Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Reliance Jio Rs 91 Recharge Plan Details1
జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!

దేశీయ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో.. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే 91 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.కంపెనీ పరిచయం చేసిన ఈ లేటెస్ట్ రూ. 91 ప్లాన్ కేవలం జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే. దీని ద్వారా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 3జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 50 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వర్తించదు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్ ఉండాలనే ఉద్దేశ్యంతో.. జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది.ఇతర రీఛార్జ్ ప్లాన్స్!రూ.3,599 ప్లాన్: ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్‌ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.రూ.3,999 ప్లాన్: లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి.

Water Costs More Than Milk And Petrol in Venezuela Know The Reason2
పెట్రోల్ కంటే.. పాలు, నీళ్ల ధరలే ఎక్కువ!.. ఎక్కడంటే?

ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెలుగొందిన వెనెజువెలా.. నికోలస్ మదురో అరెస్టు తర్వాత తీవ్ర సంక్షోభంతో సతమతమవుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరిపోయాయి. పెట్రోల్ ధరల కంటే.. వాటర్ బాటిల్, పాలు ధరలు ఎక్కువైపోయాయి.ధరలు ఇలా..ఒక లీటరు పెట్రల్: రూ. 45.10ఒక లీటరు పాలు: రూ. 160.60ఒక లీటరు వాటర్ బాటిల్: రూ. 223.70ఒక లీటరు వంట నూనె: రూ. 315 నుంచి రూ. 405అమెరికా ఆంక్షలు, సరఫరా గొలుసులను తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాగు నీరు కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇక్కడ కరెన్సీకి విలువ తగ్గిపోవడం వల్ల.. లావాదేవీలు కూడా కష్టతరం అయిపోయింది.వెనెజువెలా ఆర్ధిక పతనానికి కారణాలు➤వ్యవసాయం, తయారీ రంగాలను విస్మరించి.. ఎక్కువగా చమురుపైనే ఆధారపడటం.➤నైపుణ్యం లేనివారికి పదవులు కట్టబెట్టడం వల్ల, నిర్వహణ లోపాలు తలెత్తాయి.➤ఆదాయం లేకపోవడంతో.. ప్రభుత్వం విచ్చలవిడిగా కరెన్సీ ముద్రించింది. దీనివల్ల దేశ కరెన్సీ ఎక్కువైంది. విలువ పెరిగిపోయింది.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

Nitin Gadkari Says About India 3rd Economy Country3
మూడో ‘ఆర్థిక శక్తి’గా భారత్‌ ఎదగాలంటే..

భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే దిగుమతులు తగ్గించుకుని, ఎగుమతులను పెంచుకోవాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. సీఎస్‌ఐఆర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు.ఈ సందర్భంగా వ్యవసాయ వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా మార్చుకోవడం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని చెప్పారు. దీనివల్ల వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం కారణంగా వెలువడే కాలుష్యాన్ని నిరోధించొచ్చన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 15 శాతం కలపడం ద్వారా ఏడాదిలో 4,500 కోట్ల డాలర్ల విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవచ్చని చెప్పారు.ఇటీవలే జపాన్‌ను దాటేసి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం తెలిసిందే. రహదారుల నిర్మాణంలో బయో బిటుమన్‌ను (పెట్రోలియం రహిత) వినియోగించడం 2047 నాటికి వికసిత్‌ భారత్‌ దిశగా పరివర్తనాత్మక అడుగుగా మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. వాణిజ్య పరంగా బయో బిటుమన్‌ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం భారత్‌ అని చెప్పారు. ఇది రైతుల జీవితాలను మార్చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందన్నారు.వ్యవసాయం, నిర్మాణ రంగ సామగ్రి తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఫ్లెక్స్‌ ఇంజన్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించాలని కోరారు. హైడ్రోజన్‌ రవాణా అన్నది పెద్ద సమస్యగా పేర్కొంటూ.. ఈ విషయంలో భారత్‌ ఇంధన ఎగుమతిదారుగా అవతరించాలన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్‌ రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

How To Get Discounts On Train Tickets Know The Details Here4
ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

సంక్రాంతి పండుగ వచ్చేసింది. నగరాల్లో ఉండేవారంతా దాదాపు ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ సమయంలో ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు ఒక శుభవార్త చెప్పింది. టికెట్ కొనుగోలుపై 3 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం వివరంగా ఇక్కడ..రైల్‌వన్ యాప్ (RailOne) ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల బుకింగ్ మీద 3 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇది 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుంది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డిజిటల్ చెల్లింపు మోడ్‌లను ఉపయోగించి RailOne యాప్ ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లపై మాత్రమే తగ్గింపు పొందవచ్చు.రైల్‌వన్ యాప్ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ఎలా➤గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా ఈ సూపర్‌ యాప్‌ ‘Railone’ను డౌన్‌లోడ్‌ చేయాలి.➤యాప్‌ వినియోగదారుల లొకేషన్‌ను డిఫాల్డ్‌గా రీడ్‌ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్‌ చేసుకోవాలి.➤యాప్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత లాగిన్‌, న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌, గెస్ట్‌ అనే ఆప్షన్లు వస్తాయి.➤కొత్తగా రిజిస్టర్‌ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేస్తే.. రైల్‌ కనెక్ట్‌, యూటీఎస్‌ అని రెండు ఆప్షన్లు డిస్‌ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్‌ కనెక్ట్‌ యాప్‌లో లాగిన్‌ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్‌ కావొచ్చు. లేదంటే ➤కొత్తంగా వివరాలు ఎంటర్‌ చేసి సైనప్‌ చేయాల్సి ఉంటుంది.➤సైనప్‌ కోసం మొబైల్‌ నెంబర్‌ ఇచ్చి రిజిస్టర్‌ చేయాల్సి.➤మీ పూర్తి పేరు, మొబైల్‌ నెంబరు, ఈ-మెయిల్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.➤ఓటీపీ, ఎంపిన్‌ ఇచ్చి అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్‌ వెరిఫికేషన్‌ కోసం ఫింగర్‌ ప్రింట్‌ లేదా డివైజ్‌ లాగిన్‌ వివరాలు ఇవ్వాలి.మూడు శాతం డిస్కౌంట్ కోసం..👉🏻ఇప్పటికే మీరు ఇన్‌స్టాల్‌ చేసుకున్న RailOne యాప్.. లాగిన్ అవ్వాలి. 👉🏻ప్రాథమిక వివరాలు (పేరు, ఇతర వివరాలు) నమోదు చేసుకోవాలి.👉🏻అన్‌రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ కోసం ఎంపికను సెలక్ట్ చేసుకుని.. ప్రయాణ తేదీని, మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారా ఆ స్టేషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 👉🏻డిజిటల్ మోడ్‌ (యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్) ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేసినప్పుడు మాత్రం మీకు డిస్కౌంట్ లభిస్తుంది.👉🏻చెల్లింపు పూర్తయిన తరువాత.. టికెట్ యాప్‌లోనే జనరేట్ అవుతుంది. ప్రయాణ సమయంలో టికెట్ తనిఖీల కోసం దాన్ని మీ ఫోన్‌లో చూపించవచ్చు.రైల్‌వన్‌ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్‌, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.

Sensex Poised for 11pc Upside to 93918 by 2026 End5
ఏడాది చివరికల్లా 93,918 పాయింట్లకు సెన్సెక్స్‌

బీఎస్‌ఈ ఎక్స్ఛేంజ్‌లోని బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 2026 డిసెంబర్‌ నాటికి 93,918 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ క్లయింట్‌ అసోసియేట్స్‌ అంచనా వేసింది. అంటే సెన్సెక్స్‌ ప్రస్తుత స్థాయి (84,961)తో పోలిస్తే 11% పెరిగే వీలుందని అభిప్రాయపడింది.‘‘దేశీయ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. కార్పొరేట్‌ ఆదాయాల అవుట్‌లుక్‌ మెరుగ్గానే ఉన్నాయి. అయితే షేర్ల వాల్యుయేషన్లు అధికంగా ఉండటం, అంతర్జాతీయ అనిశి్చతుల కారణంగా ఇన్వెస్టర్లు ‘క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి’ వ్యూహాన్ని అనుసరించవచ్చు. దీంతో ఈ ఏడాది భారతీయ మార్కెట్‌ విస్తృత స్థాయి ర్యాలీలకు స్వస్తి పలికి.., ఎంపిక చేసుకున్న, ఫండమెంటల్‌ ఆధారిత అవకాశాల దిశగా అడుగులు వేయోచ్చు’’ అని సంస్థ రీసెర్చ్‌ హెడ్‌ నితిన్‌ అగర్వాల్‌ తెలిపారు.రిస్క్‌ అంచనాలను మెరుగుపరుచుకుంటూ.., సరైన డైవర్సిఫికేషన్‌ విధానాలను అనుసరిస్తే ధీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీలు ప్రధాన వనరులుగా కొనసాగుతాయని అగర్వాల్‌ పేర్కొన్నారు.ఇంకా 2026కి సంబంధించిన క్లయింట్‌ అసోసియేట్స్‌ వార్షిక ఈక్విటీ అంచనా నివేదికలో.... పోర్ట్‌ఫోలియో వైవిద్యీకరణలో బంగారం, వెండి కీలకం. డాలర్‌ బలహీనత, భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాల్లో మార్పుల కారణంగా గతేడాదిలో విలువైన లోహాలు భారీ రాబడులు ఇచ్చాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం డిమాండి పెరిగి, వ్యూహాత్మక పెట్టుబడి సాధనగా పసిడి ప్రాధాన్యం మరింత పెరిగింది. అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు, అమెరికా–చైనా ఉద్రిక్తతలు, వెండిని కూడా కీలక లోహంగా గుర్తించే చర్చల నేపథ్యంలో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్‌ వృద్ధి అవుట్‌లుక్‌ మెరుగ్గానే ఉంది. బలమైన డిమాండ్, తయారీ–సేవల రంగ విస్తరణ, స్థిరమైన జీఎస్‌టీ వసూళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదవ్వొచ్చు.

Hyderabad office leasing hits all time high in 20256
హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఆఫీస్‌ మార్కెట్ అదుర్స్‌

హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఆఫీస్‌ మార్కెట్ 2025లో బలమైన వృద్ధిని నమోదు చేసింది. నగరంలో వార్షిక కార్యాలయ లీజింగ్ 11.4 మిలియన్ చదరపు అడుగులకు చేరి, చరిత్రలో రెండవ అత్యధిక స్థాయిని సాధించింది. అదే సమయంలో 2025 ద్వితీయార్ధంలో లగ్జరీ గృహాల అమ్మకాలు మొత్తం విక్రయాలలో 71 శాతంగా నమోదయ్యాయి.ఈ వృద్ధికి ప్రధాన కారణం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణ. హైదరాబాద్‌లో కొత్త జీసీసీలు 40 శాతం పెరిగి, భారత్‌లో రెండవ అత్యంత డిమాండ్ ఉన్న నగరంగా నిలిపాయి. దక్షిణ భారతదేశంలో బెంగళూరు ముందంజలో ఉన్నప్పటికీ, జీసీసీల ద్వారా కార్యాలయ స్థల వృద్ధిలో హైదరాబాద్ బెంగళూరును (33%) అధిగమించింది. ప్రస్తుతం నగరంలోని మొత్తం లీజింగ్ కార్యకలాపాల్లో జీసీసీల వాటా సుమారు 50 శాతం.గోల్డ్‌మన్ సాచ్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, సర్వీస్‌నౌ వంటి గ్లోబల్ సంస్థలు భారీ లావాదేవీలతో హైదరాబాద్‌ను హై-వాల్యూ కార్యకలాపాల కోసం కీలక కేంద్రంగా నిలిపాయి. ఈ డిమాండ్ వల్ల హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో కార్యాలయ అద్దెలు నెలకు 10 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.77కు చేరాయి.నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, రూ.కోటి పైబడిన ఇళ్లు ఇప్పుడు మార్కెట్‌ను నడుపుతున్నాయి. ఇవి మొత్తం లావాదేవీ విలువలో దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2025లో రెసిడెన్షియల్ అమ్మకాలు 4 శాతం పెరిగి 38,403 యూనిట్లకు చేరగా, బెంగళూరులో వృద్ధి స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో సగటు ఆస్తి ధరలు 13 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.6,721కు చేరాయి. కొత్త సరఫరా పరిమితంగా ఉండటంతో అమ్ముడుపోని ఇన్వెంటరీ 2 శాతం తగ్గింది.రూ.2–5 కోట్ల సెగ్మెంట్‌లో అమ్మకాలు 22 శాతానికి పెరిగాయి. రూ.10–20 కోట్ల అల్ట్రా-లగ్జరీ గృహాలు కేవలం 1.1 త్రైమాసికాల్లోనే అమ్ముడవుతున్నాయి. దీనికి విరుద్ధంగా, రూ.50 లక్షల లోపు గృహాల వాటా 4 శాతానికి పడిపోయింది.కోకాపేట, గచ్చిబౌలి, తెల్లాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలు లగ్జరీ హౌసింగ్‌కు కేంద్రాలుగా మారాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, బెంగళూరుతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, టీఎస్‌ ఐపాస్‌ వంటి ప్రభుత్వ చర్యలు హైదరాబాద్‌ను హై-గ్రోత్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా నిలిపాయి.

Advertisement
Advertisement
Advertisement