Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

DNPA taken stance on the use of copyrighted content by generative AI1
కాపీరైట్‌ కంటెంట్‌ వాడితే మూల్యం చెల్లించాల్సిందే..

కృత్రిమ మేధ (ఏఐ) నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కాపీరైట్ కంటెంట్‌ను ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు కాపీరైట్ చట్టం నిబంధనలు పరిశీలించాలనేలా ఇటీవల కేంద్రం చూపిన చొరవను డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్‌పీఏ) స్వాగతించింది. ఈ వ్యవహారానికి సారథ్యం వహిస్తున్న వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) విభిన్న సోర్స్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీల్లో ప్రస్తుత కాపీరైట్ ఫ్రేమ్‌వర్క్‌లు ఎలా వర్తిస్తాయో అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ, సెర్చ్ అసిస్టెన్స్, ఇన్ఫర్మేషన్ ప్రయోజనాల కోసం డిజిటల్ న్యూస్ పబ్లిషర్ల కంటెంట్‌ను అనుమతి లేకుండా ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎన్‌పీఏ తెలిపింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడే మెటీరియల్‌ కోసం కంటెంట్ ఉత్పత్తిదారులకు న్యాయమైన నష్టపరిహారాన్ని నిర్ధారించే రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లు ఉండాలని పిలుపునిచ్చింది.ఇదీ చదవండి: అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌ సేవలుదేశంలో డిజిటల్ న్యూస్ మీడియా వృద్ధికి ప్రభుత్వ సహకారం చాలా ముఖ్యం అని డీఎన్‌పీఏ పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. లార్జ్‌ ల్యాంగ్వేజీ మోడళ్లు, ఏఐ ఆధారిత సెర్చ్‌ వేదికలు తరచూ జర్నలిజం మెటీరియల్‌పై ఎక్కువగా ఆధారపడుతున్న సమయంలో కంటెంట్ హక్కుల రక్షణ చాలా కీలకమని నొక్కి చెప్పింది. మెషీన్ లెర్నింగ్ వేగంగా వృద్ధి చెందుతున్న యుగంలో మేధో సంపత్తిని ఎలా కాపాడుకోవాలనే దానిపై ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వార్తా సంస్థలు, క్రియేటివ్‌ ఇండస్ట్రీ సంస్థలు ఆందోళనలు లేవనెత్తుతున్నాయి.

Stock market updates on June 23, 20252
యుద్ధంలో యూఎస్‌ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 270 పాయింట్లు నష్టపోయి 24,841కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 901 ప్లాయింట్లు తగ్గి 81,507 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టివేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇటీవల ఇరాన్‌ అణు స్థావరాలపై దాడికి పాల్పడడమే అందుకు కారణమని చెబుతున్నారు.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.99బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 76.94 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.22 శాతం తగ్గింది.నాస్‌డాక్‌ 0.51 శాతం నష్టపోయింది.ఇదీ చదవండి: అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌ సేవలుసుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్‌ జోన్‌)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్‌ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్‌ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Amazon Diagnostics Brings At Home Lab Testing to Indian Metros3
అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌ సేవలు

అమెజాన్‌ ఇండియా డయాగ్నోస్టిక్స్‌ సేవలను ప్రారంభించింది. ఇంటి నుంచే కస్టమర్లు ‘అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌’ ద్వారా తమకు కావాల్సిన ల్యాబ్‌ టెస్ట్‌లను బుక్‌ చేసుకోవచ్చని, డిజిటల్‌ రిపోర్ట్‌లను అమెజాన్‌ యాప్‌ నుంచి పొందొచ్చని ప్రకటించింది. ఆరంజ్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ సహకారంతో ఈ సేవలను తొలుత హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై పరిధిలో 450 పిన్‌కోడ్‌ల వ్యాప్తంగా అందిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: స్టార్‌ రేటింగ్‌ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?వినియోగదారులు నేరుగా అమెజాన్ యాప్ ద్వారా పరీక్షలను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన 60 నిమిషాల్లో సదరు మెడికల్‌ సిబ్బంది ఇంటికి వచ్చి టెస్టింగ్‌ కోసం శాంపిల్స్‌ సేకరించుకుంటారు. నమూనాలు సేకరించిన తర్వాత గరిష్టంగా 6 గంటల్లో ఫలితాలకు సంబంధించిన డిజిటల్ ల్యాబ్ రిపోర్టులుగా అందజేస్తారు. మొత్తం 800 వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆఫర్‌ చేస్తున్నట్టు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. దీంతో కలిపి ప్రస్తుత ఫార్మసీ, క్లినిక్‌ సేవలను అమెజాన్‌ మెడికల్‌తో అనుసంధానించింది.

Ratings of mutual funds really hepfull or not? Youth Finance4
స్టార్‌ రేటింగ్‌ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?

నా వయసు 30. ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేస్తున్న ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకం స్టార్‌ రేటింగ్‌ 4 నుంచి 3కు తగ్గింది. ఈ పెట్టుబడులను విక్రయించి టాప్‌ స్టార్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలా..? లేక ప్రస్తుత పథకం నుంచి సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో వెనక్కి తీసుకుని వేరొక పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవాలా? – రాజ్‌దీప్‌మ్యూచువల్‌ ఫండ్స్‌లో 3 స్టార్‌ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కాదు. ఎందుకంటే 3 స్టార్‌ రేటింగ్‌ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్‌ రేటింగ్‌ తగ్గడం ఒక్కదాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్‌ చార్జీలు పడుతుంటే లేదా ప్రస్తుత పథకంలో పెట్టుబడులను ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం కారణంగా మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వచ్చినట్లయితే అప్పుడు.. క్రమానుగతంగా (సిస్టమ్యాటిక్‌గా) వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. ఇదీ చదవండి: ఎఫ్‌డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకుని కొత్తగా ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్‌ చేయడం కూడా ఒక మార్గమే. ముందుగా ఎగ్జిట్‌ లోడ్‌ లేని, దీర్ఘకాల మూలధన లాభం పన్ను వర్తించని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తద్వారా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు.

Alternatives that balance returns risk and flexibility than FD5
ఎఫ్‌డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?

నా వయసు 74 ఏళ్లు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ త్వరలోనే గడువు తీరనుంది. దీని ద్వారా రూ.25 లక్షలు చేతికి రానున్నాయి. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ప్రభుత్వ పథకాలు అయిన సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌), పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (ఎంఐఎస్‌)లో నాకు పెట్టుబడులు ఉన్నాయి. – నదీమ్‌మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్‌డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్‌ అస్థిరతలతో ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌లో అంత అస్థిరతలు ఉండవు. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్, ఆర్బిట్రేజ్‌ అవకాశాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్‌లోనూ రిస్క్‌ ఎక్కువే. కాకపోతే ఐదేళ్లు అంతకుమించిన కాలంలో రిస్క్‌ చాలా తక్కువ. ఇదీ చదవండి: ‘19 ఏళ్ల కిందట భూమి అ‍మ్మారు.. నాకేం తెలియదు’షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ మరోక ఆప్షన్‌. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మాదిరే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లోనూ రాబడులు ఉంటాయి. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్‌సీఎస్‌ఎస్‌ పథకాల్లో మీకు ఇప్పటికే పెట్టుబడులు ఉన్నాయి. వీటి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడిని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ మెరుగైన ఆప్షన్‌ . ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌కు వెళ్లొచ్చు.

India ramps up oil imports from Russia, U.S6
రష్యా నుంచి పెరిగిన చమురు దిగుమతులు 

న్యూఢిల్లీ: రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులను భారత్‌ గణనీయంగా పెంచుకుంది. జూన్‌ నెలలో మధ్యప్రాచ్యం, గల్ఫ్‌ దేశాల కంటే రష్యా నుంచే అధిక చమురు దిగుమతి కావడం గమనార్హం. మొత్తం మీద ఈ నెలలో రోజువారీ 2–2.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ ‘కెప్లెర్‌’ వెల్లడించింది. గత రెండేళ్ల కాలంలో రష్యా నుంచి ఈ స్థాయి దిగుమతులు తిరిగి ఈ నెలలోనే అధికమయ్యాయని వివరించింది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌కు మించి రష్యా నుంచి దిగుమతులే అధికంగా ఉన్నట్టు తెలిపింది. మే నెలలో రష్యా నుంచి చమురు దిగుమతులు రోజువారీగా 1.96 మిలియన్‌ బ్యారెల్స్‌గా ఉన్నాయి. మరోవైపు అమెరికా నుంచి ఈ నెలలో రోజువారీ 4,39,000 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా, గత నెలలో ఇది 2,80,000 బ్యారెల్స్‌గానే ఉండడం గమనార్హం. మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు ఈ నెల మొత్తంమీద చమురు దిగుమతులు సగటున రోజువారీ 2 మిలియన్‌ బ్యారెళ్లుగా ఉండొచ్చన్నది కెప్లెర్‌ నివేదిక అంచనా. చమురు దిగుమతుల్లో ప్రపంచంలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. రోజువారీ 5.1 మిలియన్‌ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. సంప్రదాయంగా మధ్యప్రాచ్యం, గల్ఫ్‌ దేశాల నుంచే భారత్‌ అధికంగా చమురు దిగుమతి చేసుకునేది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో.. రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతమే ఉండగా, ఆ తర్వాత 40–44 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ధర కంటే తక్కువ రేటుకే చమురును భారత్‌కు రష్యా ఆఫర్‌ చేయడం గమనార్హం. సరఫరాపై ప్రభావం పడొచ్చు.. ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావం ఇప్పటి వరకు మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలపై లేదని కెప్లెర్‌ నివేదిక స్పష్టం చేసింది. వెసెల్స్‌ కార్యకలాపాలను గమనిస్తే రానున్న రజుల్లో సరఫరా తగ్గే అవకాశం కనిపిస్తున్నట్టు కెప్లెర్‌ ముఖ్య పరిశోధన విశ్లేషకుడు సుమిత్‌ రితోలియా తెలిపారు. షిప్‌ యజమానులు గల్ఫ్‌ ప్రాంతానికి ఖాళీ ట్యాంకర్లు పంపేందుకు వెనుకాడుతున్నట్టు, దీంతో వెసెల్స్‌ సరఫరా 69 నుంచి 40కు తగ్గినట్టు తెలిపారు. దీంతో సమీప కాలంలో సరఫరాలు కఠినంగా మారొచ్చని.. ఇది భారత దిగుమతుల్లో సర్దుబాట్లకు దారితీయొచ్చని అంచనా వేశారు. హర్ముజ్‌ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్‌ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే వస్తోంది. మన దేశ ముడి చమురు దిగుమతుల్లో 40 శాతం, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో సగం సరఫరా ఈ ప్రాంతం నుంచే ఉంటోంది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో హర్ముజ్‌ జలసంధి మూసివేసే రిస్క్‌ ఉందని.. అదే సమయంలో పూర్తిస్థాయి దిగ్బంధనం అవకాశాలు తక్కువే ఉండొచ్చని కెప్లెర్‌ నివేదిక తెలిపింది. ఎందుకంటే ఇరాన్‌కు చైనా అతిపెద్ద కస్టమర్‌గా ఉందని, చైనా సముద్ర మార్గ చమురు దిగుమతుల్లో 47% ఇరాన్‌ నుంచే వస్తుండడాన్ని ప్రస్తావించింది. ఇరాన్‌ 96% చమురు ఎగుమతులు ఈ జలసంధి నుంచే ఉంటున్నందున పూర్తిస్థాయి దగ్బంధనం ఇరాన్‌కే నష్టం కలిగిస్తుందని పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement