Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

From Poverty to Global Talent Hub zoho Sridhar Vembu Journey India Transformation1
నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు!

‘1980వ దశకంలో దేశం విడిచి వెళ్లేటప్పుడు నా మనసులో ఒకటే ప్రశ్న.. మనం ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నాం? కానీ నేడు అదే భారత్ ప్రపంచానికి టాలెంట్ హబ్‌గా మారింది. ఒకప్పుడు సంస్థను స్థాపించడం గగనమైతే, నేడు అది అత్యంత సులభతరమైంది’ ఇవి ప్రముఖ ఐటీ దిగ్గజం, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యక్తం చేసిన భావాలు. సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న తన జీవిత అనుభవాలు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.నిరాశ నిండిన కాలం అది..శ్రీధర్ వెంబు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, 1989లో తాను ఐఐటీ మద్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పటి పరిస్థితులను వివరించారు. ఆ సమయంలో పంజాబ్, కశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాలు అశాంతితో రగులుతుండేవన్నారు. ‘అప్పట్లో ఐఐటీయన్లు దేశం దాటి వెళ్లడమే ఏకైక మార్గంగా భావించేవారు. నేను దేశాన్ని వదిలి వెళ్తున్నప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడ నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు’ అని ఆయన ఆనాటి సామాజిక, రాజకీయ స్థితిగతులను గుర్తుచేశారు.వృథా అవుతున్న ప్రతిభఇంజినీరింగ్ చదువుతున్నప్పటికీ వెంబు దృష్టి అంతా ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రంపైనే ఉండేది. ‘మనం ఎందుకు పేదవాళ్లం?’ అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆయన దశాబ్దాల పాటు అన్వేషించారు. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘భారతదేశం పేద దేశంగా ఉండటానికి కారణం మనం మన ప్రతిభను భారీ స్థాయిలో వృథా చేయడమే’ అని విశ్లేషించారు. జోహో సంస్థను ఏ గొప్ప నేపథ్యం లేని సామాన్య భారతీయులతోనే నిర్మించామని, అటువంటి ప్రతిభ భారత్‌లో ప్రతిచోటా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ టాలెంట్‌ను సరైన దిశలో ఉపయోగిస్తే దేశం అద్భుతమైన సంపదను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సంస్కరణల పర్వం1989 నాటికే తాను సోషలిస్టు విధానాలకు వ్యతిరేకిగా మారానని వెంబు తెలిపారు. 1991 సంక్షోభం సమయంలో విదేశీ మారక నిల్వలు అడుగంటి, ఐఎంఎఫ్ వద్ద బంగారం కుదువ పెట్టాల్సిన దుస్థితి నుంచి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వరకు ఆయన ప్రస్తావించారు. సోవియట్ యూనియన్ పతనం, చైనాలో అశాంతి వంటి అంశాలు తన ఆలోచనా దృక్పథాన్ని మార్చాయని చెప్పారు.In the 1980s, most IITians would go abroad. In 1989, when I graduated from IIT Madras, I remember feeling extremely dejected about our country. Punjab, Kashmir and Assam were all burning. My heart was not in engineering. I was mostly reading books in Economics and Philosophy -…— Sridhar Vembu (@svembu) April 22, 2026నేటి భారతం అవకాశాల గనిప్రస్తుత పరిస్థితులపై ఆయన ప్రశంసలు కురిపించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సంస్థను ప్రారంభించడం చాలా సులభమని, తక్కువ ఖర్చుతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రపంచ స్థాయి కంపెనీలను నిర్మించవచ్చని ఆయన ఉదహరించారు. ‘మనం ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో కూడిన జీవన ప్రమాణాలు ఉన్న చోట నుంచి కూడా కంపెనీలను మొదలు పెట్టవచ్చు. మీ దగ్గర ప్రతిభ ఉంటే భారతదేశంలో ఏదైనా సాధించవచ్చు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Microsoft Historic Buyout AI Future Reshapes Workforce2
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ‘బైఅవుట్‌’!

ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన 51 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలతో టెక్ పరిశ్రమ రూపురేఖలు మారుతున్న తరుణంలో అమెరికాలోని తన సిబ్బంది కోసం మైక్రోసాఫ్ట్ ‘వాలంటరీ బైఅవుట్’ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకుంటూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేసింది.ఏమిటీ బైఅవుట్?సాధారణంగా కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా కొన్ని విభాగాలను మూసివేస్తున్నప్పుడు లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) ప్రకటిస్తాయి. కానీ, బైఅవుట్ అనేది దీనికి భిన్నమైనది. కంపెనీ బలవంతంగా ఉద్యోగం తీసివేయడం కాకుండా, ఉద్యోగులే స్వచ్ఛందంగా తప్పుకునేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడే వారికి ఒకేసారి భారీ నగదు, పొడిగించిన బీమా సదుపాయాలు, పదవీ విరమణ ప్రయోజనాలను ఆఫర్ చేస్తారు. లేఆఫ్స్ వల్ల వచ్చే వ్యతిరేకతను నివారించడానికి ఉద్యోగులకు గౌరవప్రదమైన రీతిలో వీడ్కోలు పలికేందుకు కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి.మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఎవరికి? అర్హతలు ఏమిటి?కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఈ వన్ టైమ్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో దాదాపు 7% మందికి వర్తించనుంది. సీనియర్ డైరెక్టర్ స్థాయి, అంతకంటే తక్కువ కేడర్‌లోని ఉద్యోగులు దీనికి అర్హులు. ఇన్సెంటివ్ ఆధారిత సేల్స్ విభాగాల్లో ఉన్నవారికి ఈ అవకాశం లేదు. ‘అర్హులైన ఉద్యోగులు తమ భవిష్యత్తు నిర్ణయాలను సొంతంగా, కంపెనీ అందించే ఆఫర్‌ను తమ ఇష్టపూర్వకంగా పొందేలా ఈ కార్యక్రమం రూపొందించారు’ అని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ పేర్కొన్నారు.అసలు సమస్య ఏమిటి?టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ఏర్పాటుపై భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన వనరులను పాత తరం సాఫ్ట్‌వేర్ సేవల నుంచి ఏఐ వైపు మళ్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వేగంగా పెరుగుతున్న ఏఐ పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవడానికి శ్రామిక శక్తిని సర్దుబాటు చేస్తున్నారు. ఏఐ ఆటోమేషన్ వల్ల ప్రభావితమయ్యే పాత్రల నుంచి సిబ్బందిని తగ్గించి, కొత్త టెక్నాలజీకి అనుగుణంగా టీమ్స్‌ను పునర్నిర్మిస్తున్నారు. పనితీరు సమీక్షలను సరళీకృతం చేస్తూనే నైపుణ్యం గలవారిని నిలుపుకోవడానికి స్టాక్ ఆధారిత రివార్డులను ఇస్తున్నారు.జూన్ 2025 నాటికి మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులను కలిగి ఉండగా అందులో 1,25,000 మంది అమెరికాలోనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దఫాలుగా తొలగింపులు చేసిన ఈ కంపెనీ ఇప్పుడు బైఅవుట్ ద్వారా మానవీయ కోణంలో మార్పునకు శ్రీకారం చుట్టింది. ఖర్చుల తగ్గింపుతోపాటు ఏఐ భవిష్యత్తు కోసం ఒక కంపెనీ తనను తాను సిద్ధం చేసుకుంటున్న తీరుకు ఇది నిదర్శనం.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Strengthen Systems Against AI Risks FM Sitharamans Mandate to PSB Heads3
ఏఐ డేంజర్‌.. బ్యాంకులకు ఆర్థిక మంత్రి కీలక సూచన

కృత్రిమ మేథ (ఏఐ) సరికొత్త నమూనాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ఫైనాన్షియల్‌ సిస్టమ్‌లలో లోపాలను ఆంథ్రోపిక్‌ మైథోస్‌ ఏఐ మోడల్‌ సులభంగా గుర్తించగలదన్న ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.ఎన్నో ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో లోపాలను గుర్తించినట్టు ఆంథ్రోపిక్‌ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ఏఐ రూపంలో ఆర్థిక వ్యవస్థకు వచ్చే రిస్క్‌లను ఎదుర్కొనే చర్యలు, సైబర్‌ భద్రతపై ఈ సమావేశంలో లోతుగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ సిస్టమ్‌లను మరింత పటిష్టంగా మార్చుకునే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సీతారామన్‌ సూచించినట్టు చెప్పాయి.ఆర్‌బీఐ, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, బ్యాంక్‌ల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉల్లంఘనల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే రిస్క్‌లపై ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్టు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.ప్రధాన ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు, వెబ్‌ బ్రౌజర్‌లలో 27 ఏళ్ల నాటి లోపాలతో సహా వేలాది బగ్స్‌ను గుర్తించి, వాటిని వినియోగించుకునే విషయంలో మనుషుల కంటే మెరుగ్గా ‘మైథోస్‌’ ఏఐ మోడల్‌ రాణించగలదని ఆంథ్రోపిక్‌ పేర్కొనడం గమనార్హం. దీంతో యూఎస్‌ ఫెడ్‌ సహా పలు కేంద్ర బ్యాంక్‌లు ఏఐ ముప్పులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తుండడం తెలిసిందే.

Warren Buffett Timeless Rules for Mutual Fund Investors in Volatile Markets4
వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్

మ్యూచువల్ ఫండ్స్ అనగానే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి. అదే సమయంలో కొంత ఆందోళన కనిపిస్తుంది. సరైన ఫండ్‌ను ఎంచుకోవడానికి మేధావి అయి ఉండాలని, మార్కెట్ గమనాన్ని ప్రతిరోజూ గమనించాలని చాలామంది భావిస్తుంటారు. అయితే, ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే వారెన్ బఫెట్ సిద్ధాంతాలు దీనికి భిన్నంగా ఉంటాయి. 94 ఏళ్ల వయసులోనూ బెర్క్‌షైర్ హాత్వేను విజయపథంలో నడిపిస్తున్న ఆయన పెట్టుబడి అనేది విజ్ఞానం కంటే కూడా క్రమశిక్షణతో కూడిన వ్యవహారమని నమ్ముతారు. నేటి అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలిచే బఫెట్ సూత్రాలపై ప్రత్యేక కథనం.పెట్టుబడి కాల పరిమితి‘ఒకవేళ స్టాక్ మార్కెట్ పదేళ్లపాటు మూతపడినా మీరు నష్టపోని కంపెనీలనే ఎంచుకోవాలి’ అన్నది బఫెట్ నియమం. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో తరచుగా ఫండ్లను మార్చడం వల్ల చక్రవడ్డీ లాభాన్ని కోల్పోతారు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్‌ను ఎంచుకుని దానికి దశాబ్దాల పాటు కట్టుబడి ఉండటమే అసలైన విజయం.మేధస్సు కంటే క్రమశిక్షణ ముఖ్యంపెట్టుబడి పెట్టడానికి ఐక్యూ 160 ఉండాల్సిన అవసరం లేదు. కేవలం భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే చాలని బఫెట్ అంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా పెరిగినప్పుడు అత్యాశ చెందకుండా సిప్‌లను కొనసాగించడమే అత్యుత్తమ వ్యూహం.రోజూ మార్కెట్‌ను గమనించకండిస్టాక్ మార్కెట్ అనేది అసహనంగా ఉన్న వ్యక్తి నుంచి ఓపికగా ఉన్న వ్యక్తికి డబ్బు బదిలీ చేసే సాధనం అని బఫెట్ నమ్ముతారు. రోజూ మ్యుచువల్‌ ఫండ్‌ ఎన్‌ఏవీని చూడటం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ లక్ష్యం 10 ఏళ్ల తర్వాత అయితే నేటి మార్కెట్ ఒడిదుడుకులు మీకు అనవసరం.భయం, అత్యాశల సమతుల్యతప్రజలందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి.. అందరూ భయపడుతున్నప్పుడు మీరు అత్యాశగా ఉండండి - ఇది బఫెట్ లైఫ్ మంత్రం. మార్కెట్ కుప్పకూలినప్పుడు చాలామంది సిప్‌లు ఆపేస్తారు. కానీ, అప్పుడే యూనిట్లు తక్కువ ధరకు వస్తాయనే విషయాన్ని బఫెట్ గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో చేసే అదనపు పెట్టుబడి భవిష్యత్తులో అద్భుతమైన సంపదను సృష్టిస్తుంది.తెలియనిచోట పెట్టుబడి వద్దుఏదో ఒక సెక్టోరల్ ఫండ్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్ గత ఏడాది 50% రిటర్న్స్ ఇచ్చిందని అందులో డబ్బులు పోయడం ప్రమాదకరం. ఆ ఫండ్ రిస్క్ ఏంటి? దాని వ్యూహం ఏంటి? అనేది కనీస అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టకూడదు.అంచనాలపై ఆధారపడకండిమార్కెట్ రేపు ఎలా ఉంటుంది? వచ్చే నెల ఎలా ఉంటుంది? అనే అంచనాలు జ్యోతిష్యం లాంటివే తప్ప వాస్తవాలు కావని బఫెట్ అభిప్రాయపడతారు. గత ఆరు నెలల ర్యాంకింగ్ చూసి ఫండ్లను మార్చడం కాకుండా ఫండ్ హౌస్ విశ్వసనీయతను చూసి పెట్టుబడి పెట్టాలని ఆయన సూచిస్తారు.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

TIME100 Next India Global Spotlight on Indian Leaders Reliance Partnership5
రిలయన్స్‌తో జతకట్టిన ‘టైమ్’

ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీల వ్యక్తులను గుర్తించడంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘టైమ్’, భారతీయ యువశక్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు సిద్ధమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో తన ప్రతిష్టాత్మక ‘టైమ్‌ 100 నెక్స్ట్’ ఫ్రాంచైజీని తొలిసారిగా భారత్‌లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ‘టైమ్‌ 100 నెక్స్ట్ ఇండియా’ పేరుతో ఈ ఎడిషన్ ప్రారంభం కానుంది. న్యూయార్క్‌లో గురువారం జరిగిన వార్షిక ‘టైమ్‌ 100 గాలా' వేదికగా టైమ్ సీఈఓ జెస్సికా సిబ్లీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ ఈమేరకు ప్రకటన చేశారు.ఏమిటీ టైమ్‌ 100 నెక్స్ట్ ఇండియా?భారతదేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేయగల 100 మంది అసాధారణ యువ నాయకులను ఈ జాబితా ద్వారా టైమ్ ఎడిటర్లు ప్రపంచానికి పరిచయం చేస్తారు. కళలు, సైన్స్, వ్యాపారం, క్రీడలు.. వంటి విభిన్న రంగాల్లో రాణిస్తున్న వారిని ఎంపిక చేస్తారు. కేవలం భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను కూడా ఈ జాబితాలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ జాబితాను ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతో పాటు డిసెంబర్ 2026లో ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో అట్టహాసంగా నిర్వహించే గాలా ఈవెంట్‌లో వీరిని సత్కరిస్తారు.భారతీయ ప్రతిభకు ప్రపంచ గుర్తింపుఈ భాగస్వామ్యంపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది భారతీయ యువతకు లభించే గొప్ప గౌరవమని పేర్కొన్నారు. ‘తర్వాతి తరం ప్రతిభను, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా నవ భారతాన్ని నిర్మించేందుకు రిలయన్స్ కట్టుబడి ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ అంశాలను భారత్‌కు తీసుకురావడం, భారత్‌లోని అత్యుత్తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడమే మా లక్ష్యం. ఈ క్రమంలో టైమ్‌తో కలిసి ముంబైలో ఈ వేడుకను నిర్వహించాలనుకోవడం గర్వంగా ఉంది’ అన్నారు. టైమ్ సీఈఓ జెస్సికా సిబ్లీ మాట్లాడుతూ, భారతీయ పరిశ్రమల్లో వస్తున్న మార్పులను, ప్రపంచ పురోగతిని నడిపిస్తున్న నాయకులను గుర్తించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Meta Layoffs What Amount Will Laid Off Employees Receive6
ఊడిపోతున్న ఉద్యోగం.. ఇదిగో ఇదే వచ్చే పరిహారం

సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (ఫేస్‌బుక్ మాతృసంస్థ) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ, తన మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం మందిని అంటే దాదాపు 8,000 మందిని తొలగించబోతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో పెట్టుబడులను పెంచడం, సంస్థాగత సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మే 20 నుంచి ప్రక్రియ ప్రారంభం!తాజా నివేదికల ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభం కానుంది. కేవలం ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాకుండా, సంస్థలో ఖాళీగా ఉన్న సుమారు 6,000 ఓపెన్ పొజిషన్ల భర్తీని కూడా మెటా నిలిపివేసింది. జనవరిలో మెటావర్స్ విభాగం (రియాలిటీ ల్యాబ్స్)లో 1,000 మందిని, మార్చిలో సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో మరికొందరిని ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే.అందుకే ఈ మార్పులు!ఓపెన్ ఏఐ (OpenAI), గూగుల్, ఆంత్రోపిక్ వంటి దిగ్గజ సంస్థలతో ఏఐ రంగంలో పోటీ పడటానికి మెటా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీని పునర్వ్యవస్థీకరిస్తోంది. కొన్ని రకాల కాంట్రాక్ట్ పనులను మానవ వనరుల నుండి తొలగించి, వాటి స్థానంలో ఏఐ ఆధారిత టూల్స్ ప్రవేశపెట్టాలని మెటా భావిస్తోంది. తక్కువ మేనేజ్‌మెంట్ పొరలతో, మరింత వేగంగా పనిచేసేలా సంస్థను తీర్చిదిద్దడమే జుకర్‌బర్గ్ లక్ష్యంగా కనిపిస్తోంది.తొలగించిన వారికి లభించే ప్రయోజనాలుబాధిత ఉద్యోగులను ఆదుకోవడానికి మెటా భారీ పరిహారాన్ని (Severance Package) ప్రకటించింది. నగదు పరిహారం కింద కనీసం 16 వారాల (4 నెలలు) బేస్ పేను చెల్లిస్తుంది. అలాగే కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల వేతనంగా అందిస్తుంది. దీంతోపాటు సుమారు 18 నెలల వరకు కోబ్రా (COBRA) హెల్త్ కవరేజ్ కొనసాగుతుంది. విదేశీ ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ సాయంతో పాటు, కెరీర్ సర్వీసెస్ (కొత్త ఉద్యోగ వేటలో సాయం) అందించనుంది."ఇది నిజంగా అవాంఛనీయ వార్త అని నాకు తెలుసు. దీనివల్ల ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతారని అర్థం చేసుకోగలను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఇది తప్పనిసరి" అని కంపెనీ అంతర్గత మెమోలో పేర్కొంది.2022-2023 కాలంలో మెటా ఇప్పటికే సుమారు 21,000 మందిని తొలగించింది. ఆ ఏడాదిని 'సామర్థ్యపు సంవత్సరం' (Year of Efficiency)గా జుకర్‌బర్గ్ అభివర్ణించారు. ప్రస్తుతానికి మెటా ఆర్థికంగా బలంగానే ఉన్నప్పటికీ, ఏఐ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.1.90 లక్షల జీతం.. 4 నెలలే సంబరం!

Advertisement
Advertisement
Advertisement