Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Reserve Bank keeps repo rate unchanged at 5. 25percent1
ధరల భయం..  రేట్లు యథాతథం! 

ముంబై: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.9 శాతానికి తగ్గించింది. ప్రస్తుతానికి పరిస్థితులను సునిశితంగా గమనిస్తూ, స్పష్టత వచ్చే వరకు వేచి చూడడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. దీంతో రెపో రేటు 5.25 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతం, స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌) రేటు 5 శాతం, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్‌) రేటు 5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఇక వడ్డీ రేట్లకు సంబంధించి తన విధానాన్ని తటస్థంగానే ఆర్‌బీఐ కొనసాగించింది. ఇరాన్‌–ఇజ్రాయెల్‌/అమెరికా యుద్ధంతో ముడి చమురు ధరలు గరిష్టాలకు పెరిగిపోవడం, రూపాయి బలహీనపడడం, ఎగుమతులు/దిగుమతులకు ఏర్పడిన అవరోధాలను ఆర్‌బీఐ ఎంపీసీ ప్రస్తావించింది. ఇరాన్‌–అమెరికా కాల్పుల విరమణనను సమీక్షలో పరిగణనలోకి తీసుకున్నా మని ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా చెప్పారు. పాలసీ ముఖ్యాంశాలు.. → గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.6 శాతం కాగా, ప్రస్తుత 2026–27లో 6.9 శాతానికి పరిమితం కావొచ్చు. → పశ్చిమాసియా యుద్ధం ఎంత కాలం పాటు కొనసాగుతుంది? నష్టం ఏ మేరకు అన్నది ద్రవ్యోల్బణం, వృద్ధి రిస్‌్కలను నిర్ణయిస్తుంది. → ద్రవ్యోల్బణం 2026–27లో 4.6 శాతంగా ఉండొచ్చు. క్యూ1లో 4 శాతం, క్యూ2లో 4.4 శాతం, క్యూ3లో 5.2 శాతం, క్యూ4లో 4.7 శాతంగా అంచనా. ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతం కాగా, అసాధారణ పరిస్థితుల్లో గరిష్టంగా 6 శాతం మించకుండా చూడాలన్న విధానాన్ని అనుసరిస్తోంది.→ 2026–27లో రూపాయి డాలర్‌తో 94 వద్ద, ముడి చమురు బ్యారెల్‌కు 85 డాలర్ల వద్ద (సగటున) స్థిరపడొచ్చు. → 2025 ఫిబ్రవరి వరకు ఆర్‌బీఐ మొత్తం మీద 1.25% మేర రెపో రేటును తగ్గించడం గమనార్హం. → తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్ష జూన్‌ 3 నుంచి 5 వరకు ఉంటుంది.దీర్ఘకాలం పాటు తక్కువ రేట్లే...పశ్చిమాసియా ఘర్షణలు ఎగుమతులు, వృద్ధిని అడ్డుకోవచ్చు. ఇంధన ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో విఘాతాలు కీలక ముడి సరుకుల లభ్యతను అడ్డుకుంటుంది. ఇది వ్యవసాయం, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు. వృద్ధిని నిదానింపజేయొచ్చు. అయినప్పటికీ దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. తటస్థ విధానాన్నే కొనసాగిస్తున్నాం. మధ్యకాలం నుంచి దీర్ఘకాలం పాటు కనిష్ట వడ్డీ రేట్లే కొనసాగుతాయి. – ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా

Gold and Silver Prices Rise After US–Iran Ceasefire2
గోల్డ్‌–సిల్వర్‌ జూమ్‌.. క్రూడ్‌ క్రాష్‌

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ వాతావరణానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడటంతో బంగారం, వెండి ధరలు తిరిగి జోరందుకున్నాయి. యూఎస్, ఇరాన్‌ మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణకు తెరలేవడంతో విలువైన లోహాలకు డిమాండ్‌ పెరిగింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ వివరాల ప్రకారం స్థానిక మార్కెట్లో కేజీ వెండి రూ. 11,000 (5 శాతం) జంప్‌చేసి రూ. 2,51,000ను తాకింది. ఇక మేలిమి బంగారం సైతం 10 గ్రాములు రూ. 3,200 (2 శాతం) ఎగసి రూ. 1,56,400కు చేరింది. విదేశీ మార్కెట్లోనూ: అంతర్జాతీయ మార్కెట్లలోనూ వెండి, బంగారం మెరిశాయి. స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌ 2 శాతంపైగా (97 డాలర్లు) బలపడి 4,803 డాలర్లకు చేరింది. మరోపక్క సిల్వర్‌ ఔన్స్‌ 6% జంప్‌చేసి 77.33 డాలర్లను తాకింది. హార్మూజ్‌ను తెరిచే వీలున్నట్లు ఇరాన్‌ సంకేతాలివ్వడంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ముడిచమురు 20% క్షీణత కొద్ది రోజులుగా చుక్కలు చూపిస్తున్న క్రూడ్‌ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నౌకల రవాణాకు అడ్డంకులు తొలగనున్న అంచనాలతో చమురు ధరలు తొలుత 20% పతనమయ్యాయి. తదుపరి బ్రెంట్‌ పీపా 15.5% (17 డాలర్లు) దిగజారి 92 డాలర్లస్థాయిలో ట్రేడవుతోంది. ఇక డబ్ల్యూటీఐ పీపా 18% (20 డాలర్లు) పడిపోయి 93 డాలర్ల దిగువకు చేరింది. రూపాయికి జోష్‌ పశ్చిమాసియాలో పరిస్థితులు శాంతించడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 1%పైగా బలహీనపడి 98.5కు చేరింది. దీంతోపాటు.. దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేయడం రూపాయికి బలాన్నిచి్చనట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ 52 పైసలు పుంజుకుని 92.54 వద్ద ముగిసింది.

Sensex ends 2,946 points up, investors earn Rs 17 lakh crore in a day3
వార్‌ సీజ్‌.. బుల్స్‌ ఫైర్‌!

ముంబై: ఇరాన్‌–అమెరికా మధ్య రెండు వారాల పాటు సీజ్‌ఫైర్‌ (కాల్పుల విరమణ) ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం రాకెట్‌ వేగంతో దూసుకెళ్లాయి. సీజ్‌ఫైర్‌తో అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, క్రూడాయిల్‌ ధరలు 100 డాలర్ల దిగువకు రావడం, ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం, రూపాయి రికవరీ వంటి అంశాలు సూచీల భారీ లాభాలకు దోహదపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 2,946 పాయింట్లు (3.95%) ఎగసి 77,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 874 పాయింట్లు (3.78%) పెరిగి 23,997 వద్ద నిలిచింది. గతేడాది(2025) మే 12వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద లాభం. అలాగే వరుసగా అయిదో లాభాల ముగింపు కూడా. భారీ లాభాలతో షురూ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 2,674 పాయింట్ల లాభంతో 74,617 వద్ద, నిఫ్టీ 731 పాయింట్లు పెరిగి 23,855 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆర్‌బీఐ వరుసగా రెండోసారీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఆరంభ ఉత్సాహం ట్రేడింగ్‌ ముగిసే వరకు కొనసాగింది. ఒకదశలో సెన్సెక్స్‌ 3,019 పాయింట్లు ర్యాలీ చేసి 77,636 వద్ద, నిఫ్టీ 901 పాయింట్లు దూసుకెళ్లి 24,025 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. గడిచిన అయిదేళ్లలో సూచీలకిదే ఇంట్రాడేలో అతి పెద్ద లాభం. అంతర్జాతీయ మార్కెట్లు రయ్‌... పశ్చిమాసియాలో శాంతి పవనాలతో ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 6.43%, జపాన్‌ 5.11%, తైవాన్‌ 4.41%, ఇండోనేసియా 4.23%, హాంగ్‌కాంగ్‌ 3%, చైనా 2.62%, సింగపూర్‌ 1.39 శాతం లాభపడ్డాయి. యూరప్‌ ఫ్రాన్స్‌ 5%, సీఏసీ 4.47%, ఎఫ్‌టీఎస్‌ఈ 2.58 శాతం ర్యాలీ చేశాయి. అమెరికా ప్రధాన స్టాక్‌ సూచీలు నాస్‌డాక్‌ 2.63%, డోజోన్స్‌ సూచీ 2.49 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో రియల్టీ 6.76%, ఆటో 6.55%, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 5.79%, బ్యాంకెక్స్‌ 5.72%, ప్రైవేటు బ్యాంక్స్‌ ఇండెక్స్‌ 5.62%, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 5.48%, సర్వీసెస్‌ 5.22%, కన్జూమర్‌ డిస్క్రేషనరీ 5.11 శాతం ర్యాలీ చేశాయి. మిడ్, స్మాల్‌ సూచీలు వరుసగా 5%, 4% చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఇండిగో 8.16%, ఎల్‌అండ్‌టీ 7.64%, బజాజ్‌ ఫైనాన్స్‌ 7.03%, ఎంఅండ్‌ఎం 6.79% యాక్సిస్‌ బ్యాంక్‌ 6.56 శాతం అత్యధికంగా లాభపడిన టాప్‌–5 షేర్లుగా నిలిచాయి. టెక్‌ మహీంద్రా (–1.53%), సన్‌ఫార్మా(–0.29%), పవర్‌గ్రిడ్‌ (–0.20%) మాత్రమే నష్టపోయాయి. → గౌతమ్‌ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించడంతో అదానీ గ్రూప్‌ షేర్లు భారీ ర్యాలీ చేశాయి. అదానీ గ్రీన్‌ 11.38%, అదానీ ఎనర్జీ 8.78%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 8.62%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 7.60% ర్యాలీ చేశాయి. → ఎన్‌డీటీవీ 6.48%, అంబుజా సిమెంట్స్‌ 6.28%, అదానీ పోర్ట్స్‌ 5.28 %, ఏసీసీ 5.20%, అదానీ పవర్‌ 3.55% పెరిగాయి. అదానీ గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.14.22 లక్షల కోట్లకు చేరింది. → సీజ్‌ఫైర్‌ ఎఫెక్ట్‌తో క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో ఏవియేషన్‌ షేర్లు రివ్వున ఎగిశాయి. ఇండిగో షేరు 8.16% లాభపడింది. స్పైస్‌ జెట్‌ షేరు 5% లాభపడి రూ.11.14 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ తాకి అక్కడే ముగిసింది.రూ.16.25 లక్షల కోట్ల సంపద సృష్టి సూచీల చరిత్రలో రెండో అతిపెద్ద ర్యాలీతో స్టాక్‌ మార్కెట్లో పెద్ద ఎత్తున సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ ఒక్కరోజులో రూ.16.25 లక్షల కోట్లు పెరిగి రూ.445.51 లక్షల కోట్లకు చేరింది.

SEBI Extends Deadline for IPOs and Minimum Public Shareholding to September 20264
సెప్టెంబర్‌ వరకూ ఐపీవో గడువు పెంపు

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్‌ ఇష్యూలతోపాటు.. పబ్లిక్‌కు కనీస వాటా కేటాయింపు గడువును పెంచింది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30లోపు ముగిసిపోయే ఐపీవోల అనుమతుల గడువును 2026 సెప్టెంబర్‌30 వరకూ పొడిగించింది.ఇదేవిధంగా పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా కల్పించే నిబంధనల విషయంలోనూ 2026 సెప్టెంబర్‌ 30 వరకూ వెసులుబాటు(ఒకేసారి)కు తెరతీసింది. రెండింటికీ విడిగా సర్క్యులర్‌లను జారీ చేసింది. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30లోపు పబ్లిక్‌కు కనీస వాటా నిబంధనలను అమలు చేయవలసిన లిస్టెడ్‌ కంపెనీలకు 2026 సెప్టెంబర్‌ 30వరకూ గడువు లభించింది.గతంలో కరోనా మహమ్మారి తలెత్తిన కాలంలోనూ సెబీ ఇదేతరహా వెసులుబాటును కల్పించిన విషయం విదితమే. పశ్చిమాసియా యుద్ధ భయాల నేపథ్యంలో తలెత్తిన అనిశ్చితి, మార్కెట్‌ ఆటుపోట్లను దృష్టిలో పెట్టుకుని సెబీ గడువు పెంపునకు నిర్ణయించింది.

Amazon may cut 14000 jobs in its third big round of layoffs5
తొలగింపుల్లో టాప్‌ అమెజాన్‌

అంతర్జాతీయ టెక్‌ రంగంలో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతూనే ఉంది. గడిచిన 2025 సంవత్సరం నుంచి ఇప్పటివరకు (2026) ప్రముఖ దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజా గణాంకాల ప్రకారం, ఈ లేఆఫ్స్‌ జాబితాలో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది.అమెజాన్, ఇంటెల్ సంస్థల్లోనే అధికంవివిధ నివేదికల ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. 2025 నుంచి ఇప్పటివరకు అమెజాన్ ఏకంగా 30,184 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దీని తర్వాత చిప్‌ మేకర్ ఇంటెల్ (Intel) 27,058 మందిని, సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) 15,347 మందిని తొలగించి టాప్-3లో నిలిచాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, నిర్వహణ ఖర్చుల తగ్గింపు మరియు సంస్థాగత మార్పులే ఈ భారీ తొలగింపులకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు.కంపెనీల వారీగా తొలగింపుల వివరాలు కంపెనీ పేరుతొలగించిన ఉద్యోగుల సంఖ్య1అమెజాన్30,1842ఇంటెల్27,0583మైక్రోసాఫ్ట్15,3474హెచ్‌పీ8,0005మెటా5,8006సేల్స్ఫోర్స్5,3857బ్లాక్ (Block)4,9318నార్త్ వోల్ట్2,8009హ్యూలెట్ ప్యాకర్డ్2,55210ఆటోడెస్క్2,350ఎందుకీ కోతలు?గత రెండేళ్లుగా టెక్ పరిశ్రమలో అనిశ్చితి కొనసాగుతోంది. AI ప్రభావం: పనులను ఆటోమేట్ చేయడం వల్ల కొన్ని విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతోంది.ఆర్ధిక మందగమనం: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖర్చులను తగ్గించుకోవాలనే ఒత్తిడి కంపెనీలపై ఉంది.రీస్ట్రక్చరింగ్: లాభదాయకత లేని ప్రాజెక్టులను మూసివేసి, ప్రాధాన్యత ఉన్న రంగాలపై పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.ఈ పరిణామాలు ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తుండగా, రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్‌.. ఖండించిన కంపెనీగడిచిన రెండేళ్లుగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అమెజాన్‌ వచ్చే మే నెలలోనూ మరో భారీ రౌండ్ లేఆఫ్‌లకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని అమెజాన్‌ ఖండించింది. ఇవన్నీ అవాస్తమని, తమకు అలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.🚨 Disclosed layoffs in 2025 and 2026 so far.1. Amazon - 30,1842. Intel - 27,0583. Microsoft - 15,3474. HP - 8,0005. Meta - 5,8006. Salesforce - 5,3857. Block - 4,9318. Northvolt - 2,8009. Hewlett Packard - 2,55210. Autodesk - 2,35011. Workday - 2,15012. Synopsys -…— Indian Tech & Infra (@IndianTechGuide) April 4, 2026

CognitiveScore ai Introduces AI Based Scholarship for Students in Telangana6
ఏఐ స్కిల్స్‌పై స్కాలర్‌షిప్‌ టెస్ట్‌

తెలంగాణకు చెందిన స్టార్టప్ 'కాగ్నిటివ్‌స్కోర్.ఏఐ' విద్యను మార్కుల ఆధారిత మూల్యాంకనం నుండి మేధోశక్తి వైపు మళ్లించే లక్ష్యంతో 'కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్‌షిప్ — తెలంగాణ ఎడిషన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కీర్తి కుమార్ జైన్, విక్రమ్ సింగ్ నేగి స్థాపించిన ఈ కార్యక్రమం, ఏఐ-ఆధారిత ప్రపంచంలో అవసరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను గుర్తించి, పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.3 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ స్కాలర్‌షిప్‌లో, 20 నిమిషాల ఆన్‌లైన్, గేమిఫైడ్, అడాప్టివ్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఇది మే 2 లేదా 3, 2026న జరగనుంది. దీనికి రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 26న ముగుస్తాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇందులో పాల్గొనడం ఉచితం కాగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రూ.499 చెల్లించి నమోదు చేసుకోవచ్చు.సాంప్రదాయ పరీక్షలకు భిన్నంగా, కాగ్నిచాంప్ మేధోశక్తి, ఉన్నత స్థాయి ఆలోచనా సామర్థ్యం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఇంకా సృజనాత్మకత, సమస్య పరిష్కారం వంటి 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలను మూల్యాంకనం చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులు గుర్తింపు, 12వ తరగతి వరకు 100% ట్యూషన్ ఫీజు మద్దతుతో కూడిన స్కాలర్‌షిప్‌లు, వారి బలాబలాలపై వ్యక్తిగత అంతర్దృష్టుల వంటి అవకాశాలను పొందుతారు.ఈ కార్యక్రమం, జాతీయ విద్యా విధాన చట్రానికి అనుగుణంగా, విద్యార్థుల అభ్యసనం, అభివృద్ధిపై పాఠశాలలకు, తల్లిదండ్రులకు ఆచరణాత్మకమైన అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. ఈ ప్రారంభంతో, భారతదేశంలో భవిష్యత్తుకు సిద్ధమైన, జ్ఞానాత్మక ఆధారిత విద్యలో అగ్రగామిగా నిలవాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement
Advertisement
Advertisement