Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

JCB India at EXCON 2025 Largest Excavator Ever in India1
బాహుబలి ఎక్స్‌కవేటర్‌ వచ్చేసింది!

దక్షిణాసియాలోనే అతిపెద్ద నిర్మాణ పరికరాల ప్రదర్శన అయిన ఎక్స్‌కాన్‌-2025లో జేసీబీ ఇండియా చారిత్రక ఆవిష్కరణ చేసింది. భారత మౌలిక సదుపాయాలకు అనుగుణంగా 400 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌తో శక్తివంతమైన 52-టన్నుల జేసీబీ 520 ఎక్స్‌ఎల్‌ ఎక్స్‌కవేటర్‌ను ఆవిష్కరించింది. భారతదేశంలో తయారు చేసిన అత్యంత భారీ యంత్రంగా నిలిచిన ఈ ఎక్స్‌కవేటర్‌ దేశీయ భారీ నిర్మాణాల అవసరాలకు ఎంతో తోడ్పడుతుందని జేసీబీ తెలిపింది.ఇది జాతీయ రహదారుల ప్రాజెక్టులు, విస్తృత మైనింగ్ కార్యకలాపాలు, పట్టణ విస్తరణలో అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ యంత్రం లాంచ్‌తో జేసీబీ హెవీ డ్యూటీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించినట్టు స్పష్టమవుతోంది. ఇది భారత మౌలిక సదుపాయాల వృద్ధిని మరింత వేగవంతం చేయగలదని కంపెనీ చెప్పింది. ప్రపంచ ఎగుమతుల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు పేర్కొంది.ఈ ప్రదర్శనలో జేసీబీ ఒక్క 520 ఎక్స్‌ఎల్‌ను మాత్రమే కాకుండా మొత్తం 10కి పైగా కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఈ ఉత్పత్తులన్నీ కస్టమర్ కేంద్రీకృత ఇన్నోవేషన్‌లుగా ఉంటాయని కంపెనీ చెప్పింది. ఎన్‌హాన్స్‌ బ్యాక్‌హో లోడర్లు, కొత్త 2-5 టన్నుల ఎక్స్‌కవేటర్‌ రేంజ్‌తో సహా ఈ మెషిన్లు లో మేనేజ్‌మెంట్‌ ఖర్చు, మెరుగైన ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. గత 15 సంవత్సరాల్లో జేసీబీ తన యంత్రాల్లో 45% ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు చెప్పింది.హైడ్రోజన్ జెన్ సెట్ ఆవిష్కరణస్థిరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ జేసీబీ తన హైడ్రోజన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. 2023లో ప్రవేశపెట్టిన హైడ్రోజన్ బ్యాక్‌హో లోడర్ విజయవంతం అయిన తరువాత కంపెనీ ఇప్పుడు హైడ్రోజన్ ఎనర్జీతో నడిచే జెన్ సెట్‌ను ప్రకటించింది. ఈ ఆవిష్కరణ జీరో-కార్బన్ ఎమిషన్లతో స్వచ్ఛ ఇంధన పరిష్కారాలను అందిస్తుంది.కస్టమర్ సపోర్ట్ బలోపేతండిజిటల్ పరివర్తనలో భాగంగా జేసీబీ అనేక కొత్త ప్లాట్‌ఫామ్‌లను ప్రవేశపెట్టింది. ‘పార్ట్స్ ఆన్‌లైన్’ పోర్టల్ ద్వారా ఈ-కామర్స్ తరహాలో విడి భాగాల కేటలాగ్‌ను అందిస్తూ, లావాదేవీలను వేగవంతం చేస్తుంది. నెక్స్ట్-జెన్ టెలిమాటిక్స్ వ్యవస్థ ద్వారా మెషిన్ కంటిషన్‌ను మెరుగుపరుస్తుంది. రియల్-టైమ్ ఆపరేషనల్ ఇన్‌సైట్స్ అందిస్తుంది.నైపుణ్యాభివృద్ధికి సిమ్యులేటర్లుశిక్షణా విభాగంలో జేసీబీ ‘దక్ష్’ ద్వారా సిమ్యులేటర్లను అందిస్తుంది. ఇది శిక్షణా ఖర్చులను తగ్గించడంతోపాటు భద్రతను పెంచుతుందని కంపెనీ తెలిపింది. 2026 ప్రారంభంలో ఎక్స్‌కవేటర్‌ సిమ్యులేటర్ కూడా విడుదల కానున్నట్లు పేర్కొంది. చిన్న కాంట్రాక్టర్లు ఈ సిమ్యులేటర్ల ద్వారా ఖరీదైన శిక్షణ లేకుండానే ఆపరేటర్ల నైపుణ్యాలను మెరుగుపరచవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: జీవిత బీమాపై అపోహలు తగ్గాలి

Mercedes Benz Cars Price Hike From 2026 Jan 12
పెరగనున్న బెంజ్ కార్ల ధరలు: జనవరి 1 నుంచే..

2025 ముగుస్తోంది, 2026 రాబోతోంది. ఈ సమయంలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' తన మొత్తం ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.వచ్చే ఏడాది ప్రారంభం (జనవరి 1) నుంచే బెంజ్ కార్ల ధరలు 2 శాతం పెరగనున్నాయి. కరెన్సీ అస్థిరత, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిరంతర లాజిస్టికల్ సవాళ్లు మొదలైన కారణాల వల్ల.. ధరలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. యూరోతో పోలిస్తే భారత రూపాయి బలహీనమైన నేపథ్యంలో బీఎండబ్ల్యూ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. ఇప్పుడు బెంజ్ కంపెనీ ఈ జాబితాలో చేరింది.2026 జనవరి 1నుంచి 2 శాతం ధరలు పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. కానీ ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని సంస్థ స్పష్టంగా వెల్లడించలేదు. మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో వివిధ రకాల బాడీ స్టైల్స్‌లో లగ్జరీ కార్లను విక్రయిస్తుంది. వీటిలో స్థానికంగా తయారు చేసినవి, స్థానికంగా అసెంబుల్ చేసినవి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) మోడల్‌లు ఉన్నాయి. అయితే కొత్త ధరలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టెస్టింగ్ కోసం మిరాయ్: త్వరలో రానుందా?

Indias Medical Costs to Rise 11 5 pc in 2026 Report3
మరింత పెరగనున్న వైద్య ఖర్చులు

కొత్త సంవత్సరం వస్తోంది. ఉద్యోగులు వచ్చే ఏడాది ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నూతన సంవత్సరం మరింత ఖరీదైన వైద్య ఖర్చుల భారాన్ని కూడా మోసుకొస్తోంది. దేశంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు 2026లో 11.5% పెరుగుతాయని అయోన్ గ్లోబల్ మెడికల్ ట్రెండ్ రేట్స్ రిపోర్ట్ తెలిపింది.వైద్య ఖర్చుల పెరుగుదల 2025లో ఉన్న 13% కంటే కొత్త ఏడాదిలో తక్కువే అయినప్పటికీ దేశ వైద్య సంబంధ ద్రవ్యోల్బణం ప్రపంచ సగటు 9.8% కంటే ఎక్కువగా ఉంది. హృదయ సంబంధ వ్యాధులు, జీర్ణశయ రుగ్మతలు, క్యాన్సర్ వంటివి వైద్య ఖర్చులను మరింత పెంచుతాయని నివేదిక హైలైట్ చేస్తోంది. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, పోషకాహారలేమి వంటి కారకాలు ఖర్చుల భారం పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడింది.వైద్య ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయంటే..ఇటీవల కాలంలో వైద్య సాంకేతికతల్లో అత్యంత పురోగతి వచ్చింది. కొత్త కొత్త వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అధునాతన రొబోటిక్స్‌, ఏఐ టెక్నాలజీని వైద్య చికిత్సల్లో వినియోగిస్తున్నారు.ప్రాణాంతకమైన అనేక జబ్బులకు ఇటీవల నూతన ఔషధాలు కనుగొంటున్నారు. సాధారణంగా ఇవి అత్యంత ఖరీదైనవిగా ఉంటున్నాయి.దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఆస్థాయిలో నాణ్యమైన ఆసుపత్రులు, నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులు ఉండటం లేదు. దీంతో మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది.పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి రక్షించుకోవడానికి చాలా మంది ఉద్యోగులు వైద్య బీమాను ఆశ్రయిస్తుంటారు. అయితే వాటిలో ఇటీవల క్లెయిమ్‌లు పెరగడంతో ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రీమియంలను పెంచేస్తున్నాయి.

IndiGo Crisis 4 flight operation inspectors suspended4
ఇండిగో సంక్షోభం.. నలుగురు అధికారుల సస్పెన్షన్‌

విమానయన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభానికి సంబంధించి నలుగురు అధికారులు సస్పెండ్‌ అయ్యారు. గడిచిన పది రోజుల్లో ఇండిగో భారీగా విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డారు. ఈ అసౌకర్యానికి అంతటికీ బాధ్యులను చేస్తూ నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్లను (ఎఫ్ఐఓ) ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ శుక్రవారం సస్పెండ్ చేసింది.సస్పెండ్‌ అయిన ఈ నలుగురు అధికారులు విమానయాన భద్రత, పైలట్ శిక్షణ, నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు చూస్తారు. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు ఏవియేషన్ రెగ్యులేటర్ ముందు హాజరవుతున్న తరుణంలోనే అధికారుల సస్పెన్షన్ జరగడం గమనార్హం.విమానాల అనూహ్య రద్దుతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. వేల సంఖ్యలో ఫ్లైట్లు క్యాన్సిల్‌ అయ్యాయి. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే శుక్రవారం రోజున అత్యధికంగా 1,600కి పైగా విమానాలు రద్దు కావడం ‍అత్యవసర ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది.

Gold and Silver rates on 12th December 2025 in Telugu states5
పసిడి పిడుగు.. సిల్వర్‌ షాక్‌!! దారుణంగా ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు మరింత దూసుకెళ్లాయి. బంగారం ధరలు వరుసగా మూడో రోజూ భారీగా పెరిగి హ్యాట్రిక్‌ కొట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) ఒక్కసారిగా ఎగిశాయి. ఇక వెండి ధరలు అయితే వరుసగా ఐదో రోజూ భారీ స్ఠాయిలో దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on December 12th 20256
లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 119 పాయింట్లు పెరిగి 26,017కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 408 పాయింట్లు లాభపడి 85,226 వద్ద ట్రేడవుతోంది.ఎల్ అండ్ టీ, హిందాల్కో, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, జియో ఫైనాన్స్, మారుతి సుజుకీ, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు నిఫ్టీ గెయినర్లుగా నిలిచాయి. విప్రో, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, హెచ్ యూఎల్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ ఎం షేర్లు లాభాల బుకింగ్ లో పతనమయ్యాయి.Today Nifty position 12-12-2025(time: 9:51 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement