Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Preity Zinta Sells Mumbai Bandra Apartment for Rs 18 5 Crore1
మరో ఫ్లాట్‌ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని పాలి హిల్‌లో ఉన్న తన ప్లాట్‌ను రూ.18.50 కోట్లకు విక్రయించింది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.ప్రీతి జింటా 2025 నవంబర్‌లో అదే భవనంలోని (రుస్తోంజీ పరిశ్రమ్ భవనం) 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ. 14 కోట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించింది. ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే రెండో ప్లాట్‌ విక్రయించడం విశేషం.ఇప్పుడు ప్రీతి జింటా విక్రయించిన ప్లాట్‌కు సంబంధించిన ఒప్పందం.. 2026 మార్చి 2న నమోదు అయింది. దీనిని అమెరికా పౌరసత్వం కలిగిన భారతీయ మూలాల వ్యక్తులు ప్రియా నగర్ & రాజీవ్ నగర్ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందంలో రూ.1.11 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది.సినీ ప్రముఖులు ఆస్తులను కొనుగోలు చేయడమే కాకుండా.. అవసరమైనప్పుడు విక్రయిస్తున్నారు కూడా. ఇప్పటికే అక్షయ్ కుమార్ 2025లో 100 కోట్లకు పైగా విలువైన అనేక ఆస్తులను విక్రయించారు. అమితాబ్ బచ్చన్ కూడా 2025లో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా ప్రీతి జింటా ఈ జాబితాలో చేరారు.నవంబర్‌లో విక్రయించిన ప్లాట్‌ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రీతి జింటా మళ్లీ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కోట్ల విలువైన కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

Gold Stranded in Dubai Sold at Discount2
బంగారానికి భారీ డిస్కౌంట్‌.. ఎక్కడ.. ఎందుకు?

మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్‌లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్‌మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్‌కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్‌, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్‌కు, అమెరికా-ఇజ్రాయెల్‌కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌!సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.

Jio Best Recharge Plans With More Than 200 Days3
జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!

ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే అవసరం వద్దనుకునేవారి కోసం రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో ఒకటి సెలక్ట్ చేసుకుంటే.. 200 కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ.1748 ప్లాన్రూ. 1748 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు డేటా లభించదు. ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం జియోటీవీ, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌కు యాక్సెస్‌ అందిస్తుంది. ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు లేదా సెకండరీ నంబర్‌ను ఉపయోగించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.2025 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా (మొత్తం 500 జీబీ), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. ఇవి కాకుండా కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్‌స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3599 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాదిపాటు (365 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్‌స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3999 ప్లాన్రూ. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు. హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత వేగం 64Kbpsకి పడిపోతుంది.

Tata Steel Plans Rs 11000 Crore Investment in Jamshedpur Plant4
టాటా స్టీల్‌ రూ. 11,000 కోట్ల పెట్టుబడులు

రాంచీ: అధునాతన గ్రేడ్‌ ఉక్కును తయారు చేసే దిశగా జంషెడ్‌పూర్‌ ప్లాంటుపై రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికలు ఉన్నట్లు టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. ఇందుకోసం తాము రూపొందించిన టెక్నాలజీతో ఉక్కు ప్రాసెసింగ్‌ వేగవంతమవుతుందని, అలాగే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని చెప్పారు. నెదర్లాండ్స్‌లో ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయిన నేపథ్యంలో 2030 నాటికి జంషెడ్‌పూర్‌లో 1 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రశేఖరన్‌ చెప్పారు. హైడ్రోజన్‌ ట్రక్కులపై కూడా టాటా మోటర్స్‌ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వివరించారు. ఇక జార్ఖండ్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని టాటా గ్రూప్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Stock Market Close March 6 Sensex drops 1097 pts as Brent rises5
కుప్పకూలిన మార్కెట్లు.. కూల్చేసిన క్రూడ్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ఏడాది కాల గరిష్టానికి పెరగడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు షెషన్‌ చివర్లో గణనీయ నష్టాలను చవిచూశాయి.నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 1.27 శాతం లేదా 315.45 పాయింట్ల నష్టంతో 24,450.45 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్ 1.37 శాతం లేదా 1,097 పాయింట్లు నష్టపోయి 78,918.90 వద్ద ముగిసింది.యూఎస్-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నందున హోర్ముజ్ జలసంధి షిప్పింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఇది సరఫరా అంతరాయం భయానికి ఆజ్యం పోసింది. దీంతో యూరోపియన్ వాణిజ్య సెషన్ లో బ్రెంట్ క్రూడ్ ను బ్యారెల్ కు 87 డాలర్ల మార్కుకు పైగా నెట్టింది.నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.69 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.24 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.27 శాతం క్షీణతతో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన సూచీగా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్‌లో నష్టపోయిన ఇతర రంగాలు. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఐటీ స్వల్ప లాభాలతో సెక్టోరల్ సూచీలను అధిగమించింది.

Casagrand Launches Rs 299 Crore Luxury Villa Project in Medchal Hyderabad6
మేడ్చల్‌లో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్.. కాసాగ్రాండ్ క్రెస్ట్‌వుడ్ లాంచ్!

భారతదేశంలోని ప్రముఖ రియల్ఎ స్టేట్ డెవలపర్లలో ఒకటైన కాసాగ్రాండ్, హైదరాబాద్‌లోని మెడ్చల్ ప్రాంతంలో 'కాసాగ్రాండ్ క్రెస్ట్‌వుడ్‌' పేరుతో ఒక అతి ప్రీమియం గేటెడ్ విల్లా కమ్యూనిటీని అధికారికంగా ప్రారంభించింది. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌లో మొత్తం 130 అత్యున్నత స్థాయి 5 బీహెచ్‌కే విల్లాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విల్లాల ప్రారంభ ధర రూ. 2.99 కోట్ల నుండి ప్రారంభమవుతుంది.అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ విల్లాలు విశాలమైన నివాస విస్తీర్ణంతో పాటు ప్రైవేట్ హోమ్ థియేటర్ ఏర్పాటు చేసే సదుపాయం, ప్రత్యేక లిఫ్ట్ ప్రొవిజన్, విస్తృత ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్, 1,200 చదరపు అడుగుల వరకు వ్యక్తిగత తోట స్థలం & సుమారు 375 చదరపు అడుగుల బ్యాక్‌యార్డ్‌ ప్రదేశాన్ని కలిగి ఉంటాయి. ప్రతి విల్లా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో రూపొందించారు.ఈ ప్రాజెక్ట్‌లో 55కి పైగా ఇండోర్ & అవుట్‌డోర్ లైఫ్‌స్టైల్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న G+3 క్లబ్‌హౌస్‌, రూఫ్‌టాప్‌ స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, యోగా స్టూడియో, పిల్లల ఆట స్థలాలు, మల్టీ పర్పస్ కోర్టులు, వాకింగ్ ట్రాక్లు, సీనియర్ సిటిజన్ జోన్, రిఫ్లెక్సాలజీ వాక్వే వంటి అనేక సౌకర్యాలు నివాసితులకు ఆరోగ్యకరమైన & సమతుల్య జీవన శైలిని అందించడానికి రూపుదిద్దుకున్నాయి.మొత్తం ప్రాజెక్ట్ విస్తీర్ణంలో సుమారు 67% భాగాన్ని ఓపెన్ స్పేస్ & ల్యాండ్ స్కేపింగ్ కోసం కేటాయించడం ద్వారా ప్రకృతి మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించారు. ఫెంగ్ షుయ్ ప్రేరణతో రూపొందించిన ఉద్యానవనాలు, ప్రత్యేక థీమ్ గార్డెన్లు & విస్తృత హరిత ప్రదేశాలు నివాసితులకు ప్రశాంతత, గోప్యతను కల్పిస్తాయి.ఇంటీరియర్ రూపకల్పనలో 9’10” ఎత్తైన సీలింగ్స్, విస్తృత గాజు స్లైడింగ్ డోర్స్, సమృద్ధిగా సహజ కాంతి & గాలి ప్రసరణకు అనుకూలమైన ప్రణాళిక, వాక్-ఇన్ వార్డ్‌రోబ్‌లతో కూడిన సూట్-సైజ్ బెడ్రూమ్స్ మరియు విశాలమైన మాడ్యులర్ వంటగదులు అందుబాటులో ఉన్నాయి. ప్రతివిల్లాకు 100% పవర్‌బ్యాకప్ సదుపాయం కల్పించారు.మెడ్చల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో ఉండటం వలన హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఐటీకారిడార్లు, పరిశ్రమల కేంద్రాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సేవా సంస్థలు & వినోద ప్రదేశాలకు సులభంగా చేరుకునే అవకాశం కల్పిస్తుంది. మేడ్చల్ ఇండస్ట్రియల్ కారిడార్, జీనోమ్ వ్యాలీ, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉండటం దీని విలువను మరింత పెంచుతుంది.అదనంగా, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు & రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సౌకర్యవంతమైన కనెక్టివిటీ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను మరింత బలపరుస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా కూడా ఇది అత్యుత్తమ అవకాశంగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement