Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

gold and silver rates on 16th december 2025 in Telugu states1
బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on December 16th 20252
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:12 సమయానికి నిఫ్టీ(Nifty) 138 పాయింట్లు తగ్గి 25,890కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 464 పాయింట్లు నష్టపోయి 84,748 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 16-12-2025(time: 10:12 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

India approved 100 Percent FDI in insurance sector3
బీమాలో 100 శాతం విదేశీ పెట్టుబడులు

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు) వాటాను 100 శాతానికి పెంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనుంది. 2047కల్లా అందరికీ బీమా సౌకర్యాన్ని కల్పించే యోచనతో ఈ వారంలో బిల్లును ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. సబ్‌కి బీమా సబ్‌కి రక్ష(బీమా చట్టాల సవరణ) చట్టం 2025 పేరుతో 1938 బీమా చట్టంలో సవరణలకు బిల్లును ప్రవేశపెట్టనుంది.జీవిత బీమా కార్పొరేషన్‌ చట్టం 1956, బీమా నియంత్రణ, అభివృద్ది అథారిటీ చట్టం 1999లో సవరణలకు బిల్లు వీలు కలి్పంచనుంది. తాజా సవరణల ద్వారా బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రస్తుత 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నట్లు బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. అయితే చైర్మన్, ఎండీ లేదా సీఈవో పదవికి తప్పనిసరిగా భారత పౌరుడిని నియమించుకోవలసి ఉంటుంది.ఇదీ చదవండి: ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టాలంటే!

India exports to US up 22 .6 pc to USD 7 billion in November4
ఎగుమతుల జోరు

న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నవంబర్‌లో బలమైన పనితీరు చూపించింది. అమెరికా టారిఫ్‌ల నడుమ సానుకూల వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్‌లో 38.13 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరిగాయి. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్, కెమికల్స్, రత్నాభరణాలు వృద్ధికి తోడ్పడ్డాయి. దిగుమతులు 1.88 శాతం తగ్గి 62.66 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ప్రధానంగా బంగారం, ముడిచమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. దీంతో వాణిజ్య లోటు 24.53 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. అక్టోబర్‌ నెలకు వాణిజ్య లోటు 41.68 బిలియన్‌ డాలర్లతో పోల్చి చూసినా నవంబర్‌లో గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.62 శాతం పెరిగి 292.07 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం ఇదే కాలంలో 5.59 శాతం అధికమై 515.21 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 223.14 బిలియన్‌ డాలర్లుగా ఉంది. → నవంబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 11.65 శాతం పెరిగి 3.93 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. → టీ, కాఫీ, ఐరన్‌ ఓర్, జీడిపప్పు, డెయిరీ, హస్తకళాకృతులు, సముద్ర ఉత్పత్తులు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు సైతం సానుకూలంగా నమోదయ్యాయి. → బియ్యం, నూనె గింజలు, కార్పెట్, ప్లాస్టిక్స్‌ ఎగుమతులు క్షీణించాయి. → సేవల ఎగుమతులు నవంబర్‌లో 35.86 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2024 నవంబర్‌లో వీటి ఎగుమతులు 32.11 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు సేవల ఎగుమతులు 270 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 248.56 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఎగుమతులకు ప్రోత్సాహకం.. రూ. 25,060 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌కు సంబంధించి సవివర మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నట్టు వాణిజ్య శాఖ సెక్రటరీ రాజేష్‌ అగర్వాల్‌ తెలిపారు. కొన్నింటిని ఈ వారంలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. అమెరికా 50 శాతం టారిఫ్‌ల కారణంగా ఏర్పడిన ప్రభావం నుంచి ఎగుమతిదారులకు కొంత మేరకు ఉపశమనం లభిస్తుందన్నారు. అమెరికా టారిఫ్‌లు విధించినప్పటికీ.. 2025 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు భారత ఎగుమతులకు యూఎస్‌ ప్రధాన కేంద్రంగా ఉన్నట్టు ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌’ (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రల్హాన్‌ తెలిపారు.యూఎస్‌కు 22 శాతం అధికంనవంబర్‌లో అమెరికాకు ఎగుమతులు బలపడ్డాయి. వరుసగా రెండు నెలల పాటు (సెప్టెంబర్, అక్టోబర్‌) క్షీణత తర్వాత.. నవంబర్‌లో 22.61 శాతం మేర అధికంగా 6.98 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు యూస్‌ మార్కెట్‌కు వెళ్లాయి. భారత్‌పై 50 శాతం టారిఫ్‌లను ఆగస్ట్‌ నుంచి యూఎస్‌ అమలు చేస్తుండడం తెలిసిందే. అమెరికా నుంచి నవంబర్‌లో భారత్‌కు దిగుమతులు 38 శాతం పెరిగి 5.25 బిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు అమెరికాకు ఎగుమతులు 11.38 శాతం పెరిగి 59 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు 13.49 శాతం పెరిగి 35.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

Warren Buffett Rules To Become Successful Investor5
బఫెట్ సూత్రాలు: స్టాక్ మార్కెట్లో విజయం!

వారెన్ బఫెట్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే.. బెర్క్‌షైర్ హాత్వే చైర్‌పర్సన్ & దిగ్గజ పెట్టుబడిదారుడుగా ప్రపంచంలోని లక్షలాదిమంది ప్రజలకు సుపరిచయమే. ఈయన స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి సులభమైన నియమాలను వెల్లడించారు. విజయవంతమైన పెట్టుబడికి.. మార్కెట్ అంచనాలతో సంబంధం లేదని, క్రమశిక్షణ, స్వీయ అవగాహన, మీ ఆలోచనలతో ఎక్కువ సంబంధం ఉందని పేర్కొన్నారు.వారెన్ బఫెట్ ప్రకారం.. పెట్టుబడి విషయంలో వాస్తవికంగా ఉండటం గురించి చెబుతారు. మీరు అర్థం చేసుకున్నది తెలుసుకోవడమే కాకుండా, మీకు తెలియనిది తెలుసుకోవడం.. దానికి ప్రలోభపడకుండా ఉండటం ముఖ్యమని, ఇది స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి దోహదపడుతుందని అంటారు.తత్వశాస్త్రం గురించి మాట్లాడుతూ.. అదుపులేని దురాశ, దీర్ఘకాలిక రాబడికి అతిపెద్ద శత్రువులలో ఒకటి బఫెట్ హెచ్చరించారు. మీరు చాలా దురాశపరులైతే, అది విపత్తు అవుతుందని ఆయన అంటారు.పెట్టుబడి అంటే అది క్లిష్టమైన ప్రక్రియ కాదంటారు బఫెట్. అయితే దీనికి ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం అని స్పష్టం చేశారు.బఫెట్ తన పెట్టుబడి తత్వశాస్త్రంలో ఎక్కువ భాగాన్ని బెంజమిన్ గ్రాహం బోధనలకు ఆపాదించారు. దశాబ్దాల మార్కెట్ పరిణామం తర్వాత కూడా అతని ఆలోచనలు సాటిలేనివిగా ఉన్నాయని అతను నమ్ముతారు. ఈ ప్రాథమిక విధానం ప్రకారం.. మీరు స్టాక్‌లను వ్యాపారాలుగా భావించి, ఆపై మంచి వ్యాపారాన్ని ఏది చేస్తుందో అంచనా వేయాలని ఆయన అన్నారు. ఈ పద్దతిలో ప్రధానమైనది భద్రతా మార్జిన్ అని బఫెట్ అన్నారు.

Axis Gold and Silver Passive FOF Fund6
బంగారం, వెండిపై ఆసక్తి: ఇదిగో కొత్త మ్యూచువల్‌ ఫండ్‌

బంగారం, వెండిపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా.. యాక్సిస్‌ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ ప్యాసివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ను తీసుకొచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ న్యూ ఆఫర్‌. ఈ నెల 10న మొదలు కాగా, 22వ తేదీన ముగియనుంది.ఈ ఒక్క పథకం ద్వారా ఇన్వెస్టర్లు బంగారం, వెండి ధరల ర్యాలీలో భాగం కావొచ్చని సంస్థ ప్రకటించింది. ఈ పథకం గోల్డ్‌ ఈటీఎఫ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లల్లో 50:50 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ‘‘చారిత్రకంగా చూస్తే బంగారం, వెండి ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతలకు చక్కని హెడ్జింగ్‌ సాధనంగా పనిచేశాయి. అదే సమయంలో పెట్టుబడుల్లో వైవిధ్యం ప్రయోజనాలను సైతం పోర్ట్‌ఫోలియోకి అందిస్తాయి’’అని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో బి.గోపకుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement