Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Indias Foreign Exchange Reserves Rise to 696 Billion1
విదేశీ కాసుల గలగల.. పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

విదేశీ మారకం నిల్వలు డిసెంబర్‌ 26తో ముగిసిన వారంలో 3.29 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. దీంతో మొత్తం విదేశీ మారకం నిల్వలు 696.61 బిలియన్‌ డాలర్లకు చేరాయి. కానీ అంతకు ముందు వారంలో విదేశీ మారకం నిల్వలు 4.36 బిలియన్‌ డాలర్లు పెరిగి 693.31 బిలియన్‌ డాలర్లకు చేరడం గమనార్హం.డిసెంబర్‌ 26తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తుల రూపంలో నిల్వలు (మొత్తం నిల్వల్లో అధిక భాగం) 184 మిలియన్‌ డాలర్లు పెరిగి 559.61 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. యూఎస్‌ డాలర్లతోపాటు యూరో, పౌండ్, యెన్‌ తదితర రూపంలో విదేశీ కరెన్సీ ఆస్తులున్నాయి. అయినప్పటికీ వీటి విలువను యూఎస్‌ డాలర్ల రూపంలో ప్రకటిస్తుంటారు.బంగారం నిల్వల విలువ 2.95 బిలియన్‌ డాలర్లు పెరిగి 113.32 బిలియన్‌ డాలర్లకు చేరింది. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) విలువ 60 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.80 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్‌ వద్ద భారత నిల్వలు 93 మిలియన్‌ డాలర్ల వృద్ధితో 4.87 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ డేటా వెల్లడించింది.

Who is The Most Educated in the Ambani Family2
అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే..

భారతదేశంలో అత్యంత సంపన్నులైన అంబానీ ఫ్యామిలీ గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఈ కుటుంబంలో ఎవరు ఎంత చదువుకున్నారు?, అనే విషయం బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ధీరూభాయ్ అంబానీ: రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ, 1933 డిసెంబర్ 28న గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ధీరూభాయ్ హీరాచంద్ అంబానీ. ధీరూభాయ్ ఉన్నత పాఠశాల వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తరువాత డబ్బు సంపాదించడానికి.. యెమెన్‌కు వెళ్లారు. ఇక్కడ పెట్రోల్ పంప్‌లో పనిచేశారు. రిలయన్స్ గ్రూప్‌కు పునాది వేసిన ధీరూభాయ్‌కు అంతకు ముందు పూర్వీకుల నుంచి వచ్చిన సంపద లేదు.ముఖేష్ అంబానీ: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఎంబీఏ కోసం స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. కానీ ఎంబీఏ పూర్తి చేయకుండానే.. తన చదువును మధ్యలో వదిలివేసి 1980లో రిలయన్స్‌లో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు.అనిల్ అంబానీ: ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ ముంబైలోని హిల్ గార్డెన్ స్కూల్ నుంచి పాఠశాల విద్య, ఆ తరువాత, కిషన్ చంద్ చెల్లారం కళాశాల నుంచి సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత 1983లో, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు.నీతా అంబానీ: ముఖేష్ అంబానీ భార్య.. నీతా అంబానీ ముంబైలోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈమెకు నృత్యం, బోధన అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే నీతా అంబానీ.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించారు.టీనా అంబానీ: అనిల్ అంబానీ భార్య.. నటి టీనా అంబానీ ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అంతే కాకుండా ఈమె లాస్ ఏంజిల్స్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేయారు.ఆకాష్ అంబానీ: ఆకాష్ అంబానీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను.. ఆ తర్వాత, 2013లో అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆకాష్ ఇప్పుడు తన తండ్రికి తన వ్యాపారంలో సహాయం చేస్తున్నాడు.శ్లోకా మెహతా అంబానీ: ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా.. న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో పట్టభద్రురాలైంది. అంతే కాకుండా ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.ఇషా అంబానీ: ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ.. 2014లో అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ.. ఆ తరువాత కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు.అనంత్ అంబానీ: అనంత్ అంబానీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను, తరువాత బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇప్పుడు అనంత్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డులో అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు.రాధిక మర్చంట్ అంబానీ: ముఖేష్ అంబానీ చిన్న కోడలు రాధిక మర్చంట్ ముంబైలోని ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్, బీడీ సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్య.. తరువాత 2017లో న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయాలు & ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు.జై అన్మోల్ అంబానీ: అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను, ఆ తరువాత యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు.క్రిషా షా అంబానీ: జై అన్మోల్ భార్య.. అనిల్ అంబానీ కోడలు క్రిషా షా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు. దీనితో పాటు, ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ కూడా పొందారు.జై అన్షుల్ అంబానీ: అనిల్ అంబానీ చిన్న కుమారుడు జై అన్షుల్ అంబానీ ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత, అతను NYU స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందాడు.

New Elegance For Old Colonies Know The Details Here3
పాత కాలనీలకు కొత్త సొబగులు!

సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న పాత కాలనీలు కొత్త సొబగులు అద్దుకోనున్నాయి. పాత, శిథిలావస్థలో ఉన్న తక్కువ ఆదాయ సమూహం(ఎల్‌ఐజీ), మధ్యతరగతి ఆదాయ సమూహం(ఎంఐజీ) గృహ నిర్మాణాల స్థానంలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌) ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్‌ఐజీ యూనిట్ల యజమానులతో చర్చలు ప్రారంభించింది. దీంతో పాత కాలనీలు నివాస, వాణిజ్య హైరైజ్‌ భవనాలతో అభివృద్ధి చెందనున్నాయి. ఇప్పటికే కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు(కేపీహెచ్‌బీ), సైదాబాద్‌లోని ఓ కాలనీలోని ఫ్లాట్ల యజమానులు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే ఆయా అపార్ట్‌మెంట్లు 20-40 అంతస్తుల ఎత్తయిన బహుళ అంతస్తుల భవనాలుగా రూపుదిద్దుకోనున్నాయి.పీపీపీ విధానంలో..రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దశాబ్దాల క్రితం నగరంలో నిర్మించిన అన్ని ఎల్‌ఐజీ, ఎంఐజీ బ్లాక్‌లను తిరిగి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం ఒకే చోట భారీ భూమిని పొందడంతో పాటు బహుళ అంతస్తుల ప్రాజెక్ట్‌ నిర్మాణాలకు వీలు కలుగతుంది. ఈ ప్రాజెక్ట్‌లతో పర్యావరణ సమస్యలను తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం, పాత స్థలాలను తిరిగి ఉపయోగించడం ద్వారా పట్టణ విస్తరణను తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రధాన నగరంలో వివిధ పథకాల కింద నిర్మించిన ఆర్థికంగా బలహీన వర్గాలు(ఈడబ్ల్యూఎస్‌) కాలనీలు ఎకరం కంటే తక్కువ ఉన్న భూములు బ్రౌన్‌ఫీల్డ్‌ పునరాభివృద్ధి చెందనున్నాయి.ఈడబ్ల్యూఎస్‌ కాలనీల పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లకు తెలంగాణ హౌసింగ్‌ బోర్డ్, హౌసింగ్‌ కార్పొరేషన్లు నోడల్‌ ఏజెన్సీలుగా ఉంటాయి. క్యూర్‌ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ అమలుకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ బ్రౌన్‌ఫీల్డ్‌ పునరాభివృద్ధి హైరైజ్‌ ప్రాజెక్ట్‌లను పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌(పీపీపీ) విధానంలో చేపడతారు.ఇదీ చదవండి: నిర్మాణం పూర్తయిందా.. బిల్డర్‌ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఇవే!మెరుగైన మౌలిక సదుపాయాలుబ్రౌన్‌ఫీల్డ్‌ పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లతో ఎల్‌ఐజీ, ఎంఐజీ ఫ్లాట్‌ యజమానులకు మరింత నిర్మాణ ప్రాంతం, మెరుగైన రోడ్లు, పౌర, రవాణా మౌలిక సదుపాయాలు, పార్క్‌లతో కొత్త ఫ్లాట్లు ఇస్తారు. కాలనీల పునరాభివృద్ధి పూర్తయ్యే వరకూ ఫ్లాట్‌ యజమానులను వేరే చోట ఉంచుతారు. ఇప్పటికే ప్రభుత్వం ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వెలుపల నాలుగు ప్రాంతాలలో సరసమైన గృహ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఒక్కో ప్రాంతంలో దాదాపు 10 వేల యూనిట్లను నిర్మించనున్నారు.

Tesla Loses Place as World Top EV Seller to China BYD4
చైనా కంపెనీ దెబ్బకు.. వెనుకబడ్డ మస్క్ టెస్లా!

అమ్మకాల్లో అగ్రగామిగా కొనసాగిన అమెరికా కార్ల తయారీ దిగ్గజం టెస్లా డీలా పడింది. ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న పోటీ, సుంకాల ప్రభావం, మస్క్ రాజకీయ ఎత్తుగడలు అన్నీ.. టెస్లా అమ్మకాలను దెబ్బతీశాయి. దీంతో బీవైడీ కంపెనీ అమ్మకాల్లో.. టెస్లాను అధిగమించి మొదటి స్థానం కైవసం చేసుకుంది.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ.. 2025 చివరి మూడు నెలల్లో 4,18,227 డెలివరీలను పూర్తి చేసింది. దీంతో ఏడాది మొత్తం విక్రయాలు 1.64 మిలియన్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు 2024తో పోలిస్తే ఎనిమిది శాతం కంటే ఎక్కువ తగ్గుదలను సూచిస్తుంది. ఇదే సమయంలో బీవైడీ కంపెనీ.. గత సంవత్సరం 2.26 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి ముందువరుసలో నిలిచింది.టెస్లా అమ్మకాలు తగ్గడానికి కారణం2024లో మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత ఫెడరల్ కార్మికులను విస్తృతంగా తొలగించడం వెనుక వివాదాస్పద "గవర్నమెంట్ ఎఫీషియన్సీ" ప్యానెల్ (DOGE)కు నాయకత్వం వహించడం కూడా భిన్నాభిప్రాయాలకు దారితీసింది. ఆ తరువాత చాలామంది పెద్ద ఎత్తున టెస్లా సౌకర్యాల వద్ద నిరసనలు తెలిపారు. ఇది కంపెనీ కార్ల అమ్మకాలపై గణనీయమైన ప్రభావం చూపింది.ధరలుమరో ప్రధానమైన కారణం ఏమిటంటే.. 'ధరలు'. బీవైడీ కంపెనీ చాలావరకు అఫర్డబుల్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు, ప్లగ్ఇన్ హైబ్రిడ్ వాహనాలు ఉన్నాయి. అయితే టెస్లా కంపెనీ మాత్రం.. ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అంటే వీటి ధరలు చాలా ఎక్కువన్నమాట. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల మధ్యతరగతి కొనుగోలుదారులు.. టెస్లా కార్లకు ప్రత్యామ్నాయంగా బీవైడీ కార్లను కొనుగోలు చేస్తున్నారు.చైనా ఆటోమొబైల్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో బీవైడీ కంపెనీ అక్కడ అతిపెద్ద మార్కెట్ షేర్ కలిగి ఉంది. టెస్లా కంపెనీకి ఈ విషయంలో అంత పెద్ద వాటా లేదని తెలుస్తోంది. దీనివల్ల అక్కడ కూడా అమ్మకాలు తక్కువ. అమెరికాలో కూడా టెస్లా అమ్మకాలు మందగించాయి. యూరప్‌లో టెస్లాకి కొన్ని మార్కెటింగ్/పాలిసీ సమస్యలు ఎదురయ్యాయి.బీవైడీ విస్తరణ2003లో ప్రారంభమైన టెస్లా కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, అమ్మకాల్లో ముందువరుసలో కొనసాగుతూ వచ్చింది. అయితే దీనికి చైనా వాహన తయారీ సంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) సంస్థ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. బీవైడీ కంపెనీ చైనా మార్కెట్లో మాత్రమే కాకుండా.. యూరోప్, ఆసియా, లాటిన్ అమెరికా వంటి మార్కెట్లలో కూడా తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయంలో టెస్లా చాలా వెనుకబడి ఉంది.

When Construction Completed You Must Take These Documents5
నిర్మాణం పూర్తయిందా.. బిల్డర్‌ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఇవే!

బిల్డర్‌ నిర్మాణాన్ని పూర్తి చేయగానే కొనుగోలుదారుల్లో పలు సందేహాలు నెలకొంటాయి. ఎప్పటిలోగా బిల్డర్‌ అపార్ట్‌మెంట్‌ను అప్పగించాలి? అతడి నుంచి ఏయే పత్రాలు తీసుకోవాలి? సంఘం నిర్వర్తించాల్సిన బాధ్యతలేమిటి? వీటిపై అవగాహన పెంచుకుంటేనే బదిలీ ప్రక్రియ ఎంతో సులువుగా జరుగుతుంది.అపార్ట్‌మెంట్‌ చిన్నదైనా, పెద్దదైనా.. లగ్జరీ ప్రాజెక్ట్‌ అయినా నిర్మాణం పూర్తవగానే ఫ్లాట్లు కొన్నవారంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడేందుకు బిల్డర్‌ ప్రతిపాదించాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సంఘం పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి. కొనుగోలు చేసిన వారి నుంచి వసూలు చేసిన కార్పస్‌ ఫండ్‌ మొత్తాన్ని అందులో జమ చేయాలి. నిర్మాణానికి సంబంధించిన కీలకమైన పత్రాలను బిల్డర్‌ నుంచి తప్పకుండా తీసుకోవాలి.బిల్డర్‌ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఇవే..➤బిల్డింగ్‌ ప్లాన్, అప్రూవల్‌ ప్లాన్‌➤కంప్లీషన్‌ సర్టిఫికెట్‌➤ఆమోదం పొందిన ఫ్లోర్‌ ప్లాన్లు➤పొల్యుషన్‌ బోర్డు, విద్యుత్తు, జలమండలి, ఫైర్‌ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు➤విద్యుత్, తాగునీరు వంటి కనెక్షన్లు➤రిజిస్ట్రేషన్‌ పత్రాలు, అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన డ్రాయింగులు➤కార్పస్‌ఫండ్, అన్ని సౌకర్యాలను సంఘానికి బిల్డర్‌ బదిలీ చేయాలిఓసీ తప్పనిసరి..నగరంలో అపార్ట్‌మెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కూకట్‌పల్లి, నిజాంపేట, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మదీనాగూడ, తెల్లాపూర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, కోకాపేట, నార్సింగి వంటి నగరం నలువైపులా అనేక అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తి కాగానే బిల్డర్‌ స్థానిక సంస్థ(జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ) నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) తీసుకోవాలి. ఈ ఓసీ వచ్చాక సుమారు రెండేళ్ల వరకు బిల్డర్‌ అపార్ట్‌మెంట్‌ నిర్వహణ బాధ్యత తీసుకోవచ్చు.సాధారణ శుభ్రత, భద్రత, బిల్లుల చెల్లింపులు, ఆస్తిపన్ను చెల్లింపులు, డీజీ(డీజిల్‌ జెనెరేటర్‌) సెట్ల నిర్వహణ, నివాసితులకు కావాల్సిన ఇతరత్రా పనులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. రెండేళ్లయ్యాక నివాసితులంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడేందుకు బిల్డర్‌ ప్రతిపాదించాలి. ఫ్లాట్‌ కొన్నప్పుడు.. కొనుగోలుదారులు చెల్లించిన కార్పస్‌ ఫండ్‌ను బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్లాన్‌ ప్రకారమే బిల్డర్‌ నిర్మాణం చేపట్టాడని తెలియజేసే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక సంస్థ నుంచి తీసుకోవాలి. నిర్మాణాన్ని అప్పగించేటప్పుడు బిల్డర్‌ నుంచి కొత్తగా ఏర్పడిన అపార్ట్‌మెంట్‌ సంఘం పలు పత్రాలను తప్పకుండా తీసుకోవాలి.

Today Gold and Silver Price August 3rd 2026 in India6
న్యూ ఇయర్‌లో మొదటిసారి తగ్గిన గోల్డ్ రేటు: కొత్త ధరలు ఇలా..

వరుసగా రెండు రోజులు ధరలు తగ్గిన తరువాత.. బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోచు చేశాయి. వెండి రేటు కూడా అదే బాటలో పయనించింది. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు నూతన సంవత్సరంలో మొదటిసారి తగ్గాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
Advertisement