ప్రధాన వార్తలు
‘ఆఫీస్ పిక్నిక్’ వేళ.. అందరూ ఒక్కటే!
ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో డెడ్లైన్లు, క్లయింట్ కాల్స్, మీటింగ్లు.. అంటూ ఉద్యోగులు నిరంతరం ఒత్తిడిలో గడుపుతుంటారు. కనీసం ప్రశాంతంగా భోజనం చేసే సమయం కూడా దొరకని ఈ రోజుల్లో ఒక సంస్థ మాత్రం వినూత్న సంస్కృతికి తెరలేపింది. పని వేళల్లో రోజూ తప్పనిసరిగా ఒక గంట పాటు పనులకు బ్రేక్ ఇచ్చి ఉద్యోగులందరూ కలిసి భోజనం చేయాలనే నియమాన్ని ‘కేకే క్రియేట్’(KK Create) వ్యవస్థాపకురాలు కావ్య అమలు చేస్తున్నారు. ఈ ‘ఆఫీస్ పిక్నిక్’ విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు వర్క్ కల్చర్పై చర్చకు దారితీసింది.ఎవరూ ఒంటరిగా తినరుకేకే క్రియేట్ సంస్థలో సుమారు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వివిధ విభాగాల్లో కఠినమైన టార్గెట్లతో పని చేసే ఈ బృందం మధ్యాహ్నం 2 గంటలయ్యిందంటే చాలు పని ఒత్తిడిని పక్కనపెట్టాల్సిందే. ఓ గంటపాటు ఎటువంటి మినహాయింపులు ఉండవు. మేనేజర్ నుంచి ఫ్రెషర్ వరకు అందరూ ఒకే చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటా భోజనం చేస్తారు.ఈ సంస్కృతిపై కావ్య కర్ణాటక లింక్డ్ఇన్లో రాస్తూ ‘మా కార్యాలయంలో ప్రతిరోజూ ఒక గంట పిక్నిక్ జరుగుతుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. ఆ సమయంలో ఆఫీసులో హైరార్కీ ఉండదు. అందరం కలిసి కూర్చుంటాం. జోకులు వేసుకుంటాం. ఆటలు ఆడుకుంటాం. దీనివల్ల పని పట్ల భారం తగ్గుతుంది’ అని పేర్కొన్నారు.పని తర్వాత చూద్దాం.. ముందు భోజనం చేద్దాంసాధారణంగా కార్పొరేట్ ఆఫీసుల్లో పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, ఇక్కడ సీనియర్ సభ్యులే ముందుండి ‘ఆజావో లంచ్ కర్నే, కామ్ బాద్ మే కర్నా’ (రండి భోజనం చేద్దాం, పని తర్వాత చూద్దాం) అని ప్రోత్సహిస్తుంటారు. ఈ సమయం కేవలం భోజనానికే పరిమితం కాకుండా ఉద్యోగుల మధ్య బలమైన బంధాలను పెంచే సామాజిక సమయంగా మారుతోందని కావ్య వివరించారు.నెటిజన్ల ప్రశంసల వెల్లువఈ పోస్ట్కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. పని సంస్కృతి అంటే కేవలం సమావేశాలు, విధానాలు మాత్రమే కాదని ఇలాంటి చిన్న వ్యవహారాలే అసలైన బంధాలను నిర్మిస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రొడక్టివిటీ పెంచమని చెప్పే క్రమంలో చాలా కంపెనీలు మానవ సంబంధాలను మర్చిపోతున్నాయి. కానీ, ఇలాంటి విధానం ఉద్యోగులను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరోవైపు, అత్యవసరమైన క్లయింట్ కాల్స్ లేదా డెడ్లైన్ల సమయాల్లో ఈ ఒక గంట విరామాన్ని ఎలా నిర్వహిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి కావ్య స్పందిస్తూ, ‘ఆ సమయంలో మాకు ఏదీ ముఖ్యం కాదు. ఒక గంట పాటు పని నుంచి పూర్తిగా దూరమవ్వడం వల్ల తిరిగి పనిలో చేరినప్పుడు మరింత సామర్థ్యంతో పనిచేయగలుగుతున్నాం’ అని బదులిచ్చారు.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్!
వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి..
ఒకప్పుడు పట్టణ రవాణా వ్యవస్థను శాసించిన యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల నమూనా ప్రస్తుతం గందరగోళ పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు వేల రూపాయల ఆదాయం, విలాసవంతమైన జీవితం అంటూ ఊరించిన ఈ వ్యవస్థ నేడు వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. తీసుకున్న అప్పులు కట్టకపోవడంతో వెహికిల్ లోన్లు ఇచ్చిన బ్యాంకులు 30,000లకు పైగా క్యాబ్లను జప్తు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వెనుక ఉన్న చేదు నిజాలు ఏమిటో విశ్లేషిద్దాం.ఓలా/ ఉబెర్ నమూనాయాప్-ఆధారిత క్యాబ్ కంపెనీల వృద్ధిని నిశితంగా పరిశీలిస్తే అవి నాలుగు దశల్లో తమ నెట్వర్క్ను విస్తరించాయి.1. నగదు వెల్లువ: ప్రారంభంలో భారీగా ఇన్సెంటివ్లు ఇచ్చి మార్కెట్ను ఆక్రమించాయి.2. నమ్మకం: డ్రైవర్లకు నెలకు రూ.70,000 నుంచి రూ.80,000 వరకు ఆదాయం వస్తుందనే ఆశ కల్పించాయి.3. ఆధారపడటం: డ్రైవర్లు ఆ ఆదాయాన్ని నమ్మి భారీగా కార్ లోన్లు తీసుకుని సొంత వాహనాలు కొనుగోలు చేశారు.4. నియంత్రణ: మార్కెట్ను గుప్పిట్లోకి తెచ్చుకున్నాక ఇన్సెంటివ్లను తగ్గించి కమిషన్లను పెంచాయి.అప్పుల ఊబిలో డ్రైవర్లుకంపెనీల వ్యూహాలు మారడంతో డ్రైవర్ల ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులకు తోడు ఇన్సెంటివ్లు తగ్గడంతో డ్రైవర్ల చేతికి వచ్చే ఆదాయం రూ.30,000 నుంచి రూ.35,000కు పరిమితమైంది. దీంతో తీసుకున్న కార్ లోన్ల ఈఎంఐలు కట్టడం డ్రైవర్లకు భారమైంది.కొవిడ్ సంక్షోభం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఆదాయం లేక, అప్పులు తీర్చలేక దాదాపు 30,000కు పైగా క్యాబ్లను బ్యాంకులు జప్తు చేశాయి. వాహనాల జప్తుతోపాటు లక్షలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది.మారుతున్న ధోరణిప్రస్తుతం డ్రైవర్ల ఆలోచనా ధోరణి మారింది. అప్పుల భారం లేని, రిస్క్ తక్కువగా ఉండే డెలివరీ పార్టనర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదాయం తక్కువైనా సొంత వాహనంపై అప్పుల బాధ్యత లేకపోవడమే వారికి ఇప్పుడు ఊరటనిస్తోంది.ప్రయాణికులపై భారంమరోవైపు, ప్రయాణికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఒక సామాన్య ప్రయాణికుడు ప్రధాన నగరాల్లో సరాసరి నెలవారీ క్యాబ్ ప్రయాణాల కోసం దాదాపు రూ.27,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సొంత కారును కొని మెయింటెనెన్స్ చేసుకునే ఖర్చు కంటే ఎక్కువ కావడం గమనార్హం.క్యాబ్-హెయిలింగ్ ఎకోసిస్టమ్ కేవలం డ్రైవర్లకే కాకుండా కంపెనీలకు, ప్రయాణికులకు కూడా నష్టదాయకంగా మారింది. కేవలం గ్రోత్ మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మోడల్ స్థిరత్వం వైపు దృష్టి సారించకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థపై పునసమీక్షించుకోకపోతే ఈ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్!
కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అత్యంత ప్రభావవంతమైన ఓపెన్ ఏఐ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన కోర్టు విచారణలో ఉత్కంఠ నెలకొంది. సంస్థ సహ వ్యవస్థాపకులు సామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రోక్మన్లపై ఎలాన్ మస్క్ దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 30న జరిగిన విచారణ వాడీవేడిగా సాగింది. ప్రజా ప్రయోజనం కోసం స్థాపించిన లాభాపేక్ష లేని సంస్థ ఇప్పుడు భారీ వాణిజ్య సంస్థగా మారిందని, ఇది విశ్వాసఘాతకమని మస్క్ గట్టిగా వాదించారు.కోర్టు గదిలో మాటల యుద్ధంవిచారణ సందర్భంగా ఓపెన్ ఏఐ న్యాయవాది విలియం సావిట్, మస్క్ను ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సంస్థ లాభాపేక్ష లేని మార్గంలో కాకుండా వాణిజ్య పరంగా వెళ్తుందని తెలిసినా మస్క్ ఎందుకు మౌనంగా ఉన్నారని, పాత ఒప్పంద పత్రాలను (2017 టర్మ్ షీట్) ఉటంకిస్తూ సావిట్ ప్రశ్నించారు. ఈ క్రమంలో మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘నేను ఆ పత్రాల్లోని ఫైన్ ప్రింట్ చదవలేదు. కేవలం శీర్షికను మాత్రమే చూశాను. ఆల్ట్మన్, ఇతరులు ఇచ్చిన హామీలనే నమ్మాను’ అని మస్క్ బదులిచ్చారు. సావిట్ పదేపదే తనను మధ్యలో ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్, ‘మీరు నన్ను ప్రతిసారీ నియంత్రించాలనుకుంటే సమాధానాలు ఎలా పూర్తవుతాయి?’ అని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ స్పందిస్తూ, న్యాయవాదిని హెచ్చరించినప్పటికీ మస్క్ చేసిన అభ్యంతరాలను పూర్తిగా సమర్థించలేదు.నమ్మకద్రోహం జరిగిందితాను ఓపెన్ ఏఐని లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగుతుందని విశ్వసించి మద్దతు ఇచ్చానని, అయితే ఇప్పుడు అది నిబంధనలను ఉల్లంఘిస్తోందని మస్క్ ఆరోపించారు. ‘ఒక స్వచ్ఛంద సంస్థ తీరును మార్చకూడదు’ అని అన్నారు. ఈ కేసులో భాగంగా ఆయన 150 బిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు సంస్థ నిర్మాణంలో సమూల మార్పులు చేయాలని, ఆల్ట్మన్, బ్రోక్మన్లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఓపెన్ ఏఐ ప్రతివ్యూహంమరోవైపు, మస్క్ వాదనలను ఓపెన్ ఏఐ తోసిపుచ్చింది. మస్క్ కేసును ఒక ప్రతీకార చర్యగా భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది. 2018లో బోర్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరాశకు గురైన మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ఏఐకి పోటీగా ఉన్న ఓపెన్ ఏఐని బలహీనపరిచేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. అంతేకాకుండా, మస్క్ కూడా తన సొంత ఏఐ మోడళ్లను ధ్రువీకరించుకోవడానికి ఇతర ఏఐలను ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు.న్యాయమూర్తి క్లాస్విచారణలో ఏఐ వల్ల మానవాళికి రాబోయే ముప్పు గురించి మస్క్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ‘ఏఐ వల్ల మనుషులు అంతరించిపోయే ప్రమాదం నిజం, మనమందరం చనిపోవచ్చు’ అని వారు కోర్టుకు తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి రోజర్స్ తోసిపుచ్చారు. ‘మీ క్లయింట్ (మస్క్) కూడా అదే రంగంలో సంస్థను నడుపుతున్నారు కదా.. మరి ప్రమాదాలు ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తూ ఇది భద్రతా ప్రమాణాల విచారణ కాదని, ఒప్పంద ఉల్లంఘనల కేసు అని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. 850 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సంస్థగా ఎదిగిన ఓపెన్ ఏఐ భవిష్యత్తును నిర్ణయించనున్న ఈ విచారణ రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2032 వరకు అన్ని హక్కులు మావే
అపార్ట్మెంట్ ధరలకు రెక్కలు
దేశంలోని ప్రముఖ నగరాల్లో అపార్ట్మెంట్ల ధరలు 8–20 శాతం మధ్య మార్చి త్రైమాసికంలో పెరిగాయి. నిర్మాణంలోకి వినియోగించే మెటీరియల్స్ ధరలు పెరిగిపోవడం ఇందుకు దారితీసినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. అంతర్గతంగా డిమాండ్ కూడా బలంగా ఉండడం, భూముల ధరలు, నిర్మాణవ్యయాలు పెరుగుదల, ప్రీమియం ఇళ్ల వైపు మొగ్గు చూపించడం కూడా ధరల పెరుగుదలకు కారణాలుగా పేర్కొంది.ఈ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. మార్చి త్రైమాసికంలో హైదరాబాద్ సహా టాప్–7 నగరాల్లో 70,631 యూనిట్ల అపార్ట్మెంట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 65,222 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త సరఫరా (నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడం) 13 శాతం పెరిగింది. 90,023 యూనిట్ల కొత్త అపార్ట్మెంట్లు (ఫ్లాట్లు) అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్కతా నగరాల డేటా ఆధారంగా ఈ వివరాలను జేఎల్ఎల్ ఇండియా విడుదల చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లు, వ్యయాల ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ఇళ్ల ధరలు ఇక ముందూ పెరగొచ్చని, కాకపోతే ఈ పెరుగుదల కాస్త నిదానించొచ్చని అంచనా వేసింది. ప్రీమియం ఫ్లాట్లకు పటిష్ట డిమాండ్అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ పడిపోగా, ప్రీమియం ఇళ్లకు మాత్రం పటిష్టంగా కొనసాగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.50 లక్షల్లోపు అపార్ట్మెంట్ల విక్రయాలు మార్చి త్రైమాసికంలో 24 శాతం తగ్గి 20,269 యూనిట్లకు పరిమితమయ్యాయి. రూ.కోటికి పైగా ధరల శ్రేణిలోని అపార్ట్మెంట్ల అమ్మకాలు మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 30 శాతం పెరిగి 50,362 యూనిట్లకు చేరాయి. ‘‘కొనుగోలుదారుల సెంటిమెంట్ ఆధారంగా కొత్త సరఫరా వస్తోంది. కొత్త ప్రాజెక్టుల ఆరంభం 13 శాతం పెరగడం, విక్రయాల్లో 8 శాతం వృద్ధి అన్నవి ఆర్థిక అనిశ్చితుల్లో కస్టమర్లు అప్రమ్తత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది’’ అని జేఎల్ఎల్ సీనియర్ ఎండీ శివ కృష్ణన్ తెలిపారు.ఇదీ చదవండి: 2032 వరకు అన్ని హక్కులు మావే
వొడాఫోన్ ఐడియాకి భారీ ఊరట
టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకి కేంద్రం భారీ ఊరటనిచ్చింది. ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీలను పునసమీక్షించిన తర్వాత 27 శాతం మేర తగ్గించింది. దీనితో కంపెనీ కట్టాల్సిన బాకీ రూ.64,046 కోట్లకు దిగివచ్చింది. దీన్ని చెల్లించేందుకు అయిదేళ్ల మారటోరియం కూడా లభించింది. అటుపైన పదేళ్ల వ్యవధిలో రెండు రకాలుగా చెల్లించాల్సి ఉంటుంది.2031–32 నుంచి 2034–35 వరకు ఏటా కనీసం రూ.100 కోట్లు చొప్పున కట్టాలి. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని 2035–36 నుంచి 2040–41 మధ్య కాలంలో ఆరేళ్ల వ్యవధిలో ఏటా సమాన వాయిదాల్లో చెల్లించాలి. కంపెనీ కట్టాల్సిన బాకీలను కొన్నాళ్లు ఫ్రీజ్ చేస్తూ కేంద్ర క్యాబినెట్ 2025 డిసెంబర్ 31న ప్యాకేజీనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి సంస్థ కట్టాల్సిన మొత్తాన్ని రూ. 87,695 కోట్లుగా నిర్ణయించారు. అయితే, మరోసారి మదింపు చేసిన మీదట తుది మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను టెలికం శాఖకు (డాట్) కమిటీ అప్పగించారు. తాజాగా డాట్ కమిటీ ఈ మేరకు బాకీలను ఖరారు చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
యూపీఐ లావాదేవీలు @ రూ. 314 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో రికార్డు స్థాయికి చేరాయి. రూ. 314 లక్షల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2016–17లో కేవలం రూ. 0.07 లక్షల కోట్లుగా ఉన్న ఈ విలువ, పదేళ్లలో 4,000 రెట్లు పెరగడం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. → 2016–17లో 2 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా.. 2025–26లో 24,162 కోట్లకు పెరిగాయి. → 2025 ఆగస్టులో తొలిసారిగా నెలవారీ లావాదేవీలు 2,000 కోట్ల సంఖ్యను దాటాయి. 2025 డిసెంబర్లో గరిష్టంగా 2,163 కోట్ల లావాదేవీలు జరిగాయి. → 2025 క్యాలెండర్ ఇయర్లో రోజుకు సగటున 60 కోట్ల లావాదేవీలు నమోదవగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 66 కోట్లు దాటింది. → ప్రారంభంలో యూపీఐ నెట్వర్క్ పరిధిలో 44 బ్యాంకులు మాత్రమే ఉండగా, 2025–26 నాటికి ఆ సంఖ్య 703 బ్యాంకులకు చేరింది. → ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ చెల్లింపుల్లో 49 శాతం వాటా యూపీఐదేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సైతం తన 2025 నివేదికలో పేర్కొనడం గమనార్హం.
కార్పొరేట్
‘ఆఫీస్ పిక్నిక్’ వేళ.. అందరూ ఒక్కటే!
వొడాఫోన్ ఐడియాకి భారీ ఊరట
రిలయన్స్ రిటైల్ చేతికి ప్రియాంక చోప్రా అనోమలి
అదానీ పవర్ మెరుపులు.. మెరిపించిన ప్రాఫిట్
ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ
జియో దూకుడు.. ట్రాయ్ పరీక్షల్లో అగ్రస్థానం!
తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు బ్యాంకు సెలవులు
2032 వరకు అన్ని హక్కులు మావే
రైలు టికెట్ బుకింగ్లోకి ఫ్లిప్కార్ట్ ‘క్లియర్ట్రిప్’
కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
పసిడి ధరలు: నిన్న ఊహించని పతనం.. నేడు ఇలా..
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. దేశంలో క...
లాభాల్లోకి స్టాక్మార్కెట్.. ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమ...
పసిడి ధరల పతనం.. ఊహకందని రీతిలో ఇలా!
భారతదేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ...
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట...
ఇంధన దాహం.. జల వినాశం!
భారతదేశం ఇంధన స్వయంసమృద్ధి దిశగా వేగంగా అడుగులు వే...
ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. భారత్కు మేలే!
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలక మార్పు చోటు చేసుక...
జోరు మీదున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిలో డిజిటల్ పబ్లిక్ ...
మళ్లీ పెరిగిన బంగారం, ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు రెండో ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏఐ ఉచ్చులో కార్పొరేట్ సంస్థలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే కేవలం ఉత్పాదకతను పెంచే మంత్రదండం మాత్రమే కాదు, అది ఒక ప్రమాదకరమైన ఆటోమేషన్ ట్రాప్ అని కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని వాడుతూ ఉద్యోగులను తొలగిస్తుంటే అది చివరికి కంపెనీలకే చేటు చేస్తుందని పెన్సిల్వేనియా, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చి చెప్పారు.ఆటోమేషన్ రేసు: గెలుపెవరిది?పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన బ్రెట్ హెమెన్వే ఫాల్క్, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు గెర్రీ సౌకలాస్ సంయుక్తంగా రూపొందించిన ‘ది ఏఐ లేఆఫ్ ట్రాప్’ అనే పరిశోధనా పత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టెక్ సంస్థలు పోటీలో ముందుండడానికి ఆటోమేషన్ను విచ్చలవిడిగా వాడుతున్నాయని, ఇది చివరికి ‘అపరిమిత ఉత్పాదకత - సున్నా డిమాండ్’ అనే వినాశకర స్థితికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నాయి. కానీ ప్రజల చేతుల్లో ఉద్యోగాలు లేకపోతే మార్కెట్లో వస్తువులను కొనే శక్తి తగ్గిపోతుంది. వినియోగదారుల డిమాండ్ పడిపోతే ఆ కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు?’ అని ఈ అధ్యయనం ప్రశ్నిస్తోంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?వాస్తవ ప్రపంచ పరిస్థితులు ఈ హెచ్చరికలను బలపరుస్తున్నాయి. టెక్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగ కోతలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. 2025లో టాప్ కంపెనీల్లో మొత్తం 1,00,000 మంది టెక్ ఉద్యోగులను తొలగించారు. ఇందులో సగానికి పైగా కారణం ఏఐ వినియోగమే. 2026 (ఇప్పటివరకు) కేవలం నాలుగు నెలల్లోనే 98 కంపెనీలు సుమారు 92,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.పరిష్కారం ఏమిటి?యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (యూబీఐ) లేదా రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్ల వంటివి ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమేనని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. దీనికి అసలైన పరిష్కారం ‘పిగౌవియన్ ఆటోమేషన్ పన్ను’ అని పరిశోధకులు సూచిస్తున్నారు. అంటే ఆటోమేషన్ వల్ల సమాజానికి కలిగే డిమాండ్ నష్టాన్ని కంపెనీలే భరించేలా చేయడం. కేవలం లాభాల కోసమే కాకుండా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించాలని నివేదిక తెలుపుతుంది.ఏఐ సాంకేతికత మరింత శక్తివంతంగా మారుతున్న కొద్దీ కంపెనీల మధ్య పోటీ ఆటోమేషన్ రేసుగా మారుతోంది. దీన్ని ఆపడం ఒక్క కంపెనీ వల్ల సాధ్యం కాదు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సరైన విధానపరమైన పన్ను నిబంధనలు తీసుకురాకపోతే సంస్థలు తాము తవ్వుకున్న గోతిలో తామే పడే ప్రమాదం ఉంది. మేధోశక్తికి, మానవ వనరులకు మధ్య సమతుల్యత దెబ్బతింటే అది కేవలం కార్మిక మార్కెట్ సమస్యే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు.ఇదీ చదవండి: ‘మస్క్ దొంగ ఏడుపు దేనికి?’
ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న స్టార్టప్ ‘ఆంత్రోపిక్’ ఒక అరుదైన ఉద్యోగ ప్రకటనతో టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సాఫ్ట్వేర్ రంగంలో భారీ జీతాలంటే కోడింగ్లో నైపుణ్యం సాధించి ఉండాలి. కానీ, ఈ కొత్త పోస్టుకు అసలు కోడింగ్ నైపుణ్యాలే అవసరం లేదు. అయినప్పటికీ, ఏడాదికి ఏకంగా 4,00,000 డాలర్లు (సుమారు రూ.3.3 కోట్లు) వరకు వేతనాన్ని ఆఫర్ చేస్తోంది.ఏమిటా కొత్త రోల్? బాధ్యతలు ఇవే..బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో లేదా న్యూయార్క్ కేంద్రంగా పనిచేయాల్సిన ఈ రోల్ ప్రధానంగా కంపెనీ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆధారపడి ఉంటుంది. చిన్నపాటి వీవీఐపీ సమావేశాల నుంచి భారీ స్థాయి టెక్ ఈవెంట్లను ప్లాన్ చేయడం, వాటిని అమలు చేయడం వంటివి చేయాలి. విధానకర్తలు, విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు జరపాలి. ఆంత్రోపిక్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి వాటి సాంకేతిక అంశాలను వివరించాలి. ఈ ఉద్యోగంలో 30% నుంచి 40% సమయం ప్రయాణాల్లోనే గడపాల్సి ఉంటుంది. అంటే నెలకు సుమారు 10-12 రోజులు వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది.సిలికాన్ వ్యాలీ దిగ్గజాల స్పందనఈ భారీ జీతంపై ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏఐ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ చాలా చౌకగా, సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఏదైనా ఒకటి సమృద్ధిగా లభించినప్పుడు దానికి భిన్నమైనది (అంటే మానవ సంబంధాలు, ప్రత్యక్ష ప్రదర్శనలు) అరుదుగా మారుతుంది’ అని ఆయన విశ్లేషించారు. మెషీన్ జనరేటెడ్ టెక్స్ట్ పెరిగిపోతున్న తరుణంలో మనుషుల మధ్య జరిగే లైవ్ కమ్యూనికేషన్కు ఉన్న డిమాండ్ను ఈ ఉద్యోగం ప్రతిబింబిస్తోంది.అర్హతలు, ఎంపిక విధానంఈ భారీ ప్యాకేజీని దక్కించుకోవాలంటే అభ్యర్థుల నేపథ్యం, నైపుణ్యాల వివరణ చాలా ముఖ్యం. ‘మీరు ఏఐ కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు?’ అనే అంశంపై 200 నుంచి 400 పదాలలోపు ఒక స్పష్టమైన వ్యాసాన్ని సమర్పించాలి. దీన్ని విశ్లేషించి కంపెనీ యాజమాన్యం అభ్యర్థులను మెయిల్ ద్వారా సంప్రదిస్తుంది.ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..
రూ.లక్ష కోట్లున్నాయ్: ఇన్ఫీ కోఫౌండర్ క్రిస్
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో బిలియన్ డాలర్లుగా (యూనికార్న్) ఎదిగే దేశీ స్టార్టప్లకు అధునాతన తయారీ, డీప్ టెక్నాలజీ దన్నుగా నిలుస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ తెలిపారు. ఈ దశను ఆయన యూనికార్న్ 2.0గా అభివర్ణించారు.అధిక వేల్యుయేషన్ల వెంటబడకుండా సొంత టెక్నాలజీలను సమకూర్చుకోవడం, దీర్ఘకాలం నిలదొక్కుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. యాక్సిలార్ వెంచర్స్ చైర్మన్, సీఐఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ చైర్మన్ కూడా అయిన గోపాలకృష్ణన్ సీఐఐ యూనికార్న్ సదస్సు 2026లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు.‘డీప్టెక్ చాలా కష్టమైన వ్యవహారం. చాలా సమయం పట్టేస్తుంది. పెట్టుబడుల పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. విఫలమయ్యే అవకాశాలు ఎక్కువే. కానీ నిలబడగలగితే ప్రయోజనాలు అత్యధికంగా ఉంటాయి‘ అని క్రిస్ తెలిపారు. ఈ పరివర్తనకు ఊతమిచ్చేలా పరిశోధనలు, అభివృద్ధి, ఆవిష్కరణలకు (ఆర్డీఐ) సంబంధించిన ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశ, విదేశాల నుంచి కూడా వచ్చే పెట్టుబడులతో ఈ వ్యవస్థ 30–40 బిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుందని, రేపటి డీప్టెక్ యూనికార్న్లకు బాటలు వేస్తుందని వివరించారు.
గూగుల్, మెటాలకు షాక్.. ఆస్ట్రేలియా కొత్త పన్ను
సోషల్ మీడియా దిగ్గజాలు మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), గూగుల్, టిక్టాక్లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. జర్నలిజం మనుగడ కోసం, వార్తా సంస్థలకు చెల్లింపులు చేయని పక్షంలో భారీగా పన్ను వసూలు చేసేలా రూపొందించిన కొత్త ముసాయిదా చట్టాన్ని విడుదల చేసింది.వార్తలకు విలువివ్వాల్సిందేజర్నలిస్టుల కష్టానికి తగిన ద్రవ్య విలువ ఉండాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సృజనాత్మకమైన వార్తా కంటెంట్ను ఉపయోగించుకుని బహుళజాతి సంస్థలు లాభాలు గడించడం తగదు. ఆ కంటెంట్ను ఉత్పత్తి చేసే వారికి తగిన పరిహారం అందాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నాణ్యమైన జర్నలిజం వెన్నెముక వంటిది’ అని పేర్కొన్నారు.ప్రతిపాదిత చట్టం ముఖ్యాంశాలువార్తా సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిరాకరించే ప్లాట్ఫారమ్లపై ఈ చట్టం కొరడా ఝుళిపించనుంది.వార్తా ప్రచురణకర్తలతో ఒప్పందాలు చేసుకోని పక్షంలో, సదరు కంపెనీల వార్షిక ఆదాయంపై 2.25 శాతం పన్ను విధిస్తారు.వార్తా సంస్థలకు చెల్లింపులు చేసే ప్లాట్ఫారమ్లకు పన్ను మినహాయింపులు (ఆఫ్సెట్లు) లభిస్తాయి.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని (సుమారు 200 - 250 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు), ఆయా వార్తా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.పాత చట్టంలో లొసుగులు 2021లో తెచ్చిన 'న్యూస్ మీడియా బేరసారాల కోడ్' నుండి తప్పుకోవడానికి కొన్ని సంస్థలు తమ ప్లాట్ఫారమ్ల నుంచి వార్తలను తొలగించాయి. తాజా చట్టాన్ని అటువంటి లొసుగులను అరికట్టేలా రూపొందించారు.భగ్గుమంటున్న టెక్ దిగ్గజాలుప్రభుత్వ నిర్ణయంపై మెటా, గూగుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ‘వార్తా సంస్థలు తమ ప్రయోజనం కోసమే మా ప్లాట్ఫారమ్లపై కంటెంట్ను పోస్ట్ చేస్తాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు సంపదను బదిలీ చేసే పన్ను మాత్రమే’ అని మెటా విమర్శించింది. ఇప్పటికే తాము వార్తా సంస్థలతో ఒప్పందాలు కలిగి ఉన్నామని, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫారమ్లను మినహాయించి కేవలం తమనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని గూగుల్ పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్తల ప్రాముఖ్యతను కాపాడటమే లక్ష్యమని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చెబుతుండగా, ఇది డిజిటల్ రంగంపై అనవసరపు భారమని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇదే బాట పడతాయేమో చూడాలి.
పర్సనల్ ఫైనాన్స్
బంగారం ఇక అలంకారం కాదు.. ఆస్తి
పసిడి కొనుగోళ్లలో ఆభరణాల వినియోగమే పెద్ద మొత్తంలో ఉంటోంది. కానీ, ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో బాగా ర్యాలీ చేయడం తెలిసిందే. దీంతో వినియోగం కంటే పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశంలో మొత్తం బంగారం కొనుగోళ్లలో పెట్టుబడుల వాటా 40 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ఇక ఆభరణాల వినియోగం వాటా 60 శాతం లోపునకు దిగొస్తుందని పేర్కొంది. మన దేశంలో బంగారం కొనుగోళ్లలో దీర్ఘకాలం నుంచి ఆభరణాల వాటా 70 శాతంగా ఉంటుంటే, మిగిలిన 30 శాతం పెట్టుబడుల నుంచి ఉంటోంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ఆభరణాల వాటా పసిడి కొనుగోళ్లలో 50 శాతమే కావడం గమనార్హం. నిర్మాణాత్మక మార్పు.. దేశంలో బంగారం కొనుగోళ్లలో వస్తున్న నిర్మాణాత్మక మార్పునకు ఇది నిదర్శనమని కేర్ఎడ్జ్ డైరెక్టర్ అఖిల్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచంలో పసిడి వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో చైనా, భారత్ కలసి సగం వాటా కలిగి ఉండడం విశేషం. ‘‘భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బంగారం ధరల్లో కదలికలు, పోర్ట్ఫోలియోలో వైవిధ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం అన్నవి పసిడిపై పెట్టుబడుల డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయి. 2026–27లో మొత్తం బంగారం వినియోగంలో పెట్టుబడి వాటా 35–40 శాతానికి చేరుతుంది. ఇక 60 శాతం ఆభరణాల వాటా అన్నది ప్రపంచ సగటు 50 శాతం కంటే ఎక్కువే’’అని అఖిల్ గోయల్ తెలిపారు. గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదరణ.. పెట్టుబడుల్లో అధిక శాతం గోల్డ్ ఈటీఎఫ్ల రూపంలో ఉంటున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక తెలిపింది. ఒక్క గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లే 37.5 టన్నులు ఉంటాయని.. గత పదేళ్లలో మొత్తం పెట్టుబడుల కంటే ఇది ఎక్కువని పేర్కొంది. ఆ తర్వాత బంగారం కాయిన్లు, కడ్డీల రూపంలోఉంటోంది. స్వల్పకాల స్పెక్యులేటివ్ అవసరాలు కాకుండా.. డిమాండ్ ధోరణుల్లో నిర్మాణాత్మక మార్పుల నేపథ్యంలో బంగారం అధిక ధరల శ్రేణిలో కొనసాగనున్నట్టు కేర్ఎడ్జ్ తెలిపింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ 2025లో ఆభరణాల వినియోగం బలంగా ఉందని, 10 శాతం పెరిగి రూ.4.8 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ఆభరణాల కొనుగోళ్ల విలువ మాత్రం 15 శాతం తగ్గడం గమనార్హం. 2026లో ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉండొచ్చని కేర్ఎడ్జ్ అంచనా వేసింది.‘‘సంస్థాగత జ్యుయలరీ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి ఆభరాణాలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. కంపెనీల స్థూల మార్జిన్లు 170–200 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని అంచనా. 2026–27లో స్థూల మార్జిన్లు 14–14.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఎబిట్డా మార్జిన్లు 6.5–7 శాతం మేర ఉండొచ్చు’’అని తెలిపింది. వెండికి యువతరం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి పెరుగుతున్నప్పటికీ సమీప కాలంలో బంగారాన్ని అది భర్తీ చేయలేదని పేర్కొంది.
ఇన్వెస్కో కొత్త ఫండ్స్!
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ కొత్తగా రెండు ఫండ్స్ని ఆవిష్కరించింది. ఇన్వెస్కో ఇండియా బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ వీటి లో ఉన్నాయి.మొదటిది సెన్సెక్స్ ఇండెక్స్లోని కంపెనీలు, రెండోది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్లోని సంస్థల ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ప్యాసివ్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఎన్ఎఫ్వో వ్యవధిలో ఏకమొత్తంగా నైతే కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ విధానంలో ఎంచుకున్న వ్యవధిని బట్టి రూ. 20 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ న్యూ ఫండ్స్ ఆఫర్లు మే 7న ముగుస్తాయి.
వ్యక్తిగత హెల్త్ పాలసీకి మైగ్రేషన్ ఇలా..
ప్రస్తుతం చాలా మటుకు సంస్థలు తమ ఎంప్లాయీ బెనిఫిట్ ప్యాకేజీలో భాగంగా గ్రూప్ మెడికల్ కవరేజ్ (జీఎంసీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీలు అందించే వేతన ప్యాకేజీలలో ఇది ఇప్పుడు ఒక కీలక భాగంగా మారింది. ఉద్యోగులకు ప్రాథమిక ఆరోగ్య బీమా రక్షణను అందించే ఈ జీఎంసీ పాలసీ, మీరు ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలం మాత్రమే వర్తిస్తుంది. 2020లో లాక్–డౌన్ తర్వాత కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలు తమ ఉద్యోగులకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా కల్పించాలని ఐఆర్డీఏఐ ఆదేశించడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది.అయితే, ఇది కేవలం ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీ తదుపరి కంపెనీలో ఇటువంటి బీమా సౌకర్యం లేకపోయినా లేదా కవరేజీ తక్కువగా ఉన్నా పరిస్థితి ఏమిటి? కెరీర్ నుంచి విరామం తీసుకున్నప్పుడో లేదా ఫ్రీలాన్సర్గానో, వ్యాపారవేత్తగానో మారినప్పుడో ఆరోగ్య బీమాను ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇక ఇప్పుడు ఇలాంటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. మీ జీఎంసీ పాలసీని వ్యక్తిగత పాలసీగా మార్చుకునే అవకాశం ఉంది. దీన్నే ‘కంటిన్యుటీ బెనిఫిట్’ అంటారు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.పాలసీని ఎలా మార్చుకోవాలంటే ముందుగా, మీ జీఎంసీ పాలసీలో మీ కుటుంబ సభ్యులకు కూడా కవరేజీ ఉంటే, మీరు దాన్ని ’ఫ్యామిలీ ఫ్లోటర్’ ప్లాన్గా మార్చుకోవచ్చు. కేవలం మీకు మాత్రమే కవరేజీ ఉంటే, ’ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్’ ప్లాన్ను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, మీ ప్రస్తుత గ్రూప్ పాలసీని అందిస్తున్న బీమా సంస్థకి మీ నిర్ణయాన్ని తెలియజేయాలి. పాలసీ గడువు ముగియడానికి లేదా రెన్యువల్కి కనీసం 30 రోజుల ముందే బీమా సంస్థకు సమాచారం ఇవ్వడం ఉత్తమం.వారి వద్ద ఉన్న వివిధ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పరిశీలించి, మీ అవసరాలకు తగిన ప్లాన్ను ఎంచుకోండి. సరైన ప్లాన్ను ఎంపిక చేసుకున్న తర్వాత, దానికి సంబంధించిన ప్రపోజల్ ఫామ్, మైగ్రేషన్ ఫామ్ వంటి పత్రాలను అడగండి. వాటిలో మీ ప్రస్తుత పాలసీ వివరాలు, ఆరోగ్య చరిత్ర, క్లెయిమ్ వివరాలను నింపి సమర్పించాలి. బీమా సంస్థ మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత, డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిబంధనల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.మైగ్రేషన్తో ప్రయోజనాలు దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ’వెయిటింగ్ పీరియడ్’. జీఎంసీ పాలసీలో మీరు ఇప్పటికే పూర్తి చేసిన వెయిటింగ్ పీరియడ్ కాలం, కొత్త రిటైల్ పాలసీలో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, కొత్త పాలసీలో ఒక నిర్దిష్ట వ్యాధికి 4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండి, మీరు పాత జీఎంసీ 3 ఏళ్లు పూర్తి చేసి ఉంటే, కొత్త పాలసీలో మీరు కేవలం ఒక ఏడాది నిరీక్షిస్తే సరిపోతుంది.గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు అదే బీమా కంపెనీ: మీరు జీఎంసీని అదే బీమా సంస్థకు చెందిన రిటైల్ ప్లాన్లోకి మాత్రమే మర్చుకోగలరు. వైద్య పరీక్షలు: గ్రూప్ పాలసీలో సాధారణంగా మెడికల్ టెస్టులు ఉండవు. కానీ రిటైల్ పాలసీకి మారేటప్పుడు బీమా సంస్థ నిబంధల ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చు. బీమా మొత్తం పెంపు: మీరు బీమా కవరేజీని పెంచుకున్నా, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనం పాత పాలసీలో ఉన్న మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. అదనంగా పెంచుకున్న మొత్తానికి కొత్తగా వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది ఉదాహరణకు జీఎంసీ సమ్ ఇన్సూర్డ్ రూ.3 లక్షలు కాగా, కొత్త పాలసీలో దాన్ని రూ.5 లక్షలకు పెంచుకున్నారని అనుకుందాం. అలాంటప్పుడు వెయిటింగ్ పీరియడ్ బెనిఫిట్ అనేది రూ.3 లక్షలకే వర్తిస్తుంది. మిగతా రూ.2 లక్షలకు వెయిటింగ్ పీరియడ్ యథాప్రకారంగానే వర్తిస్తుంది.పాలసీ నిబంధనలు: కొత్త పాలసీలోని మినహాయింపులు, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. సమయానికి పాలసీని పునరుద్ధరించుకోవడం మర్చిపోవద్దు. మొత్తానికి, మీ జీఎంసీ పాలసీని రిటైల్ పాలసీగా మార్చుకోవడం వల్ల మీకు మెరుగైన రక్షణ, సౌలభ్యం లభిస్తాయి. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటే మైగ్రేషన్ ప్రక్రియ సజావుగా ఉంటుంది, అలాగే అత్యవసర వైద్య పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కూడా లభిస్తుంది.
ఎరియర్స్ వచ్చాయా.. కొత్త ఫారాలు నింపండి..
కొత్త చట్టం, కొత్త రూల్స్, కొత్త ఫారాల వల్ల ఎన్నో మంచి మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు. సాంకేతికత, సులభతరం కోణంలోనే కాకుండా హేతుబద్ధీకరించే విధంగా ఇవి ఉన్నాయి. ఈ మార్పులతో కొత్త ఫారాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు. సులభతరం అంశాలన్నీ నింపితే సమాచారం సమగ్రంగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సాంకేతికంగా అనువుగా ఉండటం వల్ల ప్రాసెసింగ్ త్వరగా అవుతుంది. అటు చట్టం, ఇటు రూల్స్లోని అంశాలకి (మార్పులు) అనుగుణంగా, ఎటువంటి తికమక లేకుండా సాఫీగా, సజావుగా సాగుతుంది. పాత ఫారాల్లో ఉన్న తప్పొప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా తయారు చేశారు. ఫారం నింపగానే అనుసంధానం కావడం వల్ల అన్నింటిని అన్వయించుకుని, ఇతర సమాచారం మీద ఆధారపడకుండా అధికారులు చకచకా పరుగెడతారు.పాత చట్టంలో 89 (1), ఫారం 10ఈ జీతాల ఎరియర్స్ రావడం, వాటిని, సంవత్సరాలవారీగా విడగొట్టి, ఆయా ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చేయడాన్ని 89 (1) సెక్షన్లో ప్రస్తావిస్తారు. ఆ అంశాలన్నీ ఫారం 10ఈ లో నింపాలి. అప్పుడు రిలీఫ్ లెక్కించాలి.కొత్త సెక్షన్ 157 (1), కొత్త రూల్స్ 97, కొత్త ఫారం 39 కొత్త సెక్షన్ 157 (1), దాన్ని అమలుపర్చడానికి ఉద్దేశించినది 97 రూలు. ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఫారం 39 తయారైంది. పాన్ లేనిదే ఈ కొత్త ఫారాన్ని నింపలేరు. దాఖలు చేయలేరు. కొత్త ఫారంలో ఏమేమి తెలియజేయాలి? తొలి భాగంలో వ్యక్తిగత వివరాలతో పాటు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎరియర్స్ వచ్చాయో తెలియజేయాలి. మలి భాగంలో ముఖ్యమైన విషయం అంతా అంకెలమయంగా ఉంటుంది. డేటా అంతా రాయాలి. ఎరియర్స్ మీద ఎంత వచి్చంది రాయాలి. జీతం, గ్రాట్యుటీ, రిట్రెంచ్మెంట్ పరిహారం, పెన్షన్..ఇలా ఏదైనా కావొచ్చు అన్నీ రాయాలి. వీటిని సరిగ్గా నింపితే ఆ తర్వాత కాలమ్లో అన్నీ ఆటో పాపులేట్ అయిపోతాయి. పన్ను భారమెంత, ఆదాయం ఎంత, ఎరియర్స్ ఎంత, పన్ను ఎంత, ఉపశమనం (రిలీఫ్) ఎంత .. అన్నీ తెలుస్తాయి. చివరగా రిలీఫ్ ఎంతో లెక్కించి వస్తుంది.ఫారం 10ఈని అంతా చేతితో నింపాలి. మనమే అన్ని లెక్కలు చేయాలి. రాయాలి. బోలెడంత పని. యజమాని చేయరు. ఉద్యోగికి శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఇదంతా చిటికెలో అయిపోతుంది. ఈ సమాచారం అంతా ఆటోమేటిక్గా మీరు వేసే ఆదాయ పన్ను ఫారంలలో, అంటే ఐటీఆర్లలోకి వెళ్లిపోతుంది. కరెక్టుగా ఉంటే సమాచారం చాలా త్వరగా బదిలీ అవుతుంది.ఏయే డాక్యుమెంట్లు అవసరం.. మీ పాన్ కార్డు, మీ టీడీఎస్ సర్టిఫికెట్లు, మీ ఏఐఎస్ ఫారం, వచి్చన ఎరియర్స్ వివరాల గురించి తెలియజేసే పత్రం, ఫారం 130, ఫారం 168, గత సంవత్సరాల రిటర్నులు, పన్ను లెక్కింపుల ఎరియర్స్ వివరాలు కాగితాల రూపంలో కావాలి.అంతా ఆన్లైన్లోనే .. ఇది డిజిటల్ ఫారం. ఇది వరకు లాగా ఆఫ్లైన్లో వేయకూడదు. పోర్టల్లో దాఖలు చేయాలి. ఇందుకోసం మెనూకి వెళ్లి, ఫారం 39ని క్లిక్ చేయండి. బేసిక్ డేటా, ఎంపిక చేసిన కాలమ్లను సరిగ్గా నింపండి. రివ్యూ చేసుకోవచ్చు. రెండుసార్లు చెక్ చేసుకోవచ్చు. వెరిఫై చేయండి. ఫైల్ చేయండి. అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఇక తరువాత.. రిటర్ను వేయడమే! రిలీఫ్ మీకు వస్తుంది. ఏ అనుమతి కోసమూ ఆగనక్కర్లేదు. అయితే, రిటర్ను వేసేందుకు మరీ చివరి తేదీ వరకు ఆగకుండా, రెండు–మూడు నెలల ముందే ప్రాసెస్ మొదలుపెట్టండి.మీకు తెలిసిన పాత విశేషాలే అయినా.. మరోసారి.. ఉద్యోగులకు వర్తిస్తుంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎరియర్స్ ఒకేసారి ఏకమొత్తంగా రావొచ్చు. గత సంవత్సరంలో మీ ఆదాయం తక్కువ శ్లాబులో పన్నుకి గురి అయి ఉండాలి ఈ ఎరియర్స్ని ఆయా సంవత్సరాలకు సర్దుబాటు చేయడం వల్ల ఏం అవుతుందంటే, ఈ సంవత్సరం 30 శాతం బ్రాకెట్లో పడే ఆదాయం తగ్గి, గత సంవత్సరం 10 శాతానికి, 20 శాతానికి తగ్గొచ్చు. అంటే గత సంవత్సరం చేతికి వచ్చి ఉంటే తక్కువ రేటులోనే పన్ను భారం ఉండేది. ఇప్పటి 30 శాతానికి బదులుగా పన్ను భారం రేటు తగ్గి ఉండేది. ఆ ఉపశమనాన్నే రిలీఫ్ అంటారు. ఆల్ ది బెస్ట్.


