Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

WPP Media sees India ad market growing 9. 7percent in 20261
రూ. 2.01 లక్షల కోట్లకు ప్రకటన ఆదాయాలు

ముంబై: దేశీయంగా అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌ 2026లో రూ. 2,01,891 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు డబ్ల్యూపీపీ మీడియా వెల్లడించింది. 2025తో పోలిస్తే రూ. 17,844 కోట్లు అధికంగా, 9.7 శాతం మేర వృద్ధి చెందవచ్చని దిస్‌ ఇయర్‌ నెక్ట్స్‌ ఇయర్‌ నివేదికలో పేర్కొంది. ఇందులో డిజిటల్‌ వాటా 68.1 శాతంగా ఉండనుందని డబ్ల్యూపీపీ మీడియా దక్షిణాసియా సీఈవో ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. కృత్రిమ మేధ, వాణిజ్యం, గోప్యత కలిసి, వినియోగదారులతో ప్రకటనకర్తల బంధాన్ని సరికొత్తగా నిర్వచిస్తున్నాయని వివరించారు. నివేదిక ప్రకారం డీఏవీపీ ధరల పెంపుతో ప్రింట్‌ మాధ్యమంలో ప్రకటనల ఆదాయాలు 4.4%, టీవీ 3.1%, ఆడియో 1.5% వృద్ధి చెందనున్నాయి. టాప్‌ 10 గ్లోబల్‌ అడ్వర్టైజింగ్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటన్నారు.

TCS shares rise 2percent after Tata Group and OpenAI announce strategic partnership2
ఓపెన్‌ ఏఐ ఇన్‌ఫ్రాకు టీసీ‘ఎస్‌’ 

న్యూఢిల్లీ: ఐటీ సేవల టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ తాజాగా ఓపెన్‌ ఏఐతో చేతులు కలిపింది. తద్వారా దేశీయంగా 100 మెగావాట్ల ఏఐ మౌలిక సదుపాయాల(ఇన్‌ఫ్రా) కల్పనకు తెరతీయనుంది. ఇన్‌ఫ్రా సామర్థ్యాన్ని ఒక గిగావాట్‌వరకూ పెంచుకునేందుకు వీలుంది. కొన్నేళ్లపాటు అమల్లోఉండే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు రెండు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. తద్వారా ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ వినియోగాన్ని పెంచేందుకు కృషి చేయనున్నట్లు తెలియజేశాయి. ఒప్పందంలో భాగంగా టీసీఎస్‌కు చెందిన హైపర్‌వాల్ట్‌ యూనిట్‌.. ఏఐ రెడీ, గ్రీన్‌ ఎనర్జీ ఆధారిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయనుంది. ఇది తదుపరి తరం ఏఐ వర్క్‌లోడ్స్‌కు మద్దతుగా నిలవనున్నట్లు టీసీఎస్‌ పేర్కొంది. రెండు సంస్థల మధ్య సహకారం నేపథ్యంలో ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్‌కు దన్నుగా టాటా గ్రూప్‌ ఉద్యోగులకు ఎంటర్‌ప్రైజ్‌ చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుంది. దేశీయంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో భాగంగా టీసీఎస్‌ తాజా భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

Indian technology emerges as a global game changer3
ఇంటర్నెట్‌ నుంచి ఇంటెలిజెన్స్‌ యుగానికి

న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్‌ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్‌ ‘ఇంటెలిజెన్స్‌ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్‌ ప్రోగ్రెస్‌ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్‌ టెక్‌ నేతలు పిలుపునిచ్చారు. డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్‌ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్‌ సెంచరీ’లో గ్లోబల్‌ లీడర్‌గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్‌ అధినేత అంబానీ, అదానీ గ్రూప్‌ ఈడీ జీత్‌ అదానీ, గూుగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఏఐ సదస్సులో తెలిపారు. మొబైల్, ఇంటర్నెట్‌ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. జామ్‌నగర్‌లో గిగావాట్‌ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్‌–కంప్యూట్‌ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్‌ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. డీప్‌టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్‌ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్‌ను జియో ఇంటర్నెట్‌ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్‌ యుగానికి అనుసంధానం చేస్తుంది. జియో, రిలయన్స్‌ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్‌ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్‌ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు. ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్‌ అదానీ భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జీత్‌ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్‌–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్‌ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్‌ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్‌ కీలకంగా ఉంటుంది. క్రిటికల్‌ ఏఐ వర్క్‌లోడ్‌లను భారత్‌ స్వదేశంలోనే హోస్ట్‌ చేయాలి. స్టార్టప్‌లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్‌ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్‌ ఆధారిత ఏఐ ప్లాట్‌ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్‌ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ శతాబ్దంలో భారత్‌ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్‌ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు. హైపర్‌ పురోగతి శకం: గూగుల్‌ సుందర్‌ హైపర్‌ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్‌ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్‌ ఏఐ ప్రొఫెషనల్‌ సరి్టఫికెట్‌ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్‌ చెప్పారు.

Five Smart Maintenance Tips to Extend Your Car Life4
కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలు

చాలామంది కష్టపడి కారు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తరువాత మెయింటెన్స్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో మీరు తప్పులు చేసినా.. ఆలస్యం చేసినా.. తరువాత భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కథనంలో.. కారు మెయింటెన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?, తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏవి? అనే విషయం తెలుసుకుందాం.సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చాలిటైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలిబ్రేక్స్ పనితీరు చెక్ చేసుకోవాలిబ్యాటరీ & ఛార్జింగ్ సిస్టం చెకింగ్ఎయిర్ అండ్ క్యాబిన్ ఫిల్టర్

Can You Take Loan From EPF Account? Know The Rules5
పీఎఫ్‌పై లోన్ తీసుకోవచ్చా?

ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. ఇందులో ప్రతి నెలా భవిష్యత్తు భద్రత కోసం కొంత మొత్తం జమ అవుతూ ఉంటుంది. సాధారంగా ఈ మొత్తాన్ని రిటైర్మెంట్ తరువాత ఉపయోగించుకోవాలి. కానీ ఉద్యోగికి అత్యవసర సమయంలో.. డబ్బు అందించడానికి ఈపీఎఫ్ఓ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేసింది. దీని ద్వారా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందులో లోన్ తీసుకోవచ్చా? అని కొందరికి సందేహం కలుగవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నిజానికి ఈపీఎఫ్ఓ నుంచి లోన్ తీసుకోలేరు. అయితే మీ ఖాతాలో ఉన్న మొత్తంలో కొంత అడ్వాన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడైనా లోన్ తీసుకుంటే.. దాన్ని తిరిగి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కానీ పీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇల్లు కొనుగోలు చేయడం, పెళ్లి చేసుకోవడానికి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ తీసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఎంత శాతం తీసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. అయితే ఖాతాలో ఉన్న మొత్తం తీసుకోలేరు. దీనిని గుర్తుంచుకోవాలి.యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రాఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి క్లెయిమ్‌ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.

High salary earners getting nudge notices from Income Tax Dept 6
ఎక్కువ జీతాలొచ్చేవారికి ఐటీ నోటీసులు!!

భారీ జీతాలు పొందుతున్న కొంతమంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ‘నడ్జ్’ నోటీసులు అందుతున్నాయి. వెల్లడించని ఆస్తి ఆదాయం, క్రిప్టో లాభాలు, ఈఎస్ఓపీ లాభాలు, విదేశీ ఆదాయం వంటి అంశాల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు వీటిని జారీ చేస్తున్నారు. కఠిన చర్యలకు ముందుగా స్వచ్ఛందంగా తప్పులు సరిచేసుకునేందుకు ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఒకే రాజకీయ పార్టీకి లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి పలువురు పన్ను చెల్లింపుదారులు ఒకే చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు వినియోగిస్తున్న నమూనాను శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత సీఏలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.బహుళజాతి సంస్థల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు సహా ఉన్నతాధికారులకు ఈ సూచనలు పంపినట్లు తెలిసింది. జరిమానాలు విధించే ముందు లోపాలను సవరించుకోవాలని శాఖ కోరుతోంది.ఈ అంశాల్లో వ్యత్యాసాలువిదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని ప్రకటించకపోవడం, స్టాక్-లింక్డ్ ప్రోత్సాహకాలను తక్కువగా చూపించడం, గృహ, ప్రయాణ భత్యాలను పెంచి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, విదేశీ క్లయింట్ల నుంచి క్రిప్టో రూపంలో ద్వితీయ వేతనాలు పొందడం, గుర్తింపు లేని లేదా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు ఇవ్వడం వంటి వ్యత్యాసాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.డేటా విశ్లేషణతో గుర్తింపుప్రస్తుత అసెస్‌మెంట్ సైకిల్‌లో అధిక ఆదాయ వర్గాల ఐటీఆర్‌లను తీవ్రంగా సమీక్షించినప్పుడు ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ‘గైడ్ అండ్ ఎనేబుల్’ (నడ్జ్) ప్రచారంలో భాగంగా సవరించిన ఐటీఆర్‌లు దాఖలు చేయాలని శాఖ సూచిస్తోంది.ఆటోమేటెడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లు, పాన్ ఆధారిత ట్రాకింగ్ ద్వారా విదేశీ లావాదేవీల సమాచారం ప్రభుత్వానికి అందుతున్నందున తక్కువగా నివేదించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.నడ్జ్ నోటీసు అంటే ఏమిటి?ఇది డీఐఎన్ నంబర్‌తో కూడిన అధికారిక నోటీసు కాదు. కేవలం లోపాలు ఉన్నాయేమో పరిశీలించమనే సూచన మాత్రమే. ఐటీఆర్‌లో ప్రకటించిన ఆదాయం, ఆస్తులు సరైనవేనని నమ్మకం ఉంటే, డీఐఎన్ నంబర్‌తో అధికారిక నోటీసు అందే వరకు ఆందోళన అవసరం లేదు.డేటా అనలిటిక్స్ ఆధారంగా ఐటీఆర్‌లో చూపిన ఆదాయం, టీడీఎస్ వివరాలు, ఇతర లావాదేవీ డేటా మధ్య వ్యత్యాసాలు గుర్తించబడుతున్నట్లు చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా చెబుతున్నారు.ట్యాక్స్‌ పేయర్స్‌ ఏం చేయాలంటే..సంబంధిత ఆర్థిక సంవత్సరాల రిటర్నులను సమీక్షించాలిపూర్తి లావాదేవీ వివరాలు సేకరించాలిఅవసరమైతే సెక్షన్ 139(8A) కింద నవీకరించిన రిటర్న్ (ఐటీఆర్-యు) దాఖలు చేయాలివడ్డీతో పాటు అదనపు పన్ను చెల్లించాలిఇలా చేయడం ద్వారా తదుపరి విచారణ, జరిమానాలు లేదా ప్రాసిక్యూషన్ వంటి కఠిన చర్యల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement