Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Volkswagen Taigun Facelift Launched at Rs 10 99 Lakh1
2026 టైగన్ లాంచ్: ధర రూ.10.99 లక్షలు

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన టైగన్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. ఈ 2026 మోడల్ సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది.కంఫర్ట్‌లైన్, హైలైన్, హైలైన్ ప్లస్, టాప్‌లైన్, జీటీ లైన్, జీటీ ప్లస్ క్రోమ్, జీటీ ప్లస్ స్పోర్ట్ అనే ఏడు ట్రిమ్‌లలో లభించే టైగన్ కారు కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. 2021లో దేశీయ విఫణిలో లాంచ్ అయిన టైగన్.. దాదాపు ఐదేళ్లకు ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో అడుగుపెట్టింది. ఈ ఎస్‌యూవీలోని కొత్త హెడ్‌లైట్స్.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో అనుసంధానం అయింది. గ్రిల్ డిజైన్ కూడా అప్‌డేట్ అయింది. వెనుక భాగంలో టెయిల్‌లైట్లు, నలుపు రంగులో ఉన్న టైగన్ లోగో పొందుతుంది.పనితీరు పరంగా చూస్తే.. కొత్త వోక్స్‌వ్యాగన్ టైగన్ 114 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ లభిస్తుంది. మునుపటి 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్‌ను చేర్చారు. 147 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఈ తాజా మోడల్‌లో అందుబాటులో ఉంది.కొత్త టైగన్ అవకాడో పెర్ల్, స్టీల్ గ్రే రంగులలో లభిస్తుంది. దీంతో మొత్తం 9 రంగుల ఎంపికలు అందుబాటులోకి వచ్చింది. ఇది 10.09-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది. ఇది 15 విభిన్న అప్లికేషన్‌లను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో కొత్త 9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ కూడా ఉంది, ఇది మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను కూడా అందిస్తుంది.

India Auto Sales Hit Record 28 2 Million Units in FY26 Says SIAM2
కలిసొచ్చిన జీఎస్‌టీ 2.0: భారీగా పెరిగిన వాహన విక్రయాలు

దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ద్విచక్ర, త్రిచక్ర, వాణిజ్య, ప్రయాణిక వాహనాలన్నీ కలిపి రికార్డు స్థాయిలో 2,82,65,519 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024–25లో నమోదైన 2,56,09,399 యూనిట్లతో పోలిస్తే ఇవి 10.4 శాతం అధికం అని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్‌ మంగళవారం తెలిపింది.జీఎస్‌టీ 2.0 అమలు, ఆర్‌బీఐ రెపో రేట్ల కోతలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయని సియామ్‌ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)పై వాహన పరిశ్రమ సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసింది. అయితే, పశ్చిమాసియా యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే డిమాండ్, సరఫరా గొలుసు, వాహన ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది.ముడి చమురు, కమోడిటీ ధరల పెరుగుదల, మారకపు విలువల పెరుగుదల, షిప్పింగ్‌ మార్గాల్లో అంతరాయాలు ఆటో రంగానికి సవాళ్లుగా ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు సద్దుమణిగితే 2026–27లో వాహన రంగం వృద్ధి మరింత వేగం అందుకుంటుందని సియామ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి వాహన ఎగుమతులు 24 శాతం పెరిగి 53,62,884 యూనిట్ల నుంచి 66,47,685 యూనిట్లకు చేరుకున్నాయి.అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ వృద్ధి సంకేతాలు: సియామ్‌ అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ, భారత వాహన పరిశ్రమ బలమైన పునాదులపై నిలబడుతూ వృద్ధిని కొనసాగిస్తోందని సియామ్‌ అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర తెలిపారు. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్, గ్రామీణ-పట్టణ మార్కెట్లలో కొనుగోలు శక్తి పెరుగుదల, సులభమైన ఫైనాన్సింగ్‌ విక్రయాలకు ఊతమిస్తున్నాయని చెప్పారు.జీఎస్‌టీ 2.0 సంస్కరణలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతలు మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ను పెంచి పెట్టుబడులు, కొనుగోళ్లను వేగవంతం చేశాయని తెలిపారు. ఎగుమతుల్లో కొన్ని ప్రాంతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ఇతర మార్కెట్లలో భారత వాహనాల డిమాండ్‌ పెరుగుతుండటం, రూపాయి క్షీణత వల్ల లభిస్తున్న ధరల పోటీ సామర్థ్యం వృద్ధికి తోడ్పడుతున్నాయని వివరించారు.

Gold ETFs record Rs 31561 crore inflows in Q4 FY263
గోల్డ్‌ ఈటీఎఫ్‌లు మెరిశాయ్‌

న్యూఢిల్లీ: బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)కు మార్చి త్రైమాసికంలో ఇన్వెస్టర్ల నుంచి బలమైన ఆదరణ కనిపించింది. రూ.31,561 కోట్ల తాజా పెట్టుబడులను ఇవి ఆకర్షించాయి. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులతో పోల్చితే ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం. అంతేకాదు 2025–26 డిసెంబర్‌ త్రైమాసికంలో వచ్చిన రూ.23,132 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూసినా 36 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసిన డేటా ప్రకారం.. మార్చి నెలలో మాత్రం పెట్టుబడుల రాక బలహీనపడింది.మార్చి నెలలో కేవలం రూ.2,266 కోట్ల పెట్టుబడులు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో రూ.24,040 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,255 కోట్లతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. బంగారం ధరలు గత రెండేళ్లలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం తెలిసిందే. ఫలితంగా ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌లవైపు మొగ్గు చూపడం పెరిగింది. దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వీటిల్లోకి వచ్చాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు అమ్మకాల ఒత్తిడికి కొంత తగ్గిన నేపథ్యంలో, ఈటీఎఫ్‌ పెట్టుబడులపై ఇది ప్రభావం చూపించనట్టు తెలుస్తోంది. రూ.1.71 లక్షల కోట్ల ఆస్తులు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) మార్చి చివరికి రూ.1.71 లక్షల కోట్లకు చేరాయి. 2025 మార్చి చివరికి వీటి విలువ రూ.58,888 కోట్లతో పోల్చితే మూడు రెట్లు పెరిగాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ఫోలియోలు (ఒక ఈటీఎఫ్‌లో ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) గత ఆర్థిక సంవత్సరంలో 54.28 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ఫోలియోలు 1.24 కోట్లకు చేరాయి. ‘‘జనవరిలో పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్‌ (మార్పులు, చేర్పులు), రిస్క్‌ తీసుకునే ధోరణి ఫలితంగా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు అధికంగా వచ్చాయి.దీంతో తర్వాతి నెలల్లో పెట్టుబడులు బలహీనంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మార్చి నెలలో సానుకూల పెట్టుబడులు నమోదవడం అన్నది మార్కెట్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో బంగారాన్ని వైవిధ్యమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారనేదానికి సంకేతం’’అని మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ నేహల్‌ మెష్రామ్‌ పేర్కొన్నారు. బంగారంతో పోల్చితే ఈక్విటీల వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా మారినందున మార్చి నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు తగ్గడానికి కారణమని ద వెల్త్‌ కంపెనీ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో (డెట్‌) ఉమేష్‌ శర్మ చెప్పారు.

India GDP growth may slow by 0. 8 Percentage if oil hits 130 in 20264
భారత్‌ వృద్ధికి... క్రూడ్‌ కోత!

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగి బ్యారెల్‌కు 130 డాలర్లకు చేరితే భారత్‌ ఆర్థిక వృద్ధి రేటుపై 80 బేసిస్‌ పాయింట్ల (0.8 శాతం) మేర ప్రభావం పడొచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, పటిష్టమైన ఆర్థిక రంగంతో చమురు ధరల పెరుగుదలను భారత్‌ తట్టుకోగలదని పేర్కొంది. ‘‘చమురు ధరలు పెరిగితే ప్రభుత్వ ద్రవ్య లోటు లక్ష్యాలకు కొంత ఆటంకం కలగొచ్చు. కానీ భారత్‌ ‘సావరిన్‌ రేటింగ్‌’ పై తక్షణమే ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు’’అని ఎస్‌అండ్‌పీ స్పష్టం చేసింది. ఒకవేళ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి, చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తే.. భారత్‌ తిరిగి పుంజుకుంటుందని నివేదిక పేర్కొంది. నివేదికలోని ఇతర అంశాలు.. ⇒ చమురు ధరల పెరుగుదల వల్ల గృహ వినియోగం, కార్పొరేట్‌ లాభాలు, బ్యాంకింగ్‌ రంగంపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల జీడీపీ వృద్ధి రేటు మందగించే అవకాశం ఉంది. ⇒ కంపెనీల ఎబిట్డా 2027 ఆర్థిక సంవత్సరంలో 15–25 శాతం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కెమికల్స్, రిఫైనింగ్‌ మరియు విమానయాన రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ⇒ బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) 3.5 శాతానికి పెరగొచ్చు. అయినప్పటికీ, భారతీయ బ్యాంకుల వద్ద తగినంత మూలధనం ఉండటం ఊరటనిచ్చే అంశం. ⇒ చమురు ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలతో దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు జీడీపీలో 0.4% పెరగవచ్చు. దీనివల్ల రూపాయి విలువపైనా ఒత్తిడి పడుతుంది. ⇒ భారతీయ కంపెనీలు గత కొన్నేళ్లుగా అప్పులను తగ్గించుకుంటూ రావడంతో వాటి బ్యాలెన్స్‌ షీట్లు బలంగా ఉన్నాయి. బ్యాంకుల వద్ద మెరుగైన మూలధనంతోపాటు తక్కువ స్థాయిలో ఎన్‌పీఏలు సానుకూలాంశాలు.

Ai Plus Nova 2 Goes on Sale from April 14 Price Specs and Features Revealed5
Ai+ నోవా 2 అమ్మకాలు ఎప్పుడంటే?

నోవా సిరీస్‌లో భాగంగా తమ సరికొత్త డివైస్‌ 'నోవా 2' విక్రయాలు ప్రారంభమైనట్లు Ai+ స్మార్ట్‌ఫోన్‌ ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటైల్ ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటుంది.Ai+ నోవా 2 ధరలు4జీబీ + 64 జీబీ: రూ.8,9996 జీబీ + 128 జీబీ: రూ.10,999మొదటిసారి అప్‌గ్రేడ్ అవుతున్న లేదా Ai+కి మారుతున్న వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ నోవా 2 ఉండనున్నాయి. ఇది నమ్మకమైన, విశ్వసనీయమైన రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని Ai+ స్మార్ట్‌ఫోన్ సీఈఓ, నెక్స్ట్‌ క్వాంటం (NxtQuantum) షిఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మాధవ్ సేథ్‌ అన్నారు.6000mAh బ్యాటరీతో కూడిన నోవా 2.. స్ట్రీమింగ్, బ్రౌజింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు సరిపోయేలా తయారైంది. ఇది నెక్ట్స్‌ క్వాంటం (NxtQuantum) OSతో కూడిన ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తూ సున్నితమైన, ఆప్టిమైజ్ చేసిన అనుభూతి అందిస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HBM సపోర్ట్‌తో కూడిన 6.745 ఇంచెస్ HD+ డిస్‌ప్లేతో వినియోగదారులు కంటెంట్‌ను చూస్తున్నా లేదా రోజువారీ పనులు చేస్తున్నా, నోవా 2 స్పష్టమైన విజువల్స్‌, నిరంతరాయమైన స్క్రోలింగ్‌ అందిస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్‌లో అన్ని రకాల లైటింగ్ పరిస్థితులలోనూ కచ్చితమైన, సహజమైన ఫొటోలు తీయడానికి అనువైన 50MP బ్యాక్‌ కెమెరా, అలాగే స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP64 రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌తో కూడిన మెరుగైన నిర్మాణాన్ని నోవా 2 కలిగి ఉంది. ఇది పర్పుల్, గ్రీన్, పింక్, బ్లూ, బ్లాక్ అనే ఐదు విభిన్న రంగులలో లభిస్తుంది.

RBI Slaps Rs 7 5 Lakh Fine on Himachal Pradesh State Cooperative Bank6
కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా

నిబంధనల ఉల్లంఘన విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కఠినంగా వ్యవహరించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ.7.50 లక్షల నగదు జరిమానాను విధిస్తూ కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఖాతాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో బ్యాంక్ వైఫల్యం చెందడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.తనిఖీలో వెలుగుచూసిన లోపాలునేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్‌) 31 మార్చి 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీలో ఈ లోపాలు బయటపడ్డాయి. తనిఖీ నివేదిక ప్రకారం.. ఖాతాదారుల రిస్క్ ప్రొఫైల్‌ను కాలానుగుణంగా సమీక్షించే పటిష్టమైన వ్యవస్థను అమలు చేయడంలో బ్యాంక్ విఫలమైంది. ఆర్‌బీఐ నిర్దేశించిన కేవైసీ, ఇతర నియంత్రణ ప్రమాణాలను పాటించలేదు.ఆర్‌బీఐ చర్యల నేపథ్యంనిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరుతూ ఆర్‌బీఐ ఇదివరకే సదరు బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణలో ప్రతినిధులు చేసిన మౌఖిక వాదనలు, వారు సమర్పించిన అదనపు పత్రాలను ఆర్‌బీఐ క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, బ్యాంక్ వివరణ సంతృప్తికరంగా లేదని, ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.‘ఈ చర్య కేవలం రెగ్యులేటరీ వ్యవస్థలో లోపాలపై తీసుకున్న నిర్ణయం మాత్రమే. దీనికి బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలకు లేదా అది జరిపే లావాదేవీల చెల్లుబాటుకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే, ఈ జరిమానా విధించడం వల్ల బ్యాంకుపై భవిష్యత్తులో తీసుకునే ఇతర చట్టపరమైన చర్యలకు ఎటువంటి ఆటంకం కలగదు’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Advertisement
Advertisement
Advertisement