ప్రధాన వార్తలు
జీరో ట్యాక్స్.. భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైకుల ధరలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుతో యూఎస్కు చెందిన ప్రీమియం బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్కు భారీ ప్రయోజనం చేకూరనుంది. ట్రేడ్ డీల్లో భాగంగా 800–1600 సీసీతో పాటు అంతకు మించి ఇంజిన్ సామర్థ్యం కలిగిన అమెరికా మోటార్స్సైకిళ్లపై దిగుమతి సుంకం సున్నా(జీరో టాక్స్) శాతానికి తగ్గాయి. దీంతో తమ కంపెనీకి భారీ ఊరట లభించిందని హార్లే డేవిడ్సన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.‘‘ఒప్పందం అమలు రోజు నుంచి మోటార్ సైకిళ్లపై ఎలాంటి సుంకాలు ఉండవు. ప్రీమియం బైక్ల విభాగంలో భారత్ చిన్న మార్కెట్ అయినప్పటికీ, ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుంది’’ అన్నారు. హార్లే డేవిడ్సన్కు గతేడాదిలోనూ ప్రభుత్వం ఊరట కల్పించింది. 1,600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని 50 %నుంచి 40 శాతానికి, 1,600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కస్టమ్స్ డ్యూటీ 50% నుంచి 30 శాతానికి సవరించింది.భారత్–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ డీల్ 2026 మార్చిలో చట్టబద్దం కానుంది. తాజాగా ట్రేడ్ డీల్ భాగంగా అమెరికా నుంచి దిగుమతయ్యే 3000 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ కార్లు, 2500 సీసీ ఇంజిన్ కలిగిన డిజిల్ కార్లపై సుంకాలను భారత్ తగ్గించింది.
రీట్, ఇన్విట్ల్లో పెట్టుబడులు.. సెబీ కీలక మార్పులు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల నియంత్రణల్లో కీలక మార్పులను సెబీ ప్రతిపాదించింది. వీటిల్లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులకు అనుమతించడం ఇందులో కీలకమైనది. ఇతర పెట్టుబడుల’ కింద 20 శాతం పరిమితికి లోబడి లిక్విడ్ ఫండ్స్ రీట్లు, ఇన్విట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఇన్విట్లు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీలు)ను వాటి రాయితీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగించేందుకు అనుమతించనుంది. ప్రైవేటు ఇన్విట్లు తమ ఆస్తుల్లో 10 శాతం వరకు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సైతం ప్రతిపాదించింది. అలాగే ఇన్విట్ల ఆస్తుల విలువలో నికర రుణ భారం 49 శాతం మించినప్పుడు, తాజా రుణాల వినియోగ పరిధినీ విస్తృతం చేయాలన్నది మరో ప్రతిపాదన.ఆస్తుల కొనుగోలు, అభివృద్ధి కోసమే కాకుండా... మూలధన విస్తరణ, ఆస్తుల నిర్వహణ కోసం సైతం ఇన్విట్లు తాజా రుణ సమీకరణకు అనుమతించనుంది. ఇందుకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. దీనిపై ఈ నెల 26 వరకు అభిప్రాయాలు తెలియజేయాలని సెబీ కోరింది.
ఏఐతో టెక్ సర్వీసుల్లో సరికొత్త మార్పులు
న్యూఢిల్లీ: అధునాతన కృత్రిమ మేథ (ఏఐ) రాకతో దేశీ టెక్నాలజీ సరీ్వసుల రంగంలో విపత్కర పరిణామాలు ఉంటాయన్న ఆందోళనలను ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తోసిపుచ్చింది. ఇది పరిశ్రమను సరికొత్తగా తీర్చిదిద్దుతుందని పేర్కొంది. దేశీ ఐటీ కంపెనీలు సంక్లిష్టమైన టెక్నాలజీలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తుంటాయని వివరించింది.ఏఐ నుంచి సిసలైన ప్రయోజనాలు పొందాలంటే మనుషులతో కూడా సమన్వయం చేసుకోవడం కీలకంగా ఉంటుందని తెలిపింది. వారికి పరిశ్రమపైన, నిర్దిష్ట వ్యాపారాలపైన లోతైన అవగాహన అవసరమని నాస్కామ్ పేర్కొంది. ఏఐని ప్రయోగాత్మకంగా పరీక్షించడం నుంచి భారీ స్థాయిలో వినియోగంలోకి తేవడం వైపు మళ్లించడంలో టెక్నాలజీ సేవల సంస్థలు తోడ్పడతాయని వివరించింది.
రిలయన్స్ జియో రూ. 1,984 కోట్లు బాకీ..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) నాటికి టెలికం కంపెనీలు సవరించిన స్థూల రాబడిపరంగా (ఏజీఆర్) ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలు రూ. 1.77 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపయిన వొడాఫోన్ ఐడియా రూ. 89,952 కోట్లు, భారతి గ్రూప్ రూ. 51,091 కోట్లు, టాటా గ్రూప్ రూ. 20,426 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ. 14,462 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 1,984 కోట్లు కట్టాల్సి ఉంది.పార్లమెంటుకు సమర్పించిన అధికారిక డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వొడాఫోన్ ఐడియా కేసులో 2006–2018 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో కట్టాల్సిన బాకీలను రూ. 87,695 కోట్ల స్థాయికి పరిమితం చేసి, చెల్లించేందుకు మరింత గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే.
స్వగృహ ప్లాట్లకు భలే డిమాండ్.. రూ. 56 కోట్లు ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టుకు సమీపంలో బహదూర్పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్ల విక్రయంతో రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం తెలిపారు. శనివారం బాటసింగారంలో నిర్వహించిన వేలంలో 70 ప్లాట్లను విక్రయించారు. చదరపు గజం కనీస ధర (అప్సెట్ ప్రైస్) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, 43 వేలు, 41 వేలకు కొనుగోలు చేశారు. మొత్తమ్మీద సగటున చదరపు గజానికి రూ.31 వేలకు అమ్ముడు పోయాయి.కాగా.. ఆదివారం తొర్రూర్ లేఅవుట్లోని 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్ పల్లి, కుర్మల్ గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్లను లాటరీ ప్రక్రియలో కేటాయించడంతో రాజీవ్ స్వగహ కార్పొరేషన్కు రూ.11 కోట్ల ఆదాయం సమకూరింది.ఇదీ చదవండి: శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
ఎంఎస్ఎంఈలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈలు)కు అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్ వ్యవస్థల్లో అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. వ్యాపారాలు, కస్టమర్లపై వ్యయాల భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. ట్రేడ్ డీల్తో పశుపోషణ, మసాల, ప్రధాన ఆహార ఉత్పత్తులకు పూర్తి రక్షణ కలి్పంచడంతో భారతీయ రైతుల ఆదాయాలు పెరుగుతాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సాంకేతిక సహకారం ద్వారా కృత్రిమ మేధ (ఏఐ), డేటా, డిజిటల్ సేవల కేంద్రంగా భారత్ స్థానం మరింత సుస్థిరం అవుతుందని సీతారామన్ అభిప్రాయపడ్డారు.
కార్పొరేట్
లిస్టింగ్కు 8 కంపెనీలు రెడీ
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే!
అందుకే.. అమెజాన్ 200 బిలియన్ డాలర్ల పెట్టుబడి!
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి పరిహారంగా రూ.25 వేలు!
ఐటీ జీతాల కంటే అర్బన్ కంపెనీలో అధిక సంపాదన!
ఎల్ఐసీకి మంచి లాభం! కలిసొచ్చిన ‘కొత్త బిజినెస్’
భారత్లో ‘ఐకియా’కు మరిన్ని నష్టాలు
ఏసీసీ బ్యాటరీలకు భారీగా డిమాండ్
ఇక స్టార్టప్ అంటే రూ. 200 కోట్లు!
ఆఫీస్ మార్కెట్కు అడ్డా.. హైదరాబాద్
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స...
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు...
క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
బంగారం, వెండి ధరలు మళ్లీ క్రాష్ అయ్యాయి. మరోసారి ...
ఆర్బీఐ ఏం చెప్తుందో.. స్వల్ప నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప నష...
టారిఫ్ల కోతపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే..
భారత ఉత్పత్తులపై టారిఫ్లను తగ్గించాలన్న అమెరికా న...
రూపాయి రయ్.. రయ్..!
ముంబై: భారత్–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం...
ఇంకా వెనక్కి రాని రూ.2000 నోట్లు!
పెద్దనోట్ల రద్దు జరిగి చాన్నాళ్లవుతోంది. అయితే ఇప్...
వ్యవసాయం, గ్రామీణ రంగాలకు మొండిచేయి!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి బడ్జెట్లో మ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
హైదరాబాద్లో మరో కొత్త జీసీసీ.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్: దిగ్గజ వెల్ మేనేజ్మెంట్ ఎల్పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ హైదరాబాద్లో ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. అలాగే కొత్త కార్యకలాపాలకు హెడ్గా రమేష్ కాజాను నియమించుకున్నట్లు తెలిపింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ తమ టెక్నాలజీ, కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఆర్థిక సేవల్లో విస్తృతంగా ప్రతిభావంతుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, వ్యాపారాన్ని కొనసాగించేందుకు సంబంధించిన సానుకూలాంశాలు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది.భారీగా ఉద్యోగావకాశాలువచ్చే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాలకు సంబంధించి హైదరాబాద్లో ఎల్పీఎల్ వందల కొద్దీ ఉద్యోగాలను కల్పించనుంది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రస్తుతం తమ టీమ్ కోసం ప్రతిభావంతులను నియమించుకునే ప్రక్రియలో ఉంది. నెట్వర్క్ సెక్యూరిటీ, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఇంజినీరింగ్, డేటా ప్లాట్ఫామ్స్, మిడిల్వేర్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్వ్యాప్తంగా నిపుణులైన ఇంజినీర్లు, టెక్నాలజిస్టులు వీరిలో ఉండనున్నారు.భారత్లోని ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో ఉద్యోగావకాశాల కోసం ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లింక్డ్ఇన్ (LinkedIn) పేజీ, ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కెరియర్స్ సైట్ని సందర్శించాలని కంపెనీ సూచించింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గురించి..ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఎల్పీఎల్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (Nasdaq: LPLA) అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటి. 32,000 మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు, 1,200కు పైగా ఆర్థిక సంస్థల వెల్త్ మేనేజ్మెంట్ విధానాలకు సపోర్ట్ అందిస్తూ దాదాపు 80 లక్షల మందికి సంబంధించి 2.4 ట్రిలియన్ డాలర్ల నిధులను నిర్వహిస్తోంది.అధునాతన ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు, అప్లికేషన్ల వినూత్న ప్లాట్ఫాం దన్నుతో, ఆర్థిక సలహాదారులు తమ క్లయింట్లకు వ్యక్తిగతీకరించిన ఆర్థిక ప్రణాళికలను అందించడానికి ఉపయోగించే ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ , వెల్త్ మేనేజ్మెంట్ ప్రోడక్టులను ఎల్పీఎల్ ఫైనాన్షియల్ అందిస్తోంది.
వాలెంటైన్స్ డే ఆఫర్.. ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్లు
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యాపిల్ భారత మార్కెట్లో వాలెంటైన్స్ డే సేల్ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్లో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ వాలెంటైన్స్ డే సేల్ ప్రస్తుతం యాపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.ఈ సేల్లో భాగంగా యాపిల్ ఎప్పటిలానే నేరుగా ధరలు తగ్గించకుండా, బ్యాంక్ ఆధారిత ఇన్స్టంట్ క్యాష్బ్యాక్లు, క్రెడిట్ కార్డు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులపై వర్తిస్తాయి. చెక్అవుట్ సమయంలో అర్హత కలిగిన కార్డును ఉపయోగించిన వెంటనే ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీంతో ఫోన్ ధర తగ్గుతుంది. డిస్కౌంట్ తప్ప, మిగతా కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవు. డెలివరీ అంచనాలు, స్టోర్ పికప్ ఆప్షన్లు, చెల్లింపు విధానం యథాతథంగా ఉంటాయి.ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు, ధరఐఫోన్ 17లో 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే ఉంది. ఇది A19 చిప్, 8GB ర్యామ్, 256GB / 512GB స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.ఫోటోగ్రఫీ కోసం ఇందులో 48MP డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ఉండి, 10x డిజిటల్ జూమ్కు సపోర్ట్ చేస్తుంది.వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.77,900 ప్రారంభ ధరకు లభిస్తోంది. దీనిపై రూ.5,000 ఇన్స్టంట్ బ్యాంక్ క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది.ఐఫోన్ 17 ప్రో స్పెక్స్.. ఆఫర్లు ఇలా..ఐఫోన్ 17 ప్రోలో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఉంది. ఇది 120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్తో వస్తుంది. ఈ మోడల్లో A19 ప్రో చిప్ (6-కోర్ CPU, 6-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్), 12GB ర్యామ్ ఉన్నాయి. అలాగే 48MP కెమెరా అరే, 5x ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లభిస్తుంది. టైటానియం ఫ్రేమ్, USB-C పోర్ట్, అధునాతన AI ఫీచర్లు, అలాగే 33 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.వాలెంటైన్స్ డే సేల్లో ఈ ఫోన్ రూ.1,29,900 తగ్గింపు ధరకు లభిస్తుంది. దీనిపై కూడా రూ.5,000 ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ వర్తిస్తుంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు, ధరఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో 6.9 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఉంది. ఇది 120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్తో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ మోడల్ A19 ప్రో చిప్, 12GB ర్యామ్తో శక్తివంతమైన పనితీరు, మెరుగైన AI సామర్థ్యాలను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ 48MP కెమెరా సెటప్, LiDAR సెన్సార్, 5x టెలిఫోటో జూమ్, 8K వీడియో సపోర్ట్ ఉన్నాయి.వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.1,44,900 ప్రత్యేక ధరకు లభిస్తుంది. దీనిపైనా రూ.5,000 ఇన్స్టంట్ బ్యాంక్ క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది.
ఐటీ ఉద్యోగమా.. ఊడిగమా?
ఐటీ కంపెనీల్లో పని గంటలు, ఉద్యోగులపై పని ఒత్తిడి ఆందోళనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్లో ఓ ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ తనను ఏళ్ల తరబడి ఓవర్టైమ్ చెల్లించకుండా అధిక పని గంటలు చేయమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలంగాణ కార్మిక శాఖను ఆశ్రయించాడు. దేశంలో పని గంటలపై పరిశ్రమ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.రోజుకు 16 గంటల పనిటైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు శ్రీధర్ మేరుగు తన 14 ఏళ్ల ఉద్యోగ కాలంలో చాలా సార్లు రోజుకు 16 గంటలకు పైగా పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. అదనంగా పనిచేసిన గంటలకు తగిన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.తగిన వేతనం లేకుండా అధిక షిఫ్టుల్లో పనిచేయాలని ఆశించడం అన్యాయమని, కార్మిక చట్టాలను సంస్థ ఉల్లంఘించిందని శ్రీధర్ ఆరోపించారు. ఓవర్టైమ్ వేతనాలు చెల్లించకుండా నిరాకరించడంతో ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా ఆయన ఆశ్రయించారు.అనారోగ్యంలోనూ పనిభారంతాను అనారోగ్యానికి గురైన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అయినప్పటికీ పని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని శ్రీధర్ తెలిపారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున షిఫ్ట్ భత్యాలను కూడా కంపెనీ నిరాకరించిందని ఆయన ఆరోపించారు.సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ నిరంతరం ఒత్తిడి పెంచారని, మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు 16 గంటలకు పైగా పని చేసిన తర్వాతే ఈ సమస్యను అధికారికంగా లేవనెత్తినట్లు చెప్పారు. అయితే చట్టవిరుద్ధమైన పని పరిస్థితుల్లో పనిచేయడానికి నిరాకరించాడనే కారణంతోనే 2025 సెప్టెంబర్లో తనను ఉద్యోగం నుంచి తొలగించారని శ్రీధర్ ఆరోపిస్తున్నారు.చట్టబద్ధమైన వడ్డీ, జరిమానాలతో పాటు పెండింగ్లో ఉన్న ఓవర్టైమ్ బకాయిలను చెల్లించాలని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆ కంపెనీని ఆదేశించాలని శ్రీధర్ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ ఐటీ రంగంలో పెరుగుతున్న ఆందోళనహైదరాబాద్కు చెందిన ఇతర ఐటీ ఉద్యోగులు కూడా వారానికి 40 గంటలకంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. చట్టపరమైన హక్కు ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఓవర్టైమ్ క్లెయిమ్ చేయడానికి వెనుకాడుతున్నారు.దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఐటీ ప్రొఫెషనల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత వేతనం లేని వారాంతపు, సెలవు రోజుల పని సాధారణంగా మారిపోయిందని తెలిపారు. పొడిగించిన పని గంటలను పాటించలేకపోతే పరోక్ష ఒత్తిడి, ఉద్యోగం కోల్పోతామన్న భయం ఉద్యోగులను వెంటాడుతోందని ఆయన అన్నారు.పని ఒత్తిడితో పోతున్న ప్రాణాలుపని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అలాగే హైదరాబాద్కు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనల వెనుక కూడా తీవ్రమైన పని ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఐటీ పెట్టుబడిదారుల్లో ఆందోళన
కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో ఆంథ్రోపిక్ సంస్థ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. ఆంథ్రోపిక్ తన ‘క్లాడ్ కోవర్క్’ ఏజెంట్ కోసం సరికొత్త ఆటోమేషన్ ప్లగ్ఇన్లను విడుదల చేసింది. దాంతో శ్రమ ఆధారిత సర్వీసులపై ఆధారపడిన భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఇటీవల ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి.ఐటీ రంగానికి సవాలు..ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ప్లగ్ఇన్లు కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాదు, ఒక సంస్థలోని కీలక విభాగాలను స్వయంచాలకంగా నిర్వహించేలా రూపొందించారు. వీటి ప్రభావం ప్రధానంగా కింది విభాగాలపై ఉండనుంది.లీగల్, ఫైనాన్స్: కాంట్రాక్ట్ రివ్యూ, కంప్లయన్స్ వంటి సంక్లిష్ట ప్రక్రియలను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది.కస్టమర్ సపోర్ట్: టికెట్ల వర్గీకరణ, సమాధానాలు ఇవ్వడం.. వంటి అంశాలపై మనుషుల ప్రమేయం లేకుండానే సమస్యల పరిష్కారాన్ని క్లాడ్ నిర్వహిస్తుంది.సేల్స్, మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేస్తుంది.ఎంటర్ప్రైజ్ సెర్చ్: ఒక కంపెనీలోని ఈ-మెయిల్లు, క్లౌడ్ స్టోరేజ్, చాట్ డేటాను విశ్లేషించి నివేదికలు తయారు చేస్తుంది.ఇప్పటివరకు ‘సాస్’ ఆధారిత సర్వీసుల ద్వారా పై పనులను నిర్వహించేవారు. ఏదైనా సాఫ్ట్వేర్ను మన కంప్యూటర్ లేదా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడాన్ని సాస్ అంటారు. ఇప్పుడు చర్చల్లో ఉన్న క్లాడ్ కోవర్క్ వంటి ఏఐ సాధనాలు వస్తే భవిష్యత్తులో సాప్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ల అవసరం లేకుండా ఏఐతోనే పనులు చేయిస్తారని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.భారత ఐటీ రంగంపై ప్రభావం..భారత ఐటీ కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ‘అవుట్సోర్సింగ్’. అంటే విదేశీ కంపెనీలకు అవసరమైన కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి పనులను తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరుల ద్వారా అందిస్తున్నారు. ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ వ్యవస్థలు ఇప్పుడు నేరుగా ఈ పనులనే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేస్తున్నాయి.గతంలో ఏఐని ఒక కేవలం ఒక సహాయక సాధనంగా చూసిన కంపెనీలు ఇప్పుడు దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి.ఏఐ వాడకం పెరిగితే క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టుల విలువ తగ్గించే అవకాశం ఉంది.భారత కంపెనీలు ప్రధానంగా సర్వీసులపై దృష్టి పెట్టాయి కానీ, సొంత ఏఐ ఉత్పత్తులను తయారు చేయడంలో వెనుకబడి ఉన్నాయి.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం
పర్సనల్ ఫైనాన్స్
భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు
ఒకప్పుడు శుభకార్యం అంటే పలకరింపులు, పట్టుచీరలు, బంగారు కానుకల సందడి. కానీ నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరల సెగ మధ్యతరగతి గడప దాటి వారి బంధాలపై ప్రభావం చూపుతోంది. ‘అప్పుడు వారు మాకు తులం బంగారం పెట్టారు, ఇప్పుడు మేము వారికి అంత ఇవ్వలేకపోతున్నామే’ అనే ఆవేదన.. బంధువుల్లో ఆత్మీయతపై ఆందోళన పెంచుతోంది.అసలు కానుకల వెనుక అర్థంసంప్రదాయంగా బంగారం, వెండి బహుమతులు కేవలం ఆడంబరం కోసం పుట్టినవి కావు. దీని వెనుక లోతైన సామాజిక, ఆర్థిక భద్రత దాగి ఉంది. పూర్వకాలంలో ఆడపిల్లకు ఇచ్చే నగలు ఆమె ఆర్థిక భద్రతకు భరోసాగా ఉండేవి. బంధువుల మధ్య బంగారు కానుకల మార్పిడి అనేది ఒక ‘సామాజిక పొదుపు’ లాంటిది. ఒకరి ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ కలిసి ఇచ్చే కానుకలు, ఆ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తాయని ధోరణి ఉంది.పెరుగుతున్న ధరలు.. అంతరాలుప్రస్తుతం బంగారం ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. గతంలో తులం బంగారం రూ.50,000 ఉన్నప్పుడు జరిగిన శుభకార్యంతో, ఇప్పుడు తులం రూ.1,40,000 ధరతో బేరీజు వేయడం వల్ల సమస్యలు మొదలవుతున్నాయి. ‘వారు మాకు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మేము ఇవ్వకపోతే తక్కువ చేసి చూస్తారు’ అనే అభద్రతా భావం బంధువుల మధ్య గోడలు కడుతోంది. కానుకలు ఇచ్చుకోలేక చాలామంది సన్నిహితుల వేడుకలకు వెళ్లడమే మానేస్తున్నారు. ఇది పరోక్షంగా సామాజిక దూరాన్ని పెంచుతోంది.మానవ సంబంధాలను కాపాడుకోవడం ఎలా?డబ్బు కన్నా మనుషులు ముఖ్యం అని భావించినప్పుడే బంధాలు నిలుస్తాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అనుసరించాల్సిన కొన్ని మార్గాలివే..1. కాలానుగుణ మార్పును అంగీకరించాలి.. పదేళ్ల క్రితం నాటి ధరలు ఇప్పుడు లేవని గ్రహించాలి. ఇచ్చే కానుక బరువును (గ్రాములను) కాకుండా అవతలి వారి ఆర్థిక పరిస్థితిని, ఆత్మీయతను గౌరవించాలి.2. ప్రత్యామ్నాయాల వైపు చూపు.. కేవలం బంగారం, వెండి మాత్రమే కానుకలు కావు. స్థిరాస్తి బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా నగదు రూపంలో చిన్న మొత్తాన్ని అందించడం కూడా గౌరవప్రదమే.3. ముందస్తు ప్రణాళిక.. రాబోయే శుభకార్యాల కోసం ‘గోల్డ్ స్కీమ్స్’ వంటి వాటి ద్వారా చిన్న మొత్తాల్లో పొదుపు చేయడం వల్ల భారంగా అనిపించదు.4. సన్నిహిత బంధువుల మధ్య ఆర్థిక ఇబ్బందుల గురించి మొహమాటం లేకుండా చర్చించుకోవడం వల్ల అపోహలు తొలగిపోతాయి.5. వేడుకకు వెళ్లడం, తోడుగా నిలబడటం అనేది వస్తురూపంలో ఇచ్చే కానుక కంటే గొప్పదని గుర్తించాలి.బంగారం మెరుస్తుంది కానీ మాట్లాడలేదు. బంధం మౌనంగా ఉన్నా మనసును తడుముతుంది. ధరలు పెరిగినప్పుడు మన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలే తప్ప, ఆత్మీయులను దూరం చేసుకోకూడదు.ఇదీ చదవండి: ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!
లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు!
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఈ కీలక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను రాయితీలు పెరుగుతాయా? నిత్యావసరాల ధరలు తగ్గుతాయా? గృహ రుణ గ్రహీతలకు ఊరట లభిస్తుందా? అన్నవి ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్నలు.అయితే, కేంద్ర బడ్జెట్ కేవలం టీవీల్లో చూసే అంకెలు మాత్రమే కాదు; అది నేరుగా మీ ఇంట్లో, మీ పిల్లల చదువులపై, మీ పొదుపుపై ప్రభావం చూపే అంశం. అందుకే, ప్రభుత్వ బడ్జెట్తో పాటు మీ ‘ఇంటి బడ్జెట్’ను ఎలా ప్లాన్ చేసుకోవాలి? పన్ను మార్పులను ఎలా అందిపుచ్చుకోవాలి? అసలు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు ముఖ్యం? వంటి అంశాలతో కూడిన ప్రత్యేక కథనం ఇదిగో..పన్ను మార్పులు..ఈసారి కొత్త పన్ను విధానంలో (New Tax Regime) మరిన్ని మార్పులు లేదా సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రసంగం తర్వాత మీ వార్షిక ఆదాయం ఏ పన్ను స్లాబ్లోకి వస్తుందో లెక్కించుకుని, దానికి అనుగుణంగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి.ఖర్చుల అంచనాబడ్జెట్లో కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం లేదా పెంచడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, బంగారం లేదా గృహోపకరణాల ధరల్లో మార్పులు ఉండవచ్చు. మీ ఇంట్లో కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితా ఉంటే బడ్జెట్ తర్వాత ధరల హెచ్చుతగ్గులను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.పొదుపు మంత్రంబడ్జెట్లో మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలకు పెద్దపీట వేయడం వల్ల దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్పై ప్రభావం ఉంటుంది. మీ భవిష్యత్తు అవసరాల కోసం (పిల్లల చదువు, పెళ్లిళ్లు) ఎంత మేర కేటాయించాలో బడ్జెట్ ఫలితాలను బట్టి నిర్ణయించుకోవాలి.‘ఇంటి బడ్జెట్’ ఎందుకు?ప్రభుత్వం దేశం కోసం ఎలాగైతే ప్రణాళికలు సిద్ధం చేస్తుందో ప్రతి ఇంట్లో కూడా అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఎందుకంటే..అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా ఉద్యోగ మార్పులు ఎదురైనప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం ఉంటుంది. బడ్జెట్ వేసుకుంటేనే మన దగ్గర ఎంత మిగులు ఉందో తెలుస్తుంది. దాన్ని ఎమర్జెన్సీ ఫండ్లోని మళ్లించవచ్చు.ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. బడ్జెట్ వల్ల అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయవచ్చు.సొంత ఇల్లు కొనాలన్నా, కొత్త కారు తీసుకోవాలన్నా, పిల్లల చదువులు సాగాలన్నా.. కచ్చితమైన ప్లానింగ్ అవసరం. నెలకు ఎంత పొదుపు చేస్తున్నామో తెలిస్తేనే లక్ష్యం చేరువవుతుంది.బడ్జెట్ కోసం సింపుల్ టిప్: 50-30-20 రూల్మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించండి. మొత్తం నెలవారీ రాబడిలో..50%: అవసరాలు (అద్దె, కిరాణా, ఫీజులు)30%: కోరికలు (సినిమాలు, విహారయాత్రలు, షాపింగ్)20%: పొదుపు, పెట్టుబడులుకేంద్ర బడ్జెట్ 2026 దేశానికి ఒక రోడ్ మ్యాప్ అయితే, మీరు వేసుకునే ఇంటి బడ్జెట్ మీ కుటుంబ ఆర్థిక భరోసాకు పునాది. ఫిబ్రవరి 1న వెలువడే అధికారిక ప్రకటనలను బట్టి మీ ఆర్థిక వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!
ఆ పన్నులు తగ్గిస్తే మంచిది: ఎస్బీఐ
రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో పన్నులు, బీమా, పెన్షన్ రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గృహ ఆర్థిక పొదుపును పెంచడం, నియంత్రణ సవాళ్లను తగ్గించడం, దేశంలో సామాజిక భద్రత కవరేజీని మెరుగుపరచడం ఈ సూచనల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.గృహ ఆర్థిక పొదుపులో బ్యాంకు డిపాజిట్ల వాటా 2024 ఆర్థిక సంవత్సరంలో 38.7 శాతం నుంచి 2025లో 35.2 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పొదుపును ప్రోత్సహించేందుకు డిపాజిటర్లకు పన్ను ఉపశమన చర్యలు అవసరమని ఎస్బీఐ అభిప్రాయపడింది.బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయానికి వర్తించే పన్ను విధానాన్ని దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల (LTCG, STCG)తో సమానంగా తీసుకురావాలని సూచించింది. అలాగే పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ల లాక్-ఇన్ వ్యవధిని మూడేళ్లకు తగ్గించి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS)తో సమానంగా చేయాలని సిఫార్సు చేసింది. చిన్న పొదుపుదారులకు ఉపశమనం కలిగించేలా పొదుపు ఖాతాలపై వడ్డీకి వర్తించే టీడీఎస్ను పూర్తిగా తొలగించాలని లేదా కనీస పరిమితిని పెంచాలని కూడా ఎస్బీఐ సూచించింది.పరోక్ష పన్నుల విషయంలో, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD)కు సంబంధించిన జీఎస్టీ నిబంధనల్లో స్పష్టత తీసుకురావాలని నివేదిక పేర్కొంది. జీఎస్టీ చట్టం, 2017లోని కొన్ని పదాలను సవరించడం ద్వారా వివాదాలు తగ్గించవచ్చని సూచించింది. అలాగే బ్యాంకులు పంపిణీ చేసే ఐఎస్డీపై వాల్యుయేషన్ వివాదాలు లేకుండా ఉండేందుకు సెక్షన్ 20(3)కు వివరణ జోడించాలని ప్రతిపాదించింది.ఎన్పీసీఐ, వీసా, మాస్టర్కార్డ్ వంటి సెటిల్మెంట్ ఏజెన్సీల ద్వారా చెల్లింపులపై జీఎస్టీ టీడీఎస్ అమల్లో బ్యాంకులు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. బ్యాంకింగ్ సేవలకు జీఎస్టీ టీడీఎస్ వర్తించకుండా మినహాయింపు ఇవ్వాలని ఎస్బీఐ సూచించింది.బీమా రంగంలో, భారతదేశంలో బీమా వ్యాప్తి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.7 శాతానికి తగ్గిందని ఐఆర్డీఏఐ డేటాను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. జీవిత బీమా వ్యాప్తి 2.7 శాతానికి, నాన్-లైఫ్ బీమా 1 శాతానికి పరిమితమైందని పేర్కొంది. “2047 నాటికి అందరికీ బీమా” అనే ఐఆర్డీఏఐ లక్ష్యానికి ఇది సవాలుగా మారిందని హెచ్చరించింది. అలాగే 2025లో వచ్చిన ఫిర్యాదుల్లో 69 శాతం క్లెయిమ్స్కు సంబంధించినవేనని, ముఖ్యంగా ఆరోగ్య బీమా రంగంలో తక్షణ సంస్కరణలు అవసరమని నివేదిక స్పష్టం చేసింది.పెన్షన్ రంగంలో కనీస పెన్షన్ హామీతో కూడిన బలమైన, సమగ్ర పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎస్బీఐ నొక్కి చెప్పింది. కేంద్ర బడ్జెట్ 2026లో ఈ సూచనలను అమలు చేస్తే దేశ ఆర్థిక భద్రత బలోపేతమవుతుందని, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని ఎస్బీఐ పేర్కొంది.
Income Tax: బినామీ వ్యవహారాల జోలికెళ్లొద్దు..
బినామీ ఆస్తి అంటే ఏమిటి.? బినామీ వ్యవహారం ఏమిటి.? బినామీదారు ఎవరు? ప్రయోజనం పొందేవారెవరు? మొదలైన విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాము. ఈ వ్యవహారాలు చేయడం వల్ల కలిగే కష్టనష్టాలు ఈ వారం తెలుసుకుందాం.!ఆస్తి జప్తు: బినామీ ఆస్తి అని నిర్ధారణ జరిగితే ఆ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం లేదా జప్తు చేసుకుంటుంది.శిక్షార్హులు: బినామీదారు, ప్రయోజనం పొందే వ్యక్తి (ముసుగు మనిషి), ఈ వ్యవహారాన్ని ప్రేరేపించిన లేదా ప్రోత్సహించిన వ్యక్తి, ఈ ముగ్గురూ చట్టం ప్రకారం శిక్షార్హులే. ఆరోపణలు నిరూపణ అయితే ఒక ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష (కఠినకారాగార శిక్ష) ఉంటుంది. ఇది కాకుండా, బినామీ ఆస్తి ఫెయిర్ మార్కెట్ విలువ మీద 25% జరిమానాగా విధిస్తారు. ముందుగానే తప్పు ఒప్పుకుంటే కొన్ని షరతులకు లోబడి జరిమానాను సడలిస్తారు. బినామీదారు బినామీ ఆస్తిని తిరిగి ‘ప్రయోజకుడు’ లేదా ఏ ఇతర వ్యక్తికి కూడా బదిలీ చేయకూడదు. ఇలాంటి బదిలీలు చెల్లవు. అలాంటి అమ్మకం జరిగినప్పుడు కొన్న వ్యక్తికి ఎటువంటి విషయం తెలియకపోతే.. నిజమని నమ్మించి అమ్మితే, కొన్న వ్యక్తి నుంచి ఆస్తి తీసుకోరు. అధికారుల అధికారాలు ఈ చట్టప్రకారం నాలుగు రకాల అధికారులు ఉన్నారు. వారి అధికారాలు ఏమిటంటే... (1) సమన్లు జారీ చేయడం (2) సమాచారం కోరడం (3) డాక్యుమెంట్లు స్వాధీనపరచుకోవడం (4) విచారణ చేయడం (5). విచారణలో సహకారం కోసం ఇతర అధికారులను కోరడం. ఇంకా ఏం చేస్తారు నోటీసులు ఇస్తారు. విచారిస్తారు. తీర్పు ఇస్తారు. తీర్పు అనుగుణంగా ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. వాటిని ఆధీనంలోకి తీసుకుంటారు.ఆద్యులెవరు .. ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికి ముందు.. ఆద్యులు ఎవరంటే ఇన్కంటాక్స్ డిపార్టుమెంటు వారు. వారిచ్చిన సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా చేసుకొని, బినామీ చట్టంలోని అధికారులు రంగంలోకి ప్రవేశిస్తారు. ఈ తరువాత పద్దతి ప్రకారం పని ముగిస్తారు.నోటీసు ప్రక్రియ.. నోటీసు ఇవ్వడానికి ప్రక్రియ మారితే.. వ్యక్తిగత పోస్టు ద్వారా లేదా సివిల్ కోడ్ ప్రకారం నోటీసు ద్వారా విచారణ, ప్రశ్నలు, ఇన్వెస్టిగేషన్, సోదాలు, కాగితాల సేకరణ, పత్రాలు అడగడం, ఆ తరువాత తీర్పు ఇవ్వడం, ఎటాచ్మెంట్ చేయడం, స్వాధీనపరచుకోవడంలాంటివి జరుగుతాయి. ఆ తరువాత బినామీ ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఎంక్వైరీ మధ్యలో బినామీదారు/ముసుగు మనిషి మరణిస్తే వారి వారసులకు కేసు బదిలీ చేస్తారు. కోర్టు పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏ స్థాయిలోనైనా తప్పుడు సమాచారం ఇచ్చినా., తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినా కఠిన కారాగార శిక్ష, జరిమానాలు పడతాయి.ఈ రెండు చట్టాలు–చుట్టాలు .. అటు అదాయపన్ను చట్టం, ఇటు బినామీ వ్యవహారంలో నిషేధిత చట్టం రెండూ కలిసి పనిచేస్తాయి. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత అంశం వెలుగులోకి వస్తుంది. ఇన్కంటాక్స్ అధికారులనే సూత్రధారులుగా .. ప్రారంభించే అధికారిని INITIATING OFFICERS గా వ్యవహరించమంటారు. వారే అన్ని తయారు చేస్తారు. డిపార్టుమెంటు వారు ఈ చట్టం ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు రాబట్టుకుంటారు. వారి చట్టం ప్రకారం పెనాల్టీలు.. ఆదాయం మీద పన్ను వేసి... మిగతా కార్యక్రమం పూర్తి చేసి బినామీ నిషేధ చట్టం అధికారులకు అప్పగిస్తారు. ఈ అధికార్లు ఆస్తిని జప్తు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. డిక్లేర్ చేయని ఆస్తులు.. డిక్లేర్ చేయని ఆదాయ వివరాలు తెలుసుకొని వాటిని అసెస్సీ పన్ను పరిధిలోకి తెచ్చి.. అసెస్మెంట్ చేసి... పన్ను, వడ్డీ, పెనాల్టీలు వసూలు చేసి బినామీ చట్టం అధికార్లకు అప్పగిస్తారు.ఇప్పుడు అర్థమైందా... బినామీ వ్యవహారాల వెనుకు ఎంత రిస్క్ ఉందో... దగ్గర బంధువులు, వ్యాపారం చేస్తున్న మిత్రులు, బంధువులు, మీరు చిన్న ఉద్యోగి అయితే మీ బాస్లు, యజమానులు, అల్లుడు, బావ, వియ్యంకుడు ఇలా అభిమానం అడ్డుపెట్టి, డబ్బులు ఎరచూపి, వారి కష్టాలని మీ దగ్గర వెలిబుచ్చి ట్రాప్ చేస్తారు. వారి వలలో పడకండి!


