళ్లు ఉంటాయి.రీట్స్(Real Estate Investment Trusts)రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇదొక సులభమైన మార్గం. రీట్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. వీటి ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, భారీ వాణిజ్య ఆస్తుల యజమాన్యంలో భాగస్వామి కావచ్చు. అద్దెల ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఇది తక్కువ రిస్క్తో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను అందిస్తుంది.చిన్న వ్యాపారాలుపెట్టుబడి పెట్టడం ద్వారా కాకుండా మీ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉద్యోగానికి భంగం కలగకుండా మీ నైపుణ్యాలు లేదా అభిరుచులకు అనుగుణంగా ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ సేవలు, కన్సల్టింగ్, లేదా చిన్న ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు.ఈ సైడ్ బిజినెస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని పైన పేర్కొన్న పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవచ్చు. కొంతమంది విజయవంతమైన చిరు వ్యాపారాల్లో చిన్న మొత్తంలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. కానీ దీనికి ఆ వ్యాపారంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇది కొంత రిస్క్తో కూడుకుంది.ఇతర ముఖ్యమైన పెట్టుబడి మార్గాలుపీపీఎఫ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం మద్దతుతో నడిచే సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. రాబడి స్థిరంగా, పన్ను రహితంగా ఉంటుంది. ఇది తక్కువ రిస్క్ కోరుకునే వారికి అనుకూలం.ఎన్పీఎస్: జాతీయ పింఛను పథకం అనేది ఉద్యోగులకు దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు కోసం ఉద్దేశించింది. ఇది ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. సెక్షన్ 80సీ, 80సీసీడీ(1బీ) కింద అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది.బంగారం: భౌతిక బంగారం లేదా సావరీన్ గోల్డ్ బాండ్లు (SGBs), గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. బంగారం తరచుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జింగ్గా(ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మార్కెట్ పడుతున్నప్పడు బంగారం పెరుగుతుంది. ఈక్రమంలో మార్కెట్ పడినప్పుడు బంగారంలోని పెట్టుబడి తీసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు) పనిచేస్తుంది. పోర్ట్ఫోలియో వైవిధ్యీకరణకు సహాయపడుతుంది.ఇదీ చదవండి: బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే..
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025: అమల్లోకి ఎప్పుడంటే?
ఒకప్పుడు స్వాతంత్రం రాక ముందు ఆదాయపు పన్ను చట్టం 1922, స్వాతంత్రం వచ్చిన తరువాత చట్టం 1961 అమలులోకి వచ్చింది. మధ్యలో ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు, నాలుగైదు సార్లు పెనుమార్పులు. తీసివేతలు, కలిపివేతలు, 65 సార్లు 4,000 మార్పులు చేశారు. ఈ సంవత్సరం కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారు.ఆదాయపు పన్ను చట్టం 2025.. 47 చాప్టర్లను 23కు కుదించారు. 819 సెక్షన్లను 536కి తగ్గించారు. ఇప్పుడు షెడ్యూళ్లు లేవు. ఇప్పుడు వాటి సంఖ్య 16. ప్రస్తుతం అంకెలకు ఇంగ్లీషు అక్షరాలు తగిలించి.. మూడు అక్షరాల రైలుబండిలా పెట్టి వ్యవహారం నడుపుతున్నారు. ఇకపై అలా ఉండదు. కేవలం నంబర్లే... సెక్షన్ 10లో ఉండే అన్ని మినహాయింపులను షెడ్యూల్స్లో అమర్చారు. క్లారిటీ కోసం కొన్ని టేబుల్స్, ఫార్మూలాలు ప్రవేశపెట్టారు. అదేదో సినిమా డైలాగు గుర్తొస్తోంది. ‘అయితే నాకేంటి’? ఈ మార్పుల వలన మనకు ఒరిగేది ఏమిటి? 1.4.2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ చట్టం ప్రత్యేకతలు ఏమిటంటే...?సరళీకృతంగా ఉంటుంది. వాడుకలో లేనివాటిని తీసివేశారుకొన్ని అంశాలను నెంబరింగ్ ఇచ్చి క్రమబద్ధీకరించారు. కొన్ని అంశాలను పునర్నిర్మాణం చేశారు. రాబోయే పదం ‘‘పన్ను సంవత్సరం’’. ప్రస్తుత అకౌటింగ్ సంవత్సరం, ఫైనాన్సియల్ సంవత్సరం, ఆదాయపు సంవత్సరం, గత సంవత్సరం, ఇవన్నీ మనకు అర్ధం అయ్యేలా చెప్పాలంటే మనం ఆదాయం సంపాదించిన సంవత్సరం. ఈ ఆదాయాన్ని సంవత్సరం తరువాత అస్సెస్సుమెంట్ సంవత్సరం అంటే ఆ తరువాత సంవత్సరంలో అస్సెస్సు చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అస్సెస్సుమెంట్ సంవత్సరం అని అంటారు.రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి అవుతుందని అడిగినట్లు... 64 ఏళ్లు దాటినా టాక్స్ ప్లేయర్కి ఈ రెండు సంవత్సరాల మధ్య తేడా తెలియదు. కన్ఫ్యూజన్ పోలేదు. ఎన్నో పొరపాట్లు జరిగేవి. ఇన్కం టాక్స్ చెల్లించేటప్పుడు చలాన్లో సంవత్సరానికి సంబంధించిన కాలమ్ నింపేటప్పుడు తికమక అయ్యేవారు. ఇకపై తికమక అవసరం ఉండదు. 1.4.2026 నుంచి నుంచి ఒకే పదం వాడుకలోకి వస్తుంది. అదే ‘‘పన్ను సంవత్సరం’’. టీడీఎస్కి సంబంధించిన అంశాలను చాలా పద్ధతి ప్రకారం ఎటువంటి తికమక రాకుండా చేశారు. ఒక సెక్షన్ ద్వారా జీతాలకు సంబంధించిన అంశాలు పొందుబరిచారు. ఒకే ఒక సెక్షన్ ద్వారా మిగతా అన్ని టీడీయస్ అంశాలు పొందుబరిచారు. ఈ పట్టిక సమగ్రం.., సంపూర్ణం. క్రమసంఖ్య ఏ ఆదాయం మీద చేయాలి? ఎవరికి వర్తిస్తుంది? పరిమితులు... ఇలా ఉంటాయి వివరాలు... రెసిడెంట్లకు, నాన్ రెసిడెంట్లకు, టీసీఎస్.. ఎవరికి అక్కర్లేదు.? ఇలా అన్నీ టేబుల్స్ ద్వారా చక్కగా వివరించారు. పాతకాలపు పదజాలానికి స్వస్తి పలికారు. పాతవాటికి మంగళం పలికి, ప్రపంచంలో ఆచరించే మంచి పద్ధతులకు చట్టంలో చోటిచ్చారు.వర్చువల్, డిజిటల్ ఆస్తులను నిర్వచించారు. క్రిప్టో కరెన్సీ, టోకనైజ్డ్ ఆస్తులు, టెక్నాలజీ ద్వారా ఏర్పడే హక్కులు మొదలైనవి వివరించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా పరిష్కారం చేస్తారు. టెక్నాలజీని ఆసరా తీసుకొని అధికార్లకువిస్తృత అధికారాలు కల్పించారు. ఇన్నాళ్లు సెర్చ్లు అంటే ఇంటినో, ఆఫీసునో, ఫిజికల్ ఏరియా మాత్రమే ఉండేవి. ఇక నుంచి మీ ఈ–మెయిల్స్, క్లౌడ్ సర్వర్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వెబ్సైట్లు అన్నింట్లోనూ చొరబడతారు ఎగబడతారు. ఇకపై బుకాయించలేము. ఈ నగదు నాది కాదు మా మామగారిది అనలేము. అధికారులకు విస్తృత సమాచారం ఇవ్వడం వల్ల మీకు సంబంధించిన సమాచారం వారి చెంతనే ఉంటుంది. కాబట్టి కొత్త చట్టంలోని అంశాలకు అనుగుణంగా నడుచుకుందాం. చట్ట ప్రకారం మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి. ఫిబ్రవరిలో బడ్జెటుకు కసరత్తు జరుగుతోంది. అందులో శ్లాబులు, రేట్లు మారవచ్చు. మారకపోవచ్చు. ఈ రాబోయే మార్పులు తప్ప, మిగతా అంతా కొత్త చట్టం మనకు అందుబాటులో ఉంటుంది.కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య


