Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Spirit Airlines Shuts Operations After 33 Years of Service Due to Fuel Price Surge1
ఇంధన ధరల ప్రభావం.. అమెరికా విమానయాన సంస్థ క్లోజ్!

సుమారు మూడు దశాబ్దాలు తక్కువ ధరకే విమాన ప్రయాణ సేవలను అందిస్తున్న అమెరికన్ విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్‌లైన్స్, తన ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు, తక్షణమే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని.. ఆ విమానయాన సంస్థ ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది.ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదల కారణంగా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. మా ప్రయాణికులు ఎవరూ కూడా ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది. కాగా ఇప్పటికే టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు రీఫండ్ చేయనున్నట్లు కూడా వెల్లడించింది.కోవిడ్ తరువాత స్పిరిట్ కంపెనీ లాభాలను ఆర్జించకపోగా.. ఆర్థికంగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఇంధన ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. దీంతో సంస్థ తన సర్వీసులను నిలిపివేయడానికి సన్నద్ధమైంది. ఈ ప్రభావం సుమారు 17వేలమంది ఉద్యోగులపై పడనుంది.pic.twitter.com/Wz3ilRHD2z— Spirit Airlines (@SpiritAirlines) May 2, 2026

Govt Opens Insurance Sector to 100 Percent FDI2
బీమా రంగంలో సంచలనం: 100% విదేశీ పెట్టుబడులు!

భారత ప్రభుత్వం.. తాజాగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం.. బీమా కంపెనీలలో 100% విదేశీ పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించింది. అంటే.. విదేశీ సంస్థలు ఇకపై భారత బీమా రంగంలో పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేకుండా సులభంగా ప్రవేశించగలవు. ఈ నిర్ణయం ద్వారా భారత బీమా రంగం అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించడానికి అవకాశాలు పెరుగుతాయి.అయితే.. విదేశీ పెట్టుబడులు 1938 బీమా చట్టానికి లోబడి ఉండాలి. అంతే కాకుండా బీమా, సంబంధిత కార్యకలాపాలను చేపట్టడానికి కంపెనీలు తప్పనిసరిగా భారత బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (IRDAI) నుంచి లైసెన్సులు లేదా అనుమతులు పొందాలి. అంటే, విదేశీ పెట్టుబడులు వచ్చినా కూడా భారత ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుందన్నమాట.ఆటోమేటిక్ రూట్ కింద LICలో విదేశీ పెట్టుబడి 20%కి పరిమితం చేశారు. LICలో విదేశీ పెట్టుబడి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం, 1956 (31 ఆఫ్ 1956)లోని నిబంధనలకు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం, 1956 (31 ఆఫ్ 1956)లోని సెక్షన్ 43 నిబంధనల ప్రకారం LICకి వర్తించే ఇన్సూరెన్స్ చట్టం, 1938 (4 ఆఫ్ 1938)లోని ఇతర నిబంధనలకు లోబడి ఉంటుంది'' అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.మరో ముఖ్యమైన రూల్ ఏమిటంటే.. విదేశీ పెట్టుబడులు ఉన్న భారతీయ బీమా సంస్థల్లో, కనీసం ఒక కీలక పదవిలో ఉన్న వ్యక్తి (చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈఓ) భారత నివాసి పౌరుడై ఉండాలి. ఇది దేశీయ నియంత్రణ, బాధ్యతను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం.ఇక బీమా మధ్యవర్తుల (ఇంటర్మీడియరీస్) విషయంలో కూడా 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. ఇందులో బ్రోకర్లు, రీ-ఇన్సూరెన్స్ బ్రోకర్లు, కన్సల్టెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు, సర్వేయర్లు, లాస్ అసెసర్లు, మేనేజింగ్ జనరల్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ రిపాజిటరీలు ఉంటారు.ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!

Share Buybacks Make a Comeback Amid Tax Reforms3
షేర్‌ బైబ్యాక్‌ల జోరు.. ఇన్వెస్టర్లకు కొత్త ఊపు!

గత రెండేళ్లుగా గణనీయంగా తగ్గిపోయిన షేర్ల బైబ్యాక్‌ కార్యకలాపాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఇన్వెస్టర్లకు సానుకూలంగా ఉండే విధంగా పన్నుల విధానాలను క్రమబద్ధీకరించడంతో ఇవి ఆకర్షణీయంగా మారాయి. దీంతో అరబిందో ఫార్మా, సైయెంట్, విప్రోలాంటి కంపెనీలు బైబ్యాక్‌ ప్రణాళికలను ప్రకటించాయి.గత కొన్నాళ్లుగా బైబ్యాక్‌లలో షేర్లను విక్రయించడంపై వచ్చిన లాభాలను, డీమ్డ్‌ డివిడెండ్లుగా పరిగణించి, శ్లాబ్‌ రేట్ల ప్రకారం పన్ను వేస్తుండటంతో ఇన్వెస్టర్లలో వీటిపై పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదు. అయితే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఫైనాన్స్‌ యాక్ట్‌ 2026 చట్టంలోని కొత్త నిబంధనల ప్రకారం, ఇన్వెస్టర్లకు సానుకూలంగా, హేతుబద్ధతతో వీటిని షేర్‌హోల్డర్ల చేతిలో క్యాపిటల్‌ గెయిన్స్‌గా పరిగణిస్తుండటంతో బైబ్యాక్‌లు కాస్త ఆకర్షణీయంగా మారుతున్నాయి. కంపెనీల నుంచి బైబ్యాక్‌ ప్రతిపాదనలు వెల్లువెత్తడానికి ఈ పన్నుపరమైన ప్రయోజనాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.రెండేళ్లుగా డౌన్‌..గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో బైబ్యాక్స్‌ గణనీయంగా పడిపోయాయి. 2024–25లో కేవలం రూ. 8,034 కోట్లు, 2025–26లో రూ. 19,500 కోట్లకు పరిమితమయ్యాయి. అదే పన్ను విధానాలు సానుకూలంగా ఉన్నప్పుడు 2023–24లో వీటి పరిమాణం ఏకంగా రూ. 50,750 కోట్లుగా నమోదైంది.వ్యాపారంపై ధీమా..కేవలం ట్యాక్స్‌ ప్రయోజనాల వల్లే కాకుండా ఇతర అంశాలూ బైబ్యాక్‌కి ఊతమిస్తున్నాయి. చాలా మటుకు స్టాక్స్‌ భారీగా కరెక్షన్‌కి లోనవడం, నిధులు పుష్కలంగా ఉన్న కంపెనీలు తమ స్టాక్స్‌ని చాలా చౌకగా కొనుక్కునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రెండు అంశాలే కాకుండా కంపెనీలు బైబ్యాక్‌లను చేపట్టడమనేది తమ ప్రధాన వ్యాపారాలపై కంపెనీలకి గల నమ్మకాన్ని సూచిస్తోందని నిపుణులు చెప్పారు. తమ షేర్లు ఉండాల్సిన విలువ కన్నా తక్కువ పలుకుతున్నా, ఈపీఎస్‌ (షేరువారీ ఆర్జన), రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌వోఈ) మెరుగుపడే కొద్దీ రేటు మరింత పెరుగుతుందని సంస్థలు ధీమాగా ఉండటాన్ని ఇది తెలియజేస్తోందన్నారు.భారీగా రాబడులిచ్చే అవకాశాలు పరిమితంగా ఉన్న కంపెనీల విషయానికొస్తే, నగదును పక్కన పెట్టుకుని కూర్చోవడానికి బదులు బైబ్యాక్‌ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, గ్లోబల్‌గా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వేల్యుయేషన్లను కాపాడుకునేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ఓపెన్‌ మార్కెట్‌ బైబ్యాక్‌ రూపంలో కొనుక్కునే వెసులుబాటును తిరిగి ప్రవేశపెట్టాలని సెబీ యోచిస్తున్న నేపథ్యంలో ఈ విధానం మళ్లీ ఆకర్షణీయంగా మారొచ్చని భావిస్తున్నారు.

Rich Dad Poor Dad Robert Kiyosaki exposes Pak oil shock vs India stability4
ఇండియాతో పోలిక.. పాకిస్తాన్‌ పరువు తీసిన కియోసాకి

ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతుంటే, పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. భారత్ తన దూరదృష్టితో సంక్షోభాన్ని తట్టుకుంటుంటే, పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ఆయన ఎత్తిచూపారు.పాక్ వద్ద ఒక్క రోజు నిల్వలు కూడా లేవు!పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కియోసాకి తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. ఇస్లామాబాద్ వద్ద కనీసం ఒక్క రోజుకు సరిపడా ‘వ్యూహాత్మక చమురు నిల్వలు’ కూడా లేవని మాలిక్ అంగీకరించారు.కియోసాకి ఏమన్నారంటే‘న్యూఢిల్లీ తన అత్యవసర నిల్వలను పెంచుకోవడంలో నిమగ్నమైతే, ఇస్లామాబాద్ మాత్రం తమ చమురు సరఫరా సురక్షితంగా ఉందని ప్రపంచాన్ని నమ్మించే పనిలో ఉంది. కానీ వాస్తవం వేరు. భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, పాకిస్తాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’పాక్‌లో భగ్గుమంటున్న ధరలుఏప్రిల్ ప్రారంభం నుండి పాకిస్తాన్‌లో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.321 నుండి ఏకంగా రూ.458కి (43% పెరుగుదల) చేరింది. డీజిల్ లీటరుకు రూ.335 నుండి రూ.520కి (55% పెరుగుదల) పెరిగింది. ఈ అస్థిరత వల్ల దేశంలో సరఫరా గొలుసు విచ్ఛిన్నమై, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిని ‘జాతీయ అత్యవసర పరిస్థితి’గా అభివర్ణిస్తున్నాయి.భారత్ విజయం వెనుక రహస్యం..భారత్ ఈ స్థాయి సంక్షోభాన్ని ఎలా తట్టుకోగలుగుతుందో వివరిస్తూ కియోసాకి కీలక విషయాలు వెల్లడించారు. భారత్ నిర్మించున్న వ్యూహాత్మక నిల్వలు 60 నుండి 70 రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం కేవలం ‘ఒక సంతకం’తో ఈ అత్యవసర చమురును విడుదల చేసి మార్కెట్‌ను స్థిరీకరించగలదు.భారత్ కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా రష్యా, వెనిజులా వంటి దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకుని తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా ఉన్న భారత్, ఎగుమతి సుంకాలను సర్దుబాటు చేస్తూ దేశీయ ధరలు పెరగకుండా అడ్డుకోగలిగింది.పాక్ మంత్రి నిస్సహాయతపాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా భారత్ సన్నద్ధతను ప్రశంసించక తప్పలేదు. "భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటమే కాకుండా, వారు ఐఎంఎఫ్ (IMF) కఠిన నిబంధనల కింద లేరు. అందుకే వారు పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించగలుగుతున్నారు. కానీ మేము ప్రతి పైసా కోసం ఐఎంఎఫ్ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది" అని ఆయన వాపోయారు.యుద్ధం ఈ ఆర్థిక అంతరాన్ని సృష్టించలేదని, కేవలం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నద్ధత లోపాన్ని బయటపెట్టిందని కియోసాకి విశ్లేషించారు. హోర్ముజ్ జలసంధి మూతపడితే, దిగుమతులపైనే ఆధారపడ్డ పాకిస్తాన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

Hyundai Sales in April 2026 And Venue SUV Drives Growth5
ఏప్రిల్‌లో ఎక్కువమంది కొన్న హ్యుందాయ్ కారు ఇదే!

హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఏప్రిల్ నెలకు అత్యధిక దేశీయ అమ్మకాలను నమోదు చేసింది. ఈ అమ్మకాలను వెన్యూ సేల్స్ బాగా సహాయపడ్డాయి. దీనికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది.2026 ఏప్రిల్ నెలలో కంపెనీ 51,902 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2025 ఏప్రిల్ అమ్మకాలతో (44,374 యూనిట్లు) పోలిస్తే 17 శాతం ఎక్కువ. దేశీయ అమ్మకాలలో వృద్ధి కనపరిచినప్పటికీ.. ఎగుమతులు 16 శాతం తగ్గాయి.గత ఏడాది ఏప్రిల్ నెలలో 16,400 యూనిట్లును హ్యుందాయ్ ఎగుమతి చేయగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 13,708 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. వెన్యూ సేల్స్ 12420 యూనిట్లతో బ్రాండ్ పాపులర్ సేల్ మోడల్ అయింది. తరువాత స్థానంలో ఎక్స్టర్ ఎస్‌యూవీ, వెర్నా సెడాన్, ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, క్రెటా సమ్మర్ ఎడిషన్ ఎస్‌యూవీ, గ్రాండ్ ఐ10 నియోస్ వైబ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!

Donald Trump Says He Will Hike Tariffs on EU Cars to 25 Percent6
ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!

యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించకపోవడం వల్ల తాను ఈ సుంకాలను పెంచుతున్నట్లు ట్రంప్ తెలిపారు."మనం పూర్తిగా అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ పాటించలేదు. కాబట్టి వచ్చే వారం అమెరికాలోకి వచ్చే కార్లు, ట్రక్కులపై యూరోపియన్ యూనియన్‌కు విధించే సుంకాలను పెంచుతాను," అని ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల బిలియన్ల డాలర్ల ఆదాయం యునైటెడ్ స్టేట్స్‌లోకి వస్తుంది. అంతే కాకుండా ఇది ఉత్పత్తిని మరింత వేగవంతం చేసేలా ఒత్తిడి తెస్తుందని పేర్కొన్నారు.ఆగస్టులో అమెరికా, యూరోపియన్ యూనియన్ ఒక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి, దీని ప్రకారం యూరోపియన్ యూనియన్‌పై సుంకాలను 15 శాతానికి తగ్గించారు. ఆ సమయంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పారిశ్రామిక వస్తువులు, వాహనాలపై సుంకాలను తొలగించడానికి యూరోపియన్ యూనియన్ కూడా అంగీకరించింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!

Advertisement
Advertisement
Advertisement