Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

ICICI Axis Bank Launch Biometric Authentication for UPI Card Payments1
బయోమెట్రిక్‌తో యూపీఐ, కార్డు చెల్లింపులు

ముంబై: ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ తమ ఐమొబైల్‌ యాప్‌లో యూపీఐ లావాదేవీల నిర్వహణ కోసం బయోమెట్రిక్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఫేషియల్‌ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్‌ ధృవీకరణ ద్వారా రూ. 5,000 వరకు లావాదేవీలను చేయొచ్చని సంస్థ తెలిపింది. ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా యూపీఐ పిన్‌ నంబరును ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.మరోవైపు, యాక్సిస్‌ బ్యాంక్, ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫాం పేయూతో కలిసి కార్డు చెల్లింపులకు బయోమెట్రిక్‌ ధృవీకరణను అందుబాటులోకి తెచ్చినట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. దీనితో ఇకపైయాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌హోల్డర్లు ఫేస్‌ ఐడీ లేదా వేలిముద్ర ద్వారా చెల్లింపులను ఆమోదించవచ్చని పేర్కొంది.

Dollar Industries Founder Deen Dayal Gupta Passes Away at 882
డాలర్‌ ‘బిగ్‌ బాస్‌’ గుప్తా కన్నుమూత

కోల్‌కతా: హౌజరీ ఉత్పత్తుల సంస్థ డాలర్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్‌ దీన్‌దయాళ్‌ గుప్తా (88) కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. 1937 సెప్టెంబర్‌ 13న హర్యానాలోని మాన్హేరు గ్రామంలో జన్మించిన గుప్తా 1962లో కోల్‌కతాకి చేరుకుని, హౌజరీ ఉత్పత్తుల తయారీ, విక్రయ వ్యాపారాన్ని చేపట్టారు.1972లో డాలర్‌ ఇండస్ట్రీస్‌కి పునాది వేశారు. అయిదు దశాబ్దాల పాటు సారథ్యం వహిస్తూ రూ. 1,700 కోట్ల ఆదాయాలు గల అగ్రగామి హౌజరీ, దుస్తుల తయారీ దిగ్గజంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో పలు పురస్కారాలు అందుకున్నారు.

Rohit Jain Appointed as RBI Deputy Governor3
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్‌ జైన్‌

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యుటీ గవర్నర్‌ టి. రవి శంకర్‌ స్థానంలో రోహిత్‌ జైన్‌ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్‌ నియామక కమిటీ (ఏసీసీ) రోహిత్‌ జైన్‌ నియామకానికి ఆమోదం తెలిపింది.ప్రస్తుతం జైన్‌ ఆర్‌బీఐలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. రవి శంకర్‌కు పొడిగించిన పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జైన్‌ మే 3వ తేదీ లేదా ఆ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్‌బీఐ చట్టం–1934 ప్రకారం, కేంద్ర బ్యాంకుకు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి.వీరిలో ఇద్దరిని రిజర్వ్‌ బ్యాంక్‌ అంతర్గత అధికారుల నుంచి, ఒకరిని కమర్షియల్‌ బ్యాంకింగ్‌ రంగం నుంచి, మరొకరిని మానిటరీ పాలసీ విభాగానికి నేతృత్వం వహించేలా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఆర్‌బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎస్‌.సి. ముర్ము, పూనమ్‌ గుప్తా, స్వామినాథన్‌ జే తదితరులు ఉన్నారు.

Kotak Mahindra Bank Q4 net profit rises 13percent YoY to Rs 4,027 crore4
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లాభం రూ. 4,027 కోట్లు

న్యూఢిల్లీ: రుణాల వృద్ధి, మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ తగ్గుదల వంటి సానుకూలాంశాల ఊతంతో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 4,027 కోట్ల నికర లాభం (స్టాండెలోన్‌ ప్రాతిపదికన) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 3,663 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 13 శాతం అధికం. లాభం సుమారు రూ. 3,737 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ. 7,284 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ. 7,876 కోట్లకు పెరిగింది. రూ. 1 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై బ్యాంక్‌ బోర్డు రూ. 0.65 మేర డివిడెండ్‌ ఇవ్వాలని సిఫార్సు చేసింది. రాబోయే రోజుల్లో మార్జిన్లు నిర్దిష్ట శ్రేణికి పరిమితం కావచ్చని బ్యాంక్‌ గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ దేవాంగ్‌ ఘీవాలా తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్‌ వేల్యుయేషన్‌ భారీగా ఉండటం వల్లే దాని కోసం పోటీపడలేదని ఎండీ అశోక్‌ వాస్వానీ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధర కన్నా తక్కువ రేటుకే బిడ్లు రావడమనేది అంచనాలకి, వాస్తవానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాపారం యథాప్రకారంగానే ఉన్నప్పటికీ, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు సహా పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధించి ఇతరత్రా ప్రభావాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. గృహ రుణాల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు గణనీయంగా ఉనట్లు పేర్కొంది. సైబర్‌ రిస్క్ లు, ఏఐ సంబంధ ముప్పులను ఎదుర్కొనేందుకు సిస్టమ్స్‌ను పటిష్టం చేసుకోవడంపై బ్యాంకు మరింతగా పెట్టుబడులు పెడుతోంది.మరిన్ని విశేషాలు..→ నిర్వహణ లాభం వార్షికంగా 7 శాతం పెరిగి రూ. 5,855 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం 4.8 శాతం వృద్ధితో రూ. 14,175 కోట్లకు, వడ్డీ వ్యయాలు 0.9 శాతం పెరిగి రూ. 6,299 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయం 2.1 శాతం క్షీణించి రూ. 3,116 కోట్లకు తగ్గింది. → అసెట్‌ క్వాలిటీపరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 1.30 శాతం నుంచి 1.20 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌ఎన్‌పీఏ) 0.31 శాతం నుంచి 0.25 శాతానికి మెరుగుపడ్డాయి. ప్రొవిజనింగ్‌ గణనీయంగా 43 శాతం మేర తగ్గి రూ. 909 కోట్ల నుంచి రూ. 516 కోట్లకు నెమ్మదించి, లాభాలకు ఊతమిచ్చింది. → నికర వడ్డీ మార్జిన్‌ వార్షికంగా 4.97 శాతం నుంచి 4.67 శాతానికి చేరింది. క్రితం క్వార్టర్‌లో ఇది 4.54 శాతంగా నమోదైంది. నిధుల సమీకరణ వ్యయాలు 5.09 శాతం నుంచి 4.45 శాతానికి తగ్గాయి. → 2026 మార్చి 31 నాటికి నికరంగా రుణాలు 16 శాతం వృద్ధితో రూ. 4.96 లక్షల కోట్లకు చేరాయి. → మొత్తం డిపాజిట్లు 15 శాతం వృద్ధి చెంది రూ. 5.72 లక్షల కోట్లకు చేరగా, కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌) నిష్పత్తి 43.3 శాతంగా ఉంది. రుణ, డిపాజిట్ల నిష్పత్తి 86.6 శాతంగా ఉంది. → స్లిప్పేజీలు 32 శాతం తగ్గి రూ. 1,018 కోట్లకు దిగి వచ్చాయి. → మొత్తం కస్టమర్ల సంఖ్య 5.2 కోట్లుగా ఉంది. → కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన లాభం 10 శాతం వృద్ధితో రూ. 4,933 కోట్ల నుంచి రూ. 5,423 కోట్లకు చేరగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 19,288 కోట్లుగా నమోదైంది.

India April Exports Rise Despite West Asia Crisis5
ఏప్రిల్‌లో సానుకూలంగా ఎగుమతులు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ.. దేశ ఎగుమతుల రంగం ఏప్రిల్‌ నెల మొదటి మూడు వారాల్లో మంచి పనితీరు చూపించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎగుమతులు చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగినట్టు చెప్పారు. భారత్‌ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీ పరిశ్రమకు మంచి బలాన్నిస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్‌ నెల ఎగుమతులు, దిగుమతుల డేటాను వాణిజ్య శాఖ మే 15న విడుదల చేయనుంది. మార్చి నెలలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 7.44 శాతం తగ్గి 38.92 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. హర్మూజ్‌ జలసంధి మూసివేతతో ఎగుమతులు ఇతర మార్గాల ద్వారా వెళుతున్నట్టు మంత్రి గోయల్‌ చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పురోగతి గురించి మాట్లాడుతూ.. వారం క్రితం సంప్రదింపులు చక్కగా కొనసాగినట్లు చెప్పారు. అవి ఇక ముందూ కొనసాగుతాయన్నారు. యూఏఈ, యూకే, ఐరోపా సమాఖ్యతో పాటు నాలుగు ఐరోపా దేశాల కూటమి ఈఎఫ్‌టీఏతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవడాన్ని ప్రస్తావించారు. మరో 12 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. చిలీ, పెరూ, ఇజ్రాయెల్, గల్ఫ్‌ సహకార సమాఖ్య, కెనడా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా, యూరేíÙయా ప్రాంత దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు మంత్రి గోయల్‌ వెల్లడించారు. 2025–26లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 88 బిలియన్‌ డాలర్లు లేదంటే 90 బిలియన్‌ డాలర్లు దాటి ఉండొచ్చన్నారు.

White-collar hiring in India up 6percent in April amid boost from AI6
వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు పెరిగాయ్‌..!

ముంబై: దేశీయంగా కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్‌ కాలర్‌) ఏప్రిల్‌లో పెరిగాయి. గతేడాది ఇదే నెల నియామకాలతో పోల్చి చూస్తే 6 శాతం పెరిగినట్లు నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడించింది. ఇన్సూరెన్స్, ఐటీ ఆధారిత రంగాలు (ఐటీఈఎస్‌) / బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ), రియల్‌ ఎస్టేట్‌ రంగాలు హైరింగ్‌లో కీలక పాత్ర పోషించాయని నివేదిక పేర్కొంది. ‘‘నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ ప్రకారం 6 శాతం వార్షిక వృద్ధితో, నియామకాలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇన్సూరెన్స్, రియల్‌ ఎస్టేట్, హెల్త్‌కేర్‌ రంగాలు నియామకాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది ఆయా రంగాల్లో ఉన్న మౌలిక డిమాండ్‌తో పాటు, పెరుగుతున్న వినియోగదారుల కార్యకలాపాలను సూచిస్తోంది. ఐటీ నియామకాలు నిలకడగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్‌ రంగంలో మాత్రం కొంత మందగమనం కనిపిస్తోంది. మొత్తంగా, రంగాల వారీగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ... భారత జాబ్‌ మార్కెట్‌ మాత్రం నిలకడగా ఉంది’’ అని నౌకరీడాట్‌కామ్‌ ఎండీ, సీఈవో హితేష్‌ ఒబెరాయ్‌ తెలిపారు. ‘నౌకరీ డాట్‌కామ్‌’ వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగ సంబంధిత అన్వేషణల ఆధారంగా రూపొందించిన నెలవారీ నివేదిక ప్రకారం.... → బీమా రంగం 21 శాతం వృద్ధితో నియామకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బీపీఓ/ఐటీఈఎస్‌ (15%), రియల్‌ ఎస్టేట్‌ (12%), హెల్త్‌కేర్‌ (11%), విద్యా రంగం (9%) నిలిచాయి. టెలికామ్, బ్యాంకింగ్‌ రంగాల నియామకాల్లో వరుసగా నాలుగో నెలా క్షీణత నమోదైంది. ఏప్రిల్‌లో ఇవి వరుసగా 11%, 10 శాతం తగ్గాయి. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) హైరింగ్‌ 4% తగ్గడం గమనార్హం. ఐటీ, ఫార్మా, ఆటో రంగాల నియాకాల్లో పెద్దగా మార్పు లేదు. దక్షిణాదిలోనే అధికం: వైట్‌ కాలర్‌ ఉద్యోగ నియామకాల్లో దక్షిణాది మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. హైదరాబాద్‌ 12 శాతం వృద్ధితో టాప్‌లో ఉండగా, బెంగళూరు (7 శాతం), చెన్నై (6 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ (3 శాతం) స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, కోల్‌కతా (1 శాతం) దాదాపు స్థిరంగా ఉంది. అయితే, ప్రధాన మెట్రో నగరం ముంబైలో హైరింగ్‌ 3% తగ్గింది. → మెట్రోలే కాకుండా, అభివృద్ధి చెందుతున్న నగరాలు జైపూర్‌ (12%), కోయంబత్తూరు (11%), అహ్మదాబాద్‌(7%) సైతం నియామాల్లో బలమైన వృద్ధిని కనబరిచాయి. వైట్‌కాలర్‌ హైరింగ్‌ సంస్కృతి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement