Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Why Multi Asset Funds are Winning Axis MF Manager Ashish Naik Explains1
మల్టీ అసెట్‌ ఫండ్స్‌తో పెట్టుబడుల్లో వైవిధ్యం..

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు మల్టీ అసెట్‌ ఫండ్స్‌కి గణనీయంగా ఆదరణ పెరుగుతున్నట్లు యాక్సిస్‌ ఎంఎఫ్‌ ఫండ్‌ మేనేజర్‌ ఆశీష్‌ నాయక్‌ తెలిపారు. ఫండ్‌ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2026 ఫిబ్రవరిలో ఈ ఫండ్స్‌లోకి రూ. 8,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దీనితో ఈ కేటగిరీ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 1.83 లక్షల కోట్లకు చేరిందని ఆయన చెప్పారు. ఫోలియోల సంఖ్య 49.1 లక్షలకు చేరినట్లు వివరించారు. వరుసగా నాలుగో నెలా హైబ్రిడ్‌ కేటగిరీకి మల్టీ అసెట్‌ అలొకేషన్‌ ఫండ్స్‌ సారథ్యం వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తరహా ఫండ్స్‌ ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీస్‌ (పసిడి లేదా వెండి)లో ఇన్వెస్ట్‌ చేస్తాయని నాయక్‌ వివరించారు. సాధారణంగా వివిధ సందర్భాల్లో వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకంగా స్పందిస్తాయని చెప్పారు. కార్పొరేట్‌ ఆదాయాలు బాగున్నప్పుడు ఈక్విటీలు పెరుగుతాయని, అలాగే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లేదా మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు డెట్‌ సాధనాలు ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు. ఇక ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నా, అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నా పసిడి పెరుగుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా దేశీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని వివరించారు. ‘‘ఈక్విటీ వేల్యుయేషన్స్‌ భారీ స్థాయిలో పెరిగిపోగా, వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని డెట్‌ ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. గ్లోబల్‌గా అనిశి్చతితో కమోడిటీల రేట్లపై అనిశ్చితి నెలకొనడం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది’’ అని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకే సాధనంలో ఇన్వెస్ట్‌ చేసిన వారికన్నా మల్టీ అసెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన మదుపరుల పోర్ట్‌ఫోలియోల్లో ఒడిదుడుకులు కొంత తక్కువగా ఉన్నట్లు వివరించారు. ఇలా ఒకే ఫండ్‌ ద్వారా వివిధ అసెట్స్‌కి కేటాయింపులు జరిపే వ్యూహం దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు గుర్తిస్తున్నారని నాయక్‌ చెప్పారు. అయితే, ఈ కోవకి చెందిన ఫండ్స్‌ అన్నీ ఒకే రకంగా పని చేయవని గుర్తుంచుకోవాలని సూచించారు. కొన్ని ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపితే మరికొన్ని బ్యాలెన్స్‌డ్‌గా లేదా వ్యవహరిస్తాయని చెప్పారు. అలాగే కేవలం బుల్‌ మార్కెట్‌కే పరిమితం కాకుండా గతంలో వివిధ పరిస్థితుల్లో ఫండ్‌ ఎలా పని చేసిందనేది కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.

FundsIndia Hits Rs 25000 Crore AUM Milestone Records 58pc Annual Growth2
ఫండ్స్‌ఇండియా ఏయూఎం రూ.25,000 కోట్లు

బెంగళూరు: ఫండ్స్‌ ఇండియా రూ.25,000 కోట్ల నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) మైలురాయిని అధిగమించింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏయూఎం రూ.20వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు వృద్ధి చెందడందో ఇది సాధ్యపడింది. ముఖ్యంగా ఏడాది కాలంలో నిర్వహణ ఆస్తులు 58 శాతం పెరగ్గా.. మూడేళ్లలోనూ ఏటా 38 శాతం చొప్పున వృద్ధి చెందినట్టు సంస్థ ప్రకటించింది.గత 12 నెలల్లో ఫండ్స్‌ ఇండియా రూ.2,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. సంస్థ నిర్వహణ ఆస్తుల్లో 77 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు చెందినవే. 23 శాతం మేర ధనవంతులకు చెందిన ఆస్తులు ఉన్నాయి. 30 లక్షల యూజర్లకు ఫండ్స్‌ ఇండియా ప్లాట్‌ఫామ్‌ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. సిప్‌ బుక్‌ రూ.142 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది.

The IPO Party is Over High Hype and Low Returns Drive Small Investors Away3
ఆచితూచి... ఐపీఓలకు!

గత ఏడాది ఐపీవోల జోరు మామూలుగా లేదు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు పండుగలా అనిపించింది. చాలా మటుకు ఇష్యూలు లిస్టింగ్‌ రోజున భారీగానే లాభాలు ఇచ్చాయి. దీనితో ఏ కంపెనీ ఇష్యూ వచ్చినా 50రెట్లు.. 100 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయిపోయేవి. లిస్టింగ్‌ లాభాల కోసం అప్లై చేసుకోవడమనేది ఒక వ్యూహంగా మారిపోయింది. కానీ ఇప్పుడు అదే రిటైల్‌ ఇన్వెస్టర్లు.. ఐపీవో అంటే వెనక్కి తగ్గుతున్నారు. ఇష్యూలు పూర్తిగా సబ్ర్‌స్కయిబ్‌ కావడం లేదు. లిస్టింగ్‌లు నిరాశపరుస్తున్నాయి. ధీమా దెబ్బతింది. అందుకేనేమో! తాజాగా ఐపీఓకి వచ్చిన ప్రభుత్వ సంస్థ కోల్‌ ఇండియా అనుబంధ కంపెనీని సైతం రిటైలర్లు పట్టించుకోలేదు.ఈ పరిస్థితికి ప్రధాన కారణం సెంటిమెంటే. 2025లో ఐపీఓలు విజయవంతం కావడానికి ఇదే సెంటిమెంటు కారణమయితే... ఇప్పుడు రిటైలర్లు చాలా ఐపీఓలకు దూరంగా ఉండటానికి కూడా సెంటిమెంటే కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కొన్ని ఐపీఓల్లో రిటైర్లు తక్కువమంది ఇన్వెస్ట్‌ చేసినా... వారు కంపెనీల ఫండమెంటల్స్‌ చూసే ముందుకొస్తున్నారనే భావన ఉంది. ఏడాది వ్యవధిలోనే పరిస్థితి ఎందుకిలా మారిపోయింది? దీనికి కారణాలేమిటి? చిన్న ఇన్వెస్టర్ల ఆలోచనేంటి? ఏం చేస్తే బెటర్‌? అనే అంశాలసమాహారమే ఈ ‘సాక్షి’ వెల్త్‌ స్టోరీ... – సాక్షి, వెల్త్‌గతంలో ఐపీవో లిస్టయ్యిందంటే చాలు తక్కువలో తక్కువగా 20 శాతం నుంచి 50 శాతం వరకు లాభాలు పక్కా అనే విధంగా ఉండేది. అందుకే రిటైలర్ల విభాగంలో ఒక్కో ఇష్యూ 50 రెట్లు, 100 రెట్లు ఓబర్‌ సబ్ర్‌స్కయిబ్‌ అయ్యేది. నిజానికిలా ఓవర్‌ సబ్‌్రస్కయిబ్‌ అయినపుడు నూటికి 90 శాతం మందికి షేర్లు అలాట్‌ కావు. కానీ... అలాట్‌ అయితే లాభాలొస్తాయి కదా అనే ఆశతో ఒక్కొక్కరూ తమ కుటుంబీకులకు ఎన్ని ఖాతాలుంటే అన్ని ఖాతాల్లోనూ దరఖాస్తు చేసేవారు. కొద్దిరోజులు తమ క్యాపిటల్‌ లాకిన్‌లో ఉండటానికి కూడా ఇష్టపడేవారు. చివరికి అలాట్‌ అయి లిస్టింగ్‌ లాభాలొస్తే హ్యాపీ. కాదంటే నిట్టూర్పు. కానీ ఇటీవల చాలా ఐపీఓలు లిస్టింగ్‌లో పెద్దగా లాభాలివ్వలేదు. ఇష్యూ ధరకు సమానంగా ఫ్లాట్‌గానో లేకపోతే ఒక్కోసారి అంతకన్నా తక్కువకే లిస్టవుతున్నాయి. దీనితో ఐపీవోలో అలాట్‌ అయితే చాలు లాభాలు గ్యారంటీ అనే అభిప్రాయం తొలగిపోయింది.ఓవర్‌ప్రైసింగ్‌..చాలా మటుకు కంపెనీలు తమ అసలు వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ఐపీవోలకు ధర నిర్ణయిస్తున్నాయి. బులిష్‌ సెంటిమెంటుని క్యాష్‌ చేసుకుని, బయటపడిపోయేందుకు ప్రమోటర్లు ప్రయతి్నస్తున్నారనే అపవాదు ఉంది. చాలా ఐపీఓల పరిస్థితి ఇదే అయినా... ఇటీవల లెన్స్‌కార్ట్‌ వంటి ఐపీఓలపై తీవ్రమైన ఆరోపణలొచ్చాయి కూడా. అందుకే రిటైల్‌ ఇన్వెస్టర్లకి ఇలాంటి వాటిల్లో ఎంట్రీ చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని, రాబడులపై స్పష్టత ఉండదని అర్థమవుతోంది. లిస్టింగ్‌కి ముందు.. తర్వాత..కొన్ని కంపెనీల లెక్కల మాయాజాలమో, యాదృచ్ఛికమో అర్థం కావటం లేదు కానీ.. ఐపీఓకి రావటానికి ముందు ఒకటి రెండేళ్లు అద్భుతమైన పనితీరును చూపిస్తున్నాయి. అంతకుముందు చాలా ఏళ్లు ఆ పరిస్థితి లేకపోవటం గమనార్హం. దీంతో ఆ రెండేళ్ల లెక్కలను చూపిస్తూ.. భవిష్యత్తు సూపర్‌ అంటూ ఊదరగొడుతున్నాయి. అది నమ్ముకుని కొనుక్కుంటే, ఆ తర్వాత వాస్తవం బోధపడుతోంది. లిస్టింగ్‌ అయిన తర్వాత ఎరి్నంగ్స్‌ తీరు చూస్తే భయపెట్టేదిగా ఉంటోంది. ఇటీవల కొన్ని డ్రోన్‌ కంపెనీలు ఇదే బాగోతాన్ని కళ్లకుకట్టాయి.మారిన మార్కెట్‌ పరిస్థితులుఇరాన్‌ యుద్ధ ప్రభావం కావచ్చు,. అంతకుముందు అమెరికా టారిఫ్‌ల వ్యవహారం కావచ్చు. ఇవన్నీ మార్కెట్లను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఒకటి తరువాత ఒకటిగా చుట్టుముడుతున్న అంతర్జాతీయ పరిణామాలతో ఎఫ్‌ఐఐలు భారత మార్కెట్లలో తమ షేర్లను అమ్ముతూనే వస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో జరిపిన అమ్మకాలకు దీటుగా దేశీ ఫండ్లు కొనుగోళ్లు చేసినప్పటికీ... ఇపుడు తాజా ఇరాన్‌ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. మార్కెట్లు భారీ కరెక్షన్‌కు గురయ్యాయి. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. ఇక లిక్విడిటీ కూడా కష్టంగా మారుతుండటంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు స్పెక్యులేషన్‌ కన్నా క్షేమంగా ఉండటమే మిన్న అనే ధోరణికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరేం చెయ్యాలి?పరిస్థితులు ఇలా మారినంత మాత్రాన ఐపీవో మార్కెట్‌ మొత్తానికే కుప్పకూలిందనుకోవడానికి లేదు. తాజాగా వస్తున్న ఐపీఓల్లో రిటైలర్ల పాత్ర తగ్గినా పూర్తిగా పోలేదు. కొన్ని ఇష్యూల్లో ఫండ్లతో పాటు పెద్ద ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇది మార్కట్‌పై, సదరు కంపెనీలపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పాలి. ఈ వ్యవహారంపై దేశీ మ్యూచువల్‌ ఫండ్‌ దిగ్గజం ఒకరు స్పందిస్తూ... ‘‘గతంలో అందరికీ డబ్బులొచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని విషయాలు క్షుణ్నంగా తెలుసుకుని, ముందడుగు వేసే ఇన్వెస్టర్లకే వస్తున్నాయి. అది రిటైల్‌ ఇన్వెస్టర్లయినా... హెచ్‌ఎన్‌ఐలయినా’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.

The Impact of War on the Stock Markets: What Investors Need To Know4
యుద్ధ పరిస్థితులే దిక్సూచి

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణమే దిక్సూచిగా నిలవనుంది. యుద్ధ భయాలు తగ్గితే ఇన్వెస్టర్లకు రిలీఫ్‌.. పెరిగితే మరింత ఆందోళన అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. దేశీయంగా ఈ వారం ట్రేడింగ్‌ మూడు రోజులకే పరిమితంకానున్నప్పటికీ భారీ స్థాయిలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ శ్రీ మహావీర్‌ జయంతి సందర్భంగా మంగళవారం(31న) దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. గుడ్‌ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(ఏప్రిల్‌ 3న) సైతం పనిచేయవు. వెరసి ఈ వారం ట్రేడింగ్‌ మూడు రోజులకే పరిమితంకానుంది. అయినప్పటికీ పలు కీలక అంశాలు మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం గత వారాంతాన మరింత విస్తరించింది. కాల్పుల విరమణ లేదా దాడులకు పాజ్‌ అంటూ యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. వారాంతన పరిస్థితులు క్షీణించడంతో నేడు(30న) మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గణాంకాల ఎఫెక్ట్‌ ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. జనవరిలో ఐఐపీ 4.8 శాతం ఎగసింది. మార్చి నెలకు గురువారం(ఏప్రిల్‌ 2న) హెచ్‌ఎస్‌బీసీ తయారీ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో ఈ వారం చైనా తయారీ పీఎంఐ, ద్రవ్యోల్బణ డేటా విడుదలకానుంది. మరోపక్క యూఎస్‌ తయారీ పీఎంఐ, రిటైల్‌ అమ్మకాలు, ఉపాధి, నిరుద్యోగిత తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ధరలపై ఆందోళన వెలిబుచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు అంచనాలు ఏర్పడ్డాయి. వెరసి దేశ, విదేశీ గణాంకాలకూ ప్రాధాన్యమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చమురు, రూపాయి ఇటీవల బ్రెంట్‌ ముడిచమురు పీపా ధర లండన్‌ మార్కెట్లో 102–110 డాలర్ల మధ్య కదులుతోంది. దీంతో దేశీ క్రూడ్‌ బాస్కెట్‌ 140–150 డాలర్లస్థాయికి చేరుతోంది. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు కారణంకానుంది. దేశీ చమురు అవసరాలకు దిగుమతులపైనే అధికంగా ఆధారపడటంతో ఈ ప్రభావం రూపాయినీ దెబ్బతీస్తోంది. గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఏకంగా 95 స్థాయికి దిగజారిన విషయం విదితమే. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా, ఎన్‌రిచ్‌ మనీ సీఈవో పొన్మూడి ఆర్‌. తెలియజేశారు. అయితే మార్కెట్లు కుదురుకుంటే షార్ట్‌కవరింగ్‌కూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలకుతోడు విదేశీ స్టాక్‌ మార్కెట్లలో పరిస్థితులు సైతం కీలకంగా నిలవనున్నట్లు ప్రస్తావించారు.భారీ అమ్మకాలు.. ఈ నెలలో మరోసారి అమ్మకాల యూటర్న్‌ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీస్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల 2–27 మధ్యకాలంలో రూ. 1.14 కోట్ల విలువైన(12.3 బిలియన్‌ డాలర్లు) దేశీ స్టాక్స్‌ విక్రయించా రు. వెరసి మా ర్చిలో మార్కెట్ల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఇంతక్రితం 2024 అక్టోబర్‌లో అత్యధికంగా రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. ఇందుకు పశ్చిమాసియా యుద్ధం, రూపాయి బలహీనత, చమురు ధరలు, వడ్డీ రేట్ల ఆందోళనలు ప్రభా వం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో గత 17 నెలల్లోలేని విధంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన సంగతిగత 4 రోజుల్లో..నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్‌లో గత వారం సైతం(వరుసగా ఐదో వారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నికరంగా నష్టాలతోనే నిలిచాయి. సెన్సెక్స్‌ 950 పాయింట్లు(1.3 శాతం) పతనమైంది. 73,583 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 295 పాయింట్లు(1.3 శాతం) కోల్పోయి 22,820 వద్ద స్థిరపడింది. మార్కెట్లను మించుతూ బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 2.2 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. సాంకేతికంగా చూస్తే.. ఈ వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. 22,300–22,200 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఈ స్థాయి నుంచి జోరందుకుంటే 23,500–23,700 పాయింట్లకు చేరే అవకాశముంది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నీరసిస్తే 72,800కు చేరవచ్చు. అమ్మకాలు కొనసాగితే ఆపై 72,250వరకూ క్షీణించే వీలుంది. ఈ స్థాయి నుంచి బలపడితే 76,000 పాయింట్లస్థాయివైపు ప్రయాణించవచ్చు.స్టాక్స్‌ వ్యూఇండిగో పెయింట్స్‌బ్రోకరేజ్‌: మిరాయ్‌ అసెట్‌ షేర్‌ఖాన్‌ , కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 731, టార్గెట్‌: రూ. 1,350ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఇండిగో పెయింట్స్‌ కన్సాలిడేటెడ్‌ ఆదాయం 5 శాతం మెరుగుపడి రూ. 359 కోట్లకు చేరింది. ఇందుకు అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో స్టాండెలోన్‌ బిజినెస్‌ వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 339 కోట్లను తాకడం సహకరించింది. ప్రధానంగా అనుబంధ సంస్థ యాపిల్‌ కెమీ(రూ. 20 కోట్లు) వృద్ధి సైతం దన్నునిచ్చింది. రుతుపవనాలు కొనసాగడం, ముందుగానే దీపావళి పండుగ అయిపోవడం కారణంగా అక్టోబర్‌లో అమ్మకాలు మందగించాయి. ఎమల్షన్స్‌ అమ్మకాల పరిమాణం 3.4 శాతం, విలువ 0.2 శాతం చొప్పున క్షీణించాయి.అయితే ఎనామిల్స్, ఉడ్‌ కోటింగ్స్‌ అమ్మకాలు 20 శాతం, విలువ 19 శాతం చొప్పున జంప్‌చేశాయి. పుట్టీ, సిమెంట్‌ పెయింట్స్‌ అమ్మకాల పరిమాణం 2 శాతం, విలువ 5.5 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ఇక ప్రైమర్స్, డిస్టెంపర్స్‌ తదితరాల అమ్మకాలు 7.4 శాతం, విలువ 12.5 శాతం చొప్పున ఎగశాయి. ఉత్తమ మిక్స్, తగ్గిన ముడివ్యయాల కారణంగా స్థూల మార్జిన్లు 46.8 శాతం వద్ద నిలకడను చూపాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు(ఓపీఎం) 2.36 శాతం మెరుగుపడి 19 శాతంగా నమోదయ్యాయి.ఇందుకు ప్రకటనలు, ప్రమోషనల్‌(ఏఅండ్‌పీ) వ్యయాలు తగ్గడం తోడ్పాటునిచ్చింది. వార్షికంగా ఇవి 2.6 శాతం తగ్గి 5.6 శాతానికి పరిమితమయ్యాయి. పెయింట్ల పరిశ్రమలో క్రమానుగత రికవరీకితోడు.. వివిధ మార్కెట్లలో విస్తరించడం, సామర్థ్య పెంపు ఆదాయంలో వృద్ధికి దన్నుగా నిలవనున్నాయి. ముడివ్యయాలలో తగ్గుదల, నిలకడ కారణంగా సమీప కాలంలో లాభదాయకతకు మద్దతు లభించనుంది. రానున్న రెండేళ్ల కాలం(2026–27, 2028)లో వార్షికంగా ఆదాయం 9 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున పురోగమించగలవని భావిస్తున్నాం.ఎంఎం ఫోర్జింగ్స్‌బ్రోకరేజ్‌: ఆనంద్‌ రాఠీ రీసెర్చ్‌ ,కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 400 , టార్గెట్‌: రూ. 600ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఎంఎం ఫోర్జింగ్స్‌ అంచనాలకు అనుగుణంగా రూ. 72 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. వార్షికంగా ఇది 2 శాతం క్షీణతకాగా.. రానున్న రెండేళ్లలో కంపెనీ పనితీరు మెరుగుపడే అవకాశముంది. వార్షిక ప్రాతిపదికన 2026–28 కాలంలో ఆదాయం 13 శాతం, ఇబిటా 18 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా. ఈ కాలంలో దేశీయంగా భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన(ఎంఅండ్‌హెచ్‌సీవీ) అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకోనున్నట్లు భావిస్తున్నాం.ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోగతి, జీఎస్‌టీ రేట్ల సంస్కరణలతో పటిష్టమవుతున్న రీప్లేస్‌మెంట్‌ డిమాండ్‌ సహకరించే వీలుంది. వీటికితోడు లోబేస్‌ కారణంగా విదేశాలలో వాణిజ్య వాహన(సీవీ) రంగ అమ్మకాలు ఊపందుకోనున్నాయి. పర్యావరణ నిబంధనల అమలుకంటే ముందుగానే చేపట్టనున్న కొనుగోళ్లు ఇందుకు మద్దతివ్వనున్నాయి. అయితే సమీప కాలంలో అంతంతమాత్ర పనితీరు ప్రదర్శించనున్నప్పటికీ.. తాజా ఆర్డర్ల ప్రభావంతో ఆదాయంలో పరిశ్రమను మించిన వృద్ధిని సాధించనుంది. విభిన్న ప్రొడక్టులు, అధిక మెషీనింగ్‌కుతోడు భారీ ఫోర్జింగ్స్‌ మిక్స్‌ ఇందుకు తోడ్పాటునివ్వనున్నాయి.అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో అధిక ఎగుమతుల కారణంగా స్టాండెలోన్‌ ఆదాయం 11 శాతం ఎగసి రూ. 405 కోట్లను తాకింది. దేశీ ఆదాయం 14 శాతం బలపడి రూ. 256 కోట్లకు చేరింది. ఎగుమతులు 7 శాతం పుంజుకుని రూ. 148 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మార్జిన్లు 4.4 శాతం క్షీణించి 53 శాతానికి పరిమితంకాగా.. నికర లాభం 19 శాతం నీరసించి రూ. 26 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలో ఈపీఎస్‌ 8 శాతంమేర నీరసించవచ్చు. అయితే 2026–27, 2028లలో 12–16 శాతంమేర మెరుగుపడవచ్చని అంచనా.గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే

Income tax rules 2026: key changes from April 15
తెలుసా! ఐటీ రూల్స్‌ మారాయి...

ఆదాయపన్ను కొత్త చట్టం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కొత్త పన్ను ప్రయోజనాల్లేకపోయినా.. ఉన్న వాటిల్లో వేతన జీవులు తప్పకుండా తెలుసుకోవాల్సిన కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంటి అద్దె భత్యం, పిల్లల విద్య కోసం చేసే ఖర్చులపై మరింత అదనపు ప్రయోజనం దక్కనుంది. యాజమాన్యం సమకూర్చే కారు, ఇంటి సేవలపై పన్ను బాధ్యతలు పెరగనున్నాయి. బ్యాంకుల్లో నగదు జమలు, నగదు ఉపసంహరణల నుంచి.. ప్రాపర్టీ కొనుగోలు సమయంలో పాన్‌ సమరి్పంచడం వరకు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాహన కొనుగోళ్ల విషయంలోనూ పాన్‌ నిబంధనలు మారాయి. హోటల్‌ బిల్లులు, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ఒక పరిమితి దాటతే పాన్‌ సమరి్పంచాలి. ఇంటి యజమానితో తనకున్న సంబంధాన్ని కిరాయిదారు వెల్లడించాల్సిందే. ఇలా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను పరంగా వస్తున్న ముఖ్యమైన మార్పుల సమాహారమే ఈ వెల్త్‌ స్టోరీ...ఇప్పుడు హైదరాబాద్‌ వాసులకూ మరింత మెరుగైన హెచ్‌ఆర్‌ఏ పన్ను ప్రయోజనం అందుబాటులోకి వస్తోంది. ఈ నగరంలోని వేతన జీవులకు ఇప్పటి వరకు వేతనంలో భాగంగా పొందే ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)పై పన్ను మినహాయింపు 40 శాతంగానే ఉండేది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లోని వేతన జీవులకు మాత్రమే 50 శాతం పన్ను మినహాయింపు నిబంధన వర్తిస్తోంది.ఏప్రిల్‌ 1 నుంచి ఈ జాబితాలో కొత్తగా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు చేరనున్నాయి. దీంతో మొత్తం ఎనిమిది నగరాల పరిధిలోని వారు హెచ్‌ఆర్‌ఏపై మరింత అధిక ప్రయోజనం పొందే అవకాశం రానుంది. కొత్త ఆదాపన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి ఈ ప్రయోజనం లేదు. పాత పన్ను విధానంలో రిటర్నులు సమరి్పస్తున్న వారు హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇదీ ఫార్ములా.. హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపునకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 10(13ఏ) కింద వీటిని పేర్కొన్నారు.ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)⇒ యాజమాన్యం నుంచి వాస్తవంగా అందుకుంటున్న నెలవారీ హెచ్‌ఆర్‌ఏ మొత్తం. ⇒ ఇక్కడ పేర్కొన్న ఎనిమిది మెట్రోల్లో నివసించే వారికి మూలవేతనం, డీఏ మొత్తంలో 50 శాతం, ఇతర మెట్రోల్లోని వారికి 40 శాతం. ⇒ వాస్తవంగా చెల్లించిన అద్దె మొత్తం నుంచి మూల వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా వచ్చే మొత్తం. ఉదాహరణకు మూలవేతనం రూ.30వేలు ఉంటే.. ఇందులో 10% రూ.3,000 అవుతుంది. ప్రతి నెలా రూ.10,000 అద్దె చెల్లిస్తున్నట్టు అయితే ఇందులో రూ.3,000 మినహాయించగా రూ.7,000 వస్తుంది. నోట్‌: ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే సంవత్సరం మొత్తం మీద ఆ మేరకు పన్ను మినహాయింపును ఆదాయం నుంచి క్లెయిమ్‌ చేసుకోవచ్చు.ఈ ప్రయోజనానికి ఇవి తప్పనిసరి.. ⇒ వేతన జీవులై ఉండాలి. ⇒ సీటీసీలో హెచ్‌ఆర్‌ఏ భాగంగా ఉండాలి. ⇒ అద్దె ఇంట్లోనే నివసిస్తూ ఉండాలి. ⇒ ఇంటి అద్దెకు సంబంధించి రుజువులు ఉండాలి. ⇒ పాత పన్ను విధానంలోనే రిటర్నులు వేయాలి.వాహన అలవెన్స్‌లుయాజమాన్యాలు ఉద్యోగుల అధికారిక, వ్యక్తిగత వినియోగానికి సమకూర్చే కార్ల విషయంలోనూ పన్ను పరంగా మార్పులు రానున్నాయి. 1. ఉద్యోగే కారును సొంతంగా కలిగి ఉండడం లేదా అద్దెకు తీసుకున్న సందర్భాల్లో.. అయ్యే వ్యయాలను పనిచేసే సంస్థ భరిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో.. ⇒ ఇంజన్‌ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ప్రతి నెలా రూ.5,000తోపాటు, అదనంగా డ్రైవర్‌ కోసం చేసే ఖర్చు రూ.3,000పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ ఇంజన్‌ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ప్రతి నెలా రూ.7,000తోపాటు, డ్రైవర్‌ కోసం చేసే చెల్లింపులు రూ.3,000 పన్ను పరిధిలోకి వస్తాయి. 2. ఒకవేళ కారును యాజమాన్యం కొనుగోలు చేసి లేదా కిరాయికి తీసుకుని ఉద్యోగికి సమకూర్చిన సందర్భాల్లో.. ⇒ ఇంజన్‌ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ప్రతి నెలా రూ.2,000తోపాటు డ్రైవర్‌కు చెల్లింపుల పేరిట రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాలి. ⇒ ఇంజన్‌ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ప్రతి నెలా రూ.3,000తోపాటు డ్రైవర్‌కు చెల్లింపుల పేరిట రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 3. ఒకవేళ ఉద్యోగి స్వయంగా సమకూర్చుకున్న కారుపై యాజమాన్యం నిర్వహణ అలవెన్స్‌ చెల్లిస్తున్నట్టయితే.. ⇒ ఇంజన్‌ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ఉద్యోగి కారు కోసం వాస్తవంగా చేసిన వ్యయం నుంచి రూ.5,000 మినహాయించగా వచ్చే మొత్తంపై పన్ను చెల్లించాలి. డ్రైవర్‌ కోసమూ యాజమాన్యం చెల్లింపులు చేస్తుంటే మరో రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ⇒ ఇంజన్‌ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ఉద్యోగి కారు కోసం వాస్తవంగా చేసిన వ్యయం నుంచి రూ.7,000 మినహాయించగా వచ్చే మొత్తంపై... డ్రైవర్‌ పేరిట మరో రూ.3,000పైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ ఒకవేళ కారును పూర్తిగా అధికారిక అవసరాల కోసమే వినియోగించినట్టయితే, అటువంటప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంటి సేవలు, యుటిలిటీలు..⇒ స్వీపర్లు, గార్డెనర్లు, వాచ్‌మెన్‌ వేతనాల కోసం ఉద్యోగులకు యాజమాన్యాలు చేసే వాస్తవ చెల్లింపులపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ గ్యాస్, విద్యుత్, నీటిని ఇతర సంస్థల నుంచి పొందినట్టయితే, ఆయా సర్వీస్‌ ప్రొవైడర్లకు ఉద్యోగి చేసిన వాస్తవ చెల్లింపులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం తన సొంత వనరుల నుంచి వీటిని అందించినట్టయితే అప్పుడు ఒక్కోయూనిట్‌కు అయ్యే వాస్తవ వ్యయంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ⇒ ఒక సంవత్సరంలో పనిచేసే సంస్థ నుంచి పొందిన బహమతులు లేదా గిఫ్ట్‌ వోచర్ల విలువ రూ.15,000 మించితే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ పనిచేసే సమయంలో సంస్థ ఉద్యోగులకు ఆహారం, పానీయాలను ఉచితంగా పెయిడ్‌ వోచర్ల రూపంలో అందిస్తుంటే ఆ మొత్తంపై పన్ను ఉండదు. ఒక్కో భోజనం ఖర్చు గరిష్ట పరిమితి రూ.200.పిల్లల విద్య, హాస్టల్‌ ప్రయోజనాలుపిల్లల విద్యకు సంబంధించి చేసే ఖర్చులపై మరింత పన్ను మినహాయింపునకు ఇకమీదట అవకాశం లభించనుంది. నెలవారీ ఒక్కొక్కరికి ఉన్న రూ.100 పరిమితి రూ.3,000కు పెరగనుంది. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు సంబంధించి ఈ మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అలాగే, హాస్టల్‌ కోసం చేసే వ్యయాలపై ప్రస్తుతం ఉన్న నెలవారీ రూ.300 కాస్తా రూ.9,000కు పెరగనుంది. అంటే ఇంత మొత్తంపై ఇకనుంచి పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టం, 2026లోని 280 నిబంధన కింద ఈ ప్రయోజనాలను పొందుపరిచారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఈ ప్రయోజనం ఒకే విధంగా అమలు కానుంది. రుజువులు అవసరం..⇒ ఆదాయపన్ను చట్టం నిబంధనలు, 2026 కింద పాత పన్ను విధానంలో పలు పన్ను మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోవాలని భావించే వారు తప్పకుండా డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుంది. ⇒ హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌ కోసం ఆర్థిక సంవత్సరంలో అద్దె చెల్లింపులు రూ.1,00,000 దాటితే అప్పుడు ప్రాపర్టీ యజమాని పేరు, చిరునామా, పాన్, అతడితో ఉన్న సంబంధం (రెంటల్‌ అగ్రిమెంట్‌) రుజువులు చూపించాలి. ⇒ లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ కోసం ప్రయాణాలకు అయిన వ్యయాల రుజువులు సమరి్పంచాలి. ⇒ ‘ఇంటి ప్రాపర్టీ ఆదాయం’ నుంచి వడ్డీని మినహాయింపు క్లెయిమ్‌ చేసుకునేట్టు అయితే గృహ రుణదాత పేరు, చిరునామా, పాన్‌ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. వీటిల్లోనూ మార్పులు..⇒ బ్యాంకుల్లో రూ.50,000కు మించి నగదు డిపాజిట్‌ చేయాలంటే ప్రస్తుతం పాన్‌ జిరాక్స్‌ కాపీ ఇవ్వాల్సి వస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు జమలు, ఉపసంహరణల లావాదేవీల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే పాన్‌ ఇస్తే సరిపోతుంది. ⇒ ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు/విక్రయం, ఉమ్మడి అభివృద్ధి (జాయింట్‌ డెవలప్‌మెంట్‌) లావాదేవీ విలువ రూ.20 లక్షలు మించితే పాన్‌ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. ⇒ ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇతర అన్ని వాహన కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా పాన్‌ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి ఏ వాహనం కొనుగోలు చేస్తున్నా.. రూ.5 లక్షలకు మించితే పాన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ హోటల్‌ లేదా రెస్టారెంట్‌ బిల్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, బాంక్వెట్‌ హాల్స్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు చెల్లింపులు రూ. లక్షకు మించితే పాన్‌ సమర్పణ తప్పనిసరి. ⇒ జీవిత బీమా పాలసీల కొనుగోలు సమయంలో ఇకమీదట పాన్‌ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమల్లో ఉంది.

Skoda Kodiaq Recalled Over Faulty Front Seat Frame6
స్కోడా రీకాల్.. 221 కార్లపై ఎఫెక్ట్!

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా.. తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన స్కోడా కోడియాక్‌కు రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 221 యూనిట్లపై పడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.స్కోడా కోడియాక్‌లోని ముందు సీట్ల లోపలి ఫ్రేమ్‌కు సంబంధించిన లోపం కారణంగా కంపెనీ రీకాల్ జారీ చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం, మార్చి 10 నుండి డిసెంబర్ 8, 2025 మధ్య తయారైన మొత్తం 221 యూనిట్లు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఈ సమస్య ముందు సీట్ల లోపలి ఫ్రేమ్ అంచులో ఉంది. ఈ లోపం వల్ల.. సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నప్పుడు రక్షణ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు, ఇది సైడ్ ఎయిర్‌బ్యాగ్ సామర్థ్యాన్ని తగ్గించి, తద్వారా వాహనంలో ఉన్నవారికి గాయాలయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.రీకాల్ ప్రభావానికి ప్రభావితమైన కార్ల యజమానులను కంపెనీ సంప్రదించనుంది. రీకాల్ ప్రక్రియలో భాగంగా అవసరమైన తనిఖీలు, సమస్యలను పరిష్కరించనుంది.స్కోడా కొడియాక్రెండవ తరం కోడియాక్ గత సంవత్సరం ఏప్రిల్‌లో భారతదేశంలో విడుదలైంది. ఇది 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ల TSI టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 7-స్పీడ్ DSG (డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్) ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. పనితీరు పరంగా, ఈ SUV 201 bhp, 320 Nm గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.కోడియాక్ ధర వేరియంట్, కాన్ఫిగరేషన్‌ను బట్టి మారుతుంది. ఈ ఎస్‌యూవీ ధర ప్రస్తుతం రూ. 39.99 లక్షల నుంచి రూ. 45.95 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. అదే సమయంలో, స్పోర్ట్‌లైన్ మరియు ఎల్&కె వేరియంట్ల వంటి నిర్దిష్ట ట్రిమ్‌ల ధరలు వరుసగా రూ. 46.89 లక్షలు, రూ. 48.69 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement