Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Key Announcements on TCS in Budget 20261
బడ్జెట్ 2026: విదేశాలకు వెళ్లేవారికి ఊరట

మధ్యతరగతి వేతన జీవుల విదేశీ ప్రయాణాలకు, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వం ఊతం ఇచ్చింది. గతంలో ఈ విభాగంగా భారంగా మారిన 5 శాతం టీసీఎస్‌ను 2 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వేతన జీవుల నెలవారీ బడ్జెట్‌పై పడే అదనపు భారం తగ్గడమే కాకుండా చేతిలో నగదు లభ్యత పెరుగుతుంది. ఈ మార్పు వేతన జీవుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.టీసీఎస్ అంటే ఏమిటి?సాధారణంగా మనం విదేశీ పర్యటనల కోసం ప్యాకేజీలు కొన్నప్పుడు లేదా విదేశాలకు డబ్బు పంపినప్పుడు బ్యాంకులు లేదా ట్రావెల్ ఏజెంట్లు కొంత మొత్తాన్ని పన్ను రూపంలో ముందే వసూలు చేస్తారు. దీనినే టీసీఎస్‌ అంటారు. ఇది మన ఆదాయపు పన్నులో ముందుగానే చెల్లించాలి.వేతన జీవులపై ప్రభావంగతంలో 5 శాతం టీసీఎస్.. అంటే ఎక్కువ సొమ్ము ప్రభుత్వం వద్ద ఉండిపోయేది. ఇప్పుడు అది 2 శాతానికి తగ్గడం వల్ల ఆ మిగిలిన 3 శాతం నగదు పన్ను దారులకు మిగులుతుంది. విదేశీ విద్య కోసం లోన్ తీసుకోకుండా సొంతంగా డబ్బు పంపే తల్లిదండ్రులకు ఇది పెద్ద ఊరట. విదేశీ టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకునేటప్పుడు ముందస్తుగా చెల్లించాల్సిన నగదు తగ్గుతుంది.ఉదాహరణకు..ఒక వేతన జీవి తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లాలనుకున్నారనుకుందాం. ఆ టూర్ ప్యాకేజీ ధర రూ.10 లక్షలు అనుకుంటే, పాత, కొత్త రేట్ల ప్రకారం తేడా ఇలా ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం, ఈ ప్యాకేజీ ధరపై 5 శాతం టీసీఎస్ వర్తించేది. అంటే ఆ వ్యక్తి ప్యాకేజీ ధరతో పాటు అదనంగా రూ.50,000 పన్ను రూపంలో ముందే చెల్లించాల్సి వచ్చేది.అయితే, కొత్త బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈ టీసీఎస్ రేటును 2 శాతానికి తగ్గించారు. దీనివల్ల అదే రూ.10 లక్షల ప్యాకేజీపై ఇప్పుడు కేవలం రూ.20,000 మాత్రమే పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా సదరు ప్రయాణికుడికి తక్షణమే రూ.30,000 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.

Union Budget 2026–27 total expenditure at Rs 53.47 lakh cr at glance2
కేంద్ర బడ్జెట్‌ 2026 సమగ్ర స్వరూపం..

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.53,47,315 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.35,33,150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.18,14,165 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్‌ 2026-27 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.బడ్జెట్‌ 2025-26 సమగ్ర స్వరూపంరెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లుపన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లుపన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లుమూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లురుణాల రికవరీ రూ.38,397 కోట్లుఇతర వసూళ్లు రూ.80,000 కోట్లుఅప్పులు, ఇతర వసూళ్లు రూ.16,95,768 కోట్లుమొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లుమొత్తం వ్యయం రూ.53,47,315 కోట్లురెవెన్యూ ఖాతా రూ.41,25,494 కోట్లువడ్డీ చెల్లింపులు రూ.14,03,972 కోట్లుమూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,92,702 కోట్లుమూలధన ఖాతా రూ.12,21,821 కోట్లువాస్తవ మూలధన వ్యయం రూ.17,14,523 కోట్లురెవెన్యూ లోటు రూ.5,92,344 కోట్లునికర రెవెన్యూ లోటు రూ.99,642 కోట్లుద్రవ్య లోటు రూ.16,95,768 కోట్లుప్రాథమిక లోటు రూ.2,91,796 కోట్లురూపాయి రాక...ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ 21 పైసలుఎక్సైజ్‌ డ్యూటీ 6 పైసలుఅప్పులు, ఆస్తులు 24 పైసలుపన్నేతర ఆదాయం 10 పైసలుమూలధన రశీదులు 2 పైసలుకస్టమ్స్‌ ఆదాయం 4 పైసలుకార్పొరేషన్‌ ట్యాక్స్‌ 18 పైసలుజీఎస్టీ, ఇతర పన్నులు 15 పైసలురూపాయి పోక..పెన్షన్లు 2 పైసలువడ్డీ చెల్లింపులు 20 పైసలుకేంద్ర పథకాలు 17 పైసలుప్రధాన సబ్సిడీలు 6 పైసలుడిఫెన్స్‌ 11 పైసలురాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 22 పైసలుఫైనాన్స్‌ కమిషన్‌కు చెల్లింపులు 7 పైసలుకేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలుఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 7 పైసలు

Gold and Silver rates 1st February 2026 Telugu states3
హ్యాట్రిక్‌ క్రాష్‌.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి

దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. వరుసగా మూడో రోజూ అమాంతం దిగివచ్చాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం ధరలు(Today Gold Rate) భారీ తగ్గుదలను నమోదు చేశాయి. వెండి ధరలూ (Today Silver Rate) భారీగా పతనమ్యాయి.రూ.13,711 తగ్గిన బంగారంఅమ్మకాలు పెరగడంతో ఎంసీఎక్స్‌(MCX)లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. విలువైన లోహాల అమ్మకాలు వరుసగా రెండవ సెషన్‌కు కొనసాగాయి, మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ గణనీయంగా తగ్గాయి.ఏప్రిల్‌ గోల్డ్‌ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.13,711 లేదా 9 శాతం తగ్గి రూ.1,38,634కి చేరుకుంది, ఫ్యూచర్స్ ట్రేడ్ సమయంలో దాని కనిష్ట సర్క్యూట్ స్థాయిని తాకింది.మునుపటి సెషన్‌లో, బంగారం రూ.31,617 లేదా 17.2 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,52,345 వద్ద స్థిరపడింది, గురువారం 10 గ్రాములకు రూ.1,93,096 రికార్డు స్థాయిని తాకింది.సిల్వర్‌ రూ.26,273 డ్రాప్‌లాభాల బుకింగ్ మధ్య MCXలో సిల్వర్ ఫ్యూచర్స్ లోయర్ సర్క్యూట్‌కు క్రాష్ అయ్యాయి. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ఫ్యూచర్స్ భారీగా అమ్మకాలు జరపడంతో ట్రేడర్లు లాభాలను అధిక స్థాయిలో బుక్ చేసుకున్నారు. మార్చి వెండి కాంట్రాక్ట్ రూ.26,273 లేదా 9 శాతం తగ్గి కిలోకు రూ.2,65,652 వద్ద కనిష్ట సర్క్యూట్‌ను తాకింది.శుక్రవారం భారీ పతనం తర్వాత వెండి రూ.1,07,968 లేదా 27 శాతం తగ్గి కిలోకు రూ.2,91,925 వద్ద స్థిరపడింది, ఇది కూడా లోయర్ సర్క్యూట్‌ను తాకింది. గురువారం వెండి కిలోకు రూ.4,20,048 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ భారీ దిద్దుబాటు జరిగింది.ప్రపంచ మార్కెట్ అస్థిరత, కేంద్ర బడ్జెట్ ముందు పెట్టుబడిదారుల అప్రమత్తత సెంటిమెంట్ మధ్య లాంగ్ పొజిషన్‌లను దూకుడుగా నిలిపివేయడం వల్ల ఈ భారీ పతనం జరిగిందని వ్యాపారులు తెలిపారు.

Key Highlights of Capex Union Budget 20264
రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయం.. ఎలా ఖర్చు చేస్తారంటే..

కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని మార్చే దిశగా ఉన్నాయి. ముఖ్యంగా మూలధన వ్యయాన్ని రూ.12.2 లక్షల కోట్లకు పెంచడం దేశాభివృద్ధికి బలమైన సంకేతం. 2014-15లో కేవలం రూ.2 లక్షల కోట్లుగా ఉన్న ఈ వ్యయం, ఇప్పుడు ఆరు రెట్లు పెరగడం గమనార్హం. ఈ భారీ కేటాయింపుల నేపథ్యంలో రాబోయే కాలంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందో చూద్దాం.మౌలిక సదుపాయాల కల్పనబడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి స్పష్టంగా పేర్కొన్నట్లుగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, వంతెనల నిర్మాణం వేగవంతం అవుతుంది. వందే భారత్ రైళ్ల విస్తరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల పూర్తికి ఈ నిధులు ఉపయోగపడతాయి.టైర్ 2, టైర్ 3 నగరాల అభివృద్ధిఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలపై బడ్జెట్‌లో దృష్టి సారించారు. ఈ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులు, మెరుగైన మురుగునీటి వ్యవస్థ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. చిన్న నగరాలు వృద్ధి కేంద్రాలుగా మారుతున్నందున అక్కడ గృహ నిర్మాణ రంగానికి, కమర్షియల్ స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది.ఇంధన రంగం, గ్రీన్ ఎనర్జీభారీ కాపెక్స్ కేటాయింపులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎల్లప్పుడూ ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. సోలార్ ప్యానెల్స్, విండ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మిషన్లలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. పాత విద్యుత్ లైన్ల ఆధునీకరణ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిధులు మళ్లుతాయి.లాజిస్టిక్స్, తయారీ రంగం‘వేగాన్ని కొనసాగించడం’ అనే లక్ష్యంతో వస్తువుల రవాణా ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వివిధ రవాణా మార్గాలను అనుసంధానించడం ద్వారా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణం జరుగుతుంది. మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో తయారీ రంగంలో దేశీ, విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.ఉపాధి, అనుబంధ రంగాలుమూలధన వ్యయం పెరగడం వల్ల సిమెంట్, స్టీల్, పెయింట్స్, భారీ యంత్రాల పరిశ్రమలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ పరిశ్రమల వృద్ధి వల్ల లక్షలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె..

Centre Showers Boon on Hyderabad with High Speed Rail Corridors5
హైదరాబాద్‌కు హై-స్పీడ్ రైళ్లు..

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌పై వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్‌ 2026-27లో భాగంగా హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ పలు హై-స్పీడ్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మొత్తం ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించగా, వాటిలో మూడు కారిడార్లు హైదరాబాద్‌ నుంచి ఉండటం విశేషం.ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు ఇవే..* ముంబై – పూణే* పూణే – హైదరాబాద్* హైదరాబాద్ – బెంగళూరు* హైదరాబాద్ – చెన్నై* చెన్నై – బెంగళూరు* బెంగళూరు – వారణాసి* వారణాసి – సిలిగురిఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్ దేశవ్యాప్తంగా కీలక రవాణా కేంద్రంగా మరింత బలోపేతం కానుంది.

vikasit-bharat-kartavya-mantram-nirmala-sitharaman budget 20266
వికసిత్‌ భారత్ లక్ష్యంగా ‘కర్తవ్య మంత్రం’: నిర్మలా సీతారామన్‌

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ దేశాభివృద్ధికి సంబంధించి కీలకమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. కర్తవ్య భవన్‌లో రూపొందించిన తొలి బడ్జెట్‌గా దీన్ని అభివర్ణిస్తూ యువతను కీలకంగా చేసుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘మూడు కర్తవ్యాలు’, ‘ఆరు దశల ప్రక్రియ’ను ఆమె ప్రకటించారు.మూడు ప్రధాన కర్తవ్యాలుప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడానికి మూడు ముఖ్యమైన విధులను (కర్తవ్యాలను) ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.1. ఆర్థిక వృద్ధి: అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ప్రపంచ సవాళ్లను తట్టుకోగల సామర్థ్యాన్ని నిర్మించడం.2. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. వారిని కేవలం లబ్ధిదారులుగా కాకుండా భారతదేశ శ్రేయస్సులో బలమైన భాగస్వాములుగా మార్చేలా వారి నైపుణ్యాలను పెంపొందించడం.3. సమ్మిళిత వనరుల పంపిణీ: ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ విజన్‌తో ప్రతి కుటుంబం, సమాజం, ప్రాంతానికి వనరులు అందేలా చూడటం.‘నీరు, ఎనర్జీ, క్లిష్టమైన ఖనిజాల అవసరం పెరుగుతోంది. కొత్త సాంకేతికతలు ఉత్పత్తి వ్యవస్థలను మారుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆశయాన్ని, సమ్మిళిత వృద్ధిని సమతుల్యం చేస్తూ భారతదేశం వికసిత్‌ భారత్ వైపు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తుంది’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆరు దశల ప్రక్రియభారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు బడ్జెట్‌లో ఆరు కీలక అంశాలపై దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి చెప్పారు.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి: ఉత్పాదకత పెంపుదల.యువశక్తి, ఉపాధి: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన.మౌలిక సదుపాయాల కల్పన: ఆధునిక రవాణా, డిజిటల్ మౌలిక వసతులు.సుస్థిర ఇంధనం: ఇంధన భద్రత, క్లీన్ ఎనర్జీ.ఇన్నోవేషన్‌, పరిశోధన: టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధి.సమ్మిళిత అభివృద్ధి: అణగారిన వర్గాలు, పేదల సాధికారత. ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె..

Advertisement
Advertisement
Advertisement