Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 6th December 2025 in Telugu states1
గుడ్‌న్యూస్‌.. మారిపోయిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు క్షీణించాయి. క్రితం రోజున ఎగిసిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) తగ్గాయి. ఇక వెండి ధరలు మరోసారి క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Hyderabad Real estate Fourth city seeks affordable housing zone2
హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో అఫర్డబుల్‌ జోన్‌..

సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల.. ఎకరం రూ.100 కోట్లు పలుకుతున్న హైదరాబాద్‌లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల సాకారం కావాలంటే ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్‌లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్‌ హౌసింగ్‌(చౌక ధరల ఇళ్లు) తగ్గుముఖం పట్టాయి.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నగరానికి దక్షిణ భాగంలో ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫోర్త్‌ సిటీలో అఫర్డబుల్‌ హౌసింగ్‌కు కూడా ప్రత్యేకంగా జోన్‌ కేటాయించాలని డెవలపర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సంస్థలకు, క్రీడలకు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకు ఎలాగైతే ప్రత్యేకంగా జోన్లను కేటాయిస్తున్నారో.. చౌక గృహాల నిర్మాణాలకు కూడా స్థలాలను కేటాయించాల్సిన ఆవశ్యకత ఉందనేది నిపుణుల అభిప్రాయం.ఆకాశాన్నంటిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు కొనలేని విధంగా తయారైంది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌ ఏర్పడింది. డబ్బు ఉండి, ఇల్లు ఉన్నవారు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. వేతనజీవులు తమ సంపాదనలో 40–45 శాతం అద్దెలకే చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్ములో ఇల్లు, సంసారం గడపడం గగనమైపోయింది. మార్కెట్‌లో గృహ యజమానులు ఎక్కువ, అద్దెదారులు తక్కువగా ఉంటేనే సమత్యులత. లేకపోతే అద్దెలు విపరీతంగా పెరిగి, జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘అఫర్డబుల్‌ హౌసింగ్‌ పాలసీ’ని తీసుకురావడం అత్యవసరం.రీ–డెవలప్‌మెంట్‌ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్‌లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపులతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్‌ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు. అయితే ఈ తగ్గింపులతో ప్రభుత్వానికి ప్రత్యక్ష రాబడి తగ్గినా.. నిర్మాణ సామగ్రి కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరగడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటి వాటితో పరోక్షంగా అంతకు రెట్టింపు ఆదాయమే సమకూరుతుంది.ఫ్యూచర్‌ సిటీలో అఫర్డబుల్‌ జోన్‌.. కో–ఆపరేటివ్‌ సొసైటీ, ఎంప్లాయిస్‌ యూనియన్లుగా ముందుకు రావాలి. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో సామాన్య, మధ్యతరగతికి స్థలాలను కేటాయించాలి. కమ్యూనిటీ లివింగ్‌కు ప్రత్యేకంగా జోన్‌ కేటాయించాలి. ప్రభుత్వ భూములను మ్యాపింగ్‌ చేసి, అఫర్డబుల్‌ హౌసింగ్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక అవసరాలను కల్పిస్తే చాలు.. అందుబాటు ధరల్లో డెవలపర్లకు భూములను అందిస్తే అఫర్డబుల్‌ హౌసింగ్‌లను నిర్మించే వీలుంటుంది. పెరీ అర్బన్‌ ఏరియాలో భూమారి్పడి, కన్వర్షన్ల ప్రక్రియను సులభతరం చేయాలి. అర్హులైన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ, తొలిసారి ఇల్లు కొనుక్కునేవారికి స్టాంప్‌ డ్యూటీలో రాయితీ అందించాలి. అఫర్డబుల్‌ ప్రాజెక్ట్‌లను నిర్మించే డెవలపర్లకు పన్ను రాయితీలను అందజేయాలి.నిర్మాణ అనుమతుల్లో వేగం.. గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలను పాటిస్తూ.. ప్రీ–ప్యాబ్, త్రీడీ ప్రింటింగ్, మాడ్యులర్‌ టెక్నాలజీలతో ఇళ్లను నిర్మిస్తే త్వరితగతిన పూర్తవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్లేస్కూళ్లు, పార్క్‌లు, కమ్యూనిటీ స్పేస్‌లు వంటి సదుపాయాలను అందించాలి. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే మున్సిపల్, ఫైర్, రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్‌మెంటల్‌.. ఇలా 15 విభాగాలు, 170 డెస్క్‌ల ద్వారా వెళ్లాలి. ఇదే అనుమతుల జారీలో జాప్యానికి ప్రధాన కారణం.అలాకాకుండా అన్ని కీలక విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సింగిల్‌ విండో విధానంలో 45 రోజుల్లో అనుమతులు ఇవ్వాలి. రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లకు స్టాంప్‌ డ్యూటీని, మహిళా కస్టమర్లకు ప్రత్యేక రిబేట్‌ను అందించాలి. క్లబ్‌హౌస్, ఎస్టీపీ, డబ్ల్యూటీపీ, లిఫ్ట్‌లు వంటివి కూడా నివాస జీవనంలో భాగమే. అందుకే వీటికి వాణిజ్య విద్యుత్‌ సుంకాల భారం నుంచి మినహాయించాలి.

Lakme Cosmetic Brand Pioneer Simone Tata Dies At 953
‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత

ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్‌ బ్రాండ్‌ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.ముంబైలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ తమ ఎక్స్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లాక్మే బ్రాండ్‌ను భారతదేశంలో ప్రముఖ కాస్మెటిక్ కంపెనీగా అభివృద్ధి చేయడంలో సిమోన్ టాటా కృషిని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సిమోన్‌ టాటా కన్నుమూతపై లాక్మే ఇండియా కూడా సంతాపం తెలియజేసింది. లాక్మే వెనుక దార్శనికురాలిని కోల్పోయామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.టాటా కుటుంబంలో చేరి..సిమోన్ టాటా.. ప్రసిద్ధ టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్ టాటాకు తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు సవతి తల్లి. 1930లో జన్మించిన సిమోన్ డునోయర్ జెనీవాలో పెరిగారు. 1953లో పర్యాటకురాలిగా భారత్ వచ్చిన ఆమె నావల్ హెచ్ టాటాను వివాహమాడి ఇక్కడే స్థిరపడ్డారు. 1962లో టాటా ఆయిల్ మిల్స్‌కు చిన్న అనుబంధ సంస్థగా ఉన్న లాక్మే బోర్డులో చేరారు. అందం లగ్జరీ కాకూడదని, ప్రతి భారతీయ మహిళకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లాక్మే ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేశారు.We mourn the passing of Simone Tata, a truly accomplished woman whose achievements and grace touched so many. Her legacy will continue to inspire generations. May she rest in peace. Our thoughts & prayers are with the Tata family 🙏#SimoneTata pic.twitter.com/y3sHlL7ngJ— Swiss Consulate Mumbai (@SwissCGMumbai) December 5, 2025

Shift in Housing Trends Luxury Units Outperform Affordable Homes4
చిన్న ఇళ్లు చవకైపోయాయ్‌..!!

సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూ.. విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. విశాలమైన స్థలం, ఆధునిక వసతులు, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్లకు ఆదరణ వృద్ధి చెందుతోంది.2022 నుంచి 2025 మధ్యకాలంలో లగ్జరీ ఇళ్ల ధరలు 40 శాతం మేర పెరగగా.. చౌక గృహాల రేట్లు 26 శాతం మేర క్షీణించాయి. 2022లో రూ.40 లక్షలోపు ధర ఉండే అఫర్డబుల్‌ ఇళ్ల ధరలు చ.అ.కు రూ.4,229గా ఉండగా.. 2025 నాటికి 26 శాతం వృద్ధి రేటుతో రూ.5,299లకు చేరింది.అదే రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే మిడ్‌ ప్రీమియం గృహాల ధరలు 2022లో చ.అ.కు రూ.6,880గా ఉండగా.. ఇప్పుడది 39 శాతం వృద్ధి రేటుతో రూ.9,537కు పెరిగింది. ఇక, రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ యూనిట్ల ధర 2022లో చ.అ.కు రూ.14,530లుగా పలకగా.. ఇప్పుడది 40 శాతం వృద్ధి రేటుతో రూ.20,300లకు ఎగబాకింది.

Gold rallies Rs 1300 to Rs 132900 per 10 grams5
పసిడి రూ. 1,300 అప్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,300 పెరిగి రూ. 1,32,900కి చేరింది. అటు వెండి సైతం కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 1,83,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్‌ గోల్డ్‌ ధర ఒక దశలో సుమారు 15.10 డాలర్లు పెరిగి 4,223.76 డాలర్లకు చేరింది.

 Bank Of Baroda Cut Repo-Linked Interest Rate and Others To Follow Suit6
రేట్ల తగ్గింపు బాటలో బ్యాంకులు

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ రేట్లను తగ్గించడంతో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించే పనిలో పడ్డాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) రెపో ఆధారిత రుణ రేటును 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 6 నుంచి ఈ రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది.అటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా తమ రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌బీఎల్‌ఆర్‌)ను 8.35 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్‌ బ్యాంక్‌ ఇటీవలే ఏడాది కాలవ్యవధికి సంబంధించిన ఎంసీఎల్‌ఆర్‌ని (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు) 5 బేసిస్‌ పాయింట్లు కట్‌ చేసి 8.80 శాతానికి తగ్గించింది.

Advertisement
Advertisement
Advertisement