Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

stock market updates on 18 March 20261
క్రమంగా పుంజుకుంటున్న స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 142 పాయింట్లు పెరిగి 23,723 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 423 పాయింట్లు ఎగబాకి 76,485 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.59బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 100.97 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.18 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.25 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.47 శాతం పుంజుకుంది.Today Nifty position 18-03-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Iran Israel Tensions Oil Trade Shift Dollar to Yuan Payments US Sanctions2
డాలర్ ఆధిపత్యానికి గండి!

పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ భౌగోళిక రాజకీయాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని కూడా వేగంగా మారుస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్మూజ్‌ జలసంధి కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు అమెరికా డాలర్ ఏకఛత్రాధిపత్యానికి సవాలు విసురుతున్నాయి.డీ-డాలరైజేషన్ వేగవంతం?హర్మూజ్‌ జలసంధి గుండా ప్రపంచంలోని 20% పైగా చమురు రవాణా జరుగుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్, దానికి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు చమురు వ్యాపారాన్ని డాలర్లకు బదులు చైనా కరెన్సీ ‘యువాన్’లో జరపాలని యోచిస్తున్నాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో 80% పైగా చమురు లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ఇప్పుడు యువాన్ వైపు మొగ్గు చూపడం వల్ల డాలర్‌కు ఉన్న గ్లోబల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటే సురక్షితమైన కరెన్సీగా డాలర్‌ను కాకుండా ప్రత్యామ్నాయాల వైపు దేశాలు చూడటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది.భారత రూపాయిపై ప్రభావంప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ కరెన్సీ మార్పుల ప్రభావం భారత రూపాయిపై ద్వంద్వ ప్రభావం చూపే అవకాశం ఉంది.చైనా ఆధిపత్యం పెరగడంఅంతర్జాతీయ చమురు మార్కెట్‌లో యువాన్ పట్టు సాధిస్తే అది ఆసియాలో చైనా ఆర్థిక శక్తిని మరింత పెంచుతుంది. భారత్‌కు చైనాతో సరిహద్దు వివాదాలు, వాణిజ్య పోటీ ఉన్న నేపథ్యంలో మన పొరుగు దేశం కరెన్సీ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారడం భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లావేదేవీలు సర్వసాధారణం. ఒకవేళ యువాన్ వాడకం పెరిగితే భారత్ తన చమురు దిగుమతుల కోసం యువాన్‌ను భారీగా కొనాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో యువాన్‌కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ దానికి సాపేక్షంగా తగ్గే ప్రమాదం ఉంది. దాంతో మన విదేశీ మారక నిల్వలలో డాలర్ల కంటే యువాన్ నిల్వలను ఎక్కువగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అమెరికాతో సంబంధాలపై ప్రభావంభారత్-అమెరికా మధ్య రక్షణ, ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ భారత్ భారీ ఎత్తున యువాన్ వ్యవస్థలోకి వెళ్తే అది అమెరికా ఆగ్రహానికి కారణం కావచ్చు. ఇది ద్వైపాక్షిక సంబంధాలపై, అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దశాబ్దాలుగా మన బ్యాంకింగ్ వ్యవస్థ డాలర్ ఆధారిత లావాదేవీలకు(స్విఫ్ట్‌) అలవాటు పడి ఉంది. అకస్మాత్తుగా యువాన్ వ్యవస్థలోకి మారాలంటే కొత్త ఆర్థిక మౌలిక సదుపాయాలు, ఒప్పందాలు చేసుకోవాలి. దీనివల్ల లావాదేవీల ఖర్చు పెరిగే అవకాశం ఉంది.భారత్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి?చైనా యువాన్‌కు బదులుగా భారత్ ‘రూపాయి-రియల్’ (ఇరాన్‌తో) లేదా ‘రూపాయి-దిర్హామ్’ (యూఏఈతో) వంటి స్థానిక కరెన్సీ ఒప్పందాలు చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలి. ఇది జరిగితే మనకు డాలర్ లేదా యువాన్ రెండింటితోనూ పని లేకుండా సొంత కరెన్సీతోనే వ్యాపారం చేసుకునే వీలుంటుంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి. డాలర్‌పై ఆధారపడటం తగ్గుతుంది. డాలర్ విలువ పెరిగినప్పుడు మనపై పడే అదనపు భారం తగ్గుతుంది.వ్యూహాత్మక జాగ్రత్త అవసరంహర్మూజ్‌ జలసంధి మూతబడితే ప్రపంచ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో భారత్ తన వ్యూహాత్మక నిల్వలను కాపాడుకుంటూనే చమురు చెల్లింపుల కోసం బహుళ కరెన్సీ విధానాన్ని అనుసరించడం అత్యవసరం. డాలర్ ఆధిపత్యం తగ్గడం భారత్‌కు ఒక రకంగా అవకాశమే అయినా యుద్ధం తెచ్చే ద్రవ్యోల్బణ సెగను తట్టుకోవడం రూపాయికి అతిపెద్ద సవాలు.ఇదీ చదవండి: ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం!

India Post joins hands with AMFI to distribute mutual funds3
ఉత్తరాలే కాదు.. ఇక లాభాలూ డెలివరీ!

చిన్న పొదుపులు ఇపుడు పెద్ద పెట్టుబడుల దిశగా అడుగులు వేయనున్నాయి.పెట్టుబడుల్లో కొత్త అధ్యాయానికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై మీ ఇంటి పక్కన ఉండే పోస్టాఫీసు కేవలం ఉత్తరాలు, సేవింగ్స్‌ ఖాతాలకు మాత్రమే పరిమితం కాదు. స్టాక్‌ మార్కెట్‌ లాభాలను సామాన్యులకు అందించేలా మ్యూచువల్‌ ఫండ్స్‌ అమ్మకానికి సిద్ధమవుతోంది. భారత తపాలా శాఖ, అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) చేతులు కలపడంతో దేశవ్యాప్తంగా పెట్టుబడుల విప్లవం రాబోతోంది.పోస్ట్‌ ఆఫీసుల విస్తృత నెట్‌వర్క్‌తో మ్యూచువల్‌ ఫండ్లు గ్రామీణ ప్రాంతాలతో పాటు, మారు మూల పల్లెలకూ చేరే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన పెంచి, సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిని చేయాలనే సంకల్పంతో పోస్టాఫీసుల ద్వారా ఈ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు యాంఫి సీఈఓ వెంకట్‌ చలసాని చెప్పారు. పోస్ట్‌ ఆఫీసుల నెట్‌వర్క్‌తో మ్యూచువల్‌ ఫండ్లు మెట్రోల నుంచి మండలాలు, పల్లెలోకి అడుగుపెడుతున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల్లో మహారాష్ట్రే దేశంలో అగ్రస్థానంలో ఉంది దేశ మొత్తం ఫండ్‌ ఆస్తుల్లో 40శాతానికి పైగా వాటా ముంబై, పుణె నగరాలదే. దీంతో మహారాష్ట్రలోని ముంబై, పూణె, నాగపూర్, ఔరంగాబాద్‌ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా తపాలాశాఖ మ్యూచువల్‌ ఫండ్స్‌ విక్రయానికి తెరతీసింది. అది విజయవంతం కావడంతో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండో దశలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా పదివేల మంది పోస్టల్‌ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎంపిక చేసిన సిబ్బందికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ శిక్షణ ఇస్తుంది. సర్టీఫై అయిన ఉద్యోగులు పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ స్కీములను విక్రయిస్తారు. యాంఫి డి్రస్టిబ్యూటర్‌గా వ్యవహరిస్తుంది. చిన్న పట్టణాలపై ఫోకస్‌ దేశంలోని మొత్తం మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తుల్లో 80 శాతం టాప్‌ 10 నగరాల నుంచే వస్తున్నాయి. 65 శాతం మందికి అవగాహన ఉన్నా, కేవలం 7 శాతం మాత్రమే అంటే 6 కోట్ల మందే పెట్టుబడి పెడుతున్నారు. గ్రామీణప్రాంతాల, పల్లెలదాకా విస్తరిస్తే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని యాంఫి అంచనా వేస్తోంది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ బడ్జెట్‌ బూస్ట్‌ఒక్కో కొత్త ఇన్వెస్టర్‌కు రూ2,000 ప్రోత్సాహకం 2026 బడ్జెట్‌లో ప్రతి కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్‌కు రూ2,000 ప్రోత్సాహకాన్ని ఆరి్ధక మంత్రి ప్రకటించారు. పోస్టల్‌ సిబ్బందికి ఈ ప్రోత్సాహకంలో భాగస్వామ్యం కల్పించే విధానాన్ని తపాలాశాఖ రూపొందిస్తోంది. ఇది వారి రెగ్యులర్‌ కమిషన్‌కు అదనంగా ఉంటుంది. 2025 ఆగస్టు నుంచి అమల్లోకి వచి్చన ఈ ఒప్పందం 2028 ఆగస్టు వరకు మూడేళ్ల పాటు ఉంటుందని యాంఫి వెల్లడించింది.

sai parenterals fixes price band of rs 372-392 per share for ipo opening march 244
సాయి పేరెంటరల్స్‌ @ రూ. 372–392

హైదరాబాద్‌: డైవర్సిఫైడ్‌ ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్ల కంపెనీ సాయి పేరెంటరల్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి తాజాగా రూ. 372–392 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 27న ముగియనుంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌ కంపెనీ రూ. 285 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 32 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి.కంపెనీ వృద్ధి ప్రయాణంలో ఐపీవో కీలక మైలురాయిగా కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్‌ కేకే పేర్కొన్నారు. తాము సాధించిన పురోగతిని ఇది ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు. వ్యూహాత్మక ప్రణాళికలను వేగవంతం చేసేందుకు తోడ్పాటునివ్వగలదని పేర్కొన్నారు. తద్వారా తదుపరి విస్తరణ దశకు మద్దతు లభించనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా గ్లోబల్‌ ఫార్ములేషన్ల బిజినెస్‌తోపాటు.. ఇంజెక్టబుల్స్, ఓరల్‌ డోసేజీ ఫార్ములేషన్లలో కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్, తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు వివరించారు.

PFC Declares Rs 3. 25 Interim Dividend for FY26: Record Date 23 March5
పీఎఫ్‌సీ డివిడెండ్‌ రూ. 3.25

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) నాలుగో మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించేందుకు అనుమతించింది. దీంతో వాటాదారులకు షేరుకి రూ. 3.25 చొప్పున లభించనుంది. ఇందుకు ఈ నెల 23 రికార్డ్‌ డేట్‌కాగా.. ఏప్రిల్‌ 16కల్లా చెల్లించనుంది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో రూ. 1,60,000 కోట్ల రుణ సమీకరణ ప్రణాళికకు సైతం బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది.ఈబీఆర్‌ నిధులకు సంబంధంలేకుండా వీటిని ఒకేసారి లేదా దశలవారీగా వివిధ మూలాల నుంచి సమీకరించనుంది. వీటిలో రూ. లక్ష కోట్లు బాండ్లు, సెక్యూరిటీలు, మధ్యకాలిక ఇన్‌స్ట్రుమెంట్స్, కాలావధి రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. వివిధ ఇన్‌స్ట్రుమెంట్స్‌ జారీతో రూ. 20,000 కోట్ల విదేశీ మారకపు రుణాలు సైతం వీటిలో కలసి ఉన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో పీఎఫ్‌సీ షేరు బీఎస్‌ఈలో 3% జంప్‌చేసి రూ. 418 వద్ద ముగిసింది.

Latest Gold and Silver Price in India6
సాయంత్రానికి సగం తగ్గిన గోల్డ్ రేటు!

రోజురోజుకి తగ్గుతున్న గోల్డ్ రేటు ఈ రోజు (మంగళవారం) కొంత పెరిగింది. అయితే 24 గంటలు కూడా గడవకముందే.. పెరిగిన రేటులో సగం తగ్గిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం లేటెస్ట్ ధరల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,45,400 రూపాయల వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల బంగారం ధర సాయంత్రానికి రూ.1,44,900 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.500 తగ్గిందన్నమాట. 24 క్యారెట్ల ధర 1,58,620 రూపాయల నుంచి రూ.1,58,080 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో లేటెస్ట్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 158230 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 145050 రూపాయల వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం ఉన్న ధరల కంటే తక్కువ కావడం గమనార్హం.చెన్నైలో గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ధరలు ఉదయం ఎలా ఉన్నాయో, సాయంత్రానికి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,46,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,59,820 వద్ద ఉంది.

Advertisement
Advertisement
Advertisement