ప్రధాన వార్తలు
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..
నాలుగైదు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం ఓ మోస్తరుగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి భారీగా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఒకింత ఆనందాన్ని కలిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ.1,38,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి రూ.1,36,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,51,420 రూపాయల నుంచి 148970 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు ఎంతలా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర 149120 రూపాయల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద ఉంది. ఉదయం ఈ ధరలు వరుసగా రూ.151570, రూ. 138950 వద్ద ఉన్నాయి.చెన్నైలో కూడా సాయంత్రానికి బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,50,000 వద్ద ఉంది. 22 క్యారెట్ల రేటు 137500 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ రేటు రూ.10000 తగ్గడంతో సిల్వర్ రూ.2.55 లక్షల వద్దకు చేరింది. ఈ రేటు ఢిల్లీలో 2.50 లక్షల రూపాయల వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరంలో వెండి రేటు కొంత తక్కువే.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!
2025–26లో 47 లక్షల వెహికల్స్..
గత ఆర్థిక సంవత్సరం (2025–26) రికార్డు స్థాయిలో 47 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీల అత్యుత్తమ పనితీరుతో పాటు ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో జీఎస్టీ 2.0 అమలు వాహన విక్రయాలను మరింత వేగవంతం చేసింది.కొత్త ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వేగాన్ని కొనసాగించాలని ఆటోమొబైల్ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే పశి్చమాసియా యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు, కమోడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలు పెరిగితే డిమాండ్ తగ్గొచ్చని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ 24,22,713 యూనిట్లను విక్రయించింది. 2024–25లో అమ్మకాలు 22,34,266గా ఉన్నాయి.
భారతి ఎయిర్టెల్ రికార్డ్.. 65 కోట్ల యూజర్స్!
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది వినియోగదారుల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో చందాదారుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ టెలికాం కంపెనీ.. భారతదేశంలో మాత్రమే కాకుండా, ఆఫ్రికా అంతటా బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. GSMA ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. ఒక్క ఇండియాలో ఎయిర్టెల్కు 368 మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ద్వారా అనుసంధానించి 13 మిలియన్ల గృహాలు, దాని డిజిటల్ టీవీ సేవలను ఉపయోగించే 15 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.Bharti Airtel, the world’s second largest telecom operator by customer base, has crossed 650 million customers globally.— Bharti Airtel (@airtelnews) April 2, 2026ఆఫ్రికాలో.. ఎయిర్టెల్ ఆఫ్రికా 14 దేశాలలో 179 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ ప్రాంతంలో కంపెనీ హై-స్పీడ్ డేటా, వాయిస్ సేవలు, మొబైల్ మనీ పరిష్కారాలను అందిస్తుండగా, 52 మిలియన్లకు పైగా వినియోగదారులు దీని ఆర్థిక సేవల ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉన్నారు.ఎయిర్టెల్ సాధించిన ఈ విజయాన్ని గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. 65 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడం ఒక పెద్ద బాధ్యత. కొత్త ఆవిష్కరణలు, విశ్వసనీయమైన సేవల ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై కంపెనీ దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. టెలికాం పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడమే ఎయిర్టెల్ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!
చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఇదేబాటలో దిగ్గజ సంస్థ ఒరాకిల్ కూడా అడుగులువేసింది. ఈ ప్రభావం ఏకంగా 30వేలమంది ఎంప్లాయిస్ మీద పడుతుంది. ఇందులో 12000 ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వారికి లభించే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒరాకిల్ తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు చెందినవారు ఉన్నారు. లేఆఫ్స్ ప్రక్రియలో అనేక మంది ఉద్యోగులు ఒక్కసారిగా తమ సిస్టమ్ యాక్సెస్ కోల్పోయి, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జాబ్ కోల్పోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు రెడ్దిట్ ద్వారా వెల్లడించారు. ఇందులోనే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కూడా వివరించారు.''కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల ప్రాథమిక జీతం చెల్లిస్తారు. అదనంగా.. వాడని సెలవుల మొత్తాన్ని నగదుగా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగి తొలగింపు సమయంలో నోటీస్ పీరియడ్కు బదులుగా ఒక నెల జీతం కూడా అందజేస్తారు. ఉద్యోగి అర్హత ఉన్నట్లయితే గ్రాచ్యుటీ కూడా లభిస్తుంది. ఇంకా.. తొలగింపు తేదీ వరకు ఉన్న పెండింగ్ జీతం కూడా పూర్తిగా చెల్లిస్తారు'' అని ఒక ఉద్యోగి పేర్కొన్నారు.కంపెనీ నుండి రెండు నెలల అదనపు ఎక్స్గ్రేషియా (ప్రత్యేక పరిహారం) కూడా లభిస్తుంది. అయితే.. ఈ మొత్తం పొందడానికి ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం అనే ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన షరతుగా కనిపిస్తోంది. అలాగే సుమారు రూ.20,000 వరకు ఇన్సూరెన్స్, ఒక నెల గార్డెనింగ్ లీవ్ జీతం లేదా దానికి సమానమైన పరిహారం కూడా ఇవ్వనున్నట్లు మరికొందరు ఉద్యోగులు వెల్లడించారు.ఇదీ చదవండి: ప్రాపర్టీ అమ్మేసిన బాలీవుడ్ నటుడు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
జియో హిట్ ప్లాన్: అన్లిమిటెడ్ బెనిఫిట్స్!
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారి కోసం జియోలో ఓ పాపులర్ హిట్ ప్లాన్ అందుబాటులో ఉంది. అదే రూ. 349 ప్లాన్.ప్లాన్ వివరాలుజియో అందిస్తున్న ఈ రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా మొబైల్ సేవలను ఆస్వాదించవచ్చు.డేటా ధమాకాఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని డేటా ప్రయోజనాలే. ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజుల కాలపరిమితిలో వినియోగదారులకు మొత్తం 56 GB డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత కూడా తక్కువ వేగంతో ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యం ఉంటుంది.అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్డేటాతో పాటు, ఈ ప్లాన్ ద్వారా దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి. లోకల్, ఎస్టీడీ కాలింగ్స్ కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
రికార్డ్: ఒక్క నెలలో రూ. 29.53 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పండుగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు తదితర అంశాల నేపథ్యంలో ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు మార్చిలో రికార్డు స్థాయికి ఎగిశాయి. ఏకంగా రూ. 29.53 లక్షల కోట్ల విలువ చేసే 2,264 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.గతేడాది మార్చిలో నమోదైన రూ. 24.77 లక్షల కోట్లతో పోలిస్తే విలువపరంగా 19 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 26.84 లక్షల కోట్ల విలువ చేసే 2,039 కోట్ల లావాదేవీలు రికార్డయ్యాయి. డిజిటల్ చెల్లింపులు ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాయనడానికి ఇది నిదర్శనమని పేనియర్బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 85 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా యూఏఈ, సింగపూర్ తదితర ఏడు దేశాల్లో ఇది అందుబాటులో ఉంది.
కార్పొరేట్
భారతి ఎయిర్టెల్ రికార్డ్.. 65 కోట్ల యూజర్స్!
ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!
ఉత్తర కొరియా కిమ్ ‘దొంగ ప్రయాణం’!
బిగ్ రిలీఫ్.. ఐటీ శాఖ కీలక నిర్ణయం
40 పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం రద్దు!
ఒక్క ఉద్యోగమూ పోదు.. దుబాయ్ కంపెనీ అధినేత హామీ
చైనా సీసీ కెమెరాలకు చెక్! ఇక కొత్త నిబంధనలు
ఎయిర్టెల్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు
LICకి రూ.3,750 కోట్ల నష్టం.. అనిల్ అంబానీపై కేసు
ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!
స్టాక్ మార్కెట్లు ముగిశాయిలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగ...
మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
1850 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కద...
ఎఫ్అండ్వోపై లావాదేవీల పన్ను అప్
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు నిబంధనల భార...
నయారా బాటలో షెల్ ఇండియా!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సామాన్యుడి ...
ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత...
80.4 శాతానికి ద్రవ్యలోటు
కేంద్ర ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్ర...
ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి బెటర్!
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
జేబులో జ్యూసర్.. బాటిల్ బ్యాగ్!
మీ సమ్మర్ను రిఫ్రెషింగ్గా మార్చే ‘స్మార్ట్’ మ్యాజిక్ ఇదిగో! ఈ అదిరిపోయే గాడ్జెట్స్తో చెమటలకు గుడ్ బై చెప్పేసి, చిల్ అవ్వండి!జేబులో జ్యూసర్!ఆఫీసులో ఉన్నప్పుడైనా లేదా జిమ్ పూర్తి చేసొచ్చినా, బయట దొరికే షుగర్ డ్రింక్స్ తాగి విసిగిపోయారా? ఎక్కడున్నా సరే ‘ఫ్రెష్’గా జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇందుకోసమే వచ్చేసింది ఈ రీచార్జబుల్ పోర్టబుల్ జ్యూసర్!ఇది మామూలు మిక్సీ కాదు, మీరు ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లగలిగే ఒక మినీ మ్యాజిక్ బాటిల్! పైగా దీనికి వైర్లు లేదా ప్లగ్ పాయింట్లతో పనిలేదు. ఇందులో ఉన్న పవర్ఫుల్ బ్యాటరీని మీ మొబైల్ చార్జర్ లేదా పవర్ బ్యాంక్తో చార్జ్ చేసుకుంటే చాలు. ప్రయాణాల్లో ఉన్నా, క్యాంపింగ్లో ఉన్నా సెకన్లలో తాజా ఫ్రూట్ జ్యూస్లు, స్మూతీలు రెడీ అయిపోతాయి. జ్యూసర్ లీక్–ప్రూఫ్ డిజైన్తో వస్తుంది, కాబట్టి మీ బ్యాగ్లో పెట్టుకున్నా చిందుతుందనే భయం ఉండదు. ధర రూ. 570 మాత్రమే!బాటిల్ బ్యాగ్!బయటకి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ను చేత్తో పట్టుకోలేక, బ్యాగ్లో పెడితే లోపల ఉన్న వస్తువులు తడిసిపోతాయని టెన్షన్ పడుతున్నారా? ఇకపై మీ బాటిల్ను స్టయిలిష్గా మోసుకెళ్లడానికి వచ్చేసింది ఈ వాటర్ బాటిల్ క్యారియర్ బ్యాగ్!ఇందులో బాటిల్తో పాటు మీ ఫోన్, డబ్బులు లేదా తాళాలు పెట్టుకోవడానికి ఒక జిప్పర్ పాకెట్ కూడా ఉంటుంది. పైగా దీనికి ఉన్న అడ్జస్టబుల్ షోల్డర్ స్ట్రాప్ వల్ల ఎవరికైనా ఇట్టే సెట్ అయిపోతుంది. వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల వర్షం పడినా మీ ఫోన్, బాటిల్ సేఫ్గా ఉంటాయి! ఆఫీసుకైనా, జిమ్కైనా లేదా ట్రావెలింగ్కైనా ఈ బ్యాగ్ మీకు మంచి క్లాసీ లుక్ను ఇస్తుంది. ధర రూ. 500 మాత్రమే!ఐస్ ముక్కల ‘మ్యాజిక్ కప్పు’!ఫ్రిజ్లో ఉన్న ఐస్ ట్రే నుంచి ఐస్ ముక్కల్ని తీయడానికి కుస్తీ పడుతున్నారా? తీరా తీశాక అవి అక్కడక్కడా విరిగిపోయి చిరాకు తెప్పిస్తున్నాయా? అయితే మీకోసం వచ్చేసింది ఈ సిలికాన్ ఐస్ మేకర్ కప్పు!ఇది మామూలు ఐస్ ట్రే కాదు, ఒక స్మార్ట్ సిలికాన్ సిలిండర్. ఇందులో నీళ్లు పోసి ఫ్రిజ్లో పెట్టుకుని ఐస్ తయారు చేసుకోవచ్చు. దీనికున్న చిన్న బటన్ నొక్కితే చాలు, అరవై చిన్న చిన్న ఐస్ ముక్కలు టకటకా రాలిపోతాయి! చూడటానికి కప్పులా చాలా చిన్నగా ఉంటూ, మీ ఫ్రిజ్లో అస్సలు చోటు ఆక్రమించదు. ఫుడ్ గ్రేడ్ సిలికాన్ తో తయారవ్వడం వల్ల చాలా సేఫ్, పైగా దీనికి ఉన్న మూత వల్ల ఫ్రిజ్లోని ఇతర వాసనలు ఐస్కు అంటుకోవు. ధర కేవలం రూ. 400 మాత్రమే!
వివో నుంచి రెండు కొత్త ఫోన్లు
న్యూఢిల్లీ: వివో ఇండియా కొత్తగా రెండు 5జీ స్మార్ట్ ఫోన్స్ని ఆవిష్కరించింది. వై21, వై11 వీటిలో ఉన్నా యి. వై 21 5జీ ధర రూ. 18,999 నుంచి, వై11 5జీ రేటు రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. నిర్దిష్ట బ్యాంక్ కార్డులతో వై21పై రూ. 1,500 వరకు, వై11పై రూ. 1,000 వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ ఉంటుంది.రెండు డివైజ్లలో 6500 ఎంఏహెచ్ బ్యాటరీలు, 6.74 అంగుళాల స్క్రీన్లు, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్లు, ఆరిజిన్ ఓఎస్6 ఆపరేటింగ్ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వై21లో 50 ఎంపీ రియర్ కెమెరా, వై11లో 13 ఎంపీ రియర్ కెమెరా ఉంటాయి. వివో ఇండియా ఈ–స్టోర్, ఈకామర్స్ ప్లాట్ఫాంలు, పార్ట్నర్ రిటైల్ స్టోర్స్లో ఇవి లభిస్తాయి.
ట్యాబ్లెట్ పీసీల్లో శాంసంగ్ టాప్..
ముంబై: భారత ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ 2025లో వార్షిక ప్రాతిపదికన 2% వృద్ధి సాధించింది. ముఖ్యంగా శాంసంగ్ 31% మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలవగా.. యాపిల్ 20% వాటాతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లెనోవో (15%) మూడో స్థానంలో నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.‘‘ప్రముఖ బ్రాండ్లు చేపట్టిన వ్యూహాత్మక ఉత్పత్తి నవీకరణల కారణంగా భారత ట్యాబ్లెట్ మార్కెట్లో ప్రీమియం వైపు స్పష్టమైన మార్పు కనిపించింది. రూ.30,000–రూ.40,000 ధర విభాగం అత్యంత వేగంగా పెరుగుతున్న సెగ్మెంట్గా మారింది. ఈ విభాగంలో షిప్మెంట్లు దాదాపు 7 రెట్లు పెరిగాయి. ఇది అత్యాధునిక పనితీరు గల డివైస్లపై కస్టమర్లకు పెరుగుతున్న ఆసక్తి సూచిస్తుంది.’’ అని కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రధాన అనలిస్ట్ అన్షికా జైన్ తెలిపారు. కొనసాగిన శాంసంగ్ హవా: భారత్ ట్యాబ్లెట్ పీసీ మార్కెట్లో గతేడాది కూడా శాంసంగ్ అగ్రస్థానంలోనే కొనసాగింది. ట్యాబ్లెట్ల సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 15% వృద్ధితో మార్కెట్ వాటా 2024లో 27% నుంచి 2025లో 31 శాతానికి పెరిగింది. గెలాక్సీ ట్యాబ్ ఏ9 సిరీస్కు మంచి డిమాండ్ నెలకొనడం, తరువాత ఏ11 సిరీస్ ప్రవేశంతో వృద్ధి కొనసాగింది. రూ.15,000–రూ.30,000 విభాగంలో శాంసంగ్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. అలాగే గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిరీస్ ద్వారా ప్రీమియం విభాగంలో కూడా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. యాపిల్ వాటా స్వల్ప తగ్గుదల: మార్కెట్ వాటా స్వల్పంగా రెండు శాతం క్షీణించినప్పటికీ యాపిల్ మొత్తం మీద 20 శాతం వాటాతో శాంసంగ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. రూ.30,000– రూ.40,000 ధర విభాగంలో ఐప్యాడ్ (2025) 128జీబీ మోడల్కు మంచి డిమాండ్ ఉండటం గమనార్హం. ఐప్యాడ్ ప్రో సిరీస్లో ఓఎల్ఈడీ టెక్నాలజీ వినియోగం పెరగడంతో ప్రీమియం సెగ్మెంట్లో కంపెనీ స్థానం బలపడింది. లెనోవో 24% సప్లై వృద్ధితో 15 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోగా, షియోమీ 74% షిప్మెంట్ పెరు గుదలతో 11% మార్కెట్ వాటాను సాధించింది. మరోవైపు, ఏసర్ సప్లైలు 50% క్షీణించడంతో మార్కెట్ వాటా 2024లోని 21% నుంచి 2025లో 10 శాతానికి దిగివచి్చంది. ఎగుమతులు–తయారీ రంగాల్లో పురోగతి: 2025లో ట్యాబ్లెట్ ఎగుమతులు ఒక మిలియన్ యూనిట్లను దాటాయి. శాంసంగ్, లెనోవో ఆధ్వర్యంలో అమెరికా, యూరప్ మార్కెట్లకు సరఫరాలు పెరిగాయి. దేశీయ ఉత్పత్తి మొత్తం షిప్మెంట్లో 50 శాతానికి చేరడం లోకలైజేషన్ వేగాన్ని సూచిస్తోంది. దీంతో భారత్ గ్లోబల్ ట్యాబ్లెట్ తయారీ కేంద్రంగా ఎదుగుతోంది.2026లో వృద్ధి అంచనాలు: బలమైన డిమాండ్ ఆధారంగా 2026లో మార్కెట్ మరింత వృద్ధి చెందనుందని అంచనా. మెమరీ ధరలు ఖర్చులు, లాభాలపై ప్రభావం చూపినా..., అధిక కాని్ఫగరేషన్లు, ప్రొడక్టివిటీ డివైజ్లకు పెరుగుతున్న డిమాండ్ వృద్ధికి దోహదం చేస్తాయి. లోకలైజేషన్, సరఫరా డైవర్సిఫికేషన్తో ఎగుమతులు కీలకంగా మారనున్నాయి. ఏఐ ఆధారిత టాబ్లెట్లు, డివైస్లోనే పనిచేసే ఏఐ ఫీచర్లు కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తూ, మార్కెట్ విస్తరణకు తదుపరి దశకు పునాది వేస్తాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అభిప్రాయపడింది.
జియో మంత్లీ ప్లాన్లు.. 30 రోజులు వ్యాలిడిటీ
మొబైల్ రీచార్జ్కు సంబంధించి సాధారణంగా మంత్లీ రీచార్జ్ ప్లాన్లు అంటే 28 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంటాయి. కానీ నెలంతటికీ అంటే 30 రోజులూ వ్యాలిడిటీ ఉండే ప్లాన్లు కావాలనుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియోలో రెండు చౌకైన రీచార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నెలకు సరిపడా డేటా, కాలింగ్ ప్రయోజనాలతో పాటు కళ్లు చెదిరే అదనపు బెనిఫిట్స్, ముఖ్యంగా ఏఐ (AI) ప్రియుల కోసం ఈ ప్లాన్లో భారీ ఆఫర్లను చేర్చింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..జియో రూ. 365 ప్లాన్జియో తన వెబ్సైట్, యాప్లో రూ. 365 ధరతో కూడిన ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లకు భిన్నంగా ఇది పూర్తి 30 రోజుల కాలపరిమితితో వస్తుంది.ప్రయోజనాలుడేటా: మొత్తం 25 GB హై-స్పీడ్ డేటాకాలింగ్: అపరిమిత వాయిస్ కాల్స్.SMS: రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.టాక్ టైమ్: అదనంగా రూ. 7.47 విలువైన టాక్ టైమ్ లభిస్తుంది.ఈ ప్లాన్ కేవలం డేటాకే పరిమితం కాకుండా, భారీ సబ్-స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్-స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో 2000 GB క్లౌడ్ స్టోరేజ్, అధునాతన ఏఐ ఫీచర్లు ఉంటాయి. (గమనిక: ఈ బెనిఫిట్ కొనసాగాలంటే రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లో యాక్టివ్గా ఉండాలి).డిస్నీ+ హాట్స్టార్: 3 నెలల పాటు మొబైల్/టీవీ సబ్-స్క్రిప్షన్.జియో ఏఐ క్లౌడ్ (Jio AI Cloud): 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్.ఇతర యాప్లు: జియో టీవీ, జియో సినిమా సబ్-స్క్రిప్షన్లు.రూ. 355 'ఫ్రీడమ్ ప్లాన్'దాదాపు ఇవే ప్రయోజనాలతో జియో రూ. 355 కేటగిరీలో మరో ప్లాన్ను కూడా అందిస్తోంది. ఇది కూడా 30 రోజుల వ్యాలిడిటీ, 25 GB డేటా, అపరిమిత కాలింగ్ , పైన పేర్కొన్న ఏఐ (AI), ఓటీటీ సబ్-స్క్రిప్షన్లను కలిగి ఉంటుంది. ఇందులో అదనంగా నానో బనానా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.ఈ రూ. 365 ప్లాన్లో అపరిమిత 5G డేటా గురించి జియో అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం 4G డేటా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
పర్సనల్ ఫైనాన్స్
ఏటీఎం రూల్స్.. ఇక మారిపోయాయ్..
దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. ఈ ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేశాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ (HDFC), బంధన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్ విత్డ్రా లిమిట్ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గిందిఅయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్ను పీఎన్బీవన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.బంధన్ బ్యాంక్బంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది. సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది.ఉచిత పరిమితి మించితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఒక్కో నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.10 అదనంగా చార్జీలు ఉంటాయి. ఇక తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే రూ.25 పెనాల్టీ విధిస్తారు.ఇది చదవలేదా? 👉 బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే!
లోన్ కావాలా? ఇవి తెలియకపోతే ఇబ్బందే!
ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇల్లు, కారు కొనుగోలు లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం రుణం తీసుకోవడం సర్వసాధారణం. అయితే, అవసరం కదా అని ఏ ఆర్థిక సంస్థ కనిపిస్తే అందులో అప్పు చేయడం భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు. అందుకే, ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సిన కొన్ని కీలక అంశాలను పాఠకుల కోసం అందిస్తున్నాం.క్రెడిట్ స్కోరురుణం మంజూరు చేయడంలో క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోరు ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తాయి. దరఖాస్తుకు ముందే మీ స్కోరును సరిచూసుకోండి. ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే దాన్ని మెరుగుపరుచుకున్నాకే లోన్కు వెళ్లడం ఉత్తమం.ఎలాంటి వడ్డీ రేటో ముందే తెలుసుకోండి..వడ్డీ రేట్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్థిర వడ్డీ. ఇందులో రుణ కాలపరిమితి మొత్తం వడ్డీ మారదు. రెండోది ఫ్లోటింగ్ రేటు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు మార్పులకు అనుగుణంగా వడ్డీ మారుతుంటుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీకు ఏది లాభదాయకమో నిర్ణయించుకోండి.తిరిగి చెల్లించే సామర్థ్యంనెలవారీ ఆదాయంలో 40% నుంచి 50% మించి అన్ని లోన్ల ఈఎంఐలు ఉండకుండా చూసుకోవాలి. లోన్ తీసుకునే ముందే ఆన్లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా మీరు ఎంత చెల్లించగలరో లెక్కవేసుకోండి.ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలుకేవలం వడ్డీ రేటు మాత్రమే కాదు.. లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, జీఎస్టీ వంటి వాటిపై కూడా కన్నేయాలి. ఒక్కోసారి తక్కువ వడ్డీ అని చెప్పి ఇతర ఫీజుల రూపంలో భారీగా వసూలు చేసే అవకాశం ఉంది.లోన్ కాలపరిమితికాలపరిమితి పెరిగే కొద్దీ నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది కానీ, మీరు చెల్లించే మొత్తం వడ్డీ భారం పెరుగుతుంది. కాబట్టి, మీ ఆర్థిక స్థితిని బట్టి సాధ్యమైనంత తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం తెలివైన పని.ముందస్తు చెల్లింపు నిబంధనలుమీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు లోన్ మొత్తాన్ని ముందే కట్టేయాలని అనుకుంటే బ్యాంకులు ఏమైనా పెనాల్టీలు విధిస్తున్నాయో అడగండి. ముఖ్యంగా పర్సనల్ లోన్ల విషయంలో ఈ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి.ఇతర నిబంధనలులోన్ అగ్రిమెంట్పై సంతకం చేసే ముందు ‘ఫైన్ ప్రింట్’ (లోసుగులతో కూడిన ఇతర నిబంధనలు) చదవండి. బీమా తీసుకోవాలనే నిబంధన లేదా సర్వీస్ ఛార్జీల పెంపు వంటి అంశాలు అందులో ఉండవచ్చు.ఇతర బ్యాంకుల ధరలతో పోలికఒక్క బ్యాంక్తోనే ఆగిపోకుండా కనీసం 3-4 ఆర్థిక సంస్థల ఆఫర్లను పోల్చి చూడండి. ప్రస్తుతం అనేక వెబ్సైట్లు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను ఒకే చోట పోల్చి చూసే వెసులుబాటును కల్పిస్తున్నాయి.లోన్ ఇన్సూరెన్స్దురదృష్టవశాత్తూ రుణగ్రహీతకు ఏదైనా జరిగితే, ఆ అప్పు కుటుంబ సభ్యులపై భారం కాకుండా ఉండేందుకు లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఇది తప్పనిసరి కాకపోయినా భద్రత దృష్ట్యా ఆలోచించదగ్గ విషయం.బ్యాంక్ విశ్వసనీయత, సేవలుకేవలం తక్కువ వడ్డీ ఇస్తున్నారని తెలియని యాప్ల ద్వారా లేదా గుర్తింపు లేని సంస్థల ద్వారా రుణాలు తీసుకోవద్దు. ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలను మాత్రమే ఎంచుకోండి. అలాగే వారి కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో కూడా తెలుసుకోండి.రుణం అనేది అవసరానికి ఆసరా కావాలి కానీ, అది మీ ప్రశాంతతను దూరం చేసే భారం కాకూడదు. పైన పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఇలా..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పీపీఎఫ్ సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగించనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు వివిధ స్మాల్ సేవింగ్స్ స్కీములపై వడ్డీ రేట్లలో మార్పులేమీ ఉండవని ఆర్థిక శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ప్రకారం సుకన్య సమృద్ధి స్కీముపై 8.2 శాతంగా, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 7.1 శాతంగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీములపై వరుసగా 7.1 శాతం, 4 శాతంగా వడ్డీ రేట్లు ఉంటాయి. కిసాన్ వికాస పత్రాలపై 7.5 శాతం, ఎన్ఎస్సీలపై 7.7 శాతం, మంత్లీ ఇన్కం స్కీముపై 7.4 శాతంగా వడ్డీ రేటు కొనసాగుతుంది. కేంద్రం చివరిసారిగా 2023–24 నాలుగో త్రైమాసికంలో కొన్ని పథకాల రేట్లను మార్చింది.
యుద్ధం ఆగదు.. వాళ్లంతా నష్టపోక తప్పదు: కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రోబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. తాజా ‘ఎక్స్’ పోస్ట్లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడ్డగోలుగా ముద్రిస్తున్న డబ్బును 'ఫేక్ మనీ'గా అభివర్ణించిన ఆయన (Robert Kiyosaki), రాబోయే రోజుల్లో సంప్రదాయ పెట్టుబడులు నష్టపోక తప్పదని హెచ్చరించారు.డాలర్ విలువ పతనం - పెరుగుతున్న అప్పులుప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రిస్తుండటం వల్ల దేశాల జాతీయ అప్పులు (National Debt) విపరీతంగా పెరుగుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుందని, డాలర్లను పొదుపు చేసేవారు కాలక్రమేణా తమ సంపదను కోల్పోతారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా అమెరికా బాండ్లు సురక్షితమైనవనేది ఒక "పెద్ద అబద్ధం" అని ఆయన కుండబద్దలు కొట్టారు.చమురు సెగ.. అంతం లేని యుద్ధంప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలను ఆయన ఒక 'పవిత్ర యుద్ధం'గా అభివర్ణించారు. ఈ వివాదాలు త్వరలో ముగిసేవి కావని, దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పాత పద్ధతులకు కాలం చెల్లింది!సాధారణంగా ప్రజలు నమ్మే "చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, 401k లేదా మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయి" అనే సూత్రం ఇప్పుడు పనికిరాదని కియోసాకి కొట్టిపారేశారు. ఈ పద్ధతిని అనుసరించేవారే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఎంబీఏ (MBA) వంటి ఉన్నత డిగ్రీలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ముందు పనికిరావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.2026కు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్లు ఇవే..ఏవైతే ముద్రించడానికి వీలుపడవో అవే నిజమైన ఆస్తులని కియోసాకి నమ్ముతారు. ఆయన ప్రకారం 2026లో పెట్టుబడిదారులను కాపాడేవి బంగారం, వెండి (Real Gold & Silver), చమురు (Oil), ఆహార ధాన్యాలు (Food), క్రిప్టో కరెన్సీ (Bitcoin & Ethereum) మాత్రమే."మీ మెదడులో మీరు నింపుకునే ఆర్థిక విద్య (Financial Education) మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేనిని నమ్మాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. INVESTOR SECRET: “lf you want to be a rich investor you have to see the future.”Seeing the future today is EASY for two reasons.1: The National Debt will only go up because governments will only keep printing fake money. That means inflation will keep going up which…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 30, 2026


