ప్రధాన వార్తలు
విద్య ముసుగులో రూ.546 కోట్ల మోసం
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కీలక చర్య తీసుకుంది. అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీ (ఆస్టా) వ్యవస్థాపకుడు అవధూత్ సాథే, ఆస్టా సంస్థ, డైరెక్టర్ గౌరీ సాథేలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, వారి ఖాతాల్లో ఉన్న ఏకంగా రూ.546 కోట్లను జప్తు చేయాలని సెబీ ఆదేశించింది.విద్య ముసుగులో..రిటైల్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించి ఈ భారీ మొత్తాన్ని సేకరించడానికి ఆస్టా రిజిస్టర్ చేయని పెట్టుబడి సలహాదారుగా పనిచేసిందని సెబీ నిర్ధారించింది. ఆస్టా అందించిన విద్యా కోర్సుల పేరుతో నిర్దిష్ట స్టాక్ చిట్కాలు, లైవ్ ట్రేడింగ్ కాల్స్, ఎంట్రీ-ఎగ్జిట్ సూచనలు ఇవ్వడం ద్వారా ఈ ఆదాయం వచ్చిందని సెబీ తేల్చింది. ఈ సంస్థపై ఫిర్యాదులు రావడంతో సెబీ దర్యాప్తు చేపట్టింది. వీడియోలు, వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా కంటెంట్, పేమెంట్ లేవాదేవీలు, కొంతమంది వ్యక్తుల సాక్ష్యాలను పరిశీలించిన సెబీ ఆస్టా కార్యకలాపాలు కేవలం విద్యా శిక్షణకు పరిమితం కాకుండా, ప్రత్యక్ష పెట్టుబడి సలహాగా ఉన్నాయని స్పష్టం చేసింది.ఉదాహరణకు, ఒక లైవ్ సెషన్లో అవధూత్ సాథే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ను నిర్దిష్ట ధరకు కొనుగోలు చేయమని, స్టాప్-లాస్, టార్గెట్తో సహా సూచించారు. దీన్ని సెబీ ఉత్తర్వుల్లో ఉటంకిస్తూ ‘ఇది విద్య కాదు, పెట్టుబడి సలహా’ అని స్పష్టంగా పేర్కొంది.అధిక ఫీజులు, హామీ రాబడుల భ్రమఆస్టా కౌన్సెలింగ్ బ్యాచ్ల పేరుతో ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అధిక ఫీజులు చెల్లించిన వందలాది మంది సభ్యులకు రియల్టైమ్ ట్రేడింగ్ సూచనలు ఇచ్చింది. ఈ కోర్సుల ధర రూ.6.75 లక్షల వరకు ఉండగా, ఇవి కేవలం సైద్ధాంతిక పాఠాలకే కాకుండా రియల్టైమ్ సలహా కోసమేనని సెబీ గుర్తించింది. సంస్థ లాభదాయక ట్రేడ్ స్క్రీన్షాట్లు ప్రదర్శించి, నష్టాలను దాచిపెట్టి, అధిక రాబడుల హామీ భ్రమ కల్పించిందని సెబీ విమర్శించింది.2024 ప్రారంభంలో అధికారిక హెచ్చరిక అందినా సాథే ఈ పద్ధతులను కొనసాగించి, కార్యకలాపాలను మరింత రహస్యంగా మార్చారని సెబీ తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.సెబీ ఆదేశాలు ఇవే..సెక్యూరిటీస్ మార్కెట్ను రక్షించడానికి, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి సెబీ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. అవధూత్ సాథే, గౌరీ సాథే, ఆస్టా సంస్థపై సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలిక నిషేధిస్తున్నట్లు చెప్పింది. వీరు సెక్యూరిటీల కొనుగోలు-విక్రయాలు, సలహా కార్యకలాపాలు, లైవ్ ట్రేడింగ్ సెషన్లు నిర్వహించడంపై నిషేధం విధించింది. రూ.546 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ల్లో ఉంచే వరకు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. పూర్తి ఆర్థిక రికార్డులు, ఆస్తి వివరాలు, జీఎస్టీ ఫైలింగ్స్, కస్టమర్ జాబితాను సమర్పించాలని చెప్పింది. సెబీ ఈ కేసుపై విచారణ కొనసాగిస్తోంది. నోటీసులకు 21 రోజుల్లో అవధూత్ సాథే, ఇతరులు సమాధానం ఇవ్వాల్సి ఉంది.రిటైలర్లు ఏం చేయాలంటే..రిటైల్ పెట్టుబడిదారులు, వ్యాపారులు తమ డబ్బును రక్షించుకోవడానికి, ఆర్థిక నష్టాలను నివారించడానికి కొన్ని జాగ్రత్తులు తప్పకుండా పాటించాలి. ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా స్టాక్ చిట్కాలు, ట్రేడింగ్ కాల్స్ లేదా నిర్దిష్ట స్టాక్లపై సలహా ఇస్తే వారు సెబీతో రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (RIA) లేదా రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ (RA)గా నమోదు చేసుకున్నారో లేదో తప్పకుండా తనిఖీ చేయాలి.సలహా ఇచ్చే వ్యక్తి/ సంస్థ సెబీ రిజిస్ట్రేషన్ నంబర్ను (ఉదాహరణకు, INA0000XXXXXX లేదా INH0000XXXXXX) సెబీ అధికారిక వెబ్సైట్లో 'Intermediaries/Market Participants' విభాగంలో తనిఖీ చేయాలి. ట్రేడింగ్ కోర్సు లేదా విద్యా తరగతులు పేరుతో లైవ్ ట్రేడింగ్ కాల్స్, నిర్దిష్ట ట్రేడ్ సూచనలు ఇస్తే, వారు రిజిస్టర్ కాకపోయినా సెబీ దృష్టిలో అది పెట్టుబడి సలహాగానే పరిగణిస్తారు.హామీ రాబడులుస్టాక్ మార్కెట్లో ఎలాంటి హామీ రాబడులు ఉండవు. ఏ వ్యక్తి అయినా ‘కచ్చితమైన లాభం’, ‘రిస్క్-ఫ్రీ స్ట్రాటజీ’ లేదా ‘మీ డబ్బు రెట్టింపు’ అవుతుందని హామీ ఇస్తే అది మోసమే. లాభాల స్క్రీన్షాట్లు, విజయం సాధించిన క్లయింట్ల కథనాలు మాత్రమే చూపించి నష్టాలను లేదా రిస్క్లను దాచిపెడితే అలాంటి వారి నుంచి దూరంగా ఉండండి.ఇదీ చదవండి: ‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’
‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’
భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల కారణంగా పైలట్ల కొరతతో సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం కారణంగా గురువారం ఒక్కరోజే 500కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు ఏడుస్తూ సర్వీసుల ఆలస్యం కారణంగా తన ఉద్యోగం కోల్పోతానని భయపడుతూ చేసిన పోస్ట్ కొద్ది సమయంలో వైరల్ అయింది. అందులో ప్రయాణికుడు ఏడుస్తూ ‘ప్రయాణం ఆలస్యం కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించకూడదని దయచేసి నా బాస్కి చెప్పండి’ అని చెప్పడం గమనించవచ్చు.పుణెలో డాక్టర్ ప్రశాంత్ పన్సారే ‘గేట్ వద్ద సమస్య గురించి కమ్యునికేట్ చేయడానికి సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. బోర్డులో మాత్రం షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు చూపిస్తున్నాయి’ అని ఫిర్యాదు చేశారు.My @IndiGo6E flight is delayed for hours and passengers are stuck with no clear communication. I even have a video of people raising concerns. This needs urgent attention. #IndiGo #Delay #6E979 pic.twitter.com/iKKdGftKoo— Ayush Kuchya (@KuchyaAyush) December 3, 2025పైలట్ల కొరతే కారణండీజీసీఏ అమలు చేసిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనల కారణంగా పైలట్లకు వారంలో 36 గంటల నుంచి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు. అలాగే, రాత్రి వేళల్లో ల్యాండింగ్ల సంఖ్యను ఆరు నుంచి రెండుకు తగ్గించారు. విమానయాన భద్రతను పెంచే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ మార్పులు ప్రత్యేకించి రాత్రి వేళల్లో అధిక విమానాలను నడిపే ఇండిగో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం చూపాయి. కొత్త నిబంధనల అమలుకు తగినంత మంది పైలట్లను నియమించుకోవడంలో ఇండిగో వైఫల్యం చెందిందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. దీనివల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా..
ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా..
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్గా ఒరిజినల్ పేమెంట్ మోడ్కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈనేపథ్యంలో అసలు ఈ సంక్షోభానికి కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్వర్క్ను, సిబ్బంది రోస్టర్ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.సిబ్బంది కొరతకొత్త FDTL నిబంధనల అమలుకు ముందు నుంచే ఇండిగో సంస్థలో పైలట్ల కొరత ఉందని విమర్శలు ఉన్నాయి. కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసినప్పటికీ సంస్థ తగినంత మంది సిబ్బందిని ముందుగానే నియమించుకోవడంలో లేదా వారికి శిక్షణ ఇవ్వడంలో విఫలమైందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సుదీర్ఘకాలంగా అనుసరించిన ‘లీన్ మ్యాన్పవర్ స్ట్రాటజీ’(తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులు చేయించడం) ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం
సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి ‘గాడ్ఫాదర్’గా పిలుచుకునే ఏఐ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఏఐ వేగవంతమైన పురోగతి కారణంగా లక్షల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్తో కలిసి జార్జ్టౌన్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో హింటన్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఏఐ వల్ల భారీ నిరుద్యోగం రాబోతోందన్న విషయం చాలా మందికి స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, చిప్స్పై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.2023లో గూగుల్ను వీడిన హింటన్ ఏఐ ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న ఆశావాదాన్ని ఖండించారు. ‘కొత్త ఉద్యోగాలు వస్తాయి కానీ, దీని పరిణామాల వల్ల కోల్పోయే ఉద్యోగాల సంఖ్యను అవి ఎప్పటికీ భర్తీ చేయలేవు’ అని స్పష్టం చేశారు.టెక్ దిగ్గజాల అభిప్రాయాలుఏఐ ఉద్యోగాలపై చూసే ప్రభావం గురించి టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల ‘ఏఐ సామూహిక తొలగింపులకు దారితీయదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ త్వరలోనే చాలా అంశాల్లో మానవుల అవసరం లేకుండా పోతుందన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘మరో 20 సంవత్సరాల్లో చాలా మందికి పని చేయవలసిన అవసరమే ఉండదు’ అని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..
ఇదో అవకాశంగా చూడాలి.. ఆర్బీఐ గవర్నర్
భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన 50 శాతం సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావాన్ని చూపడంలేదని, దీన్ని ఎగుమతి రంగం ఒక అవకాశంగా మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల అనంతరం విలేకరులతో మాట్లాడిన మల్హోత్రా, భారతదేశం ప్రధానంగా దేశీయ డిమాండ్పై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కాబట్టి యూఎస్ సుంకాల ప్రభావం గణనీయంగా ఉండదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, లేబర్ ఇంటెన్సివ్ రంగాలపై ప్రభావం కనిపిస్తున్నట్లు ఆయన అంగీకరించారు.సుంకాల పెరుగుదల, ఎగుమతుల తగ్గుదలఆగస్టు 1 నుంచి అమెరికా 25 శాతం సుంకాలు విధించగా, ఆగస్టు 27 నుంచి రష్యా నుంచి ఇంధన దిగుమతుల కారణంగా అదనంగా 25 శాతం సుంకాలు అమలు చేసింది. ఏప్రిల్ 2న ప్రారంభమైన 10 శాతం సుంకాలు ఆగస్టు చివరి నాటికి 50 శాతానికి చేరాయి. ఈ పరిణామాల వల్ల భారత్ తన అతిపెద్ద విదేశీ మార్కెట్ అయిన అమెరికాకు చేసే ఎగుమతులు గణనీయంగా తగ్గాయి.గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం, మే నుంచి అక్టోబర్ 2025 వరకు భారత ఎగుమతులు 28.5 శాతం తగ్గి, 8.83 బిలియన్ డాలర్ల నుంచి 6.31 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ సుంకాల వల్ల రత్నాలు, ఆభరణాలు, టెక్స్టైల్స్, గార్మెంట్స్, కెమికల్స్, సీఫుడ్ వంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాలు 31.2 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. జీటీఆర్ఐ ప్రకారం, స్మార్ట్ఫోన్ ఎగుమతులు 36 శాతం, కెమికల్స్ 38 శాతం తగ్గాయి.ఆర్బీఐ వృద్ధి అంచనా పెంపుఎంపీసీ సమావేశాల్లో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకొచ్చింది. మల్హోత్రా జీడీపీ వృద్ధి అంచనాను 7.3 శాతానికి పెంచారు. ఇన్ఫ్లేషన్ 2 శాతానికి పడిపోయినప్పటికీ ఎగుమతుల తగ్గుదల రెండో అర్ధ సంవత్సరంలో వృద్ధిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఎగుమతి సంఘాలు, జీటీఆర్ఐ వంటి సంస్థలు ప్రభుత్వాన్ని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ను త్వరగా అమలు చేయాలని సూచించాయి. అమెరికాతో చర్చలు వేగవంతం చేయాలని కోరుతున్నాయి.ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..
ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..
దేశంలో అద్దె గృహాల విభాగంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అద్దె ఒప్పందాలను సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచడం, యజమానులు-అద్దెదారుల మధ్య వివాదాలను తగ్గించడం లక్ష్యంగా మార్పులు ప్రతిపాదించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రూపొందించిన ‘మోడల్ టెనెన్సీ యాక్ట్ (MTA) 2025’ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించారు.ఈ ఎంటీఏ 2025 అనేది చట్టబద్ధమైన కేంద్ర చట్టం కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రస్తుత అద్దె నియంత్రణ చట్టాలను సవరించడానికి లేదా కొత్త చట్టాలను రూపొందించడానికి ఇది ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. భూమి, ఆస్తి, అద్దె వ్యవహారాలు రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా (ఎంట్రీ 18) పరిధిలోకి వస్తాయి కాబట్టి, రాష్ట్ర శాసనసభల ఆమోదం ద్వారా మాత్రమే ఈ మార్గదర్శకాలు చట్ట రూపం దాలుస్తాయని గుర్తుంచుకోవాలి.మార్గదర్శకాల్లోని వివరాలునివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ఆస్తుల కోసం చేసుకున్న అన్ని అద్దె ఒప్పందాలను సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంపింగ్తో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో చేతితో రాసిన ఒప్పందాలు లేదా సాధారణ స్టాంప్ పేపర్ ఒప్పందాలు మాత్రమే ఉండేవి. దీనివల్ల మోసాలు, అక్రమ ఆక్రమణలు, డూప్లికేట్ ఒప్పందాలకు అవకాశం ఉండేది. దీన్ని కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది.ఒప్పందాన్ని నమోదు చేయడంలో విఫలమైతే భూస్వామికి రూ.5,000 వరకు జరిమానా విధించే వీలుంది.ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెదారులు 8 నుంచి 11 నెలల అద్దెను డిపాజిట్గా చెల్లించాల్సిన భారం ఉంది. ఎంటీఏ 2025 ఈ భారాన్ని తగ్గిస్తూ సెక్యూరిటీ డిపాజిట్పై కచ్చితమైన పరిమితిని విధించింది.నివాస గృహాలకు గరిష్ఠంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్గా తీసుకోవచ్చు.వాణిజ్య ఆస్తులకు గరిష్ఠంగా 6 నెలల అద్దె వరకు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది.ఆకస్మికంగా లేదా అతిగా అద్దె పెంచే విధానానికి కొత్త చట్టం అడ్డుకట్ట వేస్తుంది. యజమానులు అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా అద్దె పెంపునకు సంబంధించిన రాతపూర్వక నోటీసును అద్దెదారుకు కనీసం 90 రోజుల ముందు తప్పనిసరిగా ఇవ్వాలి.రెంట్ ట్రిబ్యునల్ ఆదేశం లేకుండా ఏ అద్దెదారునైనా బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించడం పూర్తిగా నిషేధం.ఇంటిని తనిఖీ చేయడానికి లేదా ప్రవేశించడానికి కనీసం 24 గంటల ముందు యజమాని అద్దెదారుకు రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.అద్దెదారుపై ఒత్తిడి తెచ్చేందుకు లాకౌట్ (తాళం వేయడం), విద్యుత్/నీటి సరఫరాను నిలిపివేయడం, బెదిరింపులకు పాల్పడటం శిక్షార్హమైన నేరాలు.అవసరమైన మరమ్మతులను యజమాని 30 రోజుల్లో పూర్తి చేయకపోతే అద్దెదారు స్వయంగా వాటిని చేయించుకుని బిల్లు చూపి ఆ ఖర్చును తదుపరి అద్దె నుంచి మినహాయించుకునే వెసులుబాటు ఉంది.అద్దెదారులు తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.రాష్ట్రాల స్పందన, అమలుపై అంచనాలు..కేంద్రం రాష్ట్రాలను తమ డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా అప్గ్రేడ్ చేసుకోవాలని కోరింది. ఇప్పటివరకు ఒడిషా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, త్రిపుర వంటి 10కి పైగా రాష్ట్రాలు ఇప్పటికే ఎంటీఏ మార్గదర్శకాల ఆధారంగా తమ అద్దె చట్టాలను సవరించాయి. అందులో కొన్ని కొత్త చట్టాలను రూపొందించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా 2026 నాటికి ఈ కొత్త నియమాలను అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ
కార్పొరేట్
‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’
ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా..
లెన్స్కార్ట్ లాభం పెరిగింది..
రూ .1,120 కోట్ల ఆస్తులు జప్తు.. అనిల్ అంబానీకి ఈడీ షాక్
ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇవన్నీ ఇవ్వాల్సిందే..!
సంక్షోభంలో విమానయానం: ఇండిగోకు ఉన్న ఇక్కట్లేమిటి?
రిటైల్ ఇన్వెస్టర్లు స్మార్ట్గురూ!
టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ
యూఎస్లో చదువుకు రూ.10 కోట్లు!
నాలుగేళ్లు కష్టపడి రూ.9 వేలు సంపాదన
రూపాయి టపా.. భారీగా పడిపోయిన భారత కరెన్సీ
భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టాన...
సిల్వర్ షాక్.. బంగారం ధరలు ఒక్క రోజులోనే రివర్స్..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. క్రి...
Stock Market Updates: నష్టాల్లో కదులుతున్న సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ.. రూ. 10,000 కోట్లకు సై!
తాజాగా సెకండరీ మార్కెట్లు కొత్త గరిష్టాల రికార్డ్...
రూపాయి తగ్గితే ఏమౌతుంది?
భారత కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్త...
క్రిప్టో తరహా ఆర్థిక ఉత్పత్తులతో సవాళ్లు
ఆర్థిక వ్యవస్థలు డిజటల్గా మారుతుండడం, క్రిప్టో, స...
భారత వృద్ధి రేటు అంచనాలు పెంపు.. ఎంతంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో భారత వృద్ధి రే...
ఆరు నెలల గరిష్టానికి డీజిల్ విక్రయాలు
పండుగ సీజన్, జీఎస్టీ రేట్ల తగ్గింపు దన్నుతో ఎకానమ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
యాపిల్ సేవలు నిలిపేస్తున్న మోడళ్లు ఇవే..
టెక్ దిగ్గజం యాపిల్ సర్వీసులు అందించలేని(Obsolete) ఉత్పత్తుల జాబితాను అప్డేట్ చేసింది. ఐదు యాపిల్ ఉత్పత్తులకు అధికారిక హార్డ్వేర్ సేవలు, మరమ్మతులు నిలిపేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన నేపథ్యంలో ఈమేరకు యాపిల్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్డేట్ చేసిన జాబితాలో కింది ఉత్పత్తులు ఉన్నాయి.ఐఫోన్ SE (మొదటి తరం)12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో (రెండవ తరం)యాపిల్ వాచ్ సిరీస్ 4 హెర్మెస్ మోడల్స్యాపిల్ వాచ్ సిరీస్ 4 నైక్ మోడల్స్బీట్స్ పిల్ 2.0 పోర్టబుల్ స్పీకర్ఏడేళ్ల గడువు పూర్తియాపిల్ అధికారిక పాలసీ ప్రకారం ఒక ఉత్పత్తి ‘ఒబ్సాలీట్’గా పరిగణించాలంటే కంపెనీ దాని అమ్మకాలను నిలిపివేసిన తర్వాత ఏడు సంవత్సరాలు పూర్తి కావాలి. ఈ ఏడేళ్ల గడువు దాటిన తర్వాత యాపిల్, దాని అధీకృత సర్వీస్ ప్రొవైడర్లు ఆ ఉత్పత్తులకు అన్ని రకాల హార్డ్వేర్ సేవలను పూర్తిగా నిలిపివేస్తారు. అంటే బ్యాటరీ మార్పిడి, మరమ్మతులు, విడి భాగాల లభ్యత ఉండదు. ఐఫోన్ SE (మొదటి తరం) సెప్టెంబర్ 2018లో అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో ఇది సరిగ్గా ఏడేళ్ల మార్క్ను దాటి ఒబ్సాలీట్ జాబితాలో చేరింది.వినియోగదారులకు సవాలుయాపిల్ ఒక ఉత్పత్తిని ముందుగా ‘వింటేజ్’ (అమ్మకాలు ఆపిన 5 ఏళ్ల తర్వాత)గా, ఆపై ఒబ్సాలీట్(7 ఏళ్ల తర్వాత)గా ప్రకటిస్తుంది. వింటేజ్ ఉత్పత్తులు రెండు సంవత్సరాల్లో ఒబ్సాలీట్గా మారతాయి. ఐఫోన్ SE వంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఈ జాబితాలో చేరడం అనేది ఇప్పటికీ ఆ పరికరాన్ని వాడుతున్న చాలామంది వినియోగదారులకు సమస్యలను సృష్టించవచ్చు. అధికారిక హార్డ్వేర్ సేవలు లేకపోవడంతో వారు థర్డ్ పార్టీ రిపేర్ సెంటర్లను ఆశ్రయించవలసి ఉంటుంది లేదా కొత్త మోడల్కు అప్గ్రేడ్ కావాలి. ఈ నిర్ణయం యాపిల్ తన నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి, పాత సాంకేతికతకు మద్దతు ఇవ్వడాన్ని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: రాయికి రంగేసి రూ.5 వేలకు అమ్మాడు.. కానీ..
భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!
యుద్ధ తంత్రాలు మారుతున్నాయి. సైనిక వ్యూహాలకు టెక్నాలజీ ఆయుధంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో భవిష్యత్ యుద్ధాలు కేవలం మానవుల మధ్య మాత్రమే కాకుండా, రోబోల దండుతో ‘మెటల్ వర్సెస్ ఫ్లెష్’ (యంత్రాలు vs మనుషులు) జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలో చైనాకు చెందిన ‘స్పై రోబోట్’ను భారత దళాలు గుర్తించాయని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చైనా-భారత్ సరిహద్దు వంటి ప్రపంచంలోని అత్యంత సున్నితమైన ప్రాంతంలో రోబోటిక్ నిఘా గురించిన ఆందోళనలను పెంచుతూ ఈ వీడియో సంచలనం సృష్టించింది. చాలా దేశాలు ఇప్పటికే తమ సైనిక వ్యూహాల్లో కృత్రిమ మేధ(ఏఐ), డ్రోన్లు, ఆటోనమస్ వెహికల్స్ను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన భవిష్యత్ పోరుకు ఒక సంకేతంగా నిలుస్తోందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వైరల్ క్లిప్లో ఏముంది?ఎత్తైన ప్రాంతంలో షూట్ చేసిన ఈ వైరల్ క్లిప్లో చైనా-భారత్ సరిహద్దు జోన్లో ఒంటరిగా నిలబడి ఉన్న హ్యూమనాయిడ్ రోబో లాంటి ఆకారాన్ని చూడవచ్చు. ఇది చైనా సరిహద్దు భద్రతలో భాగమని కొందరు చెబుతున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఇదో ఫంక్షనల్ రోబోట్ అని, భారత దళాల కదలికలను ట్రాక్ చేస్తుందని పేర్కొన్నారు. అయితే దీనిపై స్పష్టమైన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.India🇮🇳 just filmed this: Chinese🇨🇳 humanoid killer robots now patrolling the border. The age of flesh-vs-metal war begins.Who still wants to send sons to the frontline in 2030? https://t.co/zM3Gy7mYJ9 pic.twitter.com/UAB5L4N6gp— PLA_Overwhelm (@junshiguancha) December 2, 2025సోషల్ మీడియా స్పందనఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, లైక్లు, వేల సంఖ్యలో రీపోస్ట్ చేశారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోపై సరదాగా స్పందిస్తూ ‘టెర్మినేటర్ 1.0 చైనా సరిహద్దుకు వచ్చేసింది’ అని, మరికొందరు ‘మోదీగారు చిట్టి 2.0 పంపండి’ అని కామెంట్లు చేశారు.చైనా వ్యూహంలో రోబోటిక్ విప్లవంఈ క్లిప్ ఇంతగా వైరల్ అయ్యేందుకు ప్రధాన కారణం అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), స్వయంప్రతిపత్తి కలిగిన నిఘా సాధనాల వాడకం, హ్యూమనాయిడ్ రోబోటిక్స్లో చైనా వేగవంతంగా పురోగతి చెందుంతుండడంతో రోబో నిఘా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశ సరిహద్దుల్లో మానవ గస్తీని తగ్గించి అక్కడ పర్యవేక్షణను పెంచడానికి చైనా ఈ పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. చైనా ఇప్పటికే టిబెట్లో రోబో డాగ్లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనా, తైవాన్ సరిహద్దు సమీపంలో కూడా రోబోటిక్ సైనికులను మోహరించాలని యోచిస్తున్నట్లు వెల్లడైంది. ఇది భారత్-చైనా సరిహద్దులో కూడా ఇలాంటివి వచ్చే అవకాశంపై ఆందోళన కలిగిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్లో టాప్లో నీతా అంబానీ..
‘సంచార్ సాథీ’పై కలకలం
సైబర్ భద్రతను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘సంచార్ సాథీ’ యాప్ను అన్ని కొత్త స్మార్ట్ఫోన్ల్లో ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలపై వ్యతిరేకత వస్తుంది. గోప్యతా సమస్యలు, యాప్ అమలులో ఉన్న చిక్కులను ఉదహరిస్తూ యాపిల్ (Apple) వంటి ప్రముఖ మొబైల్ తయారీదారులు ఈ ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ యాప్ ఇన్స్టాల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం స్పందించారు. యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేయాలా లేదా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టంమేరకే ఉంటుందని ప్రకటించారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు.ప్రీ-ఇన్స్టాల్పై డాట్ పట్టుడిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం యాపిల్, శామ్సంగ్, షావోమీ వంటి తయారీదారులు 90 రోజుల్లోగా భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్సెట్ల్లో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా ఈ యాప్ అందేలా చూడాలని సూచించారు.ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..డూప్లికేట్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్లు, దొంగ పరికరాల విక్రయాలు, సైబర్ మోసాలను అరికట్టడం.జనవరి 2025లో ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ 7 లక్షలకు పైగా దొరికిన ఫోన్లను తిరిగి పునరుద్ధరించింది. 42 లక్షలకు పైగా నకిలీ/దొంగ పరికరాలను బ్లాక్ చేసింది.ఈ ఆదేశాలు టెలికాం యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం జారీ అయ్యాయని డాట్ తెలిపింది. వీటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే డాట్ అసలు ఉత్తర్వులో యాప్ ఫంక్షనాలిటీలను నిలిపివేయడం (Disabled) లేదా పరిమితం చేయడం (Restricted) కుదరదని పేర్కొనడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.యాపిల్ గోప్యతా ప్రమాణాలుప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే యాపిల్ ఈ తప్పనిసరి ప్రీ-ఇన్స్టాలేషన్ ఆదేశాలను పాటించే ఆలోచన లేదని భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు తమ ఐఓఎస్ ప్లాట్ఫాం భద్రతా, గోప్యతా విధానాలకు విరుద్ధమని, ఇది యాప్ స్టోర్ ఎకోసిస్టమ్కు ముప్పు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించట్లేదు. శామ్సంగ్, షావోమీ వంటి ఆండ్రాయిడ్ తయారీదారులు ఈ ఆర్డర్ను సమీక్షిస్తున్నప్పటికీ ముందస్తు సంప్రదింపులు లేకుండానే ఆదేశాలు రావడంపై పరిశ్రమలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్లో టాప్లో నీతా అంబానీ..
వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘వైబ్ కోడింగ్’పై టెక్ దిగ్గజాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేచురల్ లాంగ్వేజీలో ఆదేశాలు ఇస్తూ ఏఐ ద్వారా కోడ్ను రాయించుకునే ఈ విధానంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుకూలంగా స్పందిస్తుంటే, టెక్ టైకూన్ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అంతగా దీన్ని సపోర్ట్ చేయడం లేదు. అందుకు వారు చెబుతున్న కారణాలు విభిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?వైబ్ కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (Software Development)లో కొత్తగా వాడుకలోకి వచ్చిన ఒక విధానం. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వ్యక్తులు కూడా తమ ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధారణ, రోజువారీ భాషలో(Natural Language Prompts) ఏఐ ఆధారిత టూల్స్కు (ఉదాహరణకు, Google's AI Studio, OpenAI Codex) కమాండ్ ఇస్తారు. ఏఐ ఆ ఆదేశాలను అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఫంక్షనల్ కోడ్ను జనరేట్ చేస్తుంది. కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా యాప్లు, వెబ్సైట్లు లేదా ప్రోటోటైప్లను సులభంగా తయారు చేయవచ్చు.సుందర్ పిచాయ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైబ్ కోడింగ్ను సానుకూలంగా చూస్తున్నారు. టెక్నికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు కూడా తమ ఆలోచనలను ప్రోటోటైప్లుగా మార్చవచ్చని చెబుతున్నారు. గతంలో ప్రాజెక్ట్లకు సంబంధించిన ఆలోచన గురించి మాటల్లో వివరించేవారు. ఇప్పుడు, వైబ్ కోడింగ్ ద్వారా ఆ ఆలోచనకు కోడెడ్ వెర్షన్ లేదా ప్రోటోటైప్ను జనరేట్ చేసే వీలుందన్నారు.శ్రీధర్ వెంబు..జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వైబ్ కోడింగ్ పట్ల అంతగా సానుకూలంగా లేరు. ఏఐ జనరేట్ చేసే కోడ్ మనకు అద్భుతంగా అనిపించినప్పటికీ, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందనే క్లిష్టమైన, లోతైన అవగాహన అవసరమన్నారు. ఏఐ సాధారణంగా రీయూజబుల్ కోడ్ను రాయడంలో సహాయపడుతుందన్నారు. కానీ, కోర్ లాజిక్, కొత్త సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు ఏఐకి ఉండవని చెప్పారు. ఇవి మానవ సృజనాత్మకత, అనుభవంపై ఆధారపడి ఉంటాయని వెంబు నమ్ముతున్నారు. కోడింగ్ అనేది ఓ మ్యాజిక్ అన్నారు. వైరుధ్యంలో ఏకాభిప్రాయంఈ రెండు దృక్పథాల మధ్య పిచాయ్ కూడా ఓ పోడ్కాస్ట్లో వైబ్ కోడింగ్ పరిమితులను అంగీకరించారు. కొన్ని రకాల లార్జ్, సెక్యూరిటీ సిస్టమ్స్కు వైబ్ కోడింగ్ సరిపోదన్నారు. అందుకు అనుభవం కలిగిన ఇంజినీర్లు అవసరమని చెప్పారు.
పర్సనల్ ఫైనాన్స్
దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రభుత్వ పథకాలు
ఆర్థిక అనిశ్చితులు, మార్కెట్ హెచ్చుతగ్గులు, జీవితంలో ఎదురయ్యే దీర్ఘకాలిక లక్ష్యాల (రిటైర్మెంట్, పిల్లల విద్య, వివాహం వంటివి) మధ్య సాధారణ ప్రజలు తమ డబ్బును సురక్షితంగా పెంపుచేసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరమైన రాబడినేచ్చే పథకాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ పథకాలు పూర్తిగా ప్రభుత్వ హామీతో ఎలాంటి రిస్క్ లేకుండా 7-8% వరకు వడ్డీ రేట్లు అందిస్తాయి. అందులో కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.ఈ పథకాల వడ్డీ రేట్లు 2025లో క్వార్టర్లవారీగా సమీక్షిస్తున్నప్పటికీ, ఆర్బీఐ విధానాల మార్పులకు అనుగుణంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. పీపీఎఫ్, ఎస్ఎస్వై వంటివి దీర్ఘకాలిక భద్రతకు ఉపయోగపడగా, ఎన్పీఎస్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్తో ఎక్కువ లాభాలు ఇస్తుంది. గత దశాబ్దంలో ఈ పథకాలు ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రజలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించాయి.పథకంలక్ష్యంవడ్డీ రేటు (ఏటా)వ్యవధిప్రయోజనాలుపబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, రిటైర్మెంట్7.1%15 సంవత్సరాలుపూర్తి పన్నుమినహాయింపు, రిస్క్ ఫ్రీ, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకం.నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)రిటైర్మెంట్ పెన్షన్10-12% (మార్కెట్-లింక్డ్)60 సంవత్సరాల వయసు వరకుఈక్విటీ/ డెట్ మిక్స్, 80C + అదనపు రూ.50,000 మినహాయింపు. యువతకు ఉపయోగకరం.సుకన్యా సమృద్ధి యోజన (SSY)ఆడపిల్లల విద్య/వివాహం8.2%21 సంవత్సరాలుపూర్తి పన్నుమినహాయింపు, మహిళా సాధికారతకు ప్రోత్సాహం.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)వృద్ధులకు ఆదాయం8.2% (క్వార్టర్లీ)5 సంవత్సరాలు60+ వయసు, 80C మినహాయింపుకిసాన్ వికాస్ పత్రా (KVP)మధ్యస్థ/దీర్ఘకాలిక పెట్టుబడి7.5%9 సంవత్సరాలు 5 నెలలు (డబుల్ అవుతుంది)గ్రామీణ ప్రజలకు ఉపయోగంనేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)మధ్యస్థ పెట్టుబడి7.7%5 సంవత్సరాలు80C మినహాయింపుఅటల్ పెన్షన్ యోజన (APY)అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ రిటైర్మెంట్రూ1,000-5,000/నెల పెన్షన్60 సంవత్సరాల వయసు18-40 సంవత్సరాల వారు దరఖాస్తు చేయాలి. గ్యారంటీడ్ పెన్షన్. ప్రస్తుతం వాటిలో పెట్టుబడి పెట్టే మార్గాలుఆధార్, పాన్కార్డ్, బ్యాంక్ అకౌంట్తో కేవైసీ పూర్తి చేస్తే చాలు పోస్ట్ ఆఫీస్, బ్యాంకుల డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా వీటిలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం అవుతుంది.పోస్ట్ ఆఫీస్ మార్గం (ఆఫ్లైన్/ఆన్లైన్)ఆఫ్లైన్: సమీప పోస్ట్ ఆఫీస్కు వెళ్లి సంబంధిత ఫామ్ (ఉదా., పీపీఎఫ్కు Form-1, ఎస్ఎస్వైకు Form-4) సమర్పించాలి.ఆన్లైన్: పోస్ట్ ఆఫీస్ ఐపీపీబీ యాప్ లేదా వెబ్సైట్ (indiapost.gov.in) ద్వారా కూడా ఆన్లైన్లో వీటిని ప్రారంభించవచ్చు.బ్యాంకింగ్ మార్గంఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో యాకౌంట్ తెరిచి నెట్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్/ ఎన్ఎస్సీ వంటి వాటిలో పెట్టుబడి చేయవచ్చు.ఇదీ చదవండి: వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా?: నాలుగు మార్గాలున్నాయ్గా..
ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికి ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) గురించి అవగాహన ఉంటుంది. అయితే కొందరికి పీఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉందనే విషయం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కథనంలో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?, దానికున్న మార్గాలు ఏమిటనేది వివరంగా తెలుసుకుందాం.మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్యూఏఎన్ పోర్టల్లో ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు.. తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా EPFOలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు.మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలనుకునే సభ్యులు ముందుగా.. మొబైల్ నెంబర్ను యూనిఫైడ్ పోర్టల్లో UANతో యాక్టివేట్ చేయాలి. దీనికోసం కావలసిన డాక్యుమెంట్లతో కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి.9966044425 కు కాల్ చేసినప్పుడు రెండు రింగ్ల తర్వాత స్వయంచాలకంగా డిస్కనెక్ట్ అవుతుంది. తరువాత ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అందులోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చూడవచ్చు.ఎస్ఎమ్ఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.EPFOHO UAN టెక్స్ట్లో మీ UAN నంబర్ను యాడ్ చేసి.. మీ ప్రాంతీయ భాషలో ప్రతిస్పందనను స్వీకరించాలనుకుంటే, టెక్స్ట్లో మీ UAN తర్వాత మీకు నచ్చిన భాష కోసం కోడ్ను వెల్లడించాలి. ఇది ఇంగ్లీష్, హిందీ (HIN), పంజాబీ (PUN), గుజరాతీ (GUJ), మరాఠీ (MAR), కన్నడ (KAN), తెలుగు (TEL), తమిళం (TAM), మలయాళం (MAL), బెంగాలీ (BEN) వంటి పది భాషల్లో అందుబాటులో ఉంటుంది.UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలంటే.. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.డౌన్లోడ్ చేసుకున్న తరువాత.. లాగిన్ అయి EPFO సేవలను యాక్సెస్ చేయడానికి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని లింక్ చేయాలి.లింక్ చేసిన తర్వాత, మీరు UMANG యాప్ ద్వారా మీ PF బ్యాలెన్స్ను సులభంగా చూడవచ్చు.EPFO వెబ్సైట్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి.. సర్వీసెస్ ఫర్ ఎంప్లాయీస్పై క్లిక్ చేసి, దీని కింద ఉన్న మెంబర్ పాస్బుక్పై క్లిక్ చేయాలి.EPFO పోర్టల్లో మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) & పాస్వర్డ్ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.ఇలా లాగిన్ అయిన తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత అనేది తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?
జెన్ జెడ్ ఇన్వెస్టర్లకు బీమా.. డైలమా
పూర్తిగా డిజిటల్ శకంలో పెరుగుతున్న జెన్ జెడ్ తొలి తరం ఇన్వెస్టర్లు.. డబ్బు, లైఫ్స్టయిల్, విశ్వసనీయతకు సంబంధించిన అభిప్రాయాలను తిరగరాస్తున్నారు. వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారు. ఎంచుకునే ప్రతి దాన్నుంచి గరిష్ట విలువను పొందడంపై దృష్టి పెడుతున్నారు. తాము ఉపయోగించే ప్రతి ప్రొడక్టు, సర్వీసు సరళంగా, వేగవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనితో వారికి అనుగుణమైన ప్రోడక్టులను అందించే విషయంలో ఈ పరిణామం, బీమా సంస్థలకు ఒక పెద్ద డైలమాగా మారింది. వారి వాస్తవ అవసరాలు, అందుబాటులో ఉన్న సాధనాల మధ్య అంతరాలను భర్తీ చేసేలా కొత్త సొల్యూషన్స్ని కనుగొనాల్సిన పరిస్థితి నెలకొంది.జెన్ జెడ్ తరం వారు ఆర్థిక ప్రణాళికలపై ఆసక్తిగానే ఉన్నప్పటికీ బీమాను ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలించడం లేదు. ఇటీవలి హెచ్డీఎఫ్సీ ఎర్గో నివేదిక ప్రకారం 61 శాతం యువత హెల్త్ ఇన్సూరెన్స్పై ఆసక్తి చూపగా, 37 శాతం మంది క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్ లభ్యతకు ప్రాధాన్యమిచ్చారు. బీమాకు ప్రాధాన్యమిస్తున్నప్పటికీ కేవలం సంప్రదాయ ఫీచర్లకే పరిమితం కాకుండా సౌకర్యం, తమకు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుందనే కోణాల్లో కూడా ఇన్సూరెన్స్ని చూస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది.జెన్ జెడ్ తరం టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై గణనీయంగా ఖర్చు చేస్తోంది. తమ లైఫ్స్టయిల్కి అనుగుణంగా, పారదర్శకమైన, సరళమైన ట్రావెల్, హెల్త్ పాలసీలను, గ్యాడ్జెట్స్ను కొనుగోలు చేసేందుకు వారు సిద్ధంగా ఉంటున్నారు. దానికి తగ్గట్లుగా వారికి అర్థమయ్యే రీతిలో బీమాను వివరించి, తగు పాలసీలను అందచేయగలిగితే ఇన్సూరెన్స్ ప్రయోజనాలను జెన్ జడ్ తరంవారికి మరింతగా చేరువ చేసేందుకు వీలవుతుంది.ఏం కోరుకుంటున్నారు..సరళత్వం: అర్థం కాని సంక్లిష్టమైన పదాలు, సుదీర్ఘంగా ఉండే పాలసీ డాక్యుమెంట్లను వారు ఇష్టపడటం లేదు. సాదా సీదాగా అర్థమయ్యే భాషను, డిజిటల్ సాధనాలను, స్పష్టతను కోరుకుంటున్నారు.పర్సనలైజేషన్: వారు సంప్రదాయ పద్ధతుల్లో గిరిగీసుకుని ఉండటం లేదు. ఫ్రీల్యాన్స్ కెరియర్లు మొదలుకుని ఇతరత్రా పార్ట్టైమ్ పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి పే–యాజ్–యు–డ్రైవ్ కార్ ఇన్సూ రెన్స్, అవసరాలకు తగ్గట్లు యాడ్–ఆన్లను చేర్చేందుకు వీలుండే హెల్త్ పాలసీలు, స్వల్పకాలిక కవరేజీల్లాంటి ప్రోడక్టులను వారు ఇష్టపడుతున్నారు.డిజిటల్ ఫస్ట్: ఫోన్తో చెల్లింపులు జరిపినట్లు లేదా ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డరు పెట్టినట్లు పాలసీ కొనుగోలు అనుభూతి కూడా సులభతరమైన విధంగా, వేగవంతంగా, మొబైల్ – ఫస్ట్ తరహాలో ఉండాలనుకుంటున్నారు.పారదర్శకత: నైతిక విలువలు, పారదర్శక విధానాలను పాటించే బ్రాండ్స్ వైపు జెన్ జెడ్ తరం మొగ్గు చూపుతున్నారు. సమాజం, పర్యావరణంపట్ల బాధ్యతాయుతంగా ఉండే సొల్యూషన్స్.. వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఈ నేపథ్యంలో జెన్ జడ్ తరం అవసరాలకి తగ్గ పాలసీలను అందించే దిశగా పరిశ్రమలో ఇప్పటికే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెలీమ్యాటిక్స్ ఆధారిత వాహన బీమా యువ డ్రైవర్లకు దన్నుగా ఉంటోంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీల్లో వెల్నెస్ ప్రోగ్రాంలు, నగదురహిత డిజిటల్ సర్వీసులు మొదలైనవి అందిస్తున్నాయి. ప్రయాణాలు కావచ్చు ఇతరత్రా కొనుగోళ్లు కావచ్చు అన్నింటి అంతర్గతంగా బీమా ప్రయోజనాన్ని అందించే విధానం క్రమంగా ఊపందుకుంటోంది.జెన్ జడ్ తరం వారు బీమాను భారంగా కాకుండా సాధికారతగా చూస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పడే భద్రత సాధనాలను వారు కోరుకుంటున్నారు. వృద్ధిలోకి వచ్చేందుకు ఇన్వెస్ట్ చేయదల్చుకుంటున్నారు. కాబట్టి బీమా అనేది డిజిటల్–ఫస్ట్గా, సరళంగా, పారదర్శకంగా ఉంటే కేవలం బ్యాకప్ వ్యూహంగా మాత్రమే కాకుండా వారు కోరుకునే జీవితాన్ని గడిపేందుకు సహాయపడే సాధనంగా ఉంటుంది.వారి ఆకాంక్షలకు తగ్గట్లు పరిశ్రమ కూడా తనను తాను మల్చుకోగలిగితే జెన్ జడ్ తరానికి చేరువ కావడంతో పాటు బీమా రంగ భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జెన్ జడ్ తరం అంటే ఏదో అల్లాటప్పా కస్టమర్ సెగ్మెంట్ కాదు, బీమా రంగం భవిష్యత్తుకు దిక్సూచిలాంటిది. కొత ఆవిష్కరణలను కనుగొనడం, పాలసీలను మరింత సరళం చేయడం, చక్కగా అర్థమయ్యేలా వివరించడంలాంటి అంశాల్లో పరిశ్రమ పురోగమనాన్ని ఇది మరింత వేగవంతం చేయనుంది.
Income Tax: నోటీసులా... నోటీసులే..!
రోజూ ఇన్కంట్యాక్స్ వారి వెబ్సైట్లోకి వెళ్లి మీ పర్సనల్ అకౌంటులో లాగిన్ అయ్యి మీ వివరాలు చూసుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఆడిటర్ నుంచి మీ లాగిన్ వివరాలు తీసుకోండి. ప్రతిసారి ఆడిటర్స్ దగ్గరకు పరిగెత్తకుండా మీరే లాగిన్ అవ్వొచ్చు.నోటీసు/సమాచారంఇన్కమ్ ట్యాక్స్ సైట్లో లాగిన్ అయ్యి ... డాష్ బోర్డులోని పెండింగ్ యాక్షన్స్లో ఈ–ప్రొసీడింగ్స్ని క్లిక్ చేయండి. అందులో నోటీసులు ఉంటాయి. ఆ నోటీసుని చూడండి. దీనిని VIEW అంటారు. దానిలో నోటీసులు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు నోటీసులో ఏముందో అర్థమవుతుంది.నోటీసులెన్నో రకాలు, మరెన్నో అంశాలుడిఫెక్టివ్ నోటీసు అంటారు. బదులుగా సకాలంలో దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.అలా సర్దుబాటు చేస్తే సరిపోతుంది.143 (1) ప్రకారం ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. ఆదాయంలో కానీ పన్ను భారం లెక్కింపులో కానీ వ్యత్యాసాలుంటే తెలియజేస్తారు. ఆదా యం ‘కాలమ్’ మీరు వేసింది. అధికారి అస్సె స్ చేసింది పక్కపక్కనే ఉంటాయి. ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూసుకొండి. హెచ్చుతగ్గులుంటాయి. మినహాయింపులుంటాయి.కూడికల్లో లేదా తీసివేతల్లో పొరపాట్లు రావచ్చు.పన్ను చెల్లింపుల విషయంలో రికార్డులు అప్డేట్ కాకపోవడం వల్ల తేడాలుంటాయి.అలాంటి సందర్భాల్లో ట్యాక్స్ చెల్లించమంటారు.ఆ సర్దుబాటు ఆర్డర్లు ఉంటాయి.మీరు వాటితో ఏకీభవిస్తేనే పన్ను కట్టండి. ఒప్పుకోకపోతే అంటే అంగీకరించకపోతే డాక్యుమెంట్లు పొందుపరుస్తూ జవాబు ఇవ్వండి.స్క్రూటినీకి ఎంపిక అయితే ఏయే సమాచారం ఇవ్వాలో అడుగుతారు. ఇవ్వండి.ముందుగా AGREE/ NOT AGREE చెప్పండిఅనవసరంగా వాయిదాలు అడగొద్దు. అవసరం అని తెలిస్తేనే టైం అడగండిఅంతా ఫేస్లెస్ ... మీ మీద ఎటువంటి ఒత్తిళ్లు ఉండవు.అధికారులు ఎంతో ఓపికగా మీ రిప్లై చదువుతారు.సాధారణంగా తప్పులేం జరగవుఅవసరం అయితే నిబంధనల మేరకు మీరు అప్పీల్కు వెళ్లవచ్చు.


