Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Post Office Schemes Offer High Returns latest Interest Rates1
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు

సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్‌తో కూడిన స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్‌ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.మంత్లీ ఇన్‌కమ్‌మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లుబ్యాంకు ఎఫ్‌డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..కాలపరిమితివడ్డీ రేటు (%)ఏడాది టైమ్ డిపాజిట్6.9రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.55 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి.

Stock Market Closing Update 9th April 20262
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 931.25 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టంతో 76,631.65 వద్ద, నిఫ్టీ 222.25 పాయింట్లు లేదా 0.93 శాతం నష్టంతో 23,775.10 వద్ద నిలిచాయి.ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, ప్రీతి ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అక్షర్ స్పిన్‌టెక్స్ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, వర్వీ గ్లోబల్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, రుషిల్ డెకార్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

2026 Volkswagen Taigun Unveiled With New Design3
కొత్త లుక్‌లో టైగన్ ఫేస్‌లిఫ్ట్‌: డిజైన్, ఫీచర్స్ ఇలా..

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ భారత మార్కెట్లో ఎట్టకేలకు టైగన్ ఫేస్‌లిఫ్ట్‌ ఆవిష్కరించింది. ఇది అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటేస్ట్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2021లో దేశీయ విఫణిలో లాంచ్ అయిన టైగన్.. దాదాపు ఐదేళ్లకు ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో అడుగుపెట్టింది. ఈ ఎస్‌యూవీలోని కొత్త హెడ్‌లైట్స్.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో అనుసంధానం అయింది. గ్రిల్ డిజైన్ కూడా అప్‌డేట్ అయింది. వెనుక భాగంలో టెయిల్‌లైట్లు, నలుపు రంగులో ఉన్న టైగన్ లోగో పొందుతుంది. అల్లాయ్ వీల్స్‌కు కూడా ఒక కొత్త డిజైన్ ఉంది.కొత్త టైగన్ అవకాడో పెర్ల్, స్టీల్ గ్రే రంగులలో లభిస్తుంది. దీంతో మొత్తం 9 రంగుల ఎంపికలు అందుబాటులోకి వచ్చింది. ఇది 10.09-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది. ఇది 15 విభిన్న అప్లికేషన్‌లను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో కొత్త 9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ కూడా ఉంది, ఇది మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను కూడా అందిస్తుంది.వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ 'హలో వోక్స్‌వ్యాగన్' వాయిస్ అసిస్ట్‌ను కూడా పొందుతుంది, ఇది ఏసీ కంట్రోల్స్, మ్యూజిక్ మరియు మరిన్ని ప్రాథమిక ఫంక్షన్‌లను నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ-కొలిజన్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాగా ఈ ఎస్‌యూవీ ధరలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!పనితీరు పరంగా చూస్తే.. కొత్త వోక్స్‌వ్యాగన్ టైగన్ 114 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ లభిస్తుంది. మునుపటి 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్‌ను చేర్చారు. 147 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఈ తాజా మోడల్‌లో అందుబాటులో ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల మధ్య ఎంపికలను అందిస్తుంది.

Hyundai Creta Summer Edition Launched4
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ వచ్చేసింది..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీ క్రెటాలో 'సమ్మర్ ఎడిషన్' (Creta Summer Edition)ను లాంచ్ చేసింది. వేసవి కాలానికి సరికొత్త హంగులతో వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధరను కంపెనీ రూ. 12.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.వేరియంట్లు, ధరల వివరాలుఈ సమ్మర్ ఎడిషన్ ప్రధానంగా ఎంట్రీ లెవల్ EX ట్రిమ్ నుండి టాప్-ఎండ్ SX ట్రిమ్ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ధర రూ. 12.06 లక్షలు (EX వేరియంట్) కాగా టాప్-ఎండ్ ధర రూ. 17.89 లక్షలు (SX ట్రిమ్). ఇవే కాకుండా S(O), S(O) నైట్ (Knight) ట్రిమ్‌లలో కూడా ఈ సమ్మర్ ఎడిషన్ లభిస్తుంది.కొత్తగా చేరిన ఫీచర్లు ఇవే!డిజైన్ పరంగా ప్రామాణిక మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకోవడానికి హ్యుందాయ్ ఇందులో పలు అదనపు ఫీచర్లను జోడించింది.EX (O) వేరియంట్: ఇందులో 16-అంగుళాల డ్యూయల్-టోన్ స్టీల్ వీల్స్, స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్, క్వాడ్ బీమ్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, పొజిషనింగ్ ల్యాంప్‌లు ఉన్నాయి. అదనంగా రియర్ విండో సన్‌షేడ్, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ కెమెరా సౌకర్యం ఉంది.S(O) & S(O) నైట్ ఎడిషన్: ఈ వేరియంట్లలో భద్రత కోసం డాష్ క్యామ్ (Dashcam)ను ప్రత్యేకంగా అందించారు. అలాగే 10.25 అంగుళాల మల్టీ-డిస్‌ప్లే డిజిటల్ క్లస్టర్ కూడా ఆకర్షణగా నిలుస్తుంది.SX ప్రీమియం: టాప్ వేరియంట్‌లో సరౌండ్ వ్యూ మానిటర్ (SVM), బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ (BVM), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.ఇంజిన్, పెర్ఫార్మెన్స్హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి 1.5-లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. అయితే, ఈ స్పెషల్ ఎడిషన్‌లో టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కంపెనీ అందించడం లేదు. ట్రాన్స్‌మిషన్ పరంగా చూస్తే, కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా MT (మాన్యువల్), iVT, AT (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ ఎంపికలను ఎంచుకోవచ్చు.

Natural vs LabGrown Diamonds Market Trends Consumer Choices Future Outlook5
వజ్రాల మెరుపు వెనుక అసలు కథ

వజ్రాల వ్యాపారులు, వినియోగదారులు నిన్న(ఏప్రిల్ 8, 2026) తొలి ‘ప్రపంచ వజ్రాల దినోత్సవం’ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నేచురల్ డైమండ్ కౌన్సిల్ (ఎన్‌డీసీ) పిలుపు మేరకు జరిగిన ఈ వేడుకల్లో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో సహజ వజ్రాలకు ధీటుగా ‘ల్యాబ్‌గ్రోన్‌ డైమండ్లు’ విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? వీటి భవిష్యత్తు వినియోగం ఎలా ఉండబోతోంది? అనే అంశాలను విశ్లేషిద్దాం.సహజ వజ్రం.. ల్యాబ్‌గ్రోన్‌ డైమండ్ మధ్య తేడా..చాలామంది ల్యాబ్‌గ్రోన్ డైమండ్లను నకిలీ వజ్రాలు అనుకుంటారు, కానీ అది తప్పు. ఇవి భౌతికంగా, రసాయనికంగా, ఆప్టికల్‌గా దాదాపు సహజ వజ్రాల మన్నికనే పోలి ఉంటాయి. సహజ వజ్రాలు భూమి అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రత, పీడనం వల్ల ఏర్పడతాయి. ల్యాబ్‌గ్రోన్ డైమండ్లు ప్రయోగశాలల్లో కేవలం కొన్ని వారాల్లోనే తయారవుతాయి. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్‌గ్రోన్ వజ్రాలు 60% నుంచి 80% వరకు తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని భూమిని తవ్వి ప్రాసెసింగ్‌ చేయాల్సిన అవసరం లేనందున ‘ఎకో-ఫ్రెండ్లీ’ డైమండ్లుగా పిలుస్తారు.కృత్రిమంగా ఎలా తయారు చేస్తారు?ల్యాబ్‌లో వజ్రాలను సృష్టించడానికి ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి.హెచ్‌పీహెచ్‌టీ(హై ప్రెషర్‌ హై టెంపరేచర్‌): భూమి పొరల్లో ఉండే సహజ వాతావరణాన్ని (అధిక పీడనం, ఉష్ణోగ్రత) యంత్రాల ద్వారా సృష్టించి కార్బనైజేషన్‌ ద్వారా వజ్రాన్ని అభివృద్ధి చేస్తారు.సీవీడీ (కెమికల్‌ వేపర్‌ డెపొజిషన్‌): ఒక ఛాంబర్‌లో కార్బన్ వాయువులను నింపి ప్లాస్మా సాంకేతికతతో కార్బన్ పరమాణువులను పొరలు పొరలుగా పేరుకుపోయేలా చేస్తారు. ప్రస్తుతం అత్యుత్తమ నాణ్యత గల వజ్రాల కోసం భారత్‌లో ఈ పద్ధతినే ఎక్కువగా వాడుతున్నారు.వినియోగదారులు తేడాను ఎలా గుర్తించాలి?సాధారణంగా సహజ వజ్రానికి, ల్యాబ్‌గ్రోన్ వజ్రానికి మధ్య తేడాను కనిపెట్టడం అసాధ్యం. అనుభవజ్ఞులైన వ్యాపారులు కూడా వీటిని కొన్నిసార్లు గుర్తుపట్టలేరు. కాబట్టి వినియోగదారులు వజ్రాలు కొనేముందు కొన్ని అంశాలు గమనించాలి. వజ్రాభరణాలు కొనేటప్పుడు జీఐఏ(జెమొలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికా) లేదా ఐజీఐ వంటి సంస్థల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అడగాలి. అందులో అది ‘నేచురల్‌’ లేదా ‘లేబొరేటరీ గ్రోన్‌’ అని స్పష్టంగా ఉంటుంది. ల్యాబ్ వజ్రాల గర్డిల్ (అంచు)పై మైక్రోస్కోపిక్ లేజర్ మార్కింగ్ ఉంటుంది.ఈ విభాగంలో ఉపాధి అవకాశాలువజ్రాల తయారీ రంగంలో భారత్‌లోని సూరత్ గ్లోబల్ హబ్‌గా మారింది. దాంతో స్థానికంగా సీవీడీ మిషన్ల నిర్వహణకు ఇంజినీర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల అవసరం పెరుగుతోంది. వజ్రాలను సానబెట్టే (పాలిషింగ్‌) నైపుణ్యం ఉన్నవారికి దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. తక్కువ ధర వల్ల మధ్యతరగతి ప్రజలు కూడా వజ్రాల వైపు మొగ్గు చూపుతుండటంతో సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో వేలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి.భవిష్యత్తు ఎటువైపు?సహజ వజ్రాలు పెట్టుబడిగా, వారసత్వ సంపదగా వాటి విలువను కాపాడుకుంటున్నాయి. కొన్ని పెళ్లిళ్లు, భావోద్వేగ సందర్భాల కోసం వీటిని వాడుతున్నారు. ల్యాబ్‌గ్రోన్ డైమండ్లు ఫ్యాషన్ జ్యువెలరీ, రోజువారీ వాడకానికి ఇవి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. వీటి పర్యావరణ హితం, తక్కువ ధర కారణంగా యువత, జెన్‌జీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్‌ఎన్‌జీ?

Anant Ambani Birthday Celebrations 3000 Kg Fruit Buffet for Elephants6
అనంత్ అంబానీ బర్త్‌డే స్పెషల్‌.. గజరాజులకు విందు..

వన్యప్రాణుల పట్ల తనకున్న అమితమైన ప్రేమను అనంత్ అంబానీ మరోసారి చాటుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు రాజస్థాన్ రాజధాని జైపూర్ శివార్లలోని హాథీ గావ్‌లో జరిగాయి. మూగజీవాల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా స్థానిక ‘హాథీ గావ్ వికాస్ సమితి’ ఈ వినూత్న వేడుకను నిర్వహించింది.ఈ వేడుకలో ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన భారీ ‘ఫ్రూట్ బఫే’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 3,000 కిలోల బరువున్న వివిధ రకాల పండ్లను ఏనుగులకు విందుగా వడ్డించారు. ఈ బఫేలో అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయ, బొప్పాయి, నారింజ వంటి కాలానుగుణ ఫలాలతో పాటు ఏనుగులకు ఇష్టమైన చెరకు, బెల్లం, పచ్చి పశుగ్రాసాన్ని భారీగా సిద్ధం చేశారు. రాజస్థానీ సాంప్రదాయ శైలిలో అలంకరించిన గజరాజులు ఈ విందును ఆస్వాదించాయి.మావత్ కుటుంబాలకు అండగా..వన్యప్రాణుల సంరక్షణలో కీలక పాత్ర పోషించే మావత్ (ఏనుగుల సంరక్షకులు)లను ఈ సందర్భంగా సమితి గౌరవించింది. ఏనుగుల సంక్షేమం కోసం శ్రమించే వారికి నిత్యావసర వస్తువులతో కూడిన రేషన్ కిట్లు, దుస్తులు, టోపీలు, పాదరక్షలు, రోజువారీ వినియోగ వస్తువులను పంపిణీ చేశారు.అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి వన్యప్రాణి పునరావాస కేంద్రం వంతారాను స్థాపించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో వేధింపులకు గురైన, అనారోగ్యంతో ఉన్న సుమారు 200 జాతులకు చెందిన జంతువులకు వంతారాలో ఆశ్రయం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లోని ఏనుగుల సంరక్షణకు ఆయన అందిస్తున్న ఆర్థిక సాయం పట్ల స్ఫూర్తి పొంది ఈ వేడుకను నిర్వహించినట్లు హాథీ గావ్ వికాస్ సమితి అధ్యక్షుడు షఫీక్ బల్లు ఖాన్ తెలిపారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్‌ఎన్‌జీ?

Advertisement
Advertisement
Advertisement