ప్రధాన వార్తలు
350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 126 పాయింట్లు పెరిగి 24,158 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 359 పాయింట్లు పుంజుకొని 77,369 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.31బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 108.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.81 శాతం పెరిగింది.నాస్డాక్ 1.03 శాతం పుంజుకుంది.Today Nifty position 06-05-2026(time: 09:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ప్రపంచంలోనే నిశ్శబ్ద ప్రాంతం అది..
టెక్ ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుసరించే ప్రశాంతమైన నాయకత్వ శైలి వెనుక ఉన్న రహస్యాన్ని రివీల్ చేశారు. దశాబ్దాల క్రితం హవాయి తీరంలో జరిగిన ఒక స్కూబా డైవింగ్ అనుభవం నేడు ప్రపంచ స్థాయి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఆయనకు ఒక దిశానిర్దేశక సూత్రంగా నిలుస్తున్నట్లు చెప్పారు.అలల గందరగోళం... అడుగున నిశ్శబ్దంచాలా ఏళ్ల క్రితం హవాయి తీరంలో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో పిచాయ్ అనుకోని చిక్కుల్లో పడ్డారు. సముద్రపు ఉపరితలంపై అలలు ఉధృతంగా ఉన్నాయి. నీటిలోకి దిగగానే సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వెనక్కి వెళ్లిపోవాలన్న ఆలోచన ఆయనకు కలిగిందట. అయితే, భయపడకుండా మరింత లోతుకు డైవ్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆయన జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందని ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘సముద్ర ఉపరితలంపై ఉన్న గందరగోళం, అలల వేగం అంతా కొన్ని అడుగుల లోతుకు వెళ్లేసరికి మాయమైపోయింది. అక్కడ అత్యంత ప్రశాంతమైన, నిశ్చలమైన వాతావరణాన్ని అనుభవించాను. ఆ క్షణం ఇంకా నా మదిలో నిక్షిప్తమై ఉంది’ అన్నారు.క్లిష్ట పరిస్థితుల్లో స్పష్టతతరువాతి కాలంలో ఆల్ఫాబెట్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన పిచాయ్ తన నాయకత్వ శైలి గురించి వివరిస్తూ తరచుగా ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటారు. గూగుల్ వంటి అతిపెద్ద సంస్థను నడపడం అంటే.. నిరంతరం మారుతున్న నిబంధనలు, కృత్రిమ మేధస్సు రంగంలో వస్తున్న పెను మార్పులు, ప్రపంచ ప్రభావం చూపే కీలక నిర్ణయాల మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ‘ఉపరితలంపై ఉండే గందరగోళానికి వెంటనే ప్రతిస్పందించడం కంటే, లోతుల్లోకి వెళ్లి స్పష్టతను వెతుక్కోవడం ముఖ్యం’ అని ఆయన విశ్వసిస్తారు. క్లిష్ట సమయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటిస్తూ దీర్ఘకాలిక ఫలితాలపై దృష్టి పెట్టడమే ఉత్తమమైన మార్గమని పిచాయ్ నిరూపించారు.సహకారంతో కూడిన నాయకత్వంసాంకేతిక రంగంలో చాలామంది దిగ్గజాలు దూకుడుగా, ఘర్షణాత్మక శైలిలో నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతుంటారు. కానీ, పిచాయ్ శైలి పూర్తిగా భిన్నమైనది. ఆయన నిర్ణయాల్లో సహకారం, అంతర్గత సమన్వయం స్పష్టంగా కనిపిస్తాయి.ప్రతి సవాలుకు ఆవేశంగా స్పందించడం కంటే, సంక్లిష్ట పరిస్థితుల్లో సమతుల్యతను కోల్పోకుండా ఉండటమే గొప్ప నాయకత్వ లక్షణమని పిచాయ్ భావిస్తారు.తక్షణ ప్రయోజనాల కోసం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయడం ఆల్ఫాబెట్ వృద్ధికి దోహదపడింది.అనిశ్చితి నెలకొన్న సమయంలో నాయకుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మొత్తం సంస్థ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని ఆయన నమ్ముతారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని తగ్గించొచ్చు
దేశ జీడీపీ వృద్ధి రేటు బలంగా ఉండడంతోపాటు స్థిరమైన ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని, నియంత్రిత శ్రేణిని ఆర్బీఐ తగ్గించొచ్చని డిప్యూటీ గవర్నర్ (డీజీ) పూనమ్ గుప్తా తెలిపారు. అంతర్జాతీయ అనుభవాల ఆధారంగా చూస్తే కొంత తక్కువ లక్ష్యాన్ని, మరింత పరిమిత శ్రేణిని నిర్ణయించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ గత ఆరేళ్ల కాలంలో మాదిరి అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఇక మీదటా కొనసాగితే అది సౌలభ్యతను, స్పష్టతను తగ్గించొచ్చన్నారు.ఆర్బీఐతో సంప్రదింపుల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2031 మార్చి 31 వరకు ఐదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా.. ప్రతికూల పరిస్థితుల్లో కనిష్టంగా 2 శాతం, గరిష్టంగా 6 శాతం (ప్లస్, మైనస్ 2 శాతం) మించకుండా చూడాలని నిర్దేశించడం గమనార్హం. ఎన్సీఏఈఆర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఈ లక్ష్యం, పరిమిత శ్రేణిని మార్చడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. ధరల నియంత్రణ, వృద్ధి రేటుపైనే భవిష్యత్తు ద్రవ్యోల్బణం కార్యాచరణ ఆధారపడి ఉంటుందన్నారు. ఇందుకు అంతర్జాతీయ షాక్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.ఆర్బీఐ డీజీగా జైన్ బాధ్యతలు స్వీకరణనలుగురు డీజీలకు పోర్ట్ఫోలియోల కేటాయింపుఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా (డీజీ) రోహిత్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఫారెక్స్, ఫిన్టెక్ సహా 10 విభాగాలను ఆయన పర్యవేక్షించనున్నారు. టి.రవి శంకర్ స్థానంలో జైన్ నియమితులయ్యారు. ఇంతకుముందు వరకు ఆయన ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. మూడేళ్ల కాలానికి డీజీగా జైన్ను ప్రభుత్వం నియమించింది. 1991లో ఆయన ఆర్బీఐలో చేరడం గమనార్హం. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (ఫైనాన్స్), ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఎంకామ్ కోర్సులను పూర్తి చేశారు. అందరిలోకి సీనియర్ డీజీ అయిన స్వామినాథన్ జానకీరామన్ 11 విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఇందులో న్యాయ, డీఐసీజీసీ, తనిఖీ తదితర విభాగాలున్నాయి. అలాగే, సమన్వయ వ్యవహరాలను కూడా ఆయనే చూడనున్నారు. మానిటరీ పాలసీ నిర్వహణ సహా ఆరు విభాగాలను పూనమ్ గుప్తా పర్యేవేక్షిస్తారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
భారత్ వృద్ధికి యుద్ధం బ్రేక్
పశ్చిమాసియా ఘర్షణలతో నౌకల రవాణాకు అటంకాలు, ఇంధన ధరల పెరుగుదల భారత జీడీపీ వృద్ధికి జోరుకు అవరోధాలు కలి్పంచొచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.5 శాతంలోపునకు తగ్గిపోవచ్చని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన ఇంధన సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధితోపాటు భారత్ వృద్ధికీ అతిపెద్ద రిస్క్గా పేర్కొన్నారు. ఒకవేళ సకాలంలో పరిష్కారమైతే అప్పుడు వృద్ధి పుంజుకుంటుందన్నారు. అప్పుడు 6.5–7 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది 6.5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చన్నారు.పశ్చిమాసియా సంక్షోభం పరిష్కారమయ్యేంత వరకు జీడీపీపై, వడ్డీ రేట్లపై ఒక నిర్ణయాత్మక అభిప్రాయానికి రాలేమన్నారు. చమురు ధరలు అధిక స్థాయిల్లో (100 డాలర్లకు పైన) ఉంటే, అది వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందన్నారు. కాకపోతే గత 10–12 ఏళ్లలో ఏవో కొన్ని సందర్భాలను మినహాయిస్తే దాదాపు చమురు ధరలు కనిష్టాల్లోనే ఉన్నాయంటూ.. అది దేశ వృద్ధికి సాయపడినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.6 శాతంగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు..వడ్డీ రేట్లు సమీప కాలంలో కిందకు దిగొచ్చే పరిస్థితుల్లేవని రాజీవ్ మెమానీ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలకు మద్దతుగా లక్ష్యిత చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా రుణసాయం విషయంలో సమస్యలున్నట్టు చెప్పారు. వ్యాపార సులభతర నిర్వహణ, చిన్న తప్పులను నేరాలుగా చూడకపోవడం, న్యాయ సంస్కరణల విషయంలో వేగవంతమైన చర్యలు అవసరమన్నారు. ఈ దిశగా గత 12–18 నెలల్లో పభుత్వం చేసిన కృషిని అభినందించారు. వివాదాల సంఖ్యను సాధ్యమైనంత తగ్గించాలని, పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని మెమానీ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి సీఐఐ సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. వృద్ధి 6.3 శాతమే: ఏడీబీపశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ముఖ్య ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ అంచనా వేశారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకుంటుందన్నారు. 2025–26లో భారత్ జీడీపీ బలంగా 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, 2027–28లో 7.3 శాతానికి పుంజుకుంటుందని.. 2026–27లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఏడీబీ ఏప్రిల్లో అంచనాలు ప్రకటించడం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం ఏప్రిల్ అంచనా కంటే 2.4 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి చేరుకోవచ్చని పార్క్ తెలిపారు. చమురు, గ్యాస్ కోసం దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేశారు.ఎల్నినో ప్రభావంఎల్నినో ప్రభావంపై మాట్లాడుతూ.. భారత్లో సాగుపై ప్రభావం పడినప్పుడల్లా ధరల పరమైన సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో పెద్ద వాటా కలిగి ఉన్నందున, భారత్లో సాగుకు ఇబ్బందులు ఏర్పడితే ప్రపంచ దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోవడం వల్ల రైతులు తక్కువగా వినియోగిస్తారని.. దీంతో దిగుమతి తగ్గి ఆ తర్వాత ఆహార లభ్యత తగ్గుతుందన్నారు. ధరలపై దీని ప్రభావం కచి్చతంగా ఉంటుందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లడం, ఇతర ఇంధన వనరుల దిగుతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం అవసరమన్నారు. అయితే భారత్లో ఎన్నో సంస్కరణలు కొనసాగుతున్నాయంటూ, వృద్ధి అవకాశాలు దీర్ఘకాలానికి ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నట్టు పార్క్ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) మెరుగుపడతాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సాయపడతాయన్నారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
ఏఐ, డ్రోన్లో ముందుంటాం
పేరు మాత్రమే కాదు. బిజినెస్ తీరునే మార్చుకుని ఆధునిక డ్రోన్, క్లౌడ్– ఏఐ సర్వేలెన్స్ రంగాల్లో వడివడిగా అడుగులేస్తున్న మగెలానిక్ క్లౌడ్ది నిన్నటిదాకా స్టోరీనే. ఇపుడు ఆ స్టోరీ కార్యాచరణలోకి వస్తోంది. తాజాగా రైల్వే సహా పలు బ్యాంకింగ్ సంస్థల నుంచి సర్వేలెన్స్ కాంట్రాక్టులు దక్కించుకుంది. డ్రోన్ల తయారీలోకి ప్రవేశించాక డిఫెన్స్ నుంచీ కాంట్రాక్టులు దక్కాయి. తమ ప్రణాళికలు పూర్తిగా ఆచరణలోకి రావటానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చంటున్న కంపెనీ సీఎండీ జోసెఫ్ సుదీర్(జో)తో ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలివీ... (రమణమూర్తి మంథా)మీ బిజినెస్ వర్టికల్స్లో ఆదాయం పరంగా ముందున్నవేంటి?ఇప్పుడైతే స్టాఫింగ్, ఐటీ సేవలనేవి మొదటి వరుసలో నిలుస్తాయి. ఏఐ–ఇన్నోవేషన్పై ఫోకస్ చేస్తుంది. ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ను రూపొందిస్తున్నాం. రెవెన్యూ పరంగా దీనిదిపుడు రెండో స్థానం. డ్రోన్ తయారీలోకి కూడా ప్రవేశించాం. లాజిస్టిక్స్, డిఫెన్స్, కమర్షియల్ సర్వీసుల కోసం కస్టమైజ్డ్ డ్రోన్లను రూపొందిస్తున్నాం. ఇపుడైతే రెవెన్యూలో ఇది చివర్లో ఉంది. కానీ వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ ఆర్డర్ పూర్తిగా మారుతుంది. మరి ఇలా మారటానికి ఇపుడేం చేస్తున్నారు?ఇప్పుడున్న దశలో ఏది ఏ స్థాయిలో అమలవుతోందో పూర్తి వివరాలు చెప్పలేను. కానీ డైరెక్షన్ క్లియర్గా ఉంది. రెవెన్యూ పనితీరు మెరుగుపరుచుకోవటంపై ఫోకస్ పెట్టాం. గడిచిన మూడు త్రైమాసికాలుగా వృద్ధికి ఒక బేస్ను తయారు చేసుకున్నాం. నంబర్స్ మాత్రం ఇపుడు చెప్పలేను. సరే! ఇప్పుడు మీ డ్రోన్ బిజినెస్ ఏ స్థాయిలో ఉంది?దీనికి సంబంధించి 15–20 కోట్ల ఆర్డర్బుక్ ఉంది. ప్రధానంగా లాజిస్టిక్స్ రంగానివే. డిజైన్ నుంచి ఏఐ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, డిప్లాయిమెంట్ వరకూ మేమే చేస్తున్నాం. అవసరాన్ని బట్టి డెలివరీకి 30–45 రోజుల నుంచి మూడు నెలల వరకూ పడుతుంది. డ్రోన్ల తయారీలోకి చాలామంది వస్తున్నారు కదా!. మీ స్పెషాలిటీ ఏంటి?మేం 200 కిలోల వరకూ పేలోడ్ను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్లను తయారు చేస్తున్నాం. అవరోధాల్ని దాటుకుని ఆటో ల్యాండింగ్ కావటం... జీపీఎస్ లేకున్నా లక్ష్యాన్ని చేరటం... ఎల్రక్టానిక్ వార్ఫేర్ను తట్టుకోగలగటం ఈ డ్రోన్ల ప్రత్యేకత. సిగ్నల్ జామ్ అయిన సందర్భాల్లో సైతం ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇంటర్నల్ నేవిగేషన్ వ్యవస్థల్ని ఉపయోగించుకుని పనిచేయటం వీటి స్పెషాలిటీ.మీ రెవెన్యూలో రికరింగ్ ఎక్కువా? లేకుంటే ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్కువా?దాదాపు 70–80 శాతం రెవెన్యూ రికరింగ్ రూపంలోనే వస్తోంది. ఇవన్నీ 3–5 ఏళ్ల దీర్ఘకాలిక కాంట్రాక్టులు. వీటివల్ల స్థిరత్వం వస్తోంది. మీ ఆర్డర్ బుక్, భవిష్యత్ వృద్ధిని వివరంగా చెబుతారా?ఈ మధ్య మేం దాదాపుగా రూ.250 కోట్ల రైల్వే కాంట్రాక్టులు దక్కించుకున్నాం. వీటిలో 10 శాతాన్ని ఇప్పటిదాకా పూర్తిచేశాం. భవిష్యత్ను దీన్నిబట్టే ఊహించొచ్చు. ప్రస్తుత మార్గాల ద్వారా రెవెన్యూలో 20 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.మీ బిజినెస్లో అంతర్జాతీయ వాటా ఎంత?గతేడాది మేం రూ.600 కోట్ల రెవెన్యూ సాధించాం. దీన్లో రూ.400 కోట్లు అంతర్జాతీయ మార్కెట్ల నుంచే వచ్చింది. దీన్లో అత్యధికం అమెరికా నుంచే వచ్చింది. అంతర్జాతీయ క్లయింట్లలో డేటా సెంటర్లు ప్రధానం. వీటికి డేటా ఇంజినీరింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందిస్తున్నాం. మీ వ్యాపారంలో ఏఐ పాత్ర ఎంతవరకూ ఉంది?అన్నిటికీ ఏఐనే ప్రధానం. ఉదాహరణకు.. బ్యాంకింగ్, ఏటీఎంలకు ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ అందిస్తున్నాం. ఆటోమేటెడ్ సర్వేలెన్స్ వ్యవస్థల్లో... రియల్టైమ్లో అలెర్ట్లు పంపటంలో... ఇంప్రూవ్మెంట్లో అన్నింట్లో ఏఐ ఉంటుంది. డ్రోన్స్, ఐటీ, సర్వేలెన్స్ ఇలా మా వెర్టికల్స్ అన్నింటా ఏఐ తప్పనిసరి. మీరు ఈ మధ్య కొన్ని కంపెనీల్ని టేకోవర్ చేశారు కదా? ఫండింగ్ ఎలా?ఎక్కువ భాగం ఫండింగ్ అంతర్గత వనరుల నుంచే సమీకరించుకున్నాం. 2023–24లో మాత్రమే కొంత మూలధనం సమీకరించాం. మొత్తంగా చూస్తే బలమైన క్యాష్ ఫ్లో నుంచే ఫండింగ్ చేస్తున్నాం. ఇటీవల డ్రోన్లకు రూ.60 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.40 కోట్లు, బ్యాంకింగ్– పీఎస్యూ ప్రాజెక్టుల కోసం రూ.100 కోట్లు కేటాయించాం. కంపెనీ వృద్ధికి సంబంధించి ఇన్వెస్టర్లు ఏం ఆశించొచ్చు?గతేడాది 600 కోట్ల రెవెన్యూ ఉంది. ఈ ఏడాది రూ.850 కోట్లకు చేరుకోవచ్చు. వచ్చే ఏడాది వెయ్యి కోట్లు దాటాలని లక్ష్యిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో 30–50 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. సేవల కంపెనీ నుంచి ప్లాట్ఫామ్ ఆధారిత, ఏఐ ఆధారిత వ్యాపారంగా ఎదుగుతున్నాం కనక ఇన్వెస్టర్లు కూడా మంచి వృద్ధిని ఆశించొచ్చు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
పీఎన్బీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14% ఎగసి రూ. 5,225 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. అంతక్రితం ఏడాది (2024–25) ఇదే కాలంలో రూ. 4,567 కోట్లు ఆర్జించింది.వాటాదారులకు బ్యాంక్ బోర్డ్ షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్ప వెనకడుగుతో రూ. 36,319 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 36,705 కోట్ల ఆదాయం సాధించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.95% నుంచి 2.95 శాతానికి, నికర ఎన్పీఏలు 0.4 శాతం నుంచి 0.29 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ షేరు బీఎస్ఈలో 0.8 శాతం నష్టంతో రూ. 108 వద్ద ముగిసింది.
కార్పొరేట్
ప్రపంచంలోనే నిశ్శబ్ద ప్రాంతం అది..
బయోకాన్ వారసురాలిగా కిరణ్ మేనకోడలు
కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
లేఆఫ్స్ వేళ ఉద్యోగుల హక్కులివే!
ఎల్పీజీపై రూ.300 తగ్గించుకోండిలా!
మెట్ గాలా 2026 అనన్యా బిర్లా లుక్ : ఫ్యాషన్ వరల్డ్ షాక్!
తెరవెనుక మస్క్ బెదిరింపులు
బీహెచ్ఈఎల్ లాభం హైజంప్
10 వేల మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దుతాం
చిన్న ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ ఊరట
బెంగాల్లో బీజేపీ విజయం: ఈ రంగాలకు ఊతం!
బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. ...
'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి....
రూ.1200 తగ్గిన గోల్డ్: కొత్త ధరలు ఇవే..
ఈ రోజు (సోమవారం) ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో స్థ...
మార్కెట్ గ్రీన్.. సన్ టీవీ రెడ్!
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్...
జీఎస్టీ వసూళ్ల రికార్డ్.. ఒక్క నెలలో రూ.2.43 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఏప్...
‘జాతీయత ఆధారంగా వివక్ష చూపకూడదు’
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ట్రంప్ అడ్మినిస్ట్...
వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి..
ఒకప్పుడు పట్టణ రవాణా వ్యవస్థను శాసించిన యాప్ ఆధారి...
ఎకానమీకి పశ్చిమాసియా సవాళ్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు భారత ఆర...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆగమనంతో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో అనిశ్చితి నెలకొంది. సాంకేతికతను సాకుగా చూపి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ ధోరణికి చైనా న్యాయస్థానాలు గట్టి అడ్డుకట్ట వేశాయి. ఏఐ నేతృత్వంలోని ఉద్యోగ తొలగింపులు ఇకపై కష్టతరమని, ఆటోమేషన్ సాకుతో కార్మిక హక్కులను కాలరాయలేమని స్పష్టం చేస్తూ వెలువరించిన వరుస తీర్పులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.నిర్వహణ కార్మిక బాధ్యతడిసెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో హాంగ్జౌ, బీజింగ్ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏఐని కేవలం ఒక సాంకేతిక మార్పుగా మాత్రమే కాకుండా, కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఒక కీలక వ్యాపార అంశంగా పరిగణించాయి. చాలా సంస్థలు ఏఐని స్వీకరించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మార్పుగా పేర్కొంటూ ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ, ఈ న్యాయస్థానాలు ఆ వాదనను తోసిపుచ్చాయి. ఆటోమేషన్ అనేది కంపెనీ తీసుకునే ఒక స్వచ్ఛంద, ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తప్ప, అనివార్య పరిస్థితి కాదని కోర్టులు తేల్చిచెప్పాయి. దానివల్ల కలిగే నష్టభారాన్ని మొత్తం ఉద్యోగులపైనే వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశాయి.హాంగ్జౌ, బీజింగ్ తీర్పుల సారాంశంహాంగ్జౌ.. టెక్నాలజీ మెరుగుపడిందనే నెపంతో హ్యూమన్-ఏఐ ఇంటర్ఫేస్పై పనిచేసే ఒక ఉద్యోగికి 40% వేతన కోతతో తక్కువ హోదా కలిగిన పదవిని ఆఫర్ చేశారు. అతను నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని సవాలు చేసిన సదరు ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పాక్షికంగా ఆటోమేషన్ జరిగినంత మాత్రాన ఒక ఉద్యోగి పాత్ర పూర్తిగా అప్రస్తుతం కాదని కోర్టు స్పష్టం చేసింది.బీజింగ్ ‘లియు’ కేసు: మ్యాప్ డేటా సేకరణలో ఆటోమేషన్ రావడంతో లేఆఫ్కు గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనం కల్పించింది. కార్మిక రక్షణ చట్టాలను దాటవేసేందుకు ఆటోమేషన్ను ఆయుధంగా వాడుకోవద్దని కంపెనీలను హెచ్చరించింది.ఈ తీర్పుల ప్రకారం, ఒక ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించాలంటే ఆ పాత్ర పూర్తిగా అసాధ్యమని కంపెనీలు నిరూపించాలి. కేవలం ‘పని మరింత సమర్థవంతంగా జరుగుతుంది’ అనే కారణంతో ఉద్యోగులను తొలగించడం ఇక చెల్లదు. కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులకు రీస్కిల్లింగ్ ఇవ్వడం, ఉద్యోగితో చర్చలు జరపడం వంటి బాధ్యతలను నెరవేర్చాలి.మన చట్టాలు ఏమి చెబుతున్నాయి?ప్రస్తుతం భారతదేశంలో ఏఐపై నిర్దిష్ట కార్మిక చట్టాలు లేనప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపాయి. 2026లో మద్రాస్ హైకోర్టు ఏఐ ఆధారిత తొలగింపును పక్కన పెట్టింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్పై అతిగా ఆధారపడవద్దని సంస్థలను హెచ్చరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం (ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్) ప్రకారం ఆటోమేషన్ వల్ల జరిగే ఉద్యోగ నష్టాన్ని తొలగింపుగా పరిగణిస్తారు. దీనికి నోటీసులు, పరిహారం తప్పనిసరి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ఉద్యోగుల డేటా వినియోగంపై ఆంక్షలు విధించింది. అలాగే, చర్చల దశలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ) బిల్లు, 2025 మానవ పర్యవేక్షణ, అప్స్కిల్లింగ్ను తప్పనిసరి చేయనుంది.సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ న్యాయస్థానాలు న్యాయం, మానవీయ విలువలు, యజమాని బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ ఆఫీస్ వర్క్ను పునర్నిర్మించవచ్చు. కానీ ఆ మార్పులో ఉద్యోగుల హక్కులను కాలరాసే హక్కు కంపెనీలకు లేదు. చైనా తీర్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థలకు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మార్కెట్లో జూదం ఆడుతున్నారు!
ఇన్వెస్టర్లూ పారాహుషార్!!
స్టాక్ మార్కెట్లో తరచూ కొన్ని థీమ్లు మెరుస్తాయి. భవిష్యత్తు అద్భుతమంటూ బ్రోకరేజ్ కంపెనీలు కొన్ని రంగాల స్టోరీలు తెరపైకి తెస్తాయి. మారుతున్న పరిస్థితులు, ప్రభుత్వ ఫోకస్, కంపెనీలు పెట్టే ఖర్చు... వీటి ఆధారంగా ఈ స్టోరీని అల్లుతారు. వీటికి నిపుణుల సిఫారసులు తోడవుతాయి. దీంతో ఆ రంగంలోని షేర్లు దూసుకుపోతాయి. సహజంగానే ఆ రంగంలోని దిగ్గజాలు ఆ ర్యాలీని లీడ్ చేస్తూ ఉంటాయి. తమాషా ఏంటంటే... అదే థీమ్ ముసుగులో ఆ రంగానికి చెందిన చిన్నాచితకా కంపెనీలు కూడా రివ్వుమంటాయి. ఫండమెంటల్స్ ఏమాత్రం లేని షేర్లు లీడర్లను మించిపోతుంటాయి. ఇదే ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆపరేటర్ల హస్తవాసితో దూసుకెళ్లే షేర్ల జోలికి చిన్న ఇన్వెస్టర్లు వెళితే... ఆ తరవాత పతనంలో అమ్ముకోవటం అంత తేలిక్కాదు. ఇదంతా ఎందుకంటే... ఇపుడు మన మార్కెట్లో డిఫెన్స్, ఏరోస్పేస్ థీమ్ నడుస్తోంది. ఏడాదిగా ఈ రంగంలోని షేర్లు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. షేరు పీఈ (షేరుకు ఆర్జన) ఏకంగా 150–200 దాటిపోతోంది కూడా. అంటే... ఆ కంపెనీ ఇంకో 200 ఏళ్లలో సంపాదించే ఆదాయానికి తగ్గట్టుగా ఆ షేరు ఇప్పుడే పెరిగిపోయిందన్న మాట. మరి ఇలాంటి షేర్ల విషయంలో జాగ్రత్తపడాలి కదా? అదెలాగో వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ఒకే ఒక్క ఏడాదిలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో ఉన్న, ఉన్నట్లు చెబుతున్న పలు షేర్లు రెండు, మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగిపోయాయి. నిజానికి ఈ రంగం లాంగ్టర్మ్ పటిష్ఠంగానే ఉంది. కొన్ని కంపెనీల ఆర్డర్ బుక్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఒక రంగం బాగుందంటే దానర్థం ఆ రంగంలోని షేర్లను ఏ ధర పడితే ఆ ధరకు కొనొచ్చని కాదు కదా? ఇలాంటి పరిస్థితుల్లో జరిగేదేమిటంటే మొదట స్టోరీ. దాంతో భారీగా రీ–రేటింగ్. ఫండ్లు, ఆ రంగంపై అవగాహన ఉన్నవారు, సమాచారం తెలిసినవారు ముందుగా ఆయా షేర్లు కొంటారు. ఇదంతా స్మార్ట్ మనీ. షేర్లు పెరుగుతాయి. అప్పుడు రిటైలర్లు కొంటారు. ఇంకా పెరుగుతాయి. ఇక దొరకవేమోనన్న భయంతో మరికొందరు రిటైలర్లు దూకుతారు. వేల్యుయేషన్లు పెరిగిపోతాయి. కరెక్షన్ ఆరంభం. అయితే ధర తగ్గటం... లేదా దీర్ఘకాలంపాటు అక్కడే కదలటం. ఇలా ఏ రకంగానైనా దెబ్బతినేది ఆలస్యంగా కొన్న రిటైలర్లే. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలో చూద్దాం... 1. ఆర్డర్ బుక్ భారీగా ఉన్నా... → డిఫెన్స్ వ్యవహారాల్లో ఎగ్జిక్యూట్ కావటానికి దీర్ఘకాలం... అంటే 3–5 ఏళ్లు పడుతుంది. → ఎగ్జిక్యూషన్ రిస్క్లు ఎక్కువ. ఆర్డర్లన్నీ ఆచరణలోకి రాకపోవచ్చు కూడా. 2. ప్రభుత్వ ప్రీమియం పెరుగుతోంది... → చారిత్రకంగా చూస్తే ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీలు 10–20 పీఈ మధ్య ట్రేడయ్యేవి. → ఇపుడైతే వాటి చారిత్రక విలువల కన్నా 5–10 రెట్లు ఎక్కువ పీఈ వద్ద ట్రేడవుతున్నాయి. 2. ఆర్జనను మించి షేరు పరుగు... → ఈ కంపెనీల ఆదాయాలు ఏటా 20 నుంచి 40 శాతం పెరుగుతున్నాయి. → కానీ ఈ కంపెనీల షేర్ల విలువ ఏడాదిలో 200–300 శాతం పెరిగిపోతోంది. ఇలాగైతే జాగ్రత్త... → స్టాక్ నిట్టనిలువుగా పెరుగుతూ వచ్చిందంటే... కొనేముందు ఆలోచించండి. → స్టాక్ ధర ఎంత ఉంది? దాని ఆదాయం ఎంత పెరుగుతోంది? అనేది చూడండి. → నిదానంగా కొనటం ముఖ్యం. ఒకేసారి మొత్తం కొంటే తరవాత కష్టం. చెయ్యాల్సిందేంటి? → కరెక్షన్ కోసం చూడండి. ఎందుకంటే షేర్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉండవు. కనీసం 30–40 శాతం తగ్గేదాకా ఎదురుచూడండి. → షేరు ధర కన్నా... కంపెనీ ఆదాయం పెరుగుదలపై ఫోకస్ పెట్టండి. → వేగంగా పెరుగుతున్న చిన్న షేర్ల కన్నా... లీడర్లపై దృష్టిపెట్టండి. లోకల్ కంపెనీల డ్రీమ్ రన్... జాగ్రత్త! తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంటార్ టెక్నాలజీస్, అపోలో మైక్రో సిస్టమ్స్, సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, బొందాడ ఇంజినీరింగ్ వంటి షేర్లు డిఫెన్స్ థీమ్తో ఇటీవల బీభత్సంగా ఎగిశాయి. ఎంటార్ షేరు ఏకంగా రెండుమూడు నెలల వ్యవధిలోనే 3–4 రెట్లు పెరిగిపోయింది. ఆదాయాలకు మించి పెరుగుతున్న ఇలాంటి షేర్లలో కరెక్షన్ వస్తే అది కూడా తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి రిటైలర్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిది. ఇవీ.. డిఫెన్స్లో లీడర్లు → హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ → భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ → భారత్ డైనమిక్స్ లిమిటెడ్ షిప్ బిల్డింగ్.. హెవీ డిఫెన్స్లో → మజగన్ డాక్ షిప్బిల్డర్స లిమిటెడ్ → కొచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ → గార్డెన్రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ ప్రైవేటు డిఫెన్స్ షేర్లు... (స్మాల్–మైక్రోకాప్) → డాటా పాటర్న్స్ ఇండియా → పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ → సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బాగా పెరిగిన తెలుగు రాష్ట్రాల షేర్లు → ఎంటార్ టెక్నాలజీస్ → అజాద్ ఇంజినీరింగ్ → బొందాడ ఇంజినీరింగ్ → సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (ఒకనాటి మెగాసాఫ్ట్) → అపోలో మైక్రో సిస్టమ్స్ (వీటిలో చాలా షేర్లు నిట్టనిలువుగా పెరిగినవని) పక్క పట్టిక చూస్తే 320 పీఈ వద్ద ట్రేడవుతున్న షేర్లు ఆరు నెలలు తిరక్కుండా ఆరేడు రెట్లు పెరిగిన షేర్లు కనిపిస్తాయి. నెలలోనే రెట్టింపయిన షేర్లూ ఉన్నాయి. మరి వీటి ఆదాయాలు ఆ స్థాయిలో పెరిగాయా? ఈ ప్రశ్నకు ఆశాజనకమైన జవాబు రాదు. ఆదాయాలు కొంత పెరుగుతూ ఉండొచ్చు. కానీ ఆదాయాలకు 10 నుంచి 20 రెట్లు షేర్లు పెరిగిపోవ టమే ఆందోళనకరం. రిటైలర్లు ఇలాంటి సమయాల్లో ఇంకా పెరుగుతాయనే ఆశతో ఎంటరయితే పడిపోయే అవకాశమూ ఉంది. ఎందుకంటే అప్పటిదాకా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరగవచ్చు. పైపెచ్చు స్టోరీ ఆధారంగా పెరిగిన షేర్లు ఆ స్టోరీ గనక నిజం కాకపోతే నేలచూపులు చూడొచ్చు. అపుడు రిటైల్ ఇన్వెస్ట ర్లు ఎంతో కొంతకు అమ్ముకుని బయటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. నష్టాలు భారీగా ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని థీమ్ల వెంట పరుగులు పెట్టవద్దన్నది నిపుణుల సలహా. ఒకవేళ మీరు గనక థీమ్ను బలంగా నమ్మితే... ఆ రంగంలో లీడర్లను ఎంచుకోవాలే తప్ప చిన్నషేర్ల వెంట క్విక్ మనీ కోసం పరుగులు పెడితే ఇబ్బందులేనన్నది గ్రహించాలి. (రమణమూర్తి మంథా)
రూ.10 వేల లోపు ఫోన్లలో నెం.1 బ్రాండ్ ఇదే..
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లను అందిస్తున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘ఐటెల్’ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మన్నిక, విశ్వసనీయతలో అగ్రస్థానంలో నిలిచింది. సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశ డివైజ్ మార్కెట్లో మన్నిక, విశ్వసనీయత, అందుబాటు ధరల ప్రాధాన్యత’ అనే నివేదికలో ఐటెల్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల 2,086 మంది వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.డ్యూరబులిటీ ఇండెక్సులో అగ్రస్థానంరూ.10,000 లోపు ధర కలిగిన మొబైల్ విభాగంలో 0.86 మన్నిక(డ్యూరబులిటీ) సూచికతో ఐటెల్ మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత శాంసంగ్ (0.79), వివో (0.72) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా ఫీచర్ ఫోన్ విభాగంలో 91% మంది వినియోగదారులు ఐటెల్ మన్నికైన బ్రాండ్ అని వెల్లడించారు. స్మార్ట్ఫోన్ విభాగంలోనూ 85% స్కోరుతో ఐటెల్ రెండో స్థానంలో నిలిచింది.నివేదికలో మరిన్ని అంశాలుదాదాపు 81% మంది వినియోగదారులు ఐటెల్ను బలమైన, మన్నికకు మారుపేరుగా భావిస్తున్నారు. 79% మంది దీని డిజైన్ సౌకర్యవంతంగా ఉందని ప్రశంసించారు. 74% మంది ఈ బ్రాండ్ను అత్యంత నమ్మదగినదిగా గుర్తించారు. 85% మంది తాము చెల్లించే ధరకు తగిన గొప్ప విలువ (వాల్యూ ఆఫ్ మనీ) లభిస్తుందని నమ్ముతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 51% మంది భవిష్యత్తులో ఐటెల్ ఫీచర్ ఫోన్ను, 30% మంది ఐటెల్ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.
టెక్ మహీంద్రా చేతికి కెనడా ఐటీ కంపెనీ
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా కెనడా కంపెనీ అల్లూరి టెక్నాలజీస్ ఇంక్(అవాంట్)ను కొనుగోలు చేయనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలుత 85% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.8 కోట్ల కెనడియన్ డాలర్లు(రూ. 171 కోట్లు) వెచి్చంచనుంది. మూడేళ్ల తదుపరి మిగిలిన 15% వాటాను ముందుగా నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోలు చేయనున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది.అవాంట్తో.. సొంత అనుబంధ కంపెనీ టెక్ మహీంద్రా కన్సల్టింగ్ గ్రూప్(టీఎంసీజీ) వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. తాజా కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో మరింత బలపడే వీలున్నట్లు తెలియజేసింది. 2029 జూన్ 30కల్లా మిగిలిన 15% వాటా సైతం దక్కించుకోనున్నట్లు వెల్లడించింది.ఈ కొనుగోలు ద్వారా ఉత్తర అమెరికా మార్కెట్లో టెక్ మహీంద్రా తన ఉనికిని మరింత సుస్థిరం చేసుకోనుంది. ముఖ్యంగా అల్లూరి టెక్నాలజీస్కు ఉన్న డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ నైపుణ్యం, టెక్ మహీంద్రా గ్లోబల్ నెట్వర్క్కు తోడవ్వడం వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాల్లో కొత్త ప్రాజెక్టులను చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది.
పర్సనల్ ఫైనాన్స్
ఆదాయపన్నుకు డెడ్లైన్!
ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పన్ను వర్తించే ఆదాయం పరిధిలో ఉన్న వారందరూ తప్పనిసరిగా చేయాల్సిన పని. అది కూడా గడువులోపు దాఖలు చేయడం ఉత్తమం. పన్ను వర్తించేంత ఆదాయం లేకపోయినా సరే, కొన్ని లావాదేవీల్లో (టీడీఎస్ తదితర) భాగస్వాములై ఉన్నా కానీ రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతేకాదు పన్ను వర్తించే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మించుతుంటే ముందస్తు పన్ను చెల్లింపుల బాధ్యత కూడా ఉంటుంది. కనుక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆదాయపన్ను నిబంధనల పాటింపునకు సంబంధించి కీలక తేదీలను ఒక్కసారి తెలుసుకుందాం.మే 2026 మే 7: ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన టీడీఎస్/టీసీఎస్ డిపాజిట్ చేయాలి. మే 15: ఏప్రిల్ నెలకు సంబంధించి శాలరీ (ఫారమ్ 16), ఇతర పేమెంట్లకు (ఫారమ్ 16ఏ) టీడీఎస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. మే 30: జనవరి–మార్చి 2026 త్రైమాసికానికి సంబంధించి టీసీఎస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. మే 31: అధిక విలువ కలిగిన ఆర్థిక లావాదేవీల నివేదిక (ఫారమ్ 61ఏ), ఆస్తి లావాదేవీల నివేదిక (ఫారమ్ 61బీ) దాఖలు చేయడానికి చివరి తేదీ. స్వచ్ఛంద సంస్థలు తమ విరాళాల నివేదికను (ఫారమ్ 10బీడీ) దాఖలు చేయాలి.జూన్ 2026 జూన్ 7: మే 2026 నెలకు సంబంధించిన టీడీఎస్/టీసీఎస్ డిపాజిట్ చేయాలి. జూన్ 15: మొదటి విడత అడ్వాన్స్ టాక్స్ (సంవత్సరం మొత్తం పన్ను బాధ్యత అంచనాలో 15శాతం) చెల్లించడానికి చివరి తేదీ. జూన్ 30: మే నెలకు సంబంధించిన టీడీఎస్ చలాన్–స్టేట్మెంట్ దాఖలు చేయాలి. ఏఐఎఫ్లు క్రితం త్రైమాసిక నివేదికలను సమరి్పంచాలి.జూలై 2026 జూలై 31: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హెచ్యూఎఫ్లు తమ ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్–1 లేదా ఐటీఆర్–2) దాఖలు చేయడానికి చివరి తేదీ.ఆగస్టు 2026 ఆగస్టు 15: ఏప్రిల్–జూన్ (క్యూ1) త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ రిటర్నులు దాఖలు చేయాలి. ఆగస్టు 31: ఆడిట్ అవసరం లేని వ్యాపార నిపుణులు ఐటీఆర్–3 లేదా ఐటీఆర్–4 దాఖలు చేయడానికి పొడిగించిన గడువు.సెప్టెంబర్ 2026 సెప్టెంబర్ 15: రెండో విడత అడ్వాన్స్ టాక్స్ (మొత్తం 45శాతం) చెల్లించడానికి చివరి తేదీ. సెపె్టంబర్ 30: జూలై–సెప్టెంబర్ (క్యూ2) త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ రిటర్నులు దాఖలు చేయాలి.అక్టోబర్ 2026 అక్టోబర్ 31: ఆడిట్ అవసరమైన వ్యాపారస్తులు, నిపుణులు తమ ఐటీఆర్–3/ఐటీఆర్–4 రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ.నవంబర్ 2026 నవంబర్ 30: అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించిన వారు ’ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్’ (ఫారమ్ 3సీఈబీ) సమరి్పంచాలి.డిసెంబర్ 2026 డిసెంబర్ 15: మూడో విడత అడ్వాన్స్ టాక్స్ (మొత్తం 75శాతం) చెల్లించడానికి చివరి తేదీ. డిసెంబర్ 31: ఆలస్యంగా దాఖలు చేసే రిటర్నులకు పెనాలీ్టతో దాఖలు చేయడానికి చివరి అవకాశం.జనవరి 2027 జనవరి 31: ఉద్యోగులు తమ పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడుల వివరాలను యజమాన్యానికి సమర్పించాలి.ఫిబ్రవరి 2027ఫిబ్రవరి 15: జనవరి నెలకు సంబంధించిన పీఎఫ్, ఈఎస్ఐ జమ చేసేందుకు గడువు.మార్చి 2027మార్చి 15: చివరి విడత అడ్వాన్స్ టాక్స్ (100 శాతం) చెల్లించడానికి గడువు. మార్చి 31: పన్ను ఆదా కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు, సవరణ రిటర్నలు, ఆలస్యపు రిటర్నుల దాఖలుకు చివరి తేదీ.
ఒక్క EMI ఎగ్గొట్టినా కష్టమే.. RBI కొత్త రూల్స్ ఎఫెక్ట్!
బ్యాంకింగ్లో రుణాల స్వరూపం తీరుతెన్నులను సమూలంగా మార్చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. సమస్య వచ్చాకా పరిష్కారం వెతుక్కోవడం కన్నా అసలు సమస్యే రాకుండా బ్యాంకులు ముందు జాగ్రత్త తీసుకునేలా ఈసీఎల్ .. అంటే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ విధానాన్ని ప్రతిపాదించింది. సరళంగా చెప్పాలంటే ఇచ్చిన రుణంపై నష్టం వచ్చే రిసు్కలను బ్యాంకులు ముందుగానే అంచనా వేసుకోగలగాలి. దానికి తగ్గట్లుగా ఆ మేరకు నిధులను పక్కన పెట్టుకోవాలి.వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ రూల్స్తో రుణాల తీరుతెన్నులు మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. సరే అదేదో బ్యాంకులకు సంబంధించిన వ్యవహారం కదా మనకేంటి అనుకుంటే పొరపాటే. దీని వల్ల రుణాలు తీసుకున్న, తీసుకోబోతున్న వారందరిపైనా ప్రభావం పడబోతోంది. ఇంతకీ, అసలు ఈ రూలేంటి.. దాని ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయనేది వివరించేదే ఈ కథనం..దశాబ్దాలుగా బ్యాంకులు తమకు ‘వాటిల్లిన నష్టం’ ప్రాతిపదికన మొండిబాకీలకు కేటాయింపులు చేసే విధానాన్ని పాటిస్తూ వస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే రుణ గ్రహీత తాను తీసుకున్న లోన్ని కొన్నాళ్ల పాటు చెల్లించక, అది బాకీగా మారితే గానీ దాన్ని మొండిపద్దు కింద వర్గీకరించడం లేదు. దాన్ని నష్టంగా పరిగణించి నిధులను పక్కన పెట్టడం లేదు. అంటే రుణ గ్రహీత విషయంలో కాస్త ఉదారంగా ఉంటున్నట్లే. ఎందుకంటే ఒకసారి మొండిపద్దుగా వర్గీకరిస్తే దాని వసూలుకు తీసుకునే చర్యలు వేరేగా ఉంటాయి. క్రెడిట్ ప్రొఫైల్పై ప్రభావమూ వేరేగా ఉంటుంది.ఒకరకంగా ముందుగానే సదరు రుణం మొండిబాకీగా మారే అవకాశాలను అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవడం కన్నా, పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కొత్తగా వచ్చే ఈసీఎల్ నిబంధనలతో ఈ వేచి చూసే ధోరణికి కాలం చెల్లిపోతుంది. బ్యాంకులు ఇకపై రాబోయే రోజుల్లో రుణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకోవాల్సి రానుంది. తలెత్తబోయే రిసు్కలను ఊహించుకుని, ముందుగానే ప్రొవిజనింగ్తో సిద్ధంగా ఉండాలి. ఎప్పుడో తీరిగ్గా స్పందించడం కాకుండా, సింగిల్ పేమెంట్ మిస్ అయినా, వెంటనే స్పందించి, క్రియాశీలకంగా చర్యలు తీసుకోవాలి.మరి దీని ప్రభావం ఏంటి.. ఇలా ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసేయడమనేది మీ నెలవారీ ఖర్చులపైనా ప్రభావం చూపనుంది. రాబోయే నష్టాల రిసు్కలను అంచనా వేసి, వాటికి అనుగుణంగా బ్యాంకులు కొంత మొత్తాన్ని పక్కన పెట్టాల్సి రావడం వల్ల, వాటికి వ్యాపారం ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. దీనితో మార్జిన్లను కాపాడుకునేందుకు అవి వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచాల్సి రావొచ్చు. ఫలితంగా మీరు కారు రుణం తీసుకోవాలన్నా.. పర్సనల్ లోన్లాంటివి తీసుకోవాలనుకున్నా వడ్డీ రేటు మరికాస్త పెరిగిపోవచ్చు.కొత్త ప్రమాణాలు..క్రెడిట్ స్కోరును పెద్దగా పట్టించుకోనివారికి ఈ కొత్త నిబంధనలు మేల్కొలుపులాంటివి. రుణం దొరకడమనేది కఠినతరమైన వ్యవహారంగా మారుతుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి క్రెడిట్ అలవాట్లను ట్రాక్ చేసేందుకు బ్యాంకులు మూడంచెల పర్యవేక్షణ విధానానికి మారతాయి. మొదటి అంచెలో, ఆరోగ్యకరమైన అకౌంట్లు ఉంటాయి. రెండో అంచెలో అప్పుడప్పుడే కాస్త స్ట్రెస్ మొదలవుతున్న దాఖలాలు కనిపించే ఖాతాలు ఉంటాయి. ఇక మూడో అంచెలో డిఫాల్ట్ అయిన ఖాతాలు ఉంటాయి. ఉదాహరణకు, మీరో రుణం తీసుకున్నారు. ఏదో కారణం వల్ల ఈఎంఐలను కట్టడంలో జాప్యం చేశారు.ప్రస్తుతమైతే బ్యాంకులు కాస్త చూసీ చూడనట్లుగా పెనాలీ్టల్లాంటివి వేసి వదిలేస్తున్నాయే గానీ ఇకపై ఇలా జరిగితే మీరు వెంటనే హై రిస్క్ కేటగిరీలోకి వెళ్లిపోతారు. ఇచ్చిన రుణం రెండో గ్రేడ్లోకి జారిన పక్షంలో తమకి జరిమానా పడే అవకాశం ఉన్నందున, బ్యాంకులు ముందునుంచే చాలా జాగ్రత్త వహిస్తాయి. తీసుకున్నవారు రెగ్యులర్గా చెల్లించకపోతున్నా, క్రెడిట్ స్కోరు పడిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నా మరింత వేగంగా స్పందిస్తాయి. మీ మీద నిఘా మరింత పెంచేస్తాయి. అంటే రాబోయే రోజుల్లో రుణగ్రహీతలు ఏవో కొన్ని ఈఎంఐలు కట్టకపోతే మహా అయితే లేట్ ఫీజు పడుతుంది అంతేగా అనుకుని లైట్గా తీసుకునే పరిస్థితి ఉండదు. అసలుకే ఎసరొస్తుంది. ఖాతాలపై మానిటరింగ్ పెరగడమే కాకుండా భవిష్యత్తులో మీరు రుణం తీసుకుందామనుకున్నా అంత తేలిగ్గా దొరక్కపోవచ్చు. వ్యవస్థకు మేలే..వ్యక్తిగత స్థాయిలో రుణాలు తీసుకున్నవారికి ఈ నిబంధనలు కఠినతరంగా అనిపించినప్పటికీ ఒక క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా విస్తృత స్థాయిలో ఆర్థిక వ్యవస్థకు మేలే జరుగుతుంది. రాబోయే తలనొప్పులను ముందుగానే గుర్తించేలా బ్యాంకులపై ఒత్తిడి పెంచడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం పటిష్టంగా అయ్యేలా ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీ బ్యాంకింగ్ సంక్షోభాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆర్థికంగా మందగమనాల్లాంటివేవైనా తలెత్తినా బ్యాంకులు ‘ఆరోగ్యకరంగా’నే ఉంటాయి. ఇక రుణాలు తీసుకున్న వారి విషయానికొస్తే.. క్రెడిట్ డిసిప్లిన్ అనేది సూపర్పవర్లాంటిది గుర్తెరిగి వ్యవహరించడం వల్ల రుణ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.‘ఆరోగ్యకరంగా’నే ఉంటాయి. ఇక రుణాలు తీసుకున్న వారి విషయానికొస్తే.. క్రెడిట్ డిసిప్లిన్ అనేది సూపర్పవర్లాంటిది గుర్తెరిగి వ్యవహరించడం వల్ల రుణ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.అంశంప్రభావంరుణ లభ్యతకాస్త కఠినతరంవడ్డీ రేట్లుస్వల్పంగా పెరగొచ్చుక్రెడిట్ డిసిప్లిన్ఇకపై మరింత కీలకంబ్యాంకింగ్మరింత పటిష్టంఏం చేయాలంటే.. ఈఎంఐలు సకాలంలో చెల్లించేయాలి. క్రెడిట్ స్కోరు బాగుండేలా చూసుకోవాలి అతిగా రుణాలు తీసుకోవడం మానేయాలి
కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లు: స్థిరమైన ఆదాయం, పిల్లల భవిష్యత్తు
న్యూఢిల్లీ: అవీవా ఇండియా ‘అవీవా సెక్యూర్ నెస్ట్ యాన్యూటీ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. సింగిల్ ప్రీమియంతో స్థిరమైన ఆదాయాన్ని పొందే పరిష్కారమే ఈ ప్లాన్ అని సంస్థ ప్రకటించింది. 80 ఏళ్ల వయసు వరకు ఈ ప్లాన్లోకి ప్రవేశించొచ్చు. ఈ ప్లాన్ కింద ఒకరికి లేదంటే ఉమ్మడిగా కవరేజీని కూడా పొందొచ్చు.మరణానంతరం నామినీలకు కొనుగోలు ధరను చెల్లించే సదుపాయం కూడా ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాన్ పనిచేస్తుందని అవీవా ఇండియా తెలిపింది. జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్ ద్వారా భరోసా ఇస్తున్నట్టు అవీవా ఇండియా ఎండీ, సీఈవో అసిత్ రథ్ తెలిపారు. బజాజ్ లైఫ్ ‘యంగ్ అచీవర్ ప్లాన్’ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదువుకునే పిల్లల పేరిట సంపద సృష్టితోపాటు, వారి భవిష్యత్ లక్ష్యాలకు కవరేజీతో కూడిన ‘బజాజ్ లైఫ్ యంగ్ అచీవర్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల కోసం కావాల్సినంత నిధిని (హామీతో కూడిన) సమకూర్చుకోవచ్చు. తల్లి/తండ్రి మరణిస్తే లేదా వైకల్యం పాలు కావడం లేదంటే ఎంపిక చేసిన 25 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్నెస్) ఏదేనీ బారిన పడితే, ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు.పాలసీ యథావిధిగా కొనసాగుతుంది. ఒకే విడత చెల్లింపులు లేదా పిల్లల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్రమానుగతంగా ఆదాయం అందుకునే ఆప్షన్లలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. 5–12 ఏళ్ల మధ్య ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులకు, చివర్లో అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలున్నాయి.
బయోమెట్రిక్తో యూపీఐ, కార్డు చెల్లింపులు
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఐమొబైల్ యాప్లో యూపీఐ లావాదేవీల నిర్వహణ కోసం బయోమెట్రిక్ ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్ప్రింట్ ధృవీకరణ ద్వారా రూ. 5,000 వరకు లావాదేవీలను చేయొచ్చని సంస్థ తెలిపింది. ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా యూపీఐ పిన్ నంబరును ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, ఫిన్టెక్ ప్లాట్ఫాం పేయూతో కలిసి కార్డు చెల్లింపులకు బయోమెట్రిక్ ధృవీకరణను అందుబాటులోకి తెచ్చినట్లు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తెలిపింది. దీనితో ఇకపైయాక్సిస్ బ్యాంక్ కార్డ్హోల్డర్లు ఫేస్ ఐడీ లేదా వేలిముద్ర ద్వారా చెల్లింపులను ఆమోదించవచ్చని పేర్కొంది.


