Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India Ethanol Push Green Energy Dream or Water Crisis Nightmare1
ఇంధన దాహం.. జల వినాశం!

భారతదేశం ఇంధన స్వయంసమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి విదేశీ ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే, ఈ గ్రీన్ ఎనర్జీ ప్రస్థానం దేశాన్ని మరో పెను ప్రమాదంలోకి నెట్టేస్తోందా? అనే ప్రశ్న ప్రస్తుతం పర్యావరణవేత్తలను వేధిస్తోంది. ఒక లీటరు ఇథనాల్ తయారీకి దాదాపు 10,000 లీటర్ల నీరు ఖర్చవుతోందన్న వాస్తవం ఇప్పుడు దేశ జల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.బియ్యం నుంచి ఇంధనంప్రభుత్వం 2024-25లో ఇథనాల్ ఉత్పత్తి కోసం 52 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది. రాబోయే 2025-26 నాటికి ఈ లక్ష్యాన్ని 90 లక్షల టన్నులకు పెంచాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఆహార సరఫరా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందే విరిగిన బియ్యం వాటాను 25% నుంచి 10%కి తగ్గించనున్నారు. దీనివల్ల మిగిలిన బియ్యాన్ని నేరుగా ఇథనాల్ తయారీ డిస్టిలరీలకు మళ్లిస్తారు. అయితే, ఆహార భద్రత కంటే ఇంధన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.నీటి వినియోగం గణాంకాలు ఇలా..ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఇథనాల్ తయారీకి పంటల వారీగా నీటి వినియోగం కింది విధంగా ఉంది.పంట రకంఒక లీటరు ఇథనాల్‌కు అవసరమయ్యే నీరుబియ్యం (వరి)10,790 లీటర్లుమొక్కజొన్న4,670 లీటర్లుచెరకు3,630 లీటర్లు ఒక కిలో బియ్యం పండించడానికి సుమారు 3,000 లీటర్ల నీరు అవసరమైతే ఒక టన్ను బియ్యం నుంచి కేవలం 470 లీటర్ల ఇథనాల్ మాత్రమే లభిస్తుంది. అంటే, మనం వాహనాల్లో వాడే ఇంధనం ఎంత భారీ స్థాయిలో జల వనరులను హరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.పెరుగుతున్న కాలుష్యంనీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు నిండుకునే ప్రమాదం ఉంది. ఇటువంటి తరుణంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోనే ఇథనాల్ ప్లాంట్లు కేంద్రీకృతమవ్వడం గమనార్హం. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో తాగునీటికే కటకటలాడుతున్న స్థితిలో అక్కడ 396 కోట్ల లీటర్ల ఇథనాల్‌ సామర్థ్యం గల ప్లాంట్లు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలో కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్న ప్రాంతాల్లోనే ఇథనాల్ తయారీ జోరుగా సాగుతోంది. ఇథనాల్ మిల్లులు విడుదల చేసే వినాస్సే (Vinasse) అనే వ్యర్థ జలాలు భూమిలోకి చేరితే భూగర్భ జలాలు, ఉపరితల జలాలు పూర్తిగా కలుషితమవుతాయని కొందరు చెబుతున్నారు.వైరుధ్యాల వలయంఒకప్పుడు పంజాబ్, హరియాణా వంటి ప్రాంతాల్లోని రైతులు వరి పండించి భూగర్భ జలాలను తోడేస్తున్నారని విమర్శించిన వ్యవస్థే ఇప్పుడు అదే ధాన్యాన్ని పారిశ్రామిక స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పేరుతో ఇంధనంగా మారుస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తులో దేశాన్ని మంచినీటి చుక్క కోసం అల్లాడేలా చేసేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.క్లీన్ ఎనర్జీ లక్ష్యం గొప్పదే అయినా అది దేశ జల వనరులను బలిపెట్టేదిగా ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యం, చెరకు వంటి నీటి తీవ్రత పంటల కంటే ఇతర ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: ‘మస్క్‌ దొంగ ఏడుపు దేనికి?’

AI Layoff Trap Why Automation Could Collapse Consumer Demand2
ఏఐ ఉచ్చులో కార్పొరేట్ సంస్థలు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే కేవలం ఉత్పాదకతను పెంచే మంత్రదండం మాత్రమే కాదు, అది ఒక ప్రమాదకరమైన ఆటోమేషన్ ట్రాప్‌ అని కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని వాడుతూ ఉద్యోగులను తొలగిస్తుంటే అది చివరికి కంపెనీలకే చేటు చేస్తుందని పెన్సిల్వేనియా, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చి చెప్పారు.ఆటోమేషన్ రేసు: గెలుపెవరిది?పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన బ్రెట్ హెమెన్వే ఫాల్క్, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు గెర్రీ సౌకలాస్ సంయుక్తంగా రూపొందించిన ‘ది ఏఐ లేఆఫ్ ట్రాప్’ అనే పరిశోధనా పత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టెక్‌ సంస్థలు పోటీలో ముందుండడానికి ఆటోమేషన్‌ను విచ్చలవిడిగా వాడుతున్నాయని, ఇది చివరికి ‘అపరిమిత ఉత్పాదకత - సున్నా డిమాండ్’ అనే వినాశకర స్థితికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నాయి. కానీ ప్రజల చేతుల్లో ఉద్యోగాలు లేకపోతే మార్కెట్లో వస్తువులను కొనే శక్తి తగ్గిపోతుంది. వినియోగదారుల డిమాండ్ పడిపోతే ఆ కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు?’ అని ఈ అధ్యయనం ప్రశ్నిస్తోంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?వాస్తవ ప్రపంచ పరిస్థితులు ఈ హెచ్చరికలను బలపరుస్తున్నాయి. టెక్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగ కోతలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. 2025లో టాప్‌ కంపెనీల్లో మొత్తం 1,00,000 మంది టెక్ ఉద్యోగులను తొలగించారు. ఇందులో సగానికి పైగా కారణం ఏఐ వినియోగమే. 2026 (ఇప్పటివరకు) కేవలం నాలుగు నెలల్లోనే 98 కంపెనీలు సుమారు 92,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.పరిష్కారం ఏమిటి?యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ (యూబీఐ) లేదా రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ల వంటివి ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమేనని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. దీనికి అసలైన పరిష్కారం ‘పిగౌవియన్ ఆటోమేషన్ పన్ను’ అని పరిశోధకులు సూచిస్తున్నారు. అంటే ఆటోమేషన్ వల్ల సమాజానికి కలిగే డిమాండ్ నష్టాన్ని కంపెనీలే భరించేలా చేయడం. కేవలం లాభాల కోసమే కాకుండా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించాలని నివేదిక తెలుపుతుంది.ఏఐ సాంకేతికత మరింత శక్తివంతంగా మారుతున్న కొద్దీ కంపెనీల మధ్య పోటీ ఆటోమేషన్ రేసుగా మారుతోంది. దీన్ని ఆపడం ఒక్క కంపెనీ వల్ల సాధ్యం కాదు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సరైన విధానపరమైన పన్ను నిబంధనలు తీసుకురాకపోతే సంస్థలు తాము తవ్వుకున్న గోతిలో తామే పడే ప్రమాదం ఉంది. మేధోశక్తికి, మానవ వనరులకు మధ్య సమతుల్యత దెబ్బతింటే అది కేవలం కార్మిక మార్కెట్ సమస్యే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు.ఇదీ చదవండి: ‘మస్క్‌ దొంగ ఏడుపు దేనికి?’

Elon Musk vs Sam Altman OpenAI Battle Reaches Crucial Stage in San Francisco3
‘మస్క్‌ దొంగ ఏడుపు దేనికి?’

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్‌ ఆల్టమన్‌, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య సాగుతున్న న్యాయపోరాటం కీలక దశకు చేరుకుంది. మస్క్ దాఖలు చేసిన దావాపై కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ కోర్టులో వాదోపవాదాలు హోరెత్తుతున్నాయి. ఓపెన​్‌ఏఐ సంస్థ స్థాపన లక్ష్యాలను తుంగలో తొక్కారన్న మస్క్ ఆరోపణలు, మరోవైపు మస్క్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారన్న ఓపెన్ ఏఐ వాదనలతో ఈ కేసు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.2015లో ఓపెన్ ఏఐ స్థాపన సమయంలో ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రోక్‌మన్ వంటి దిగ్గజాలు ఒక్కటయ్యారు. అప్పట్లో మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఏజీఐ అభివృద్ధి, లాభాపేక్ష లేని పరిశోధనలు అనేవి ప్రధాన సూత్రాలుగా ఉండేవి. 2018 వరకు బోర్డులో చురుగ్గా ఉన్న మస్క్, ఆ తర్వాత సంస్థ విధానాలను వ్యతిరేకిస్తూ అందులో నుంచి వైదొలిగారు. ప్రస్తుతం కోర్టులో సాక్ష్యమిచ్చిన మస్క్, సంస్థ మూల సూత్రాల నుంచి తప్పుకుందని మండిపడ్డారు. ‘నేనే ఈ ఆలోచనను ప్రారంభించాను, పేరు పెట్టాను, కీలక నిపుణులను నియమించాను, భారీగా నిధులు సమకూర్చాను. ఇది నా బ్రెయిన్ చైల్డ్. కానీ ఇప్పుడు దాని తీరుతెన్నులే మారిపోయాయి’ అన్నారు.మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు..మస్క్ నిష్క్రమణ తర్వాత 2019లో ఓపెన్ ఏఐ ‘క్యాప్డ్ ప్రాఫిట్’ (పరిమిత లాభాపేక్ష) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. అజూర్, కోపైలట్ వంటి ఉత్పత్తుల్లో ఓపెన్ ఏఐ సాంకేతికతను వాడటంపై మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓపెన్ ఏఐ మళ్లీ పాత లాభాపేక్షలేని మోడల్‌కు మారాలి. దాదాపు 134 బిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించాలి. ప్రస్తుత నాయకత్వంలో మార్పులు జరగాలి’ అని మస్క్‌ అంటున్నారు.ఓపెన్ ఏఐ కౌంటర్మస్క్ ఆరోపణలను ఓపెన్ ఏఐ తరపు న్యాయవాది విలియం సావిట్ తీవ్రంగా ఖండించారు. సంస్థ లాభాపేక్షలేనిదిగా ఉండటానికి ఎలాంటి రాతపూర్వక ఒప్పందం లేదని ఆయన వాదించారు. ఆధునిక ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి బిలియన్ల కొద్దీ నిధులు, భారీ మౌలిక సదుపాయాలు అవసరమని అందుకే నిర్మాణంలో మార్పులు చేశామని స్పష్టం చేశారు. ‘మిస్టర్ మస్క్ కోరుకున్నట్లుగా సంస్థపై నియంత్రణ దక్కలేదు కాబట్టే ఈ దావా వేశారు. గతంలో ఆయనే స్వయంగా సంస్థపై ఎక్కువ నియంత్రణ కోసం ఒత్తిడి చేశారు. ఇప్పుడు దొంగ ఏడుపు నటిస్తున్నారు’ అని సావిట్ కోర్టుకు వివరించారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సైతం తన పాత ప్రకటనలను సమర్థించుకుంటూ.. ‘ప్రపంచస్థాయి మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి సాధారణంగా సేకరించే నిధుల కంటే ఎక్కువ మూలధనం అవసరం. మా లక్ష్యం ఎప్పుడూ మానవాళి శ్రేయస్సే’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్‌ ఆఫర్‌

UAE Exit from OPEC Shakes Global Oil Markets India Eyes Energy Independence4
ఒపెక్ నుంచి యూఏఈ ఔట్‌.. భారత్‌కు మేలే!

అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ముడిచమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ‘ఒపెక్’ నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల మధ్య భారతదేశం తన ఇంధన వనరులపై దృష్టి సారించాలని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ‘ది ఎకనామిస్ట్ ఇంపాక్ట్ రెసిలెంట్ ఫ్యూచర్స్ సమ్మిట్’లో ఆయన ప్రసంగిస్తూ గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్‌కు ఇది సానుకూల పరిణామంగా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒపెక్ పట్టు సడలుతోందా?1960లో ఏర్పాటైన ఒపెక్ అంతర్జాతీయంగా చమురు ధరలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం 12 దేశాల సభ్యత్వం ఉన్న ఈ కూటమిలో యూఏఈ 1967 నుంచి (మొదట అబుదాబిగా, తర్వాత 1971 నుంచి యూఏఈగా) కీలక భాగస్వామిగా ఉంది. మే 1 నుంచి యూఏఈ ఈ కూటమి నుంచి వైదొలుగుతుందన్న నిర్ణయం చమురు సరఫరా, ధరలపై ఒపెక్‌కు ఉన్న పట్టును బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.‘యూఏఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్లను అతలాకుతలం చేస్తుందా లేదా స్థిరీకరిస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే, భారత్-యూఏఈల మధ్య ఉన్న అసాధారణ భౌగోళిక రాజకీయ సంబంధాలు, నాయకత్వాల మధ్య ఉన్న పరస్పర నమ్మకం దృష్ట్యా ఇది భారత్‌కు మేలు చేస్తుందని భావిస్తున్నాను’ అని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ అన్నారు.యూఏఈ తన వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఒపెక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ మార్కెట్‌ను ఒక్కసారిగా ప్రభావితం చేసే అవకాశం లేదు. క్రమంగా చమురు ఉత్పత్తిని పెంచడం ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని యూఏఈ భావిస్తోంది. ఈ అనిశ్చితి కాలంలో దేశీయంగా ఇంధన వనరులను బలోపేతం చేసుకోవడమే భారత్‌కు అత్యంత కీలకమైన రక్షణ కవచం.ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..

AI Startup Anthropic Offers 3 3 cr Job Without Coding Skills5
ఆంత్రోపిక్ బంపర్‌ ఆఫర్‌

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న స్టార్టప్ ‘ఆంత్రోపిక్’ ఒక అరుదైన ఉద్యోగ ప్రకటనతో టెక్‌ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ జీతాలంటే కోడింగ్‌లో నైపుణ్యం సాధించి ఉండాలి. కానీ, ఈ కొత్త పోస్టుకు అసలు కోడింగ్ నైపుణ్యాలే అవసరం లేదు. అయినప్పటికీ, ఏడాదికి ఏకంగా 4,00,000 డాలర్లు (సుమారు రూ.3.3 కోట్లు) వరకు వేతనాన్ని ఆఫర్ చేస్తోంది.ఏమిటా కొత్త రోల్‌? బాధ్యతలు ఇవే..బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో లేదా న్యూయార్క్ కేంద్రంగా పనిచేయాల్సిన ఈ రోల్‌ ప్రధానంగా కంపెనీ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆధారపడి ఉంటుంది. చిన్నపాటి వీవీఐపీ సమావేశాల నుంచి భారీ స్థాయి టెక్ ఈవెంట్‌లను ప్లాన్ చేయడం, వాటిని అమలు చేయడం వంటివి చేయాలి. విధానకర్తలు, విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు జరపాలి. ఆంత్రోపిక్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి వాటి సాంకేతిక అంశాలను వివరించాలి. ఈ ఉద్యోగంలో 30% నుంచి 40% సమయం ప్రయాణాల్లోనే గడపాల్సి ఉంటుంది. అంటే నెలకు సుమారు 10-12 రోజులు వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది.సిలికాన్ వ్యాలీ దిగ్గజాల స్పందనఈ భారీ జీతంపై ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏఐ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ చాలా చౌకగా, సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఏదైనా ఒకటి సమృద్ధిగా లభించినప్పుడు దానికి భిన్నమైనది (అంటే మానవ సంబంధాలు, ప్రత్యక్ష ప్రదర్శనలు) అరుదుగా మారుతుంది’ అని ఆయన విశ్లేషించారు. మెషీన్ జనరేటెడ్ టెక్స్ట్ పెరిగిపోతున్న తరుణంలో మనుషుల మధ్య జరిగే లైవ్ కమ్యూనికేషన్‌కు ఉన్న డిమాండ్‌ను ఈ ఉద్యోగం ప్రతిబింబిస్తోంది.అర్హతలు, ఎంపిక విధానంఈ భారీ ప్యాకేజీని దక్కించుకోవాలంటే అభ్యర్థుల నేపథ్యం, నైపుణ్యాల వివరణ చాలా ముఖ్యం. ‘మీరు ఏఐ కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు?’ అనే అంశంపై 200 నుంచి 400 పదాలలోపు ఒక స్పష్టమైన వ్యాసాన్ని సమర్పించాలి. దీన్ని విశ్లేషించి కంపెనీ యాజమాన్యం అభ్యర్థులను మెయిల్‌ ద్వారా సంప్రదిస్తుంది.ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..

Last Minute Salary Demands Shake Corporate Hiring CEO Calls It Nonsense 6
ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..

కార్పొరేట్ ప్రపంచంలో నియామక ప్రక్రియలు ఒక్కోసారి వింత పోకడలకు వేదికవుతున్నాయి. ఒక అభ్యర్థికి ఆఫర్ లెటర్ ఇచ్చి, అతను దానికి అంగీకారం తెలిపి, ఇక విధుల్లో చేరతాడు అనే సమయానికి.. చివరి నిమిషంలో భారీ ప్యాకేజీ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'నాట్ డేటింగ్' (Knot Dating) స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జస్వీర్ సింగ్ తన కంపెనీలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఇది పూర్తిగా ‘నాన్‌ సెన్స్‌’ అన్నారు.అసలేం జరిగింది?జస్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బ్యాకెండ్ డెవలపర్ నియామకం కోసం తమ సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఓ అభ్యర్థి ప్రస్తుతం రూ.21 ఎల్‌పీఏ సంపాదిస్తున్నారు. తనకు కంపెనీ సుమారు 33 శాతం పెంపుతో ఏటా రూ.28 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది. అభ్యర్థి ఈ ఆఫర్‌ను సంతోషంగా అంగీకరించి కంపెనీలో చేరతానని ధ్రువీకరించారు. కానీ, ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. విధుల్లో చేరడానికి కేవలం రెండు రోజుల ముందు ఆ అభ్యర్థి కంపెనీకి ఒక ఈమెయిల్ పంపారు. తనకు మరో సంస్థ నుంచి రూ.32 లక్షలు ఆఫర్ వచ్చిందని, కాబట్టి తన జీతాన్ని రూ.36 లక్షలకి పెంచితేనే చేరుతానని డిమాండ్ చేశారు.‘మనం చివరిసారి మాట్లాడుకున్నప్పుడు రూ.28 లక్షలకి అంగీకరించాను. కానీ ఇప్పుడు రూ.32 లక్షలు ఆఫర్ వచ్చింది. నాకు మీ కంపెనీ అంటే ఇష్టమే అందుకే నా ప్యాకేజీని రూ.36 లక్షలకు సవరించే వెసులుబాటు ఉందేమో చూడండి. అలాగే, నేను వారాంతాల్లో పని చేయను’ అని ఆ అభ్యర్థి నిస్సంకోచంగా మెయిల్‌లో పేర్కొన్నారు.‘ఇది ప్రొఫెషనలిజం కాదు’ఈ మెయిల్ చూసి విస్మయానికి గురైన జస్వీర్ సింగ్ అభ్యర్థి ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్యాకేజీ గురించి చర్చలు జరపడం సహజమే కానీ, ఒక ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. ‘ప్రస్తుత కంపెనీలో నోటీసు పీరియడ్ ముగిసే వరకు వేచి చూసి కొత్త కంపెనీలో చేరడానికి రెండు రోజుల ముందు ఇలా డిమాండ్ చేయడం వల్ల కంపెనీ సమయం, వనరులు వృథా అవుతాయి. ఇంకా ఆఫర్ల కోసం వెతుకుతుంటే ఆ విషయాన్ని ముందే చెప్పాలి. ఇది నాన్‌సెన్స్‌’ అని జస్వీర్‌ అన్నారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘ఎక్కడ ఎక్కువ జీతం వస్తే అక్కడికి వెళ్లడం సహజం. కంపెనీలు కూడా అవసరం తీరాక ఉద్యోగులను తొలగిస్తాయి కదా, అప్పుడు లేని నైతికత ఇప్పుడెందుకు?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘ఒక మాట ఇచ్చాక తప్పడం సరికాదు. మరిన్ని ఆఫర్లు కావాలనుకుంటే అసలు ఆఫర్ లెటర్ మీద సంతకం చేయకూడదు. ఇది రిక్రూటర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’ అని మరికొందరు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: ‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’

Advertisement
Advertisement
Advertisement