Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Crash Closing Bell On 13 February 20261
స్టాక్‌మార్కెట్‌ ​క్రాష్‌.. నెత్తురు కక్కిన షేర్లు!

మార్కెట్‌పై బేర్స్‌ పట్టు సాధించడంతో దలాల్ స్ట్రీట్‌లో శుక్రవారం తీవ్ర రక్తపాతం! చోటుచేసుకుంది. గ్లోబల్ టెక్ మార్కెట్లలో కొనసాగుతున్న మందగమనం ప్రభావంతో హెవీవెయిట్ ఐటీ షేర్లు భారీగా క్షీణించాయి. ఫలితంగా భారతీయ ఈక్విటీ సూచీలు దిగువన పయనించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 1,048.16 పాయింట్లు లేదా 1.25 శాతం క్షీణించి 82,626.76 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 336.1 పాయింట్లు లేదా 1.30 శాతం క్షీణించి 25,471.1 వద్ద ముగిసింది. బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ మినహా అన్ని షేర్లు కుప్పకూలాయి. వీటిలో హెచ్‌యూఎల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, టైటాన్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. రంగాలవారీగా నష్టాలకు దారితీసింది. ఇది 3 శాతానికి పైగా పడిపోయింది. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతానికి పైగా పడిపోయి 1.44 శాతం నష్టపోయింది.రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతం కంటే ఎక్కువ నష్టపోయి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతం పైగా క్షీణించి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.71 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.79 శాతం పడిపోయాయి. మార్కెట్ అస్థిరతకు సూచిక అయిన ఇండియా వీఐఎక్స్‌ 15.18 శాతం ఎగసి, పెట్టుబడిదారుల ఆందోళనలను ప్రతిబింబించింది.

Toll Relief on Partially Open Expressways From 2026 Feb 152
మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. వాహనదారులకు గుడ్‌న్యూస్!

టోల్ వసూళ్లకు సంబంధించి.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును తగ్గించాలని నిర్ణయించింది. ఇది 2026 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నిర్మాణం పూర్తికాని లేదా కొంత భాగం మాత్రమే ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును 25 శాతం తగ్గించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2008లో అమలులోకి వచ్చిన జాతీయ రహదారుల ఫీజు నియమాలలో సవరణలు చేసి ఈ తగ్గింపును అమలులోకి తీసుకురానున్నారు.ఇప్పటివరకు.. ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా అందుబాటులో లేకపోయినప్పటికీ.. ప్రయాణికులు ఎక్కువ టోల్ చెల్లించాల్సి వచ్చేది. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోయినా.. ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అనేది ప్రజలకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టోల్ చెల్లింపులు తగ్గిస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నారు.ఇక్కడ వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 25 శాతం టోల్ ఫీజు తగ్గింపు అనేది శాశ్వతం కాదు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత సాధారణ టోల్ ఫీజును వసూలు చేస్తారు. అంటే సాధారణ ఎక్స్‌ప్రెస్‌వే రేట్లు అమలులోకి వస్తాయన్నమాట.ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. ప్రజలను కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలను ఉపయోగించేందుకు ప్రోత్సహించడమే. టోల్ ఫీజు తక్కువగా ఉంటే ఎక్కువ మంది ఆ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో జాతీయ రహదారులపై ట్రాఫిక్ తగ్గుతుంది.ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!

Henley Passport Index 2026 India making notable leap global mobility rankings3
పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ల్లో భారత్‌ స్థానం ఎంతంటే..

అంతర్జాతీయ ప్రయాణ విభాగంలో భారత పాస్‌పోర్ట్ తన ప్రభావాన్ని చాటుతోంది. తాజాగా విడుదలైన 2026 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకుంది. భారతీయ పౌరుల అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛ గణనీయంగా పెరిగిందని ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అందించే అధికారిక డేటా ఆధారంగా రూపొందుతుంది. ఒక దేశ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా అవసరం లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశంపై ఈ ర్యాంకింగ్స్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత నివేదిక ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా-ఫ్రీ, వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా సౌకర్యంతో సులభంగా ప్రయాణించవచ్చు.ప్రయాణికులకు ప్రయోజనాలుఈ మెరుగైన ర్యాంకింగ్ వల్ల సెలవులు, వ్యాపార పర్యటనలు లేదా సాంస్కృతిక సందర్శనల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు వీసా అవాంతరాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆసియా, ఓషియానియా, కరేబియన్ దీవులు, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో భారతీయులకు మెరుగైన ప్రవేశ సౌకర్యాలు లభిస్తాయి.భారత్ ఈ ర్యాంకింగ్స్‌లో గత దశాబ్ద కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 2006లో 71వ ర్యాంకులో ఉన్న భారత్ గత ఏడాది 85వ స్థానానికి పడిపోయింది. అయితే, 2026 ప్రారంభంలో 80వ స్థానానికి, ఇప్పుడు ఏకంగా 75వ స్థానానికి చేరుకోవడం గమనార్హం.ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు..ర్యాంకుదేశంవీసా రహిత పర్యటన(దేశాల సంఖ్య)1సింగపూర్1922జపాన్, దక్షిణ కొరియా1873స్వీడన్, యూఏఈ1864జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ (మరో 8 ఐరోపా దేశాలు)1855ఆస్ట్రియా, గ్రీస్, పోర్చుగల్, మాల్టా184 టాప్ 10లో ఇతర దేశాలు..ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు టాప్ 10 జాబితాలో కొనసాగుతున్నాయి. అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 179 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించగలరు.75వ ర్యాంకు అనేది భారత పాస్‌పోర్ట్ చరిత్రలో అత్యుత్తమ స్థానం కాకపోయినప్పటికీ, గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న వృద్ధి రేటు సానుకూల ధోరణిని సూచిస్తోంది. ప్రపంచ దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, దౌత్య సంబంధాల మెరుగుదల కారణంగా భవిష్యత్తులో భారత పాస్‌పోర్ట్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాజ్‌పాల్‌ యాదవ్‌ గ్యారేజీలోని కార్ల లిస్ట్‌ ఇదే..

Rich Dad Poor Dad Robert Kiyosaki Warns Parents Stop Spoiling Kids with 5 Cs4
డబ్బుతోనే చెడగొడుతున్నారు.. ‘రిచ్‌ డాడ్‌’ వార్నింగ్‌!

ప్రఖ్యాత ఇన్వెస్టర్‌, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) తరచూ తన ఆర్థిక అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి ఆయన.. తల్లిదండ్రులు డబ్బుతో తమ పిల్లల జీవితాలను ఎలా చెడగొడుతున్నారో వివరించారు.5 ‘సీ’లతో పిల్లల జీవితాలు నాశనంతల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నారో కియోసాకి తన సోషల్ మీడియా వేదిక ‘ఎ‍క్స్‌’ (ట్విటర్‌)లో చేసిన పోస్టులో వివరించారు. పిల్లలు ఆర్థికంగా చెడిపోవడానికి కారణమైన ఐదు ‘సీ’(C)ల గురించి ప్రస్తావించారు.1. క్యాష్‌ (మనీ): తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఇస్తారు. కానీ వారు స్వయంగా సంపాదించాలని ఆశించరు. దీంతో పిల్లల్లో ఆర్థిక బాధ్యత తగ్గుతుంది.2. కాలేజ్‌ : పిల్లల ఉన్నత విద్యకు తల్లిదండ్రులే పూర్తిగా ఖర్చు భరిస్తారు. దీంతో ఉన్నత విద్య కోసం కష్టపడే అలవాటు పిల్లలకు తగ్గిపోతుంది.3. కారు: కళాశాల ఫీజులతో పాటు, కారు కొనివ్వడం, బీమా, నిర్వహణ ఖర్చులు కూడా తల్లిదండ్రులే భరిస్తున్నారు.4. కాండో (ఇల్లు): కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి ఇంటిని కూడా తామే స్వయంగా కొనిస్తున్నారు.5. క్యాష్‌(ట్రస్ట్ ఫండ్): పిల్లల భవిష్యత్తు కోసం ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు బడ్జెట్ చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి ఆర్థిక నైపుణ్యాలు నేర్చుకోరు.ఆస్తి కరిగిపోతుంది..కియోసాకి అభిప్రాయం ప్రకారం.. మొదటి తరం కష్టపడి సంపాదిస్తుంది. రెండో తరం సౌకర్యవంతమైన జీవితం గడుపుతుంది. కానీ అదే అలవాట్లు మూడో తరానికి వెళ్తే కుటుంబ ఆస్తి క్రమంగా క్షీణిస్తుంది. కష్టపడి పనిచేయడం, సంపాదించడం, పెట్టుబడి పెట్టడం, బడ్జెట్ నిర్వహించడం వంటి అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఫేక్‌లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!భారతీయ కుటుంబాల్లో ఇదే పరిస్థితిరాబర్ట్‌ కియోసాకి చెప్పిన పరిస్థితి భారతీయ కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో పిల్లలు ఉద్యోగం పొందిన తర్వాత కూడా ఇల్లు లేదా కారు కొనుగోలు సమయంలో తల్లిదండ్రులు తమ పొదుపులను, కొన్నిసార్లు ప్రావిడెంట్ ఫండ్ లేదా పదవీ విరమణ నిధుల నుంచే ఉపసంహరించుకుని సహాయం చేస్తుంటారు. ఇది తల్లిదండ్రుల ప్రేమగా కనిపించినా, దీర్ఘకాలంలో పిల్లల్లో ఆర్థిక స్వావలంబనను దెబ్బతీసే ప్రమాదం ఉందని కియోసాకి హెచ్చరిస్తున్నారు.THE 5-Cs: How to destroy a child’s life with money.I have met many parents who destroy their children’s lives with money….The parents give their child or children the 5-Cs1: CASH: they give their children money never expecting them to earn their money.2: COLLEGE:…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 12, 2026

Rajpal Yadav garage reflects car collection exotic supercars5
రాజ్‌పాల్‌ యాదవ్‌ గ్యారేజీలోని కార్ల లిస్ట్‌ ఇదే..

బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో వార్తల్లో నిలిచారు. ఒకవైపు ఆయన లగ్జరీ కార్ల సేకరణ సోషల్ మీడియాలో చర్చనీయాంశం కాగా, మరోవైపు ఆయన ఎదుర్కొంటున్న చట్టపరమైన చిక్కులు పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజ్‌పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఆయన జీవనశైలికి సంబంధించిన ఆసక్తికర వివరాలతో కూడిన వివరాలు చూద్దాం.రాజ్‌పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో నిలిచారు?ప్రస్తుతం రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.9 కోట్ల బకాయిలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇటీవల తిహార్ జైలులో లొంగిపోయారు. 2010లో ఆయన దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమా కోసం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఈ వివాదం తలెత్తింది. దీనిపై ఇటీవల జరిగిన బెయిల్ విచారణను కోర్టు ఫిబ్రవరి 16కి వాయిదా వేసింది. ఈ క్లిష్ట సమయంలో కొందరు ప్రముఖ బాలీవుడ్‌ నటులు ఆయనకు అండగా నిలవడం, ఆర్థిక సహాయం ప్రకటించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.రాజ్‌పాల్ యాదవ్ వ్యక్తిగత జీవితం సాధారణంగానే ఉన్నప్పటికీ, ఆయన వద్ద ఉన్న కార్ల సేకరణ మాత్రం చాలా ప్రత్యేకం. వీటికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేనప్పటికీ కొన్ని వార్తా నివేదికల సమాచారం ప్రకారం ఆయన వద్ద ఉన్న వాహనాలు వివరాలు కింది విధంగా ఉన్నాయి.

Zomato Deepinder Goyal shared overwhelmed after receiving more than 8000 emails6
రాజీనామా చేసిన వారికి ఆహ్వానం

జొమాటో సంస్థను వదిలి వెళ్లిన మాజీ ఉద్యోగులను తిరిగి ఆహ్వానిస్తూ జొమాటో గ్రూప్ (ఎటర్నల్) వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ చేసిన ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆయనకు సుమారు 8,000 ఈమెయిల్స్ వచ్చినట్లు ఆయన ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఈమెయిల్స్‌ను రెండు వర్గాలుగా విభజించవచ్చు. అందులో గతంలో ఎటర్నల్ ప్రయాణంలో భాగమై వివిధ కారణాలతో సంస్థను వీడిన 4,000 మంది మాజీ ఉద్యోగులు కొందరున్నారు. ఇప్పటివరకు సంస్థలో పనిచేయకపోయినా జొమాటో సంస్కృతికి ఆకర్షితులై చేరాలనుకుంటున్న వారు మరో 4,000 మంది ఉన్నారు. ‘నేను దీన్ని అస్సలు ఊహించలేదు. చాలా ధన్యవాదాలు. ఈ ఈమెయిల్స్‌లో ఎన్నో కథలు, భావోద్వేగాలు, నిజాయితీ దాగి ఉన్నాయి’ అని గోయల్ ఆనందం వ్యక్తం చేశారు.పాత సహోద్యోగులకు బంపర్ ఆఫర్సంస్థ గత కొన్నేళ్లుగా ఎదుగుతున్న క్రమంలో పాత ఉద్యోగులతో తనకు ఉన్న అనుబంధం ప్రస్తుత టీమ్‌కు ఉండకపోవచ్చని గోయల్ అభిప్రాయపడ్డారు. 8,000 మెయిల్స్ స్వయంగా చదవడం సమయంతో కూడుకున్న పని కావడంతో తనతో నేరుగా పనిచేసిన వారికి ఆయన ఒక వెసులుబాటు కల్పించారు. ఎవరైనా గతంలో దీపిందర్‌తో పనిచేసి ఉంటే మెయిల్ కోసం వేచి చూడకుండా నేరుగా తన మొబైల్ నంబర్ కనుగొని వాట్సాప్ చేయమని ఆయన కోరారు.‘గతాన్ని పట్టించుకోను’మాజీ ఉద్యోగుల పట్ల గోయల్ చూపిన సానుకూల దృక్పథం చర్చనీయాంశమైంది. గతంలో వారు ఎందుకు వెళ్లిపోయారు లేదా ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేశారనే విషయాలను పక్కన పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో సంస్థలో సరైన వాతావరణం లేదా నాయకత్వం లేకపోవడం వల్ల కొందరు వెళ్లిపోయి ఉండవచ్చని ఆయన నిజాయితీగా అంగీకరించారు. ‘నేను గతాన్ని పట్టుకుని కూర్చుంటానని మీరు భావించవద్దు. తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మాకు మీ అవసరం ఉంది’ అంటూ ఆయన భరోసా ఇచ్చారు.ఎందుకు మాజీ ఉద్యోగులకే ప్రాధాన్యత?సంస్థ పనితీరు, దాని విలువలు తెలిసిన వారు తిరిగి రావడం వల్ల పని వేగవంతం అవుతుందని గోయల్ నమ్ముతున్నారు. ‘ఎటర్నల్‌లో ఇంకా వృద్ధి చెందాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఎదిగి, బయటకు వెళ్లి తిరిగి రావాలనుకునే వారికంటే మెరుగైన అభ్యర్థి మరొకరు ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: డబుల్‌ డ్రాప్‌.. ఇంకా భారీగా పడిపోయిన పసిడి, వెండి ధరలు

Advertisement
Advertisement
Advertisement