ప్రధాన వార్తలు

మోసాల నివారణకు.. యాంటీఫ్రాడ్ యాప్
సీమాంతర సైబర్ ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో క్విక్ హీల్ టెక్నాలజీస్ తాజాగా మోసాల నివారణ సొల్యూషన్ యాంటీఫ్రాడ్డాట్ఏఐ ఫ్రీమియం వెర్షన్ను ప్రవేశపెట్టింది. ఫోన్లో కనిపించే హానికరమైన యాప్లతో పాటు కనిపించకుండా దాక్కునే యాప్లను కూడా గుర్తించడం దీని ప్రత్యేకత.ఫిషింగ్, స్పైవేర్, ఆర్థిక మోసాలపరమైన దాడుల కోసం ఉపయోగించే ఈ హిడెన్ యాప్లు యూజరుకు తెలియకుండా పని చేస్తాయి. ఇలాంటి యాప్ల గురించి యాంటీఫ్రాడ్డాట్ఏఐ యూజర్లను అలర్టు చేసి, తగు చర్యలు తీసుకునేందుకు సహాయపడుతుంది.స్కామ్ ప్రొటెక్షన్, రిస్క్ ప్రొఫైల్ అసెస్మెంట్, కాల్ ఫార్వార్డింగ్.. బ్యాంకింగ్ ఫ్రాడ్ అలర్ట్, ఫ్రాడ్ ప్రొటెక్ట్ బడ్డీ మొదలైన ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీన్ని ప్రాథమికంగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, మరింత భద్రత కోరుకునే వారు సబ్్రస్కిప్షన్ ద్వారా ప్రీమియం వెర్షన్ తీసుకోవచ్చని సంస్థ సీఈవో విశాల్ సాల్వి తెలిపారు.

గడ్కరీ సతీమణి పండించిన ఉల్లి: ఒక్కొక్కటి కేజీ బరువు! అదెలాగంటే?
నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిగా విధులు నిర్వహిస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. పెట్రోల్ & డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వెహికల్స్ వినియోగించాలని చెబుతూ.. హైడ్రోజన్ కారులో పార్లమెంటుకు వెళ్లి, పర్యావరణంపై ఆయనకున్న మక్కువను చూపించారు. భర్త బాటలోనే నడుస్తూ.. గడ్కరీ సతీమణి ఆర్గానిక్ పద్దతిలో, మల్చింగ్ పేపర్ టెక్నాలజీతో ఉల్లిని పండించారు.ఉల్లిని అందరూ పండిస్తారు.. అందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ వీరు పండించిన ఉల్లి ఒక్కొక్కటి సుమారు 800 గ్రాముల నుంచి 1000 గ్రాములు లేదా ఒక కేజీ బరువు ఉన్నాయి. ఈ విషయాన్ని గడ్కరీ తన ఎక్స్ ఖాతలో పేర్కొన్నారు. ''నా భార్య కాంచన్, నాగ్పూర్లోని ధపేవాడలోని మా భక్తి ఫామ్లో, మల్చింగ్ పేపర్ టెక్నిక్ ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేసి, ఒక కిలో వరకు బరువున్న సేంద్రీయ ఉల్లిపాయలను విజయవంతంగా ఉత్పత్తి చేశారు'' అని ట్వీట్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పొలం దున్నడం.. ఉల్లి విత్తనాలను నాటు వేయడం వంటివన్నీ చూడవచ్చు. మొత్తానికి ఇక్కడ పండిన ఉల్లి సాధారణ ఉల్లికంటే.. చాలా పెద్దవిగా ఉన్నాయి. ఒక రకంగా వీటిని బాహుబలి ఉల్లి అని కూడా చెప్పొచ్చు.మల్చింగ్ పేపర్ టెక్నాలజీమల్చింగ్ పేపర్ టెక్నాలజీలో.. మట్టి బెడ్ మీద ఒక ప్లాస్టిక్ షీట్ కప్పుతారు. దీనిపైన చిన్న రంధ్రాలు చేసి.. ఉల్లినారు నాటుతారు. ఈ విధంగా వ్యవసాయం చేయడం వల్ల నీటి వృధా తగ్గుతుంది. కలుపు మొక్కలను నివారించవచ్చు. ఈ ఉల్లిని పండించడానికి కాంచన్ గడ్కరీ సేంద్రీయ పద్ధతులనే ఉపయోగించారు. అంతే కాకుండా.. ఉల్లి విత్తనాలను ప్రత్యేకంగా నెదర్లాండ్స్ నుంచి తెప్పించి ప్రయోగం చేశారు.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరికనాణ్యమైన విత్తనాలు ఉపయోగించి.. సహజ సిద్దమైన పద్దతులతో వ్యవసాయం చేస్తే తప్పకుండా మంచి దిగుబడి ఉంటుందని గడ్కరీ దంపతులు చెబుతున్నారు. అంతే కాకుండా.. స్థానిక రైతులకు ఈ పద్దతిపై అవగాహన కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంచన్ గడ్కరీ పేర్కొన్నారు.नागपुर के धापेवाड़ा स्थित हमारे भक्ति फार्म में मेरी पत्नी, श्रीमती कांचन ने एक अनूठा प्रयोग करते हुए, मल्चिंग पेपर तकनीक का इस्तेमाल कर एक किलो तक वज़न वाले ऑर्गेनिक प्याज़ का सफल उत्पादन किया है।#OrganicFarming #OrganicOnion #Nagpur pic.twitter.com/nTjU11anHR— Nitin Gadkari (@nitin_gadkari) May 29, 2025

విద్యుత్కు భారీ డిమాండ్: వచ్చే ఐదేళ్లలో..
విద్యుత్ డిమాండ్ ఏటా 6 శాతం నుంచి 6.5 శాతం చొప్పున (కాంపౌండెడ్గా) వచ్చే ఐదేళ్ల పాటు పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విస్తరణతోపాటు గ్రీన్ హైడ్రోజన్కు ఇస్తున్న ప్రాధాన్యం, డేటా సెంటర్ల విస్తరణ విద్యుత్ అవసరాలను అధికం చేస్తుందని పేర్కొంది.2025–26 ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో 44 గిగావాట్లుగా ఉంటుందని అంచనా వేసింది. 2024-25లో ఆల్టైమ్ గరిష్ట ఉత్పత్తి 34 గిగావాట్లుగా ఉంది. వచ్చే ఐదేళ్లలో అదనంగా ఏర్పడే డిమాండ్లో ఈ మూడు రంగాల నుంచే 20-25 శాతం వాటా ఉంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెండ్ విక్రమ్ తెలిపారు.రూఫ్టాప్ సోలార్ వినియోగం పెరుగుతుండడం, ఆఫ్ గ్రిడ్ ప్రాజెక్టుల నేపథ్యంలో గ్రిడ్ సామర్థ్య డిమాండ్ కొంత వరకు తగ్గొచ్చన్నారు. రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్లను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రస్తావించారు. 2026 మార్చి నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 520 గిగావాట్లకు చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది.2025–2026లో థర్మల్ విభాగం నుంచి 9-10 గిగావాట్ల కొత్త సామర్థ్యం అందుబాటులోకి రానుండగా.. మిగిలినదంతా పునరుత్పాదక విద్యుత్ వనరుల రూపంలో ఉంటుందని తెలిపింది. రానున్న సంవత్సరాల్లో కొత్త సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) కీలక పాత్ర పోషించనుందని పేర్కొంది. థర్మల్ విద్యుత్ విభాగం పట్ల స్థిరమైన అవుట్లుక్తో ఉన్నట్టు ఇక్రా తెలిపింది.

మరోసారి తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.24 తగ్గించాయి. కొత్త ధరలు రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు (జూన్ 1) నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయి.వాణిజ్య ఎల్పీజీ ధరలు తగ్గడం వరుసగా ఇది మూడోసారి. మే ప్రారంభంలో కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.14.50 తగ్గించాయి. అంతకు ముందు ఏప్రిల్ 1న సిలిండర్ ధర రూ.41 తగ్గింది. కాగా ఇప్పుడు రూ.24 తగ్గింది. కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గినా.. గృహాల్లో ఉపయోగించే ఎల్పీజీ ధరలలో ఎలాంటి మార్పు లేదు.19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు•ఢిల్లీ: రూ. 1723.50•కోల్కతా: రూ. 1826•ముంబై: రూ. 1674.50•చెన్నై: రూ. 1881ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

'ఇకపై ఉద్యోగాల పరిస్థితి ఇది': సర్వేలో కీలక విషయాలు
న్యూఢిల్లీ: ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు నెలకొని, ఖర్చులు విషయంలో కంపెనీలు ఆచి తూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నియామకాలు నెమ్మదించనున్నాయి. రిక్రూట్మెంట్ కార్యకలాపాల వృద్ధి (ఎన్ఈసీ) 2.8 శాతానికి పరిమితం కానుంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-మార్చి త్రైమాసికంలో ఇది 7.1 శాతంగా నమోదైంది. నియామకాల తీరుతెన్నులపై టీమ్లీజ్ సర్వీసెస్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదిక ప్రకారం 47 శాతం సంస్థలు సిబ్బందిని పెంచుకుంటామని, 28 శాతం సంస్థలు స్థిరంగా కొనసాగిస్తామని, 25 శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల నుంచి 23 పరిశ్రమలకు చెందిన 1,263 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు➤డిమాండ్ను బట్టి ఉద్యోగులను తీసుకునే ఫ్లెక్సి స్టాఫింగ్ విధానానికి 69 శాతం సంస్థలు మొగ్గు చూపాయి. దీర్ఘకాలిక వ్యయాల భారం లేకుండా, సత్వరం కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ విధానంలో వీలుంటోంది.➤హైరింగ్ వ్యూహాల్లో గిగ్ ఎకానమీకి (స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్స్ వర్కింగ్) ప్రాధాన్యం లభిస్తోంది. 64 శాతం కంపెనీలు గిగ్ విధానాల ద్వారా సేల్స్, కస్టమర్ సరీ్వస్ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.➤ద్రవ్యోల్బణం, ఎగుమతులు మందగించడం, జీడీపీ నెమ్మదించడం తదితర అంశాల కారణంగా వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు 58 శాతం కంపెనీలు తెలిపాయి. దీంతో ఉద్యోగుల సంఖ్యను ఏదో పేరుకి మాత్రమే పెంచుకోవడం కాకుండా, నిర్దిష్ట నైపుణ్యాలున్న వారినే తీసుకోవడంపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక➤76 శాతం కంపెనీలు డిజిటల్ లిటరసీకి, 68 శాతం కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్కి, 63 శాతం సంస్థలు కమ్యూనికేషన్లాంటి కీలక నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపాయి.➤ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్కి డిమాండ్ పెరుగుతుండటంతో ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు, అనుబంధ మౌలిక సదుపాయాల రంగాలు, ఈ–కామర్స్, టెక్ స్టార్టప్లు వృద్ధి చెందనున్నాయి.

ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!
ఒకటో తేదీ వచ్చిందంటే.. దాదాపు చాలా రూల్స్ మారిపోతాయి. క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి గ్యాస్ ధరల వరకు.. చాలా మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఈ రోజు (జూన్ 1) నుంచి కొన్ని ఐఫోన్లు & ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ చర్య 2025 మే 1వ తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొంచెం ఆలస్యం కావడంతో.. వినియోగదారులు తమ ఫోన్లను మార్చుకోవడానికి సమయం దొరికింది.వాట్సప్కు సపోర్ట్ చేయని మొబైల్స్..➤ఐఫోన్ 5ఎస్➤ఐఫోన్ 6➤ఐఫోన్ 6 ప్లస్➤ఐఫోన్ 6ఎస్➤ఐఫోన్ 6s ప్లస్➤ఐఫోన్ ఎస్ఈ (ఫస్ట్ జనరేషన్)➤శామ్సంగ్ గెలాక్సీ ఎస్4➤శామ్సంగ్ గెలాక్సీ నోట్ 3➤సోనీ జెడ్పీరియా జెడ్1➤ఎల్జీ జీ2➤హువావే అసెండ్ పీ6➤మోటో జీ (ఫస్ట్ జనరేషన్)➤మోటరోలా రేజర్ హెచ్డీ➤మోటో ఈ 2014జాబితాలోని అన్ని ఫోన్లు చాలా పాత వెర్షన్లు. అయితే కొన్ని ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ సాధ్యమైతే.. వాట్సప్ పనిచేసే అవకాశం ఉంది.ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం.. భద్రతా ప్రమాణాలే అని తెలుస్తోంది. యాపిల్ ఇకపై పాత iOS వెర్షన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించదు. కాబట్టి ఈ పరికరాల్లో భద్రత లోపిస్తుంది. భద్రతా లోపం సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరికగత కొన్ని నెలలుగా, వాట్సాప్ వినియోగదారుల గోప్యతను బలోపేతం చేయడం.. వ్యక్తిగత డేటాను రక్షించడం లక్ష్యంగా అనేక అప్డేట్స్ చేస్తూనే ఉంది. చాట్లు, సమూహ సంభాషణల నుంచి ఇతరులు టెక్స్ట్, ఫోటోలు లేదా వీడియోలను కాపీ చేయకుండా నిరోధిచడమే లక్ష్యంగా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకొస్తోంది. అంతే కాకుండా.. వాట్సాప్ చాట్ లాక్ వంటి మెరుగైన ఫీచర్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు పాస్వర్డ్, వేలిముద్ర లేదా ఫేస్ ఐడితో వ్యక్తిగత చాట్లను సురక్షితంగా ఉంచడానికి అనుమతిస్తుంది.
బిజినెస్ పోల్
కార్పొరేట్

విద్యుత్కు భారీ డిమాండ్: వచ్చే ఐదేళ్లలో..

మరోసారి తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

'ఇకపై ఉద్యోగాల పరిస్థితి ఇది': సర్వేలో కీలక విషయాలు

డిజిటల్ ప్లాట్ఫామ్లపై సమస్యాత్మక ప్రకటనలు

ఐపీవోల బాటలో బీఎఫ్ఎస్ఐ సంస్థలు

డేటా సెంటర్ల బూమ్..

విద్యార్థులకు రూ.కోటి ఉపకార వేతనాలు: రిలయన్స్

6000 మంది ఉద్యోగుల తొలగింపు అందుకే: సత్య నాదెళ్ళ

ఇది అమలైతే.. ఇన్సూరెన్స్ అంత ఈజీ కాదు..

బట్టలుతికే సర్ఫ్ కంపెనీ టర్నోవర్ ఎంతంటే..

మార్చి త్రైమాసిక ఫలితాలు
ద్విచక్ర ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ ...

చిన్న పట్టణాల్లోకి నిప్పన్ ఇండియా విస్తరణ
కోల్కతా: నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ చిన్న ప...

గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్,...

బంగారానికి భారీ డిమాండ్: ఆభరణాల ధరలు పైపైకి
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నా...

నోట్ల ముద్రణకు రూ.6,373 కోట్లు ఖర్చు!
గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణపై ఆర్బీ...

యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా 15–2...

లాభాలకు తగ్గట్లు జీతాలు పెంచండి
న్యూఢిల్లీ: లాభదాయకతకు అనుగుణంగా పెట్టుబడులు, ఉద్య...

వృద్ధి జోరులో మనమే టాప్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత...
ఆటోమొబైల్
టెక్నాలజీ

ఒకే స్టేటస్ ఇమేజ్లో ఆరు ఫొటోలు.. వాట్సాప్ కొత్త అప్డేట్
మెటా కంపెనీ ఆధ్వర్యంలోని ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త అప్డేట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత సమాచారంతోపాటు వేడుకలు, ఇతర జ్ఞాపకాలను ముఖ్యమైన వారితో పంచుకోవడానికి వాట్సాప్ స్టేటస్ను గతంలోనే తీసుకొచ్చింది. అయితే అందులో ఇప్పటివరకు కేవలం ఒకే ఇమేజ్ను అప్లోడ్ చేసే వీలుండేది. తాజాగా వాట్సాస్ తీసుకొచ్చిన అప్డేట్తో స్టేటస్ ఇమేజ్లో గరిష్ఠంగా ఆరు ఇమేజ్లను అప్లోడ్ చేసేలా వెసులుబాటు కల్పించింది.ఈమేరకు మే 30న కొత్త అప్డేట్ అందించింది. స్టేటస్ ద్వారా యూజర్లు మరింత సృజనాత్మకంగా తమ ఇమేజ్లను ఇతరులతో పంచుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా లేఅవుట్లు, మ్యూజిక్, ఫొటో స్టిక్కర్లు.. వంటి ఫీచర్లతో ‘యాడ్ యువర్స్’ ఆప్షన్ ద్వారా ఇమేజ్లను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.ఇదీ చదవండి: నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యంవినియోగదారులు సులభంగా ఉపయోగించేలా ఎడిటింగ్ టూల్స్తో గరిష్టంగా ఆరు ఫోటోలను ఒకే ఇమేజ్ స్టేటస్లో పొందుపరిచేలా లేఅవుట్ను రూపొందించారు. యూజర్లు ఇమేజ్లన్నింటినీ ఒకే ఫ్రేమ్లో ఎలా చూపించాలనుకుంటున్నారో సరిగ్గా అమర్చుకుంటే సరిపోతుంది. దీనికి అదనంగా మ్యూజిక్ను యాడ్ చేసుకోవచ్చు. వినియోగదారుల మానసిక స్థితిని అనుసరించి ట్యూన్ సెట్ చేయవచ్చు. దాంతోపాటు మ్యాజిక్ స్టిక్కర్ను ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించాలంటే వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఆస్టన్ మార్టిన్తో రియల్మీ జట్టు
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ, మోటార్ స్పోర్ట్ సంస్థ ఆస్టన్ మార్టిన్ ఫార్ములా వన్ టీమ్తో భాగస్వామ్యం కుదుర్చుకుని జీటీ 7 డ్రీమ్ ఎడిషన్ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా రియల్మీ ఫోన్ను ఆస్టన్ మార్టిన్ లోగోతో, విభిన్న స్టైలిష్ రంగుల్లో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం మూడేళ్లపాటు ఉంటుందని కంపెనీ పేర్కొంది.రియల్మీ ఆస్టన్ మార్టిన్ సహకారంతో ఏటా రెండు మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇది స్మార్ట్ఫోన్ పరిశ్రమలో ఫార్ములా వన్ ప్రతిష్ఠను తీసుకువస్తుందని అధికారులు తెలుపుతున్నారు. ప్రాథమికంగా ఆస్టన్ మార్టిన్ జీటీ 7 డ్రీమ్ ఎడిషన్ ఫార్ములా వన్ రేసింగ్ డిజైన్ను క్యాప్చర్ చేసేలా రూపొందించిన ఏరోడైనమిక్ బిల్డ్తో మొబైల్ను లాంచ్ చేయనున్నట్లు రియల్మీ పేర్కొంది. అందులోని ఫీచర్లు కింది విధంగా ఉండనున్నాయి.ఇదీ చదవండి: పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు..7,000 ఎంఏహెచ్ బ్యాటరీ120 వాట్ల వైర్డ్ పవర్ ఛార్జింగ్మీడియాటెక్ డైమెన్సిటీ 9400ఈ చిప్సెట్

నాన్టెక్లో టెకీలుగా దూసుకొస్తున్న మహిళలు
ముంబై: టెక్యేతర రంగాల్లో మహిళా టెకీల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. 2020 తర్వాత నుంచి ఈ ధోరణి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2020లో టెక్నాలజీ ఉద్యోగాల్లో మహిళల వాటా 1.90 శాతంగా ఉండగా, 2023లో 11.8 శాతానికి, 2024 నాటికి 14 శాతానికి పెరిగిందని టీమ్లీజ్ డిజిటల్ ఒక నివేదికలో వెల్లడించింది. 2020–2024 మధ్యకాలంలో 13,000 మంది టీమ్లీజ్ డిజిటల్ టెక్ కాంట్రాక్ట్ సిబ్బంది డేటా విశ్లేషణ ఆధారంగా దీన్ని రూపొందించారు.దీని ప్రకారం పురుషాధిక్యత ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మహిళల వాటా 2020లో 9.51 శాతంగా ఉండగా 2024లో 27.98 శాతానికి పెరిగింది. నాన్–టెక్ రంగాల్లో టెక్నాలజీపరమైన విధుల్లో మహిళల నియామకాలు మెరుగుపడుతుండటాన్ని ఇది సూచిస్తోందని రిపోర్ట్ పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. హోదాపరంగా చూస్తే సీనియర్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం 3.35 శాతానికే పరిమితం కాగా, మిడ్–లెవెల్లో 4.07 శాతంగా, ఎంట్రీ స్థాయిలో 3.03 శాతంగా ఉంది. లీడర్షిప్ హోదాలను చేరుకోవడంలో మహిళలకు ఇప్పటికీ సవాళ్లు ఎదురవుతున్నాయనడానికి ఇది నిదర్శనం. పరిశ్రమలవారీగా నైపుణ్యాల ఆధారిత విశ్లేషణ ప్రకారం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఇటు నాన్–టెక్నికల్, అటు టెక్నికల్ నైపుణ్యాల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉంది. ఇది వరుసగా 49.28 శాతం, 44.31 శాతంగా నమోదైంది. 47.32 శాతం, 34.58 శాతం వాటాతో లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్కేర్ ఆ తర్వాత స్థానంలో నిల్చింది. టెక్నాలజీయేతర రంగాల్లో టెకీ ఉద్యోగాల్లో మహిళల వాటా 14 శాతానికి చేరడమనేది సమ్మిళితత్వం పెరుగుతుండటాన్ని సూచిస్తోంది. అయితే, లీడర్షిప్ హోదాల్లో వారికి అంతగా ప్రాతినిధ్యం ఉండటం లేదు. ఈ అంతరాలను సరిచేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి. మహిళలకు కూడా అవకాశాలు ..వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా, పరిశ్రమపరమైన అవరోధాలను పరిష్కరించేలా, సిబ్బందిలో వారి సంఖ్య మరింత పెరిగేలా చూడటంపై కంపెనీలు మరింత దృష్టి పెట్టాలి.

జియో 5 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్తో..
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్ దృష్ట్యా రిలయన్స్ జియో ఒక పెద్ద అడుగు వేసింది. కంపెనీ ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. వీటిలో ఉచితంగా జియోగేమ్స్ క్లౌడ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అంటే ఖరీదైన హార్డ్వేర్ లేకుండా యూజర్లు తమ మొబైల్, పీసీ, జియో సెట్-టాప్ బాక్స్లో కన్సోల్ లాంటి గేమ్స్ను ఆస్వాదించగలరు. ఈ ప్లాన్లు రూ.48 నుంచి ప్రారంభమవుతాయి.ఏమిటీ జియోగేమ్స్ క్లౌడ్?ఇది క్లౌడ్ ఆధారిత గేమింగ్ సర్వీస్. దీని ద్వారా యూజర్లు గేమ్ను డౌన్లోడ్ చేయకుండా నేరుగా ఆన్లైన్లో ఆడవచ్చు. సాధారణంగా దీని సబ్ స్క్రిప్షన్ రూ.398. కానీ కొత్త ప్లాన్లలో ఈ సదుపాయాన్ని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జియో ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రస్తుతం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్ పెయిడ్, బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఇది అందుబాటులో లేదు.జియో కొత్త గేమింగ్ ప్లాన్స్ ఇవే..రూ.48 ప్లాన్: ఇది గేమింగ్ ప్రయత్నించాలనుకునే స్వల్పకాలిక వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ప్లాన్. ఈ ప్లాన్ 10 ఎంబీ డేటా, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ ను 3 రోజుల పాటు అందిస్తుంది.రూ.98 ప్లాన్: ఈ ప్లాన్తో 7 రోజుల పాటు 10 ఎంబీ డేటా, గేమింగ్ యాక్సెస్ లభిస్తుంది. ఇది డేటా వోచర్, కాబట్టి దీనిని ఉపయోగించడానికి యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండటం అవసరం.రూ.298 ప్లాన్: జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ తో పాటు 3 జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. ఇది కూడా డేటా వోచర్. యాక్టివ్ ప్లాన్ తో మాత్రమే ఉపయోగించవచ్చు.రూ.495 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు అందిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్, జియోసినిమా (డిస్నీ+ హాట్స్టార్ మొబైల్), ఫ్యాన్కోడ్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.రూ.545 ప్లాన్: ఇది అత్యంత ప్రీమియం ప్లాన్. 2 జీబీ రోజువారీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత 5 జీ డేటా ఇందులో లభిస్తాయి. మిగతా ఫీచర్లన్నీ రూ.495 ప్లాన్ మాదిరిగానే ఉంటాయి.
పర్సనల్ ఫైనాన్స్

ఆధార్ లాక్.. డేటా సేఫ్: ఇదిగో టిప్స్
డిజిటల్ ప్రపంచంలో.. సైబర్ మోసగాళ్లు ఎప్పుడు మన డేటా దొంగలిస్తున్నారో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఇలాంటి సమయంలో ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు, ఫేస్ స్కాన్ వంటి సున్నితమైన సమాచారంతో అనుసంధానించబడి ఉండటంతో.. చిన్న లోపం కూడా పెద్ద దుర్వినియోగానికి దారితీస్తుంది. ఆధార్ కార్డు భద్రత కోసం బయోమెట్రిక్ లాక్ చాలా ముఖ్యం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆధార్ బయోమెట్రిక్ను ఆన్లైన్లో లాక్ చేయడం ఎలా?మీ ఆధార్ బయోమెట్రిక్స్ను లాక్ చేయాలనుకుంటే.. మీకు ముందుగా వర్చువల్ ఐడీ (VID) అవసరం. మీరు UIDAI అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆధార్ సర్వీసెస్ అనే విభాగంలో 'వర్చువల్ ఐడి జనరేటర్' ట్యాబ్పై క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్ వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు.వర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకున్న తరువాత.. ఆధార్ బయోమెట్రిక్స్ను ఆన్లైన్లో లాక్ చేయడం కోసం కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి..➤యూఐడీఏఐ మైఆధార్ పోర్టల్కి వెళ్లండి.➤ఆధార్ సర్వీస్ విభాగంలో కనిపించే 'లాక్/అన్లాక్ ఆధార్' ఆప్షన్ క్లిక్ చేయండి.➤అక్కడ కనిపించే సూచనలను జాగ్రత్తగా చదివి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.➤సూచనల తరువాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే.. ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వర్చువల్ ఐడీ నెంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీ ఆధార్ బయోమెట్రిక్ విజవంతంగా లాక్ అవుతుంది. అన్లాక్ చేయడానికి కూడా ఇదే దశలను 'అన్లాక్ ఆధార్' ఆప్షన్ మీద క్లిక్ చేసి పూర్తిచేయాలి.బయోమెట్రిక్ లాకింగ్ ఉద్దేశ్యం ఆధార్ లాక్ని యాక్టివేట్ చేస్తే.. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించలేరు. గుర్తింపు ధృవీకరణ, ఆర్థిక లావాదేవీలు లేదా సిమ్ కార్డ్ జారీ కోసం అయినా, మీ ఆమోదం తప్పనిసరి అవుతుంది.ఆధార్ను పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఓటరు ఐడీలు (కొన్ని రాష్ట్రాల్లో), రేషన్ కార్డులు, మొబైల్ నెంబర్ల వంటి కీలక డాక్యుమెంట్లకు లింక్ చేస్తున్నారు. ఈ అనుసంధానం.. గుర్తింపు ధృవీకరణను క్రమబద్ధీకరించడానికి, మోసాన్ని తగ్గించడానికి, అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు లేదా సబ్సిడీలను సమర్థవంతంగా అందించడంలో సహాయపడుతుంది. కాబట్టి అలాంటి ఆధార్ డేటాను కొందరు సైబర్ నేరగాళ్లు.. మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆధార్ లాక్ చాలా అవసరం.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..ఆధార్ లాక్ చేస్తే.. మీ అనుమతి లేకుండా వేలిముద్రలు & ఐరిస్ స్కాన్ వంటి వాటిని ద్రువీకరించలేరు. మీరు అన్లాక్ చేయనంత వరకు మీ ప్రమేయం లేకుండా ఆధార్ వివరాలు భద్రంగా ఉంటాయి.

‘రూ.50 లక్షలు సంపాదించాను.. ఏం చేయాలి..?’
నా వయస్సు 55 సంవత్సరాలు. నేను వివిధ పెట్టుబడి మార్గాల ద్వారా రూ.50 లక్షలు సంపాదించాను. బ్యాంకు డిపాజిట్ రేట్లు పడిపోవడం, మార్కెట్లు అస్థిరంగా ఉన్నందున ఈ నిధులను పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన మార్గం ఏమిటి? ఈ ఏకమొత్తం ద్వారా కనీసం ఐదేళ్లలో ఎంత సంపాదిస్తాను? దినేశ్, విజయవాడమీ వయసురీత్యా సంపద భద్రంగా ఉండాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం మేలు. అయితే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడిని సృష్టించడానికి ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కొంత రిస్క్తో కూడిన అంశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ వయసు, ఐదేళ్ల టైమ్ పరిధిని దృష్టిలో ఉంచుకుని, కొంత రిస్క్ తీసుకోవడానికి అంగీకరిస్తే ఈక్విటీలో 25-30% రాబడితో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ (హైబ్రిడ్ ఫండ్స్) లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. తక్కువ అస్థిరతతో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందేందుకు ఈ ఫండ్లు సహాయపడతాయి. ఈక్విటీ పొదుపు ఫండ్లను పన్ను ప్రయోజనాల కోసం పరిశీలించవచ్చు.ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంవీటన్నింటికంటే ముందు మీ వయసురీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు ఆరోగ్యబీమా పథకం తీసుకోనట్లయితే వెంటనే ఆర్థిక సలహాదారున్ని సంప్రదించి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఏదైనా అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తితే మీ సంపద అంతా హరించుకుపోతుంది.

కొత్త ఈపీఎఫ్వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు
మే నెల ముగింపునకు వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో జూన్ నెల ప్రారంభం కాబోతోంది. దేశంలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇవి మీ పొదుపు, క్రెడిట్ కార్డు వాడకం, ప్రావిడెంట్ ఫండ్ రాబడిని ప్రభావితం చేస్తాయి. జూన్ 1 నుంచి ఏయే మార్పులు అమల్లోకి రానున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ఓ 3.0ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) జూన్ 1 నుంచి అప్గ్రేడ్ చేసిన నూతన ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థను ప్రారంభించనుంది. పీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేయడం, కేవైసీ అప్డేట్లను క్రమబద్ధీకరించడం, క్లెయిమ్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడం ఈ కొత్త విధానం లక్ష్యం. ఈపీఎఫ్ నిధులను సులభంగా, వేగంగా పొందేందుకు వీలుగా ఏటీఎం తరహా కార్డులను ప్రవేశపెట్టడం ఇందులో ప్రధాన ఆకర్షణ.క్రెడిట్ కార్డ్ రూల్స్🔸యాక్సిస్ బ్యాంక్ జూన్ 20 నుంచి క్రెడిట్ కార్డు లావాదేవీల వర్గీకరణలో సవరణలు చేయనుంది. రివార్డ్ పాయింట్లు, ఫీజు మినహాయింపులు ఏ లావాదేవీలకు వర్తిస్తాయో కొత్త అప్ డేట్ స్పష్టం చేస్తుంది.🔸కోటక్ మహీంద్రా బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్లు, ఫీజులలో జూన్ 1 నుండి మార్పులను అమలు చేస్తుంది. ఖర్చు కేటగిరీలలో సంపాదించిన రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులు రానున్నాయి. అలాగే కొన్ని క్రెడిట్ కార్డ్ ఫీజులు పెరుగుతాయి. ఇవి కార్డు రకాన్ని బట్టి మారుతాయి. సవరించిన బెనిఫిట్ లు, ఖర్చులకు అనుగుణంగా కార్డుదారులు తమ కార్డు వినియోగాన్ని మార్చుకోవాలి.ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల సవరణలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇప్పటికే తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను తగ్గించాయి. మరిన్ని బ్యాంకులు జూన్ 1 నుండి వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ప్రస్తుత రేట్లు 6.5 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉన్నందున, రేట్ల కోతకు ముందు అధిక రాబడిని పొందడానికి ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను ఇప్పుడే లాక్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.సెబీ మ్యూచువల్ ఫండ్ కటాఫ్ టైమింగ్ మార్పులుసెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జూన్ 1 నుండి ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ (ఎంఎఫ్ఓఎస్) కటాఫ్ సమయాలను సవరించనుంది. ఈ మార్పు క్లయింట్ ఫండ్స్ తాకట్టు ఆధారిత అప్ స్ట్రీమింగ్ను క్రమబద్ధీకరిస్తుంది. ఒక రోజులో మెచ్యూరిటీ అయ్యే రిస్క్ లేని ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఓవర్నైట్ ఫండ్లు సర్దుబాటు చేసిన రిడంప్షన్, లావాదేవీ సమయాలను కలిగి ఉంటాయి. ఇది నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఏవీ) లెక్కలను ప్రభావితం చేస్తుంది.

ఐటీఆర్ గడువుపై బిగ్ అప్డేట్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26కు సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్లు) దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మంగళవారం ప్రకటించింది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్), ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు ఏటా పన్ను రిటర్నుల దాఖ లుకు జూలై 31 తుది గడువుగా ఉంటోంది.సాంకేతిక సమస్యలు, ఇతరత్రా ప్రతికూల పరిస్థితుల్లో ఈ గడువును ఆదాయపన్ను శాఖ పొడిగిస్తుంటుంది. ఈ ఏడాది ఐటీఆర్లో మార్పులు చేయడంతో.. ఇందుకు సంబంధించి ఐటీ శాఖ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు, ఐటీఆర్ యుటిలిటీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీబీటీ తెలిపింది.
రియల్టీ
Business exchange section
Currency Conversion Rate
Commodities
Name | Rate | Change | Change% |
---|---|---|---|
Silver 1 Kg | 111000.00 | 0.00 | 0.00 |
Gold 22K 10gm | 89350.00 | 0.00 | 0.00 |
Gold 24k 10 gm | 97480.00 | 0.00 | 0.00 |
Egg & Chicken Price
Title | Price | Quantity |
---|---|---|
Chicken (1 Kg skin less) | 226.00 | 1.00 |
Eggs | 72.00 | 12.00 |