Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Hyundai Creta Crosses 2 Lakh Annual Sales1
రెండు లక్షలమంది కొన్న కారు ఇది

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. 2025వ సంవత్సరాన్ని సరికొత్త రికార్డుతో ముగించింది. కంపెనీకి చెందిన క్రెటా 2,00,000 యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. భారతదేశంలో దాని విభాగంలో.. అత్యంత పోటీ ఉన్నప్పటికీ మంచి అమ్మకాలను సాధించగలిగింది.2025లో హ్యుందాయ్ రోజుకు 550 క్రెటా కార్లను విక్రయించింది. అంటే.. మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద హ్యుందాయ్ క్రెటా గత ఐదు సంవత్సరాలుగా (2020–2025) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది. మిడ్-సైజ్ SUV విభాగంలో 34 శాతానికి పైగా కమాండింగ్ మార్కెట్ వాటాతో, దాని పోటీదారుల కంటే అమ్మకాల్లో చాలా ముందుంది.క్రెటా రెండు లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను పొందిన సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ డిజిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా ప్రయాణం అసాధారణమైనది. 2 లక్షల యూనిట్లకు పైగా వార్షిక అమ్మకాలను సాధించడం అనేది చాలా గొప్ప విషయం అని అన్నారు.

Peter Thiel and Larry Page May Leave Silicon Valley Know The Reason2
సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లు!

ప్రపంచ టెక్నాలజీ రంగానికి కేంద్రంగా నిలిచిన సిలికాన్ వ్యాలీ.. దశాబ్దాలుగా ప్రముఖ వ్యాపారవేత్తలు & ఆవిష్కర్తలకు నిలయంగా ఉంది. అయితే తాజాగా వెలువడిన కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం.. ఇద్దరు ప్రముఖ టెక్ బిలియనీర్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం అంతర్జాతీయంగా.. చర్చనీయాంశంగా మారింది.సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లలో ఒకరు పేపాల్ కో-ఫౌండర్ పీటర్ థీల్, మరొకరు గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్.పీటర్ థీల్, లారీ పేజ్ ఇరువురూ.. సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టడానికి కారణం క్యాలిఫోర్నియా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ''బిలియనీర్ ట్యాక్స్'' అని తెలుస్తోంది. ఈ పన్ను ప్రకారం.. ఒక బిలియన్ డాలర్లకు మించిన ఆస్తి కలిగిన వ్యక్తులపై అదనపు సంపద పన్ను విధించాలనే యోచన ఉంది.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేందుకు ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నప్పటికీ.. సంపన్నులు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్ను వల్ల తమపై భారీ ఆర్థిక భారం పడుతుందని, పెట్టుబడులు & వ్యాపార స్వేచ్ఛకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ఈ కారణంగానే పీటర్ థీల్, లారీ పేజ్ వంటి బిలియనీర్లు సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.బిలియనీర్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గం.. క్యాలిఫోర్నియా నుంచి ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్లిపోవడమే. ఈ పరిణామం సిలికాన్ వ్యాలీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవేళా ఈ బిలియనీర్లు నిజంగా నగరాన్ని విడిచిపెడితే, ఇతర టెక్ వ్యాపారవేత్తలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఫలితంగా క్యాలిఫోర్నియా రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గడమే కాకుండా, సిలికాన్ వ్యాలీకి ఉన్న ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం కొంత మేర తగ్గే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.యూకే వీడిన లక్ష్మీ మిట్టల్ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల కారణంగా దేశం వీడిన బిలియనీర్ల జాబితాలో ప్రముఖ్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ కూడా ఉన్నారు. యూకే ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయం వల్ల.. ఆయన దేశం విదిచిపెట్టి దుబాయ్‌ చేరుకున్నారు. 2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇదీ చదవండి: లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. కుటుంబం లోన్ చెల్లించాలా?

Stock Market Holidays 2026 NSE Releases Full List3
2026లో స్టాక్ మార్కెట్ హాలిడేస్: ఫుల్ లిస్ట్ ఇదే..

2025 డిసెంబర్ 31న స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇక రేపటి నుంచి (2026 జనవరి 1) కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ తరుణంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వచ్చే సంవత్సరం మార్కెట్ సెలవుల జాబితాను విడుదల చేసింది.➤26 జనవరి (సోమవారం): గణతంత్ర దినోత్సవం➤3 మార్చి (మంగళవారం): హోలీ➤26 మార్చి (గురువారం): రామనవమి➤31 మార్చి (మంగళవారం): మహావీర్ జయంతి➤3 ఏప్రిల్ (శుక్రవారం): గుడ్ ఫ్రైడే➤14 ఏప్రిల్ (మంగళవారం): అంబేద్కర్ జయంతి➤1 మే (శుక్రవారం): మహారాష్ట్ర దినోత్సవం➤28 మే (గురువారం): బక్రీద్➤26 జూన్ (శుక్రవారం): మొహర్రం➤14 సెప్టెంబర్ (సోమవారం): గణేష్ చతుర్థి➤2 అక్టోబర్ (శుక్రవారం): మహాత్మా గాంధీ జయంతి➤20 అక్టోబర్ (మంగళవారం): దసరా➤10 నవంబర్ (మంగళవారం): దీపావళి-బలిప్రతిపాద➤24 నవంబర్ (మంగళవారం): గురునానక్ జయంతి➤25 డిసెంబర్ (శుక్రవారం): క్రిస్మస్2026 NSE సెలవుల జాబితా ప్రకారం.. భారత స్టాక్ మార్కెట్ 15 రోజులు మూసివేయబడుతుంది. ఇవి కాకుండా శని, ఆదివారాలు మార్కెట్ సెలవు.శని & ఆదివారాల్లో వచ్చే పండుగ సెలవులు➤15 ఫిబ్రవరి (ఆదివారం): మహాశివరాత్రి➤21 మార్చి (శనివారం): రంజాన్➤15 ఆగస్టు (శనివారం): స్వాతంత్య్ర దినోత్సవం➤8 నవంబర్ (ఆదివారం): దీపావళి

Guruvayurappan Temple Gets New TVS Apache RTX 3004
గురువాయూరప్పన్‌కు ఖరీదైన బైక్

కొంతమంది భక్తులు.. తాము నమ్మిన దేవునికి ధనం సమర్పించుకుంటారు. ఇంకొందరు వాహనాలు సమర్పించుకుంటూ ఉంటారు. దేవుడు ఎవరైనా.. ఎవరి నమ్మకం వారిది. ఇటీవల 'గురువాయూరప్పన్'కు (దేవాలయానికి) టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్‌ 300 (TVS Apache RTX 300) బైక్ అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి.గురువాయూరప్పన్ దేవాలయానికి.. టీవీఎస్ మోటార్ కంపెనీ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ TVS Apache RTX 300 బైకును, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ.. దేవస్వం చైర్మన్ డాక్టర్ వీకే విజయన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్వం పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్‌ 300టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్‌ 300ను.. కంపెనీ రూ.1.99 లక్షల ప్రారంభ ధరలతో మార్కెట్లో విక్రయిస్తుంది. ఇది బేస్, టాప్, బీటీఓ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటాయి.ఇదీ చదవండి: 2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలుఅపాచీ ఆర్‌టిఎక్స్‌ 300 బైక్.. 299 సీసీ ఇంజిన్‌తో 9,000rpm వద్ద 36hp పవర్ & 7,000rpm వద్ద 28.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది Apache RR 310 తర్వాత తయారీదారు యొక్క రెండవ అత్యంత శక్తివంతమైన బైక్‌గా నిలిచింది. ఇది ఆఫ్ రోడర్‌గా మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ టూరర్‌గా కూడా ఉపయోగపడుతుంది.

Zomato Swiggy Hike Gig Workers Know The Details Here5
గిగ్ వర్కర్ల సమ్మె: స్విగ్గీ, జొమాటో ప్రోత్సాహకాలు?

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో.., కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయాలు కలగకుండా ఉండేదుకు చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే.. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లైన స్విగ్గీ & జొమాటోలు పీక్ అవర్స్.. సంవత్సరాంతపు రోజులలో డెలివరీ కార్మికులకు అధిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాయి.జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 25, డిసెంబర్ 31 తేదీలలో డెలివరీ వర్కర్ యూనియన్లు సమ్మెలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాల ప్రకటన వెలువడింది. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య రద్దీ సమయాల్లో జొమాటో డెలివరీ భాగస్వాములకు ఒక్కో ఆర్డర్‌కు రూ.120–150 చెల్లింపులను ఆఫర్ చేసినట్లు కార్మికులు.. ఈ విషయం తెలిసిన వ్యక్తులకు పంపిన సందేశాలు చెబుతున్నాయి.తాజా ప్రోత్సాహకాల ప్రకారం.. డెలివరీ ఏజెంట్లు సగటున 3000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా.. క్యాన్సిలేషన్లు లేదా ఆర్డర్‌ తీసుకోకపోయిన సందర్భాల్లో సాధారణంగా విధించే పెనాల్టీలను కూడా అమలు చేయబోమని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిద్వారా.. ఎక్కువ మంది డెలివరీ ఏజెంట్లు పనికి రావాలని సంస్థలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా, స్విగ్గీ కూడా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 12 గంటల మధ్య రూ. 2,000 వరకు పీక్-అవర్ ఆదాయాన్ని ప్రకటిస్తోంది.ఇదీ చదవండి: కేంద్రం కీలక ప్రకటన.. వొడాఫోన్ ఐడియాకు బిగ్ రిలీఫ్!ఇకపోతే.. డిసెంబర్ 25న సమ్మె చేపట్టిన గిగ్ వర్కర్లు.. మరోమారు ఈరోజు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. మెరుగైన చెల్లింపులు, మెరుగైన పని పరిస్థితులను మాత్రమే కాకుండా.. 10 నిమిషాల డెలివరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) పేర్కొన్నాయి.

Cabinet Clears Package for Vodafone Idea Freezes AGR Dues at Rs 87695 Crore6
కేంద్రం కీలక ప్రకటన.. వొడాఫోన్ ఐడియాకు బిగ్ రిలీఫ్!

రుణభారంతో సతమతమవుతున్న 'వొడాఫోన్ ఐడియా'కు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిలు రూ. 87,695 కోట్లను ఫ్రీజ్ చేసింది. అంతే కాకుండా.. 2032 ఆర్థిక సంవత్సరం నుంచి 2041 ఆర్థిక సంవత్సరం వరకు.. 10 సంవత్సరాల కాలంలో వారి తిరిగి చెల్లించేలా వెసులుబాటు కల్పించింది.ఏజీఆర్ సంబంధిత అంశాలు.. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ మద్దతు కోసం వేచిచూస్తున్న వొడాఫోన్ ఐడియాకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించింది.వోడాఫోన్ ఐడియాలో.. ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి బకాయిల చెల్లింపును క్రమబద్ధీకరించడానికి వీలు కల్పించడమే కాకుండా.. కంపెనీకి చెందిన 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది.

Advertisement
Advertisement
Advertisement