Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Indias Flex Office Sector Eyes 10 Billion Valuation by 20281
రియల్ ఎస్టేట్‌కు గట్టి పోటీ ఇస్తున్న ‘ఫ్లెక్స్ ఆఫీస్’

దేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ (ఫ్లెక్స్ ఆఫీస్) పరిశ్రమ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలో ఈ రంగం ఇప్పటికే 100 మిలియన్ చదరపు అడుగుల మార్కును దాటడమే కాకుండా, లాభాల బాటలో పయనిస్తూ సరికొత్త వృద్ధి దశలోకి ప్రవేశించింది. అనరాక్‌ ‍గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ మార్కెట్‌ప్లేస్‌ ‘మైహెచ్‌క్యూ’(myHQ) విడుదల చేసిన క్యూ3 (Q3 FY26) ఫ్లెక్స్ ఆఫీస్ నివేదిక ప్రకారం.. 2028 నాటికి ఈ రంగం విలువ ఏకంగా 9 నుండి 10 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.ఒకప్పుడు కేవలం స్టార్టప్‌లకే పరిమితమైన ఈ రంగం.. ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs), బడా కార్పొరేట్ సంస్థల రాకతో సరికొత్త రూపును సంతరించుకుంది. కొత్తగా బుక్ అవుతున్న సీట్లలో దాదాపు 40% వాటాను ఇవే కైవసం చేసుకుంటున్నాయి. గత రెండేళ్లలో సగటు డీల్ సైజు 25 సీట్ల నుండి ఏకంగా 53 సీట్లకు పెరగడం విశేషం. దీన్నిబట్టి ప్రధాన స్రవంతి రియల్ ఎస్టేట్ వ్యూహాల్లో ఫ్లెక్స్ ఆఫీస్‌ల ప్రాధాన్యత ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.లాభాల బాటలో దిగ్గజాలుఈ రంగంలో 2026 ఆర్థికేడాదిలోని మూడో త్రైమాసికం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మార్కెట్లోని పలు అగ్రగామి లిస్టెడ్ ఆపరేటర్లు ఒకేసారి లాభాల్లోకి రావడం విశేషం. 'వీవర్క్ ఇండియా' (WeWork India), 'స్మార్ట్‌వర్క్స్' (Smartworks) రెండు సంస్థలూ లాభాలు ఆర్జించాయి. ఇందులో 'స్మార్ట్‌వర్క్స్' అత్యధికంగా 490 బేసిస్ పాయింట్ల మార్జిన్ వృద్ధిని నమోదు చేసి రికార్డు సృష్టించింది.వృద్ధికి ప్రధాన కారణాలు ఇవే..కార్పొరేట్ సంస్థల మొగ్గు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) సంస్థలు ఈ ఆఫీస్‌లను ఎక్కువగా ఎంచుకుంటుండటంతో పరిశ్రమకు దీర్ఘకాలిక స్థిరత్వం లభిస్తోంది.ఆదాయ వనరుల వైవిధ్యం: కేవలం ఆఫీస్ స్పేస్‌పైనే కాకుండా.. MICE (సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్లు), డే పాస్‌లు, ప్రైవేట్ క్యాబిన్లు, ఇతర విలువ ఆధారిత సేవల ద్వారా ఆపరేటర్లు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొత్తం ఆదాయంలో వీటి వాటా 12-16% గా ఉంది.ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరణ: బెంగళూరులోని సర్జాపూర్, హెబ్బాల్, హైదరాబాద్‌లోని కోకాపేట, పూణేలోని హింజేవాడి, చెన్నైలోని ఓఎంఆర్‌వంటి మెట్రో ప్రాంతాలతో పాటు.. అహ్మదాబాద్, కొచ్చి, ఇండోర్ వంటి టైర్-2 నగరాలు కూడా ఇప్పుడు ప్రధాన హబ్‌లుగా మారుతున్నాయి.భారీ పెట్టుబడులు: గ్లోబల్ ఫండ్స్ రాక, ఐపీఓ (IPO)ల ద్వారా నిధుల సమీకరణ ఈ రంగం మరింత వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తున్నాయి.సంప్రదాయ రియల్ ఎస్టేట్‌కు గట్టి పోటీఈ పరిణామాలపై మైహెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉత్కర్ష్ కవాత్రా మాట్లాడుతూ.. ‘ఫ్లెక్స్ ఆపరేటర్లు ఇప్పుడు కేవలం తమలో తాము మాత్రమే పోటీ పడటం లేదు. సంప్రదాయ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌తో తలపడుతూ.. ఫ్లెక్సిబులిటీ, వేగం, మూలధన సామర్థ్యంతో విజయం సాధిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Stock Market closing April 1 Sensex settles off days high2
స్టాక్‌ మార్కెట్లు ముగిశాయిలా..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. యూఎస్-ఇరాన్ యుద్ధం ముగింపు వార్తల నేపథ్యంలో ఉదయం అత్యంత భారీ లాభాలలో పయనించాయి. అయితే ప్రారంభ ఉత్సాహం మసకబారడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెషన్‌ ద్వితీయార్ధంలో రోజు గరిష్ట స్థాయి నుండి లాభాలు క్షీణించాయయి.ముగింపు సమయానికి నిఫ్టీ 1.56 శాతం లేదా 348 పాయింట్ల లాభంతో 22,679.40 వద్ద, సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు లేదా 1.65 శాతం పెరిగి 73,134.34 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ట్రెంట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.24 శాతం, 3.24 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ టాప్‌ గెయినర్‌గా ఉంది. నిఫ్టీ కెమికల్, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఫార్మా నష్టాల్లో నిలిచాయి.

ATM rules changed HDFC PNB Bandhan Bank atms new rules from April 13
ఏటీఎం రూల్స్‌.. ఇక మారిపోయాయ్‌..

దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఏటీఎం వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), బంధన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్‌ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్‌డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్‌ విత్‌డ్రా లిమిట్‌ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గిందిఅయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్‌ను పీఎన్‌బీవన్‌ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.బంధన్ బ్యాంక్బంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది. సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది.ఉచిత పరిమితి మించితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఒక్కో నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.10 అదనంగా చార్జీలు ఉంటాయి. ఇ‍క తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే రూ.25 పెనాల్టీ విధిస్తారు.

Shell India Joins Nayara Fuel Prices Surge as Crude Oil Tops4
నయారా బాటలో షెల్‌ ఇండియా!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచిన నయారా ఎనర్జీ బాటలోనే తాజాగా ‘షెల్ ఇండియా’ సైతం ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడంతో నష్టాలను తగ్గించుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.బెంగళూరులో ధరల మోతతాజా పెంపుతో కర్ణాటక రాజధాని బెంగళూరులో షెల్‌ కంపెనీ అవుట్‌లెట్లలో ఇంధన ధరలు కింది విధంగా ఉన్నాయి. స్థానిక పన్నుల వ్యత్యాసం కారణంగా ఇతర నగరాల్లో ఈ ధరలు స్వల్పంగా అటు ఇటుగా ఉండవచ్చు.ఇంధనం రకంపెంపు (లీటరుకు)తాజా ధర (సాధారణ)ప్రీమియం వేరియంట్ ధరపెట్రోల్రూ. 7.41రూ. 119.85రూ. 129.85డీజిల్రూ. 25.01రూ. 123.52రూ. 133.52 అంతర్జాతీయ సంక్షోభంఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 60 శాతం మేర పెరిగింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి గుండా సరఫరాకు అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు ధరలను మరింత పెంచుతున్నాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో ఈ సరఫరా గొలుసులో తలెత్తే స్వల్ప మార్పులైనా దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగ సంస్థలుముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను దాదాపు స్థిరంగా ఉంచడం గమనార్హం. అయితే ప్రైవేట్ రిటైలర్లు అయిన షెల్, నయారా వంటి సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు లభించే సబ్సిడీలు లేదా నష్టపరిహారాలు ప్రైవేట్ సంస్థలకు అందవు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తమ మనుగడ సాగించాలంటే పెరిగిన భారాన్ని కస్టమర్లపై వేయడం తప్ప మరో మార్గం లేదని ప్రైవేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

Enterprise AI Shifts Focus From Model Power to Operational Control5
ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా..

కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కేవలం ప్రయోగశాలలకో, మొబైల్ యాప్‌లకో పరిమితమైన సాంకేతికత కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని అంతర్భాగం చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘మోడల్ సామర్థ్యం’ కంటే ఇప్పుడు దాని ‘నిర్వహణా సామర్థ్యం’ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటర్‌ప్రైజ్ ఏఐ మనుగడకు నియంత్రణ, సమన్వయం కీలకంగా మారుతున్నాయిని ప్రముఖ సంస్థ గార్ట్‌నర్‌ అంచనా వేసింది.2027 నాటికి 40 శాతం ప్రాజెక్టులు రద్దు?గార్ట్‌నర్‌ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి సుమారు 40 శాతం ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం.. అంచనాలకు మించి నిర్వహణ ఖర్చులు పెరగడం, వ్యాపార పరంగా స్పష్టమైన విలువ జోడింపు కనిపించకపోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలాఉండగా, కేవలం ఏఐ మోడల్స్‌ను కొనుగోలు చేయడం వల్ల లాభం లేదని, పని విధానాన్ని పునర్నిర్మించడం, పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే ఫలితాలు వస్తాయని మెకిన్సే పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.అడ్డంకిగా అవాస్తవ సమాచారంఏఐ వ్యవస్థలు ఇచ్చే సమాచారం ఎంతవరకు నమ్మదగినది? అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద కంపెనీలను వేధిస్తోంది. కేపీఎంజీ 2025 నివేదిక ప్రకారం.. 54 శాతం మంది ప్రతినిధులు డేటాలో ఉన్న అశాస్త్రీయతను ప్రధాన రిస్క్‌గా భావిస్తున్నారు. 45 శాతం మంది ఏఐ సృష్టించే తప్పుడు సమాచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల పైలట్ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలోకి రావడానికి జాప్యం జరుగుతోంది. ఇక్కడే గవర్నెన్స్(నియంత్రణ) ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఏఐ తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? అనే అంశాలపై స్పష్టత లేకపోతే సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.సమీకృత పరిష్కారంప్రముఖ టెక్ నిపుణుడు, ఎవాల్యుయేట్‌ఐక్యూ సహ వ్యవస్థాపకుడు సంజయ్ కొప్పికర్ అభిప్రాయం ప్రకారం.. ఎంటర్‌ప్రైజ్ ఏఐలో గవర్నెన్స్, సమన్వయం అనేవి విడివిడి అంశాలు కావు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ‘ఏఐని కేవలం అమలు చేయడం ముఖ్యం కాదు, దానిని నియంత్రించగలగడం, వివరించగలగడం, నమ్మదగినదిగా మార్చడం తక్షణ అవసరం’ అని చెప్పారు.భారీ పెట్టుబడులు - రాబడిపై ఆందోళనలుటెక్ దిగ్గజాలు జనరేటివ్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. నిత్యం కొత్త వెర్షన్లు, కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటంతో పాత టెక్నాలజీ త్వరగా కాలం చెల్లిపోతోంది. దీంతో పెట్టుబడిని ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.దాంతో కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి చిన్న, ప్రత్యేకమైన మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఏఐ ఇచ్చే అవుట్‌పుట్ నమ్మదగ్గదిగా ఉంటేనే క్లయింట్లు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ట్రస్ట్‌ను ఒక ఫీచర్‌గా కంపెనీలు అమ్ముతున్నాయి. పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా మానవ పర్యవేక్షణ ఉండేలా హైబ్రిడ్‌ వర్క్ ఫ్లోలను డిజైన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

South India Retirement Readiness Lags Despite Rising Health Awareness6
ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణపై అవగాహన మెరుగుపడినప్పటికీ పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రత విషయంలో మాత్రం ఇంకాస్త అప్రమత్తత అవసరమని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, కాంతార్‌తో కలిసి నిర్వహించిన ఐదో ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (ఐరిస్‌ 5.0)’ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దక్షిణాదిలో రిటైర్మెంట్ ఇండెక్స్ 2022లో 43 పాయింట్లు ఉండగా 2025 నాటికి అది స్వల్పంగా మారి 45కు చేరింది. అయితే జాతీయ సగటు (44 నుంచి 48కి)తో పోలిస్తే ఈ వృద్ధి నెమ్మదిగానే ఉంది.నివేదికలోని అంశాలు..దక్షిణాది ప్రజలు తమ ఫిట్‌నెస్‌పై మునుపటి కంటే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.ప్రతిరోజూ వ్యాయామం చేసే వారి సంఖ్య 37% నుంచి 44%కి పెరిగింది. ఇది జాతీయ వృద్ధి రేటు కంటే ఎక్కువ.ఆరోగ్య ధీమా: సుమారు 80 శాతం మంది తాము పదవీ విరమణ తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.డిజిటల్ హెల్త్: వెల్నెస్ యాప్‌లను ఉపయోగించడంలో దక్షిణాది వాసులు (18%) జాతీయ సగటు (15%) కంటే ముందున్నారు.బీమా: హెల్త్ చెకప్‌ల పట్ల ఆసక్తి పెరిగినప్పటికీ ఆరోగ్య బీమా వినియోగం మాత్రం 44% వద్దే నిలిచిపోయింది. ఇది జాతీయ సగటు (50%) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.10 ఏళ్లకే నిధులు ఖాళీ?పదవీ విరమణ ప్రణాళిక అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని 54% మంది భావిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం వెనుకబడి ఉన్నారు.దేశవ్యాప్తంగా 67% మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెడుతుంటే దక్షిణాదిలో అది కేవలం 61% మాత్రమే ఉంది.రిస్క్ ఉన్నా అధిక లాభాలనిచ్చే ఇన్వెస్ట్‌మెంట్లలో పెట్టుబడులు కేవలం 33% మాత్రమే ఉండగా, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సాంప్రదాయ పద్ధతులపైనే (58%) ఎక్కువగా ఆధారపడుతున్నారు.తమ పొదుపు మొత్తాలు రిటైర్మెంట్ తర్వాత పదేళ్లకు మించి రావని 27% మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఆస్తులు (39%), ఇతర తక్షణ ఖర్చుల (33%) కారణంగా పదవీ విరమణ పొదుపుపై దృష్టి పెట్టలేకపోతున్నామని సర్వేలో తేలింది.ఒంటరితనం దూరంఆర్థికంగా వెనుకబడటం మినహాయిస్తే కుటుంబ మద్దతు విషయంలో దక్షిణాది వాసులు ధైర్యంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులు అండగా ఉంటారనే నమ్మకం 57 శాతానికి పెరిగింది. గతంలో 75 శాతంగా ఉన్న ఒంటరితనపు భయంతో ఉండేవారు. ప్రస్తుతం ఇది 68 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం.‘ఆరోగ్యం, వెల్నెస్ పట్ల అవగాహన పెరగడం శుభపరిణామం. అయితే ఆలోచనలకు ఆచరణ తోడైనప్పుడే పూర్తిస్థాయి పదవీ విరమణ భద్రత లభిస్తుంది. ఆర్థిక ప్రణాళికల్లో ఉన్న ఈ అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది’ అని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాహుల్ తల్వార్ అన్నారు. దక్షిణాదిలో ప్రజలు ఆరోగ్యంగా, మానసికంగా బలంగా మారుతున్నప్పటికీ ఆర్థికంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మదుపు చేయడం ద్వారానే సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌ కాదు.. ఈసారి కండోమ్‌ల వంతు!

Advertisement
Advertisement
Advertisement