ప్రధాన వార్తలు
‘జెన్’ ఇన్ బ్లాక్
ఎన్ని రంగులు ఉన్నా తెల్ల రంగు కారు అందమే వేరు. ఆకర్షణీయమైన, ప్రశాంతమైన లుక్, అధిక రీసేల్ వేల్యూలాంటి అంశాల కారణంగా దశాబ్దాలుగా తెల్ల కార్లకు డిమాండ్ కొనసాగుతోంది. కానీ ఇప్పుడు దాని స్థానాన్ని క్రమంగా నల్ల రంగు కార్లు ఆక్రమిస్తున్నాయి. జేటో డైనమిక్స్ డేటా ప్రకారం గత అయిదేళ్లుగా వార్షికంగా తెల్ల కార్ల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు తగ్గాయి. 2021లో అమ్ముడైన మొత్తం కార్లలో వీటి వాటా 43.9 శాతంగా ఉండగా, 2025లో 40.7 శాతానికి పడిపోయింది. అదే సమయంలో నల్ల రంగు కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.2021లో 14.8 శాతంగా ఉన్న వీటివాటా 2025లో దాదాపు 20.76 శాతానికి ఎగిసింది. పరిశ్రమ సగటుతో పోలిస్తే నల్ల రంగు కార్ల అమ్మకాలు గత అయిదేళ్లుగా భారీగా వృద్ధి చెందాయని మారుతీ సుజుకీ వర్గాలు తెలిపాయి. జెనరేషన్ జెడ్, యువ కొనుగోలుదార్లలో ప్రీమియం ఎడిషన్లు, బ్లాక్ కలర్ కార్లపై ఆసక్తి పెరిగిందని పేర్కొన్నాయి. హ్యుందాయ్ మోటర్స్ 2021లో దేశీయంగా నమోదు చేసిన అమ్మకాల్లో నల్ల కార్ల వాటా 9 శాతంగా ఉండగా 2024 నాటికి (జనవరి–నవంబర్) ఇది 19 శాతానికి పెరిగింది. వ్యక్తిత్వాన్ని వ్యక్తపర్చేందుకు ఉపయోగపడే సాధనంగా కారు మారిందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. దీనితో ఆత్మవిశ్వాసం, ప్రీమియం లుక్ ఉట్టిపడే రంగుల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి. మారుతున్న అభిరుచులు, మార్కెటింగ్ వ్యూహాలు.. కొనుగోలుదారుల మారుతున్న అభిరుచులు, కార్ల కంపెనీలు అనుసరించే వ్యూహాలతో కూడా నలుపు రంగుకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ప్రీమియం, లైఫ్స్టయిల్ ఆధారిత సెగ్మెంట్లలో ముదురు వర్ణాలను ఇండివిడ్యువాలిటీ, హోదా, ఆధునికతకు ముడిపెట్టి ఆటోమొబైల్ కంపెనీలు వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. హై ఫ్యాషన్, లగ్జరీ ఉత్పత్తులుగా వాటిని మార్కెటింగ్ చేస్తున్నాయి. తయారీపరంగా కూడా మిగతా తేలికపాటి రంగులతో పోలిస్తే నలుపు రంగుతో పెయింటింగ్ ప్రక్రియ సరళంగా పూర్తవుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.నలుపు రంగు అనేది దుమ్మును, చిన్న చిన్న గీతలను అంతగా కనిపించకుండా చేయగలదని వివరించాయి. 2025లో దేశీయంగా అమ్ముడైన మొత్తం స్పోర్ట్ యుటిలిటీ వాహనాల్లో (ఎస్యూవీ) దాదాపు 30 శాతం వాటా వాహనాలు నలుపు రంగు వాటిది కాగా, హ్యాచ్బ్యాక్లలో ఇది 6.77 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే యువతరం బోల్డ్ స్టయిల్ స్టేట్మెంట్గా నలుపు రంగును ఎంచుకుంటుండగా, పెద్దవారు కాస్త తేలికపాటి రంగులను ఎంచుకుంటున్నారు. వేడిమిని ఎక్కువగా గ్రహించే స్వభావం, భారత్లో వేడి వాతావరణంలో మెయింటెనెన్స్పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ మాస్ మార్కెట్ కొనుగోలుదారులు నలుపు ఎస్యూవీలను దూకుడుగా కనిపించే స్టయిల్ కోసం ఎంపిక చేసుకుంటుండగా, లగ్జరీ కొనుగోలుదార్లు హోదాకు చిహ్నంగా ఎంచుకుంటున్నారు. – సాక్షి, బిజినెస్డెస్క్
క్విక్ డెలివరీకి బ్లింకిట్ బై..
న్యూఢిల్లీ: డెలివరీ వర్కర్లపై ఒత్తిడి పెరుగుతోందన్న ఆందోళనల నడుమ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ ’10 నిమిషాల్లో డెలివరీ’ నినాదాన్ని పక్కన పెట్టింది. జెప్టో, ఇన్స్టామార్ట్లాంటి మిగతా సంస్థలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెలివరీ అగ్రిగేటర్ సంస్థలతో గత వారం భేటీ అయిన కేంద్ర కార్మీక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇచ్చిన సూచనల మేరకు కంపెనీలు ’10 మినిట్’ డెలివరీ డెడ్లైన్ని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. మాండవీయ సారథ్యంలో జరిగిన సమావేశంలో బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీలాంటి దిగ్గజాలు పాల్గొన్నాయి.బ్లికింగ్ట్ సత్వరం ఆదేశాలను అమలు చేస్తూ తమ బ్రాండింగ్ నుంచి 10 నిమిషాల్లో డెలివరీ హామీని తొలగించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికి తగ్గట్లుగా కంపెనీ తన బ్రాండ్ మెసేజింగ్ని కూడా అప్డేట్ చేసింది. ‘10 నిమిషాల్లో 10,000 పైగా ఉత్పత్తుల డెలివరీ‘ హామీని ‘మీ ఇంటి ముంగిట్లోకే 30,000కు పైగా ఉత్పత్తుల డెలివర్ అవుతాయి‘ అని మార్చింది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని, 10 మినిట్స్ ఇన్స్టంట్ డెలివరీ సిస్టమ్కు స్వస్తి పలకడాన్ని గిగ్, ప్లాట్ఫాం సర్విస్ వర్కర్ల యూనియన్ స్వాగతించింది. 10 నిమిషాల డెలివరీని వ్యతిరేకిస్తూ గిగ్ వర్కర్లు నూతన సంవత్సరం రోజున దేశీయంగా సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ వేతన పరిమితి పెంపు?
దేశంలోని కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించే అవకాశం ఉంది. ఉద్యోగుల సామాజిక భద్రతా పథకాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈపీఎఫ్ఓ (ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ), ఈఎస్ఐసీ (ఉద్యోగుల స్టేట్ బీమా సంస్థ)ల వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ రెండు సంస్థల వేతన పరిమితిని నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య స్థాయికి పెంచాలని భావిస్తోంది.ప్రస్తుతం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీల మధ్య వేతన పరిమితుల్లో భారీ వ్యత్యాసం ఉంది.ఈపీఎఫ్ఓ పరిమితి: నెలకు రూ.15,000 (ఇది 2014 సెప్టెంబర్ నుంచి మార్పు చేయలేదు).ఈఎస్ఐసీ పరిమితి: నెలకు రూ.21,000.ఈ వ్యత్యాసం వల్ల వేతనాల పెరుగుదల కారణంగా చాలా మంది ఉద్యోగులు సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు. ద్రవ్యోల్బణం, పెరిగిన కనీస వేతనాలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రెండు పథకాలను ఏకరీతిగా చేయడం ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం.సుప్రీంకోర్టు ఆదేశాలుఈ తాజా పరిణామాల్లో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు అత్యంత కీలకంగా మారాయి. జనవరి 2026 ప్రారంభంలో (జనవరి 5 నాటి సమాచారం ప్రకారం) సుప్రీం కోర్టు, ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి, ఈపీఎఫ్ఓ బోర్డుకు నాలుగు నెలల గడువు విధించింది. దశాబ్ద కాలంగా పరిమితి మారకపోవడంపై పిటిషనర్లు, ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటానికి ఇది ఒక విజయంగా భావించవచ్చు.లబ్ధిదారులపై ప్రభావంఈ మార్పు అమల్లోకి వస్తే సామాజిక భద్రతా వలయం గణనీయంగా విస్తరిస్తుంది. ఈపీఎఫ్ఓ పరిధిలో ప్రస్తుతం ఉన్న 8.5 కోట్ల మంది సభ్యుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈఎస్ఐసీలో ప్రస్తుతం ఉన్న 14 కోట్ల మంది లబ్ధిదారులకుతోడు పరిమితి పెంపుతో మరిన్ని కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభిస్తుంది.పెరగనున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి, యజమాని చెరో 12 శాతం వాటా జమ చేస్తారు. యజమాని వాటాలో 8.33 శాతం పెన్షన్ స్కీమ్ (EPS)కు, 3.67 శాతం పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. వేతన పరిమితి పెరిగితే ఈ కాంట్రిబ్యూషన్ మొత్తం పెరిగి ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ మరింత మెరుగ్గా మారుతాయి.సాధారణంగా ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం, ప్రస్తుతం ఉన్న రూ.15,000 గరిష్ట వేతన పరిమితి ఆధారంగా లెక్కలు కింది విధంగా ఉంటాయి.1. ఉద్యోగి వాటా (12%): గరిష్టంగా కట్ అయ్యే మొత్తం: రూ.15000*12%= రూ.1,800.2. యజమాని వాటా (12%): రెండు భాగాలుగా విడిపోతుంది.EPF (3.67%): 15000*3.67%= రూ.550.EPS (పెన్షన్ - 8.33%): 15000*8.33%= రూ.1250.కాబట్టి, ప్రస్తుత అధికారిక పరిమితి ప్రకారం మీ జీతం నుంచి నెలవారీ గరిష్టంగా కట్ అయ్యే పీఎఫ్ మొత్తం రూ.1,800.ఒకవేళ వేతన పరిమితి రూ.25,000 లేదా రూ.30,000 కి పెరిగితే..వేతన పరిమితిఉద్యోగి వాటా (12%)యజమాని వాటా (EPS + EPF)మొత్తం నెలకు జమ అయ్యేదిరూ.25,000రూ.3,000రూ.3,000 (EPS: రూ.2,083 + EPF: రూ.917)రూ.6,000రూ.30,000రూ.3,600రూ.3,600 (EPS: రూ.2,499 + EPF: రూ.1,101)రూ.7,200
10 నిమిషాల డెలివరీ ఎత్తివేత!
జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడంతో పాటి.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ వంటివాటిని నిరసిస్తూ గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించారు. దీనిపై కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు.కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడానికంటే ముందు.. డెలివరీ సమయపాలనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి బ్లింకిట్ , జెప్టో, జొమాటో & స్విగ్గీ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్లతో ఒక సమావేశం నిర్వహించారు. బ్లింకిట్ ఇప్పటికే 10 నిమిషాల డెలివరీ విధానం తొలగించింది. ఇక త్వరలోనే ఇతర అగ్రిగేటర్లు కూడా దీనిని అనుసరిస్తారని పేర్కొన్నారు.10 నిమిషాల డెలివరీ వల్ల సమస్యలు!ప్రస్తుత రోజుల్లో ‘10 నిమిషాల డెలివరీ’ పోటీ పెరిగింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ గిగ్ వర్కర్లకు మాత్రం శాపంగా మారింది. పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరగా చేరుకోవాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే కంపెనీలు వేసే జరిమానాలు, కస్టమర్ల నుంచి వచ్చే తక్కువ రేటింగ్ వారి జీతాలపై ప్రభావం చూపుతున్నాయి.10 నిమిషాల డెలివరీ ఉద్దేశ్యం.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్.. డెలివరీ ఏజెంట్స్ లేదా రైడర్లపై ఒత్తడి తెస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, దీపిందర్ గోయల్ స్పందిస్తూ..ఇళ్ల చుట్టుపక్కల్లో దుకాణాలు ఎక్కువ కావడం వల్లనే 10 నిమిషాల డెలివరీ అనేది తీసుకొచ్చాము. దీని ఉద్దేశ్యం డెలివరీ ఏజెంట్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలని కాదని అన్నారు. అంతే కాకుండా డెలివరీ కోసం కస్టమర్లకు ఇచ్చిన టైమర్.. డెలివరీ ఏజెంట్లకు కనిపించదని వెల్లడించారు.కార్మికుల భద్రత గురించి వివరిస్తూ.. డెలివరీ భాగస్వాములకు వైద్య, జీవిత బీమా ఉందని గోయల్ అన్నారు. ఆలస్యానికి జరిమానాల విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. డెలివరీ ఏజెంట్స్.. సమయానికి అందించకపోతే ఏమీ జరగదు. కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యాలు జరుగుతాయని గోయల్ వెల్లడించారు.
వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు ఖరారు
భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఈ నెలలోనే పట్టాలెక్కనుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరా, అస్సాంలోని గువాహతి (కామాఖ్య) మధ్య ఈ రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన టికెట్ ధరలు, రిజర్వేషన్ నిబంధనలను రైల్వే బోర్డు అధికారికంగా వెల్లడించింది.జనవరి 17న ప్రారంభంరైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్, టెస్టింగ్, భద్రతా సర్టిఫికేషన్ ప్రక్రియలు విజయవంతంగా పూర్తయ్యాయి. జనవరి 17, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సాధారణ ప్రయాణికులకు జనవరి 18 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికులకు అత్యుత్తమ అనుభూతిని అందించేందుకు రైల్వే బోర్డు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో కేవలం ‘కన్ఫర్మ్’ అయిన టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. సాధారణ రైళ్లలో ఉండే ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ ఇందులో ఉండదు. అంటే, రైలు చార్ట్ సిద్ధమైన తర్వాత సీటు కేటాయించబడని వారికి ప్రయాణించే అవకాశం ఉండదు. అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి (ARP) మొదటి రోజు నుంచే అన్ని బెర్తులు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.టికెట్ ధరలు, కనీస ఛార్జీరైల్వే బోర్డు ఇటీవల ప్రకటించిన సర్క్యులర్ ప్రకారం, వందే భారత్ స్లీపర్ ఛార్జీలు కిలోమీటరు ప్రాతిపదికన నిర్ణయించారు.కనీస ఛార్జీ: ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.3 ఏసీ కిలోమీటరుకు రూ.2.4 (కనీస ధర రూ.960)2 ఏసీ: కిలోమీటరుకు రూ.3.1 (కనీస ధర రూ.1,240)1 ఏసీ: కిలోమీటరుకు రూ.3.8 (కనీస ధర రూ.1,520)హౌరా-గువాహతి మార్గంలో పూర్తి ప్రయాణానికి 3 ఏసీకి సుమారుగా రూ.2,300, 2 ఏసీకి రూ.3,000, ఫస్ట్ ఏసీకి రూ.3,600 (కేటరింగ్ ఛార్జీలతో కలిపి) ఉండొచ్చని అంచనా. వీటికి అదనంగా జీఎస్టీ ఛార్జీలు ఉండే అవకాశం ఉందని గమనించాలి.రిజర్వేషన్ కోటాలుఈ రైలులో అన్ని రకాల కోటాలు వర్తించవు. కేవలం కింద పేర్కొన్న ముఖ్యమైన విభాగాలకు మాత్రమే రిజర్వేషన్ కోటా ఉంటుంది.1. మహిళలు2. దివ్యాంగులు3. సీనియర్ సిటిజన్లు4. డ్యూటీ పాస్ కోటా (రైల్వే సిబ్బంది కోసం). మిగిలిన ఇతర ప్రత్యేక కోటాలకు ఈ రైలులో చోటు లేదు.ఈ రైలు ప్రత్యేకతలుమొత్తం 16 కోచ్లతో (11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ) నడవనున్న ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చు. గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక ‘కవచ్’ భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ డోర్స్, విమాన స్థాయి సౌకర్యాలతో ఈ వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని భారీతీయ రైల్వే తెలిపింది.ఇదీ చదవండి: ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు
ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణ వేగాన్ని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తీవ్రంగా తప్పుబట్టారు. 2026 న్యూయార్క్ టైమ్స్ డీల్ బుక్ సమ్మిట్ వేదికగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలు తమ సొంత డేటా సెంటర్లను నిర్మించుకోవడాన్ని 110 ఏళ్ల క్రితం నాటి విద్యుత్ రంగ పరిస్థితులతో పోల్చారు.చారిత్రక తప్పిదమే పునరావృతం?మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ సొంత కంప్యూటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని బెజోస్ తప్పుబట్టారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పవర్ గ్రిడ్లు అందుబాటులోకి రాకముందు కర్మాగారాల్లో తమకు అవసరమైన విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఏఐ రంగంలోనూ అదే జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ సొంత డేటా సెంటర్లు నిర్మించుకుంటున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు. దీనికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీగా విద్యుత్తు వనరుల అవసరం పెరగనుంది. భవిష్యత్తులో టెక్ ఇండస్ట్రీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి కేంద్రీకృత క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వైపు మళ్లడం అనివార్యం. అప్పుడే వనరుల దుర్వినియోగం తగ్గుతుంది’ అని ఆయన అంచనా వేశారు. గతంలో విద్యుత్ రంగం ఎలాగైతే కేంద్రీకృతమై సమర్థవంతంగా మారిందో, ఏఐ మౌలిక సదుపాయాల్లో కూడా అదే రకమైన విప్లవం రావాలని హెచ్చరించారు.పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ఏఐ వినియోగం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా మారుతోంది. 2024లో డేటా సెంటర్లు 415 టెరావాట్ల విద్యుత్తును వాడగా, 2030 నాటికి ఇది 945 టెరావాట్లకు చేరుతుందని అంచనా. అమెరికా జాతీయ విద్యుత్ డిమాండ్లో డేటా సెంటర్ల వాటా 4 శాతం నుంచి 12 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఒక సాధారణ గూగుల్ సెర్చ్తో పోలిస్తే, ఒక్క చాట్ జీపీటీ ప్రాంప్ట్ 10 రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. అలాగే ఒక లార్జ్ ఏఐ మోడల్ శిక్షణకు ఏడాదికి సుమారు 200 గృహాలకు సరిపడా విద్యుత్ అవసరమవుతుందని అంచనా.శక్తి వనరులే అసలైన అడ్డంకికేవలం బెజోస్ మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక సందర్భంలో ‘తగినంత విద్యుత్ లేక జీపీయూ చిప్స్ ఖాళీగా ఉంటున్నాయి’ అని అంగీకరించారు. సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) గతంలో మాట్లాడుతూ విద్యుత్ లభ్యత అనేది ఏఐ వృద్ధికి దీర్ఘకాలిక అడ్డంకి అని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి మెటా సంస్థ ఒహియోలో ఏర్పాటు చేస్తున్న తన సూపర్ క్లస్టర్ కోసం ఏకంగా అణు విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకోగా, ఆల్ఫాబెట్ సంస్థ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4.75 బిలియన్ డాలర్లను వెచ్చించింది.ఇదీ చదవండి: లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు..
కార్పొరేట్
10 నిమిషాల డెలివరీ ఎత్తివేత!
వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు ఖరారు
లాభాల్లోనే లాస్.. బలంగానే బిజినెస్
ఏటా 5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి
రూ.2.7 కోట్ల జీతం.. జాబ్ వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. ఎందుకంటే..
ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం
మీ ఇల్లు బంగారంగానూ!
బెర్క్షైర్ హాత్వే కొత్త సీఈఓ: వేతనం ఎన్ని కోట్లంటే?
రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు: అంబానీ కీలక ప్రకటన
2010లో పెట్టిన ఆర్డర్.. 2026లో వచ్చిన డెలివరీ
వెండి స్పీడు.. పసిడి దూకుడు.. భారీ ధరలు
బంగారం, వెండి ధరలు పూట పూటకూ మారిపోతున్నాయి. రోజుక...
పసిడి దూకుడు.. రూ.5400 పెరిగిన గోల్డ్ రేటు!
2025లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. 2026లో కూడా కొ...
మళ్లీ పసిడి పిడుగు! భారీగా మారిపోయిన ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు పూట పూటకూ మారిపోతున్నాయి...
పడిలేచిన పసిడి.. ఒక్కసారిగా పెరిగిన రేటు!
శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, 24 గ...
బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత
బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంపై సమాచార...
పెట్రోల్ కంటే.. పాలు, నీళ్ల ధరలే ఎక్కువ!.. ఎక్కడంటే?
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెలు...
మూడో ‘ఆర్థిక శక్తి’గా భారత్ ఎదగాలంటే..
భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవ...
అఫీషియల్: ఆదివారమే కేంద్ర బడ్జెట్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరి...
ఆటోమొబైల్
టెక్నాలజీ
బంపరాఫర్.. రూపాయికే సిమ్ కార్డు!
ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఉచితంగా సిమ్ కార్డు అందించనున్నట్లు వెల్లడించింది.''సెలబ్రేషన్స్ ముగిశాయి, కానీ ఆనందం మాత్రం అలాగే ఉంది!. కేవలం ఒక రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ పొందండి. దీని ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు.. 30 రోజుల చెల్లుబాటుతో ఆనందించండి. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే. మీకు సమీపంలోని BSNL CSC లేదా రిటైలర్ని ఈరోజే సందర్శించండి!'' అని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.Celebration over, but the joy isn’t!Get a Free BSNL SIM for just ₹1 and enjoy Unlimited Calls, 2GB/day data, 100 SMS/day with 30 days of validity. Offer valid till 31st Jan 2026Walk into your nearest BSNL CSC or retailer today!#BSNL #DigitalBharat #BSNLOffer… pic.twitter.com/3KCkyujWOE— BSNL India (@BSNLCorporate) January 10, 2026
ఏడాది రీచార్జ్.. ఇదే చవక ప్లాన్!!
భారతదేశపు రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్, తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త, చవక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. దేశవ్యాప్తంగా 390 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న ఈ సంస్థ, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్లపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో, సిమ్ను పూర్తిగా ఒక సంవత్సరం పాటు యాక్టివ్గా ఉంచే తక్కువ ధర ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ప్లాన్ ముఖ్యంగా ఎక్కువ డేటా అవసరం లేని, కాలింగ్, ప్రాథమిక కనెక్టివిటీ అవసరమయ్యే వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు, తల్లిదండ్రులు, లేదా సెకండరీ/బ్యాకప్ సిమ్ ఉపయోగించే వారికి ఇది ఖర్చు తక్కువ పరిష్కారం. తక్కువ వ్యయంతో మీ మొబైల్ నంబర్ను ఏడాది పొడవునా యాక్టివ్గా ఉంచడమే ఈ రీఛార్జ్ ఉద్దేశం.ఎయిర్టెల్ రూ.2,249 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలుఎయిర్టెల్ రూ.2,249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రీఛార్జ్ చేసిన రోజు నుండి పూర్తి సంవత్సరం వరకు అన్ని నెట్వర్క్లకు అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఫోన్ వినియోగం ప్రధానంగా కాల్స్, చాటింగ్, పరిమిత ఇంటర్నెట్ అవసరాలకు మాత్రమే ఉంటే, ఈ ప్లాన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలుఈ ప్లాన్లో రోజువారీ డేటా ఉండదు. బదులుగా, మొత్తం 30జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది. దీన్ని 365 రోజుల కాలవ్యవధిలో అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ చాటింగ్, ముఖ్యమైన ఇంటర్నెట్ అవసరాల కోసం ఈ డేటా సరిపోతుంది. అదనంగా 3,600 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. ఇవి బ్యాంక్ అలర్టులు, OTPలు, ఇతర ముఖ్యమైన సందేశాల కోసం పూర్తిగా సరిపోతాయి.అదనపు బెనిఫిట్ఈ రీఛార్జ్ ప్లాన్తో ఎయిర్టెల్ ఒక ప్రత్యేక అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. వినియోగదారులకు 12 నెలల పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ (Perplexity Pro AI) సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీని విలువ సుమారు రూ.17,000 వరకు ఉంటుందని అంచనా. ఈ ఏఐ టూల్ అధునాతన సెర్చ్, ఉత్పాదకత పనుల కోసం ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ఈ రీఛార్జ్ ప్లాన్ విలువ మరింత పెరుగుతుంది.
అదే రీఛార్జ్ ప్లాన్.. పెరిగిన డైలీ డేటా!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బీఎస్ఎన్ఎల్.. తన రూ. 2399, రూ. 485, రూ. 347, రూ. 225 రీఛార్జ్ ప్లాన్ల మీద 0.5 జీబీ అదనపు డేటా అందిస్తుంది. గతంలో ప్యాక్ రీఛార్జ్ ద్వారా 2.5 జీబీ డేటా లభిస్తే.. ఇప్పుడు అదే ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 3.0 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.BSNL enhances prepaid plans with extra daily data!Enjoy a data boost on ₹2399, ₹485, ₹347 & ₹225 at no extra cost. Stay connected longer on Bharat’s trusted network. Offer valid till 31 Jan 2026Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c#BSNL… pic.twitter.com/iQvAesldmr— BSNL India (@BSNLCorporate) January 9, 2026
పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?
కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్లను 10 శాతం నుంచి 20 శాతం పెంచవచ్చు. ఎయిర్టెల్ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుందని సమాచారం. అయితే వోడాఫోన్ ఐడియా (VI) పరిస్థితి మరింత సవాలుగా మారనుంది. దాని బకాయి చెల్లింపులను తీర్చడానికి, కంపెనీ FY27 & FY30 మధ్య మొబైల్ సర్వీస్ రేట్లను 45 శాతం వరకు పెంచాల్సి రావచ్చు.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది. జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!జూన్ 2026 నుంచి టారిఫ్లు పెరిగితే, సాధారణ వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జ్ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు & ఎక్కువ డేటా వినియోగించేవారి ఇది కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెలికాం కంపెనీల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది.
పర్సనల్ ఫైనాన్స్
మీ డబ్బు - మీ నిర్ణయం..
సొంత ఇల్లు కొనాలన్నా, మిగిలిన డబ్బును పొదుపు చేయాలన్నా సగటు మనిషికి ఎన్నో సందేహాలు. మార్కెట్లో పెట్టుబడి మార్గాలకు కొదువ లేకపోయినా, ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది? ఎక్కడ రాబడి ఎక్కువగా వస్తుంది? అనేదే అసలు ప్రశ్న. మీ ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసేలా రియల్టీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి కీలక రంగాలపై కొన్ని కీలక ప్రశ్నలకు నిపుణులు ఇచ్చిన స్పష్టమైన వివరణలు ఇక్కడ చూద్దాం.రియల్టీ..ఇల్లు కొనటానికి డౌన్పేమెంట్ ఎంతవరకూ ఉండాలి? సాధారణంగా ఇంటి విలువలో 10–20 శాతాన్ని డౌన్పేమెంట్గా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 80–90 శాతం మొత్తాన్ని బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణంగా అందిస్తుంటాయి. ప్రాపర్టీ విలువ రూ.30 లక్షల లోపు ఉంటే 90 శాతం వరకూ మొత్తాన్ని రుణంగా ఇస్తారు. 10 శాతం డౌన్పేమెంట్ చెల్లించాలి. ప్రాపర్టీ విలువ రూ.30 నుంచి 75 లక్షల వరకూ ఉంటే 80 శాతం వరకూ రుణాన్ని ఇస్తారు. మిగిలిన 20 శాతం డౌన్పేమెంట్గా చెల్లించాలి. రూ.75 లక్షలు దాటిన ఇళ్లకయితే 25 శాతం వరకూ డౌన్పేమెంట్ అవసరం. మిగిలిన 75 శాతాన్నే రుణంగా ఇస్తారు. ఇక 5–8 శా>తం ఉండే స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, ఇంటీరియర్ ఖర్చులు, లీగల్ ఖర్చులు అన్నీ కొనుగోలుదారే భరించాలి. బ్యాంకింగ్..స్వల్ప కాలంపాటు సొమ్ము దాచుకోవటానికి సేవింగ్స్ ఖాతా లేక లిక్విడ్ ఫండ్సా? లిక్విడ్ ఫండ్స్లో సేవింగ్స్ ఖాతా కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. సేవింగ్స్ ఖాతాపై 2–3 శాతం వడ్డీ వస్తే... లిక్విడ్ ఫండ్స్లో 5–6 శాతం వరకూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవటమన్నది సేవింగ్స్ ఖాతాలోనే సాధ్యపడుతుంది. లిక్విడ్ ఫండ్స్లో కనీసం ఒక్కరోజైనా పూర్తిగా ఉంచాలి. ఎక్కువ శాతం ట్యాక్స్ రేటు చెల్లించేవారికి సేవింగ్స్ ఖాతాకన్నా లిక్విడ్ ఫండ్సే బెటర్. పూర్తిస్థాయి భద్రతను కోరుకునేవారికి సేవింగ్స్ ఖాతా నయం. ఇలా దేని ప్రత్యేకతలు దానికున్నాయి. కనీసం నెలరోజుల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలో ఉంచుకుని, అంతకు మించిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. బంగారం బంగారానికి హాల్ మార్కింగ్ తప్పనిసరా? దేశంలో అన్ని నోటిఫైడ్ జిల్లాల్లోనూ హాల్మార్కింగ్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనిప్రకారం బంగారాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (బీఐఎస్) హాల్మార్కింగ్ చేయాలి. అంటే ప్రత బంగారు ఆభరణంపై బీఐఎస్ లోగో, దాని స్వచ్ఛత (24– 22– 18 క్యారెట్లు..), హాల్మార్కింగ్ ఐడెంటిఫికేషన్ నంబర్, సదరు జ్యుయలర్ ఐడెంటిఫికేషన్ నంబర్ వంటివన్నీ ఉండాలి. స్వల్ప నాన్–నోటిఫైడ్ జిల్లాలకు మాత్రం ఈ హాల్మార్కింగ్ నిబంధనలు వర్తించవు. ఇక బ్యాంకులు, ఎంఎంటీసీ విక్రయించే బంగారం కాయిన్లు, బార్లకు అవే హాల్మార్కింగ్ చేస్తాయి. హాల్మార్కింగ్ వల్ల బంగారం స్వచ్ఛత ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్వచ్ఛతకు గ్యారంటీ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్...రిటైరైన వారికి స్టాక్ మార్కెట్లు సురక్షితమేనా? సురక్షితమే. కాకపోతే మిగతా వారితో పోలి్చనపుడు రిటైరీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి అదనపు ఆదాయం ఉండదు. కాబట్టి ఎక్కువ రాబడులకన్నా తమ అసలు భద్రంగా ఉండటం ముఖ్యం. మార్కెట్లలో ఒడదుడుకులు సహజం కనక అవి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలి. అందుకని తమ రిటైర్మెంట్ నిధిలో 15–20 శాతం మాత్రమే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటం మంచిది. నెలవారీ ఖర్చుల కోసం కాకుండా దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డివిడెండ్లు ఇచ్చే షేర్లు, లేదా లార్జ్క్యాప్ షేర్లు లేదా వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్లను ఎంచుకోవాలి. ఎక్కువ డబ్బును ఎఫ్డీలు, ఆర్బీఐ బాండ్లలో పెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్...సిప్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయటం మంచిదా..∙ఒకేసారి పెద్ద మొత్తం పెడితే మంచిదా? సిప్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఇక ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడమనేది కొందరికే. మార్కెట్ టైమింగ్ను చూసుకుని, బాగా రిస్్కను తట్టుకోగలిగే వారికే! సిప్ వల్ల మార్కెట్ టైమింగ్ రిస్కు ఉండదు. క్రమశిక్షణ అలవాటు కావటంతో పాటు రుపీ కాస్ట్ కూడా యావరేజ్ అవుతుంది. కాకపోతే మీ దగ్గర పెద్ద మొత్తం ఉన్నపుడు సిప్ చేయటం మొదలుపెడతే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయ డానికి చాలా సమయం పడుతుంది. అలాకాకుండా ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లు కలిసివస్తే రాబడులు కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మార్కెట్లు బాగా చౌకగా ఉన్నాయని భావించినపుడు, రిసు్కను తట్టుకోగలమని భావించినపుడు మాత్రమే దీనికి సిద్ధపడాలి. ఇన్సూరెన్స్ప్రెగ్నెన్సీ, డెలివరీ ఖర్చులు ఇన్సూరెన్స్లో కవరవుతాయా?మెటరి్నటీ ఖర్చులకు చాలా బీమా కంపెనీలు ఇపుడు కవరేజీ ఇస్తున్నాయి. పాలసీ తీసుకున్నాక కొంత వెయిటింగ్ పీరియడ్ తరవాతే ఇవి వర్తిస్తాయి. నార్మల్ లేదా సి–సక్షన్ డెలివరీ ఖర్చులతో పాటు ప్రీ–పోస్ట్ నాటల్ వ్యయాలు, కొంతకాలం వరకూ పుట్టిన బిడ్డకు అయ్యే ఖర్చు ఇవన్నీ కవర్ అవుతున్నాయి. మెటరి్నటీ కవర్ పాలసీ తీసుకున్న 2–4 ఏళ్ల తరువాతే మొదలవుతుంది. ఈ వెయిటింగ్ పీరియడ్లోపల అయ్యే ఖర్చులకు కవరేజీ ఉండదు. ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప ఐవీఎఫ్, ఐయూఐ వంటి గర్భధారణ ఖర్చులకు బీమా కవరేజీ ఉండదు. అయితే కొన్ని యాజమాన్యాలిచ్చే పాలసీ లు, గ్రూప్ పాలసీల్లో మాత్రం వెయిటింగ్ పీరియడ్ లేకుండానే డెలివరీ కవరేజీ అందిస్తున్నారు.ఇదీ చదవండి: రిటైర్మెంటుతో.. లీవ్ ఎన్క్యాష్మెంట్..?
రిటైర్మెంటుతో.. లీవ్ ఎన్క్యాష్మెంట్..?
ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైర్మెంటు తీసుకున్న ఉద్యోగస్తులు ఆలోచిస్తున్న అంశం.. తమ చేతికొచ్చిన లీవ్ ఎన్ క్యాష్మెంట్ మొత్తంలో మినహాయింపు రూ.3,00,000 పోగా పన్నుకి గురైన మిగతా భాగం గురించే. దీనిపై సమాచారాన్ని ఈ వారం తెలుసుకుందాం.లీవ్ ఎన్క్యాష్మెంట్పై కొన్ని రూల్స్కి లోబడి రూ.3,00,000 వరకు మినహాయింపు ఉండేది. 24–03–2023 నాడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మొత్తాన్ని రూ.25,00,000కు పెంచారు. ఈ డేటు తర్వాత వచ్చిన వాటికి ఇది వర్తిస్తుంది. ఈలోగా ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 01–01–2016 నుంచి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు జీతాలు, లీవ్ ఎన్క్యాష్మెంట్ భారీగా పెరిగాయి. 01–01–2016 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగస్తులు తమ ఆదాయ పన్ను రిటర్నులలో రూ.3,00,000 వరకు మినహాయింపు పొంది, మిగతా మొత్తాల మీద 30 శాతం పన్ను, విద్యా సుంకం 4 శాతం.. వెరసి 31.2 శాతం పన్ను చెల్లించి సరిపెట్టుకున్నారు. ఇది సంతోషాన్ని కలిగించినప్పటికీ కొంత అలజడి మొదలైంది.కొంత మంది ఉద్యోగస్తులు నోటిఫికేషన్ అంశాన్ని లేవదీసి, ఆ మేరకు అదనంగా కట్టిన ట్యాక్స్ రిఫండు కోసం దరఖాస్తు చేశారు. అధికారులు యధావిధిగా అన్నింటినీ తోసిపుచ్చారు. విషయం ట్రిబ్యునల్ వరకు వెళ్లింది. అక్కడ ఉపశమనం లభించింది. వడ్డీతో సహా రిఫండ్ వచ్చింది. ఈ విషయం ఉద్యోగ సంఘాల ద్వారా ఊరు, వాడా చేరింది. ఒకే ప్రశ్న మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది.. మీరూ రిఫండు కోసం క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేయడం తప్పు కాదు. ఎటువంటి రిస్కు కాదు. ఖర్చేమీ కాదు. ఫైల్ చేయండి.ఇదీ చదవండి: అంతులేని ధరల పెంపు ఆగేదెప్పుడో..ఎలా చేయాలి..కాగితాలన్నీ సమకూర్చుకోండి. మీ గత చరిత్ర ఒక పద్ధతిలో పెట్టండి. ఏ సంవత్సరంలో దాఖలు చేశారు, అక్నాలెడ్జ్మెంటు, రిటర్ను కాపీ, అసెస్మెంట్ ఆర్డరు, ట్యాక్స్ చెల్లించిన చలాన్లు, వాటికి సంబంధించిన అన్ని కాగితాలు.కాలదోషం పట్టిన కేసుల్లో రిటర్ను వేయకూడదు. అలా వేయాలంటే డిపార్టుమెంటు నోటీసులు ఇవ్వాలి. ఈ విషయంలో అలాంటివి జరగవు. ఆటోమేటిక్గా వాళ్లు రిఫండు ఇవ్వరు. మీరు రివైజ్ రిటర్ను వేయాలి.రివైజ్ రిటర్ను వేయాలంటే మీకు అనుమతి కావాలి. ఆ అనుమతి కేంద్ర పన్నుల బోర్డు ఇవ్వాలి. బోర్డు అంటే.. మీరు ఢిల్లీ పరుగెత్తనక్కర్లేదు. మీకు సంబంధించిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కం ట్యాక్స్ వారికి దరఖాస్తు చేసుకోవాలి.ఇలా దరఖాస్తు చేయడాన్ని కండోనేషన్ అప్లికేషన్ వేయడం అంటారు. తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్లో వీరి కార్యాలయం ఉంది. ప్రత్యక్షంగా ఫైల్ చేయొచ్చు లేదా ఐటీ పోర్టల్లోనైనా చేయొచ్చు. లాగిన్ తర్వాత సర్వీసెస్ బోర్డుకి వెళ్లాక, కండోనేషన్ రిక్వెస్ట్ కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. క్రియేట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. అందులో అన్ని వివరాలు ఉంటాయి. నింపండి.ఏ వివరాలు ఇవ్వాలంటే.. మీ వివరాలు, కేసు వివరాలు, గతంలో రిటర్న్ వేసిన వివరాలు, నిజాలన్నీ పొందుపరుస్తూ, నా తప్పేమీ లేదు, ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు అని రివైజ్ రిటర్ను వేయడానికి అనుమతి వేడుకోండి.సాధారణంగా అనుమతి ఇస్తారు. రోజూ వెబ్సైట్ వాచ్ చేయండి. అనుమతి రాగానే రివైజ్ రిటర్ను వేయండి.అన్ని కాగితాలు/వివరాలు ఇచ్చి రిటర్ను వేస్తే రిఫండు వచ్చే అవకాశం ఉంది.
మీ ఇల్లు బంగారంగానూ!
తాకట్టు... రుణం!. ఈ రెండూ భవిష్యత్తుని నిర్ణయించేవే. అది ఎదగటమైనా... పాతాళానికి పడిపోవటమైనా!. దానికి దిక్సూచులు ఏ అవసరానికి తీసుకుంటున్నాం? ఎంత క్రమశిక్షణతో తిరిగి తీరుస్తున్నామనేవే. ఇక రుణ ప్రపంచానికి హృదయం లాంటివి హోమ్లోన్... గోల్డ్ లోన్. ఒకటి ఆశలు నెరవేర్చేదైతే మరొకటి అవసరాన్ని తీర్చేది. మరి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో రెండూ ఈ రుణాలిస్తున్నాయి కదా... ఏది మంచిది? ఏ రుణం ఎక్కడ తీసుకుంటే మంచిది? వీటికి సమాధానమే ఈ వెల్త్ స్టోరీ...సరైన రుణాన్ని, సరైన సంస్థను ఎంచుకోకకపోవటం వల్ల లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందంటే ఆశ్చర్యంగా ఉండదూ? గృహరుణంలో ఒక్క 0.5 శాతం తేడా వల్ల మనం చెల్లించే సొమ్ము కొన్ని లక్షల రూపాయలు పెరిగిపోతుందంటే ఇబ్బందికరంగా లేదూ? అందుకే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో ఎక్కడ రుణం తీసుకున్నా... మన అవసరమేంటన్నది ముఖ్యం. ఆ అవసరానికి మనకు ఎంత త్వరగా రుణం వస్తోంది? ఎంత వడ్డీకి వస్తోంది? మన దగ్గర అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయా? మనకు కొన్ని వెసులుబాట్లు అవసరమా? ఇలాంటివన్నీ చూసుకుని, దానికి తగ్గ సంస్థను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. అదెలాగో చూద్దాం... గృహ రుణానికి బ్యాంకే మంచిదా? గృహ రుణం తీసుకునే వారు ఒక్క వడ్డీ రేటే కాకుండా చాలా అంశాలు చూడాలి. అదేమిటంటే గృహ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా బ్యాంకుల్లోనే తక్కువ. ఎందుకంటే ఇవి ఆర్బీఐ రెపో రేటు మాదిరి ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేట్తో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ రేట్లకు అనుగుణంగా తక్షణం మార్పుచేర్పులుంటాయి. ఉదాహరణకు 0.5 శాతం గనక వడ్డీ రేటు తగ్గితే... 20 ఏళ్ల కాల వ్యవధికి రూ.50 లక్షల రుణంపై ఏకంగా రూ.3 లక్షలు మిగుల్చుకోవచ్చు. పైపెచ్చు బ్యాంకుల్లో గృహ రుణాలను గరిష్టంగా 30 ఏళ్ల కాలానికీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు, దీర్ఘకాలం కారణంగా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. కాకపోతే బ్యాంకుల్లో గృహ రుణ దరఖాస్తుల పరిశీలన చాలా కఠినంగా ఉంటుంది. ప్రాపరీ్టకి క్లియర్ టైటిల్తోపాటు, రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ (రుణ పరపతి/ రుణ చరిత్ర) 700కు పైన ఉండాలి. చెల్లింపుల సామర్థ్యాలనూ బ్యాంక్లు చూస్తాయి. దీనికితోడు న్యాయపరమైన క్లియరెన్స్ కూడా తీసుకుంటాయి. కనుక ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఎన్బీఎఫ్సీలు ఎవరికంటే... నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) గృహ రుణాల విషయంలో బ్యాంకుల మాదిరి అంత కఠినంగా వ్యవహరించవు. 700కు దిగువన క్రెడిట్స్కోరు ఉన్న వారికి సైతం, ఇతర అర్హతల ఆధారంగా ఇవి రుణాలను అందిస్తుంటాయి. ఆదాయ ధ్రువీకరణల్లేని స్వయం ఉపాధిపై ఉన్న వారికి, తక్కువ ఆదాయ వర్గాలకు సైతం ఎన్బీఎఫ్సీల్లో రుణాలు లభిస్తాయి. పైపెచ్చు ఎన్బీఎఫ్సీల్లో గృహ రుణం కేవలం రోజుల వ్యవధిలో మంజూరవుతుంది. సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల్లోనే రుణం పొందొచ్చు. అంటే బ్యాంకులతో పోలి్చనపుడు ఎన్బీఎఫ్సీల్లో వేగవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఆశించొచ్చు. కాకపోతే ఎన్బీఎఫ్సీల్లో వడ్డీ రేట్లు ఎక్కువ. కనుక వడ్డీ రూపంలో కాస్త ఎక్కువ చెల్లించాలి. బ్యాంకుల్లో మాదిరి అధిక రుణం మొత్తం అన్ని ఎన్బీఎఫ్సీల్లో సాధ్యపడదు. వీరికి బ్యాంక్ బెటర్.. → మంచి క్రెడిట్ స్కోరు ఉండి, ఆదాయ ధ్రువీకరణలున్న వారికి. → ఆర్బీఐ నియత్రణల కింద మరింత పారదర్శకత కోరుకునే వారికి. → సమయం పట్టినా తక్కువ వడ్డీకి రుణం కావాలనుకునేవారికి. వీరికి ఎన్బీఎఫ్సీలు.. → తక్కువ ఆదాయం లేదా ఫ్రీలాన్స్, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల ద్వారా ఆదాయం వచ్చేవారికి → వేగంగా రుణం మంజూరు కోరుకునే వారికి. ళీ వడ్డీ రేటు కాస్త ఎక్కువైనా.. తమ అవసరాలకు వీలుగా సౌకర్యవంతమైన షరతులపై రుణం కోరుకునే వారికి బంగారంపై రుణం ఎక్కడ నయం? గృహ రుణం మాదిరే బంగారాన్ని తనఖా పెట్టి తీసుకునే రుణమూ సెక్యూర్డ్ కిందికే వస్తుంది. కనుక వీటిపైనా రేట్లు తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ రుణం మొత్తం, వడ్డీ రేటు, కాల వ్యవధి, చెల్లింపుల్లో సౌలభ్యం పరంగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి. బ్యాంక్లు ఎక్కడ బెటరంటే... → బంగారంపై వడ్డీ రేటు బ్యాంకుల్లో తక్కువ. ఇవి 8 శాతం రేటుకే రుణాలిస్తుంటాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ రేటు గరిష్టంగా 12 శాతం వరకు ఉంటుంది. → బంగారంపై బ్యాంకుల్లో దీర్ఘకాలిక రుణాలు తీసుకునే సౌలభ్యం ఉంది. రుణం తీసుకుని, ప్రతి నెలా చెల్లింపులు చేయకుండా.. ఒకేసారి తిరిగి చెల్లించేట్టయితే ఏడాది కాలానికి మంజూరు చేస్తారు. → రుణం తీసుకుని నెలవారీ వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించేట్టు అయితే రెండు నుంచి మూడేళ్ల కాలానికి రుణాలిస్తారు. → ఇక బ్యాంకుల్లో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులైతే బంగారంపై తక్కువ రేటుకు రుణాలిస్తుంటాయి. → ఆర్బీఐ మార్గదర్శకాలను బ్యాంకులు కచి్చతంగా అనుసరిస్తుంటాయి. కనుక భద్రత, పారదర్శకత ఎక్కువ. → బ్యాంకుల్లో బంగారంపై రుణం అదే రోజు, గంటల్లోనే మంజూరవుతుంది. → కాకపోతే బ్యాంకుల్లో బంగారం విలువపై తక్కువ రుణం లభిస్తుంది. అంటే ఎక్కువ బ్యాంకులు బంగారం విలువలో 65–70 శాతానికి మించి రుణాన్ని ఇవ్వవు. ఎన్బీఎఫ్సీలు ఎక్కడ బెటరంటే... → ఎన్బీఎఫ్సీల్లో బంగారం రుణాలపై అధిక వడ్డీ రేటు అమలవుతుంది. వీటిల్లో 12 శాతం నుంచి 30 శాతం మధ్య రేటు ఉంటుంది. → కేవైసీ పరంగా ఆధార్, పాన్ ఇస్తే చాలు... బ్యాంకుల్లో మాదిరే బంగారంపై రుణం అదే రోజు వేగంగానే మంజూరవుతుంది. → ముఖ్యంగా బంగారంపై అధిక రుణాన్ని ఎన్బీఎఫ్సీలు ఆఫర్ చేస్తుంటాయి. కానీ, ఇందుకోసం అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సిందే. → వడ్డీని ఏ నెలకానెల కట్టేసి.. అసలును చివర్లో కట్టేస్తే సరిపోతుంది. → కాకపోతే వీటిల్లో రుణ కాలవ్యవధి బ్యాంకుల్లో మాదిరి సుదీర్ఘంగా ఉండదు. ఆరు నెలలు, ఏడాదికే ఆఫర్ చేస్తాయి. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. → రుణాన్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైతే కఠినంగా వ్యవహరిస్తాయి. అంగీకారానికి ముందు.. → రుణం తీసుకునే ముందు ఒప్పంద నియమ నిబంధనలు, షరతులు, చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. → తిరిగి చెల్లింపుల పరంగా ఉన్న ఆప్షన్లను తెలుసుకోవాలి. → రుణాన్ని నిరీ్ణత కాల వ్యవధికి ముందే తీర్చివేస్తే పెనాల్టీ మాదిరి ఏవైనా చార్జీలు చెల్లించాల్సి ఉంటుందా? అడగాలి. → వివిధ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య రుణ రేట్లు, చార్జీలను పోల్చి చూసుకోవాలి. → సాధారణంగా దీర్ఘకాల రుణాలకు బ్యాంక్లు అనుకూలం, సౌకర్యం. → అత్యవసరంగా, అధిక రుణం కోరుకునే వారికి ఎన్బీఎఫ్సీలు అనుకూలం.రుణ వ్యయాలు తగ్గించుకోవడమెలా? → రుణం తీసుకోవడానికి ముందు తమ క్రెడిట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలి. ఏడాదిలో ఒక్కసారి క్రెడిట్ స్కోరును ఆయా సంస్థలు ఉచితంగా ఇస్తాయి. → 760కు పైన క్రెడిట్ స్కోరు ఉన్న వారు తక్కువ వడ్డీ రేటుతోపాటు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కోసం డిమాండ్ చేయొచ్చు. → గృహ రుణం అయితే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ (ఆర్బీఐ రెపో/ఈబీఎల్ఆర్) రేటు ఆధారితంగా ఎంపిక చేసుకోవాలి. → రుణం తీసుకునే సమయంలో అధిక రేటు ఉండి, ఆ తర్వాత రేట్లు దిగొస్తే.. మిగిలిన బకాయిని తక్కువ రేటు ఉన్న సంస్థకు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి.
ప్రీ అప్రూవ్డ్ లోన్ గురించి తెలుసా.. బ్యాంక్ ఎవరికి ఇస్తుందంటే?
ఉద్యోగం చేసేవాళ్లకైనా.. వ్యాపారం చేసేవాళ్లకైనా.. లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోన్ అంటే.. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్. బహుశా దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ.. బ్యాంకులు ఈ రకమైన లోన్స్ ఎందుకు ఇస్తాయి?, ఎవరికి ఇస్తాయి? అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అంటే?ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది.. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ముందుగానే అర్హత నిర్ధారించి, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఆఫర్ చేసే పర్సనల్ లోన్. అంటే కస్టమర్ ప్రత్యేకంగా లోన్ కోసం అప్లై చేయకపోయినా.. లోన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పడం. ఆదాయం, క్రెడిట్ స్కోర్, లావాదేవీలు మొదలైనవాటిని పరిశీలించి.. ఎంత మొత్తంలో లోన్ ఇవ్వవచ్చు అని బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేస్తుంది.ఈ లోన్ ఎవరికి ఇస్తారు?బ్యాంకులో ఇప్పటికే అకౌంట్ ఉండే కస్టమర్లకు, జీతం పొందుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి, సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవాళ్లకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందటానికి అర్హుడు అని బ్యాంక్ గుర్తించినప్పుడు.. వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్, నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.ఈ లోన్ ఆఫర్ కస్టమర్ అంగీకరిస్తే.. సింపుల్ పద్దతిలో లోన్ పొందవచ్చు. దీనికోసం ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు. చాలా తొందరగా లోన్ మంజూరు అవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.గుర్తుంచుకోవాల్సిన విషయాలుబ్యాంక్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ చేసింది కదా అని.. ముందు వెనుక ఆలోచించకుండా లోన్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీరు తీసుకునే లోన్ మీద ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకోవడానికి ముందు.. అన్నీ తెలుసుకుని, తప్పకుండా అవసరం అయితేనే ముందుకు వెళ్లడం మంచిది. లేకుంటే.. భవిష్యత్తులో ఆర్ధిక భారం మోయాల్సి వస్తుంది.


