Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Worlds Most Expensive Cruise Ticket Costs Rs 7 Crore Mumbai Stop1
అత్యంత ఖరీదైన క్రూయిజ్.. ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాలి!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూయిజ్ ప్రయాణానికి ప్రకటన విడుదలైంది. రీజెంట్ సెవెన్ సీస్ అనే సంస్థ "వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్" పేరుతో 140 రోజుల క్రూయిజ్ ప్రయాణాన్ని ప్రకటించింది. మియామి నుండి న్యూయార్క్ వరకు వెళ్లే ఈ ‍సెవెన్‌ సీస్‌ స్ల్పెండర్‌ క్రూయిజ్‌ 6 ఖండాలు, 40 దేశాలు, 71 ఓడరేవులను కవర్ చేస్తుంది. ఈ విలాస సాగర యాత్ర 2027 జనవరి 11న ప్రారంభం కానుంది.టికెట్‌ ధరలు ఇలా.."వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్" క్రూయిజ్‌ ఎక్కడం సామాన్యుల తరం కాదు. ఎందుకంటే అంతలా ఉన్నాయి టికెట్‌ ధరలు. ఎంట్రీ లెవల్ వరండా సూట్ల ఛార్జీలే ఒక్కొక్కరికి సుమారు రూ .80 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇక టాప్-ఎండ్ రీజెంట్ సూట్ కావాలంటే దాదాపు రూ .7.3 కోట్లు అవుతుంది. వాణిజ్య క్రూయిజ్ మార్కెట్లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం.ఏమిటి ప్రత్యేకతలు?సముద్ర ఉపరితలంపై అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు అందించడంలో రీజెంట్ సూట్‌లకు సుదీర్ఘ ఖ్యాతి ఉంది. ప్రతి పోర్ట్ లోనూ ప్రైవేట్ కారు, డ్రైవర్, ఇన్-సూట్ స్పా, క్యూరేటెడ్ ఫైన్ ఆర్ట్, 4,000 చదరపు అడుగుల ప్రైవేట్ స్పేస్‌ వంటి అల్ట్రా-ఎక్స్ క్లూజివ్ వసతులను అతిథులకు కల్పిస్తుంది.రీజెంట్ 2026లో సెవెన్ సీస్ ప్రెస్టీజ్ లో ఇంకా పెద్ద స్కైవ్యూ రీజెంట్ సూట్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. దీని ధర ఒక్క రోజుకి సుమారు రూ .20-22 లక్షలు. ఇది అత్యంత ఖరీదైన సూట్ రేటుగా రికార్డుకెక్కింది.ఆరు ఖండాలలో ప్రయాణం2027 "వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్" క్రూయిజ్ అతిథులు లాస్ ఏంజిల్స్, సిడ్నీ, సింగపూర్, మాలిబు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో రాత్రి బస చేసి ఆరు ఖండాల గుండా 35,668 నాటికల్ మైళ్ళు (66,057 కిమీ) ప్రయాణిస్తారు.మార్గం వెంట 486 కాంప్లిమెంటరీ షోర్ విహారయాత్రలు, మూడు ప్రత్యేకమైన తీరప్రాంత గాలా ఈవెంట్ లు, ఇంటర్‌కాంటినెంటల్‌ బిజినెస్‌ లేదా ఫస్ట్-క్లాస్ విమానాలు, లగ్జరీ హోటల్ బసలు, లగేజ్‌ సర్వీస్‌, ప్రీమియం బేవరేజీలు, స్పెషాలిటీ డైనింగ్, వాలెట్ లాండ్రీ, వై-ఫై, 24 గంటల ఇన్-సూట్ డైనింగ్ వంటివెన్నో ఈ విలాస ప్రయాణంలో ఉన్నాయి.ఈ ‍క్రూయిజ్‌కు భారత్‌లో నాలుగు స్టాప్ లు ఉన్నాయి. ముంబై, మంగళూరు, కొచ్చి, గోవాలో ఈ క్రూయిజ్‌ను యాత్రికులు ఎక్కొచ్చు.

Stock Market Close September 17 Sensex rises 313 pts Nifty at 253302
బ్యాంక్‌, ఐటీ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరుతుందన్న ఆశాభావంతో భారత ఈక్విటీ సూచీలు సానుకూలంగా కదిలాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 313.02 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 82,693.71 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 91.15 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 25,330.25 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్), కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. దీనికి విరుద్ధంగా, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్ ​​వెనుకబడి ఉన్నాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.08 శాతం, స్మాల్ క్యాప్ 0.68 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.61 శాతం, నిఫ్టీ ఐటీ 0.65 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ 0.5 శాతం నష్టపోయింది.

Madison India Capital exits Star Health with Rs 299 cr stake sale3
స్టార్‌హెల్త్‌ నుంచి తప్పుకొన్న ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ

స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ నుంచి ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ నిష్క్రమించింది. కంపెనీలో తనకున్న మొత్తం 1.15 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా సుమారు రూ. 299 కోట్లకు విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌ డీల్‌ డేటా ప్రకారం అనుబంధ సంస్థ ఎంఐవో స్టార్‌ ద్వారా మాడిసన్‌ ఇండియా 67.72 లక్షల షేర్లను సగటున రూ.441.01 రేటుకు విక్రయించింది.ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌లో భాగమైన పీఐ ఆపర్చూనిటీస్‌ ఏఐఎఫ్‌ 45.35 లక్షల షేర్లను (0.77 శాతం వాటా) రూ. 200 కోట్లకు కొనుగోలు చేసింది. 2024 మే నెలలో మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ సహా మూడు సంస్థలు స్టార్‌ హెల్త్‌లో సుమారు 7.06 శాతం వాటాను రూ. 2,210 కోట్లకు విక్రయించాయి.కాగా నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ ఇండియా (ఏహెచ్‌పీఐ) ఇటీవల హెచ్చరిక జారీ చేసింది. స్టార్‌ హెల్త్‌ నుంచి ఆస్పత్రులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ప్రస్తావించింది. ఏహెచ్‌పీఐలో 1,500 ప్రైవేటు ఆస్పత్రులు సభ్యులుగా ఉన్నాయి.

How Discord played a surprising backstage role to Nepal Movement?4
డిస్‌కార్డ్‌ వంటి మరెన్నో యాప్స్‌..

నేపాల్‌లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జెన్‌జీ యువతకు కమ్యునికేషన్‌ సాధనంగా ‘డిస్‌కార్డ్‌’ యాప్‌ ఎంతో తోడ్పడినట్లు తెలుస్తుంది. యువతను కట్టడి చేసేందుకు, అల్లర్లను అదుపు చేసేందుకు నేపాల్‌ గత ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించడంతో గేమింగ్‌ యాప్‌లో ఇంటర్నల్‌ కమ్యునికేషన్‌ టూల్‌గా వాడే డిస్‌కార్డ్‌ ఎంతో ఉపయోగపడినట్లు కొందరు చెబుతున్నారు.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యవస్థాపకులు జాసన్ సిట్రాన్, స్టాన్ విస్‌నేవిస్క్‌ 2015లో డిస్‌కార్డ్‌ను ఆవిష్కరించారు. ఇది వాయిస్, వీడియో, చాట్ ప్లాట్‌ఫామ్‌. గేమింగ్ సాధనాల్లో గేమర్లు ఇంటర్నల్‌ కమ్యునికేషన్‌ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇటీవల నేపాల్ జెన్‌జీ యువత రాజకీయ మార్పును డిమాండ్ చేస్తూ వీధుల్లోకి పెద్దమొత్తంగా ర్యాలీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలున్న సమయంలో ఇంతలా యువత ఒకేసారి అసంత​ృప్తితో కూడబలుక్కొని వీధుల్లోకి రావడం ఎలా సాధ్యమైందనే దానిపై చర్చ సాగింది. అందుకు గేమింగ్‌ టూల్స్‌లో ఉన్న డిస్‌కార్డ్‌ యాప్‌ ద్వారా యువత పరస్పరం కమ్యునికేట్‌ అయి ఇలా మూకుమ్మడిగా దాడికి దిగినట్లు తెలుస్తుంది.ఇదిలాఉండగా, భారతదేశంలో 2025లో డౌన్‌లోడ్‌ల పరంగా డిస్‌కార్డ్‌ నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇది మొత్తం ఇన్‌స్టాల్స్‌లో 6 శాతం వాటాను కలిగి ఉంది. ఇండియాలో ఈ ఒక్క ఏడాదే 5 మిలియన్ల డౌన్‌లోడ్లు నమోదు అయ్యాయి. 2024 కంటే 2 శాతం పెరిగింది. ఇలాంటి మరిన్ని యాప్స్ గురించి యువత సెర్చ్‌ చేస్తోంది. వాటిలో కొన్నింటి వివరాలు కింద చూద్దాం.యాప్‌ముఖ్య లక్షణాలుఎవరి కోసం అంటే..గిల్డెడ్వాయిస్, వీడియో, బాట్గేమింగ్ కమ్యూనిటీలుటీమ్ స్పీక్అల్ట్రా-లో లేటెన్సీ వాయిస్, మిలిటరీ-గ్రేడ్ ఎన్ క్రిప్షన్ఈస్పోర్ట్స్‌, ఎఫ్‌పీఎస్‌ పోటీ దారులకు..మంబుల్‌ఓపెన్ సోర్స్, ఎన్ క్రిప్టెడ్ వాయిస్ చాట్గోప్యంగా ఉండాలనుకునే గేమర్లుటాక్స్పీర్-టు-పీర్ మెసేజింగ్గేమింగ్ సమూహాలు ఇదీ చదవండి: బిగ్‌ రిలీఫ్‌! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే

Double Diwali Bonanza for Central Government Employees5
దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్‌ ఆఫర్‌?

దీపావళి పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు బంపర్‌ ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు కరవు భత్యం (డీఏ) పెంచాలని చూస్తుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తీసుకునే ఈ రెండు నిర్ణయాల వల్ల ఉద్యోగుల వేతనాలు పెరుగనున్నాయి.8వ పే కమిషన్8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించి దీపావళి లోపు నిబంధనలు ఖరారు చేస్తారని కొందరు విశ్వసిస్తున్నారు. ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 15-18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి 8 నెలల్లోనే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.నిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్‌ ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌(కొత్త బేసిక్‌పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్‌పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.డీఏ పెంపుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2025 నుంచి కరవు భత్యం (డీఏ) 3 శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఈమేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 58 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, దీపావళి ముందు అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కస్టమర్‌ సర్వీస్‌ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!?

Modi continue to serve India when independent India turns 100 said Ambani6
‘100 ఏళ్ల స్వాతంత్ర్య భారతానికి మోదీ సేవ చేస్తూనే ఉండాలి’

భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులతోపాటు దేశంలోని వ్యాపార ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. స్వాతంత్ర్య భారతానికి 100 ఏళ్లు వచ్చే వరకు నరేంద్రమోదీ దేశానికి సేవ చేస్తూనే ఉండాలని అందులో తెలిపారు.‘ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని 145 కోట్ల మందికి ఇదో పండగ రోజు. భారతదేశంలోని మొత్తం వ్యాపార సమాజం తరఫున, రిలయన్స్, అంబానీ కుటుంబం తరఫున, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం అమృత్ కాల్‌లో మోదీ అమృత్ మహోత్సవ్ రావడం యాదృచ్ఛికం కాదు. స్వతంత్ర భారతదేశానికి 100 ఏళ్లు నిండిన నాటికి కూడా మోదీ భారతదేశానికి సేవ చేస్తూనే ఉండాలనేది కోరిక’ అని చెప్పారు.#WATCH | "It is my deepest wish that Modi ji should continue to serve India when independent India turns 100...", says Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani, on PM Modi's 75th birthdayHe says, "Today is a festive day for 1.45 billion… pic.twitter.com/u2NJSTMV3R— ANI (@ANI) September 17, 2025

Advertisement
Advertisement
Advertisement