Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Real Estate Land Acquisitions Fall in FY26 Anarock1
రియల్‌ఎస్టేట్‌ ప్రాజెక్టుల ల్యాండ్‌ డీల్స్‌ తగ్గాయ్‌..

రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం స్థలాల కొనుగోళ్లు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొంత నీరసించాయి. 2,994 ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇందులో సగం మేర లిస్టెడ్‌ రియల్టీ కంపెనీలు కొనుగోలు చేసినవే కావడం గమనార్హం.రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2025–26లో దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల అభివృద్ధికి కోసం గాను, 2,994 ఎకరాలకు సంబంధించి 111 భూముల కొనుగోలు లావాదేవీలు నమోదయ్యాయి. 2024–25లో 3,071 ఎకరాలకు సంబంధించి 143 లావాదేవీలు జరగడం గమనార్హం. ప్రతి రెండు లావాదేవీల్లో ఒకటి లిస్టెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ రూపంలోనే ఉన్నట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు.1,433 ఎకరాలకు సంబంధించి 54 కొనుగోలు లావాదేవీలు లిస్టెడ్‌ కంపెనీల రూపంలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వడోదర, అమృత్‌సర్, నాగ్‌పూర్, పానిపట్, మైసూర్, రాయిపూర్, కోయింబత్తూర్‌ తదితర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో భూములను సమీకరించాయి. గోద్రేజ్‌ ప్రాపర్టీస్, లోధా డెవలపర్స్, ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చురుగ్గా వ్యవహరించాయి.‘‘లిస్టెడ్‌ సంస్థలు క్రమంగా మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాయి. కస్టమర్లు బ్రాండెడ్‌ డెవలపర్ల ప్రాజెక్టుల్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుండడం వీటికి డిమాండ్‌ను పెంచుతోంది. భూముల కొనగోలు అన్నది భారీ పెట్టుబడి నియంత్రణలతో ముడిపడిన అంశం. అందుకే అసంఘటిత రంగంలోని సంస్థలు, చిన్న డెవలపర్ల కంటే లిస్టెడ్‌ రియల్టీ కంపెనీలకు సానుకూలత ఎక్కువగా ఉంటోంది’’అని అనుజ్‌ పురి వివరించారు.

Tata AIA Shubh Flexi Pension Plan Game-Changer in Retirement Planning2
టాటా ఏఐఏలో సరికొత్త పెన్షన్ ప్లాన్

నేటి కాలంలో రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం నిధిని సమకూర్చుకోవడమే కాదు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలకడగా ఆదాయం పొందే మార్గాన్ని వెతుక్కోవడం. ఈ అవసరాన్ని గుర్తిస్తూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఇటీవల 'శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్'ను తీసుకువచ్చింది. ఇది జీవితకాలం పాటు స్థిరమైన గ్యారంటీడ్ ఆదాయాన్ని అందిస్తూనే, మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను (నిఫ్టీ 50 పనితీరుకు అనుగుణంగా) మేళవించిన ఒక వినూత్న హైబ్రిడ్ రిటైర్మెంట్ సొల్యూషన్.ఈ ప్లాన్ ప్రధాన ప్రత్యేకత దాని ఫ్లెక్సిబిలిటీ. పాలసీదారులు తమ అవసరానికి తగ్గట్టుగా 60% నుండి 90% వరకు గ్యారంటీడ్ ఆదాయాన్ని, మిగిలిన 10% నుండి 40% వరకు మార్కెట్ లింక్డ్ రిటర్న్స్‌ను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, పెన్షన్ వెంటనే ప్రారంభమయ్యే లేదా గరిష్టంగా 20 ఏళ్ల వరకు వాయిదా వేసుకునే సదుపాయం ఉంది. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తాన్ని నామినీలకు తిరిగి ఇచ్చే 'రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్' ఆప్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.ప్రీమియం చెల్లింపుల విషయంలో కూడా కస్టమర్లకు వెసులుబాటు కల్పించారు. ఏకమొత్తంగా లేదా 2 నుండి 12 ఏళ్ల కాలపరిమితితో ప్రీమియం చెల్లించవచ్చు. 35 ఏళ్ల వయస్సు నుంచే ఈ ప్లానింగ్ ప్రారంభించే అవకాశం ఉండటం వల్ల, యువ ప్రొఫెషనల్స్ నుండి రిటైర్మెంట్ ముంగిట్లో ఉన్న వారి వరకు అందరికీ ఇది అనువుగా ఉంటుంది.

LPG Rules Change From May 1: Will gas cylinder prices rise again?3
ఎల్‌పీజీ మార్పులు.. మే 1 నుంచి కొత్త రూల్స్‌

దేశంలో ఎల్‌పీజీ (LPG) గ్యాస్‌ వినియోగదారులకు సంబంధించి మే 1వ తేదీ నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా ఇంధన ధరలపై పడుతోంది. ధరల పెంపుతో పాటు, మే నెల నుంచి గ్యాస్ బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఅమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ధరల భారాన్ని వినియోగదారులపై గత నెలలోనే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరపై సుమారు రూ. 60పెరిగింది. ఇ​క కమర్షియల్ వినియోగదారులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఏప్రిల్ 2026 నాటికి ఏకంగా రూ. 196 పెరిగింది. మే 1వ తేదీన చమురు సంస్థలు నిర్వహించే నెలవారీ సమీక్షలో ధరలు మరోసారి సవరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.కొత్త బుకింగ్ నిబంధనలు ఇవే!కేవలం ధరలే కాకుండా, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది.బుకింగ్ గ్యాప్: నగరాల్లో నివసించే వారు ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.OTP తప్పనిసరి: గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ఆధారిత ప్రామాణీకరణ ఇకపై శాశ్వతం కానుంది. సిలిండర్ల మళ్లింపును అరికట్టేందుకు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.ఆన్‌లైన్ బుకింగ్: ప్రస్తుతం 98% బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుండగా, మే నెల నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయనున్నారు.ఆధార్ ఈ-కేవైసీ ఎవరికి అవసరం?గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీపై (e-KYC) సామాన్యుల్లో ఉన్న గందరగోళానికి అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఆర్థిక సంవత్సరంలో ఏడు రీఫిల్స్ పూర్తయ్యాక, ఎనిమిదో సిలిండర్ నుండి సబ్సిడీ పొందాలంటే ఈ ప్రామాణీకరణ అవసరం. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.

Gold and Silver Rates Today (April 28): Check latest prices4
తగ్గుతున్న బంగారం.. మరో గుడ్‌ న్యూస్‌

దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. క్రితం రోజున ఉదయం కాస్త పెరిగిన పసిడి ధరలు సాయంత్రానికే తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఈరోజు పుత్తడి ధరలు (Today Gold Rate) మరింతగా తగ్గాయి. అలాగే నేడు వెండి ధరలు (Today Silver Rate) కూడా క్షీణించాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..

Stock Market 28 April 2026 Sensex falls 200 points5
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 42.80 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 24,049.90 వద్ద ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం ట్రేడింగ్ సెషన్ ను 208.84 పాయింట్లు లేదా 0.27 శాతం తగ్గి 77,094.79 వద్ద ప్రారంభించింది.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.24 శాతం, 0.64 శాతం పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Office Market Boom India Defies Global Uncertainty with Record Leasing6
ఆఫీసులకు భలే డిమాండ్‌.. మూడు నెలల్లో కొత్త రికార్డులు

అంతర్జాతీయంగా అనిశ్చితులున్నప్పటికీ భారత ఆఫీస్‌ మార్కెట్‌ డిమాండ్‌కు కొత్త రికార్డులకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో 21.5 మిలియన్‌ చదరపు అడుగుల స్థూల(ఎస్‌ఎఫ్‌టీ) ఆఫీస్‌ వసతుల (ఆఫీస్‌ లీజ్‌/కార్యాలయ స్థలాలు) లీజింగ్‌ లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్‌ 19.5 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగింది.ఇక నికర ఆఫీస్‌ లీజింగ్‌ (రెన్యువల్స్‌ కాకుండా) 7 శాతం పెరిగి 13.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల డేటా ఆధారంగా ఈ వివరాలను రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా విడుదల చేసింది. ప్రధానంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు విదేశీ సంస్థల నుంచి బలమైన డిమాండ్‌ ఉన్నట్టు తెలిపింది.‘‘భారత్‌ ఆఫీస్‌ మార్కెట్‌ మొదటి త్రైమాసికంలో ఇప్పటి వరకు లేనంతటి బలమైన పనితీరును పనిచేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య ఇది చెప్పుకోతగ్గ పనితీరే. అంతర్జాతీయ సంస్థలు భారతదేశాన్ని వినియోగించుకునే విధానంలో వచి్చన మౌలిక మార్పు ఈ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోంది’’అని జేఎల్‌ఎల్‌ ఇండియా ఆఫీస్‌ లీజింగ్‌ హెడ్‌ రాహుల్‌ అరోరా తెలిపారు. జీసీసీల జోరు.. విదేశీ సంస్థలు ఏర్పాటు చేసిన జీసీసీల లీజింగ్‌ 43 శాతం పెరిగి 9.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. మొత్తం లీజింగ్‌లో 45.5 శాతంగా ఉంది. ‘‘ఇవేవీ వ్యూహాత్మక బ్యాక్‌ ఆఫీస్‌లు కానేకావు. ఏఐ అభివృద్ధి, డిజిటల్‌ ఇంజనీరింగ్, ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ఆవిష్కరణల కేంద్రాలు’’అని జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక తెలిపింది. టాప్‌–7 నగరాల్లో బెంగళూరు ఆఫీస్‌ మార్కెట్‌ మెరుగైన పనితీరు చూపించింది.మార్చి త్రైమాసికంలో స్థూల లీజింగ్‌ 25 శాతం పెరిగి 5.3 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. మార్చి త్రైమాసికంలో స్థూల లీజింగ్‌లో 9.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ దేశీ సంస్థలు తీసుకున్నవే. క్రితం ఏడాది మార్చి క్వార్టర్‌తో పోల్చితే 5 శాతం పెరిగింది. దేశీ సంస్థలు తీసుకున్న లీజింగ్‌లోనూ 57.8 శాతం ఫ్లెక్స్‌ ఆపరేటర్ల రూపంలోనే ఉన్నట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement