Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

After 11000 Layoffs Accenture Says Use AI At Work For Promotion1
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్నవేళ.. యాక్సెంచర్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉన్న సీనియర్ ఉద్యోగులకు.. ముఖ్యంగా అసోసియేట్ డైరెక్టర్లు & సీనియర్ మేనేజర్లు, పదోన్నతులు పొందాలంటే కంపెనీ రూపొందించిన ఏఐ టూల్స్ క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించింది.ఏఐ ఎనేబుల్డ్ కంపెనీగా మారాలనే లక్ష్యంతో యాక్సెంచర్ సరికొత్త వ్యూహం రచించింది. కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా.. ఉద్యోగులకు కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులో ఉంచి, దానిద్వారా.. పనితీరును & ఉత్పాదకతను పెంచడానికి సంస్థ సిద్ధమైంది. పోటీ ప్రపంచంలో మనం నిలబడాలంటే.. ప్రతి ఉద్యోగి ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలని సీఈఓ జూలీ స్వీట్ పేర్కొన్నారు.యాక్సెంచర్ ప్రకటించిన ఈ కొత్త విధానం.. యూరప్‌లోని 12 దేశాలలో ఉన్న సిబ్బందికి & అమెరికా ప్రభుత్వ ఒప్పందాల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు. మిగిలిన అందరూ తప్పకుండా పాటించాల్సిందే. ఏఐ ఉపయోగించాల్సిందే. కంపెనీ 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.మూడు నెలల్లో 11000 మంది!యాక్సెంచర్ కంపెనీ గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోకపోతే.. మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా కంపెనీ ఏఐలో స్థిరంగా నిలబడటానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!

Stock Market Closing Update 20th February 20262
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్ల (0.38 శాతం) లాభంతో 82,814.71 వద్ద, నిఫ్టీ 116.90 పాయింట్ల (0.46 శాతం) లాభంతో 25,571.25 వద్ద నిలిచాయి.VL E-గవర్నెన్స్ & IT సొల్యూషన్స్ లిమిటెడ్, BLB లిమిటెడ్, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, సకార్ హెల్త్‌కేర్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. విక్రమ్ సోలార్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, ట్రాన్స్‌వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్, కెఎన్ అగ్రి రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Releaf Wellness announced first small molecule herbal pharma brand3
సహజంగా ఉండి సమర్థంగా పని చేసేలా కొత్త ఉత్పత్తులు

ఆయుర్వేద విజ్ఞానానికి ఆధునిక సైన్స్‌ను జోడిస్తూ ‘రిలీఫ్ వెల్నెస్’ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. భారత వెల్నెస్ మార్కెట్లో మొదటి స్మాల్ మాలిక్యూల్ హెర్బల్ ఫార్మా బ్రాండ్‌గా ఇది రికార్డు సృష్టించినట్లు చెప్పింది. ఈ బ్రాండ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొని కంపెనీ ఉత్పత్తులను ఆవిష్కరించారు.సుమారు 5,000 ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానానికి, ప్రస్తుత ఫార్మాస్యూటికల్ టెక్నాలజీకి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా రీలీఫ్ వెల్నెస్ పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ‘కంపెనీ ఉత్పత్తుల్లో నానో సాంకేతికతను ఉపయోగించడం వల్ల సాధారణ హెర్బల్ ఉత్పత్తుల కంటే 20-30 రెట్లు వేగంగా శరీరంలోకి ఇంకుతాయి. కణాల స్థాయిలో పనిచేసే చిన్న అణువులతో కూడిన ఫార్ములేషన్లను భారత్‌లో తొలిసారిగా తీసుకొచ్చాం. ఇది అల్లోపతి మందుల తరహాలోనే వేగవంతమైన ఫలితాలను అందిస్తుంది’ అని కంపెనీ చెప్పింది.పరిశోధనలే పునాదిగా..రిలీఫ్ వెల్నెస్ వ్యవస్థాపకుడు మిస్టర్ డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ పరిశోధనలతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఆయుర్వేద మూలికల శక్తిని ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వేగంతో అందించడమే మా లక్ష్యం’ అని చెప్పారు. బ్రాండ్ సీఈఓ తరుణ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ‘కెమికల్స్‌తో కూడిన మందులకు ప్రత్యామ్నాయంగా, సహజంగా ఉండి సమర్థంగా పనిచేసే మందులు కావాలనేవారికి రిలీఫ్ వెల్నెస్ బెటర్‌ చాయిస్‌’ అన్నారు.ఈ సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేశ ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్‌తో అనుసంధానం చేసిన విధానం ఆకట్టుకుంది. వెల్నెస్ రంగంలో పరిశోధనల ఆధారిత ఉత్పత్తులు రావడం అభినందనీయం’ అన్నారు. ఈ సంస్థ భారత్‌లోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ హబ్ సీ-క్యాంప్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్‌! తులం ఎంతంటే..

Tata Punch EV Facelift Launched4
468 కిమీ రేంజ్ అందించే టాటా కొత్త కారు: ధర ఎంతంటే?

టాటా మోటార్స్ కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరలు రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) నుంచి ప్రారంభమవుతాయి.టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 468 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ చేసింది. అయితే రియల్ వరల్డ్ రేంజ్ 355 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఈ కారు 65 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 26 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, మూడు డ్రైవ్ మోడ్‌లు (ఎకో, సిటీ, స్పోర్ట్), డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, కొత్త విండో కంట్రోల్ బటన్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో మొదలైనవి ఉన్నాయి.ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలుడిజైన్ పరంగా, రిఫ్రెష్డ్ ఫాసియా, చుట్టూ బూడిద రంగు బాడీ క్లాడింగ్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి. మిగిలిన డిజైన్ దాదాపు సాధారణ ఏవీ పంచ్ మాదిరిగానే ఉంటుంది.

where india exactly in ai development5
నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా?

న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్‌లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్‌జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్‌ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్‌లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.కంప్యూటింగ్‌ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్‌ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌..), చైనా (డీప్‌సీక్‌) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్‌ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.ప్లాట్‌ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్‌ఫారమ్స్ లేవు.అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్‌కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?అమెరికా కంపెనీలు భారత్‌పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్‌గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్‌ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్‌నే వాడాలని కోరుకుంటున్నారు.భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.డేటాపై పూర్తి అధికారంభారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పనచైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్‌లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.నైపుణ్యం కలిగిన మానవ వనరులుఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్‌! తులం ఎంతంటే..

RBI announced major regulatory shift risk based premium framework6
ఏప్రిల్ 2026 నుంచి ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’తో తగ్గుదల!

భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్కరణలు చేపడుతోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ కోసం ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల మెరుగైన రిస్క్ మేనేజ్‌మెంట్ పాటించే బ్యాంకులకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా ఖాతాదారుల డిపాజిట్లకు మరింత భద్రత చేకూరనుంది.ప్రస్తుత విధానం vs కొత్త విధానంప్రస్తుతం అమలులో ఉన్న ఫ్లాట్ ప్రీమియం పద్ధతిలో బ్యాంకు స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి రూ.100 అసెసబుల్ డిపాజిట్లకు (ఒక బ్యాంకు తన వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లపై డీఐసీజీసీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏ మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రీమియంను లెక్కిస్తారో దాన్ని అసెసబుల్ డిపాజిట్లు అంటారు) 12 పైసలను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఫిబ్రవరి 6, 2026న విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ ధరలను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నిర్ణయించే రిస్క్ స్కోర్ల ఆధారంగా వర్గీకరిస్తారు.ముఖ్యమైన అంశాలుబ్యాంకుల అంతర్గత రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ప్రీమియం మారుతుంది. పటిష్టమైన ఆర్థిక స్థితి ఉన్న బ్యాంకులు తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.ఐసీఆర్ఏ అంచనా ప్రకారం క్లెయిమ్‌లు లేని, సుదీర్ఘ హిస్టరీ కలిగిన బ్యాంకులు తమ అసెట్స్ పై రిటర్న్ (ఆర్‌ఓఏ)లో దాదాపు 4 బేసిస్ పాయింట్ల వృద్ధిని చూడవచ్చు.దేశంలోని మొత్తం డిపాజిట్లలో 80 శాతం వాటా కలిగిన బ్యాంకులు ఈ రాయితీ ప్రీమియంల వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకింగ్ రంగానికి మొత్తంగా 3 బేసిస్‌ పాయింట్లు లాభం చేకూరవచ్చు.టైర్-1 బ్యాంకులపై ప్రభావంషెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు (ఆర్‌ఆర్‌బీలు మినహా) వర్తించే టైర్-1 మోడల్ ప్రకారం ‘ఏ’ కేటగిరీ బ్యాంకుల ప్రీమియం రూ.100కి 8 పైసలకు తగ్గుతుంది. అంటే గతంలో కంటే నేరుగా 33.33 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా, వింటేజ్ ఆధారిత ప్రోత్సాహకం కింద మరో 25 శాతం వరకు ప్రీమియం తగ్గే అవకాశం ఉంది.రూ. 5 లక్షల పరిమితి పెరుగుతుందా?ప్రస్తుతం ఒక బ్యాంకులో ఖాతాదారుడికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంది. కొత్త ధరల నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఈ బీమా పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రిస్క్ ఆధారిత ప్రీమియం వల్ల బ్యాంకులపై పడే అదనపు భారాన్ని ఈ రాయితీలు భర్తీ చేస్తాయని ఐసీఆర్‌ఏ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్‌! తులం ఎంతంటే..

Advertisement
Advertisement
Advertisement