Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Indian retail auto sales jump 25. 6percent in February1
హైస్పీడ్‌లో వాహన విక్రయాలు

న్యూఢిల్లీ: జీఎస్‌టీ క్రమబదీ్ధకరణ నేపథ్యంలో వాహన విక్రయాల జోరు ఫిబ్రవరిలోనూ కొనసాగింది. గత నెల మొత్తం వాహనాల రిటైల్‌ విక్రయాలు 26 శాతం పెరిగి 24,09,362 యూనిట్లకు చేరినట్లు డీలర్ల సమాఖ్య ఫాడా ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో 19,17,934 యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ అమ్మకాల జోరు కొనసాగినట్లు వివరించింది. ఆరింట అయి దు కేటగిరీల్లో (టూవీలర్లు, త్రీ–వీలర్లు, ప్యాసింజర్‌ వాహనాలు, కమర్షియల్‌ వాహనాలు, ట్రాక్ట ర్లు) ఫిబ్రవరిలో అత్యధికంగా రిటైల్‌ సేల్స్‌ నమోదైనట్లు ఫాడా ప్రెసిడెంట్‌ సీఎస్‌ విఘ్నేశ్వర్‌ తెలిపారు. మార్కెట్లో పటిష్టమైన డిమాండ్‌ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. జీఎస్‌టీ క్రమబదీ్ధకరణతో రేట్లు తగ్గడం, పెళ్లిళ్ల సీజన్, కొత్త మోడల్స్‌ రాకతో బుకింగ్స్‌ మెరుగ్గా ఉండటంలాంటివి పరిశ్రమకు సానుకూలంగా నిల్చినట్లు వివరించారు. పంట దిగుబడులు బాగుండి గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యత మెరుగుపడటం, ఆకర్షణీయమైన మార్కెటింగ్‌ స్కీములు కలిసి వచి్చనట్లు డీలర్లు చెప్పారు. ఇతర విశేషాలు.. → టూవీలర్లు 25%, త్రిచక్ర వాహనాలు 24%, ప్యాసింజర్‌ వాహనాలు 26%, కమర్షియల్‌ వాహనాలు 29% అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. → ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 3,13,015 యూనిట్ల నుంచి 3,94,768 యూనిట్లకు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో 21 శాతం, గ్రామీణ మార్కెట్లలో 34 శాతం వృద్ధి నమోదైంది. స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాలు, యుటిలిటీ వాహనాలే ఓవరాల్‌గా ఈ విభాగానికి దన్నుగా నిలుస్తున్నప్పటికీ, చిన్న కార్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ నెలకొనడం సానుకూలాంశం. → టూవీలర్‌ విక్రయాలు 13,60,155 యూనిట్ల నుంచి 17,00,505 యూనిట్లకు పెరిగాయి. → వాణిజ్య వాహనాల విభాగంలో అమ్మకాలు 78,219 యూనిట్ల నుంచి 1,00,820 యూనిట్లకు పెరిగాయి. → త్రీ–వీలర్‌ సేల్స్‌ 1,17,130.. ట్రాక్టర్ల అమ్మకాలు 89,418 యూనిట్లుగా నమోదయ్యాయి.

Global shipping costs have gone up since the US-Israel attacks on Iran2
ఎగుమతులకు సర్‌చార్జీల మోత

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశీయంగా ఎగుమతిదారులకు షిప్పింగ్‌ సర్‌చార్జ్‌ల రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులను సాకుగా చూపి షిప్పింగ్‌ కంపెనీలు అదనంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఎక్కువకాలం నిల్వ ఉండని ఉత్పత్తులను మోసుకెళ్లే 40 అడుగుల కంటైనర్లపై అదనంగా రూ. 4,000 మేర కంటింజెన్సీ సర్‌చార్జీలు ఇవ్వాలంటున్నాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ దాడి చేయడానికి ముందే కొన్ని కన్సైన్‌మెంట్లు గమ్యస్థానాలకు చేరినప్పటికీ, సరుకును రిలీజ్‌ చేయాలంటే అదనంగా చెల్లించాల్సిందేనని షిప్పింగ్‌ కంపెనీలు పట్టుబట్టి కూర్చున్నాయని వివరించారు. ‘ఫిబ్రవరి 28న యుద్ధం మొదలు కావడానికి ముందే పశ్చిమాసియాలోని పోర్టులకు నౌకలు చేరుకున్నాయి. కానీ అధిక సర్‌చార్జీలు ఇవ్వాలంటూ, షిప్పింగ్‌ సంస్థలు డెలివరీ చేయడం లేదు. ఈ భారాన్ని ఎవరు భరించాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యను కేంద్ర వాణిజ్య శాఖ దృష్టికి తీసుకెళ్లాం‘ అని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ తెలిపారు. భారత్‌లో ఇంకా లోడ్‌ కాని వాటిపై చార్జీలు విధిస్తే అర్థం చేసుకోవచ్చు గానీ ఇప్పటికే గమ్యస్థానాలకు చేరిన వాటిపై కూడా విధించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారత ఎగుమతులపై భౌగోళికరాజకీయ పరిణామాల ప్రభావాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంతర్‌ మంత్రిత్వ శాఖల బృందాన్ని ఏర్పాటు చేసింది. 2024–25 లో పశ్చిమాసియా దేశాలకు భారత్‌ నుంచి ఎగుమతులు 58.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కన్సైన్‌మెంట్స్‌ నిలిపివేత .. ఓవైపు అదనపు సర్‌చార్జీలతోనే సతమతమవుతుంటే మరోవైపు, పశ్చిమాసియా దేశాలకు కన్సైన్‌మెంట్స్‌ను తీసుకోవడాన్ని షిప్పింగ్‌ సంస్థలు నిలిపివేయడం ఎగుమతిదారులకు ఇంకో సమస్యగా మారింది. నౌకలు నిల్చిపోయి కంటైనర్ల కొరత ఏర్పడటంతో సముద్ర మార్గంలో రవాణా వ్యయాలు 50 శాతం ఎగిసినట్లు ఎగుమతిదారులు చెప్పారు. అటు విమానాల ద్వారా రవాణా పెరిగినప్పటికీ ఇది ఖరీదైన వ్యవహారంగా ఉంటోంది. కోల్‌కతా నుంచి పశ్చిమాసియాకు వెళ్లే కొన్ని ఎయిర్‌లైన్స్‌ సరుకు రవాణా చార్జీలను కేజీకి రూ. 175 నుంచి రూ. 425కి పెంచేశాయని సహాయ్‌ తెలిపారు. ఈ సవాళ్ల వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో దేశీ ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి, మన పోటీ సామర్థ్యాలకు ప్రతికూలంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Gold Prices Drop Again in India Know The Details3
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!

మార్చి 2నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పెట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,49,900 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,49,300 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,63,530 రూపాయల నుంచి రూ. 1,62,880 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,50,050 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,49,450 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,63,680 రూపాయల వద్ద నుంచి రూ. 1,63,030 వద్దకు చేరింది.ఇక చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 151200 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 164950 వద్దనే ఉన్నాయి.ఇదీ చదవండి: ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్!

Tata AIA Launches Pension Plan Blending Guaranteed Income4
శుభ్ ఫ్లెక్సి పెన్షన్.. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్

జీవించినంత కాలం నిరంతర ఆదాయం అందుతుందనే భరోసాతో రిటైర్ కావడాన్ని ఒకసారి ఊహించుకోండి. మీ పొదుపులు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పెరుగుతూ మీ జీవనశైలిని కొనసాగించేందుకు సహాయపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అచ్చంగా ఈ ఆలోచనకే వాస్తవ రూపం ఇచ్చేలా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ను ఆవిష్కరించింది. మీరు ధీమాగా, సౌకర్యవంతంగా, ఆర్థిక భద్రత దన్నుతో పదవీ విరమణను ప్లాన్ చేసుకునేందుకు తోడ్పడేలా ఇది తీర్చిదిద్దబడింది.నేటి రిటైర్మెంట్ - సరికొత్త పరిస్థితులుప్రస్తుతం రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మాత్రమే కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక అవసరం. ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల రిటైర్ అయిన వారిపై ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది రిటైర్మెంట్ అనంతరం కూడా తమ జీవనశైలిని కొనసాగిస్తూ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కలిగిన స్మార్ట్ ఫైనాన్షియల్ పరిష్కారాల కోసం చూస్తున్నారు.ఇప్పటి రిటైరీలు కారు కొనడం లేదా విదేశీ పర్యటనలు చేయడం వంటి లక్ష్యాల గురించి కూడా కలలు గంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ (FIRE) తరానికి చెందిన వారు కావచ్చు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు కావచ్చు లేదా ఉద్యోగ మార్పుల మధ్యలో ఉన్నవారు కావచ్చు, ఇలా చాలా మందికి సంప్రదాయ పెన్షన్ పథకాలు సరిపోవడం లేదు. అంతేకాదు, జీవితకాలం ముగిసేలోగానే, దాచుకున్న డబ్బు పూర్తిగా ఖర్చయిపోతుందనే భయం కూడా చాలా మందిలో ఉంది.అయితే రిటైర్మెంట్ జీవితం గురించి ఆందోళన చెందే పరిస్థితి లేకపోతే ఎలా ఉంటుంది? నిర్దిష్ట హామీతో కచ్చితమైన ఆదాయం పొందుతూ మార్కెట్ వృద్ధి అవకాశాలను కూడా పొందగలిగితే ఎలా ఉంటుంది?‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ అచ్చంగా అలాగే ఉంటుంది. ఈ పథకం ద్వారా భద్రతతో పాటు వృద్ధి అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో మీరు కోరుకున్న జీవనశైలి విషయంలో రాజీపడాల్సిన అవసరం లేకుండా, ధీమాగా రిటైర్ కావచ్చు.రిటైర్మెంట్ ప్లానింగ్‌కు స్మార్ట్ మార్గంఆయుర్దాయం పెరుగుతుండటం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతోంది. సంప్రదాయ రుణాధారిత పెన్షన్ పథకాలు భరోసా ఇస్తాయి కానీ ఆదాయం పెరిగే అవకాశం ఉండదు. మరోవైపు సూచీ ఆధారిత పెట్టుబడులు వృద్ధి అవకాశాలను ఇస్తాయి కానీ స్థిరత్వం ఉండదు. అలాంటప్పుడు ఈ రెండు ప్రయోజనాలు ఒకే పథకంలో లభిస్తే ఎలా ఉంటుంది?శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ జీవితాంతం హామీ ఆదాయాన్ని అందిస్తుంది. ఈక్విటీల్లో 40 శాతం వరకు పెట్టుబడుల దన్నుతో ఇది అదనంగా మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను కూడా అందిస్తుంది. ‘ఈక్విటీ ఓరియెంటెడ్, రెగ్యులర్ పే’ సొల్యూషన్‌గా ఈ పథకం ఇలా పనిచేస్తుంది.జీవితాంతం హామీతో కూడుకున్న ఆదాయంమీరు జీవించినంతకాలం యాన్యుటీ రూపంలో ఆదాయం అందుతుంది. రిటైర్మెంట్ సమయంలో డబ్బు సరిపోదేమోనని ఆందోళన చెందనక్కర్లేదు.మార్కెట్ ఆధారిత వృద్ధికి అవకాశంవేరియబుల్ యాన్యుటీ ఆప్షన్ ద్వారా మీ ఆదాయంలో కొంత భాగాన్ని NIFTY 50 పనితీరుకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో ఈ ఆప్షన్లు ఉన్నాయి:➤60% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 40% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤70% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 30% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤80% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 20% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤90% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 10% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనగలిగేలా, మీకు ఒక స్థిరమైన ఆదాయం ఉండడమే కాకుండా మార్కెట్ పెరుగుదలతో మీ పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉండేలా చూసేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.“భారతదేశంలో రిటైర్మెంట్ ప్లానింగ్ విధానం మారుతోంది. ఆయుర్దాయాలు పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం, వడ్డీ రేట్లు మారడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలను కూడా అందించే సాధనాలను కోరుకుంటున్నారు. శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు హామీతో కూడుకున్న ఆదాయం మరియు పొదుపు మొత్తాన్ని పెంచుకునే అవకాశం, ఇలా రెండింటినీ అందిస్తున్నాం,” అని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ క్షితిజ్ శర్మ తెలిపారు.మీ రిటైర్మెంట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడినదిప్రతి ఒక్కరి రిటైర్మెంట్ లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమవైన లక్ష్యాలు, కాలవ్యవధులు ఉంటాయి. అందుకే శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్, వివిధ రకాల రిటైర్మెంట్ అవసరాలకు తగ్గట్లుగా అనేక అనువైన ఆప్షన్లు అందిస్తుంది.ముందుగానే ప్రారంభించండి: 35 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి కావడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది.ఎప్పటి నుంచి ఆదాయం కావాలో మీరే ఎంచుకోవచ్చుఇమిడియేట్ యాన్యుటీ: రిటైర్ అయిన వెంటనే ఆదాయం ప్రారంభం.డిఫర్డ్ యాన్యుటీ: చెల్లింపులు ప్రారంభమయ్యే ముందు 20 సంవత్సరాల వరకు నిధికి పెరిగే అవకాశాన్ని కల్పించడం ద్వారా మూలనిధిని పెంచుకోవచ్చు. PPTకి అదనంగా గరిష్ట స్థాయిలో 20 ఏళ్ల వరకు వాయిదా వేసే వీలు. ఉదాహరణకు పాలసీ ప్రీమియం చెల్లింపు వ్యవధి 12 ఏళ్లు అనుకుంటే, గరిష్టంగా 12 + 20 = 32 ఏళ్లు డిఫర్ చేసుకోవచ్చు.సరళతర ప్రీమియం ఆప్షన్లుఏకమొత్తంగా చెల్లించవచ్చు2–12 ఏళ్ల వరకు విడతలవారీగా చెల్లింపులు జరపవచ్చుకుటుంబానికి రక్షణఈ పథకం కేవలం మీ భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, మీ కుటుంబ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. “రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్” ఆప్షన్‌ని ఎంచుకోవడం వల్ల పాలసీదారు మరణించిన తర్వాత కొనుగోలు కోసం మీరు మొదట చెల్లించిన మొత్తం తిరిగి నామినీకి లభిస్తుంది.ఎవరికి అనుకూలం?శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ వివిధ వర్గాలవారందరికీ అనుకూలమైనదిగా ఉంటుందిముందుగానే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలనుకునే వారు (FIRE తరం)ఆర్థిక స్వాతంత్య్రంతో జీవనశైలిని కొనసాగించాలనుకునే వారుస్థిరమైన ఆదాయం, వృద్ధి అవకాశాలను కోరుకుంటూ, రిటైర్మెంట్‌కు సమీపిస్తున్న వారుస్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కోరుకునే రిటైరీలుయాన్యుటైజేషన్ ఆప్షన్లను కోరుకునే NPS సభ్యులునిర్మాణాత్మకమైన, దీర్ఘకాలిక రిటైర్మెంట్ వ్యూహం కోరుకునే వ్యక్తులు

Middle East Conflict Disrupts Indian Basmati Exports Stranding 400000 Tons5
వార్‌ ఎఫెక్ట్‌.. భారత్‌కు తప్పని ఇబ్బందులు!

అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం చాలా దేశాలతోపాటు.. భారతీయ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించింది. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన బాస్మతి బియ్యం.. ఇప్పుడు ఢిల్లీలోని గిడ్డంగుల్లో నిలిచిపోయింది. దీంతో ఎగుమతులు నిలిచిపోయాయి.ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతి ఆగిపోవడం అనేది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. దాదాపు 4,00,000 మెట్రిక్ టన్నుల భారతీయ బాస్మతి బియ్యం ఓడరేవులు, గిడ్డంగుల్లో ఉన్నట్లు సమాచారం. సుమారు 2,00,000 టన్నుల బాస్మతి బియ్యం రవాణాలో చిక్కుకుపోయినట్లు ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (AIREA) అధ్యక్షుడు సతీష్ గోయెల్ పేర్కొన్నారు. ఎగుమతిదారులు ఇప్పటికే స్టాక్‌లను పోర్టులకు తరలించారు, కానీ పెరుగుతున్న కంటైనర్ సరుకు రవాణా ఖర్చుల కారణంగా మధ్యప్రాచ్యానికి రవాణా చేయలేకపోతున్నారని ఆయన వెల్లడించారు.భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ సుగంధ ద్రవ్యాలు కలిగిన, ప్రీమియం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే అతిపెద్ద దేశం. మన దేశం సౌదీ అరేబియా, ఇరాన్ & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా మధ్యప్రాచ్యంలో సగానికి పైగా వాటా కలిగి ఉంది.తగ్గిన ధరలు2026 ప్రారంభం నుంచి బాస్మతి బియ్యం డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఫిబ్రవరిలో మాత్రమే ధరలు 5-10 శాతం పెరిగాయి. కాగా ఇప్పుడు యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లకు రవాణా నిలిచిపోయింది. దీంతో ధరలు 10 శాతం పడిపోయింది. మన దేశంలో కూడా బాస్మతి బియ్యం రేటు 5-6 శాతం తగ్గింది. యుద్ధం ముగిస్తేగానీ.. మళ్లీ ఎగుమతులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎగుమతులు మొదలైతే ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!

Realme launches Narzo Power 5G in India with 10001mAh battery6
రియల్‌మీ కొత్త ఫోన్‌ వచ్చేసింది.. ‘పవర్‌’ఫుల్‌ బ్యాటరీతో..

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ తన నార్జో సిరీస్‌లో కొత్తగా రియల్‌మీ నార్జో పవర్‌ 5జీ (Realme Narzo Power 5G) స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 10,001mAh భారీ బ్యాటరీ. సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఎక్కువసేపు వినియోగానికి ఇది సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, రోజువారీ వినియోగం ఎక్కువగా చేసే వారికి ఈ డివైజ్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.ధర, లభ్యతరియల్‌మీ నార్జో పవర్ 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ ఒకటి కాగా మరొకటి 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్. అలాగే ఈ ఫోన్ టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ప్రారంభ విక్రయంలో దీని ధర రూ.23,999 నుంచి మొదలవుతుంది.మార్చి 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమెజాన్‌, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి కంపెనీ రూ.3,999 వరకు బండిల్ బెనిఫిట్లు అందిస్తోంది. అదనంగా 4 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఇస్తోంది.ప్రధాన ఫీచర్లుఈ ఫోన్‌లోని 10,001mAh బ్యాటరీని సిలికాన్ యానోడ్ టెక్నాలజీతో రూపొందించారు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు మాత్రమే ఉండేలా రూపొందించారు.80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్: కేవలం 36 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 8GB ర్యామ్‌తో పాటు ప్రత్యేక AI ప్రాసెసింగ్ చిప్ కూడా ఉంది. ఇది గేమింగ్ సమయంలో స్థిరమైన పనితీరును అందించడంలో సహాయపడుతుందని కంపెనీ చెబుతోంది.డిస్‌ప్లే విషయానికి వస్తే ఫోన్ ముందుభాగంలో 144Hz రిఫ్రెష్ రేట్‌తో హైపర్‌గ్లో 4డీ కర్వ్‌+ అమోల్‌డ్‌ డిస్‌ప్లే అందించారు. ఇది 1.07 బిలియన్ రంగులను సపోర్ట్‌ చేస్తుంది. గరిష్టంగా 6500 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.

Advertisement
Advertisement
Advertisement