Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

jaguar-land-rover-1.7-lakh-vehicles-recall-power-loss-issue1
ల్యాండ్ రోవర్ భారీ రీకాల్: 1.70 లక్షల కార్లలో సమస్య

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాలో సుమారు 1.70 లక్షల హైబ్రిడ్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కారులోని విద్యుత్ వ్యవస్థలో తలెత్తిన క్లిష్టమైన లోపం వల్ల వాహనం అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ గుర్తించింది.సమస్య ఏమిటంటే?ఈ వాహనాల్లోని DC-DC కన్వర్టర్‌లోని బూస్ట్ కంట్రోల్ మైక్రోచిప్‌లో అంతర్గత లోపం ఉన్నట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ భాగం 12-వోల్ట్ బ్యాటరీ సిస్టమ్ ఛార్జింగ్‌ను నియంత్రిస్తుంది. ఇది విఫలమైతే, వాహనానికి అందే విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోతుంది. దీనివల్ల కారు ప్రొపల్షన్ (ముందుకు కదిలే శక్తి), బాహ్య లైట్లు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.హెచ్చరిక సంకేతాలుసిస్టమ్ పూర్తిగా విఫలమవ్వడానికి ముందు, డ్యాష్‌బోర్డ్ పై "Stop Safely Electric Fault Detected" అనే హెచ్చరిక కనిపిస్తుంది. ఒకవేళ డ్రైవర్ దీనిని గమనించకుండా డ్రైవింగ్ కొనసాగిస్తే గేర్‌బాక్స్ సరిగ్గా పనిచేయదు. కారు 'న్యూట్రల్' మోడ్‌లోకి వెళ్తుంది.సెంట్రల్ డిస్‌ప్లే, ఎయిర్ కండిషనింగ్ ఆగిపోతాయి. చివరగా ఇంజిన్, బాహ్య లైట్లు పనిచేయడం నిలిచిపోయి వాహనం ఆగిపోతుంది.ప్రభావితమైన మోడళ్లు మొత్తం 1,70,169 ఎస్‌యూవీలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి. వీటిలో రేంజ్ రోవర్ ఎవోక్ (2020-2023), స్పోర్ట్ (2019-2024), వెలార్ (2021-2024), రేంజ్ రోవర్ స్టాండర్డ్ (2020-2024) మోడళ్లు ఉన్నాయి. అలాగే ల్యాండ్ రోవర్ డిస్కవరీ(2021-2024), డిస్కవరీ స్పోర్ట్(2020), డిఫెండర్ (2020-2024), జాగ్వార్ ఇ-పేస్ (2021-2022), ఎఫ్-పేస్ (2021-2024) వాహనాలకూ రీకాల్‌ వర్తిస్తుంది.పరిష్కారం ఇంకా సిద్ధం కాలేదురాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ సమస్యకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ వద్ద ప్రస్తుతానికి శాశ్వత పరిష్కారం సిద్ధంగా లేదు. సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ అప్‌డేట్ కోసం కంపెనీ కసరత్తు చేస్తోంది. వాహన యజమానులకు ప్రమాదం గురించి హెచ్చరిస్తూ జూన్ 12, 2026 నాటికి నోటీసులు అందుతాయి. పరిష్కారం సిద్ధమైన తర్వాత తుది మరమ్మతు లేఖలు కంపెనీ పంపుతుంది.భారత్‌పై ప్రభావం?ప్రస్తుతానికి ఈ రీకాల్ కేవలం అమెరికా మార్కెట్‌కే పరిమితం చేసింది కంపెనీ. అయితే, భారతీయ యజమానులు (ముఖ్యంగా దిగుమతి చేసుకున్న మోడళ్లు వాడుతున్న వారు) గ్లోబల్ VIN (వెహికల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) తనిఖీల ద్వారా తమ కారు సురక్షితంగా ఉందో లేదో సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: కియోసాకి కొత్త వార్నింగ్‌.. ఈవీలపై కీలక కామెంట్స్‌

Missed Your Train? Here’s What Indian Railways Rules Say About Your Ticket2
రైలు మిస్ అయితే.. సేమ్ టిక్కెట్టుతో ఇంకో రైలు ఎక్కొచ్చా?

ప్రయాణికులు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కోసారి ట్రాఫిక్ జాంలు లేదా ఇతర అనివార్య కారణాల వల్ల రైలు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రయాణీకుల్లో ఒకటే ఆందోళన.. "నేను కొన్న టిక్కెట్టు ఏమవుతుంది..? దీనితో మరో రైలులో ప్రయాణించవచ్చా?" అని ఆందోళన కలుగుతుంది. అయితే, దీనిపై ఇండియన్ రైల్వేస్‌కు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..ఒకవేళ మీరు తీసుకున్నది జనరల్ టిక్కెట్టు అయితే, రైలు మిస్ అయినా అదే టిక్కెట్టుతో నెక్స్ట్ అందుబాటులో ఉన్న రైలులో ప్రయాణించే వీలుంటుంది. కానీ, ఇక్కడ ఒక షరతు ఉంది. సాధారణంగా జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేసిన సమయం నుంచి 3 గంటలు లేదా ఆ మార్గంలో వెళ్లే మొదటి రైలు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ సమయం దాటితే ఆ టిక్కెట్టు చెల్లదు.ఒకవేళ రిజర్వేషన్ టిక్కెట్టు ఉంటే కుదరదు..ఒకవేళ మీరు స్లీపర్, ఏసీ లేదా ఏదైనా కేటగిరీలో ముందస్తుగా బెర్త్ రిజర్వ్ చేసుకుని, ఆ రైలును మిస్ అయితే మాత్రం అదే టిక్కెట్టుతో మరో రైలు ఎక్కడానికి వీల్లేదు. మరో టిక్కెట్టు తప్పనిసర..తదుపరి రైలులో వెళ్లాలంటే మీరు కొత్తగా టిక్కెట్టు తీసుకోవాల్సిందే. రీఫండ్ అవ్వదు..రైలు మిస్ అయిన సందర్భంలో రిజర్వేషన్ టిక్కెట్టుపై రీఫండ్ పొందే హక్కు ప్రయాణీకుడికి ఉండదు.కేటగిరీ మారినా.. మీ దగ్గర ఉన్నది ఆర్డినరీ రైలు టిక్కెట్టు అయి ఉండి, మీరు మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ లేదా రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించాలనుకుంటే ఆ టిక్కెట్టు చెల్లదు. ఆయా రైళ్ల కేటగిరీని బట్టి మీరు అదనపు రుసుము చెల్లించి కొత్త టిక్కెట్టు తీసుకోవాలి.టీటీఈ చెకింగ్‌లో దొరికితే జరిమానా!..చెల్లని టిక్కెట్టుతో లేదా పాత రిజర్వేషన్ టిక్కెట్టుతో మరో రైలులో ప్రయాణిస్తూ టీటీఈ కి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడవచ్చని రైల్వే నిబంధనలు హెచ్చరిస్తున్నాయి.కాబట్టి, రైలు ప్రయాణానికి కనీసం గంట ముందే స్టేషన్‌కు చేరుకోవడం ఉత్తమం. ఒకవేళ పొరపాటున రైలు మిస్ అయితే, రిస్క్ తీసుకోకుండా నిబంధనల ప్రకారం కొత్త టిక్కెట్టు తీసుకోవడమే బెటర్.. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Street Cart to Shop Owner How One Act Empathy Changed Panipuri Seller Life3
వీధి చివరి పానీపూరీ వాలా కనిపించట్లేదని..

మనం రోజూ ఆగే పానీపూరీ బండి ఒక వారం రోజులు కనిపించకపోతే ఏమనుకుంటాం? బహుశా ఆ పానీపూరీ వాలా ఊరెళ్లాడనో లేక తనకు ఆరోగ్య సమస్యనో అనుకుని మరో బండి వద్దకు వెళ్తాం. కానీ ఒక కస్టమర్ మాత్రం తాను రెగ్యులర్‌గా వెళ్లే పానీపూరీ బండి వ్యక్తి ఎందుకు రావట్లేదో ఆరా తీశాడు. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో కింద చూద్దాం.ఎక్స్‌ (ట్విట్టర్) యూజర్‌ అంకిత్ పాండే నిత్యం ఒకే బండి దగ్గర పానీపూరీ తినేవాడు. వరుసగా పది రోజుల పాటు ఆ బండి కనిపించకపోవడంతో అంకిత్ అనుమానం వచ్చి పాత గూగుల్‌పే లావాదేవీల ద్వారా సదరు బండి నిర్వాహకుడి ఫోన్ నంబర్ తీసుకొని కాల్ చేశాడు. అవతలి నుంచి వచ్చిన సమాధానం అంకిత్‌ను కలిచివేసింది.తన భార్య తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆ వైద్య ఖర్చుల కోసం తన జీవనోపాధి అయిన పానీపూరీ బండిని అమ్మేసుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చేయడానికి పని లేదు. ‘సార్, నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి’ అని అతను అడిగిన ఆ ఒక్క మాట అంకిత్‌ ఆలోచనను మార్చేసింది.సహాయం కాదు.. భాగస్వామ్యం!కేవలం కొంత ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకోవడం కంటే అతనికి మళ్లీ ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని అంకిత్ నిర్ణయించుకున్నాడు. రోడ్డు పక్కన బండి పెట్టే స్థాయి నుంచి అతడిని ఒక గౌరవప్రదమైన షాపు యజమానిని చేసేలా మాస్టర్ ప్లాన్ వేశాడు.కొత్త బిజినెస్ మోడల్ ఇలాఅంకిత్ పాండే రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసి ప్రధాన కూడలిలో నెలకు రూ.15,000 అద్దెతో ఒక షాపు లీజుకు తీసుకున్నాడు. పానీపూరీ బండి వ్యక్తితో నెలకు రూ.20,000 వేతన ఒప్పందం చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షాపు ఓపెన్‌ ఉండేలా ప్లాన్‌ చేశాడు.నమ్మకమే పెట్టుబడిగా..‘ఈ షాపు ద్వారా రోజుకు కనీసం రూ.5 వేల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అంటే నెలకు రూ.1.5 లక్షల ఆదాయం. ఖర్చులన్నీ పోను మీరు రూ.60 నుంచి 70 వేల వరకు లాభం పొందవచ్చు’ అని ఆ బండి వ్యక్తి గణాంకాలతో సహా వివరించడం అంకిత్‌ను ఆశ్చర్యపరిచింది. ‘అన్నీ కోల్పోయిన వ్యక్తిలో ఇంకా ఎదగాలనే తపన కనిపిస్తోంది. ఇది సానుభూతితో చేస్తున్న సాయం కాదు, ఒక వ్యక్తి మనస్తత్వానికి నేను పెడుతున్న పెట్టుబడి’ అని అంకిత్ పేర్కొన్నారు.My panipuri wala disappeared 10 days ago. No cart, no sign. I used to go there almost daily, so it felt strange.Today I found his number from old GPay payments and called him.He said he sold his entire cart because his wife was admitted to the hospital.Everything gone. No…— Ankit Pandey (@iamankitpande) April 23, 2026నెటిజన్ల రియాక్షన్‌ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఒకరిలో ఉన్న ఎదుగుదలను గుర్తించి భాగస్వామిగా చేర్చుకోవడం గొప్ప విషయం’ అని ఒక యూజర్ కొనియాడారు. ‘వ్యాపారం పుంజుకున్నాక సదరు వ్యక్తి నిజాయితీగా ఉంటాడా లేదా అనేది గమనించాలి. డబ్బు మనుషులను మారుస్తుంది’ అని మరొకరు హెచ్చరించారు. కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనివ్వడం గొప్ప విషయమే, కానీ ఆ వ్యక్తిలోని నైపుణ్యాన్ని గుర్తించి అతడిని తిరిగి ఒక వ్యాపారస్థుడిగా మార్చడం నిజమైన సామాజిక బాధ్యత అని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Gold and Silver rates on 25 April 2026 in Telugu states4
ఇక్కడ బంగారం ధరలు ఫ్రీజ్‌.. అక్కడ మాత్రం..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

From Rs 20 Lakh Salary to Organic Farming, Viral Journey Redefines Success5
రూ.20 లక్షల నుంచి రూ.20 వేలకు తగ్గిన సంపాదన..

నేటి ఆధునిక సమాజంలో సక్సెస్ అంటే ఏంటి? ఆరంకెల జీతం, ఏటా పెరిగే బోనస్‌లు, సమాజంలో హోదా పెంచే కార్పొరేట్ పదవులు.. ఇదే కదా అందరి లెక్క! కానీ, వీటన్నింటినీ కాదని ఆత్మసంతృప్తి కోసం ఒక మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ భార్య రుచి వారికూ కార్పొరేట్‌ కంపెనీలో వార్షికంగా రూ.20 లక్షల ప్యాకేజీని వదులుకొని నెలకు కేవలం రూ.20 వేలు వచ్చే సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.కలల కొలువు నుంచి బ్రేక్‌వైరల్‌ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. రుచి వారికూ కెరీర్ ప్రారంభం నుంచి ఒక మూస పద్ధతిలో ఆలోచించలేదు. 19 ఏళ్ల వయస్సులోనే ఆమెకు భవిష్యత్తుపై స్పష్టమైన, భిన్నమైన ఆలోచనలు ఉండేవని అంకుర్ గుర్తు చేసుకున్నారు. కాలేజీ పూర్తి కాగానే ఒక మ్యాగజైన్‌లో చేరిన ఆమె ఆ తర్వాత తన కలల సంస్థ అయిన డిస్కవరీ ఛానెల్‌లో ఉద్యోగం సంపాదించారు. 2005 నుంచి 2010 వరకు అక్కడే పనిచేస్తూ ఏటా రూ.20 లక్షల ఆదాయంతో అత్యున్నత స్థాయిలో నిలిచారు.జీవితం మలుపు తిరిగింది ఇలా..తమకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత రుచి తన ప్రాధాన్యతలను మార్చుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే తన కుమారుడి పెంపకం కోసం ఉద్యోగానికి విరామం ప్రకటించారు. నాలుగు ఏళ్ల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమైన ఆమె మళ్లీ కెరీర్ ప్రారంభించాలనుకున్నప్పుడు అందరిలా తిరిగి కార్పొరేట్ రంగానికి వెళ్లలేదు. ‘నా భార్య సంవత్సరానికి రూ.20 లక్షల సంపాదన నుంచి నెలకు రూ.20 వేల సంపాదనకు మారింది. 2014లో ఆమె సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపింది. నెలకు కేవలం రూ.20 వేలు మాత్రమే అందుతున్నా ఆమె పొందిన సంతృప్తి వెలకట్టలేనిది’ అని అంకూర్‌ లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో అన్నారు.సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘విజయం కేవలం ఆదాయం గురించి కాదు, ఆ దశలో మీకు ఏది ముఖ్యమో దానితో కలిసి ప్రయాణించడం’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘కెరీర్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులను బట్టి మారుతుంటుంది’ అని మరొకరు పేర్కొన్నారు. డబ్బు కంటే మానసిక ప్రశాంతత, కుటుంబం, వ్యక్తిగత ఆసక్తి ముఖ్యమని నిరూపించిన రుచి వారికూ కథ, కెరీర్ రేసులో పరుగెడుతున్న నేటి యువతకు గొప్ప పాఠం.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

US Sanctions on China Hengli Petrochemical Shake Global Oil Markets6
చైనా చమురు దిగ్గజంపై ట్రంప్‌ ఆంక్షలు

ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇరాన్ నుంచి అక్రమంగా చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాకు చెందిన ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం ‘హెంగ్లీ పెట్రోకెమికల్’పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనితో పాటు ఇరాన్ చమురు రవాణాలో పాలుపంచుకుంటున్న సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై కూడా వేటు వేసింది.ఆంక్షల వెనుక ప్రధాన ఉద్దేశంఇరాన్ సైన్యానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవడమే ఈ నిర్ణయం ఉద్దేశం. తాజా చర్యతో ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, కంపెనీలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామన్న తన హెచ్చరికను ట్రంప్ ప్రభుత్వం అమలు చేసి చూపింది. దాంతో చైనాలోని డాలియన్ నగరంలో ఉన్న హెంగ్లీ పెట్రోకెమికల్ సదుపాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. రోజుకు సుమారు 4,00,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ పెసిలిటీ ఉత్పాదకత తగ్గిపోయే ప్రమాదముంది. అయితే, 2023 నుంచి ఈ సంస్థ ఇరాన్ ముడి చమురును స్వీకరిస్తూ తమ సైన్యానికి వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని చేకూర్చినట్లు అమెరికా ట్రెజరీ విభాగం నిర్ధారించింది.ప్రపంచ ఇంధన మార్కెట్‌లో అలజడిఒకవైపు ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే మరోవైపు భౌగోళికంగా కూడా అమెరికా ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధిపై అమెరికా దిగ్బంధనాన్ని విధించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో ప్రపంచ ఇంధన వాణిజ్యం ప్రస్తుతం గందరగోళంలో ఉంది.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Advertisement
Advertisement
Advertisement