Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Skoda Kodiaq RS Sold Out in 6 Minutes India Booking Frenzy1
ఆరు నిమిషాల్లోనే అన్నీ సేల్‌.. కొత్త కారు క్రేజ్‌

భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో పనితీరు ఆధారిత ప్రీమియం ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరుగుతోందని మరోసారి రుజువైంది. స్కోడా ఆటో ఇండియా తాజాగా బుకింగ్‌లను ప్రారంభించిన తన ఫ్లాగ్‌షిప్‌ పెర్ఫార్మెన్స్‌ ఎస్‌యూవీ ‘కొడియాక్‌ ఆర్ఎస్‌’ తొలి బ్యాచ్‌ వాహనాలన్నీ కేవలం ఆరు నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయాయి. దేశానికి కేటాయించిన తొలి 50 యూనిట్లను వినియోగదారులు బుక్‌ చేసుకోవడంతో ఈ మోడల్‌పై ఉన్న ఆసక్తి స్పష్టమైంది.స్కోడా భారత మార్కెట్లో ఆర్ఎస్‌ (ర్యాలీ స్పోర్ట్‌) బ్యాడ్జ్‌తో తీసుకొచ్చిన తొలి ఎస్‌యూవీ ఇదే. కంపెనీ 125 ఏళ్ల మోటార్‌స్పోర్ట్స్‌ వారసత్వం, ఆర్ఎస్‌ బ్రాండ్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక మోడల్‌ను పరిమిత సంఖ్యలో సీబీయూ (Completely Built Unit) రూపంలో తీసుకొచ్చింది.కొడియాక్‌ ఆర్ఎస్‌లో 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 265 పీఎస్‌ శక్తి, 400 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్‌ డీఎస్‌జీ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌, ఆల్‌వీల్‌ డ్రైవ్‌ వ్యవస్థతో కూడిన ఈ ఎస్‌యూవీ 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో చేరుకుంటుందని స్కోడా వెల్లడించింది. గరిష్ఠ వేగం గంటకు 231 కి.మీ. వరకు ఉంటుంది. దీంతో ఇది భారతదేశంలో స్కోడా విక్రయిస్తున్న అత్యంత వేగవంతమైన మోడల్‌గా నిలిచింది.ధరను స్కోడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మార్కెట్‌ వర్గాల అంచనాల ప్రకారం ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. తొలి బ్యాచ్‌ పూర్తిగా అమ్ముడవడంతో కంపెనీ అదనపు యూనిట్లను భారత్‌కు కేటాయిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: సెకండ్‌ హ్యాండ్‌ కార్లలో ‘స్విఫ్ట్‌’ హవా!

Will AI Replace IT Companies Infosys Chairman Nandan Nilekani Answer2
ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా?

న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల స్థానాన్ని కృత్రిమ మేథ (ఏఐ) ఎన్నటికీ ఆక్రమించలేదని ఇన్ఫోసిస్‌ సహ–వ్యవస్థాపకుడు, చైర్మన్‌ నందన్‌ నీలేకని స్పష్టం చేశారు. ఏఐతో ఐటీ కంపెనీలు మరింత పటిష్టమవుతాయని ఆయన తెలిపారు. 2030 నాటికి 400 బిలియన్‌ డాలర్ల భారీ ఏఐ ఆధారిత సర్వీసులకు సంబంధించిన అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఇన్ఫీ మరింతగా దృష్టి పెడుతోందని నీలేకని చెప్పారు.కంపెనీ 45వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. సాంకేతిక విప్లవాలు వేగవంతమవుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్న సందేహాలపై నీలేకని స్పందించారు. జెన్‌ఏఐ మనుగడలోకి వచ్చిన మూడేళ్ల వ్యవధిలో ఇన్ఫోసిస్‌ మరింత పటిష్టంగా మారిందని, రాబోయే దశాబ్దకాలాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అత్యుత్తమ కోడింగ్‌ టూల్స్‌ని ఉపయోగించుకుని ఉత్పాదకతను మరింతగా పెంచుకున్నప్పటికీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌కి సంబంధించి జీవిత కాలంలో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయన్నారు. కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌కి కఠినతరమైన పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, అలాగే సైబర్‌సెక్యూరిటీ, కఠినతరమైన డేటా గవర్నెన్స్‌లాంటి వాటిని బైటివాళ్లకి ఔట్‌సోర్సింగ్‌ చేయడానికి ఉండదని పేర్కొన్నారు.‘పెద్ద కంపెనీల్లో ఏఐ వినియోగానికి సంబంధించి చాలా మటుకు అంతరాలు ఉంటున్నాయి. వాటిని భర్తీ చేయడమే మా పని. ఏఐ అనేది మాలాంటి కంపెనీలను ఆక్రమించదు. పరిస్థితులకు అనుగుణంగా, వేగంగా తమను తాము మల్చుకునే సంస్థలను మరింత పటిష్టం చేస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తమ టాప్‌ 200 క్లయింట్లలో 90 శాతం సంస్థలకి ఏఐ వినియోగంపరమైన సేవలు అందిస్తున్నట్లు నీలేకని వివరించారు. ఇదీ చదవండి: రికార్డులు సృష్టిస్తోన్న ఆధార్‌ యాప్‌..

Gold and Silver Rates on 24 June 2026 in Telugu states3
కరుగుతోన్న బంగారు కొండ.. వెండి ఢమాల్‌!

దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. క్రితం రోజున అత్యంత భారీగా పడిపోయిన పసిడి ధరలు నేడు కూడా కాస్త క్షీణించాయి. ఇక వెండి ధరలు క్రితం రోజుతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పతనమయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం(Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

stock market updates on 24 June 20264
లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్ ఆధిక్యంలో ఉండటంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ మ్యూట్ ఓపెన్ తర్వాత పెరిగాయి. ఈరోజు ఉదయం 9:35 గంటల సమయానికి నిఫ్టీ 0.19 శాతం లేదా 46.20 పాయింట్లు పెరిగి 23,870.30 వద్ద, సెన్సెక్స్ 230.96 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 76,431.64 వద్ద ట్రేడవుతోంది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.03 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ 1 శాతం పెరిగి ఇతర రంగాల సూచీలలో లీడ్ లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ ఆటో తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Gold prices dropped by Rs 3000 to Rs 1. 49 lakh per 10 grams5
పసిడి, వెండి వెనకడుగు

న్యూఢిల్లీ: బంగారం, వెండి మళ్లీ నష్టాల బాట పట్టాయి. డాలర్‌ బలపడడం వీటిల్లో అమ్మకాలకు దారితీసింది. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అంచనాలు, యూఎస్‌ డాలర్‌ బలంగా ఉండడం వంటివి పసిడి, వెండిలో అమ్మకాలకు దారితీసినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ వెల్లడించారు. పసిడి 10 గ్రా.కు రూ.3,000 తగ్గి రూ.1,49,300 స్థాయికి పరిమితమైంది.వెండి అయితే కిలోకి ఏకంగా రూ.10,500 నష్టపోయి రూ.2,35,000 స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ 70 డాలర్లు పడిపోయి (2 శాతం) 4,121 స్థాయికి, వెండి 4 శాతం నష్టంతో 62.27 డాలర్ల స్థాయికి దిగొచ్చాయి. అమెరికా–ఇరాన్‌ మధ్య చర్చల్లో పురోగతితో ముందు రోజు పసిడి, వెండి లాభపడగా, తిరిగి వడ్డీరేట్లపై ప్రతికూల అంచనాలతో అమ్మకాలు ఎదురైనట్టు కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీ రీసెర్చ్‌ ఏవీపీ కేనత్‌ చైన్‌వాలా వివరించారు.

Market gears up for NSE and Jio mega IPOs6
మెగా ఐపీఓ ఫీవర్‌!

స్టాక్‌ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలవుతోంది. టెలికం దిగ్గజం జియోతో పాటు దేశంలో అతిపెద్ద స్టాక్‌ ఎక్స్చేంజ్ ఎన్‌ఎస్‌ఈ మెగా పబ్లిక్‌ ఆఫర్లకు రంగం సిద్ధమైంది. అయితే, బడా ఐపీఓలు వస్తున్నాయంటే.. ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తితో పాటు ఆందోళన కూడా తప్పడం లేదు. గతంలో వచ్చిన మెగా ఇష్యూలు అధిక వేల్యుయేషన్ల కారణంగా లిస్టింగ్‌లో తుస్సుమనడమే దీనికి కారణం. అంతేకాదు, భారీ ఐపీఓలు వచ్చినప్పుడల్లా మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు లిస్టింగ్‌ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక దృష్టితోనే ఈ ఆఫర్లలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. –సాక్షి, బిజినెస్‌ డెస్క్‌భారత క్యాపిటల్‌ మార్కెట్ల చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించేందుకు జియో ప్లాట్‌ఫామ్స్‌ రెడీ అవుతోంది. దాదాపు రూ.37,000 కోట్ల (4 బిలియన్‌ డాలర్లు) సమీకరణ లక్ష్యంతో సెబీకి తాజాగా దరఖాస్తు చేసింది. ఇక నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సైతం రూ.30,000 కోట్ల భారీ ఐపీఓకు తెరతీసింది. మరో రెండు మూడు నెలల్లో ఈ రెండు మెగా ఐపీఓలు ఇన్వెస్టర్ల తలుపుతట్టనున్నాయి. జియో 27 కోట్ల తాజా షేర్ల జారీ ద్వారా నిధులను సొంత అవసరాల కోసం వినియోగించుకోవాలనుకుంటోంది. ఈ ఇష్యూతో కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు రూ.13 లక్షల కోట్లకు చేరుతుందనేదివిశ్లేషకుల అంచనా. కాగా, ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ఉంటుంది. తద్వారా ఎస్‌బీఐ సహా ప్రస్తుత వాటాదారులు సుమారు 6% వాటాలను విక్రయించనున్నారు. దీని మార్కెట్‌ విలువను రూ.5 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నా రు. మరోపక్క, క్విక్‌ కామర్స్‌ దిగ్గజం జెప్టో, ఫిన్‌టెక్‌ అగ్రగామి ఫోన్‌పే కూడా బిలియన్‌ డాలర్లకు పైగా నిధుల సమీకరణ రేసులో ఉన్నాయి. అంటే ఈ నాలుగు ఇష్యూలే సుమారు రూ. లక్ష కోట్లను మార్కెట్ల నుంచి లాగేసే అవకాశం ఉంది. మళ్లీ కళకళ... ప్రైమరీ మార్కెట్‌ గతేడాది కొత్త రికార్డులు నెలకొ ల్పింది. 104 కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్ల ద్వారా సుమారు రూ.1.76 లక్షల కోట్లకు పైగానే సమీకరించాయి. అయితే, ఈ ఏడాది ఇప్పటిదాకా సుమారు 23 కంపెనీలు మాత్రమే (దాదాపు రూ.27,000 కోట్లు)లిస్టింగ్‌ బాట పట్టాయి. పశ్చిమాసియా యుద్ధం తర్వాత మార్కెట్ల తిరోగమనంతో ఐపీఓలకు వచ్చే సాహసం చేయలేదు. ఏప్రిల్‌లో 2 ఇష్యూలు రాగా.. మే నెలలో ఒక్కటి కూడా లేదు. అయితే, ఇప్పుడిప్పుడే ఉద్రిక్తతలు శాంతిస్తుండటం.. మార్కెట్ల రికవరీతో జూన్‌లో మళ్లీ ఆఫర్ల బాటపట్టాయి. ఇప్పటికే మూడు కంపెనీలు లిస్టవగా.. మరో మూడు ఆరంభమయ్యాయి. ఇక రాబోయే జియో, ఎన్‌ఎస్‌ఈ, జెప్టో, ఫోన్‌పే, ఓయో వంటి భారీ ఇష్యూలతో మళ్లీ ప్రైమరీ మార్కెట్‌ కళకళలాడనుంది. 163 కంపెనీలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా.. మరో 73 సంస్థలు ఆమోదం కోసం వేచిచూస్తుండటం గమనార్హం. గతంలో మెగా నిరాశ... దేశీ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో నాలుగు భారీ ఇష్యూలూ ఇన్వెస్టర్లకు నిరాశే మిగిల్చాయి. ఇందులో రూ.27,859 కోట్లతో ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓగా నిలుస్తున్న హ్యుందాయ్‌ ఇండియా నష్టాలతో అరంగేట్రం చేసింది. ఇప్పటికీ ఇది ఇష్యూ ధర వద్దే కదలాడుతుండటం విశేషం. ఇక ఎంతో హైప్‌ క్రియేట్‌ చేసిన ఎల్‌ఐసీ, పేటీఎం సైతం మెప్పించలేకపోగా.. భారీ నష్టాల్లోకి జారిపోయాయి. టాటా క్యాపిటల్‌ ఒక్కటే లిస్టింగ్‌లో ఏదో పర్వాలేదనిపించియినా.. పెద్దగా లాభాలను పంచలేదు. ఎల్‌ఐసీ బోనస్‌ షేర్లను పరిగణనలోకి తీసుకుంటే షేరు ఇంకా ఇష్యూ ధర కంటే 7% దిగువనే ట్రేడవుతున్నట్లు లెక్క. పేటీఎం 50% నష్టాల్లో ఉంది. అధిక వేల్యుయేషన్‌ కారణంగానే ఐపీఓలు సక్సెస్‌ కాలేకపోయాయనేది మార్కెట్‌ వర్గాల విశ్లేషణ.సరైన షేరు ధరే కీలకం.. ప్రస్తుతం అన్‌లిస్టెడ్‌ మార్కెట్లో ఎన్‌ఎస్‌ఈ షేరు రూ.1,950–2,000 వరకు పలుకుతోంది. ఇంత భారీ వేల్యుయేషన్‌తో షేరు ధరను నిర్ణయిస్తే.. రిటైల్‌ ఇన్వెస్టర్లు ముఖం చాటేసే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, జియో షేరు ధర ఎంత పెడతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ రెండు ఐపీఓలు దీర్ఘకాలంలో మంచి రాబడులే అందించే అవకాశం ఉందని.. అయితే, లిస్టింగ్‌ లాభాలు మాత్రం ఆయా షేర్ల ఇష్యూ ధర పైనే ఆధారపడి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.‘రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవాలంటే ఎన్‌ఎస్‌ఈ, జియో ఐపీఓ షేర్ల ప్రైసింగ్‌ను ఎంత నిర్ణయిస్తారనేది కీలకం. కేవలం లిస్టింగ్‌ లాభాల కోసమైతే రిటైలర్లు వీటి జోలికెళ్లకపోవడమే మంచిది. ఆయా కంపెనీల వ్యాపారం, వృద్ధి అవకాశాలు, మార్కెట్లో పోటీ, వేల్యుయేషన్‌ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. దీర్ఘకాలంలో వాటి రాబడుల సామర్థ్యంతో పోలిస్తే సరైన ధరను గనుక నిర్ణయిస్తే.. రిటైలర్లకు మంచి సంపదనే సృష్టించవచ్చు. కాబట్టి రిటైలర్లు దీర్ఘాకాలిక వ్యూహంతో ఇన్వెస్ట్‌ చేస్తే బెటర్‌‘ అని ఆనంద్‌ రాఠి స్టాక్‌ బ్రోకర్స్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ నరేంద్ర సోలంకి చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement