Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Core infra sectors growth slows down to 4percent in January1
మౌలిక రంగం మందగమనం 

న్యూఢిల్లీ: కీలక మౌలిక రంగాల్లో పనితీరు జనవరిలో చెప్పుకోతగ్గ స్థాయిలో నిదానించింది. వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. గతేడాది జనవరిలో వృద్ధి రేటు 5.1 శాతం కాగా, గత డిసెంబర్‌లోనూ 4.7 శాతం స్థాయిలో ఉండడం గమనించొచ్చు. ముఖ్యంగా మడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి తగ్గిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించింది. రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి సైతం ఫ్లాట్‌గా నమోదైంది. ఇక బొగ్గు ఉత్పత్తి 3.1 శాతానికి పరిమితమైంది. 2025 జనవరిలో బొగ్గు ఉత్పత్తి 4.6 శాతంగా ఉంది. సిమెంట్‌ ఉత్పత్తి 10.7 శాతం వృద్ధికి తగ్గింది. 2025 జనవరిలో ఇది 14.3 శాతం పెరగడం గమనార్హం. ఎరువులు, స్టీల్, విద్యుదుత్పత్తి గతేడాది జనవరితో పోలి్చతే సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి 2.8 శాతానికి తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 4.5 శాతంగానే ఉంది. ఎనిమిది రంగాలకు గాను ఏడింటిలో వృద్ధి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్‌ పేర్కొన్నారు. ఈ ప్రకారం పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2025 డిసెంబర్‌లో ఉన్న 7.8 శాతం నుంచి ఈ ఏడాది జనవరిలో 5.5 శాతానికి తగ్గొచ్చని అంచనా వేశారు.

India digital payments revolution continues to set new Records2
డిజిటల్‌ విప్లవం: క్యాష్‌కు చెక్‌..  యూపీఐదే హవా!

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవం సామాన్యుడి జీవనశైలిని సమూలంగా మార్చేసింది. చిల్లర కష్టాలకు చెక్‌ పెడుతూ.. గల్లీ లోని కిరాణా షాపు నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు ఎక్క డ చూసినా ఇప్పుడు ‘స్కాన్‌ అండ్‌ పే’ మంత్రమే మార్మోగుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, రూపే డెబిట్‌ కార్డులు, తక్కువ–విలువ కలిగిన భీమ్‌–యూపీఐ లావాదేవీల వల్ల దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌), నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) సంయుక్తంగా విడుదల చేసిన ‘సామాజిక–ఆర్థిక ప్రభావ విశ్లేషణ’ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని ఇప్సోస్‌ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించింది. యూపీఐ సంచలనం.. రికార్డుల మోత గత ఎనిమిదేళ్ల వ్యవధిలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు ఏకంగా 11 రెట్లు పెరిగాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్‌ లావాదేవీల సంఖ్య 2024–25 నాటికి 22,831 కోట్లకు చేరింది. మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో ఒకప్పుడు కేవ లం 4 శాతంగా ఉన్న యూపీఐ వాటా.. ఇప్పు డు ఏకంగా 80 శాతానికి చేరుకుని అగ్రగామిగా నిలిచింది. పీర్‌–టు–మర్చంట్‌ అంటే వినియోగదారు లు వ్యాపారులకు చేసే చెల్లింపుల్లో 26 రెట్ల భారీ వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్‌–టైమ్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో 49% వాటాతో మన దేశం గ్లోబల్‌ లీడర్‌గా కొనసాగుతోంది. తగ్గుముఖం పట్టిన ఏటీఎం క్యూలు దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరగడంతో జేబులో నగదు పెట్టుకుని తిరిగే వారి సంఖ్య గ ణనీయంగా తగ్గింది. నివేదిక ప్రకారం.. 59% మంది వినియోగదారులు, 57% మంది వ్యాపారులు తమ దైనందిన జీవితంలో నగదు వాడకం బాగా తగ్గిపోయిందని స్పష్టం చేశారు. నగదు డ్రా చేసేందుకు బ్యాంకులకు వెళ్లే వినియోగదారుల సంఖ్య 69% మేర తగ్గిపోగా, ఏటీఎంల నుంచి డబ్బు లు డ్రా చేయడం 62% మేర పడిపోయింది. వ్యాపారుల్లో ఏటీఎం విత్‌డ్రాలు 61% మేర తగ్గాయి. జీడీపీకి భారీ ఆర్థిక ఊతం నగదు నిర్వహణ ఖర్చులు తగ్గడం, డిజిటల్‌ లావాదేవీల్లో పారదర్శకత పెరగడం ద్వారా యూపీఐ ఏకంగా భారత జీడీపీకి (2022 సంవత్సరంలో) అదనంగా 16.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) జోడింపును అందించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. లావాదేవీలపై అదనపు రుసుములు లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. మారుమూల ప్రాంతాల్లోనూ మారుమోగుతున్న ‘స్కాన్‌ అండ్‌ పే’ డిజిటల్‌ చెల్లింపుల మద్దతు కేవలం మహానగరాలకే పరిమితం కాలేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాల్లోనూ యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. వృద్ధి రేటును గమనిస్తే.. లక్షదీ్వప్‌లో ఏకంగా 136%, మేఘాలయలో 83%, జమ్మూకాశీ్మర్‌లో 76% మేర యూపీఐ లావాదేవీల వృద్ధి నమోదైంది. వినియోగదారులు ఏమనుకుంటున్నారు? చాలా సులభంగా వాడుకునే వీలుండటం (63%), తక్షణమే ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ జరగడం (59%) వల్లే యూపీఐను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వినియోగదారులు సర్వేలో తెలిపారు. క్యాష్‌బ్యాక్‌ ఆఫ ర్లు (52%), మెరుగైన ఇంటర్నెట్‌ సౌకర్యం (37%), మెరుగైన భద్రతా ఫీచర్లు (36%) లాంటివి డిజిటల్‌ చెల్లింపుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నా యి. మరింత మందికి చేరువయ్యేందుకు స్థానిక భాష ల్లో యాప్స్‌ అందుబాటులో ఉండాలని 21% మంది అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నగదు కోసం ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరిగిన సగటు భారతీయుడు.. ఇప్పుడు తన స్మార్ట్‌ఫోన్‌నే బ్యాంక్‌గా మా ర్చుకుని పారదర్శకమైన ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాడని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.

Sakshi Interview With Kotak Mahindra Life Insurance MD Mahesh Balasubramanian3
బీమా వృద్ధికి ఎఫ్‌డీఐల దన్ను 

దేశీయంగా బీమా రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం పరిశ్రమ వృద్ధికి దోహదపడే పురోగామి చర్యగా కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎండీ మహేష్‌ బాలసుబ్రమణియన్‌ అభివరి్ణంచారు. జీఎస్‌టీపరమైన చర్యలతో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు 18 శాతం, సంప్రదాయ పథకాలు 4.5 శాతం చౌకగా లభిస్తాయని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి ఇచి్చన ఇంటర్వ్యూలో చెప్పారు. మరిన్ని విశేషాలు.. భారత బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించడం వల్ల పెట్టుబడులు, పోటీ తదితర విషయాల్లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు సకాలంలో తీసుకున్న పురోగామి చర్య. తదుపరి దశలో అధిక వృద్ధిని వేగవంతంగా సాధించడానికి పరిశ్రమకు కావల్సిన దీర్ఘకాలిక పెట్టుబడులు లభించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కస్టమర్‌ కోణంలో చూస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడి పెరగడం వల్ల సహజంగానే ఆవిష్కరణలకు ఊతం లభిస్తుంది. బీమా సంస్థలు డిజిటల్‌ ప్లాట్‌ఫాంలపై భారీగా ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలవుతుంది. దీనితో జీవిత బీమా మరింత సరళంగా మారి, ఇంకా అందుబాటులోకి వస్తుంది. అంతిమంగా కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులు, దీటైన ధరలో లభిస్తాయి. సరీ్వసులు కూడా మెరుగుపడతాయి. ఇక, ఏజెంట్లు, బ్రోకర్స్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లులాంటి ఇంటరీ్మడియరీలకు ఈ సంస్కరణతో మరింత విస్తృతమైన, వైవిధ్యమైన మార్కెట్‌ ఏర్పడుతుంది. బీమా సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో కూడా విస్తరిస్తున్న తరుణంలో బీమాపై అవగాహనను పెంచడంలో, ఆఖర్లో ఉన్న వారికి కూడా బీమాను చేరువ చేయడంలో వారి పాత్ర ఇంకా కీలకంగా మారుతుంది. ఇన్సూరెన్స్‌ విస్తృతి ఇంకా అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో కవరేజీని విస్తరించడం, ఆర్థిక భద్రతను పటిష్టం చేయడానికి సంబంధించిన దీర్ఘకాలిక విజన్‌కి ఇది దన్నుగా నిలుస్తుంది. ప్రీమియంలు, డిమాండ్‌పై జీఎస్‌టీ సంస్కరణల ప్రభావం ఎలా ఉంది? ఇది వినియోగదారులకు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చేదే. భారత్‌లో సాధారణంగా సున్నా శాతం శ్లాబ్‌ను నిత్యావసరాలకు, మనుగడ సాగించేందుకు కీలకమైన ఉత్పత్తులకు రిజర్వ్‌ చేశారు. బీమాను ఈ ‘ఎసెన్షియల్‌’ విభాగంలోకి చేర్చడం ద్వారా, ఆర్థిక భద్రత అనేది ఉన్నా లేకున్నా ఫర్వాలేదు అనుకోవడానికి లేదని, ప్రతి కుటుంబానికి ఇది కీలక అవసరమని ప్రభుత్వం ఒక శక్తివంతమైన సందేశం ఇచి్చనట్లయింది. 18 శాతం మేర చౌకగా లభించడం వల్ల, పూర్తిగా ప్రొటెక్షన్‌ పథకాలైన టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్ల విషయంలో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటోంది. ప్రొటెక్షన్‌లో సాధారణంగా వెనుకబడి ఉన్న భారత్‌లాంటి మార్కెట్లో ఇది చాలా పెద్ద కరెక్షన్‌గా చెప్పవచ్చు. దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మొదటిదేమిటంటే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు 18 శాతం చౌకగా లభించడం వల్ల తొలిసారిగా తీసుకునే వారికి మరింత అందుబాటులోకి వస్తుంది. ఇక రెండో కోణంలో చూస్తే, ప్రస్తుత కస్టమర్లకు అదనపు భారం పెరగకుండా 18 శాతం అధిక కవరేజీ లభించినట్లవుతుంది. అసలు బీమా లేని వారికి, సరైన కవరేజీ లేని వర్గాలకి కూడా జీఎస్‌టీ కోతతో ప్రయోజనాలు లభిస్తాయి. సాంప్రదాయ పథకాలు 4.5 శాతం, రెన్యువల్స్‌ 2.25 శాతం చౌకగా లభించడం వల్ల కస్టమర్లకు సానుకూలంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బీమా ధోరణులు ఎలా ఉంటున్నాయి? ఆర్థికంగా భారీ ఆకాంక్షలు, పురోగామి ఆలోచనా ధోరణులున్న వినియోగదారులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జీవిత బీమాకి సంబంధించి విశిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాంటార్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లాంటి అర్బన్‌ సెంటర్ల సారథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో క్రియాశీలక ప్లానింగ్, పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ, జీవిత బీమాపై అత్యధిక స్థాయిలో అవగాహన ఉన్నట్లు వెల్లడైంది. ఆర్థిక భద్రతకు నెలకొన్న డిమాండ్‌ని ఈ డేటా సూచిస్తోంది. సర్వే ప్రకారం ఈ ప్రాంతంలోని వినియోగదారుల్లో 78 శాతం మందికి సేవింగ్స్‌ ప్లాన్స్‌ గురించి అవగాహన ఉంది. గ్యారంటీగా ఏకమొత్తాన్ని అందించే, లేదా, స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని అందించే ప్లాన్లను పరిశీలిస్తామని 87 శాతం మంది తెలిపారు. పొదుపు ఆధారిత పథకాలకు ప్రాథమికంగా ప్రాధాన్యమిస్తున్నప్పటికీ, సమగ్ర భద్రతవైపు మళ్లుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లోని మొత్తం ఎన్‌వోపీల్లో టర్మ్‌ పాలసీల వాటా 32 శాతంగా ఉండగా, వీటి వృద్ధి 50 శాతం మేర ఉంటోందని కోటక్‌ లైఫ్‌ గమనించింది. సంపదను పెంపొందించుకోవడానికి ఎంత ప్రాధాన్యం ఉంటోందో ప్రొటెక్షన్‌కి కూడా అంతే ప్రాధాన్యత లభిస్తోంది. బ్యాంకెష్యూరెన్స్‌ వాటా 48 శాతంగా, ప్రొప్రైటరీ మాధ్యమాల వాటా 52 శాతంగా మా పంపిణీ వ్యవస్థ సమతూకమైన విధంగా ఉంటోంది. వచ్చే మూడు నుంచి అయిదేళ్లలో వృద్ధి, విస్తరణ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? కార్యకలాపాలు ప్రారంభించిన 25వ సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) సాధించడమనేది జీవిత బీమాలాంటి దీర్ఘకాలిక వ్యాపారంలో కోటక్‌ లైఫ్‌ సంపాదించుకున్న విశ్వసనీయతకు నిదర్శనం. మేము ఇప్పుడు 4.3 కోట్ల మందికి భద్రతనిస్తూ, దేశీయంగా దిగ్గజ ప్రైవేట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో ఒకటిగా కార్యకలాపాలు సాగిస్తున్నాం. హ్యాపీయూ యాప్‌లాంటి వాటితో మరింత ఆరోగ్యకరమైన, సురక్షితమైన విధంగా జీవించేలా కస్టమర్లను ప్రోత్హిస్తున్నాం. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిలో గణనీయంగా విస్తరించనున్నాం. ప్రస్తుత 333 శాఖల స్థాయి నుంచి రాబోయే కొన్నేళ్లలో రెట్టింపు స్థాయికి పెంచుకోనున్నాం. ఈ క్రమంలో 1 లక్ష మందికి పైగా ఉన్న మా డి్రస్టిబ్యూటర్ల వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ, సర్వీసింగ్‌ .. ఆటోమేషన్‌ని బలోపేతం చేసుకునేందుకు డిజిటల్‌కి సంబంధించి పెట్టుబడులను కొనసాగిస్తాం. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం ఎలా ఉంటోంది? కస్టమర్లు, భాగస్వాములు, ఉద్యోగులు అందరికీ సమగ్రమైన ప్రయోజనాలను అందించే విధంగా ఏఐ, ఎంఎల్‌ (మెషిన్‌ లెరి్నంగ్‌), ఆటోమేషన్‌ కలిసికట్టుగా పని చేయాలని మేము భావిస్తాం. కస్టమర్ల విషయానికొస్తే సోర్సింగ్‌ నుంచి క్లెయిమ్స్‌ వరకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నాం. క్లెయిమ్‌ల విషయంలో ఏఐ చాట్‌బాట్‌ల దన్నుతో 80 శాతం లావాదేవీలను డిజిటల్‌కు మార్చగలిగాం. 2 లక్షల క్లెయిమ్‌ల్లో 65 శాతం క్లెయిమ్‌లను ఫైనల్‌ డాక్యుమెంట్లు అందిన రోజే సెటిల్‌ చేశాం. పాలసీల విక్రయాలు, సరీ్వసు కోసం అడ్వైజర్లకి ఆప్టిమస్, బూస్ట్‌ 360, స్మార్ట్‌సెల్‌లాంటి సాధనాలను అందుబాటులోకి తెచ్చాం. ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మద్దతు లభించేలా, కావ్య పేరిట ఏఐ ఆధారిత హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌ని ప్రవేశపెట్టాం. బీమా విస్తృతి పెరగడానికి ఎలాంటి వ్యూహాలు అవసరం? దేశీయంగా జీవిత బీమా విస్తృతి ప్రస్తుతం గ్లోబల్‌ బెంచ్‌మార్క్‌ల కన్నా చాలా దిగువన దేశ జీడీపీలో అత్యంత తక్కువగా 2.8 శాతం స్థాయిలోనే ఉంటోంది. ప్రొటెక్షన్‌ అంతరం దాదాపు 17 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో 80 శాతం మేర ఉంటోంది. 2050 నాటికి రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ అవసరాలు, లభ్యత మధ్య అంతరం 85 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సవాళ్ల తీవ్రత, సత్వరం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు పరిశ్రమ ప్రధానంగా ట్రిపుల్‌ ‘ఏ’ ఫ్రేమ్‌వర్క్, అంటే అవగాహన పెంపొందించడం (ఎవేర్‌నెస్‌), మరింత అందుబాటులోకి తేవడం (యాక్సెసబిలిటీ), చౌకగా అందించడమనే (అఫోర్డబిలిటీ) వ్యూహాన్ని అమలు చేస్తోంది. – హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో

Top 5 Useless Features in Cars4
కారులో అవసరం లేని 5 ఫీచర్స్.. ధర కూడా తగ్గుతుంది!

కార్ల ధరలు ప్రధానంగా మీరు ఎంచుకునే ఫీచర్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు సరిగ్గా గమనిస్తే.. బేస్ వేరియంట్ ధర ఒకలా ఉంటే, టాప్ వేరియంట్ ధర ఇంకోలా ఉంటుంది. చూడటానికి కారు ఒకేలా కనిపించినా.. బేస్ వేరియంట్ - టాప్ వేరియంట్ ఫీచర్స్ వేరేలా ఉంటాయి. అంటే బేస్ వేరియంట్ లిమిటెడ్ ఫీచర్స్ పొందుతుంది. టాప్ వేరియంట్ ప్రీమియం ఫీచర్స్ లేదా అదనపు ఫీచర్స్ పొందుతుంది.ప్రస్తుతం కారు కొనుగోలు చేసే చాలామంది ఎక్కువ ఫీచర్స్ ఉన్న కార్లనే కొంటున్నారు. ఫీచర్స్ ఉన్న కార్లను కొంటున్నారు సరే.. ఉన్న ఫీచర్స్ ఉపయోగిస్తున్నారా.. అంటే?, లేదనే చెప్పాలి. అలాంటప్పుడు ఫీచర్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం కూడా వృధా. కాబట్టి ఈ కథనంలో ఫాఫాపు అవసరం లేని 5 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.బిల్ట్ నావిగేషన్ సిస్టమ్‌లుచాలా మంది డ్రైవర్లు గూగుల్ మ్యాప్స్ లేదా యాపిల్ మ్యాప్స్ ఉపయోగిస్తారు. అయితే వీటికంటే ఫోన్ నావిగేషన్ మరింత ఖచ్చితమైనది. అప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతుంది.పవర్డ్ టెయిల్‌గేట్బటన్‌తో బూట్‌ను ఓపెన్ చేయడం అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్ చిన్న కార్లలో అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది చేతితో ఓపెన్ చేయడం కంటే నెమ్మదిగా ఉంటుంది. ఇది పెద్ద కార్లకు అనుకూలంగా ఉంటుంది.పనోరమిక్ సన్‌రూఫ్ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. కానీ చాలామంది ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగించరు. ఎక్కువ గాలి లేదా ఎండ వస్తుందని దాదాపు క్లోజ్ చేసి ఉంచుతారు.గెస్టర్ కంట్రోల్ సిస్టమ్స్గెస్టర్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే మీ చేతిని ఊపి మ్యూజిక్ మార్చడం లాంటి ఫీచర్. మొదట చూడటానికి ఇది చాలా కూల్‌గా అనిపించవచ్చు, కానీ ఎక్కువసార్లు ఇవి సరిగ్గా పని చేయవు. కాబట్టి టచ్ కంట్రోల్ ఎంపిక చేసుకోవచ్చు. ఇది వేగంగా ఉంటుంది, నమ్మదగినదిగా ఉంటుంది.టచ్-ఓన్లీ క్లైమేట్ కంట్రోల్స్డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ ద్వారా ACని అడ్జస్ట్ చేయడం చికాకును కలిగిస్తుంది. కాబట్టి ఫిజికల్ నాబ్‌లు సులభంగా ఉంటాయి. ప్రత్యేకించి దీనిపై శ్రద్ద చూపాల్సిన అవసరం లేదు.ఒక కారును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అవసరమైన ఫీచర్స్ ఏవి కావాలి?, వాటిని ఎంతవరకు ఉపయోగిస్తాము అనే విషయాలను ముందుగానే ఆలోచించుకోవాలి. లేకుంటే మీకు అవసరం లేని ఫీచర్లకు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం.

AI Will Enhance Efficiency Not Replace Humans Says Karan Adani, Know The Details5
నాన్న అదే రాత్రి పోర్టుకు పంపారు.. నాకు ఆఫీస్ కూడా లేదు: కరణ్ ఆదానీ

దేశ రాజధానిలో ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్.. ప్లాటినం జూబ్లీ (70వ) వ్యవస్థాపక దినోత్సవం & 20వ జాతీయ మేనేజ్‌మెంట్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశంలో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు.కృత్రిమ మేధస్సు మానవులను పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ సామర్థ్యాన్ని పెంచేదిగా పనిచేస్తుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. ఉత్పాదకతను మెరుగుపరిచే & సంస్థలు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడే శక్తివంతమైన సాధనంగా AIని చూడాలని అన్నారు. అయితే.. ఒక టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కొంతమంది ఉద్యోగం కోల్పోవడం సర్వ సాధారణమే అని కరణ్ అదానీ పేర్కొన్నారు.ఇప్పటికే కొన్ని పెద్ద సంస్థలు తమ ఉద్యోగులకు ఏఐ వంటి వాటిలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇది ఉద్యోగ భద్రతను అందిస్తుంది. కంపెనీలు మాత్రమే కాకుండా.. ఉద్యోగులు కూడా తమకు తాము కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో మనగలుగుతాము.ఈ సందర్భంగా.. తన బాల్యం గురించి మాట్లాడుతూ నేను మూడేళ్లు మిషనరీ పాఠశాలలో చదువుకున్నాను అని కరణ్ అదానీ చెప్పారు. అక్కడే నేను క్రమశిక్షణ, స్వతంత్రత & భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలతో కలసి మెలసి ఉండటం వంటి విలువలను నేర్చుకున్నారని చెప్పారు. ఈ అనుభవాలు తన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.సింగపూర్‌లోని స్నేహితులు తనకు పరిచయం చేసిన ఫార్ములా 1 పట్ల తనకున్న మక్కువ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇందులో ప్రతి మిల్లీ సెకన్ ఎంత ముఖ్యమైనదో మైఖేల్ షూమేకర్ వంటి వాళ్లను చూసి నేర్చుకున్నాను అని అన్నారు. ఫార్ములా 1 భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం గురించి మాట్లాడుతూ, ప్రపంచ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని కరణ్ అదానీ అన్నారు.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!కరణ్ ఆదానీ తన వృత్తి ప్రయాణం గురించి మాట్లాడుతూ.. కాలేజీలో చదువు పూర్తయిపోయిన తరువాత.. పోర్టుల వ్యాపారంపై తనకు ఆసక్తి ఉందని తన తండ్రికి చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. అదే రాత్రి, నన్ను ముంద్రా పోర్టుకు పంపారు. నా మొదటి సంవత్సరం స్పెషల్ ఆఫీస్ & డెస్క్ లేకుండా నేలపై పని చేస్తూ గడిపాను. ఆ సమయంలోనే అనేక విభాగాలను సందర్శిస్తూ, అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అనుభవం ద్వారా నేర్చుకున్నాను అని వెల్లడించారు.

Gold Prices Surge Over Rs 1500 in a Week and Silver Climbs to Rs 2 90 Lakh6
వారం రోజుల్లో పసిడి జంప్.. ఎంతలా పెరిగిందంటే?

బంగారం, వెండి ధరలు కొంత కాలంగా పెరుగుతూ, తగ్గుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ వారం (ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21) రోజుల్లో గోల్డ్ రేటులో గణనీయమైన మార్పు ఏర్పడింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరలు ఎంతలా మారాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఫిబ్రవరి 15న 1,57,750 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 21) 1,59,280 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 1530 రూపాయలు పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,44,600 నుంచి 1,46,000 వద్దకు (రూ.1400 పెరిగింది) చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,57,900 రూపాయల నుంచి రూ. 1,59,430 వద్దకు (రూ.1530 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర 1,44,750 రూపాయల నుంచి రూ. 1,46,150 వద్దకు (1400 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,58,840 రూపాయల నుంచి 1,60,150 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,45,600 రూపాయల నుంచి రూ. 1,46,800 వద్దకు (రూ. 1200 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా మారాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 15) రూ. 2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజుకు (శనివారం) పెరుగుతూ.. తగ్గుతూ.. రూ. 2.90 లక్షలకు చేరింది.ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు?

Advertisement
Advertisement
Advertisement