Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

gold and silver rates on 12 march 2026 in Telugu states1
డబుల్‌ రిలీఫ్‌.. పసిడి, వెండి ప్రియులకు ఊరట

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోతులం బంగారం22 క్యారెట్స్--రూ.1,48,700--రూ.1000 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,62,220--రూ.1090 తగ్గింపుచెన్నైలో22 క్యారెట్స్--రూ.1,49,700--రూ.1500 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,63,310--రూ.1640 తగ్గింపుదేశ రాజధాని నగరం దిల్లీలో22 క్యారెట్స్--రూ.1,48,850--రూ.1000 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,62,370--రూ.1090 తగ్గింపుముంబై, బెంగళూరులో22 క్యారెట్స్--రూ.1,48,700--రూ.1000 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,62,220--రూ.1090 తగ్గింపుహైదరాబాద్‌లో ఈరోజు వెండి ధరకేజీ వెండి రూ.2,90,000. రూ.10,000 తగ్గింపుఢిల్లీలో ఈరోజు వెండి ధరకేజీ వెండి రూ.2,80,000. రూ.10,000 తగ్గింపు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 12 March 20262
మార్కెట్‌ సూచీలు నేల చూపు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 255 పాయింట్లు తగ్గి 23,606 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 809 పాయింట్లు దిగజారి 76,045 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.51బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 100.92 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.08 శాతం పడిపోయింది.నాస్‌డాక్‌ 0.08 శాతం పెరిగింది.Today Nifty position 12-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Google Built In AI to Chrome in India Supporting 50 Languages3
క్రోమ్‌ బ్రౌజర్లో ఏఐ టూల్స్‌

సురక్షితమైన, మెరుగైన బ్రౌజింగ్‌ అనుభూతిని కల్పించే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా బిల్ట్‌ ఇన్‌ ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళం, హిందీలాంటి 8 ప్రాంతీయ భాషలతో పాటు 50 ల్యాంగేజ్‌లకు సపోర్ట్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లేటెస్ట్‌ జెమిని 3.1 మోడల్‌పై రూపొందించిన ఈ ఫీచర్లతో, బ్రౌజర్‌ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు వీలవుతుందని వివరించింది. ముందుగా డెస్క్‌టాప్‌, ఐవోఎస్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయని గూగుల్‌ డైరెక్టర్‌ షార్మెయిన్‌ డిసిల్వా తెలిపారు.వీటిని తొలిసారిగా ప్రవేశపెడుతున్న మార్కెట్లలో భారత్‌ కూడా ఒకటని వివరించారు. కొత్త ఫీచర్ల ప్రకారం వేరే ట్యాబ్‌కి మారాల్సిన అవసరం లేకుండా యూజర్లు, ప్రస్తుత ట్యాబ్‌లోనే పైన కుడివైపున ఉండే బ్రౌజింగ్‌ అసిస్టెంట్‌ ఐకాన్‌ని క్లిక్‌ చేసి నేరుగా చాట్‌ చేయొచ్చు. చాంతాడంత కంటెంట్‌ను సంక్షిప్తంగా పొందవచ్చు. జీమెయిల్‌తో అనుసంధానించడం వల్ల ప్రస్తుత పేజీ నుంచి వేరే పేజీకి వెళ్లక్కర్లేకుండా, సైడ్‌ ప్యానెల్‌ నుంచే ఈమెయిల్స్‌ రాయొచ్చు, పంపించవచ్చు.ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌.. తర్వాత దీని వంతే!

India Eases FDI Rules for Global Firms Excludes China and Border Nations4
సరళీకరణ సరిహద్దు దేశాలకుకాదు!

కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనల సరళీకరణ విదేశీ సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి శివహరి పేర్కొన్నారు. 10 శాతంలోపు చైనీస్‌ వాటా కలిగిన ఇతర దేశాలకు చెందిన సంస్థలు దేశీయంగా ఎంపిక చేసిన రంగాలలో పెట్టుబడులు చేపట్టేందుకు ఆటోమాటిక్‌ మార్గంలో అనుమతి లభిస్తుందని తెలియజేశారు. అయితే చైనా, హాంకాంగ్‌ లేదా ఏ ఇతర సరిహద్దు పంచుకుంటున్న దేశాని(ఎల్‌బీసీ)కైనా తాజా సవరణలు వర్తించవని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య శాఖ(డీపీఐఐటీ) జాయింట్‌ సెక్రటరీ జై ప్రకాష్‌ శివహరి వెల్లడించారు.ఇప్పటివరకూ సరిహద్దు దేశాల వాటాదారులుగా ఉన్న విదేశీ సంస్థలు దేశీయంగా ఇన్వెస్ట్‌ చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవలసి ఉండేదని వివరించారు. ఈ నెల 10న కేంద్ర కేబినెట్‌ 2020 ప్రెస్‌ నోట్‌ 3లో సవరణలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిపై శివహరి తాజా వివరణ ఇచ్చారు. వెరసి సరిహద్దు దేశాలన్నిటికీ ఎఫ్‌డీఐ ఆంక్షలు అమల్లో ఉన్నట్లు తెలియజేశారు. నాన్‌ఎల్‌బీసీ సంస్థలు 10 శాతంలోపు ఎల్‌బీసీ వాటాదారులుగా ఉన్నప్పుడు కొన్ని రంగాలలో ప్రత్యక్ష పెట్టుబడులకు తాజా సవరణల ద్వారా ఆటోమాటిక్‌ అనుమతి లభిస్తుందని వివరించారు.

Equity Mutual Funds Shine in February5
మళ్లీ ఫోకస్‌లోకి ఈక్విటీ ఫండ్స్‌

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫిబ్రవరిలో మెరిశాయి. అంతకుముందు రెండు నెలల్లో వరుస క్షీణత తర్వాత మెరుగైన పెట్టుబడులు నమోదయ్యాయి. రూ.25,978 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జనవరిలో వచ్చిన రూ.24,028 కోట్ల కంటే 8 శాతం అధికం. 2025 డిసెంబర్‌లో రూ.28,054 కోట్లు, నవంబర్‌లో రూ.29,911 కోట్ల చొప్పున పెట్టుబడులు రావడం గమనార్హం. ఫిబ్రవరి చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ రూ.82.3 లక్షల కోట్లకు చేరుకుంది. జనవరి చివరికి ఈ మొత్తం రూ.81 లక్షల కోట్లుగానే ఉంది. ఈ వివరాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసింది. అంతర్జాతీయ పరిణామాల మధ్య దేశీ ఈక్విటీలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న తరుణంలోనూ ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన పెట్టుబడుల రాక వారిలోని విశ్వాసానికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. విభాగాల వారీ..ఫిబ్రవరిలో ఫండ్స్‌ పరిశ్రమలో 42.58 లక్షల కొత్త ఫోలియోలు నికరంగా పెరిగాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు సంఖ్యను ఫోలియోగా చెబుతారు. అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ రూ.6,295 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వరుసగా ఏడో నెలలోనూ ఈ పథకాలు మెరుగైన పెట్టుబడులను రాబట్టాయి.మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.4,003 కోట్లు, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ సైతం రూ.3,881 కోట్లు ఆకర్షించి మెరిశాయి.సెక్టోరల్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌లోకి రూ.2,987 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో కొత్త ఫండ్‌ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌వో) ఇన్వెస్టర్ల నుంచి రూ.3,995 కోట్లను సమీకరించాయి. ముఖ్యంగా సెక్టోరల్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌ విభాగంలో ఆరు ఎన్‌ఎఫ్‌వోలు కలిపి రూ.3,560 కోట్లను ఆకర్షించడం గమనార్హం. ఒక లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌వో రూ.324 కోట్లు, మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌వో రూ.71 కోట్ల చొప్పున సమీకరించాయి.కళ తప్పిన వెండి ఈటీఎఫ్‌లు వెండి ఈటీఎఫ్‌లు జవనరిలో రూ.9,463 కోట్లను ఆకర్షించి రికార్డు సృష్టించగా.. ఫిబ్రవరిలో పరిస్థితి తలకిందులైంది. ఇన్వెస్టర్లు నికరంగా రూ.826 కోట్లను వెండి ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కి తీసుకున్నారు. 2023 నవంబర్‌ తర్వాత వెండి ఈటీఎఫ్‌ల నుంచి పెబ్టుబడులు బయటకు వెళ్లిపోవడం ఇదే మొదటిసారి.బంగారం ఈటీఎఫ్‌ల్లోకి రూ.5,255 కోట్లు వచ్చాయి. జనవరిలో వచ్చిన రూ.24,039 కోట్లు, 2025 డిసెంబర్‌లో వచ్చిన రూ.11,647 కోట్లతో పోలి్చతే గణనీయంగా తగ్గాయి. వెండి, బంగారం ధరలు ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి కొంత దిద్దుబాటుకు గురైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణికి గురైనట్టు తెలుస్తోంది. ఇండెక్స్‌ ఫండ్స్‌లోకి రూ.3,233 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డెట్‌ ఫండ్స్‌ రూ.42,106 కోట్లను ఆకర్షించాయి. జనవరిలో వచి్చన రూ.74,827 కోట్లతో పోలిస్తే తగ్గాయి.పటిష్టంగానే సిప్‌ పెట్టుబడులుఫిబ్రవరిలో సిప్‌ పెట్టుబడులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. బలంగానే నమోదయ్యాయి. రూ.29,845 కోట్లను సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో పెట్టుబడి పెట్టారు. జనవరిలో ఇవి రూ.31,002 కోట్లుగా ఉన్నాయి. అయినప్పటికీ ఫండ్స్‌ నిర్వహణలోని సిప్‌ ఆస్తుల విలువ నెలవారీగా 1.7 శాతం పెరిగి రూ.16.64 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తుల్లో 20.3 శాతం సిప్‌ రూపంలోనే వచి్చనవే కావడం గమనార్హం. సిప్‌ల నిలిపివేత 76 శాతంగా ఉంది. జనవరిలో నిలిపివేత 74 శాతం కంటే స్వల్పంగా పెరిగింది. ఫిబ్రవరిలో 28 రోజులే ఉండడం సిప్‌ పెట్టుబడులు తగ్గడానికి కారణమని యాంఫి సీఈవో వెంకట్‌ ఎన్‌ చలసాని తెలిపారు. 29, 30, 31వ తేదీల్లోని సిప్‌ వాయిదాలు మార్చి నెలలో ప్రాసెస్‌ అవుతుంటాయని చెప్పారు.సిఫ్‌కు భలే ఆదరణసంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గంలోనే అధిక రాబడి కోరుకునే వారి కోసం తీసుకొచ్చిన స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌) నిర్వహణ ఆస్తులు ఫిబ్రవరిలో రూ.9,711 కోట్లకు పెరిగాయి. జనవరితో పోల్చితే 47.9 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఫండ్స్‌లో కనీసం రూ.10 లక్షల ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో ఈ విభాగంలోకి నికరంగా రూ.3,127 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మూడు కొత్త సిఫ్‌లు ప్రారంభమయ్యాయి. రెండు ఈక్విటీ స్ట్రాటజీ సిఫ్‌లు రూ.916 కోట్లు, ఒక హైబ్రిడ్‌ స్ట్రాటజీ సిఫ్‌ రూ.436 కోట్లను సమీకరించాయి.ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌.. తర్వాత దీని వంతే!

Global Tensions Asian Markets Sensex Nifty Likely to Open Gap Down Today6
ఆసియా మార్కెట్లు ఢమాల్‌..

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేడు భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. నేడు (గురువారం) ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ పతనం దిశగా పయనిస్తుండటంతో మన దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు గ్యాప్ డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆసియా మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జపాన్ సూచీ నిక్కీ, కోస్పీ-దక్షిణ కొరియా మార్కెట్‌, గిఫ్ట్ నిఫ్టీ.. వంటి ముందస్తు దిక్సూచిగా భావించే సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇది భారత మార్కెట్లు కనీసం 1.5% నుంచి 2% నష్టంతో ప్రారంభమవుతాయని సూచిస్తోంది.మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలుఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లను భయపెడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవచ్చనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి.యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ద్రవ్యోల్బణ ముప్పుగా పరిణమించనుంది.గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) షేర్ల ర్యాలీకి బ్రేక్ పడింది. టెక్ దిగ్గజాల వాల్యుయేషన్లపై అనుమానాలు మొదలవడంతో అంతర్జాతీయ స్థాయిలో టెక్ షేర్లను ఇన్వెస్టర్లు వదిలించుకుంటున్నారు.భారత మార్కెట్‌పై ప్రభావం ఎలా ఉండబోతోంది?నిపుణుల అంచనా ప్రకారం.. మార్కెట్ అవర్స్‌లో బ్యాంక్ నిఫ్టీ, ఐటీ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మార్కెట్లు పడిపోతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నేడు బంగారం పెరిగే అవకాశం ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడవచ్చు.‘ప్రస్తుత అస్థిరత నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం లేదా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈ పతనాన్ని అవకాశంగా మార్చుకోవడం ఉత్తమం’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌.. తర్వాత దీని వంతే!

Advertisement
Advertisement
Advertisement