ప్రధాన వార్తలు
వ్యవసాయ ఎగుమతులకు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం వల్ల భారత వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వెల్లడించింది. జలరవాణా మార్గాల్లో ఆటంకాలు, పెరుగుతున్న బీమా వ్యయాలు, లాజిస్టిక్స్కి సంబంధించి అనిశ్చితితో దాదాపు 11.8 బిలియన్ డాలర్ల ఎగుమతులకు రిస్క్లు నెలకొన్నాయని పేర్కొంది.భౌగోళికంగా భారత్కి దగ్గరగా ఉండటంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉంటుండటంతో ఆ ప్రాంతం చారిత్రకంగా మన ఎగుమతులకు కీలక మార్కెట్గా నిలుస్తోందని జీటీఆర్ఐ పేర్కొంది. 2025లో పశ్చిమాసియాకు భారత్ దాదాపు 11.8 బిలియన్ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యవసాయ, ఆహారోత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ విభాగంలో మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 21.8 శాతంగా నిల్చింది. వీటిలో 7.48 బిలియన్ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి.పశ్చిమాసియా దేశాలకు బియ్యం, అరటిపళ్లు, ఉల్లి, పప్పు ధాన్యాలు, కాఫీ, టీ మొదలైన వాటిని కూడా భారత్ ఎగుమతి చేస్తోంది. ‘అత్యధికంగా బియ్యం మీద ప్రభావం పడొచ్చు. పశ్చిమాసియాకు భారత్ 4.43 బిలియన్ డాలర్ల బియ్యం ఎగుమతి చేసింది. ఇది అంతర్జాతీయంగా మన దేశం నుంచి బియ్యం ఎగుమతుల్లో 36.7 శాతం. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్లాంటి రాష్ట్రాలకు గల్ఫ్ దేశాలు కీలక మార్కెట్గా ఉంటున్నాయి‘ అని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ రూట్లలో ఆటంకాలు ఏర్పడి, బీమా వ్యయాలు పెరిగిపోయి ఎగుమతిదారులకు సందిగ్ధ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఇది దేశీయంగా పలు రాష్ట్రాల్లోని రైతులు, ఫుడ్ ప్రాసెసర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. గత దశాబ్దకాలంగా వ్యవసాయ ఎగుమతుల కోసం పశ్చిమాసియా మార్కెట్పై భారత్ ఆధారపడటం పెరిగింది. బియ్యం, అరటిపళ్లు, సుగంధ ద్రవ్యాలు, డెయిరీ ఉత్పత్తులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. 2025లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలకు 396.5 మిలియన్ డాలర్ల విలువ చేసే అరటిపళ్లు, 111 మిలియన్ డాలర్ల ఉల్లి, వెల్లుల్లి ఎగుమతయ్యాయి. యాలకులు, జాజికాయలాంటివి (295.5 మిలియన్ డాలర్లు), జీలకర్ర–ధనియాల్లాంటివి (163 మిలియన్ డాలర్లు), అల్లం–పసుపు (173 మిలియన్ డాలర్లు), కాఫీ (240.7 మిలియన్ డాలర్లు), టీ (410.1 మిలియన్ డాలర్లు), ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ తదితరాలు (1.35 బిలియన్ డాలర్లు), చేపలు, మాంసం, ఫ్రోజెన్–ప్రాసెస్డ్ ఉత్పత్తులు (1.81 బిలియన్ డాలర్లు) మొదలైనవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. 281.1 మిలియన్ డాలర్ల డెయిరీ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఇవి భారత్ నుంచి మొత్తం డెయిరీ ఎగుమతుల్లో 28.9 శాతం. 197.5 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆల్కహాలిక్, నాన్–ఆల్కహాలిక్ పానీయాలను పశ్చిమాసియాకి భారత్ ఎగుమతి చేసింది.
మహిళల్లో ఆరోగ్య బీమా కవరేజీ అంతంతే..
దేశీయంగా బీమా కవరేజీ ఉన్న జనాభాలో మహిళల వాటా 47 శాతంగా ఉన్నప్పటికీ, వారికి ఆరోగ్య బీమా కవరేజీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. కేవలం 20 శాతం మంది మహిళలకు మాత్రమే తగినంత కవరేజీ ఉంటోందని టాటాఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది.కార్డియాక్, క్యాన్సర్లాంటి తీవ్ర అనారోగ్యాల చికిత్స వ్యయాలకు సాధారణంగా రూ. 20 లక్షలకు పైగా కవరేజీ అవసరమవుతోందని పేర్కొంది. కానీ 80 శాతం మందికి ఆ స్థాయిలో బీమా ఉండటం లేదని పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో కార్డియాక్ రిసు్కలు ప్రస్తుతం ఎక్కువగా ఉంటున్నాయని 34 శాతం మంది కార్డియాలజిస్టులు వివరించినట్లు తెలిపింది.అయితే, మహిళల్లో వ్యాధి లక్షణాలను చాలా సందర్భాల్లో సకాలంలో గుర్తించకపోవడం లేదా తప్పుగా నిర్ధారించడం వల్ల చికిత్స అందడంలో జాప్యం చోటు చేసుకుంటోందని సంస్థ తెలిపింది. ఇక చికిత్స వ్యయాల విషయానికొస్తే.. నేషనల్ హెల్త్ అకౌంట్స్ (2021–22) గణాంకాల ప్రకారం 39.4 శాతం ఖర్చులు జేబునుంచే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటోందని వివరించింది.ఆరోగ్య బీమా తీసుకోవడం పెరుగుతున్నప్పటికీ దాన్ని కొనసాగించకపోవడం, తక్కువ కవరేజీ తీసుకోవడంలాంటి ధోరణులను బట్టి చూస్తే చాలా మటుకు మహిళలకు తగినంత కవరేజీ ఉండటం లేదనే విషయం తెలుస్తోందని కంపెనీ హెడ్ (కన్జూమర్ బిజినెస్ క్లెయిమ్స్) రాజగోపాల్ రుద్రరాజు తెలిపారు.మహిళల్లో క్యాన్సర్, తీవ్ర అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సన్నద్ధత గతంలో కన్నా మరింత కీలకంగా మారిందని పేర్కొన్నారు. తగినంత కవరేజీ తీసుకోవడం, ప్రివెంటివ్ హెల్త్కేర్పై దృష్టి పెట్టడం అవసరమని వివరించారు.
ఇరుకు ఇళ్లకు ఇకమతు! ఇలాంటి గోడలు
వినియోగదారుడికి నచ్చిన విధంగా ఇంట్లో ఉన్న విస్తీర్ణాన్ని అవసరానికి తగిన విధంగా సద్వినియోగం చేసుకునేలా నిర్మాణదారులు సరికొత్త సాంకేతిక ఆలోచనలు చేస్తున్నారు. ఇటుకలు, సిమెంట్ బ్లాక్స్ ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుండటంతో వాటి స్థానంలో ప్యానల్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. ఇవి తక్కువ మందంతో పాటు పటిష్టంగా ఉండి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. స్క్రూలతో బిగింపు.. ఇంటి లోపల అంతర్గత గోడల కోసం ఈ ప్యానెల్స్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే గతంలో వీటిని కదలించడానికి వీలు లేకుండా స్క్రూలతో బిగించేవారు. ప్రస్తుతం కదిలేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో స్థలాన్ని వినియోగించుకునే అవకాశం ఏర్పడుతోంది. చిన్న పిల్లల గదిని పగటి పూట తగ్గించుకొని హాల్ పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవి ఇంటీరియర్స్లో కలిసిపోయి అందంగా ఉంటాయి కాబట్టి ఎవరూ ఇవి గోడలని గుర్తించలేరు.నిర్మాణ వ్యయం ఎక్కువ స్టూడియో అపార్ట్మెంట్స్లలో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తరహా గోడలనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఉదయంలో బెడ్ను కాస్త గోడకు నిలబెట్టేస్తే అదొక డిజైన్ మాదిరి కనిపిస్తుంటుంది. అయితే సంప్రదాయ గోడల కంటే వీటి నిర్మాణానికి వ్యయం ఎక్కువ అవుతుంది. చదరపు అడుగు వాల్ ప్యానెల్స్ రూ.75–రూ.80 నుంచి ప్రారంభమవుతాయి. బహిరంగ మార్కెట్తో పాటు ఆన్లైన్లోనూ వివిధ రకాల డిజైన్లు లభ్యమవుతాయి.
భారత్కు ఫిన్లాండ్ చాక్లెట్లు తీసుకొస్తున్న రిలయన్స్
న్యూఢిల్లీ: ఫిన్లాండ్కి చెందిన ఆహారోత్పత్తుల దిగ్గజం ఫేజర్తో రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫేజర్ ప్రీమియం చాక్లెట్లను భారత్లో ఉత్పత్తి, మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలను ఆర్సీపీఎల్ చేపట్టనుంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారత పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.పోలాండ్, చైనా తదితర 40 పైగా దేశాలకు ఫేజర్ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీపీఎల్ సంస్థ టాఫీమ్యాన్, పాన్ పసంద్, లోటస్ చాక్లెట్స్లాంటి పలు దేశీ బ్రాండ్లను పునరుద్ధరించింది. అలాగే మాలిబాన్, నెక్స్బా, పేస్లాంటి గ్లోబల్ బ్రాండ్స్ని కూడా ప్రవేశపెట్టింది.
మహిళా సాధికారతకు ఎస్బీఐ 50 కోట్ల డాలర్ల రుణ సదుపాయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 50 కోట్ల డాలర్ల సిండికేటెడ్ సోషల్ టర్మ్ రుణ సదుపాయాన్ని ప్రకటించింది. ఇందులో గ్రీన్షూ ఆప్షన్ కూడా ఉంటుంది.లింగ సమా నత్వం, సమగ్ర ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ఈ రుణం అందించనున్నట్లు బ్యాంకు తెలిపింది. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్జీ) సిద్ధాంతాలపై బ్యాంకు చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తుందని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
ఫార్మాకు రూ.5,000 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల్లో దేశీ ఫార్మా రంగం రూ.2,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంతో సరుకు రవాణా, సరఫరా వ్యవస్థల్లో ఏర్పడే ప్రతికూలతలు ఇందుకు దారితీయనున్నట్టు ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) పేర్కొంది. దేశ ఫార్మా ఎగుమతుల్లో గల్ఫ్ దేశాల (జీసీసీ) వాటా 5.58 శాతం ఉన్నట్టు తెలిపింది.2020–21లో పశ్చిమాసియాకు ఎగుమతులు 1,320 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2024–25లో 1,749 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. అందుబాటు ధరలకే ఔషధాల కోసం యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, యెమెన్ భారత్పై ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు తెలిపింది. ఒక్కో షిప్మెంట్కు 4,000–8,000 డాలర్ల మేర సర్చార్జీతో భారత ఎగుమతులు, దిగుమతుల రవాణా చార్జీలు పెరిగిపోతాయని, భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలపై భారం పడుతుందని ఫార్మెక్సిల్ పేర్కొంది. మార్బి సిరామిక్ పరిశ్రమపై పిడుగు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో గుజరాత్లోని మార్బిలో 350 వరకు సిరామిక్ టైల్స్ తయారీ పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. సహజవాయువు (ప్రొపేన్) కొరత ఇక్కడి పరిశ్రమను వేధిస్తోంది. మార్చి 15 నాటికి సరఫరా పునరుద్ధరించకపోతే మొత్తం పరిశ్రమ మూసివేసే ఆలోచనతో ఉన్నట్టు మార్బి సిరామిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కేజీ కుందారియా తెలిపారు. ‘‘మార్బిలో 750 వరకు పరివ్రమలు ఉన్నాయి.దేశ టైల్స్ ఉత్పత్తిలో వీటి వాటా 90 శాతం. గ్యాస్ సరఫరా లేకపోవడంతో శుక్రవారం నాటికి 350 పరిశ్రమలు మూతపడనున్నాయి’’ సిరామిక్ ప్యానెల్ చైర్మన్ జెటా్పరియా తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మొదలైన నాటి నుంచి ప్రొపేన్ సరఫరా సరిగ్గా ఉండడం లేదని, మార్బిలో కేవలం 30 శాతం పరిశ్రమలే గుజరాత్ గ్యాస్ పంపిణీ సంస్థ కనెక్షన్ కలిగి ఉన్నట్టు చెప్పారు. ఈ సంస్థ 50 శాతం తగ్గించి సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
కార్పొరేట్
మహిళల్లో ఆరోగ్య బీమా కవరేజీ అంతంతే..
భారత్కు ఫిన్లాండ్ చాక్లెట్లు తీసుకొస్తున్న రిలయన్స్
మహిళా సాధికారతకు ఎస్బీఐ 50 కోట్ల డాలర్ల రుణ సదుపాయం
రూ.26 లక్షల ఉద్యోగం.. అందుకే వదిలేసా!
భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం
‘భారతీయ బ్యాంకింగ్పై నమ్మకం’లో కొత్త కోణాలు
ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష
పేటీఎం తర్వాత మరో భారీ ఐపీవో.. ఫోన్పే ప్లాన్ ఇదే!
బంగారంపై భారీ డిస్కౌంట్.. అమ్మేసుకుంటున్న వ్యాపారులు
ఒకేసారి 300 మంది ఉద్యోగులపై వేటు!
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
మార్చి 2నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుత...
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ...
ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం
భారతీయ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్త...
మరింత తక్కువకు బంగారం.. కొనేవారిదే భాగ్యం!
దేశంలో బంగారం ధరల (Today Gold Rate) తగ్గుదల కొనసాగ...
మళ్లీ మనకి రష్యా క్రూడ్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో...
భారత్ చమురు కొనుగోలుకు అనుమతి అవసరం లేదు
భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడానికి ఎప్పుడూ ఇత...
వార్ ఎఫెక్ట్.. భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు!
పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ పరిస్థితులతో భారత ఆర్...
రష్యా చమురు కొనుగోలుకు యూఎస్ ఓకే
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ఇరా...
ఆటోమొబైల్
టెక్నాలజీ
చాట్జీపీటీని బాయ్కాట్ చేసిన 25 లక్షల మంది!
అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఓపెన్ఏఐ సేవలపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. చాట్జీపీటీని బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన ఒక వెబ్సైట్.. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్జీపీటీని బాయ్కాట్ చేసినట్లు పేర్కొంది.900 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఓపెన్ఏఐ (OpenAI) గత వారం అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ శాఖ తన వర్గీకృత నెట్వర్క్లో ఏఐ మోడల్ను అమలు చేయడానికి అనుమతి లభించింది.ఈ డీల్తో వినియోగదారుల అసంతృప్తి పెరుగుతోందని ఆ వెబ్సైట్ వెల్లడించింది. సంతకాల సంఖ్య, సోషల్ మీడియా షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ప్రజలు చాట్జీపీటీపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంది. “అమెరికన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను చాట్జీపీటీ నుంచి నిష్క్రమించడానికి మేము సమన్వయం చేస్తున్నాం. వినియోగదారుల చర్యల ద్వారా ఓపెన్ఏఐకు స్పష్టమైన సందేశం పంపవచ్చు” అని వెబ్సైట్ పేర్కొంది.ఇదిలా ఉండగా, సెన్సార్ టవర్ విశ్లేషణ ప్రకారం.. పెంటగాన్ నుంచి తప్పుకొన్న ఆంథ్రోపిక్ (Anthropic) రూపొందించిన ‘క్లాడ్’ చాట్బాట్ యాప్, అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్ చార్టుల్లో చాట్జీపీటీ యాప్ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. అలాగే టెక్క్రంచ్ నివేదిక ప్రకారం.. గత శనివారం చాట్జీపీటీ మొబైల్ యాప్ యూఎస్లో అన్ఇన్స్టాల్ల సంఖ్య రోజుకు 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది.
ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!
భారత టెలికాం రంగంలో మార్పులు చోటుచేసుకునేలా ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెలికాం స్పెక్ట్రం అనేది ప్రజా ఆస్తి అని, ఇది ప్రభుత్వ సార్వభౌమత్వ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 13, 2026న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాంతో దివాలా తీసిన సంస్థల బకాయిల వసూలు ప్రక్రియ చిక్కుల్లో పడినట్టయిందని కొందరు భావిస్తున్నారు.ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), ఎయిర్ సెల్ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల ఏజీఆర్ బకాయిలను(స్పెక్ట్రం వినియోగానికి బదులుగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు) ఎలా రాబట్టాలనే అంశంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఇప్పుడు అటార్నీ జనరల్ నుంచి అత్యవసర న్యాయ సలహాను కోరింది.స్పెక్ట్రం ప్రభుత్వ ఆస్తి.. ఐబీసీ పరిధిలోకి రాదుసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. టెలికాం స్పెక్ట్రం అనేది ఒక పరిమిత సహజ వనరు. దీనిపై పూర్తి హక్కులు భారత ప్రభుత్వానికే ఉంటాయి. టెలికాం ఆపరేటర్లకు కేవలం షరతులతో కూడిన వినియోగ హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, అది వారి సొంత ఆస్తి కాదు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద స్పెక్ట్రంను విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ఆర్కామ్, ఎయిర్ సెల్ వంటి సంస్థల ఆస్తులను విక్రయించి తమ అప్పులు తీర్చుకోవాలని భావించిన బ్యాంకులు (రుణదాతలు) ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.రుణదాతల ఆందోళనఈ తీర్పుతో సుమారు రూ.37,588 కోట్ల ఏజీఆర్ బకాయిల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆర్కామ్ బకాయిలు సుమారు రూ.25,199.3 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ సెల్ బకాయిలు సుమారు రూ.12,389 కోట్లుగా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీ దివాలా తీస్తే దాని ఆస్తులను అమ్మి ‘వాటర్ఫాల్ మెకానిజం’(ఒక కంపెనీ దివాలా తీసినప్పుడు దాని ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి అని నిర్ణయించే క్రమం) ద్వారా రుణదాతలకు పంచుతారు. కానీ, ఇప్పుడు స్పెక్ట్రం ఐబీసీ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వ బకాయిలు అలాగే ఉండిపోవడమే కాకుండా, ఇతర ఆర్థిక సంస్థల అప్పు రికవరీ కూడా నామమాత్రంగానే మిగిలే ప్రమాదం ఉంది.టెలికాం రంగంపై ఒత్తిడిభారత టెలికాం రంగం ఇప్పటికే భారీ అప్పులతో సతమతమవుతోంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి ప్రధాన ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4.09 లక్షల కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ బలోపేతం కోసం నిధులు సేకరించినప్పటికీ స్పెక్ట్రం ఫీజులు, అప్పుల నిర్వహణ సవాలుగా మారింది. భారతీ ఎయిర్ టెల్ 75.6% డెట్-టు-ఈక్విటీ నిష్పత్తితో బ్యాలెన్స్ షీట్ను నెట్టుకొస్తోంది. టెలికాం కంపెనీలు 5జీ సేవలకు మారుతున్న తరుణంలో భారీ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నియంత్రణ సంస్థల స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.బ్యాంకులు టెలికాం రంగానికి రుణాలు ఇచ్చేటప్పుడు ఇకపై చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటార్నీ జనరల్ ఇచ్చే వివరణ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి అడుగు వేయనుంది. ఒకవేళ స్పెక్ట్రంను వేలం వేయడానికి వీలు లేకపోతే ప్రభుత్వం ఈ బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుందనేది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
ఒక రీఛార్జ్.. 72 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 485 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 485 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.Caption-Shoot. Share. Shine! Celebrate this Holi with extra data and uninterrupted fun on BSNL ₹485 plan. Hurry, offer ends 31st March 2026.#HoliWithBSNL #ExtraDataExtraFun #BSNLIndia #Holi2026 pic.twitter.com/Hw9gdSPEPd— BSNL India (@BSNLCorporate) March 3, 2026
ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన!
అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్, తక్షణ ఫీడ్బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది.
పర్సనల్ ఫైనాన్స్
EPFO సేవల్లో మార్పులు.. ఇక అన్నీ ఆటోమేషన్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ద్వారా అందే సేవలను పూర్తిగా ఆటోమేషన్ పద్ధతిలో నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయించింది. ఇందుకు ప్రతి చందాదారుడు తప్పనిసరిగా కేవైసీ సమర్పించాలని సూచించింది. అలా కేవైసీ సమర్పించిన వారికి ఈ సేవలన్నీ ఆటోమేషన్ పద్ధతిలో అందుతాయి.ఇకపై మాన్యువల్ విధానానికి తావు ఇవ్వొద్దని సీబీటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కసరత్తు చేయాలని ఈపీఎఫ్ఓ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సీబీటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చందాదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న తరుణంలో సేవలను వేగంగా అందించే లక్ష్యంతో డిజిటల్ రీఫార్మ్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.మానవ జోక్యం లేకుండా... క్లెయిమ్ ప్రాసెస్ను మానవ జోక్యం లేకుండా పూర్తి చేసే వ్యవస్థను ఈపీఎఫ్ఓ అభివృద్ధి చేస్తోంది. పూర్తిగా ఆటో సెటిల్మెంట్ విధానాన్ని విస్తరిస్తోంది. ఒక క్లెయిమ్ పరిష్కారానికి ఇదివరకు మాన్యువల్గా కాగితాల సమర్పణ, అధికారుల ఆమోదం లాంటివి ఉండేవి. ఇకపై అలాంటి జాప్యం లేకుండా ఆటోమేషన్ పద్ధతిలో క్లెయిమ్స్ ప్రాసెస్ చేస్తారు. ఇందుకోసం చందాదారుడు ఆధార్, బ్యాంకు కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.దీంతో మానవ ప్రమేయం లేకుండా సిస్టమ్ ఆధారంగానే క్లెయిమ్స్ సెటిల్ చేస్తారు. ఈ సందర్భంలోనే ఆన్లైన్ ట్రాకింగ్, ఎస్ఎంఎస్/ ఈ –మెయిల్ అప్డేట్ను మరింత పారదర్శకం చేయనున్నారు. ఇనాపరేటివ్ ఖాతాల నిర్వహణకు చెక్ పెట్టాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఈపీఎఫ్ ఖాతాలు, చాలాకాలంగా నిర్వహణ లేని వాటిని ఆటో–ఇనిషియేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసేందుకు సీబీటీ నిర్ణయం తీసుకుంది.ఇలాంటి ఖాతాలు దాదాపు 3 లక్షలకు పైబడి ఉన్నాయి. ఆటో–ఇనిషియేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాన్ని పైలట్ పద్ధతిలో ప్రారంభించనుంది. చిన్న మొత్తాలున్న ఖాతాలు, ఏళ్ల తరబడి నిర్వహణ లేని ఖాతాలను స్వయంచాలకంగా గుర్తించి, సభ్యుల బ్యాంక్ వివరాలు సరైనవని నిర్ధారించుకొని ఆ నిధులను వెనక్కి ఇచ్చేస్తారు. దీంతో ఏటా వడ్డీ చెల్లింపులు, నిర్వహణ భారం తగ్గుతుంది. ఈడీఎల్ఐ పథకం అమలు కూడా మరింత వేగవంతం కానుంది.క్లెయిమ్స్ను వేగంగా పరిష్కరించేలా ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ విభాగాల మధ్య డేటా సమన్వయానికి చర్యలు చేపట్టనున్నారు. చందాదారులకు ఒకేచోట సేవలు అందేలా యూనిఫైడ్ పోర్టల్ అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇదివరకే తీసుకోగా... పనుల ప్రగతి నివేదికపైనా సీబీటీ సమావేశంలో చర్చించారు.యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఆధారంగా రికార్డుల నవీకరణ, పేరు, పుట్టిన తేదీ సవరణను సులభతరం చేయనున్నారు. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తారు. ఫిర్యాదుకు సంబంధించిన సమస్య పరిష్కారానికి నిర్దేశించిన గరిష్ట సమయం కంటే ముందే పరిష్కరించేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.
పెట్టుబడులకు చక్కని వైవిధ్యం
పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. దీని వల్ల నష్టాల రిస్క్ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అన్ని పెట్టుబడులను ఒకే చోట పెట్టడం కంటే.. వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాల రిస్క తగ్గుతుంది. ఒకే ఫండ్తో చక్కని వైవిధ్యం కోరుకునే వారికి పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చక్కగా సరిపోతుంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులతో, తక్కువ నష్టాల రిస్్కతో ఈ పథకం మెరుగ్గా రాణిస్తోంది.రాబడులుఈ పథకానికి మంచి రాబడుల చరిత్రే ఉంది. ఈ పథకం 2013లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున 19 శాతం చొప్పున రాబడులను అందించింది. గత ఐదేళ్లలోనూ రాబడి ఇదే స్థాయిలో ఉంది. మూడేళ్లలో మాత్రం ఏటా 20.94 శాతం చొప్పున, ఏడాది కాలంలో 10 శాతం మేర పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే 6 శాతం వరకు అధిక ప్రతిఫలం ఈ పథకంలోనే ఉండడం గమనించొచ్చు.పెట్టుబడుల విధానంమంచి రాబడుల అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఈ ఫండ్కు ఉంది. స్థానిక కంపెనీలతో పాటు విదేశీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో ఈ పథకం చెప్పుకోతగ్గ స్థాయిలో ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్లో ఈ పథకానికి గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. వ్యాల్యూ స్టాక్స్కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది. అంటే కంపెనీ వ్యాపారం, మూలాల పరంగా మంచి విలువ కలిగి, ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులు తెచ్చిపెట్టే వ్యూహాన్ని పాటిస్తోంది.వాస్తవ విలువలకు మించి గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న స్టాక్స్కు దూరంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్్కను సాధ్యమైనంత తగ్గించే విధంగా పనిచేస్తుంది. స్టాక్స్ను తరచూ మార్చదు. ఒక కౌంటర్లో దీర్ఘకాలం పాటు కొనసాగడాన్ని పాటిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలు కాకుండా.. ఎంతో విలువ దాగున్న స్టాక్స్ను గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా డెట్ సెక్యూరిటీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లలో (రీట్)నూ ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మధ్యకాల లక్ష్యాలకు (5–7 ఏళ్లు) దీర్ఘకాల లక్ష్యాలకు (10 ఏళ్లకు అంతకుమించి) ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.1,33,970 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 77.32 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 13.71 శాతం, ఈక్విటీ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్లలో 2.53 శాతం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో 1.33 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 5.11 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 33.80 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 25.29 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీలకు 7.48 శాతం చొప్పున కేటాయించింది. ప్రతినెలా రూ.1000 నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల సిలిండర్ కొత్త రేటు..
మార్చి నెలకు ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలురాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కు పెరిగింది. కోల్కతాలో ధర రూ.1844.50 నుంచి రూ.1875.50కు చేరింది. ముంబైలో రూ.1692 నుంచి రూ.1720కు పెరిగింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1899.50 నుంచి రూ.1929కు, హైదరాబాద్లో రూ. 1,962.50 నుంచి రూ. 1,990.50కు విశాఖపట్నంలో రూ. 1,791.50 నుంచి రూ. 1,822.50కు పెరిగినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.గృహ ఎల్పీజీ రేట్లు యథాతథంఆయిల్ కంపెనీల తాజా వివరాల ప్రకారం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఇది రూ.853కు అందుబాటులో ఉంది. కోల్కతాలో రూ.951గా కొనసాగుతోంది. ముంబైలో రూ.852.50గా ఉంది. లక్నోలో గృహ సిలిండర్ ధర రూ.890.50గా కొనసాగుతోంది. హైదరాబాద్లో రూ. 905, విశాఖపట్నంలో రూ. 861లుగా ఉంది.కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తోంది.
ఇన్సూరెన్స్తోపాటు ఈక్విటీ.. కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
అంతర్జాతీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘టాటా ఏఐఏ గ్లోబల్ ఈక్విటీ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 5 వరకు అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు గ్లోబల్ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుంది. టాటా ఏఐఏ శుభ్ గ్లోబల్ ఇన్వెస్ట్ లాంటి యూనిట్ లింక్డ్ పథకాల ద్వారా ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఫండ్ నిధుల్లో 70%–100% వరకు భాగాన్ని గ్లోబల్ ఈక్విటీల్లో, మిగతా భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.ట్రస్ట్ ఎంఎఫ్ మిడ్క్యాప్ ఫండ్ ప్రధానంగా మిడ్–క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మిడ్ క్యాప్ ఫండ్ని ఆవిష్కరించింది. ఇది మార్చి 13 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా 101 నుంచి 250 ర్యాంకుల వరకు ఉండే సంస్థల షేర్లు, ఈక్విటీ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి నిఫ్టీ మిడ్క్యాప్ 150 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా తయారీ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన పలు మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణిస్తున్నాయని సంస్థ తెలిపింది. గత అయిదేళ్లలో ఈ విభాగంలోని 37 కంపెనీలు మూడు రెట్లు రాబడులు అందించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిడ్–క్యాప్ కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో సందీప్ బాగ్లా తెలిపారు. ఐసీఐసీఐ ప్రు లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. నిలకడగా డివిడెండ్లను చెల్లించే ట్రాక్ రికార్డుతో ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. బీఎస్ఈ 500 నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల ఇండెక్స్ని ఇది ట్రాక్ చేస్తుంది. ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్ అష్యూర్, స్మార్ట్కిడ్ అష్యూర్, స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ (సిప్ ప్లస్) తదితర పథకాలతో ఇది లభిస్తుంది.


