Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

iSprout Launches 5 6 Lakh Sq Ft Enterprise Grade Workspace for GCCs in Hyderabad1
హైదరాబాద్‌లో ఐస్పౌట్ భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్ 'ఐస్పౌట్' (iSprout), హైదరాబాద్‌లోని మీనాస్ టవర్స్‌లో 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఎంటర్‌ప్రైజ్ గ్రేడ్ కార్యాలయాన్ని ప్రారంభించింది. 20 అంతస్తుల ఈ భారీ కాంప్లెక్స్‌లో ఇప్పటికే 10 అంతస్తులు ప్రముఖ కంపెనీలకు లీజుకు ఇవ్వడం విశేషం. ఈ సరికొత్త విస్తరణతో భాగ్యనగరంలో ఐస్పౌట్ మొత్తం పోర్ట్‌ఫోలియో 17 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), పెద్ద సంస్థలను లక్ష్యంగా చేసుకుని 100 నుంచి 3,000 సీట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.ఈ కొత్త కేంద్రం కేవలం కార్యాలయ సముదాయం మాత్రమే కాకుండా, ప్రతి క్లయింట్ అవసరాలకు అనుగుణంగా 'కస్టమ్ డిజైన్' చేసిన వర్క్‌స్పేస్‌లను అందిస్తోంది. హై-స్పీడ్ ఐటీ మౌలిక సదుపాయాలు, మీటింగ్ రూమ్‌లు, కొలాబరేషన్ సూట్‌లతో పాటు హై-ఎండ్ రెస్టారెంట్లు, కాఫీ షాపులు వంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం 60 రోజుల్లోనే కంపెనీల బ్రాండ్ నిబంధనల ప్రకారం కార్యాలయాన్ని సిద్ధం చేసి అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లకు సమీపంలో ఉండటం, మెట్రో కనెక్టివిటీ ఉండటం ఈ కేంద్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఐస్పౌట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 నగరాల్లో 26 కేంద్రాలను నిర్వహిస్తూ, 350కి పైగా కంపెనీలకు సేవలు అందిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 14,000 సీట్లుగా ఉన్న కంపెనీ సామర్థ్యం, 2026 నాటికి 43,000 సీట్లకు చేరుకోవడం సంస్థ వేగవంతమైన వృద్ధికి నిదర్శనం. హైదరాబాద్ తమకు అత్యంత వ్యూహాత్మక మార్కెట్ అని, గ్లోబల్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇక్కడ మౌలిక వసతుల నిర్వహణ బాధ్యతలను తాము తీసుకుంటామని ఐస్పౌట్ సీఈఓ, కో-ఫౌండర్ సుందరి పాటిబండ్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Indias New CCTV Regulations What Hikvision TP Link Users Need to Know2
చైనా సీసీ కెమెరాలకు చెక్‌! ఇక కొత్త నిబంధనలు

దేశ భద్రత, సైబర్ రక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చైనాకు చెందిన పలు కంపెనీల సీసీటీవీ (CCTV) కెమెరాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇంటర్నెట్ ఆధారిత కెమెరాల నిఘాను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 1 నుండి మారిన నిబంధనలు ఇవే..ఏప్రిల్ 1 నుండి దేశంలో విక్రయించే ప్రతి ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీటీవీ కెమెరా తప్పనిసరిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన STQC (స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్) ఫ్రేమ్‌వర్క్ నుండి అనుమతి పొందాలి.కంపెనీలు తమ కెమెరాలలో ఉపయోగించే సిస్టమ్-ఆన్-చిప్ (SoC) లేదా ప్రాసెసర్ ఎక్కడ తయారైందో స్పష్టంగా తెలియజేయాలి.ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ, హార్డ్‌వేర్ మూలం, ఫర్మ్‌వేర్ భద్రత మరియు ట్యాంపరింగ్ (ట్యాంపర్ రెసిస్టెన్స్) వంటి అంశాలపై STQC అధికారులు పరీక్షలు నిర్వహిస్తారు.కెమెరా డేటాను ఇతరులు రిమోట్‌గా యాక్సెస్ చేసే అవకాశం ఉందో లేదో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.విదేశాల నుండి దిగుమతి చేసుకునేవే కాకుండా, భారత్‌లో అసెంబుల్ చేసే పరికరాలు కూడా ఈ పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. క్లియరెన్స్ లేని ఉత్పత్తుల విక్రయం ఇకపై చట్టవిరుద్ధం.ఏ బ్రాండ్‌లపై ప్రభావం పడుతుంది?భారత సీసీటీవీ మార్కెట్‌లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన హిక్ విజన్ (Hikvision), టీపీ-లింక్ (TP-Link), దహువా (Dahua) వంటి ప్రముఖ చైనా కంపెనీలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం వీరు కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.పాత కెమెరాల పరిస్థితి ఏమిటి?ఇప్పటికే ఇళ్లు, కార్యాలయాల్లో వాడుతున్న కెమెరాల విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రస్తుత కెమెరాలను స్వాధీనం చేసుకోదు. పాత కెమెరాలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, భవిష్యత్తులో ఆయా కంపెనీల నుండి వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ (మరమ్మతులు) విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.ధరలు పెరుగుతాయా?చైనా కంపెనీలకు ఆంక్షలు ఎదురైనప్పటికీ, భారతీయ బ్రాండ్లు సీపీ ప్లస్ (CP Plus), ప్రమా (Prama), క్యోబో (Kyobo), మ్యాట్రిక్స్ (Matrix), స్పర్ష్ (Sparsh) ఇప్పటికే తమ ఉత్పత్తిని భారీగా పెంచాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వీటి వాటా 80 శాతానికి చేరుకుంది. అయినప్పటికీ, భద్రతా పరీక్షల కోసం అయ్యే అదనపు ఖర్చు, సరఫరాదారుల సంఖ్య తగ్గడం వల్ల, రానున్న రోజుల్లో ముఖ్యంగా మిడ్, ప్రీమియం రేంజ్ కెమెరాల ధరలు కొంత మేర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Airtel Announces 1 Billion Investment in Nxtra Led by Alpha Wave Global3
ఎయిర్‌టెల్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు

భారతీ ఎయిర్‌టెల్ తన డేటా సెంటర్ విభాగమైన 'నెక్స్ట్రా' (Nxtra)లో భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆల్ఫా వేవ్ గ్లోబల్, కార్లైల్, యాంకోరేజ్ క్యాపిటల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కలిసి సుమారు 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,300 కోట్లు) నిధులను సమకూర్చనున్నాయి. ఈ పెట్టుబడిలో భారతీ ఎయిర్‌టెల్ కూడా పాలుపంచుకోనుంది. ఈ నిధుల సేకరణ అనంతరం నెక్స్ట్రా సంస్థ విలువ సుమారు 3.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.ఈ ఒప్పందంలో భాగంగా ఆల్ఫా వేవ్ గ్లోబల్ 435 మిలియన్ డాలర్లు, కార్లైల్ 240 మిలియన్ డాలర్లు, యాంకోరేజ్ క్యాపిటల్ 35 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఎయిర్‌టెల్ సంస్థే సమకూర్చనుంది. ఈ పెట్టుబడుల తర్వాత కూడా నెక్స్ట్రాలో మెజారిటీ వాటా ఎయిర్‌టెల్ వద్దే ఉంటుంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డేటా సెంటర్ల విస్తరణే లక్ష్యంగా ఈ నిధులను వినియోగించనున్నారు.ప్రస్తుతం నెక్స్ట్రా సంస్థకు దేశవ్యాప్తంగా 300 మెగావాట్ల సామర్థ్యం ఉండగా, రానున్న కొన్నేళ్లలో దీన్ని 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో శరవేగంగా పెరుగుతున్న క్లౌడ్ సేవలు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, హైపర్‌స్కేలర్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ఈ విస్తరణ దోహదపడనుంది. దేశీయ డేటా సెంటర్ మార్కెట్‌లో 25 శాతం వాటాను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.నెక్స్ట్రా ఇప్పటికే పుణెలో అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉండగా, తాజాగా చెన్నై, ముంబై, కోల్‌కతాలలో ఏఐ-రెడీ (AI-ready) క్యాంపస్‌లను నిర్మిస్తోంది. గూగుల్‌తో కలిసి గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 14 ప్రధాన కోర్ డేటా సెంటర్లు, 120కి పైగా ఎడ్జ్ కేంద్రాలతో నెక్స్ట్రా తన సేవలను అందిస్తోంది. ఈ కొత్త పెట్టుబడులతో భారత్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Gold and Silver rates on April 1 evening in Telugu states4
గంటల్లోనే రెచ్చిపోయిన బంగారం రేట్లు

దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. బుధవారం ఉదయం మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత రెచ్చిపోయాయి.హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం రూ.1800 పెరిగి రూ.1,38,850 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.3150 పెరిగి రూ.1,40,200 లకు ఎగిసింది.అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం ఉదయం రూ.1970 పెరిగి రూ.1,51,480 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మొత్తం రూ.3440 పెరిగి రూ. 1,52,950 లకు ఎగబాకింది.ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈరోజు సిల్వర్‌ కేజీకి రూ.15000 పెరిగి రూ.2,65,000 వద్దకు ఎగిసింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

CBI Registers Fresh Case Against Anil Ambani RCom Over LIC Loss Allegation5
LICకి రూ.3,750 కోట్ల నష్టం.. అనిల్‌ అంబానీపై కేసు

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని కష్టాలు వీడటం లేదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ద్వారా ఎల్ఐసీని (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మోసగించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తాజా కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి సుమారు రూ.3,750 కోట్ల మేర ఎల్ఐసీకి నష్టం కలిగించారనేది ప్రధాన ఆరోపణ.అసలేం జరిగింది?కేసు వివరాల ప్రకారం.. 2009 నుంచి 2012 మధ్య కాలంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCD) జారీకి పూనుకుంది. ఆ సమయంలో కంపెనీ ఆర్థిక స్థితిగతులు, ఆస్తుల భద్రతపై తప్పుడు సమాచారం ఇచ్చి ఎల్ఐసీని నమ్మించారు. దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ఎన్సీడీలను కొనుగోలు చేసేలా ఎల్ఐసీని ప్రేరేపించారు. చివరికి ఈ వ్యవహారంలో ఎల్ఐసీకి రూ.3,750 కోట్లకు పైగా నికర నష్టం వాటిల్లింది.ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తుపోయే నిజాలుబీడీఓ ఇండియా ఎల్ఎల్పీ (BDO India LLP) 2020లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఈ కుంభకోణంలోని లోతుపాతులను బయటపెట్టింది. ఆ నివేదిక ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి సేకరించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు. షెల్ కంపెనీలు, అనుబంధ సంస్థల ద్వారా ఇంటర్-కంపెనీ డిపాజిట్ల పేరుతో నిధులను స్వాహా చేశారు. ఉనికిలో లేని అమ్మకాల ఇన్వాయిస్‌లు, కల్పిత బిల్లులను సృష్టించి ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. సెక్యూరిటీగా చూపిన ఆస్తుల విలువను వాస్తవం కంటే భారీగా పెంచి చూపినట్లు తేలింది. కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై అవినీతి నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ, ఆర్‌కామ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు అధికారులు తెలిపారు.వరుస కేసులుఅనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు చేయడం ఈ నెలలో ఇది రెండోసారి. మార్చి 8న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఫిర్యాదు మేరకు రూ.1,085 కోట్ల బ్యాంకు మోసం కేసు నమోదైంది. ఇందులో పీఎన్‌బీకి రూ.621.39 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.463.80 కోట్ల మేర బకాయిలు పడ్డారు. తాజా ఎల్ఐసీ కేసుతో అనిల్ అంబానీ సహా మాజీ డైరెక్టర్ల చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది.

Indias Flex Office Sector Eyes 10 Billion Valuation by 20286
రియల్ ఎస్టేట్‌కు గట్టి పోటీ ఇస్తున్న ‘ఫ్లెక్స్ ఆఫీస్’

దేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ (ఫ్లెక్స్ ఆఫీస్) పరిశ్రమ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలో ఈ రంగం ఇప్పటికే 100 మిలియన్ చదరపు అడుగుల మార్కును దాటడమే కాకుండా, లాభాల బాటలో పయనిస్తూ సరికొత్త వృద్ధి దశలోకి ప్రవేశించింది. అనరాక్‌ ‍గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ మార్కెట్‌ప్లేస్‌ ‘మైహెచ్‌క్యూ’(myHQ) విడుదల చేసిన క్యూ3 (Q3 FY26) ఫ్లెక్స్ ఆఫీస్ నివేదిక ప్రకారం.. 2028 నాటికి ఈ రంగం విలువ ఏకంగా 9 నుండి 10 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.ఒకప్పుడు కేవలం స్టార్టప్‌లకే పరిమితమైన ఈ రంగం.. ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs), బడా కార్పొరేట్ సంస్థల రాకతో సరికొత్త రూపును సంతరించుకుంది. కొత్తగా బుక్ అవుతున్న సీట్లలో దాదాపు 40% వాటాను ఇవే కైవసం చేసుకుంటున్నాయి. గత రెండేళ్లలో సగటు డీల్ సైజు 25 సీట్ల నుండి ఏకంగా 53 సీట్లకు పెరగడం విశేషం. దీన్నిబట్టి ప్రధాన స్రవంతి రియల్ ఎస్టేట్ వ్యూహాల్లో ఫ్లెక్స్ ఆఫీస్‌ల ప్రాధాన్యత ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.లాభాల బాటలో దిగ్గజాలుఈ రంగంలో 2026 ఆర్థికేడాదిలోని మూడో త్రైమాసికం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మార్కెట్లోని పలు అగ్రగామి లిస్టెడ్ ఆపరేటర్లు ఒకేసారి లాభాల్లోకి రావడం విశేషం. 'వీవర్క్ ఇండియా' (WeWork India), 'స్మార్ట్‌వర్క్స్' (Smartworks) రెండు సంస్థలూ లాభాలు ఆర్జించాయి. ఇందులో 'స్మార్ట్‌వర్క్స్' అత్యధికంగా 490 బేసిస్ పాయింట్ల మార్జిన్ వృద్ధిని నమోదు చేసి రికార్డు సృష్టించింది.వృద్ధికి ప్రధాన కారణాలు ఇవే..కార్పొరేట్ సంస్థల మొగ్గు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) సంస్థలు ఈ ఆఫీస్‌లను ఎక్కువగా ఎంచుకుంటుండటంతో పరిశ్రమకు దీర్ఘకాలిక స్థిరత్వం లభిస్తోంది.ఆదాయ వనరుల వైవిధ్యం: కేవలం ఆఫీస్ స్పేస్‌పైనే కాకుండా.. MICE (సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్లు), డే పాస్‌లు, ప్రైవేట్ క్యాబిన్లు, ఇతర విలువ ఆధారిత సేవల ద్వారా ఆపరేటర్లు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొత్తం ఆదాయంలో వీటి వాటా 12-16% గా ఉంది.ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరణ: బెంగళూరులోని సర్జాపూర్, హెబ్బాల్, హైదరాబాద్‌లోని కోకాపేట, పూణేలోని హింజేవాడి, చెన్నైలోని ఓఎంఆర్‌వంటి మెట్రో ప్రాంతాలతో పాటు.. అహ్మదాబాద్, కొచ్చి, ఇండోర్ వంటి టైర్-2 నగరాలు కూడా ఇప్పుడు ప్రధాన హబ్‌లుగా మారుతున్నాయి.భారీ పెట్టుబడులు: గ్లోబల్ ఫండ్స్ రాక, ఐపీఓ (IPO)ల ద్వారా నిధుల సమీకరణ ఈ రంగం మరింత వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తున్నాయి.సంప్రదాయ రియల్ ఎస్టేట్‌కు గట్టి పోటీఈ పరిణామాలపై మైహెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉత్కర్ష్ కవాత్రా మాట్లాడుతూ.. ‘ఫ్లెక్స్ ఆపరేటర్లు ఇప్పుడు కేవలం తమలో తాము మాత్రమే పోటీ పడటం లేదు. సంప్రదాయ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌తో తలపడుతూ.. ఫ్లెక్సిబులిటీ, వేగం, మూలధన సామర్థ్యంతో విజయం సాధిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement