ప్రధాన వార్తలు
కొనసాగిన పండగ సీజన్ జోష్..
న్యూఢిల్లీ: పండుగలు అయిపోయినప్పటికీ వాహనాలకు సంబంధించి నవంబర్లోనూ ఆ జోష్ కొనసాగింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు భారీగా డిమాండ్ నెలకొంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు కూడా తోడు కావడంతో హోల్సేల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ గణాంకాల ప్రకారం హోల్సేల్ డేటాకి తగ్గట్లే ప్యాసింజర్ వాహనాలు, త్రీ–వీలర్ల అమ్మకాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్లో ఏర్పడే డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు.. డీలర్íÙప్ల దగ్గర స్టాక్స్ గణనీయంగా పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ద్విచక్ర వాహనాల రిజి్రస్టేషన్లు మాత్రం వార్షికంగా 3 శాతం మేర నెమ్మదించాయి. 2024 నవంబర్లో 26,27,617 యూనిట్లు రిజిస్టర్ కాగా ఈసారి నవంబర్లో 25,46,184 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. పండగల నెల కావడంతో అక్టోబర్లోనే భారీగా టూ –వీలర్ల కొనుగోళ్లు జరగడం, పంట సంబంధ చెల్లింపుల్లో జాప్యం, కస్టమర్లకు నచి్చన మోడల్స్ అందుబాటులో లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని ఎఫ్ఏడీఏ పేర్కొంది. బులిష్ గా పరిశ్రమ.. పంటల దిగుబడులు పటిష్టంగా ఉండటం, పెళ్లిళ్ల సీజన్లాంటి అంశాల దన్నుతో టూ–వీలర్లతో పాటు మిగతా వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరుగుతాయని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున పాలసీపరమైన సంస్కరణలు, మార్కెట్ సెంటిమెంట్లు మెరుగుపడటం లాంటి అంశాల మద్దతుతో వచ్చే ఏడాది కూడా ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని పరిశ్రమ ఆశిస్తున్నట్లు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలపరంగా ఈసారి నవంబర్ తమకు అత్యుత్తమ నెలగా గడిచిందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తెలిపింది. ‘‘గత 40 ఏళ్లలో (కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి) నవంబర్ నెలకు సంబంధించి ఈ ఏడాది అత్యుత్తమంగా గడిచింది. గత నెలలో అత్యధికంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి’’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. తమ రిటైల్ అమ్మకాలు 31% పెరిగినట్లు వివరించారు. అలాగే ఎనిమిది మోడల్స్ విషయంలో ఫ్యాక్టరీ స్థాయిలో కూడా నిల్వలు లేకుండా పూర్తిగా అమ్ముడైపోయినట్లు పేర్కొన్నారు. ఇక చిన్న కార్ల (4 మీటర్ల లోపు పొడవు, 18 శాతం ట్యాక్స్ రేటు వర్తించేవి) సంగతి తీసుకుంటే అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 38 శాతం పెరిగాయని బెనర్జీ చెప్పారు. అలాగే పెద్ద కార్ల (40 శాతం పన్ను రేటు వర్తించేవి) విక్రయాలు 17 శాతం పెరిగాయని వివరించారు. పెండింగ్లో లక్షన్నర బుకింగ్స్ .. మారుతీ సుజుకీ దగ్గర 1,50,000 వాహనాలకు బుకింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల దగ్గర మరో 1,20,000 యూనిట్లు ఉన్నాయి. వెయిటింగ్ పీరియడ్లను తగ్గించేందుకు, సకాలంలో వాహనాలను డెలివరీ చేసేందుకు సెలవు రోజుల్లో కూడా సిబ్బంది పని చేస్తున్నట్లు బెనర్జీ వివరించారు. డిసెంబర్లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అటు టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర దిగ్గజాలు కూడా నవంబర్లో భారీ అమ్మకాలు నమోదు చేశాయి. టాటా మోటర్స్ అమ్మకాలు 22 శాతం పెరిగి 57,436 యూనిట్లకు చేరాయి.
అందుకే.. పెట్రోల్ కంటే సీఎన్జీ కారు మైలేజ్ ఎక్కువ!
సాధారణంగా పెట్రోల్ కార్లు ఇచ్చే మైలేజ్ కంటే కూడా సీఎన్జీ (Compressed Natural Gas) కార్లు ఇచ్చే మైలేజ్ కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఎందుకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందనే విషయం మాత్రమే బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఇంధన రసాయన నిర్మాణంపెట్రోల్ అనేది C8H18 వంటి హైడ్రోకార్బన్ల మిశ్రమం. ఇది ఒక మధ్యస్థాయి పరిమాణం గల అణువు. అయితే సీఎన్జీలో మీథేన్ (CH4) ఉంటుంది. ఇది పరిమాణంలో చిన్నది, తేలికైంది.. కాబట్టి ఇది గాలిలో తేలికగా మండుతుంది, తద్వారా పవర్ డెలివరీ సమర్థవంతంగా సాగుతుంది. ఇది మండే సమయంలో కూడా కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెట్రోల్ అనేది సీఎన్జీతో పోలిస్తే అసంపూర్తిగా మండుతుంది. దీనివల్ల కొంత ఇంధన శక్తి వృధా అవుతుంది. కాబట్టి సీఎన్జీ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.ఎయిర్ ఫ్యూయెల్ రేషియోసీఎన్జీ వాహనాల్లో.. ఎయిర్ - ఫ్యూయెల్ రేషియో (నిష్పత్తి) 17.2:1గా ఉంటుంది. అంటే 17.2 భాగాల గాలికి, ఒక ఫ్యూయెల్ (ఇంధనం) అవసరం అవుతుంది. పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే.. ఈ రేషియో (ఎయిర్:ఫ్యూయెల్) 14.7:1గా ఉంటుంది. దీని ప్రకారం.. ఎక్కువ గాలి ఉండటం వల్ల, సీఎన్జీ పూర్తిగా మండి శక్తిని అందిస్తుంది.ఎనర్జీ కంటెంట్పెట్రోల్లో సుమారు 34.2 MJ/L ఎనర్జీ ఉంటుంది, కానీ CNGలో 1 కేజీకి 53.6 MJ ఉంటుంది (MJ-మెగాజౌల్). గ్యాస్ పరిమాణం తక్కువ కాబట్టి వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీ పెరగదు. కానీ CNG ఇంజిన్స్ ఎక్కువ కంప్రెషన్ రేషియోకి అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇది వేడి నష్టం తగ్గించి, ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది.వేడి నష్టం తక్కువCNG తక్కువ వేడి నష్టం కలిగిన ఇంధనం. కాబట్టి మండే (దహనం) సమయంలో వేడి సమర్థవంతంగా ఉపయోగిస్తే, ఇంజిన్ పనితీరు పెరుగుతుంది. పెట్రోల్ కారు కొంత శక్తిని వేడిగా వృథా చేస్తుంది. అందువల్ల పెట్రోల్ వాహనాల మైలేజ్ తక్కువ.మైలేజ్సాధారణంగా ఒక పెట్రోల్ కారు 12-15 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. సీఎన్జీ కారు 18-22 కిమీ/కేజీ అందింశింది. దీన్నిబట్టి చూస్తే.. మైలేజ్ ఏది ఎక్కువగా ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మైలేజ్ అనేది వెహికల్ డిజైన్, ట్రాఫిక్ కండిషన్, డ్రైవింగ్ వంటివాటిపై ఆధారపడి ఉంటుంది.మరో ప్రధానమైన విషయం ఏమిటంటే పెట్రోల్ కార్ల కంటే సీఎన్జీ వాహనాల పవర్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సాధారణ హైవేలు, ట్రాఫిక్ లేని రోడ్లపైన.. ఈ కార్లు మైలేజ్ కొంత ఎక్కువగానే అందిస్తాయి. కానీ ఎత్తైన రోడ్లలో ప్రయాణించే సమయంలో మాత్రం.. పెట్రోల్ కార్లు అందించినంత పవర్ డెలివరీ చేయవు.
పీక్లో గోల్డ్, సిల్వర్: డీలా పడిన ప్లాటినం!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఊహకందని రీతిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు క్రాస్ చేయగా.. కేజీ వెండి రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రెండు కాకుండా ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం వంటి విలువైన లోహాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామందికి తెలిసిన లోహాలు గోల్డ్, సిల్వర్, ప్లాటినం మాత్రమే. పెట్టుబడిదారులకు పల్లాడియం గురించి తెలుసుంటుంది.ఇతర లోహాల సంగతి పక్కన పెడితే.. బంగారం వెండి ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి. ప్లాటినం ధరలు ఎందుకు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి?.. ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా పెరిశీలిద్దాం..బంగారం ధరలు పెరగడానికి కారణాలుద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాల కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం, డిమాండుకు తగ్గ.. బంగారం సరఫరా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణాలు అవుతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులలో.. లాభనష్టాలు ఉంటాయి. కానీ బంగారం పెట్టే పెట్టుబడి భద్రంగా ఉంటుందని భావిస్తారు. ఈ కారణంగానే పెట్టుబడిదారులు.. మార్కెట్స్ కుప్పకూలినప్పుడు గోల్డ్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.వెండి ధరలు పెరగడానికి కారణాలుఈ ఏడాది వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడం ఒక కారణం అయితే.. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీలలో వెండి వినియోగం పెరిగిపోవడం కూడా మరో కారణం. నీటి శుద్ధి, వైద్య రంగం, పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలలో కూడా వెండి వినియోగం విరివిగా ఉంది. ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలలో కూడా వెండిని ఉపయోగిస్తారు.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. వెండిని పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల.. సిల్వర్ రేటు రెండు లక్షల రూపాయలు దాటేసింది.ప్లాటినం ధరలు ఎందుకు తక్కువ?➤బంగారం, వెండితో పోలిస్తే.. ప్లాటినం ధరలు చాలా తక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.➤బంగారం, వెండి ఆభరణాలకు ఉన్నంత డిమాండ్.. ప్లాటినం ఆభరణాలు లేదు.➤ప్లాటినంపై పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువ➤ఇండస్ట్రీల్ వినియోగం ఎక్కువగా ఉంది.➤ప్లాటినం ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, రష్యాలలో మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.➤డిమాండ్ తక్కువగా ఉండటం వల్లనే.. ప్లాటినం ధరలు తక్కువగా ఉన్నాయి.ఇతర లోహాలుబంగారం, వెండి మాదిరిగానే.. ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం కూడా విలువైన లోహాలు. అయితే వీటికున్న డిమాండ్ భారతదేశంలో చాలా తక్కువ. ఈ కారణంగానే వీటి ధరలు కూడా అలాగే ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది.
ఈవీ బ్యాటరీలకు భారీ డిమాండ్
భారత్లో ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ (ఈవీ బ్యాటరీ) డిమాండ్ వచ్చే ఏడేళ్లలో గణనీయంగా పెరనుందని కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (సీఈఎస్) సంస్థ అంచనా వేసింది. 2025లో ఈవీ బ్యాటరీ డిమాండ్ 17.7 గిగావాట్ హవర్ (జీడబ్యూ్యహెచ్) ఉండగా, 2032 నాటికి 256.3 గిగావాట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఏటా 35 శాతం కాంపౌండెడ్ వృద్ధి (సీఏజీఆర్) ఈ రంగంలో నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇంధన ధరలు పెరుగుతుండడం, ఎలక్ట్రిఫికేషన్ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడం, వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్, ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు విడుదల అవుతుండడం, విధానపరమైన మద్దతు అన్నీ కలసి ఈవీ మార్కెట్ భారీ వృద్ధికి అనుకూలిస్తున్నట్టు తన నివేదికలో సీఈఎస్ వివరించింది.‘‘భారతదేశ ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి బ్యాటరీ కెమిస్ట్రీ పురోగతులు కీలకమైనవి. ఎల్ఎఫ్పీ జెన్ 4, సోడియం అయాన్ టెక్నాలజీ ఆవిష్కరణలు కేవలం సాంకేతికపరమైన పురోగతులే కాదు. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అందుబాటు ధరలకు తీసుకొచ్చే సంచలనాలు. సురక్షితమైన, ఒక్కచార్జ్తో మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కల్పిస్తాయి’’అని సీఈఎస్ ఎండీ వినాయక్ వలింబే తెలిపారు. ఎల్ఎఫ్పీ జెన్4 సెల్స్ అన్నవి ఇప్పుడు 300 వాట్హవర్/కిలోని అధిగమించాయంటూ.. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు, ధరలు తగ్గేందుకు అనుకూలిస్తాయ ఈ నివేదిక తెలిపింది.సవాళ్లను అధిగమించాలి..భారత్ తన ఎలక్ట్రిఫికేషన్ (ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం) లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పరిశ్రమతో సహకారం, బలమైన బ్యాటరీ ఎకోసిస్టమ్ ఏర్పాటు, వ్యూహాత్మక పెట్టుబడుల సవాళ్లను అధిగమించేందుకు విధానపరమైన జోక్యం అవసరమని సీఈఎస్ నివేదిక సూచించింది. బ్యాటరీల్లో వినియోగించే కీలక ముడి పదార్థాలను, ఖనిజాలపై చైనా నియంత్రణలు.. భారత్లో గిగాఫ్యాక్టరీల నిర్మాణాన్ని నిదానింపజేయొచ్చని, సరఫరా వ్యవస్థ రిస్్కలకు దారితీయొచ్చని హెచ్చరించింది. అధిక ఆరంభ పెట్టుబడులకుతోడు, దేశీయంగా ఖనిజ నిల్వలు పరిమితంగా ఉండడం భారత స్వావలంబన లక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది.
తయారీ హబ్గా భారత్!
భారత్ 2047 నాటికి తయారీ దిగ్గజంగా మారాలంటే.. జీడీపీలో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 25 శాతానికి చేర్చాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), జెడ్47 సంయుక్త నివేదిక సూచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన భారత్లో తయారీ, ఆత్మనిర్భర్భారత్, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)తో దేశీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నట్టు పేర్కొంది.ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఆటోమోటివ్-ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధనం, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 2047 నాటికి 25 ట్రిలియన్ డాలర్ల అవకాశాలున్నట్టు తెలిపింది. రానున్న కాలంలో తయారీ రంగంలో భారత్ వృద్ధికి ఈ రంగాలు కీలకంగా మారనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వీటికితోడు బలమైన జీడీపీ వృద్ధి, పారిశ్రామిక మద్దతు, స్పష్టమైన విధానాలు/పెట్టుబడులతో తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీతత్వాన్ని పెంచడం, టెక్నాలజీ అమలు ద్వారా సామర్థ్యాలను విస్తృతం చేయడం ద్వారా తయారీ రంగానికి బలమైన పునాదులు వేయాలని సూచించింది.2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం కోసం.. రక్షణ, ఈవీ, సెమీకండక్టర్లకు సంబంధించి ప్రాంతీయ తయారీ క్లస్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నివేదిక పేర్కొంది. నోయిడా–చెన్నై–హోసూర్, దొలెరా కారిడార్లు ఇప్పటికే ఫలితాలను చూపిస్తున్నట్టు తెలిపింది. ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల తుది మార్కెట్ 2022లో 33 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి 117 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. రక్షణ రంగానికి 2025–26లో కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉండగా, దేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చే దశాబ్దంలో కేటాయింపులు రెట్టింపు కానున్నట్టు పేర్కొంది.
డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు..
ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రమంగా దేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు అందుబాటులో ఉన్నన్ని డీజిల్ కార్లు ప్రస్తుతం అందుబాటులో లేదు. దీనికి గల కారణం ఏమిటి?, భవిష్యత్తులో డీజిల్ కార్లు కనుమరుగవుతాయా? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన డీజిల్ కార్లు.. నేడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కంపెనీలు సైతం ఈ కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అధిక కాలుష్యం కారణంగా.. కూడా ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ కార్లను నిషేధిస్తున్నాయి.డీజిల్ కార్లు తగ్గడానికి ప్రధాన కారణాలుబీఎస్6 నిబంధనలు: 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 నిబంధనలు అమలులోకి వచ్చాయి. కంపెనీలు తయారు చేసే కార్లను తప్పకుండా ఈ నిబంధనలను అనుగుణంగా ఉండాలని, ఇంజిన్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖలు వెల్లడించాయి. పెట్రోల్ వాహనాలలో ఇంజిన్లను బీఎస్6 నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేయడం కొంత సులభమే. కానీ డీజిల్ ఇంజిన్లను కొత్త నిబంధనలకు తగ్గట్లుగా అప్డేట్ చేయడం కష్టం. దీనివల్ల ధరలు భారీగా పెరుగుతాయి. ధరలు పెరిగితే అమ్మకాలు క్రమంగా తగ్గుతాయి.కాలుష్యం: డీజిల్ కార్ల వినియోగం వల్ల.. వాతావరణంలోకి వెలువడే కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట పరిమితి దాటిన తరువాత డీజిల్ కార్ల నుంచి వెలువడే పొగ అధికంగా ఉంటుంది. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొంతవరకు నిషేధించాయి.ధరల మధ్య తేడా: చాన్నాళ్లకు ముందు.. డీజిల్, పెట్రోల్ ధరలలో తేడా ఉండేది. లీటరు పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే, డీజిల్ ధర 80 రూపాయలు వరకు ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే.. డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాల్సి ఉంటుంది.తగ్గిన అమ్మకాలు: కార్లను కొనుగోలు చేసేవారిలో కూడా చాలామంది.. పెట్రోల్, ఈవీలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. అమ్మకాలు తగ్గుతున్న కారణంగా.. కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి.ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ.. డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా మోటార్స్, టయోటా వంటి కంపెనీలతో పాటు లెక్సస్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవేళా కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తే.. కొత్త డీజిల్ కార్లు అందుబాటులో ఉండవు. బహుశా ఈ స్థితి రాదనే కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ.. ''సంఖ్య మాత్రం తగ్గుతుందనేది నిజం. పూర్తిగా డీజిల్ కార్లను కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమే''.డీజిల్ కార్లను తగ్గడానికి మరోకారణం.. కొనుగోలుదారుల ఆలోచన కూడా. ఎందుకంటే.. మారుతున్న కాలంతో పాటు వారు వినియోగించే కార్లలో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. చాలామంది యువత ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ రాష్ట్రాల్లో డీజిల్ కార్లు నిషేధం!వాయుకాలుష్యం రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న డీజిల్ కార్లను నిషేధించారు. ఈ జాబితాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొన్ని సందర్భాల్లో డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఇంజిన్ అప్డేట్ పొందిన డీజిల్ కార్ల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు.ఇదీ చదవండి: వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా?
కార్పొరేట్
కొత్త శకానికి భారత్ సారథ్యం: శాంసంగ్
తయారీ హబ్గా భారత్!
ఉద్యోగాలకు స్పేస్ టెక్ దన్ను
రిలయన్స్ రిటైల్ సీఈవోగా ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్
ప్రయాణాలకు శీతాకాలమే ఇష్టం: సర్వేలో వెల్లడైన విషయాలు
ప్రైవేటు, చిన్న బ్యాంకులపై ఫిర్యాదులు: ఆర్బీఐ
ఆద్యం హ్యాండ్వోవెన్ బ్రాండ్ అంబాసిడర్గా శోభితా ధూళిపాళ
కోర్టుకు ఎక్కిన ఇండిగో..
ఇండిగో సంక్షోభం.. నలుగురు అధికారుల సస్పెన్షన్
మాకంటూ సొంత బాట
పసిడి పిడుగు.. సిల్వర్ షాక్!! దారుణంగా ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు మరింత దూసుకెళ్లాయి. బంగ...
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
మళ్లీ ఈక్విటీ ఫండ్స్ జోరు..!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస...
రూ.3200 నుంచి.. రూ.లక్ష దాటిన గోల్డ్
బంగారం.. ఇది ఒక విలువైన లోహం. ప్రపంచంలోని చాలా దేశ...
బలహీనమైన యూరప్ అమెరికాకు అనవసరం
అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన జేపీ మోర్గా...
విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది?
మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారా? క్రెడిట్ కార...
ట్యాక్స్ అయిపోయింది.. ఇక భారీ మార్పులు వీటిలోనే..
భారీ సంస్కరణలకు సంబంధించి తదుపరి అజెండాలో కస్టమ్స్...
‘రూపాయి’ని అలా చూడొద్దు: నిర్మలా సీతారామన్
కొనసాగుతున్న రూపాయి పతనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట...
ఆటోమొబైల్
టెక్నాలజీ
డేటా సెంటర్లు.. సవాళ్లపై భారత్ నజర్ వేయాల్సిందే!
అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపడం దేశ డిజిటల్ విప్లవంలో ఒక కీలక ఘట్టం. ఇంటర్నెట్, క్లౌడ్ సేవలు, కృత్రిమ మేధస్సు (AI), ఆన్లైన్ చెల్లింపులు (UPI), ఈ-కామర్స్ వంటి ఆధునిక డిజిటల్ సేవలకు డేటా సెంటర్లు మూలస్తంభాలు. భారతదేశంలో ప్రస్తుతం డేటా సెంటర్ల సంఖ్య ప్రపంచంలోని వాటితో పోలిస్తే అతి తక్కువగా (కేవలం 3% వాటా) ఉన్నప్పటికీ 2030 నాటికి వీటి సామర్థ్యం పెరుగుతుందని అంచనా. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి కొన్ని కీలకమైన పర్యావరణ, మౌలిక సదుపాయాల సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది.డేటా సెంటర్ల ఏర్పాటుతో లాభాలుడేటా సెంటర్ల కోసం భారత్లోకి దాదాపు రూ.2.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. మల్టీనేషనల్ కంపెనీల నుంచి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో డిమాండ్ పెరిగి అనుబంధ రంగాలకు లబ్ధి చేకూరుతుంది. ఐటీ, నెట్వర్క్ నిర్వహణ, భద్రత, నిర్వహణ వంటి రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి.సప్లయ్ చైన్, రవాణా, హోటల్ వంటి సేవల రంగాలలో పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్ల అవసరాల కోసం ఫైబర్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా వ్యవస్థలు మెరుగుపడతాయి. ఇది స్థానిక స్టార్టప్లు, చిన్న వ్యాపారాలకు మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించి, టెక్నాలజీ రంగంలో పురోగతికి దోహదపడుతుంది.డేటా స్థానికీకరణ ద్వారా భారతీయ డేటా భద్రత మెరుగుపడుతుంది.సవాళ్లు లేవా..?డేటా సెంటర్ల కోసం విద్యుత్, నీరు చాలా అవసరం. భారతదేశంలో ఇప్పటికే ఈ వనరుల లభ్యత, వినియోగంపై ఆందోళనలు ఉన్నాయి. డేటా సెంటర్లలో సర్వర్లు నిరంతరం పనిచేయడం వల్ల భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని చల్లబరచడానికి, సర్వర్లకు శక్తిని అందించడానికి అధిక విద్యుత్ అవసరం. భారతదేశం అధికంగా థర్మల్ విద్యుత్పై ఆధారపడుతున్నందున డేటా సెంటర్ల ఏర్పాటుతో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.పెద్ద డేటా సెంటర్లు పట్టణ విద్యుత్ సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెంచి విద్యుత్ కొరతకు దారి తీయవచ్చు. అయితే గూగుల్ వంటి కంపెనీలు తమ సెంటర్లకు పునరుత్పాదక శక్తి (Green Energy)వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం సానుకూల అంశం. అయితే, మొత్తం డిమాండ్ను థర్మల్ విద్యుత్ నుంచి పునరుత్పాదక ఇంధనానికి మార్చడం తక్షణ సవాలు. దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా ప్రభుత్వాలు, కంపెనీలు చర్యలు తీసుకోవాలి.నీటి నిర్వహణసర్వర్ల వేడిని తగ్గించడానికి శీతలీకరణ (Cooling) ప్రక్రియకు లక్షలాది లీటర్ల నీరు అవసరం. గూగుల్ వంటి సంస్థలు వార్షికంగా బిలియన్ల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నట్లు అంచనాలున్నాయి. ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు, వ్యవసాయానికి నీటి లభ్యతపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కంపెనీల నుంచి నీటి వినియోగంపై పారదర్శకత లేకపోవడం, నియంత్రణ సంస్థల నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం ఈ సమస్యను మరింత పెంచుతుందని గుర్తుంచుకోవాలి.సింగపూర్, అమెరికాలో వ్యతిరేకతసింగపూర్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ దేశాల్లో డేటా సెంటర్ల విస్తరణను ప్రజలు, పర్యావరణవేత్తలు పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు భారతదేశంలోని సమస్యల తరహాలోనే ఉన్నాయి. అధిక విద్యుత్ వినియోగం కోసం శిలాజ ఇంధనాలపై ఆధారపడినప్పుడు కార్బన్ ఉద్గారాలను పెంచుతుండడం. స్థానిక నీటి వనరులపై ఒత్తిడి పెంచి, ఇతర అవసరాలకు కొరత ఏర్పరచడం.అంతా ఆటోమేషన్..డేటా సెంటర్ల నిర్వహణ ఆటోమేటెడ్గా ఉంటుంది. దాంతో ఉద్యోగాలు ఎక్కువగా రాకపోవడం, ఆర్థిక ప్రయోజనం స్థానికులకు తక్కువగా ఉండటంతో ఇప్పటికే ఇవి ఉన్న ప్రాంతాల్లో వ్యతిరేకత నెలకొంటుంది. ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలించి అందుకు తగిన విధంగా పాలసీను రూపొందించాలి. సాంకేతిక పురోగతికి డేటా సెంటర్లు అవసరమే అయినా, వనరుల స్థిరత్వం, పర్యావరణ భద్రత విషయంలో దీర్ఘకాలిక ప్రణాళిక చాలా అవసరం.ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
టెక్ దిగ్గజాల పెట్టుబడులజోరు..
సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ మెగా హబ్గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. భారత్ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా భారత్ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్–బు టాన్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్ సైతం భారత్పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్ దిగ్గజం గూగుల్ .. వైజాగ్లో డేటా సెంటర్పై 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఓపెన్ఏఐ కూడా భారత్లో డేటా హబ్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్లో గూగుల్ ఏఐ, డేటా సెంటర్ హబ్తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్ బూమ్తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్
దేశంలోనే తొలి ఇంక్యుబేటర్ లింక్డ్ వీసీ ఫండ్ ప్రారంభం
దేశ ఆవిష్కరణల విభాగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఐఐటీ బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్(SINE) దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించింది. ‘వై-పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్’గా పిలువబడే ఈ ఫండ్ను మొత్తం రూ.250 కోట్ల పరిమాణంతో ప్రారంభ దశలో ఉన్న డీప్ టెక్ స్టార్టప్లకు క్యాపిటల్ను అందించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు.దీని ద్వారా ఐఐటీ బాంబే దేశంలో తన సొంత వెంచర్ క్యాపిటల్ ఫండ్ను నిర్వహించే మొదటి అకడమిక్-అనుబంధ టెక్నాలజీ ఇంక్యుబేటర్గా అవతరించింది. హై-పొటెన్షియల్ స్టార్టప్లకు ఇంక్యుబేషన్, మెంటార్షిప్ సేవలు అందిస్తున్న ఎస్ఐఎన్ఈకు ఈ ఫండ్ ఎంతో తోడ్పడుతుందని ఐఐటీ బాంబే తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ నిధి దాదాపు 25 నుంచి 30 స్టార్టప్లకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఒక్కో స్టార్టప్కు గరిష్టంగా రూ.15 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందుతుంది.విస్తృత రంగాలకు మద్దతురొబోటిక్స్, మెటీరియల్ సైన్సెస్, అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్పేస్ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ వంటి కీలక డీప్ టెక్ రంగాల్లో పనిచేసే స్టార్టప్లకు వై-పాయింట్ ఫండ్ మద్దతు అందిస్తుంది. ముఖ్యంగా ఐఐటీ బాంబే రిసెర్చ్ ఎన్విరాన్మెంట్, టెక్ ల్యాబ్లు, వ్యవస్థాపక నెట్వర్క్ల నుంచి ఉద్భవించే కంపెనీలకు ఇది చేదోడుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇతర ప్రీమియర్ అకడమిక్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల నుంచి వచ్చే డీప్ టెక్ స్టార్టప్లకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ
హైదరాబాద్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభం
హైదరాబాద్: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్లోని టి-హబ్లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ను ప్రారంభించాయి. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న స్టార్టప్, ఇన్నోవేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే ఈ కేంద్రం.. భారతదేశంలోనే ఈ తరహాలో తొలి హబ్గా నిలిచింది. ప్రాంతీయ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి వనరులు, నైపుణ్యం, నెట్వర్క్ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఏం చేస్తుందీ కేంద్రం?తెలంగాణలోని ఏఐ-ఫస్ట్ స్టార్టప్లను ఎంపిక చేసి, వారికి ఏడాది పొడవునా ఉచిత కో-వర్కింగ్ సౌకర్యాలు, గూగుల్ నిపుణుల మెంటర్షిప్, వెంచర్ ఇన్వెస్టర్లతో కనెక్షన్ వంటి అవకాశాలను హబ్ అందిస్తుంది. సాంకేతిక ప్రతిభను పెంపొందించడం, గ్లోబల్ మార్కెట్లకు యాక్సెస్ కల్పించడం, బాధ్యతాయుతమైన ఏఐ ఆధారిత వ్యాపారాల్ని నిర్మించడంలో స్టార్టప్లకు దోహదపడడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.గూగుల్ ఫర్ స్టార్టప్స్ గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ఈ హబ్, ఆలోచనల దశ నుండి స్కేలింగ్ దశ వరకు స్టార్టప్ల ప్రయాణానికి తోడ్పాటు అందిస్తుంది. వర్ధమాన వ్యవస్థాపకులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ఏఐ నైపుణ్యం, మెంటర్షిప్, ప్రోడక్ట్, యూఎక్స్ గైడెన్స్తో పాటు కమ్యూనిటీ ఈవెంట్స్, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా ఎంట్రాప్రెన్యూర్లు, టైర్-2 ఆవిష్కర్తలు, విశ్వవిద్యాలయ ప్రతిభకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఈ హబ్ ప్రత్యేకత.తెలంగాణకు పెద్ద అడుగుగూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ అతిథిగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణను ప్రపంచ పోటీతత్వ ఆవిష్కరణ కేంద్రంగా మార్చడానికి ఇది మౌలిక సదుపాయాలకన్నా పెద్ద అడుగు. హైదరాబాద్లో రూపొందుతున్న ఆలోచనలకు ప్రపంచ వ్యాప్తి కల్పించే మార్గదర్శకత్వం, సాంకేతికత, మార్కెట్ యాక్సెస్ను గూగుల్ హబ్ అందిస్తుంది” అన్నారు.గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. “గూగుల్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాల నుండి ఆండ్రాయిడ్, ప్లే, ప్రకటనలు, డెవలపర్ ప్రోగ్రామ్ల వరకు గూగుల్ పూర్తి మద్దతును తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్కు అందిస్తున్నాము. ఈ హబ్ భారత్తో సహా ప్రపంచమంతటికీ బాధ్యతాయుత ఏఐ ఆధారిత డీప్-టెక్ పరిష్కారాలను రూపొందించడంలో స్టార్టప్లకు సహాయపడుతుంది” అన్నారు.
పర్సనల్ ఫైనాన్స్
పదేళ్లలో రూ.300 లక్షల కోట్లు!
రిటైల్ ఇన్వెస్టర్ల అండతో దేశంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మరింత విస్తరించనుంది. ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) వచ్చే పదేళ్ల కాలంలో గణనీయంగా పెరగునున్నట్టు గ్రో, బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక అంచనా వేసింది. 2025 అక్టోబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఏయూఎం రూ.79.88 లక్షల కోట్లుగా ఉంటే, 2035 నాటికి రూ.300 లక్షల కోట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఇందులో డైరెక్ట్ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ రూ.250 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది.డిజిటల్ ప్లాట్ఫామ్ల విస్తరణ, పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో 10 శాతం గృహాలే మదుపు చేస్తుండగా, వచ్చే దశాబ్ద కాలంలో 20 శాతానికి విస్తరించనున్నట్టు అంచనా వేసింది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ నుంచి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడం, డిజిటల్ సాధనాల వ్యాప్తి, బలమైన మార్కెట్ పనితీరు ఇందుకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. డెరివేటివ్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కట్టడికి సెబీ ఇటీవలి కాలంలో తీసుకున్న కఠిన చర్యలను ప్రస్తావించింది. ఇవి సైతం ఫండ్స్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. కొత్తగా 9 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లు జెన్ జెడ్, మిలీనియల్స్ నుంచి వస్తారంటూ.. ఇందుకు పెరుగుతున్న డిజిటల్ వినియోగం, పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యతను ప్రస్తావించింది.దీర్ఘకాల దృక్పథం..ఇన్వెస్టర్లలో దీర్ఘకాల పెట్టుబడుల ధోరణి బలపడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐదేళ్లకు పైగా ఫండ్స్లో కొనసాగిస్తున్న పెట్టుబడులు 7 శాతం నుంచి 16 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. అంతేకాదు ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు సైతం 12 శాతం నుంచి 21 శాతానికి పెరిగినట్టు నిదర్శనాలుగా పేర్కొంది. గత ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు (ఒక పథకంలో పెట్టుబడికి కేటాయించే సంఖ్య) రెండున్నర రెట్లు పెరిగా యని వెల్లడించింది. ఫోలియోలు గణనీయంగా పెరిగినప్పటికీ పెట్టుబడుల రాక కేవలం 7 శాతమే పెరగడం వెనుక, కొత్త ఇన్వెస్టర్లు తక్కువ మొత్తం పెట్టుబడులతో వస్తుండడాన్ని కారణంగా ప్రస్తావించింది. ‘‘సిప్ పెట్టుబడులు ఏటా 25 శాతం చొప్పున గత దశాబ్ద కాలంలో పెరుగుతూ వచ్చాయి. 30 ఏళ్లలోపు వయసున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు 40 శాతానికి చేరారు. 2018–19 నాటికి 23 శాతంగానే ఉన్నారు’’అని ఈ నివేదిక వివరించింది. భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రయాణంలో రిటైల్ పెట్టుబడులు ప్రధాన చోదకం కానున్నాయని, ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ వ్యాప్తంగా 7 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. ఫండ్స్-ఈక్విటీలకు ప్రాధాన్యం..సంప్రదాయ పొదుపు సాధనాల నుంచి పెట్టుబడుల ఆధారిత సాధనాల వైపు ఇన్వెస్టర్లు క్రమంగా మళ్లుతున్నారని బెయిన్ పార్ట్నర్ సౌరభ్ ట్రెహాన్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు ఇటీవలి కాలంలో వేగవమంతైన వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ‘‘భారతీయులు ‘తొలుత పొదుపు నుంచి ముందుగా పెట్టుబడి పెట్టు’ మనస్తత్వానికి మారుతున్నట్టు గుర్తించామని గ్రో సహ వ్యవస్థాపకుడు హర్ష జైన్ తెలిపారు.
అతిపెద్ద ఆర్థిక పతనం వస్తోంది.. ఇది ఎనిమిదో పాఠం
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పతనం” దిశగా సాగుతోందని సోషల్ మీడియాలో వరుస పోస్ట్లు చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెబుతున్నారు. అందులోభాగంగా ఎనిమిదో పాఠాన్ని తాజాగా ‘ఎక్స్’లో పంచుకున్నారు.చరిత్ర చూడండి..ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.ఈ పరిణామాలు ప్రపంచాన్ని “రుణ ఆర్థిక వ్యవస్థగా” మార్చాయని, దీని ఫలితంగా అమెరికా జపాన్ వంటి దేశాలు భారీ రుణభారంతో సతమతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డునపడుతున్నారన్నారు.కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం వెండి విదేశాల్లో నిల్వ చేస్తానని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణెం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకొనే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుందని అన్నారు.ఫెడ్ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలంప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వ్నేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి లను “దేవుని సొమ్ము”గా.. బిట్కాయిన్, ఈథీరియంను “ప్రజల డబ్బు”గా కియోసాకి అభివర్ణించారు.ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా, సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని కియోసాకి పునరుద్ఘాటించారు. “వాళ్లే విజేతలు” అని, “ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది” అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు.స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడంలేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికివారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ, బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ, రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళన ఉన్న పలువురికి ఆయన సందేశం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. LESSON # 8: How you can get richer as the world economy collapses.CRASHES do not happen over night.CRASHES take decades to occur.For Example:Silver crashed in 1965: when the US government turned silver coins into fake coins…. Violating Greshams Law which stated when…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 10, 2025
22..? 24..? ఏది మంచిది?
ఫైనాన్షియల్ వ్యవహారాలపై చాలామందికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. దాంతో పెద్దగా రాబడులు రాని విధానాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో భారీగా నష్టపోతుంటారు. ఈక్రమంలో ఏది మేలో.. ఏది కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంగారం, బ్యాంకులు, రియల్టీ, స్టాక్ మార్కెటు, మ్యూచువల్ ఫండ్స్.. వంటి ఎన్నో సాధనాల్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి చాలానే ప్రశ్నలుంటాయి. వీటిలో కొన్నింటిపై నిపుణులు ఇస్తున్న సమాధానాలు చూద్దాం.బంగారంతరచూ బంగారంలో 22 కేరెట్లు, 24 కేరెట్లు అంటుంటారు కదా! ఏది మంచిది?ఆభరణాల కోసమైతే 22 కేరెట్ల బంగారాన్ని కొంటే సరిపోతుంది. అలాకాకుండా ఇన్వెస్ట్ చేయడానికైతే 24 కేరెట్ల బంగారమే బెటర్. దీన్లో తరుగు ఉండదు కాబట్టి స్వచ్ఛమైన 24 కేరెట్ల బంగారమైతే ఎప్పుడు విక్రయించినా అప్పుడు మార్కెట్లో ఉన్న రేటు మనకు లభిస్తుంది. సాధారణంగా కాయిన్లు, బిస్కెట్ల వంటివి 24 కేరెట్లలోనే లభిస్తుంటాయి. ధర కూడా 22 కన్నా 24 కేరెట్లు కాస్త ఎక్కువ ఉంటుంది. కొందరైతే ఆభరణాల కోసం 18 కేరెట్ల బంగారాన్ని కూడా వాడతారు. ఇది మరికొంత చౌక.స్టాక్ మార్కెట్లు..ఈ ఏడాది చాలా ఐపీఓలు వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఇలాగే రావచ్చేమో. మరి 2026లో ఐపీఓల్లో పెట్టుబడి పెట్టవచ్చా?ఈ మధ్య కాలంలో చాలా ఐపీఓలు అత్యధిక ధర వద్ద ఇష్యూకు వస్తున్నాయి. లిస్టింగ్ నాడు లాభాలొస్తున్నా... అది దైవాదీనమనుకోవాలి. ఎందుకంటే చాలా ఐపీఓలు లిస్ట్ అయిన నెల–రెండు నెలలకే నేల చూపులు చూస్తున్నాయి. కాబట్టి ఏ ఐపీఓలో పెట్టుబడి పెట్టినా కంపెనీ ఫండమెంటల్స్ చూడండి. ఫండమెంటల్స్ బాగుండి, ఆ వ్యాపారానికి భవిష్యత్ ఉందనిపిస్తే పెట్టండి. దీర్ఘకాలానికైనా పనికొచ్చేలా ఉండాలి.రియల్టీ..నేనో స్థలం కొందామనుకుంటున్నాను. గేటెడ్ కమ్యూనిటీలో అయితే మంచిదా... లేకపోతే మామూలు సింగిల్గా ఉండే ప్లాటయితే మంచిదా?ప్లాట్ల విషయానికొచ్చినపుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉండే స్థలానికున్న రక్షణ బయట సింగిల్గా ఉండే స్థలాలకు ఉండదు. కబ్జాలకు అవకాశం తక్కువ. కాకపోతే స్థలమన్నది ఎక్కడ కొన్నా ముందుగా చెక్ చేసుకుని కొనటం తప్పనిసరి. గేటెడ్ అయితే రీసేల్ కాస్త సులువుగా అవుతుంది. దీనికోసం 10–20 శాతం ధర ఎక్కువ పెట్టాల్సి వచ్చినా పర్వాలేదు. బ్యాంకింగ్..నేను భవిష్యత్ లక్ష్యాల కోసం క్రమానుగత ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేయటం మంచిదా... మ్యూచువల్ ఫండ్స్ మంచివా? దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసేటపుడు మ్యూచ్వల్ ఫండ్స్ను ఎంచుకోవటమే సరైన నిర్ణయం అనిపిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి షేర్ మార్కెట్కు ఉంటుంది. పైపెచ్చు ఆర్డీతో పోలిస్తే దీర్ఘకాలానికి ఫండ్లే మంచి రాబడినిస్తాయి. ఆర్డీ సురక్షితమే అయినా రాబడి తక్కువ. స్వల్పకాలానికైతే అది మంచిది.ఫండ్స్...నేను మ్యూచువల్ పండ్స్లో పెట్టుబడి పెడుతున్నాను. ప్రస్తుతం నా పోర్ట్ఫోలియోలో 22 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇది మంచిదేనా? అసలు ఎన్ని ఫండ్స్ ఐతే బెటర్?వాస్తవానికి అన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని ఫండ్ల పనితీరూ ఒక్కలా ఉండదు. ఇలా పెట్టడమంటే షేర్లలో పెట్టినట్లే. షేర్లలో పెట్టుబడి పెడితే రిస్కు ఎక్కువనే కదా మీరు మ్యూచువల్ ఫండ్లు ఎంచుకున్నది. మరి ఇన్ని ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే అన్నింటి పనితీరునూ ఎప్పటికపుపడు గమనిస్తూ వెళ్లగలరా? అందుకే నా సూచనేమిటంటే కనిష్టంగా 3, గరిష్ఠంగా 5 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.ఇన్సూరెన్స్...క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే ఏంటి? ఎంతవరకూ ఉపకరిస్తుంది? అది తీసుకోవటం మంచిదేనా? మంచిదే. మీ ఆరోగ్య బీమా ప్రీమియానికి కొంత మొత్తాన్ని జోడించటం ద్వారా ఈ రైడర్ను తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కేన్సర్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, మేజర్ అవయవ మారి్పడి వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాస్తవంగా ఆసుపత్రి బిల్లు ఎంతయిందనే అంశంతో సంబంధం లేకుండా ఇన్సూర్ చేసిన మొత్తాన్ని కంపెనీ మీకు చెల్లించేస్తుంది. ఆ మొత్తాన్ని మీరు చికిత్సకు, రికవరీకి, ఈ మధ్యలో చెల్లించాల్సిన ఈఎంఐల వంటి ఖర్చులు వాడుకోవచ్చు. ఊహించని వ్యాధులొచ్చినపుడు ఈ రైడర్ వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటమనేది తప్పుతుంది. కాబట్టి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ను తీసుకోవటం సరైనదే.ఇదీ చదవండి: ఇండిగో కొంప ముంచింది ఇదే..
అంత క్యాష్ కనిపించిందా.. కొరడానే!
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ మార్పులు వ్యక్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ నిర్వహించే రోజువారీ నగదు ప్రవాహంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.కొత్త నిబంధనల ప్రకారం, లెక్కల్లో చూపని నగదుపై జరిమానాలు, సర్ఛార్జీలు, సెస్సులు కలిసి మొత్తం 84% వరకు పన్ను భారం పడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించారు.అహుజా పేర్కొన్నట్లుగా, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా స్వాధీనం సందర్భాల్లో వ్యక్తి వద్ద లెక్కలు లేని నగదు పట్టుబడితే ఈ అధిక పన్ను రేటు వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త మార్పుల నేపథ్యంలో ఇటు వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు నగదు వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.కొత్త నిబంధనలు ఇవే..కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తాల నగదు లావాదేవీలను నిశితంగా పర్యవేక్షించనున్నాయి.ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.రూ. 20 లక్షలకు పైగా ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు తక్షణమే టీడీఎస్ (TDS) కట్ చేస్తాయి.తరచుగా పెద్ద మొత్తాల నగదు ఉపసంహరణలు జరిగితే, వాటి మూలం అనుమానాస్పదంగా కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా జప్తు చర్యలు కూడా ప్రారంభించవచ్చు.వీటికి 100% జరిమానా తప్పదుకొన్ని ప్రత్యేక నగదు లావాదేవీలపై ఇకపై 100 శాతం జరిమానా వర్తించనుంది. అటువంటి లావాదేవీలు ఇవే..స్థిరాస్తి విక్రయం సమయంలో రూ. 20,000 కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే, ఆ మొత్తంపైనే 100% జరిమానా ఉంటుంది.ఒకే రోజులో ఒక కస్టమర్ నుండి రూ. 2 లక్షలకు పైగా నగదు అందుకుంటే ఆ మొత్తంపైనే జరిమానా విధిస్తారు.వ్యక్తులు నగదు రూపంలో రుణాలు పొందడం ఇకపై పూర్తిగా నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే రుణ మొత్తం అంతటిపై 100% జరిమానా పడుతుంది.ఈ జాగ్రత్తలు అవసరంప్రభుత్వం కట్టుదిట్టమైన నగదు నియంత్రణ వ్యవస్థను నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరంపెద్ద మొత్తాల నగదు లావాదేవీలు తప్పకుండా బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా జరపాలి.నగదు రసీదులు స్పష్టమైన ఆధారాలతో ఉండాలి.అక్రమ, లెక్కల్లో లేని నగదు ఖచ్చితంగా గణనీయమైన పన్ను భారం, జరిమానాలు తెచ్చిపెడుతుంది.


