ప్రధాన వార్తలు
జాబ్ స్కాములపై అప్రమత్తంగా ప్రొఫెషనల్స్
న్యూఢిల్లీ: ఉద్యోగావకాశాల పేరిట జరిగే స్కాముల గురించి భారతీయ ప్రొఫెషనల్స్లో అవగాహన పెరుగుతోంది. 82 శాతం మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకునే ముందు సదరు జాబ్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ రూపొందించిన జాబ్ సెర్చ్ సేఫ్టీ పల్స్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఉద్యోగం నిఖార్సయినదేనా లేదా ఏదైనా కుంభకోణం అయి ఉంటుందా అని ఆలోచించి, అడుగేసే ప్రొఫెషనల్స్ సంఖ్య పెరుగుతోంది. అయితే, వేగం, పోటీ తీవ్రంగా ఉండే మార్కెట్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం కష్టతరమైన వ్యవహారంగా ఉంటోంది. ముఖ్యంగా కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారికి ఇది మరింత సవాలుతో కూడుకున్నదై ఉంటోంది. ఈ నేపథ్యంలో జాబ్ ప్లాట్ఫాంలు, కంపెనీలు, ఉద్యోగార్థులు.. అందరూ జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా, ఉద్యోగావకాశాల వ్యవస్థను విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దడం అవసరమని లింక్డ్ఇన్ ఇండియా హెడ్ (లీగల్, పబ్లిక్ పాలసీ) అదితి ఝా తెలిపారు. 2026 మార్చి 16–30 మధ్య భారత్తో పాటు బ్రిటన్, అమెరికా, జర్మనీ, బ్రెజిల్లో నిర్వహించిన ఈ సర్వేలో 8,512 మంది పాల్గొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఉద్యోగాన్ని దక్కించుకోవాలనే ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో అప్రమత్తతను పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ముఖ్యంగా కెరియర్ని అప్పుడప్పుడే మొదలుపెట్టే ఉద్యోగార్థుల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంటోంది. చాలా మంచి అవకాశంగా భావించి హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని 54 శాతం మంది జెన్ జెడ్ ఉద్యోగార్థులు తెలిపారు. జెన్ జెడ్ ప్రొఫెషనల్స్లో దాదాపు సగం మంది 49 శాతం జాబ్ స్కాము నుంచి తృటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. జెన్ ఎక్స్లో ఇలాంటి వారి సంఖ్య 36 శాతంగా ఉంది. → ఉద్యోగం కోసం బ్రౌజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తారసపడే అవకాశాలు (20 శాతం), సరైన వివరాలేమీ ఉండని, నమ్మశక్యంగా అనిపించని రిక్రూటర్ /కంపెనీ స్వయంగా సంప్రదించిన పరిస్థితుల్లో (18 శాతం) .. స్కామ్ అయి ఉంటుందేమోననే సందేహాలు ఉంటున్నాయి. → చర్చల పేరిట ఉద్యోగార్థులను విశ్వసనీయమైన ప్లాట్ఫాంల నుంచి వేరే వేదికల వైపు మళ్లించి, స్కామర్లు మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. 90 శాతం స్కామ్లలో, మెంబర్లను వ్యక్తిగత మెసేజింగ్ యాప్ల వైపు మళ్లిస్తున్నారు.
టెలికాం ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త నిబంధనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ కాల్స్ డ్రాప్ అవుతున్నాయా? డేటా స్పీడ్ రావడం లేదా? బిల్లుల్లో తప్పులున్నాయా? ఇకపై ఇలాంటి టెలికాం ఫిర్యాదుల పరిష్కారం కోసం గంటల తరబడి కస్టమర్ కేర్ ప్రతినిధి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రతిపాదించిన ’టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార (నాల్గవ సవరణ) నిబంధనలు–2026’ వినియోగదారుడికి మరింత ఉపశమనం ఇవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసినట్లు గురువారం కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ ప్రకటనలో తెలిపింది. గతంలో నిమిషాల కొద్దీ వెయిటింగ్ నెట్వర్క్ సమస్యలు, డేటా సమస్యల పరిష్కారం కోసం గతంలో ఫిర్యాదు చేయాలంటే కేవలం కాల్ సెంటర్కు ఫోన్ చేయడం లేదా ఎస్ఎంఎస్ పంపడం మాత్రమే ప్రధాన మార్గాలుగా ఉండేవి. ఫిర్యాదు చేసిన తర్వాత దాని పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి కస్టమర్ కేర్కు మళ్లీ మళ్లీ ఫోన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఓ పక్క పరిష్కారం కాకపోవడం, మరోపక్క ఫిర్యాదు నమోదు అయ్యిందో లేదో తెలుసుకునేందుకే గంటల కొద్దీ ఐవీఆర్ కాల్లో వెయిట్ చేయాల్సి వచ్చేది. చేసిన ఫిర్యాదు ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితులు ఉండేవి. కొత్త నిబంధనలు ఇలా కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి టెలికాం కంపెనీ తప్పనిసరిగా తమ మొబైల్ యాప్, అధికారిక వెబ్సైట్, ఏఐ ఆధారిత చాట్బాట్ల ద్వారా ఫిర్యాదులను స్వీకరించాలి. వినియోగదారుడు ఏ మాధ్యమం ద్వారా ఫిర్యాదు చేసినా, దానికి ఒకే విధమైన ’యూనిక్ ఫిర్యాదు నెంబర్ను కేటాయించాలి. రియల్ టైమ్ ట్రాకింగ్ ద్వారా మనం చేసిన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. కస్టమర్ కేర్కు మళ్లీ ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఆన్–లైన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఫిర్యాదు ఏ దశలో ఉంది, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటిలోపు పరిష్కారం అవుతుంది అనేది లైవ్ స్టేటస్ ద్వారా చూసుకోవచ్చు. పరిష్కార ప్రక్రియ మరింత పటిష్టం ముసాయిదా నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను మరింత పటిష్టం చేశారు. మొదటి దశలో.. వినియోగదారుడు చేసిన ఫిర్యాదును నిర్ణీత గడువులోపు పరిష్కరించాలి. ఒకవేళ ఇక్కడ పరిష్కారం లభించకపోయినా లేదా కంపెనీ ఇచి్చన సమాధానం నచ్చకపోయినా వెంటనే తదుపరి దశకు వెళ్లవచ్చు. ఇక రెండవ దశలో.. అప్పీలేట్ అథారిటీ వద్ద అప్పీల్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు మరింత సులభతరం చేశారు. వినియోగదారులకు స్పష్టతనిచ్చేలా, ఎటువంటి గందరగోళం లేకుండా అప్పీల్ ఫారమ్లను డిజిటల్గా అందుబాటులో ఉంచుతారు. ఆటోమేటెడ్ అలర్ట్స్ – రిమైండర్స్ ఫిర్యాదు నమోదు కాగానే వినియోగదారుడికి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా నిర్ధారణ సందేశం రావడంతో పాటు, పరిష్కార గడువు ముగిసేలోపు కంపెనీ ప్రతినిధులు వినియోగదారుడిని సంప్రదించేలా ఆటోమేటెడ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ట్రాయ్ సూచించింది. జవాబుదారీతనంలో భాగంగా.. ఫిర్యాదుల పరిష్కారంలో విఫలమైనా లేదా నిబంధనలు ఉల్లంఘించినా టెలికాం ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకునేలా ట్రాయ్ ఈ సవరణలో నిబంధనలను పొందుపరిచింది. కంపెనీలు తమ వద్ద నమోదైన ఫిర్యాదులు, పరిష్కరించిన కేసులు, పెండింగ్లో ఉన్న వాటిపై త్రైమాసిక నివేదికలను బహిరంగపరచాల్సి ఉంటుంది.
గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!
మే 2026 ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. ఈ రోజు 24 గంటల వ్యవధిలోనే గోల్డ్ ధరలు మరోమారు ఎగబాకాయికి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.ఈ రోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 1,39,750 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,250 వద్దకు చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,52,460 నుంచి 1,53,000 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటలు గడవకముందే పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,53,150 వద్దకు, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,400 వద్దకు చేరింది. అయితే చెన్నైలో మాత్రం ధరలు కేవలం తులం మీద 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?
2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎలాంటి ఆస్తులు స్థిరంగా ఉంటాయనే విషయాన్ని చర్చించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా మంది జీవితకాలంగా కూడబెట్టుకున్న సేవింగ్ కొన్ని వారాల్లోనే కరిగిపోవడం నేను చూశాను. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా 40 శాతం నుంచి 60 శాతం వరకు పడిపోయాయి. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వంటి భౌతిక ఆస్తులు స్థిరంగా నిలిచాయని కియోసాకి పేర్కొన్నారు.పేపర్ ఆస్తులుకియోసాకి ప్రకారం.. స్టాక్లు, బాండ్లు, నగదు వంటివాటిని ''పేపర్ ఆస్తులు''. ఇవి నిజంగా భౌతికంగా ఉండే వస్తువులు కావు, ఇవి కొన్ని వాగ్దానాలపై ఆధారపడతాయి.➤స్టాక్ అంటే ఒక కంపెనీ లాభదాయకంగా కొనసాగుతుందనే నమ్మకం➤బాండ్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ అప్పు తిరిగి చెల్లిస్తుందనే నమ్మకం➤డబ్బు అంటే కేంద్ర బ్యాంక్ దాని విలువను స్థిరంగా ఉంచుతుందనే నమ్మకంఅంటే.. ఇవన్నీ మన నియంత్రణలో కాకుండా, వ్యవస్థపై ఆధారపడిన ఉంటాయన్నమాట. రియల్ ఆస్తులురాబర్ట్ కియోసాకి దృష్టిలో భూమి, ఇళ్లు, బంగారం, వెండి వంటి వాటిని రియల్ ఆస్తులు. ఇవి భౌతికంగా ఉండే వస్తువులు కాబట్టి, ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ వాటి విలువ పూర్తిగా తగ్గే అవకాశం లేదు.భూమి ఎప్పుడూ ఉంటుంది, బంగారం అనేక శతాబ్దాలుగా విలువను నిలుపుకుంది. అద్దె ఇల్లు ఉంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది. కాబట్టి సంక్షోభ సమయాల్లో ఇవి నిలకడగా ఉంటాయి.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకిప్రతి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. స్టాక్స్, పేపర్ ఆస్తులు వేగంగా పడిపోతాయి. ఎందుకంటే ప్రజల్లో భయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు భయంతో స్టాక్స్ అమ్మేస్తారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ నష్టపోతారు. రియల్ ఆస్తులు మాత్రం స్థిరంగా ఉండడం లేదా పెరగడం జరుగుతుంది. అందుకే.. అనుభవజ్ఞులు సంక్షోభం రాకముందే తమ పెట్టుబడులను భౌతిక ఆస్తుల వైపు మార్చుకుంటారు.ఏ ప్రభుత్వం ఏర్పడక ముందే భూమి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉంది. ఒక బంగారు నాణెం రోమన్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, వాటి మధ్య వచ్చిన ప్రతి కరెన్సీ సంక్షోభాన్ని తట్టుకుని నిలిచింది. కాబట్టి నిజమైన వస్తువులకు ఉండే శాశ్వతత్వం కాగితపు వస్తువులకు ఎప్పటికీ ఉండదని రాబర్ట్ కియోసాకి విశ్వసిస్తున్నారు.
పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్
అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా.. పదేళ్లలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహా నగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదన్నారు.అందుకే.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా.. బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయన్నారు.గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి... వాటిల్లో కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం చేయకుండా.. వాటిని ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా ప్రత్యేక ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్లో ఉన్న ‘సిలికాన్ డెన్సిటీ (విభిన్న రంగాల నిపుణుల లభ్యత)’ని అందిపుచ్చుకుని ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు.
యూనికార్న్ క్లబ్లోకి హైదరాబాద్ స్కైరూట్
హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఏరోస్పేస్ ‘స్కైరూట్’ 60 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 570 కోట్లు) నిధులను సమీకరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో కంపెనీ దేశంలోనే తొలి స్పేస్-టెక్ 'యూనికార్న్' హోదాను దక్కించుకుంది. ఈ లేటెస్ట్ ఫండింగ్తో కంపెనీ మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,300 కోట్లు) చేరుకుంది.సాధారణంగా ఒక స్టార్టప్ విలువ 1 బిలియన్ డాలర్లను దాటితే.. దాన్ని యూనికార్న్గా పరిగణిస్తారు. భారత అంతరిక్ష రంగంలో.. ఇది గొప్ప విజయంగా భావిస్తారు. దీన్నిబట్టి చూస్తే భారతీయ స్పేస్ కంపెనీల వృద్ధి ఎలా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఈ పెట్టుబడి రౌండ్కు షెర్పలో వెంచర్స్, జీఐసీ నాయకత్వం వహించాయి. అంతే కాకుండా గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకులు, ఆర్కామ్ వెంచర్స్ వంటి ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ ఇన్వెస్టర్, అలాగే గూగుల్ తొలి పెట్టుబడిదారులలో ఒకరు, బోర్డు సభ్యుడైన రామ్ శ్రీరామ్ కూడా ఇందులో చేరనున్నారు.కంపెనీ కొత్తగా సేకరించిన నిధులను మూడు ప్రధాన లక్ష్యాల కోసం వినియోగించనుంది. మొదటగా, 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగాలను తరచుగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. రెండవది, రాకెట్ తయారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనుంది. మూడవది, మరింత శక్తివంతమైన 'విక్రమ్-2' రాకెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టనుంది.ఈ రాకెట్ ఒక టన్ను వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యంతో రూపొందుతుంది. అధునాతన క్రయోజెనిక్ ఇంజిన్తో ఇది మరింత పెద్ద మిషన్లకు ఉపయోగపడనుంది.ప్రస్తుతం స్కైరూట్ సంస్థ 'విక్రమ్-1' ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది భారత్లో పూర్తిగా ప్రైవేట్గా అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్గా గుర్తింపు పొందుతోంది. ఈ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాటిలైట్ ఆపరేటర్లకు తక్కువ ఖర్చుతో, అనుకూలమైన స్పేస్ లాంచ్ సేవలను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
కార్పొరేట్
పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్
యూనికార్న్ క్లబ్లోకి హైదరాబాద్ స్కైరూట్
స్మార్ట్ఫోన్ అమ్మకాలకు బ్రేక్: కారణం ఇదే!
రూ.28 లక్షల జాబ్ వదులుకున్న మేనేజర్
50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా స్వచ్ఛంద విరమణ
ఇండియా క్లీన్ ఎనర్జీలోకి యాపిల్ ఎంట్రీ
మేనేజర్లకు కాలం చెల్లిందా?
విజయానికి మంత్రం ఇదే..
ఎయిరిండియా సంచలన నిర్ణయం
ప్రపంచ వేదికపై భారతీయ కళా వైభవం
అందుకేనా.. బంగారం ఇంతలా పెరిగింది!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగు...
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు,...
అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి
ఆర్ధిక విషయాలకు సంబంధించిన విషయాలను, పెట్టుబడులకు ...
ఒక్కసారిగా మారిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
జీఎస్టీ వసూళ్ల రికార్డ్.. ఒక్క నెలలో రూ.2.43 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఏప్...
‘జాతీయత ఆధారంగా వివక్ష చూపకూడదు’
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ట్రంప్ అడ్మినిస్ట్...
వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి..
ఒకప్పుడు పట్టణ రవాణా వ్యవస్థను శాసించిన యాప్ ఆధారి...
ఎకానమీకి పశ్చిమాసియా సవాళ్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు భారత ఆర...
ఆటోమొబైల్
టెక్నాలజీ
అదుపుతప్పిన రోబో.. భయపడ్డ విద్యార్థులు (వీడియో)
చైనాలోని జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్లోని ఒక పాఠశాలలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక రోబో అదుపుతప్పి.. విద్యార్థులను భయబ్రాంతులకు గురించి చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విద్యార్థులను అలరించడానికి ఏర్పాటు చేసిన రోబో అకస్మాత్తుగా కిందపడిపోయింది. ఆ తరువాత అక్కడున్న ప్రదర్శనకారులపై కుంగ్-ఫూ కిక్లు విసరడం ప్రారంభించింది. దిక్కుతోచని విధంగా.. అడ్డదిడ్డంగా పరుగులు పెట్టింది. మైదానంలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు.పరిస్థితిని అర్థం చేసుకుని, దానిని కంట్రోల్ చేసే వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రోబోట్ను పట్టుకున్నాడు. ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే మైదానంలోని విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.ఇదే మొదటిసారి కాదురోబోలు తడబడటం ఇదే మొదటిసారి కాదు. 2026 మార్చి నెలలో.. చైనాలోని షాన్సీ ప్రావిన్స్లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన.. సిబ్బంది ఆ రోబోను పక్కకు లాగడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ.. అది రింగ్ మధ్యలో తన ప్రోగ్రామ్ ప్రదర్శించింది.Reported on Telegram 🤣The robot went berserk and almost attacked the dancers at a festival in China: the Unitree android malfunctioned severely and started swinging its "iron" in the style of Bruce LeeFortunately, it was quickly shut down — a full-blown "fight" didn't… pic.twitter.com/FH38FFrjZV— Beefeater (@Beefeater_Fella) May 3, 2026రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని 2025 నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.కంపెనీలకు సూచనలురోబర్స్ తయారీ లేదా వినియోగం అనేది మంచి చర్య. అయితే వాటికి భావాలు అర్థం చేసుకోవడం, ప్రవర్తించిన విధానం పూర్తిగా తెలిసి ఉండదు. ఇలాంటి సమయంలో రోబోల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి వస్తుంది. కాబట్టి సంస్థలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోబోట్స్ తయారు చేయాలి. అంతే కాకుండా..పూర్తిగా టెస్ట్ చేసిన తరువాత వినియోగానికి ఉపయోగించడం మంచిది. లేకుంటే.. ప్రజలకు ఇబ్బంది, తద్వారా కంపెనీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సరైన ప్రశ్నలు అడగండి.. రాత్రికి రాత్రే యాప్ రెడీ
సాఫ్ట్వేర్ అభివృద్ధి అంటేనే ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, వేల గంటల శ్రమ, సంక్లిష్టమైన కోడింగ్తో కూడిన సుదీర్ఘ ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. సరైన ప్రశ్న అడగడం తెలిస్తే చాలు సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా అద్భుతాలు సృష్టించవచ్చని తాజాగా జరిగిన ఒక ఉదంతం నిరూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్వేర్ తయారీ రంగాన్ని ఎలా మారుస్తుందో చెప్పే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.రాత్రికి రాత్రే ఫంక్షనల్ యాప్ప్రముఖ వ్యవస్థాపకుడు సందీప్ మాల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అందులోని వివరాల ప్రకారం.. తన కుమారుడు అసలు ప్రోగ్రామింగ్ నేపథ్యమే లేని మార్కెటింగ్ గ్రాడ్యుయేట్ ‘క్లాడ్’ అనే ఏఐ సాధనాన్ని ఉపయోగించి కేవలం ఒక్క రాత్రిలో పూర్తి స్థాయి వెండర్ మేనేజ్మెంట్ యాప్ను రూపొందించాడని ఆయన వెల్లడించారు. ఈ యాప్లో కెపాసిటీ ట్రాకింగ్, క్వాలిటీ మానిటరింగ్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయని, ఒక ప్రొఫెషనల్ యాప్కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు.సాంప్రదాయకంగా సాఫ్ట్వేర్ తయారీలో ప్రోగ్రామింగ్ భాషల వాక్యనిర్మాణం (సింట్యాక్స్) తెలుసుకోవడం అత్యంత కీలకం. అయితే, ఈ ఘటన తర్వాత జరుగుతున్న చర్చలో నెటిజన్లు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఏఐ యుగంలో కోడింగ్ నేర్చుకోవడం కంటే, సమస్యను ఎలా ఫ్రేమ్ చేయాలి? ఏ ప్రశ్న అడిగితే సరైన పరిష్కారం వస్తుంది? అనే జడ్జిమెంట్ (నిర్ణయాత్మక సామర్థ్యం)కు ప్రాధాన్యత పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలంటే టీమ్, భారీ పెట్టుబడి అవసరమయ్యేవి. ఇప్పుడు ఆ ప్రవేశ అడ్డంకులు కనుమరుగవుతున్నాయి.సవాళ్లు లేకపోలేదుఈ పరిణామాన్ని అందరూ ఆహ్వానిస్తున్నప్పటికీ వాస్తవిక దృక్పథాన్ని కోల్పోవద్దని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ప్రోటోటైప్ను తయారు చేయడం వేరు. దాన్ని యాప్ స్టోర్లోకి తీసుకురావడం, భద్రతా ప్రమాణాలను పాటించడం, దీర్ఘకాలంలో నిర్వహించడం వంటివి చాలా క్లిష్టమని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా, ఏఐ సృష్టించిన కోడ్లో వచ్చే బగ్లను గుర్తించి డీబగ్ చేయడం ఇప్పటికీ ఒక సవాలుతో కూడిన నైపుణ్యమేనని అభిప్రాయపడుతున్నారు.My younger one is a marketing grad. Zero coding knowledge. Sat through one night with Claude and built a complete vendor management app - capacity, quality, workload, the works.Old wisdom says: ask the right questions. Turns out, that’s all you need in the AI world too. 🙌— Sandeep Mall (@SandeepMall) May 4, 2026భవిష్యత్తు దిశగా..సాంకేతిక నైపుణ్యం కంటే ఆలోచన, దాన్ని అమలు చేసే స్పష్టతకు విలువ పెరుగుతోంది. సాఫ్ట్వేర్ తయారీ అనేది ఇప్పుడు కేవలం ఇంజినీర్లకే పరిమితం కాదు, సృజనాత్మకత ఉన్న ఎవరైనా సరే ఏఐతో తమ సొంత పరిష్కారాలను నిర్మించుకునే యుగం మొదలైంది.ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు
డిగ్రీ ఉంటే సరిపోదు.. స్కిల్ ఉంటేనే జాబ్
ముంబై: నేటి తరం విద్యార్థుల వేతన అంచనాలకు, మార్కెట్లోని వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. పట్టభద్రులవుతున్న విద్యార్థుల్లో దాదాపు 73 శాతం మంది రూ.5 లక్షలకు మించి వార్షిక వేతనాన్ని (ఎల్పీఐ) ఆశిస్తుండగా.. కేవలం 40 శాతం మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారని ‘అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026’ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 37 వేలకు పైగా విద్యార్థులు, 500 మందికి పైగా హెచ్ఆర్ ప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.డిగ్రీ ‘ప్రీమియం’ కనుమరుగు: ఒకప్పుడు పెద్ద కోర్సులు చదివిన వారికి మాత్రమే దక్కే ‘అదనపు వేతన ప్రాధాన్యం’ క్రమంగా తగ్గుతోంది. ఎంబీఏ పూర్తి చేసిన వారిలో 30 శాతం మంది రూ. 10 లక్షల కంటే తక్కువ వార్షిక వేతనం పొందుతుండగా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 39 శాతం మంది రూ. 7 లక్షల లోపు వేతనాలకే పరిమితమవుతున్నారు. దీనిని బట్టి వివిధ కోర్సుల మధ్య ఉన్న ‘వేతన అంతరం’ తగ్గుముఖం పడుతోందని స్పష్టమవుతోంది.విద్యార్థుల ఆలోచనా ధోరణిలో మార్పు: పెరుగుతున్న పోటీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సైతం వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మెరుగైన అభ్యాస అవకాశాలు, కెరీర్ వృద్ధి ఉంటే 90 శాతం మందికి పైగా విద్యార్థులు తక్కువ జీతానికైనా పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే 82 శాతం మంది విద్యార్థులు తక్షణ ఆర్థిక స్థిరత్వం కోసం అదనపు ప్రయోజనాల (పెర్క్స్) కంటే చేతికి వచ్చే జీతానికే (ఇన్–హ్యాండ్ శాలరీ) ప్రాధాన్యత ఇస్తున్నారు.నైపుణ్యమే అసలైన ‘గేట్కీపర్’: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నియామక ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు చూసి ఉద్యోగాలిచ్చిన కంపెనీలు, ఇప్పుడు అభ్యర్థుల్లోని నైపుణ్యాలు (స్కిల్స్), కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. సుమారు 64 శాతం మంది హెచ్ఆర్ ప్రతినిధులు ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలపై పట్టున్న వారినే ‘ప్రీమియం టాలెంట్’గా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాబ్లమ్ సాల్వింగ్ (49%), ఏఐ పరిజ్ఞానం (39%), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (30%) వంటి సామర్థ్యాలు ఉన్నవారికే అత్యధిక డిమాండ్ ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.ఎంపిక ప్రమాణాలు మారాయి: భారత ఉద్యోగ విపణిలో అవకాశాలు తగ్గలేదు, కానీ ఒక నిర్మాణాత్మక మార్పు జరుగుతోంది. నైపుణ్యం, ఏఐ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. బలమైన పునాదులతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు, ఏఐ ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులే ఈ పోటీలో నిలబడతారు’’ అని అన్స్టాప్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్ అగర్వాల్ విశ్లేషించారు.
ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆగమనంతో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో అనిశ్చితి నెలకొంది. సాంకేతికతను సాకుగా చూపి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ ధోరణికి చైనా న్యాయస్థానాలు గట్టి అడ్డుకట్ట వేశాయి. ఏఐ నేతృత్వంలోని ఉద్యోగ తొలగింపులు ఇకపై కష్టతరమని, ఆటోమేషన్ సాకుతో కార్మిక హక్కులను కాలరాయలేమని స్పష్టం చేస్తూ వెలువరించిన వరుస తీర్పులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.నిర్వహణ కార్మిక బాధ్యతడిసెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో హాంగ్జౌ, బీజింగ్ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏఐని కేవలం ఒక సాంకేతిక మార్పుగా మాత్రమే కాకుండా, కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఒక కీలక వ్యాపార అంశంగా పరిగణించాయి. చాలా సంస్థలు ఏఐని స్వీకరించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మార్పుగా పేర్కొంటూ ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ, ఈ న్యాయస్థానాలు ఆ వాదనను తోసిపుచ్చాయి. ఆటోమేషన్ అనేది కంపెనీ తీసుకునే ఒక స్వచ్ఛంద, ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తప్ప, అనివార్య పరిస్థితి కాదని కోర్టులు తేల్చిచెప్పాయి. దానివల్ల కలిగే నష్టభారాన్ని మొత్తం ఉద్యోగులపైనే వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశాయి.హాంగ్జౌ, బీజింగ్ తీర్పుల సారాంశంహాంగ్జౌ.. టెక్నాలజీ మెరుగుపడిందనే నెపంతో హ్యూమన్-ఏఐ ఇంటర్ఫేస్పై పనిచేసే ఒక ఉద్యోగికి 40% వేతన కోతతో తక్కువ హోదా కలిగిన పదవిని ఆఫర్ చేశారు. అతను నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని సవాలు చేసిన సదరు ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పాక్షికంగా ఆటోమేషన్ జరిగినంత మాత్రాన ఒక ఉద్యోగి పాత్ర పూర్తిగా అప్రస్తుతం కాదని కోర్టు స్పష్టం చేసింది.బీజింగ్ ‘లియు’ కేసు: మ్యాప్ డేటా సేకరణలో ఆటోమేషన్ రావడంతో లేఆఫ్కు గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనం కల్పించింది. కార్మిక రక్షణ చట్టాలను దాటవేసేందుకు ఆటోమేషన్ను ఆయుధంగా వాడుకోవద్దని కంపెనీలను హెచ్చరించింది.ఈ తీర్పుల ప్రకారం, ఒక ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించాలంటే ఆ పాత్ర పూర్తిగా అసాధ్యమని కంపెనీలు నిరూపించాలి. కేవలం ‘పని మరింత సమర్థవంతంగా జరుగుతుంది’ అనే కారణంతో ఉద్యోగులను తొలగించడం ఇక చెల్లదు. కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులకు రీస్కిల్లింగ్ ఇవ్వడం, ఉద్యోగితో చర్చలు జరపడం వంటి బాధ్యతలను నెరవేర్చాలి.మన చట్టాలు ఏమి చెబుతున్నాయి?ప్రస్తుతం భారతదేశంలో ఏఐపై నిర్దిష్ట కార్మిక చట్టాలు లేనప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపాయి. 2026లో మద్రాస్ హైకోర్టు ఏఐ ఆధారిత తొలగింపును పక్కన పెట్టింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్పై అతిగా ఆధారపడవద్దని సంస్థలను హెచ్చరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం (ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్) ప్రకారం ఆటోమేషన్ వల్ల జరిగే ఉద్యోగ నష్టాన్ని తొలగింపుగా పరిగణిస్తారు. దీనికి నోటీసులు, పరిహారం తప్పనిసరి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ఉద్యోగుల డేటా వినియోగంపై ఆంక్షలు విధించింది. అలాగే, చర్చల దశలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ) బిల్లు, 2025 మానవ పర్యవేక్షణ, అప్స్కిల్లింగ్ను తప్పనిసరి చేయనుంది.సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ న్యాయస్థానాలు న్యాయం, మానవీయ విలువలు, యజమాని బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ ఆఫీస్ వర్క్ను పునర్నిర్మించవచ్చు. కానీ ఆ మార్పులో ఉద్యోగుల హక్కులను కాలరాసే హక్కు కంపెనీలకు లేదు. చైనా తీర్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థలకు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మార్కెట్లో జూదం ఆడుతున్నారు!
పర్సనల్ ఫైనాన్స్
ఆదాయపన్నుకు డెడ్లైన్!
ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పన్ను వర్తించే ఆదాయం పరిధిలో ఉన్న వారందరూ తప్పనిసరిగా చేయాల్సిన పని. అది కూడా గడువులోపు దాఖలు చేయడం ఉత్తమం. పన్ను వర్తించేంత ఆదాయం లేకపోయినా సరే, కొన్ని లావాదేవీల్లో (టీడీఎస్ తదితర) భాగస్వాములై ఉన్నా కానీ రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతేకాదు పన్ను వర్తించే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మించుతుంటే ముందస్తు పన్ను చెల్లింపుల బాధ్యత కూడా ఉంటుంది. కనుక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆదాయపన్ను నిబంధనల పాటింపునకు సంబంధించి కీలక తేదీలను ఒక్కసారి తెలుసుకుందాం.మే 2026 మే 7: ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన టీడీఎస్/టీసీఎస్ డిపాజిట్ చేయాలి. మే 15: ఏప్రిల్ నెలకు సంబంధించి శాలరీ (ఫారమ్ 16), ఇతర పేమెంట్లకు (ఫారమ్ 16ఏ) టీడీఎస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. మే 30: జనవరి–మార్చి 2026 త్రైమాసికానికి సంబంధించి టీసీఎస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. మే 31: అధిక విలువ కలిగిన ఆర్థిక లావాదేవీల నివేదిక (ఫారమ్ 61ఏ), ఆస్తి లావాదేవీల నివేదిక (ఫారమ్ 61బీ) దాఖలు చేయడానికి చివరి తేదీ. స్వచ్ఛంద సంస్థలు తమ విరాళాల నివేదికను (ఫారమ్ 10బీడీ) దాఖలు చేయాలి.జూన్ 2026 జూన్ 7: మే 2026 నెలకు సంబంధించిన టీడీఎస్/టీసీఎస్ డిపాజిట్ చేయాలి. జూన్ 15: మొదటి విడత అడ్వాన్స్ టాక్స్ (సంవత్సరం మొత్తం పన్ను బాధ్యత అంచనాలో 15శాతం) చెల్లించడానికి చివరి తేదీ. జూన్ 30: మే నెలకు సంబంధించిన టీడీఎస్ చలాన్–స్టేట్మెంట్ దాఖలు చేయాలి. ఏఐఎఫ్లు క్రితం త్రైమాసిక నివేదికలను సమరి్పంచాలి.జూలై 2026 జూలై 31: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హెచ్యూఎఫ్లు తమ ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్–1 లేదా ఐటీఆర్–2) దాఖలు చేయడానికి చివరి తేదీ.ఆగస్టు 2026 ఆగస్టు 15: ఏప్రిల్–జూన్ (క్యూ1) త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ రిటర్నులు దాఖలు చేయాలి. ఆగస్టు 31: ఆడిట్ అవసరం లేని వ్యాపార నిపుణులు ఐటీఆర్–3 లేదా ఐటీఆర్–4 దాఖలు చేయడానికి పొడిగించిన గడువు.సెప్టెంబర్ 2026 సెప్టెంబర్ 15: రెండో విడత అడ్వాన్స్ టాక్స్ (మొత్తం 45శాతం) చెల్లించడానికి చివరి తేదీ. సెపె్టంబర్ 30: జూలై–సెప్టెంబర్ (క్యూ2) త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ రిటర్నులు దాఖలు చేయాలి.అక్టోబర్ 2026 అక్టోబర్ 31: ఆడిట్ అవసరమైన వ్యాపారస్తులు, నిపుణులు తమ ఐటీఆర్–3/ఐటీఆర్–4 రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ.నవంబర్ 2026 నవంబర్ 30: అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించిన వారు ’ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్’ (ఫారమ్ 3సీఈబీ) సమరి్పంచాలి.డిసెంబర్ 2026 డిసెంబర్ 15: మూడో విడత అడ్వాన్స్ టాక్స్ (మొత్తం 75శాతం) చెల్లించడానికి చివరి తేదీ. డిసెంబర్ 31: ఆలస్యంగా దాఖలు చేసే రిటర్నులకు పెనాలీ్టతో దాఖలు చేయడానికి చివరి అవకాశం.జనవరి 2027 జనవరి 31: ఉద్యోగులు తమ పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడుల వివరాలను యజమాన్యానికి సమర్పించాలి.ఫిబ్రవరి 2027ఫిబ్రవరి 15: జనవరి నెలకు సంబంధించిన పీఎఫ్, ఈఎస్ఐ జమ చేసేందుకు గడువు.మార్చి 2027మార్చి 15: చివరి విడత అడ్వాన్స్ టాక్స్ (100 శాతం) చెల్లించడానికి గడువు. మార్చి 31: పన్ను ఆదా కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు, సవరణ రిటర్నలు, ఆలస్యపు రిటర్నుల దాఖలుకు చివరి తేదీ.
ఒక్క EMI ఎగ్గొట్టినా కష్టమే.. RBI కొత్త రూల్స్ ఎఫెక్ట్!
బ్యాంకింగ్లో రుణాల స్వరూపం తీరుతెన్నులను సమూలంగా మార్చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. సమస్య వచ్చాకా పరిష్కారం వెతుక్కోవడం కన్నా అసలు సమస్యే రాకుండా బ్యాంకులు ముందు జాగ్రత్త తీసుకునేలా ఈసీఎల్ .. అంటే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ విధానాన్ని ప్రతిపాదించింది. సరళంగా చెప్పాలంటే ఇచ్చిన రుణంపై నష్టం వచ్చే రిసు్కలను బ్యాంకులు ముందుగానే అంచనా వేసుకోగలగాలి. దానికి తగ్గట్లుగా ఆ మేరకు నిధులను పక్కన పెట్టుకోవాలి.వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ రూల్స్తో రుణాల తీరుతెన్నులు మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. సరే అదేదో బ్యాంకులకు సంబంధించిన వ్యవహారం కదా మనకేంటి అనుకుంటే పొరపాటే. దీని వల్ల రుణాలు తీసుకున్న, తీసుకోబోతున్న వారందరిపైనా ప్రభావం పడబోతోంది. ఇంతకీ, అసలు ఈ రూలేంటి.. దాని ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయనేది వివరించేదే ఈ కథనం..దశాబ్దాలుగా బ్యాంకులు తమకు ‘వాటిల్లిన నష్టం’ ప్రాతిపదికన మొండిబాకీలకు కేటాయింపులు చేసే విధానాన్ని పాటిస్తూ వస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే రుణ గ్రహీత తాను తీసుకున్న లోన్ని కొన్నాళ్ల పాటు చెల్లించక, అది బాకీగా మారితే గానీ దాన్ని మొండిపద్దు కింద వర్గీకరించడం లేదు. దాన్ని నష్టంగా పరిగణించి నిధులను పక్కన పెట్టడం లేదు. అంటే రుణ గ్రహీత విషయంలో కాస్త ఉదారంగా ఉంటున్నట్లే. ఎందుకంటే ఒకసారి మొండిపద్దుగా వర్గీకరిస్తే దాని వసూలుకు తీసుకునే చర్యలు వేరేగా ఉంటాయి. క్రెడిట్ ప్రొఫైల్పై ప్రభావమూ వేరేగా ఉంటుంది.ఒకరకంగా ముందుగానే సదరు రుణం మొండిబాకీగా మారే అవకాశాలను అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవడం కన్నా, పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కొత్తగా వచ్చే ఈసీఎల్ నిబంధనలతో ఈ వేచి చూసే ధోరణికి కాలం చెల్లిపోతుంది. బ్యాంకులు ఇకపై రాబోయే రోజుల్లో రుణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకోవాల్సి రానుంది. తలెత్తబోయే రిసు్కలను ఊహించుకుని, ముందుగానే ప్రొవిజనింగ్తో సిద్ధంగా ఉండాలి. ఎప్పుడో తీరిగ్గా స్పందించడం కాకుండా, సింగిల్ పేమెంట్ మిస్ అయినా, వెంటనే స్పందించి, క్రియాశీలకంగా చర్యలు తీసుకోవాలి.మరి దీని ప్రభావం ఏంటి.. ఇలా ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసేయడమనేది మీ నెలవారీ ఖర్చులపైనా ప్రభావం చూపనుంది. రాబోయే నష్టాల రిసు్కలను అంచనా వేసి, వాటికి అనుగుణంగా బ్యాంకులు కొంత మొత్తాన్ని పక్కన పెట్టాల్సి రావడం వల్ల, వాటికి వ్యాపారం ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. దీనితో మార్జిన్లను కాపాడుకునేందుకు అవి వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచాల్సి రావొచ్చు. ఫలితంగా మీరు కారు రుణం తీసుకోవాలన్నా.. పర్సనల్ లోన్లాంటివి తీసుకోవాలనుకున్నా వడ్డీ రేటు మరికాస్త పెరిగిపోవచ్చు.కొత్త ప్రమాణాలు..క్రెడిట్ స్కోరును పెద్దగా పట్టించుకోనివారికి ఈ కొత్త నిబంధనలు మేల్కొలుపులాంటివి. రుణం దొరకడమనేది కఠినతరమైన వ్యవహారంగా మారుతుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి క్రెడిట్ అలవాట్లను ట్రాక్ చేసేందుకు బ్యాంకులు మూడంచెల పర్యవేక్షణ విధానానికి మారతాయి. మొదటి అంచెలో, ఆరోగ్యకరమైన అకౌంట్లు ఉంటాయి. రెండో అంచెలో అప్పుడప్పుడే కాస్త స్ట్రెస్ మొదలవుతున్న దాఖలాలు కనిపించే ఖాతాలు ఉంటాయి. ఇక మూడో అంచెలో డిఫాల్ట్ అయిన ఖాతాలు ఉంటాయి. ఉదాహరణకు, మీరో రుణం తీసుకున్నారు. ఏదో కారణం వల్ల ఈఎంఐలను కట్టడంలో జాప్యం చేశారు.ప్రస్తుతమైతే బ్యాంకులు కాస్త చూసీ చూడనట్లుగా పెనాలీ్టల్లాంటివి వేసి వదిలేస్తున్నాయే గానీ ఇకపై ఇలా జరిగితే మీరు వెంటనే హై రిస్క్ కేటగిరీలోకి వెళ్లిపోతారు. ఇచ్చిన రుణం రెండో గ్రేడ్లోకి జారిన పక్షంలో తమకి జరిమానా పడే అవకాశం ఉన్నందున, బ్యాంకులు ముందునుంచే చాలా జాగ్రత్త వహిస్తాయి. తీసుకున్నవారు రెగ్యులర్గా చెల్లించకపోతున్నా, క్రెడిట్ స్కోరు పడిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నా మరింత వేగంగా స్పందిస్తాయి. మీ మీద నిఘా మరింత పెంచేస్తాయి. అంటే రాబోయే రోజుల్లో రుణగ్రహీతలు ఏవో కొన్ని ఈఎంఐలు కట్టకపోతే మహా అయితే లేట్ ఫీజు పడుతుంది అంతేగా అనుకుని లైట్గా తీసుకునే పరిస్థితి ఉండదు. అసలుకే ఎసరొస్తుంది. ఖాతాలపై మానిటరింగ్ పెరగడమే కాకుండా భవిష్యత్తులో మీరు రుణం తీసుకుందామనుకున్నా అంత తేలిగ్గా దొరక్కపోవచ్చు. వ్యవస్థకు మేలే..వ్యక్తిగత స్థాయిలో రుణాలు తీసుకున్నవారికి ఈ నిబంధనలు కఠినతరంగా అనిపించినప్పటికీ ఒక క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా విస్తృత స్థాయిలో ఆర్థిక వ్యవస్థకు మేలే జరుగుతుంది. రాబోయే తలనొప్పులను ముందుగానే గుర్తించేలా బ్యాంకులపై ఒత్తిడి పెంచడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం పటిష్టంగా అయ్యేలా ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీ బ్యాంకింగ్ సంక్షోభాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆర్థికంగా మందగమనాల్లాంటివేవైనా తలెత్తినా బ్యాంకులు ‘ఆరోగ్యకరంగా’నే ఉంటాయి. ఇక రుణాలు తీసుకున్న వారి విషయానికొస్తే.. క్రెడిట్ డిసిప్లిన్ అనేది సూపర్పవర్లాంటిది గుర్తెరిగి వ్యవహరించడం వల్ల రుణ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.‘ఆరోగ్యకరంగా’నే ఉంటాయి. ఇక రుణాలు తీసుకున్న వారి విషయానికొస్తే.. క్రెడిట్ డిసిప్లిన్ అనేది సూపర్పవర్లాంటిది గుర్తెరిగి వ్యవహరించడం వల్ల రుణ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.అంశంప్రభావంరుణ లభ్యతకాస్త కఠినతరంవడ్డీ రేట్లుస్వల్పంగా పెరగొచ్చుక్రెడిట్ డిసిప్లిన్ఇకపై మరింత కీలకంబ్యాంకింగ్మరింత పటిష్టంఏం చేయాలంటే.. ఈఎంఐలు సకాలంలో చెల్లించేయాలి. క్రెడిట్ స్కోరు బాగుండేలా చూసుకోవాలి అతిగా రుణాలు తీసుకోవడం మానేయాలి
కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లు: స్థిరమైన ఆదాయం, పిల్లల భవిష్యత్తు
న్యూఢిల్లీ: అవీవా ఇండియా ‘అవీవా సెక్యూర్ నెస్ట్ యాన్యూటీ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. సింగిల్ ప్రీమియంతో స్థిరమైన ఆదాయాన్ని పొందే పరిష్కారమే ఈ ప్లాన్ అని సంస్థ ప్రకటించింది. 80 ఏళ్ల వయసు వరకు ఈ ప్లాన్లోకి ప్రవేశించొచ్చు. ఈ ప్లాన్ కింద ఒకరికి లేదంటే ఉమ్మడిగా కవరేజీని కూడా పొందొచ్చు.మరణానంతరం నామినీలకు కొనుగోలు ధరను చెల్లించే సదుపాయం కూడా ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాన్ పనిచేస్తుందని అవీవా ఇండియా తెలిపింది. జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్ ద్వారా భరోసా ఇస్తున్నట్టు అవీవా ఇండియా ఎండీ, సీఈవో అసిత్ రథ్ తెలిపారు. బజాజ్ లైఫ్ ‘యంగ్ అచీవర్ ప్లాన్’ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదువుకునే పిల్లల పేరిట సంపద సృష్టితోపాటు, వారి భవిష్యత్ లక్ష్యాలకు కవరేజీతో కూడిన ‘బజాజ్ లైఫ్ యంగ్ అచీవర్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల కోసం కావాల్సినంత నిధిని (హామీతో కూడిన) సమకూర్చుకోవచ్చు. తల్లి/తండ్రి మరణిస్తే లేదా వైకల్యం పాలు కావడం లేదంటే ఎంపిక చేసిన 25 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్నెస్) ఏదేనీ బారిన పడితే, ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు.పాలసీ యథావిధిగా కొనసాగుతుంది. ఒకే విడత చెల్లింపులు లేదా పిల్లల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్రమానుగతంగా ఆదాయం అందుకునే ఆప్షన్లలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. 5–12 ఏళ్ల మధ్య ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులకు, చివర్లో అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలున్నాయి.
బయోమెట్రిక్తో యూపీఐ, కార్డు చెల్లింపులు
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఐమొబైల్ యాప్లో యూపీఐ లావాదేవీల నిర్వహణ కోసం బయోమెట్రిక్ ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్ప్రింట్ ధృవీకరణ ద్వారా రూ. 5,000 వరకు లావాదేవీలను చేయొచ్చని సంస్థ తెలిపింది. ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా యూపీఐ పిన్ నంబరును ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, ఫిన్టెక్ ప్లాట్ఫాం పేయూతో కలిసి కార్డు చెల్లింపులకు బయోమెట్రిక్ ధృవీకరణను అందుబాటులోకి తెచ్చినట్లు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తెలిపింది. దీనితో ఇకపైయాక్సిస్ బ్యాంక్ కార్డ్హోల్డర్లు ఫేస్ ఐడీ లేదా వేలిముద్ర ద్వారా చెల్లింపులను ఆమోదించవచ్చని పేర్కొంది.


