Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

BSNL Rs 485 Plan Details1
ఒక రీఛార్జ్.. 72 రోజుల వ్యాలిడిటీ!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 485 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 485 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.Caption-Shoot. Share. Shine! Celebrate this Holi with extra data and uninterrupted fun on BSNL ₹485 plan. Hurry, offer ends 31st March 2026.#HoliWithBSNL #ExtraDataExtraFun #BSNLIndia #Holi2026 pic.twitter.com/Hw9gdSPEPd— BSNL India (@BSNLCorporate) March 3, 2026

Tata Sierra Crosses 10000 Deliveries2
టాటా కారుకు ఫుల్ డిమాండ్.. 10వేల డెలివరీలు!

టాటా మోటార్స్ తన సియెర్రా కారును లాంచ్ చేసినప్పటి నుంచి 10000 కార్లను డెలివరీ చేసింది. 2025 డిసెంబర్ 16న దీనికోసం బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు 2026 జనవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు. టాటా సియెర్రా కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి.

Is X Adult Content Banned in India3
ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌ నిషేధం?

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో అశ్లీల కంటెంట్ లేదా అడల్ట్ కంటెంట్ మీద భారత ప్రభుత్వం పరిమితులు విధించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎక్స్ యూజర్లు సైతం స్పందిస్తున్నారు.భారత ప్రభుత్వం సాధారణంగా అడల్ట్ కంటెంట్ నిషేధంపై చాలా సీరియస్‌గా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇలాంటి కంటెంట్ అందించే చాలా ప్లాట్‌ఫామ్‌ల మీద కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఎక్స్‌కు కూడా పరిమితులు విదించిందా? అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.భారతదేశంలో ఎక్స్‌లో 18+ కంటెంట్ నిషేధంపై మస్క్ కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా యూజర్లు దీనికి సంబంధించిన పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఆ పోస్టుల ప్రకారం.. అడల్ట్ కంటెంట్ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.Elon Musk banned 18+ videos in india.Respect @elonmusk 🫡 pic.twitter.com/QXmRa043nx— Let's X OTT GLOBAL (@LetsXOtt) March 3, 2026Elon Musk banned 18+ content?— Tammubaby (@tammubaby) March 3, 2026How can elon musk ban the porn, damn all my bookmarks are now not showing the content 😭😭— Just Chocolate™ (@LovelyFantasyyy) March 3, 2026

Broke at 18 Boss at 30 The Rise of Bonkers Corner Founder Shubham Gupta Story4
ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. దిగ్గజ పారిశ్రామికవేత్తల ముందు నిలబడి నా కంపెనీ విలువ రూ.300 కోట్లు అని చెప్పడం ఒక సాధారణ యువకుడికి పెద్ద సాహసమే!. డిగ్రీలు పూర్తిచేసి 30 ఏళ్ల వయసులో ఉద్యోగాలు చేస్తూ.. బరువు బాధ్యతలు మోసేవాళ్లే సమాజంలో ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఎలాంటి డిగ్రీ లేకుండానే.. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం స్థాపించండం అంటే మాటలా?, అయినా అలాంటిదే నిజం చేసి చూపించారు 'శుభం గుప్తా'. ఇంతకీ ఈయనెవరు, ఈయన స్టార్ట్ చేసిన బిజినెస్ ఏది? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.2011లో ముంబైలో ఏళ్ల యువకుడిగా 12వ తరగతి పూర్తి చేసిన శుభం గుప్తా.. అందరిలా డిగ్రీ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తండ్రి బట్టల వ్యాపారం దివాళా తీసింది. కష్టాలను ఎదుర్కోవడానికి.. జీవితంలో ఎదగడానికి కంకణం కట్టుకున్న శుభం, చిన్న చిన్న పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ.. బిజినెస్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు.యువతలో స్టైలిష్, కూల్ టీ-షర్టులపై పెరుగుతున్న ఆసక్తిని గమనించిన శుభం గుప్తా.. కొంత డబ్బుతో అక్కడ స్థానికంగా ఉన్న మార్కెట్లలో టీ-షర్ట్స్ కొనుగోలు చేసి, విక్రయించడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారం గురించి బాగా తెలుసుకోవడానికి.. నేరుగా కస్టమర్లతో మాట్లాడి వారి అభిరుచులను అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత ఆన్‌లైన్ ఆర్డర్లను పంపించడం మొదలుపెట్టాడు.ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!2014లో శుభం గుప్తా చేస్తున్న వ్యాపారానికి 'బాంకర్స్ కార్నర్' (Bonkers Corner) అనే పేరు పెట్టాడు. దీనిద్వారా యువత అభిరుచికి తగిన బ్రాండెడ్ స్ట్రీట్ స్టైల్ దేశీ టచ్‌తో దుస్తులు విక్రయించాడు. పెద్ద మార్కెటింగ్, పెద్ద బడ్జెట్ లేకపోయినా.. కొత్త కొత్త డిజైన్స్ పరిచయం చేసి బ్రాండ్ అంచెలంచెలుగా ఎదిగింది. కాగా ఈయన కంపెనీ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

Bengaluru IT Startup Lays Off 40 Percent Staff in a Day5
ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!

2026లోనూ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా బెంగళూరుకు చెందిన ఒక ఐటీ స్టార్టప్.. తన ఉద్యోగులలో 40 శాతం మందిని ఒకే రోజులో తొలగించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.బెంగళూరులో ఒక ఐటీ స్టార్టప్‌లో పనిచేస్తున్న నా స్నేహితుల్లో ఒకరు.. ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోయారు. అతనితో పాటు కంపెనీ ఒకేరోజు 40 శాతం మందిని తొలగించినట్లు సీఏ అర్పిత్ గోయల్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ వెల్లడించారు.నా స్నేహితుడు పనిచేసే ఐటీ స్టార్టప్‌లో ఏడాదికి రూ. 92 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే ప్రస్తుతం కంపెనీలు ఖర్చును తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులను తొలగించేస్తున్నారని అర్పిత్ గోయల్ పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇది ఉద్యోగ మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితిని స్పష్టం చేస్తోందని పేర్కొంటున్నారు.ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కలిగి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండాలని ఒకరు పేర్కొన్నారు. రూ. 92 లక్షల జీతం అంటే.. ఒక ఐదేళ్లు జీతం తీసుకున్న వ్యక్తిని కంపెనీ తొలగించినప్పటికీ.. అది అతన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేదని మరొకరు అన్నారు. రూ. 92 లక్షల జీతం, జీరో సేఫ్టీ అని ఇంకొకరు అన్నారు.One of my friend working in IT startup at bangalore, Recently his company did a 40% layoff in literally a single day and this is a real story.And he is having a CTC of 92 lakhs.The job loss is real.— CA Arpit Goyal (@Arpit1223) February 24, 2026

Mercedes Benz V Class Facelift Launched6
రూ.1.40 కోట్ల బెంజ్ కారు: దీని గురించి తెలుసా?

న్యూఢిల్లీ: మెర్సిడెస్‌ బెంజ్‌ తన లగ్జరీ ఎంపీవీ మోడల్‌ ‘వి–క్లాస్‌’ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ.1.40 కోట్లుగా ఉంది. ఈ కారు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.5 లక్షలతో ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ మార్చి చివరి నుంచే డెలివరీలు మొదలుకానున్నాయి.‘మేక్‌ ఇన్‌ ఇండియా’పై కంపెనీ నిబద్ధతను తెలియజేస్తూ.., నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, మహారాష్ట్రలోని పుణెలో ఉన్న తన చాకన్‌ కర్మాగారంలోనే అసెంబుల్‌ చేయనుంది. డిజైన్‌ విషయానికి వస్తే... ఏఎంజీ లైన్‌ ప్యాకేజీని జోడించడం వల్ల మరింత స్పోర్టీ లుక్‌ వచ్చింది. విశాలమైన క్యాబిన్, మసాజ్, వెంటిలేషన్‌ సీట్లు, 64–రంగుల యాంబియెంట్‌ లైటింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. పెంపుడు జంతువులను కూడా తమ వెంట తీసుకెళ్లే సదుపాయం ఉంది.ఇందులో డీజిల్, పెట్రోల్‌ రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీ300 డీ డీజిల్‌ మోడల్‌ 237 హెచ్‌పీ పవర్‌ను జనరేట్‌ చేసే 2–లీటర్‌ టర్బో ఇంజిన్‌తో వస్తుంది. ఇక వీ300 పెట్రోల్‌ మోడల్‌ 231 హెచ్‌పీ పవర్‌ను ఇచ్చే 2–లీటర్‌ ఇంజిన్‌తో పాటు మైల్డ్‌–హైబ్రిడ్‌ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఈ రెండు ఇంజిన్లకు 9–స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు.సేఫ్టీ కోసం మల్టిపుల్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, 360–డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ వంటివి ఉన్నాయి. అబ్సిడియన్‌ బ్లాక్, హై–టెక్‌ సిల్వర్, ఆలై్పన్‌ గ్రే, సోడాలైట్‌ బ్లూ, క్రిస్టల్‌ వైట్‌ వంటి అద్భుతమైన రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

Advertisement
Advertisement
Advertisement