ప్రధాన వార్తలు
అద్దె భారం.. సౌకర్యాలు శూన్యం!: బెంగళూరులో ఇలా..
బెంగళూరు నగరంలో రోజురోజుకి ఇళ్ల అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. కానీ కావలసిన కనీస అవసరాలు కూడా లభించడం లేదు. అధిక మొత్తంలో డబ్బు చెల్లించినప్పటికీ, తగిన ఇళ్లు దొరకడం లేదని చాలా మంది అద్దెదారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.బెంగళూరు నివాసి ఒకరు ఇటీవల కడుబీసనహళ్లికి 6 కిలోమీటర్ల పరిధిలో 1BHK ఫ్లాట్ కోసం వెతుకుతున్నప్పుడు ఎదురైన తమ అనుభవాన్ని రెడ్డిట్లో పంచుకున్నారు. ఈ అన్వేషణలో.. బెల్లందూర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, మారతహళ్లి, ఏఈసీఎస్ లేఅవుట్, సమీపంలోని సర్జాపూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.ఎక్కడ ఇల్లు కోసం సెర్చ్ చేసినా.. కనీస సౌకర్యాలు లేదని వెల్లడించాడు. అయితే అద్దె మాత్రం చాలా ఎక్కువగా ఉందని వాపోయాడు. దాదాపు రూ. 30,000 చెల్లిస్తున్నప్పటికీ, సరైన బాల్కనీ, పార్కింగ్ సౌకర్యాలు ఉన్న ఫ్లాట్ను వెతుక్కోవడం కష్టంగా ఉందని కూడా ఆయన అన్నారు.ఫ్లాట్లు రూ.28 వేల నుంచి రూ.32 వేలు లేదా అంతకంటే ఎక్కువ ధరకే లభిస్తున్నాయి, అయినా కూడా వాటిలో సరైన బాల్కనీ లేదా ప్రత్యేక కార్ పార్కింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. నన్ను మరింత ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటంటే, ఇళ్లను చూపించే విధానం. చాలా చోట్ల బాల్కనీ ఉందని చెబుతారు, కానీ మీరు నిజంగా వెళ్ళినప్పుడు, అది వాషింగ్ మెషీన్ పక్కన ఉండే ఒక చిన్న పని ప్రదేశంలా ఉంది. ఇది తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా అనిపిస్తుందని అతడు వెల్లడించాడు.ఇదీ చదవండి: రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!నేను మరీ అంత ఆడంబరమైన ఇళ్ల కోసం ఏమీ వెతకడం లేదు. గేటెడ్ సొసైటీలో.. కనీసం నిలబడటానికి లేదా కూర్చోవడానికి వీలుగా ఒక చిన్న ప్రైవేట్ బాల్కనీ, సరైన కార్ పార్కింగ్ ఉన్న ఒక సాధారణ 1BHK చాలు. అయినా అలాంటివి అస్సలు దొరకడం లేదు. దీన్నిబట్టి చూస్తే నగరంలో సరైన సౌకర్యాలున్న ఇళ్లను వెతుక్కోవడం పెద్ద సహజంగా అనిపిస్తుంది.
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 509.73 పాయింట్ల లాభంతో 74,616.58 వద్ద, నిఫ్టీ 155.40 పాయింట్ల లాభంతో 23,123.65 వద్ద నిలిచింది.ఆల్కలీ మెటల్స్ లిమిటెడ్, ఆల్ఫాజియో (ఇండియా) లిమిటెడ్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఉమా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, ల్యాండ్మార్క్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రాజ్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్వర్క్స్ లిమిటెడ్, అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్పోర్ట్స్) లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!
ఏదైనా ఒక కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసేటప్పుడు.. ఫ్యాకేజిలో హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఇతర ప్రయోజనాలను అందివ్వడం సర్వసాధారణం. కానీ ఆఫ్రికాకు చెందిన ఒక కంపెనీ మాత్రం 'కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్' వెల్లడించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇక అసలు విషయానికి వస్తే.. వ్యాపారవేత్త అమన్ ధత్తర్వాల్తో, ప్రముఖ పాడ్కాస్టర్ కుశాల్ లోధా మాట్లాడుతూ.. ఒక ఆఫ్రికన్ కంపెనీ ప్లేస్మెంట్ల కోసం ఐఐఎంకు వచ్చి రూ.80 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేసింది. కానీ అందులో రూ. 40 లక్షలు కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్ కోసం కేటాయించిందని వెల్లడించాడు. అంటే ఆ డబ్బు కిడ్నాపర్ల కోసం అన్నమాట."ఈ సీటీసీ వర్సెస్ చేతికి అందే జీతం అనేది ఒక రకమైన మోసం అని నాకు అనిపిస్తోంది" అని లోధా అన్నారు. "ఈ కంపెనీ ఐఐఎం కలకత్తాకు వచ్చి, సంవత్సరానికి రూ. 80 లక్షలు ఇస్తామని ఆఫర్ చేసింది. పైగా ఇది ఆఫ్రికాకు చెందిన కంపెనీ. అక్కడ కిడ్నాప్లు చాలా సాధారణమని తెలుస్తోంది. కాబట్టి ఆ రూ. 80 లక్షల వార్షిక వేతనంలో, రూ. 40 లక్షలు జీతం కాగా.. మిగిలిన రూ. 40 లక్షలు కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్. అంటే.. కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎప్పుడైనా కిడ్నాప్కు గురైతే.. రూ.40 లక్షలు కిడ్నాపర్లకు చెల్లించి విడిపించుకుంటుందన్న మాట. అయితే లోధా ఆ కంపెనీ పేరును వెల్లడించలేదు.ఇదీ చదవండి: 'ఒరాకిల్'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఒకవేళా కిడ్నాపర్లకు రూ.40 లక్షల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే?, ఆ తరువాత సంవత్సరం క్లెయిమ్ చేసుకోవాలా? అని కొందరు పేర్కొన్నారు. ఒకవేలా సన్నిహితులు కూడా ఆ డబ్బుకోసం ఉద్యోగిని కిడ్నాప్ చేయొచ్చు కదా అని ఇంకొందరు అన్నారు.
కేరళ దేవాలయాలకు అనంత్ అంబానీ భూరి విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు భారీ విరాళాలు ప్రకటించారు. రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాల అభివృద్ధికి, గజరాజుల సంరక్షణకు సంబంధించి మొత్తంగా రూ.18 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.రాజరాజేశ్వరం ఆలయ పునరుద్ధరణకు పెద్దపీటఇటీవల తలపరంబలోని చారిత్రక రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.12 కోట్ల భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గత రెండు శతాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న అత్యంత పురాతనమైన, పురావస్తు ప్రాధాన్యత కలిగిన తూర్పు గోపురాన్ని పునరుద్ధరించడానికి ఈ నిధులను ప్రధానంగా వెచ్చించనున్నారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు తోడ్పడతాయి. తక్షణ విరాళం కింద ఆలయ నిర్వహణ కమిటీకి రూ.3 కోట్ల చెక్కును అందజేశారు.ఏనుగుల సంరక్షణ కోసం..అంతకుముందు, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ స్వామివారికి రూ.3 కోట్ల విరాళాన్ని సమర్పించారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా స్ఫూర్తితో గురువాయూర్ ఏనుగుల సంక్షేమం కోసం వినూత్న ప్రణాళికలను ప్రకటించారు.ఏనుగుల కోసం ప్రత్యేకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఆసుపత్రి నిర్మాణం.ఏనుగులను గొలుసులతో కట్టేయకుండా స్వేచ్ఛగా తిరిగేలా ఆధునిక వసతి గృహాల ఏర్పాటు.ఏనుగులకు గౌరవప్రదమైన, శాస్త్రీయమైన సంరక్షణ అందించడానికి అవసరమైన సాంకేతిక మద్దతు.‘భారతీయ ఆధ్యాత్మిక ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. అవి విశ్వాసం, కరుణ, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటిచెప్పే జీవన కేంద్రాలు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే మన సంప్రదాయంలో భాగమైన మూగజీవాలకు అత్యుత్తమ వైద్యం, గౌరవం అందించడమే మా లక్ష్యం’ అని అనంత్ అంబానీ అన్నారు.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..
టెక్ ఇండస్ట్రీలో ఏఐ ప్రకంపనలు
గ్లోబల్ టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతోంది. 2026 ప్రారంభం నుంచే టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ మంత్రాన్ని జపిస్తుండటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలోకి మళ్లుతున్న పెట్టుబడులు, కంపెనీల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 51,000 మంది నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. నియామకాలు మందగించడం, కేవలం నైపుణ్యం కలిగిన స్వల్ప శ్రామిక శక్తితోనే గరిష్ట ఉత్పాదకత సాధించాలనే లక్ష్యంతో కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.రంగంలోకి ఏఐప్రస్తుత సంక్షోభంలో క్లౌడ్ కంప్యూటింగ్, హార్డ్వేర్, గేమింగ్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రధాన తొలగింపులు కింది విధంగా ఉన్నాయి.ఒరాకిల్.. టెక్ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ డే లేఆఫ్స్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించింది. ఇందులో భారత్కు చెందిన 12,000 మంది ఉండటం గమనార్హం. ఏఐ మౌలిక సదుపాయాల పటిష్టతకే తమ ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది.అమెజాన్.. కొవిడ్ సమయంలో పెరిగిన అదనపు సిబ్బందిని తగ్గించుకునే క్రమంలో సుమారు 16,000 మందికి ఉద్వాసన పలికింది. రోబోటిక్స్ విభాగంలోనూ కోతలు విధించడం ద్వారా కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టింది.డెల్.. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 11,000 ఉద్యోగాలను తొలగించడంతోపాటు కొత్త నియామకాలపై కఠిన ఆంక్షలు విధించింది.బ్లాక్(Block).. జాక్ డోర్సే నేతృత్వంలోని ఈ సంస్థ 4,000 మందిని తొలగిస్తూ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడమే ఇందుకు కారణమని బహిరంగంగా ప్రకటించింది.మెటా, అట్లాసియన్.. మెటా తన రియాలిటీ ల్యాబ్స్లో 10 శాతం సిబ్బందిని తగ్గించగా, అట్లాసియన్ 1,600 మందిని ఇంటికి పంపింది. మారుతున్న ఏఐ నైపుణ్య అవసరాలే ఇందుకు కారణమని అట్లాసియన్ పేర్కొంది.కారణాలేంటి?కంపెనీలు తమ మూలధనాన్ని సాధారణ నిర్వహణ నుంచి ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎఫిషియన్సీ (సామర్థ్యం) పేరుతో ఖర్చులను తగ్గిస్తున్నాయి. సంప్రదాయ కోడింగ్, సపోర్ట్ ఉద్యోగాల కంటే ఏఐ డెవలప్మెంట్, డేటా సైన్స్ తెలిసిన వారి కోసమే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.మానవ మేధ vs కృత్రిమ మేధఈ లేఆఫ్స్ పరంపర ఉద్యోగ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ఏఐ వల్ల సాధారణ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఏఐ నైపుణ్యం కలిగిన వారికి కొత్త అవకాశాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘టెక్ రంగం ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య కంటే సాంకేతిక సామర్థ్యానికే పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న తొలగింపులు కేవలం ఖర్చు తగ్గింపు మాత్రమే కాదు, అది పరిశ్రమ నిర్మాణంలో వస్తున్న పెను మార్పు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోకపోతే ఈ డిజిటల్ రేసులో వెనుకబడే ప్రమాదం ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..
భారత్వైపు టెక్ కంపెనీల చూపు..
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం ప్రపంచ ఐటీ ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ డేటా భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో భౌగోళికంగా, ఆర్థికంగా సురక్షితమైన స్థావరంగా భావిస్తున్న భారతదేశం ప్రపంచ డేటా సెంటర్ హబ్గా అవతరించేందుకు సిద్ధమవుతోంది.గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి గ్లోబల్ కంపెనీలు ప్రస్తుతం భారత్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాల కోసం కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ ఇప్పటికే దేశంలోని ప్రముఖ డేటా సెంటర్ ఆపరేటర్లయిన CtrlS, Sify, NTT, CapitaLand, Airtel Nxtraలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పశ్చిమాసియా క్లయింట్లు సైతం తమ డేటాను భారత్కు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు.భారత్ ఎందుకు అత్యుత్తమ ఎంపిక?అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తమ వర్క్లోడ్ను యూరప్ లేదా అమెరికాకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ భారత్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ధరల ప్రయోజనం. నిపుణులు విశ్లేషణ ప్రకారం, భారత్లో ఒక డేటా సెంటర్ నిర్మించే ఖర్చుతో పోలిస్తే సింగపూర్ వంటి దేశాల్లో రెండింతలు ఖర్చవుతుంది. అంటే భారత్లో పెట్టుబడి పెడితే మిగిలిన సొమ్ముతో మరో అదనపు కేంద్రాన్ని ఉచితంగా నిర్మించుకున్నంత లాభం చేకూరుతుంది.జీపీయూలకు భారీ డిమాండ్కేవలం డేటా స్టోరేజ్ మాత్రమే కాకుండా కృత్రిమ మేధ ప్రాసెసింగ్కు అవసరమైన జీపీయూ(గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు) కోసం కూడా అంతర్జాతీయ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘యొట్టా’ డేటా సర్వీసెస్ ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలతో 16 మిలియన్ డాలర్ల నుంచి 1.3 బిలియన్ డాలర్ల విలువైన భారీ జీపీయూ ఒప్పందాలను కుదుర్చుకుంది. పెరిగిన డిమాండ్ను తట్టుకోవడానికి రాబోయే నాలుగు నెలల్లో సుమారు 30,000 అదనపు B300/B200 జీపీయూలను సిద్ధం చేయాలని యొట్టా భావిస్తోంది.సాధారణ కార్యాలయాల వలె డేటా సెంటర్లను తక్షణమే మార్చడం సాధ్యం కాదు కాబట్టి, ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలు దీర్ఘకాలికంగా భారత్కు మేలు చేయనున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, గల్ఫ్ దేశాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్.. భారత్ను గ్లోబల్ క్లౌడ్ కారిడార్లో ఒక శక్తివంతమైన సెకండరీ హబ్గా నిలబెడుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్లోబల్ టెక్ రంగంలో ఇదొక నిర్మాణాత్మక మార్పు. భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే డిజిటల్ ఎకానమీలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..
కార్పొరేట్
రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!
కేరళ దేవాలయాలకు అనంత్ అంబానీ భూరి విరాళం
టెక్ ఇండస్ట్రీలో ఏఐ ప్రకంపనలు
ఎయిర్ ఇండియా సీఈఓ రాజీనామా
హెల్త్కేర్, ఫార్మాలో.. ఉద్యోగ‘మస్తు’!
క్యూ4లో ఐటీ డీలా!
విప్రో రూ. 9,300 కోట్ల డీల్
'ఒరాకిల్'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?
ఆ రైల్వే స్టేషన్కు వెళ్లాలంటే.. పాస్పోర్ట్, వీసా ఉండాల్సిందే!
25 లక్షల టన్నుల యూరియా దిగుమతికి రంగం సిద్ధం
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా క...
ప్రమోటర్ల దారెటు..?
కొన్నాళ్లుగా అమెరికా సుంకాలు... ఇపుడేమో ఇరాన్ యుద...
వెండి ధరలు కొత్త మార్క్.. కేవలం వారం రోజుల్లో!
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా, వ...
త్వరలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహం!
ముంబై: నకిలీ అప్లికేషన్లు(యాప్స్)తో స్టాక్ మార్క...
ఎక్కడి రేట్లు అక్కడే! ఆర్బీఐ పాలసీ మీట్ నేటి నుంచే..
ముంబై: ఆర్బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మా...
ప్రమోటర్ల దారెటు..?
కొన్నాళ్లుగా అమెరికా సుంకాలు... ఇపుడేమో ఇరాన్ యుద...
తగ్గిన సిబిల్ స్కోర్.. సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యక్తి
లోన్ తీసుకుని చెల్లించకపోవడం, క్రెడిట్ కార్డు బిల్...
రూపాయి రక్షణలో.. మరింత తగ్గిన ఫారెక్స్, బంగారం నిల్వలు
ముంబై: అధిక చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఒరాకిల్ బాస్కు షాక్.. రూ.16 లక్షల కోట్లు లాస్!
టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్ సంపద ఊహించని రీతిలో ఆవిరైపోయింది. గడిచిన ఆరు నెలల కాలంలోనే ఆయన నికర విలువ ఏకంగా 193 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.10 లక్షల కోట్లు) మేర క్షీణించింది. ఒరాకిల్ షేర్లు మార్కెట్లో భారీగా పతనమవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.కుబేరుల జాబితాలో వెనక్కి..బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 22, 2025 నాటికి ఎల్లిసన్ నికర విలువ 388 బిలియన్ డాలర్లుగా ఉండేది. అప్పట్లో ఆయన ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏప్రిల్ 3, 2026 నాటికి అది 195 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్స్లో ఆయన రెండో స్థానం నుండి ఆరో స్థానానికి పడిపోయారు.షేర్ల పతనమే కొంపముంచింది..ఒరాకిల్ సంస్థలో ఎల్లిసన్కు దాదాపు 41% వాటా ఉంది. కంపెనీ షేర్ల విలువ తగ్గితే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ కూడా నేరుగా ప్రభావితమవుతుంది. సెప్టెంబర్ 2025లో 345.72 డాలర్ల వద్ద ఉన్న ఒరాకిల్ షేర్ ధర, ఏప్రిల్ 2, 2026 నాటికి 146.38 డాలర్లకి పడిపోయింది. అంటే దాదాపు 58% మేర పతనం నమోదైంది.భారీగా ఉద్యోగుల తొలగింపు ఒకవైపు సంపద క్షీణిస్తుండగా, మరోవైపు ఒరాకిల్ సంస్థ ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడింది. మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 18%) తొలగించినట్లు సమాచారం.భారత్పై తీవ్ర ప్రభావంమీడియా నివేదికల ప్రకారం, ఈ తొలగింపుల ప్రభావం భారత్పై తీవ్రంగా ఉంది. దేశంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులను కంపెనీ సాగనంపినట్లు తెలుస్తోంది."ప్రస్తుత వ్యాపార అవసరాలు, సంస్థాగత మార్పులను దృష్టిలో ఉంచుకుని మీ పాత్రను తొలగించాలని నిర్ణయించాం," అంటూ తెల్లవారుజామునే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.వ్యాపార ఒత్తిళ్లు, మార్కెట్ అస్థిరత నేపథ్యంలో ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు ఇన్వెస్టర్లను, ఇటు ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రూ .1.8 కోట్ల జీతం.. భలే జాబ్ కొట్టాడు!!
విదేశీ ఉద్యోగం అంటే లక్షల రూపాయల ఖర్చుతో కూడిన కన్సల్టెన్సీలు, విదేశాల్లో నెట్వర్కింగ్, లేదా అక్కడే చదువుకుని ఉండాలని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఏ విధమైన విదేశీ కనెక్షన్లు లేకుండా, కేవలం తన గదిలో కూర్చుని పక్కా ప్రణాళికతో రూ. 1.8 కోట్ల అంతర్జాతీయ జాబ్ ఆఫర్ను సొంతం చేసుకున్నాడు కార్తీక్ మోడీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రస్తుతం ఈ వార్త టెక్ నిపుణుల్లో హాట్ టాపిక్ కావడమే కాకుండా, ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తోంది.అసాధ్యం కాదు..తొలుత ఇండియాలో ఉంటూనే రిమోట్ పద్ధతిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసిన కార్తీక్, ఆఫర్ లెటర్ అందుకున్న తర్వాతే యూకేకి మకాం మార్చారు. ‘విదేశాలకు వెళ్లడం లేదా పెద్ద నెట్వర్క్ ఉండటం ముఖ్యం కాదు. సరైన నైపుణ్యం, స్పష్టమైన ప్రణాళిక ఉంటే మీ గది నుంచే ప్రపంచాన్ని గెలవొచ్చు’ అని ఆయన తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు.కార్తీక్ మోడీ సక్సెస్ మంత్రం ఇదే..గుడ్డిగా వందలాది కంపెనీలకు దరఖాస్తు చేయకుండా, కేవలం 25-30 అంతర్జాతీయ కంపెనీలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. వీసా స్పాన్సర్షిప్ ఇచ్చే కంపెనీల కోసం లింక్డ్ఇన్, ఇండీడ్, లెవల్స్.ఫై వంటి వేదికలను ఉపయోగించుకున్నారు.సుమారు 40 ఉద్యోగ ప్రకటనలను క్షుణ్ణంగా పరిశీలించి, అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువగా ఆశిస్తున్న నైపుణ్యాలను గుర్తించి తనను తాను సిద్ధం చేసుకున్నారు. ఇందు కోసం 12 వారాల పక్కా ప్లాన్ వేసుకున్నారు. మొదటి 5 వారాలు డేటా స్ట్రక్చర్స్ & అల్గోరిథమ్స్ పై పట్టు సాధించారు. వేల సమస్యలు కాకుండా, కేవలం 100 కీలకమైన సమస్యలను ఎంచుకుని, వాటి వెనుక ఉన్న లాజిక్ను అర్థం చేసుకున్నారు.సిస్టమ్ డిజైన్పై పట్టు సాధించేందుకు పేమెంట్స్, సెర్చ్, నోటిఫికేషన్స్ వంటి 8-10 కీలక కోర్ సిస్టమ్స్పై లోతైన అధ్యయనం చేశారు. రియల్ వరల్డ్ ప్రాజెక్టులలో స్కేలబిలిటీ, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ఎలా ప్రదర్శించాలో ప్రాక్టీస్ చేశారు.రిజ్యూమ్ చిన్నగా.. ఇంపాక్ట్ పెద్దగా!అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కేవలం ఒకే ఒక్క పేజీలో తన రిజ్యూమ్ను రూపొందించారు. సుదీర్ఘమైన వివరణలు ఇవ్వకుండా, తాను చేసిన పని వల్ల కలిగిన ఫలితాలను గణాంకాలతో సహా పొందుపరిచారు. ఇంటర్వ్యూ భయం పోగొట్టుకోవడానికి పలు 'మాక్ ఇంటర్వ్యూలు' కూడా నిర్వహించుకున్నారు.ఏ విధమైన షార్ట్కట్లు వెతక్కుండా, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ ఉంటే ప్రపంచస్థాయి అవకాశాలు మన ముంగిటకే వస్తాయని కార్తీక్ మోడీ నిరూపించారు. కేవలం 10-12 వారాల కఠోర శ్రమ ఆయన జీవితాన్నే మార్చేసింది.
జియోకు షాక్.. ఎయిర్టెల్కే ఎక్కువ యూజర్లు!
భారతీ ఎయిర్టెల్ కొత్త చందాదారులను ఆకర్షించడంలో వరుసగా మూడో నెలలోనూ ముందుంది. ఫిబ్రవరిలో 48.5 లక్షల కొత్త చందాదారులను తన నెట్వర్క్లో భాగం చేసుకుంది. వైర్లైన్ కూడా కులుపుకుంటే ఎయిర్టెల్ మొత్తం మీద 50.88 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. జియో నికరంగా 17.41 లక్షల చందాదారులను (మొబైల్ విభాగంలో 16.24 లక్షలు) ఆకర్షించింది.మొత్తం మీద ఫిబ్రవరి చివరికి మొబైల్, ఫిక్స్డ్ వైర్లెస్ కనెక్షన్ల సంఖ్య 127.33 కోట్లకు పెరిగింది. వొడాఫోన్ ఐడియా ఇటీవలి కాలంలోనే మొదటిసారి 21,927 మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. ఇక బీఎస్ఎన్ఎల్ 1.01 లక్షల కస్టమర్లను కోల్పోయింది. జియో నికర చందాదారులు 51.96 కోట్లకు పెరిగారు. 36.4 కోట్ల చందాదారులతో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంటే, 12.93 కోట్ల కస్టమర్లతో వొడాఫోన్ ఐడియా, 2.8 కోట్ల కస్టమర్లతో బీఎస్ఎన్ఎల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గ్లోబల్గా రెండో స్థానంలో ఎయిర్టెల్ అంతర్జాతీయంగా 65 కోట్ల మంది సబ్ర్స్కయిబర్స్తో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం ఆపరేటరుగా భారతి ఎయిర్టెల్ నిల్చింది. మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న జీఎస్ఎంఏ ఇంటెలిజెన్స్ గణాంకాలను ఉటంకిస్తూ కంపెనీ ఈ విషయాలు తెలిపింది. ఎయిర్టెల్కి భారత్లో 36.8 కోట్ల మంది, ఆఫ్రికాలోని 14 దేశాల్లో 17.9 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వినూత్న ఆవిష్కరణలు, విశ్వసనీయత ప్రాతిపదికన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు భారతి ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ తెలిపారు.
మొబైల్ డేటా జోరు
దేశీయంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరుగుతోంది. 2024లో ప్రతి యూజరు నెలకు సగటున 27.5 జీబీ వినియోగించగా 2025లో ఇది 31 జీబీకి పెరిగింది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వార్షిక మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్ (ఎంబీఐటీ) 13వ ఎడిషన్ ప్రకారం గత ఐదేళ్లలో డేటా వినియోగం వార్షిక ప్రాతిపదికన 18 శాతం మేర వృద్ధి చెందింది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ అప్లికేషన్స్, 4కే వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్లాంటి అవసరాల కోసం డేటాకి డిమాండ్ గణనీయంగా పెరిగింది. 2025లో భారత్లో మొత్తం డేటా ట్రాఫిక్ ప్రతి నెలా 27 ఎక్సాబైట్స్కి (ఈబీ) చేరింది. సంఖ్యాపరంగా 5జీ యూజర్లకు సంబంధించి భారత్.. ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.మరిన్ని విశేషాలు..డేటా ట్రాఫిక్ వృద్ధికి ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) కూడా కీలకంగా ఉంటోంది. మొత్తం 5జీ డేటాలో ఈ విభాగం వాటా 25 శాతం పైగా ఉంది. వార్షికంగా 5జీ ఎఫ్డబ్ల్యూఏ సబ్స్క్రైబర్స్ సంఖ్య రెండు రెట్లు పెరిగింది.5జీ వినియోగం వేగవంతంగా పెరుగుతుండటం, ఏఐ ఆధారిత యాప్స్ ప్రభావంతో భారత్లో మొబైల్ బ్రాడ్బ్యాండ్ విభాగం కొత్త దశలోకి అడుగుపెడుతోంది.5జీ వినియోగంలో మెట్రో సర్కిల్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆయా మార్కెట్లలో మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్లో 58 శాతం వాటా 5జీ టెక్నాలజీదే ఉంటోంది.యాక్టివ్ 4జీ డివైజ్ల సంఖ్య 2025లో 89.2 కోట్లకు చేరింది. ఇందులో 5జీ సామర్థ్యాలు ఉన్న డివైజ్ల సంఖ్య 38.3 కోట్లుగా ఉంది. బడ్జెట్ 5జీ ఫోన్ల (100 డాలర్ల లోపు ధర) సంఖ్య పది రెట్లు పైగా వృద్ధి చెందింది. గతేడాది విక్రయించిన 90 శాతం స్మార్ట్ ఫోన్లు 5జీని సపోర్ట్ చేస్తాయి.రాబోయే రోజుల్లో 2031 నాటికి భారత్లో 5జీ సబ్స్క్రయిబర్స్ సంఖ్య 100 కోట్ల స్థాయిని దాటుతుందని అంచనా.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?
పర్సనల్ ఫైనాన్స్
ఈ వారం బ్యాంకులకు వెళ్లొచ్చా?
సామాన్యుడి దైనందిన జీవితంలో బ్యాంకింగ్ సేవలు అంతర్భాగమయ్యాయి. నగదు విత్డ్రాయల్స్ నుంచి లోన్ అప్లికేషన్ల వరకు ఏదో ఒక పనిపై మనం బ్యాంకులను సందర్శిస్తుంటాం. అయితే, బ్యాంకుకు వెళ్లే ముందు ఆ రోజు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 12 మధ్య బ్యాంకుల పనిదినాల వివరాలు ఇలా ఉన్నాయి..ఈ వారం ప్రత్యేక సెలవులు లేవుఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఈ వారంలో (ఏప్రిల్ 6 - ఏప్రిల్ 12) దేశవ్యాప్తంగా ఎలాంటి జాతీయ లేదా ప్రాంతీయ పండుగ సెలవులు లేవు. బ్యాంకులు తమ సాధారణ పనివేళల్లోనే సేవలందిస్తాయి. అయితే, వారాంతపు సెలవుల కారణంగా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని గమనించాలి. ఏప్రిల్ 11న రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. సాధారణంగా బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.ఆన్లైన్ సేవలు అందుబాటులో..బ్యాంకులకు భౌతికంగా సెలవు ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) సేవలతోపాటు నెట్ బ్యాంకింగ్/మొబైల్ యాప్స్ ద్వారా నగదు బదిలీ (NEFT, RTGS, IMPS) చేసుకోవచ్చు. ఇక ఏటీఎం (ATM) కేంద్రాలు 24 గంటలూ తెరిచి ఉంటాయి.
గ్రూప్ బీమా.. ఇస్తుందా ధీమా?
వేతన జీవుల్లో చాలా మందికి యాజమాన్యం ఆఫర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకం. అంతేకాదు, దాన్నొక భరోసాగానూ చూస్తుంటారు. ఒక విధంగా ప్రీమియం తక్కువగా ఉండడం, కొన్ని చోట్ల యాజమాన్యాలు ప్రీమియంలో కొంత సబ్సిడీ ఇవ్వడం, మరికొన్ని సొంతంగా ప్రీమియం చెల్లిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేస్తుంటాయి. దీంతో ఉద్యోగులు ఈ విషయంలో మరో ఆలోచన లేదన్నట్టు కనిపిస్తుంటారు.కానీ, అసలు రిస్క్ ఎప్పుడంటే..? ఆ ఉద్యోగంతో బంధం తెగిపోయినప్పుడే. సంస్థే తొలగించొచ్చు. లేదంటే ఉద్యోగే రాజీనామా చేయొచ్చు. లేదా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆ మరుసటి రోజు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేకుండా కొనసాగాల్సి వస్తుంది. చూడ్డానికి ఇదేమంత పెద్ద అంశంగా అనిపించకపోవచ్చు. మరో సంస్థలో చేరిన తర్వాత బీమా తీసుకోవచ్చులేనని అనుకోవచ్చు. కానీ, ఈ విరామ సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే రూ.లక్షలాది పొదుపు నిధి ఖర్చయిపోతుంది. లేదంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.ఇక రిటైర్మెంట్ వరకు సంస్థ బీమాపైనే ఆధారపడిన వారి పరిస్థితి మరింత సంక్లిష్టం. వృద్ధాప్యంలో ఏవైనా ఆరోగ్య సమస్యలతో తాజాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే అదేమంత ఈజీ కాదు. ప్రీమియం భారీగానే ఉంటుంది. కనుక వేతన జీవులు వ్యక్తిగత ఆరోగ్య రక్షణ విషయం ఎలా వ్యవహరించాలో తెలిపే వెల్త్ స్టోరీ ఇది... – సాక్షి, వెల్త్సంస్థల్లో ఉద్యోగులు అందరికీ ఆఫర్ చేసేది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. కనుక స్టాండెలోన్ హెల్త్ప్లాన్తో పోల్చితే ఇందులో కొన్ని పరిమితులు ఉంటాయి. కంపెనీకి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ నిలిచిపోతుంది. కొనసాగింపు ప్రయోజనాలేవీ ఉండవు. పాలసీ నియమ, నిబంధనలు అన్నవి ప్రతి ఉద్యోగికి అనుకూలమైనవిగా ఉండాలని లేదు. సమ్ ఇన్సూర్డ్ (బీమా కవరేజీ) ఎంత ఉండాలి?అందులో ప్రయోజనాలు, మినహాయింపులు, నెట్వర్క్ ఆస్పత్రులు ఇవన్నీ ప్రైవేటు సంస్థ, బీమా సంస్థ కలసి తమ అంగీకారం మేరకు నిర్ణయిస్తుంటాయి. వారు ఆఫర్ చేసే ప్రయోజనాలు, పరిమితులకు ఉద్యోగులు తప్పనిసరిగా అంగీకారం తెలపాల్సిందే. ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చాలా వరకు కవరేజీ సమగ్రంగా ఉండదు. రూ.3–5 లక్షలకు మించదు. ఈ రక్షణ అందరికీ చాలకపోవచ్చు.రిటైర్మెంట్ వరకు మేల్కొనకపోతే..🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి. 🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి.ముందే ఎందుకు..? హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా, ఏ వయసులో అయినా తీసుకోవచ్చు. కానీ 20–30ల్లో తీసుకుంటే చౌక ప్రీమియంతో వస్తుంది. అన్ని రకాల కవరేజీలను పొందొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కనుక ముఖ్యమైన కవరేజీలకు సంబంధించి వెయిటింగ్ పీరియడ్ నిబంధనల గండాలను సులభంగా దాటేయొచ్చు. అందుకే ఆర్థిక నిపుణులు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణలను జోడించుకోవాలని బలంగా సూచిస్తుంటారు. పనిచేసే సంస్థ ఇచ్చే గ్రూప్ హెల్త్ ప్లాన్తో సంబంధం లేకుండా విడిగా కుటుంబం అంతటికీ వర్తించే విధంగా మెరుగైన రక్షణతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా.. మరో ఉద్యోగం వచ్చే వరకు, పదవీ విరమణ తర్వాత కూడా వ్యక్తిగత ఆరోగ్య బీమా రక్షణ నిశి్చంతగా కొనసాగుతుంది. కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో పరిమితులు ఉంటాయి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలు, రిస్్కలకు అనుగుణంగా మెరుగైన రక్షణ సదుపాయాలతో ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు.ఉదాహరణ.. 🔸 35 ఏళ్ల వయసులో రూ.10 లక్షల హెల్త్ ప్లాన్కు ప్రీమియం రూ.8,000–12,000 🔸 60 ఏళ్ల వయసులో ఇంతే కవరేజీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.40,000–80,000 చెల్లించాల్సిందే. 🔸 60ల్లో ఆరోగ్య సమస్యలతో పాలసీ కొనుగోలు కష్టం కావొచ్చు. యథార్థమిదీ.. 🔸 హైదరాబాద్కు చెందిన రమేష్ వయసు 60 ఏళ్లు. 🔸 ఒక ప్రైవేటు సంస్థలో 30 ఏళ్లు పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నాడు. 🔸 ఇప్పటి వరకు సంస్థ ఇచి్చన గ్రూప్ హెల్త్ ప్లాన్ తప్ప విడిగా ఎలాంటి రక్షణ లేదు.🔸 రమే‹Ùకు కొంత కాలం క్రితమే మధుమేహం, బీపీ బారినపడ్డాడు. 🔸 గత రెండేళ్లలోనే ఆరోగ్య సమస్యల కారణంగా అతడు రూ.6 లక్షలు తన రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ తప్పులకు దూరం దూరం..🔸 కేవలం కంపెనీ బీమాపైనే ఆధారపడడం. 🔸 ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోకపోవడం. 🔸 బీమా కొనుగోలు చేసినా, ప్రీమియం తక్కువగా ఉండడం. కోసం సమ్ ఇన్సూర్డ్ రూ.3–5 లక్షలకే పరిమితం చేయడం. 🔸 తల్లిదండ్రుల బీమా అవసరాలను విస్మరించడం. 🔸 పెరుగుతున్న ఆదాయం, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను సమీక్షించుకోకపోవడం. 🔸 హెల్త్ ఇన్సూరెన్స్ను కేవలం పన్ను ఆదా సాధనంగా చూడడం. 🔸 ఉద్యోగుల గ్రూప్ హెల్త్ ప్లాన్ను ప్రయోజనంగా కాకుండా పరిష్కారంగా చూడడం. రక్షణ అవసరమైన మేర..🔸 ప్రతి వేతన జీవి కనీసం రూ.10–20 లక్షలతో బేస్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 అది కూడా 25–35 ఏళ్ల వయసు మించకుండా తీసుకుంటనే బెటర్. 🔸 జీవిత భాగస్వామి, పిల్లలను తప్పకుండా అందులో భాగం చేయాలి. పెద్ద వయసులోని తల్లిదండ్రులు ఉంటే వారికంటూ విడిగా ప్లాన్ తీసుకోవాలి. 🔸 టాపప్ లేదా సూపర్ టాపప్ ప్లాన్తో అదనపు రక్షణను కల్పించుకోవాలి. 🔸 బేస్ పాలసీ కవరేజీ అంత డిడక్టబుల్ పెట్టుకుని రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలి. ఈ రెండింటిలో సూపర్ టాపప్ ఎక్కువ ప్రయోజనకరం. 🔸 ఒకవేళ బేస్ పాలసీ రూ.5 లక్షలు ఉంటే.. రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 దీనివల్ల ఎప్పుడైనా ఆస్పత్రిలో బిల్లు బేసిక్ కవరేజీని మించిపోతే అప్పుడు టాపప్ లేదా సూపర్ టాపప్ నుంచి చెల్లింపులు లభిస్తాయి. 🔸 రూ.5 లక్షల కవరేజీ చాలులే అనిపించొచ్చు. కానీ, వైద్య చికిత్సల చార్జీలు ఏటా 10–15 శాతం వరకు పెరుగుతున్నాయి. నేడు గుండె సర్జరీకి రూ.5 లక్షలు ఖర్చు అయితే.. పదేళ్ల తర్వాత రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 🔸 అందుకే తగినంత సమ్ ఇన్సూర్డ్తోపాటు ప్రతి మూడేళ్లకు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సమీక్షించుకోవాలి. తమ అవసరాలకు భరోసానిస్తుందా? అన్నది చూసుకోవాలి.
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు."బ్యాడ్ న్యూస్.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు1974 వరకు అమెరికా డాలర్కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అప్పుల ఊబిలో అమెరికాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం (Gold), వెండి (Silver), బిట్కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా.."1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్ను ముగించారు.BAD NEWS: History has ARRIVED.1974 was a future changing year. 1974 marked two massive changes in our world’s future.Our problem is….in 2026, our future is here.The two 1974 future changing events were:1974 the US dollar became the Petro dollar. Rather than backed by…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 4, 2026
బంగారం 'గిఫ్ట్' వచ్చిందా.. ఈ రూల్స్ తెలుసా?
ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్రతి ఇంటా బంగారంపైనే చర్చ జరుగుతోంది. 2026 మార్చిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.69 లక్షల ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి, ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులతో రూ.1.50 లక్షల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా బంగారం బహుమతులు ఇచ్చే వారు, తీసుకునే వారు తాజా పన్ను నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం.బంగారం ధరలు భారీగా పెరగడంతో, బహుమతిగా ఇచ్చే నగలు లేదా కాయిన్ల విలువ కూడా పెరిగింది. దీనివల్ల పన్ను పరిమితులు త్వరగా దాటే అవకాశం ఉంది.ఇలా వస్తే పన్ను లేదు..బంధువుల నుంచి: భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఎంత విలువైన బంగారం అందుకున్నా నయా పైసా పన్ను చెల్లించక్కర్లేదు.వివాహ కానుకలు: వివాహ సమయంలో స్నేహితులు లేదా ఇతరుల నుంచి వచ్చే గోల్డ్ గిఫ్ట్లకు పూర్తి మినహాయింపు ఉంటుంది. ధర ఎంత ఉన్నా పన్ను ఉండదు.వారసత్వ సంపద: తల్లిదండ్రుల నుంచి లేదా వీలునామా ద్వారా వచ్చే బంగారానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.ఇలా అయితే పన్ను కట్టాల్సిందే..స్నేహితులు / ఇతరుల నుంచి: బంధువులు కాని వారు ఇచ్చే బంగారం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించితే, ఆ మొత్తం విలువపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. ప్రస్తుతం బంగారం ధర రూ.1.5 లక్షలు దాటిన నేపథ్యంలో, చిన్న ఉంగరం బహుమతిగా ఇచ్చినా ఈ పరిమితి దాటే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.బంగారం అమ్మితే పన్ను ఎంత? బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం బంగారం అమ్మకంపై పన్ను (Capital Gains Tax) గణనలో స్పష్టత వచ్చింది. దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG): మీరు బంగారాన్ని 24 నెలల (2 ఏళ్లు)కంటే ఎక్కువ కాలం ఉంచుకుని అమ్మితే, వచ్చే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఇందులో 'ఇండెక్సేషన్' (ద్రవ్యోల్బణ సర్దుబాటు) ప్రయోజనం ఉండదు.స్వల్పకాలిక మూలధన లాభం (STCG): కొన్న 24 నెలల లోపే అమ్మితే, ఆ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ (Slab Rate) ప్రకారం పన్ను విధిస్తారు.సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB): మీరు నేరుగా ఆర్బీఐ నుంచి కొన్న బాండ్లను (Sovereign Gold Bonds) మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు ఉంచుకుంటే లాభంపై పన్ను ఉండదు. కానీ, సెకండరీ మార్కెట్లో కొన్న వారికి ఈ మినహాయింపు వర్తించదు.కొనుగోలుపై జీఎస్టీ అదనంబంగారం ధరలతో పాటు పన్నుల (GST) భారం కూడా ఉంటుంది. గోల్డ్ వాల్యూపై 3 శాతం, మేకింగ్ చార్జీలపై 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్పై కూడా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.నిపుణుల సూచన: బంగారం ధరలు భారీగా ఉన్నందున, పెద్ద మొత్తంలో బంగారం బహుమతిగా వచ్చినప్పుడు భవిష్యత్తులో ఐటీ నోటీసుల ఇబ్బంది లేకుండా 'గిఫ్ట్ డీడ్' (Gift Deed) రాసి ఉంచుకోవడం ఉత్తమం.ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, బంగారం ధరలు 2026 చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి పెట్టుబడి లేదా బహుమతుల విషయంలో పన్ను అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి.ఇదీ చదవండి: బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు


