ప్రధాన వార్తలు
అరబిందో ఫార్మా థెరానిమ్ బయోలాజిక్స్ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యేక బయోలాజిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లలో (సీఎంఓ) ఒకటైన థెరానిమ్ కేంద్రాన్ని అరబిందో ఫార్మా ప్రారంభించింది. తెలంగాణ మంత్రులు డి. శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. బయోలాజిక్స్ తయారీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఈ ప్రాజెక్ట్కు ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్డీ ప్రధాన కస్టమర్గా చేరింది.ప్రారంభోత్సవానికి ముందు అరబిందో ఫార్మా డైరెక్టర్లు, ఎంఎస్డీ సీనియర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రాజెక్ట్ వివరాలు తెలియజేసి ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు. బయోలాజిక్స్ కాంట్రాక్ట్ తయారీ రంగంలో అరబిందో ఫార్మా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఏర్పాటైన థెరానిమ్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బయోలాజిక్ చికిత్సల డిమాండ్ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
ధనవంతుల రహస్యం చెప్పిన కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాత పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండిపై తన మద్దతును వ్యక్తం చేశారు. సంపదను కాపాడుకోవాలంటే బంగారం వంటి వాస్తవ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టులో, చాలామంది బంగారం కొంటే డబ్బు సంపాదించవచ్చని భావిస్తారని, కానీ ధనవంతులు ఆ ఉద్దేశంతో బంగారం కొనరని పేర్కొన్నారు. డాలర్పై నమ్మకం లేకపోవడమే బంగారం కొనడానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. తన వయోజన జీవితమంతా బంగారం, వెండి నిల్వ చేసుకుంటూ వచ్చానని, వాటి ధరలు భారీగా పెరుగుతాయని ఆశించి కాదు, డాలర్ విలువ కాలక్రమేణా తగ్గుతుందనే అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.ప్రభుత్వాలు కొత్త కరెన్సీని ముద్రించిన ప్రతిసారీ నగదు కొనుగోలు శక్తి తగ్గిపోతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం లాభాలను హామీ ఇవ్వదని, కానీ సంపదను రక్షించే సాధనంగా పనిచేస్తుందని చెప్పారు. కోట్లాది రూపాయలు అవసరం లేదని, ఒక వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలో బంగారం కొనుగోలు చేయడం ద్వారా కూడా సంపద రక్షణను ప్రారంభించవచ్చని సూచించారు.అయితే ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో సమయం గడపడం, తదుపరి స్టాక్ టిప్ కోసం ఎదురు చూడడం లేదా ప్రభుత్వమే తమను కాపాడుతుందని ఆశించడం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన డబ్బు బంగారం, వెండి వంటి విలువైన లోహాలేనని, కాగితపు కరెన్సీ కేవలం నకిలీ డబ్బు లాంటిదేనని ఆయన పేర్కొన్నారు.వేల ఏళ్లుగా బంగారం, వెండి సంపద నిల్వ సాధనాలుగా కొనసాగుతున్నాయని, కానీ అమెరికా డాలర్ 1971 నుంచి క్రమంగా విలువ కోల్పోతోందని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం ఉంచాలా, లేక బంగారంపై విశ్వాసం పెంచుకోవాలా అనేది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు.
అవి సాధారణ లాభాలే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) లాభాలు సాధారణ స్థాయికి తిరిగొచ్చాయే తప్ప పశ్చిమాసియా సంక్షోభం నుంచి అవేమీ భారీగా లబ్ధి పొందలేదని ప్రభుత్వ, పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2025–26లో మూడు ఓఎంసీలు కలిసి రూ. 77,821 కోట్ల లాభాలను ప్రకటించాయి. ఇది 2024–25తో పోలిస్తే ఏకంగా 130 శాతం అధికం. దీనితో ఆయిల్ కంపెనీలు పశ్చిమాసియా సంక్షోభం సాకుతో రేట్లను పెంచేసి అనూహ్య లాభాలను ఆర్జించాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు ఓఎంసీలైన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) నిపుణుల విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకుంది.వాస్తవానికి 2024–25లో వంట గ్యాస్ రేట్లు పెరగకుండా రేట్లను అదే స్థాయిలో కొనసాగించడం వల్ల ఓఎంసీలు రూ. 40,434 కోట్ల ఆదాయ నష్టాన్ని భరించాయి. ఫలితంగా 2024–25లో లాభాలు రూ. 33,602 కోట్లకు పరిమితమయ్యాయి. 2025–26లో లాభాలు భారీగా పెరిగినట్లు కనిపిస్తున్నా, అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో అవి భారీగా అండర్ రికవరీలను నమోదు చేయడం వల్ల, దానితో పోల్చి చూడటం సరికాదని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న లాభాలు 2023–24లో నమోదైన రూ. 80,986 కోట్ల స్థాయికి దరిదాపుల్లో ఉన్నాయని, ఈ స్థాయి ప్రాఫిట్స్ సాధారణమే తప్ప ఆకస్మిక లాభాలు కావని తెలిపారు.ఆ మాత్రం మార్జిన్లుండాలి.. కంపెనీల ఆదాయాల స్థాయిని వాటి పరిమాణాన్ని బట్టి మదింపు చేయాలని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీయంగా మూడు ఏఎంసీల వార్షికాదాయం రూ. 20 లక్షల కోట్ల పైగానే ఉంటుంది. ఐవోసీలాంటి రిఫైనింగ్ సంస్థ ఆదాయామే ఏటా రూ. 10 లక్షల కోట్లు ఉంటుంది. భారీ కమోడిటీ రిఫైనింగ్ సంస్థల నిర్వహణ మార్జిన్లు 1–3 శాతం ఉండటం సాధారణమేనని నిపుణులు తెలిపారు. మూలధన పెట్టుబడులను కొనసాగించడానికి, రిఫైనరీలను అప్గ్రేడ్ చేసుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ మాత్రం నిధులు కావాల్సి ఉంటుందని వివరించారు. కేవలం ఒక రిఫైనరీని విస్తరించాలన్నా రూ. 50,000–60,000 కోట్లు అవసరమవుతాయని తెలిపారు.2030 నాటికి రిఫైనింగ్ సామర్థ్యాలను వార్షికంగా 310 మిలియన్ టన్నులకు మించి పెంచుకోవాలని పరిశ్రమ నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 2025–26లో ఆదాయాలకు పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధం లేదని కంపెనీలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి సంక్షోభం తలెత్తడానికి 50–60 రోజుల ముందు కొన్న ముడిచమురును తాము శుద్ధి చేసినట్లు వివరించాయి. కాబట్టి పశ్చిమాసియా సంక్షోభంపరంగా క్రూడాయిల్ రేట్లు, రవాణా వ్యయాలు, ఇన్సూరెన్స్ సర్చార్జీల పెరుగుదల మొదలైనవన్నీ 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆదాయాల్లోనే కనిపించవచ్చంటున్నాయి. ఈ గణాంకాలు ఆగస్టులో వెల్లడవుతాయి.ప్రపంచంలో అయిదో వంతు ముడిచమురు హార్మూజ్ జలసంధి నుంచే రవాణా అవుతోంది. అక్కడ ఉద్రిక్తతల వల్ల ఆసియావ్యాప్తంగా ఆయిల్ ధరలు, షిప్పింగ్ వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. ఫిబ్రవరిలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి దేశీయంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ రేట్లు 8–9 శాతం పెరిగాయి. అయితే పలు పొరుగు దేశాల్లో నమోదైన 20–67 శాతం వరకు పెంపుతో పోలిస్తే ఇది తక్కువేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. పైగా 2026 మార్చి 27 నుంచి పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు తెలిపాయి.దీనితో 2021 నుంచి చూస్తే పెట్రోల్పై రూ. 23, డీజిల్పై రూ. 26 మేర సుంకాలను తగ్గించినట్లయిందని పేర్కొన్నాయి. ఇక ఓఎంసీల లాభాల్లో దాదాపు సగం వాటా డివిడెండ్లు, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వస్తుందని.. హైవేలు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టుల్లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మిగతా మొత్తాన్ని ఇంధన భద్రత కోసం, రిఫైనింగ్ సామర్థ్యాల పెంపు కోసం పెట్టుబడులకి వినియోగమవుతున్నాయని వివరించాయి.
అదానీ గ్రూప్ ఇబిటా రికార్డ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం, డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో రికార్డ్ నిర్వహణ లాభం(ఇబిటా) సాధించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,834 కోట్లు(10 బిలియన్ డాలర్లు) ఆర్జించింది. ఇదేసమయంలో రూ. 1.53 లక్షల కోట్ల(16.1 బిలియన్ డాలర్లు) పెట్టుబడి వ్యయాలు చేపట్టింది. ఇది సరికొత్త రికార్డ్కాగా.. వార్షికంగా అత్యధిక పెట్టుబడులు వెచ్చించిన దేశీ కార్పొరేట్ గ్రూప్గా నిలిచింది.దీంతో గ్రూప్ పోర్ట్ఫోలియో స్థూల ఆస్తుల విలువ రూ. 7.85 లక్షల కోట్ల(82.8 బిలియన్ డాలర్లు)కు చేరింది. పెట్టుబడుల్లో దాదాపు 80 శాతం ఎనర్జీ, యుటిలిటీస్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ బిజినెస్ తదితర కీలక మౌలిక సదుపాయాలపై వెచ్చించింది. అదానీ గ్రూప్ విడుదల చేసిన వివరాల ప్రకారం కన్సాలిడేటెడ్ ఇబిటా వార్షికంగా 5.6 శాతం బలపడింది.
ధనవంతుల్లో అంబానీని దాటేసిన టిక్టాక్ ఫౌండర్
చైనా టెక్ దిగ్గజం బైట్డాన్స్ (ByteDance) సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ (Zhang Yiming) సంపద మరోసారి భారీగా పెరిగింది. ఫలితంగా ఆయన భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీని (Mukesh Ambani)ను వెనక్కి నెట్టి ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.తాజా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం జాంగ్ యిమింగ్ నికర సంపద 92.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన చైనాలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. 2019లో బ్లూమ్బర్గ్ ఆయన సంపదను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పుడు అది కేవలం 13 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం ఏడు రెట్లకు పైగా పెరగడం విశేషం.ఈ వృద్ధికి ప్రధాన కారణం టిక్టాక్ ప్రపంచవ్యాప్త విజయంతో పాటు బైట్డాన్స్ అభివృద్ధి చేసిన డౌబావో (Doubao) ఏఐ చాట్బాట్కు చైనాలో లభిస్తున్న ఆదరణ. డౌబావోకు ఇప్పటికే 300 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో బైట్డాన్స్ దూకుడుగా పెట్టుబడులు పెడుతుండటం కూడా కంపెనీ విలువను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలపై గత కొన్నేళ్లుగా నెలకొన్న నియంత్రణ అనిశ్చితి కూడా ఇటీవల కొంతవరకు తగ్గింది. బైట్డాన్స్ తన అమెరికా వ్యాపారంలోని భాగాలను అమెరికన్ పెట్టుబడిదారులకు బదిలీ చేయడంతో కంపెనీపై ఉన్న రిస్క్ డిస్కౌంట్ను బ్లూమ్బర్గ్ తగ్గించింది. దీంతో సంస్థ విలువపై మరింత సానుకూల అంచనాలు వెలువడ్డాయి.ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు బ్లాక్రాక్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, టి.రోవీ ప్రైజ్, జనరల్ అట్లాంటిక్, తదితర సంస్థల తాజా విలువల అంచనాల ఆధారంగా జాంగ్ సంపద ఒక్కసారిగా 24 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు సమాచారం.అగ్రస్థానంలో గౌతమ్ అదానీఇక భారతీయ బిలియనీర్లలో ముకేశ్ అంబానీ 86.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆసియాలో మూడో స్థానానికి దిగజారగా, గౌతమ్ అదానీ (Gautam Adani) 117.4 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఏఐతో కొత్త శకానికి బైట్డాన్స్సోషల్ మీడియా కంపెనీగా ప్రారంభమైన బైట్డాన్స్ ఇప్పుడు ఏఐ రంగంలోనూ భారీ ఆశయాలతో ముందుకు సాగుతోంది. 2026లో ఏఐ మౌలిక సదుపాయాలు, చిప్స్, మోడల్ అభివృద్ధిపై భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. టిక్టాక్ విజయాన్ని ఏఐ వ్యాపారంలోనూ పునరావృతం చేయగలిగితే, జాంగ్ యిమింగ్ సంపద మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కెనరా బ్యాంక్కు కొత్త బాస్.. బ్రజేష్ కుమార్ సింగ్
బెంగుళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు కెనరా నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బ్రజేష్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం మే 30న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు బ్రజేష్ కుమార్ సింగ్ 2029 ఏప్రిల్ 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.మాజీ ఎండీ, సీఈఓ కె.సత్యనారాయణ రాజు పదవీ విరమణ అనంతరం స్థానంలో నియమితులయ్యారు. బ్రజేష్ కుమార్ సింగ్కు బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కెనరా బ్యాంక్లో చేరకముందు ఇండియన్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. అలహాబాద్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్లో వ్యవసాయ విద్యను అభ్యసించారు.ఫైనాన్స్లో ఎంబీఏ పట్టా పొందారు. బ్రజేష్ కుమార్ సింగ్ నాయకత్వంలో కెనరా బ్యాంక్ డిజిటల్ పరివర్తనను మరింత వేగవంతం చేయనుంది. ఆర్థిక చేరిక విస్తరణ, ఆస్తుల నాణ్యత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వినియోగదారుల సేవలను మెరుగుపరుస్తూ, షేర్ హోల్డర్లకు స్థిరమైన విలువను సృష్టించడమే లక్ష్యమని బ్యాంక్ తెలిపింది.
కార్పొరేట్
అరబిందో ఫార్మా థెరానిమ్ బయోలాజిక్స్ కేంద్రం ప్రారంభం
అవి సాధారణ లాభాలే..
అదానీ గ్రూప్ ఇబిటా రికార్డ్
ధనవంతుల్లో అంబానీని దాటేసిన టిక్టాక్ ఫౌండర్
కెనరా బ్యాంక్కు కొత్త బాస్.. బ్రజేష్ కుమార్ సింగ్
విమానయాన, ఇంధన సంస్థలకు గుడ్ న్యూస్: కేబినెట్ కీలక నిర్ణయం
ఒక్కో ట్రిప్పుపై రూ.300-రూ.400 భారం
అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంపై మహీంద్రా కన్ను
డీమెర్జర్ వేళ, వేదాంతకు ఎదురు దెబ్బ : ఈడీ దాడులు
సాఫ్ట్వేర్ విజయం సాధించాలంటే..
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి.. ఎప్పుడు 'నో' చెప్పాలి?
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడు ఎవరు...
నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ...
విరాట్ కోహ్లీ నేర్పే పెట్టుబడి పాఠాలు!
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫైనల్లో మరోసారి తన స్థిరమైన ...
పత్తి దిగుమతులకు సుంకాల నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: పత్తి దిగుమతులకు అయిదు నెలల పాటు అన్ని...
సవాళ్లున్నాయి, కానీ సంక్షోభం లేదు
పశ్చిమాసియా సంక్షోభం, ఇతరత్రా విదేశీ షాక్ల కా...
కరెన్సీ నోటు మీద ట్రంప్.. డిజైన్ రెడీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump...
వికసిత్ భారత్కు బ్యాంకింగ్ దన్ను
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాకారంలో బ్యాంక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఎనర్జీపై 170 బిలియన్ డాలర్లకు పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయంగా ఇంధనాలకు డిమాండ్ పెరుగుతుండటం, స్వచ్ఛ ఇంధనాలవైపు భారత్ వేగంగా మళ్లుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఎనర్జీ రంగంపై పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. సౌర విద్యుత్, ఆయిల్ రిఫైనింగ్ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తుడటంతో పెట్టుబడులు 2026లో 170 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఒక నివేదికలో వెల్లడించింది. ఎనర్జీ రంగంపై పెట్టుబడులు గత ఐదేళ్లుగా ఏటా 11 శాతం వృద్ధి చెందుతుండగా, వార్షికంగా సోలార్ ఫొటోవోల్టెయిక్ (పీవీ) ఏటా 25 శాతం, ఆయిల్ రిఫైనింగ్లో 23 శాతం పెరిగాయని పేర్కొంది. మొత్తం ఎనర్జీ రంగంలో ఇన్వెస్ట్మెంట్లో ఈ రెండు రంగాల వాటా దాదాపు పావు శాతం ఉన్నట్లు తెలిపింది. భారీ పెట్టుబడుల దన్నుతో 2030 నాటికి రిఫైనింగ్ సామర్థ్యాలు 15 శాతం మేర పెరగనున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. బొగ్గు సరఫరాకు సంబంధించి గత దశాబ్దకాలంలో భారత్ పెట్టుబడులు మూడింతలు పెరిగినట్లు వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఇటు విద్యుదుత్పత్తికి, అటు పారిశ్రామిక అవసరాలకి బొగ్గుకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. దేశీయంగా ప్రస్తుతం 1 బిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తిని 2030 నాటికి 1.5 బిలియన్ టన్నులకు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. ఈ క్రమంలో 2026లో బొగ్గు సరఫరాపై పెట్టుబడులు 13 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. → పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గ్రిడ్ ఆధునీకరణ, బ్యాటరీ స్టోరేజ్పైనా భారత్ మరింతగా ఇన్వెస్ట్ చేస్తోంది. దేశీయంగా స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన పెట్టుబడుల్లో ప్రస్తుతం సౌర, పవన విద్యుత్ వాటా సగానికి పైగా ఉంటోంది. దీనితో విద్యుత్ పంపిణీ, స్టోరేజ్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం పెరుగుతోంది. → 2020 నుంచి జల విద్యుత్, అణు విద్యుత్పై పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం 9 గిగావాట్లుగా ఉన్న అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా 49 శాతం వరకు విదేశీ ఓనర్షిప్తో రియాక్టర్ల నిర్మాణానికి ప్రైవేట్ కంపెనీలకు అనుమతినిస్తూ 2205లో సంస్కరణలను ప్రవేశపెట్టింది. → ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్పై 2026లో పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. గత ఐళ్లుగా ఇవి వార్షికంగా 15 శాతం మేర పెరుగుతున్నాయి. పునరుత్పాదక విద్యుత్ను, జాతీయ..రా్రïÙ్టయ గ్రిడ్లకు అనుసంధానించేందుకు ఉద్దేశించిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రోగ్రాంతో 3,000 కి.మీ. పైగా ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటయ్యాయి. తదుపరి దశల పనులు కొనసాగుతున్నాయి.
సెమీకండక్టర్ దిగ్గజంగా భారత్!
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ రంగంలో భారత్ కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా దిగ్గజంగా ఎదగాలని, 2035 నాటికి 120–150 బిలియన్ డాలర్ల (రూ.14.25 లక్షల కోట్లు సుమారు) విలువైన సెమీకండక్టర్ వ్యాల్యూచైన్ నిర్మించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని నీతి ఆయోగ్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు అవసరమైన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతును ప్రభుత్వమే సమకూర్చడం ద్వారా యాంకర్ పాత్రను పోషించాలంటూ, తద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కల్పించొచ్చని పేర్కొంది. ‘భారత్ దేశ సెమీకండక్టర్ పరిశ్రమ భవిష్యత్’ పేరుతో ఒక నివేదికను నీతి ఆయోగ్ రూపొందించింది. అంతర్జాతీయంగా పోటీనివ్వగలిగిన సెమీకండక్టర్ వ్యవస్థను దేశీయంగా నిర్మించుకునేందుకు 135–180 బిలియన్ డాలర్ల (రూ.17.10 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చే దశాబ్ద కాలంలో అవసరమవుతాయని తెలిపింది. ముఖ్యంగా డిజైన్, ఫ్యాబ్రికేషన్, అత్యాధునిక ప్యాకేజింగ్, మేటీరియల్స్, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ మేరకు పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొంది. దిగుమతులను తగ్గించుకోవాలి.. ప్రస్తుతం భారత్లో సెమీకండక్టర్ల డిమాండ్ వేగంగా పెరుగుతుండగా, ఇందులో 90 నుంచి 95 శాతం వరకు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. దీనివల్ల భారీగా విదేశీ మారకద్రవ్యం తరలిపోవడమే కాకుండా, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడినప్పుడు దేశ రక్షణ, డిజిటల్ రంగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. 2035 నాటికి దేశీయ సెమీకండక్టర్ మార్కెట్ 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా వ్యక్తం చేస్తూ.. ఈ డిమాండ్ను దేశీయంగానే తీర్చుకునే విధంగా పరిశ్రమను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. దేశీయంగా డిమాండ్ స్థాయిలో ఉత్పాదకత లేకపోవడాన్ని గొప్ప అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. టెక్నాలజీలో స్వావలంబనతోనే వికసిత్ భారత్ బ్లాక్బాక్స్ సాంకేతికతల దిగుమతులపై ఆధారపడడం వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పెద్ద అవరోధమని నీతి ఆయోగ్ వైస్చ ఐర్మన్ అశోక లాహిరి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు సాంకేతిక సౌర్వబౌమత్వం పునాది కావాలన్నారు. అది మౌలిక వసతుల నుంచే ఆరంభం కావాలన్నారు. సరికొత్త పరిశోధనలు, సొంత డిజైన్ల సృష్టి, దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే స్థిరమైన విధానాలు, అధునాతన ప్యాకేజింగ్ మరియు కాంపౌండ్ సెమీకండక్టర్ల ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి అవసరమని ఈ నివేదిక సూచించింది. భారతదేశం కేవలం చిప్స్ వినియోగించే దేశంగా కాకుండా, ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో ఒక తప్పనిసరి భాగస్వామిగా మారాలనే తమ సంకల్పాన్ని ఈ నివేదిక చాటిచెబుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివేదిక విడుదల సందర్భంగా పేర్కొన్నారు. సెమీ కండక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను (డిజైన్, నైపుణ్య వనరులు, మెటీరియల్స్, ఎక్విప్మెంట్, ఫ్యాబ్, ప్యాకేజింగ్) నిర్మించడంపై తాము దృష్టి పెట్టినట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఐటీ ఉద్యోగానికి గుడ్బై.. ఆటో డ్రైవింగ్తో హ్యాపీ లైఫ్!
ఐటీ ఉద్యోగాలు పైకి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. మంచి జీతం వస్తున్నా తాము పడే ఇబ్బందులు, పని ఒత్తిడి అంతా ఇంతా కాదని చాలా మంది ఐటీ ఉద్యోగులు చెబుతుంటారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఐటీ రంగంలో పనిచేసిన మహిళ తీసుకున్న విలక్షణ నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. కార్యాలయ ఉద్యోగంలోని తీవ్రమైన ఒత్తిడి, సుదీర్ఘ పనిగంటలు, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడం వంటి సమస్యలతో విసిగిపోయిన ఆమె చివరకు ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసింది.ఆటో డ్రైవర్గా కొత్త ప్రయాణంసుమారు 9 ఏళ్లు చేసిన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసిన ఆమె.. ఆ తర్వాత ఆటో రిక్షా నడపడం ప్రారంభించింది. తనకు నచ్చిన సమయాల్లో పని చేసుకునే స్వేచ్ఛ లభించడంతో పాటు, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించగలిగింది. ప్రస్తుతం తాను నెలకు సుమారు రూ.60 వేల వరకు ఆదాయం పొందుతున్నానని, గతంతో పోలిస్తే ఇప్పుడు తాను మరింత సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నానని ఆమె చెబుతోంది.సోషల్ మీడియాలో వైరల్ఈ మహిళ కథను మరో మహిళా ఎంట్రప్రెన్యూర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా విస్తృత చర్చకు దారితీసింది. సాంప్రదాయ కెరీర్ను వదిలి తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చే వృత్తిని, అది కూడా పురుషాధిక్యత ఉండే పనిని ఎంచుకోవడంపై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగం అంటే కేవలం అధిక జీతమే కాదని, జీవన నాణ్యత కూడా ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఐటీ ఉద్యోగుల స్పందనఈ కథకు స్పందించిన ఓ ఐటీ ఉద్యోగి, “18 ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్నా ఇప్పటికీ అంతులేని మీటింగ్లు, గంటల తరబడి కొనసాగే కాల్స్, అర్ధరాత్రి వచ్చే ప్రొడక్షన్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం” అంటూ వ్యాఖ్యానించారు. ఈ రంగంలో కొనసాగాలంటే ఎంతో సహనం, మానసిక స్థైర్యం అవసరమని పేర్కొన్నారు.ఆమె గతంలో సంపాదించిన ఆదాయంతో మంచి సేవింగ్స్ చేసి ఉండవచ్చని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం సరళమైన, ప్రశాంతమైన జీవితం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. చివరికి ప్రతి మనిషి కోరుకునేది మనశ్శాంతేనని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన ఉదాహరణను కూడా నెటిజన్లు పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే ఉద్యోగాన్ని వదిలి ఆటో రిక్షా నడపడం ప్రారంభించాడని, క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించి ఐదు ట్రక్కుల యజమానిగా ఎదిగాడని తెలిపారు. రూ.5 కోట్లకు పైగా సంపాదించినప్పటికీ ఇప్పటికీ ఆటో నడుపుతుండటం అతని వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Dr. Nezrin Midhlaj / Entrepreneur / Global Speaker (@dr.nezrin_midhlaj)
లగ్జరీ బైక్పై బెంగాల్ బీజేపీ మంత్రి రైడ్, వీడియో వైరల్
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ బైక్ రైడ్ చేసి ఆకట్టుకున్నారు. కోల్కత్తా వీధుల్లో ఖరీదైన హోండా గోల్డ్ వింగ్ను రాయల్గా చక్కర్లు కొట్టారు. ఈ రైడ్కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్ చేశారు. మరికొంతమంది మంత్రి బైక్ నడపడం చూసి ఆశ్చర్య పోయారు. హెల్మెట్ లేకుండా బైక్ ఎలా నడుపుతున్నారని కొంతమంది విమర్శిస్తే.. ఇంత ఆదాయం ఎక్కడిది అంటూ @IncomeTaxIndia ట్యాగ్ చేయడం విశేషం ఈ బైక్ ధర మార్కెట్లో దాదాపు రూ.53 లక్షల వరకు ఉంటుందని అంచనా.దీనికి సంబంధించిన వివరాలను కూడా మంత్రి దిలీప్ ఎక్స్లో షేర్ చేశారు, Honda BigWing సూపర్ బైక్ అత్యంత వేగవంతమైన, 1800cc సామర్థ్యం గల 6-సిలిండర్ల మోటార్సైకిల్. ఈ బైక్ ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాదు, అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. దీని వెనుక భాగంలో విశాలమైన స్థలం ఉంది; అక్కడ సోఫాలాంటి ప్రయాణీకుల సీటు ఉండటం వల్ల, వెనుక కూర్చునే వ్యక్తి కూడా అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు అంటూదీని ఫీచర్స్ గురించి రాసుకొచ్చారు.#WATCH | West Bengal Minister Dilip Ghosh seen riding a bike, in Kolkata this morning. pic.twitter.com/OKBr643M33— ANI (@ANI) May 29, 2026 1.1 Today, I rode a Honda BigWing superbike. It is a high-speed 1800cc, 6-cylinder motorcycle.The bike is extremely comfortable & offers incredible speed.There is ample space at the back with a sofa-like passenger seat,ensuring that the pillion rider can also sit very comfortably pic.twitter.com/al8jWEKVkF— Dilip Ghosh (Modi Ka Parivar) (@DilipGhoshBJP) May 29, 2026
పర్సనల్ ఫైనాన్స్
‘బ్యాంకులకూ బంగారంపైనే నమ్మకం’
ప్రపంచవ్యాప్తంగా బంగారం ప్రాధాన్యం మరింత పెరుగుతోందని ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో (ట్విట్టర్) చేసిన తాజా పోస్టు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.గత ఏడాదిలో బంగారం ధరలు సుమారు 65 శాతం పెరిగాయని, అదే సమయంలో బ్యాంకు పొదుపు ఖాతాలపై కేవలం 4 శాతం వార్షిక వడ్డీ మాత్రమే లభిస్తోందని కియోసాకి గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు అమెరికా ట్రెజరీ బాండ్లను విక్రయించి, వాటి స్థానంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.“ఈ పరిణామాలను గమనిస్తే పరిస్థితి ఏ దిశగా వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు” అంటూ కియోసాకి తన పోస్టులో వ్యాఖ్యానించారు. డాలర్ ఆధారిత ఆస్తుల కంటే బంగారం వంటి భౌతిక ఆస్తులపై విశ్వాసం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.కియోసాకి గత కొంతకాలంగా బంగారం, వెండి, బిట్కాయిన్లకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ ఆస్తులను పరిశీలించాలని ఆయన తరచూ సూచిస్తున్నారు.FYI:Gold up 65% in 1 year.Savings pay 4% a year.Central banks dumping US Treasuries for gold.Get the picture?— Robert Kiyosaki (@theRealKiyosaki) June 1, 2026
Income Tax: ఐటీఆర్ ఫారం 2 రెడీగా ఉంది..
గత వారం నుంచి ఆదాయపు పన్ను వారి ఈ–ఫైలింగ్ పోర్టల్లో ఫారాలను ఎనేబుల్ చేస్తున్నారు. మనం గతంలో ఫారం 1, ఫారం 4 గురించి తెలుసుకున్నాం. లేటెస్టుగా ఫారం 2 రెడీగా ఉంది. వివరాల్లోకి వెళ్దాం.ఈ ఫారం ఎవరు దాఖలు చేయాలి? వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు మాత్రమే ఐటీఆర్ ఫారం 2ను వేయగలరు. ఇతరులెవ్వరూ ఈ ఫారం ద్వారా తమ ఆదాయాలను డిక్లేర్ చేయకూడదు. ఐటీఆర్ ఫారం 1 వేయకూడనివారు (వేయలేకపోవడం కాదు.. వేయడానికి అర్హత లేని వారు), అలాగే బిజినెస్ / వృత్తిపై లాభనష్టాలు ఉండని వారు మాత్రమే ఈ ఫారం దాఖలు చేయడానికి అర్హులు.ఏయే ఆదాయాలున్నవారు వేయొచ్చు.. ß మూలధన లాభాలు (దీర్ఘకాలిక, స్వల్పకాలిక) ß ఒక ఇంటి ఆస్తి మీద, ఎక్కువ ఆస్తుల మీద ఆదాయం ఉన్నవారు ß విదేశీ ఆస్తుల మీద ఆదాయం ß విదేశాల నుంచి ఆదాయం ß జీతాలు / పెన్షన్ ß ఇతర ఆదాయాలు, లాటరీలు, గుర్రపు పందాలు, గ్యాంబ్లింగ్ వగైరా ఆదాయాలు ఉన్నవారు ß వ్యవసాయం మీద ఆదాయం రూ. 5,000 దాటినవారు ß మొత్తం ఆదాయం పరిమితి రూ. 50,00,000 దాటినవారు ß డైరెక్టర్స్ ß అన్లిస్టెడ్ ఈక్విటీ వాటాల్లో ఇన్వెస్ట్ చేసినవారుఏ ఆదాయం ఉన్నవారు వేయకూడదు.. వ్యక్తులు కానీ / హిందు ఉమ్మడి కుటుంబాలకు వ్యాపారం మీద / వృత్తి మీద ఆదాయం ఉన్నవారు ఫారం 2 వేయకూడదు.గడువు తేదీ ఎప్పుడు ఈ ఫారం దాఖలు చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31.తెలుసుకోవాల్సిన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ఫారం ఆన్లైన్లో గానీ ఆఫ్లైన్లో గానీ వేసుకోవచ్చు. ఈ కింద చెప్పబోయే విషయాల్లో పాత చట్టంలో పేర్కొన్న పేరు, ఫారాలను వాడుతున్నాం. 🔸 యజమాని జారీ చేసిన ఫారం 16 🔸 వివిధ డిడక్టర్లు జారీ చేసిన ఫారం 16ఏ 🔸 టీడీఎస్ వెరిఫికేషన్ కోసం ఫారం 26ఏఎస్ 🔸 ఇంటద్దె రశీదులు, ఒక్కొక్కప్పుడు యజమాని తీసుకోకపోయినా / పరిగణించకపోయినా మీరు డైరెక్టుగా క్లెయిమ్ చేయొచ్చు 🔸 బ్యాంకు పాస్బుక్స్ లేదా బ్యాంకు వాళ్లు ఇచి్చన స్టేట్మెంట్లు 🔸 ఫిక్స్డ్ డిపాజిట్ల రశీదులు 🔸 క్యాపిటల్ గెయిన్స్ – దీర్ఘకాలికమైనవైతే ఆస్తుల అన్ని వివరాలు, కాగితాలు, రశీదులు మొదలైనవి 🔸 క్యాపిటల్ గెయిన్స్ స్వల్పకాలికమైనా, ఆస్తులకు సంబంధించిన వివరాలు, కాగితాలు, రశీదులు 🔸 షేర్లు, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి బ్రోకింగ్ సంస్థలు / ఏజెన్సీలు జారీ చేసిన స్టేట్మెంట్లు, సర్టిఫికెట్లు మొదలైనవి 🔸 పాత పద్ధతిలో పన్నుభారం లెక్కించే విధానం ఎంపికలో 80సి, జీ, డి, జీజీ ఇలాంటి మినహాయింపులకు సంబంధించి కాగితాలు, నంబర్లు, వివరాల విషయంలో దయచేసి చాలా జాగ్రత్త వహించండి. షరా: కాగితాలు జతపర్చుకోనక్కర్లేదు, కానీ భద్రపరచాలి. వాటిలోని వివరాలు తెలియజేయాలి.కొత్త మార్పులు ప్రత్యేకించి 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నుల్లో సమాచారపరంగా వచ్చిన మార్పులు ఏమిటంటే, స్పల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ 15 శాతం కొన్ని, 10 శాతం కొన్ని ఉండేవి. కానీ ఇప్పుడు అన్నింటికీ ఒకే రేటు. తికమక ఉండదు. రివైజ్ రిటర్నుకి సంబంధించిన ఫీజు వివరాలు ఇవ్వాలి. 80సీ, 80డీ మొదలైన వాటి విషయాల్లో ప్రత్యేకంగా 80జీజీసీ వ్యవహారపు వివరాలు/ రిఫరెన్సు, పాన్ నంబరు ఇవ్వాలి. రిప్రజెంటేటివ్ అసెసీ వివరాల్లో పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు తెలియజేస్తే చాలు.
‘బంగారం, వెండి.. అలా కొన్నారంటే నష్టమే’
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికా ప్రభుత్వ బాండ్ల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రణాళికకర్తలు అమెరికా బాండ్లు సురక్షితమైన పెట్టుబడులని చెబుతున్నప్పటికీ, అలాంటి అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని ఆయన సూచించారు.సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో, “మూర్ఖత్వం నుంచి వచ్చే ఏ పెట్టుబడీ పూర్తిగా సురక్షితం కాదు” అని వ్యాఖ్యానించారు. బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి ఆస్తులు కూడా కేవలం ప్రచారం లేదా హైప్ ఆధారంగా కొనుగోలు చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.ప్రస్తుతం జపాన్, చైనా వంటి ప్రధాన అమెరికా బాండ్ హోల్డర్లు తమ వద్ద ఉన్న బాండ్లను విక్రయించి బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లలో నగదు ప్రవాహం ఏ దిశగా వెళ్తుందో గమనించడం మదుపరులకు ముఖ్యమని సూచించారు.అంతేకాకుండా, ఎవరికైనా అత్యంత విలువైన ఆస్తి వారి మెదడేనని, సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని కియోసాకి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించాలని ఆయన సూచించారు. Don’t drink financial planners Kool- Aide when they tell you US Bonds are safe. There is nothing safe….from stupidity. Remember even gold, silver, and Bitcoin can cost you money if purchased on hype.Best watch the cash flowing. Today many major US Bond holders, like…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 30, 2026
బ్యాంకులకు వెళ్లేవాళ్లకు అలర్ట్: 11 రోజులు సెలవులు!
బ్యాంకులు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయాయి. ప్రతిఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకు బ్రాంచిలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో బ్యాంకులు ఏ రోజుల్లో పనిచేస్తాయి.. ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయి.. అనే విషయాలను తెలుసుకోవడం అవసరం. దేశవ్యాప్తంగా బ్యాంకులకు జూన్ నెలలో గత నెలలతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే సెలవులు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా కొన్ని ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులు మూసివేస్తున్నందున ఖాతాదారులు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జూన్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉండగా, మిగిలిన రోజులు రాష్ట్రాల వారీగా అమలయ్యే ప్రత్యేక సెలవులు.మొహర్రం ప్రధాన సెలవుజూన్ 26న మొహర్రం (అషూరా) సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు మూసిఉంటాయి. ఇది జూన్ నెలలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రధాన సెలవుగా భావించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో మొహర్రం సెలవు జూన్ 25న ఉండగా, ఇతర చాలా రాష్ట్రాల్లో జూన్ 26న అమలులో ఉంటుంది.జూన్లో బ్యాంకు సెలవులుజూన్ 7 - ఆదివారంజూన్ 13 - రెండో శనివారంజూన్ 14 - ఆదివారంజూన్ 15 – మిజోరాంలో వైఎంఏ దినోత్సవం, ఒడిశాలో రాజ సంక్రాంతి సందర్భంగా సెలవుజూన్ 21 - ఆదివారంజూన్ 25 – ఆంధ్రప్రదేశ్లో మొహర్రం సెలవుజూన్ 26 – మొహర్రం/అషూరా సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవుజూన్ 27 - నాలుగో శనివారంజూన్ 28 - ఆదివారంజూన్ 29 – హిమాచల్ ప్రదేశ్లో సంత్ గురు కబీర్ జయంతిజూన్ 30 – మిజోరాంలో రెమ్నా నీ శాంతి దినోత్సవంఅందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకు శాఖలు మూసిఉన్నప్పటికీ, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్, పాస్బుక్ అప్డేట్లు, ఖాతా సంబంధిత సేవలు వంటి బ్రాంచ్ ఆధారిత పనులు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు.అనేక సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుండటంతో ఖాతాదారులు తమ ప్రాంతీయ బ్యాంకు శాఖల సెలవుల జాబితాను ముందుగానే పరిశీలించడం మంచిది. ఏవైనా అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉంటే సెలవుల తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది.


