Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Live highlights from the Economic Survey 20261
ఎకనామిక్ సర్వే 2026.. మారథాన్‌ వేగం అవసరం: సీఈఏ

దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఆర్థిక సర్వే 2026ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ సర్వేలోని ముఖ్యాంశాలను వివరిస్తూ.. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారతదేశం తన వ్యూహాలను ఎలా మార్చుకోవాలో స్పష్టం చేశారు.‘ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి దృష్ట్యా భారతదేశం నిరాశావాదం కంటే వ్యూహాత్మక సంయమనాన్ని ప్రదర్శించాలని సర్వే సూచించింది. భారతదేశం ఇప్పుడు ఒకే సమయంలో మారథాన్, స్ప్రింట్ రెండింటినీ ఎదుర్కోవాలి. అంటే దీర్ఘకాలిక వృద్ధిని (మారథాన్) కొనసాగిస్తూనే, తక్షణ సవాళ్లను ఎదుర్కోవడంలో వేగాన్ని (స్ప్రింట్) ప్రదర్శించాలి. సరఫరా వ్యవస్థలో స్థిరత్వం, వనరుల సృష్టి, దేశీయ వృద్ధిని పెంచడం, అనిశ్చితులను తట్టుకునే సామర్థ్యం చాలా కీలకం’ అన్నారు.పెరిగిన నిడివిఈ ఏడాది ఆర్థిక సర్వే గతంలో కంటే భిన్నంగా, మరింత సమగ్రంగా రూపొందించారు. ఇందులో 17 అధ్యాయాలున్నాయి. మునుపటి కంటే సర్వే నిడివి పెరిగింది. పదిహేడు అధ్యాయాలతో కూడిన ఈ ఎడిషన్ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించింది. గతంలో అధ్యాయాల అమరిక ఆర్థిక అంశాల ప్రాధాన్యతపై ఆధారపడేది, కానీ ఇప్పుడు జాతీయ అవసరాలు, సమయ-ఔచిత్యం (Time-relevance) ఆధారంగా సిద్ధం చేశారు.రాజకీయాల ఆధారంగానే విధానాలు2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలాన్ని ఎదుర్కోవచ్చని సర్వే హెచ్చరించింది. 2025 నాటి పరిస్థితులే కొనసాగినప్పటికీ భద్రతా పరంగా ప్రపంచం మరింత బలహీనంగా మారుతుందని విశ్లేషించింది. ‘భద్రత పరిధి సన్నగిల్లడంతో చిన్నపాటి ఆర్థిక లేదా రాజకీయ ఒత్తిళ్లు పెద్ద వ్యవస్థాగత నష్టాలకు దారితీయవచ్చు. ప్రపంచ దేశాల మధ్య అపనమ్మకం పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు సమీకృతంగా ఉన్నా కొన్ని సమస్యలకు అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రమవ్వడం వల్ల వాణిజ్య విధానాలు ఇప్పుడు భద్రత, రాజకీయాల ఆధారంగానే రూపొందుతున్నాయి’ అని సర్వేలో తెలిపారు.కరెన్సీ, ఎగుమతుల మధ్య సంబంధం‘సాధారణంగా ఒక దేశ కరెన్సీ బలంగా ఉండాలంటే ఆ దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని (Forex) నిరంతరం ఆర్జించాలి. దీనికి తయారీ రంగ పోటీతత్వం, ఎగుమతులు వెన్నెముక వంటివి. ఎగుమతులు పెరిగితే రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. తయారీ రంగం బలోపేతమైతే దిగుమతులపై ఆధారపడటం తగ్గి, కరెన్సీ మరింత బలోపేతం అవుతుంది’ అని సర్వే తెలిపింది.ఇదీ చదవండి: గోల్డ్‌ ధర.. గుండె దడ!

Key Highlights of Economic Survey 20262
ఆర్థిక సర్వే 2025-26.. ముఖ్యాంశాలు

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (జనవరి 29, 2026) పార్లమెంటులో ‘ఆర్థిక సర్వే 2025-26’ పత్రాన్ని ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌కు దిక్సూచిగా నిలిచే ఈ సర్వే భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని విశ్లేషించింది. కాసేపట్లో భారత ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ్వరన్ మీడియా సమావేశం నిర్వహించి కీలక అంశాలను వివరించనున్నారు.ఆర్థిక వృద్ధి అంచనాలు: సంస్కరణల ప్రభావంప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది.2025-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.4% గా ఉంటుందని ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి.2026-27 ఆర్థిక సంవత్సరంలో బలమైన స్థూల ఆర్థిక అంశాలు, వరుస నియంత్రణ సంస్కరణల వల్ల జీడీపీ వృద్ధి 6.8% నుంచి 7.2% మధ్య ఉండొచ్చని సర్వే అంచనా వేసింది.‘ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధి కీలకం. ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, కానీ నిరాశావాదం అక్కర్లేదు. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. ఆహార ధరల ఒత్తిడి తగ్గింది’ అని సర్వేలో పేర్కొన్నారు.‘మేక్ ఇన్ ఇండియా 2.0’పై దృష్టి కేంద్రీకరించి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు తెలిపారు.డిజిటల్ ఎకానమీ.. డిజిటల్ పేమెంట్లు, ఫిన్‌టెక్, AI వినియోగం వేగంగా పెరుగుతూ, భారత్‌ను ప్రపంచ స్థాయి టెక్ హబ్‌గా మలుస్తోందన్నారు.సౌర, వాయు, హైడ్రజన్ వంటి గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించి, స్థిరమైన వృద్ధికి అనుకూలంగా పాలసీ మద్దతు కొనసాగుతోందని చెప్పారు.మానవ కేంద్రిత సంస్కరణలు.. సాంకేతిక వినియోగాన్ని విస్తరించడంలో కూడా, సంక్షేమాన్ని కాపాడే విధంగా సంస్కరణలు పూర్తిగా మానవ కేంద్రితంగానే ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలో భారత స్థానం.. భారతాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు “ఆశాకిరణం”గా వర్ణిస్తూ, గ్లోబల్ పెట్టుబడులు, దృష్టి భారత్‌వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు.ఇదిలాఉండగా, డిసెంబరులో వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 2% వద్ద ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది కేంద్రం నిర్దేశించిన 4% లక్ష్యం కంటే చాలా తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నామమాత్రపు జీడీపీ వృద్ధి 8% వద్ద ఉండొచ్చని అంచనా.బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో గుర్తుంచుకోవాల్సిన తేదీలు..జనవరి 29: ఆర్థిక సర్వే 2025-26 సమర్పణ.ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్.ఏప్రిల్ 2: బడ్జెట్ సమావేశాల ముగింపు.

Economic Survey 2026 tabled in Parliament today3
పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2025-26 విడుదల

దేశ ఆర్థిక వ్యవస్థ గమనానికి దిక్సూచిగా భావించే ఆర్థిక సర్వే (Economic Survey) 2025-26ను కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్‌ నేడు (గురువారం, జనవరి 29, 2026) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ కంటే ముందు వెలువడే ఈ కీలక పత్రం గత ఆర్థిక సంవత్సరంలో దేశం సాధించిన ప్రగతిని, రాబోయే సవాళ్లను విశ్లేషిస్తుంది.ప్రధాన అంశాలు..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ సర్వేను సమర్పించారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ్వరన్ విలేకరుల సమావేశంలో పాల్గొని దేశ ఆర్థిక పోకడలపై సమగ్ర వివరణ ఇవ్వనున్నారు.జనవరి 28న ప్రారంభమైన ఈ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2, 2026 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.ఆర్థిక వృద్ధి అంచనాలుభారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశం 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా. ఇది గతంలో ఊహించిన 6.3 - 6.8 శాతం కంటే మెరుగ్గా ఉండటం విశేషం. పటిష్టమైన దేశీయ వినియోగం, తయారీ రంగంలో వృద్ధి దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.బడ్జెట్‌ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి?ఆన్‌లైన్‌లో indiabudget.gov.in(https://www.indiabudget.gov.in) అధికారిక వెబ్‌సైట్‌, సాక్షి.కామ్‌లోని లైప్‌ అప్‌డేట్ల ద్వారా బడ్జెట్‌ వివరాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు సోషల్ మీడియాలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అధికారిక పేజీలతోపాటు ఫేస్‌బుక్‌లోకి ‘సాక్షి’ పేజీని ఫాలో అయి తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: గోల్డ్‌ ధర.. గుండె దడ!

gold and silver rates on 29th january 2026 in Telugu states4
గోల్డ్‌ ధర.. గుండె దడ!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 29th January 20265
రెండు రోజుల లాభాలకు బ్రేక్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి లాభాల్లో కదలాడిన మార్కెట్లు ఈరోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 115 పాయింట్లు తగ్గి 25,223 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 436 పాయింట్లు నష్టపోయి 81,898 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 29-01-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

HAL major strategic push into civil aviation6
సివిల్‌ ఏవియేషన్‌పై హెచ్‌ఏఎల్‌ మరింతగా ఫోకస్‌

పౌర విమానయాన విభాగంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ప్రభుత్వ రంగ ఏరోస్పేస్‌ దిగ్గజం హెచ్‌ఏఎల్‌ సీఎండీ డీకే సునీల్‌ వెల్లడించారు. వ్యాపారంలో ఈ విభాగం వాటా ప్రస్తుతం 5–6 శాతంగా ఉండగా 25 శాతానికి పెంచుకోనున్నట్లు వివరించారు. ఈ క్రమంలో సూపర్‌జెట్‌ 100 (ఎస్‌జే100) ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రస్తుత ప్లాంట్లలో వచ్చే మూడేళ్లలో సెమీ–నాక్డ్‌ డౌన్‌ విధానంలో రూపొందించనున్నట్లు చెప్పారు. రష్యాకి చెందిన పబ్లిక్‌ జాయింట్‌ స్టాక్‌ కంపెనీ యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌తో హెచ్‌ఏఎల్‌ ఇటీవలే ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది.ఓవైపు వీటిని లీజు పద్ధతిలో అందిస్తూనే, దేశీయంగా ఈ విమానాల తయారీకి ఏర్పాట్లు చేసుకోనున్నట్లు సునీల్‌ చెప్పారు. దేశంలో ప్రాంతీయంగా కనెక్టివిటీపై దృష్టి పెడుతున్నందున 200 పైగా ఎస్‌జే100 విమానాలకు డిమాండ్‌ నెలకొనవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే మూడునాలుగేళ్లలో తమ కంపెనీ ఆదాయాల్లో ఈ విమానాలతో పాటు హెలికాప్టర్లకు కూడా గణనీయంగా వాటా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ పవన్‌ హన్స్‌ సంస్థ దేశీయంగా తయారైన 10 ధృవ్‌ న్యూ జనరేషన్‌ హెలికాప్టర్లను కొనుగోలు చేసి, ఓఎన్‌జీసీ ఆఫ్‌షోర్‌ కార్యకలాపాల కోసం వినియోగించనున్నట్లు సునీల్‌ చెప్పారు. బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) నుంచి కూడా ఈ విమానాలకోసం ఆర్డర్లు ఉన్నట్లు తెలిపారు. కార్యకలాపాలపై ఏటా రూ. 2,500–3,000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 31,000 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈ ఆర్థిక సంవత్సరం సుమారు 7–8 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు!

Advertisement
Advertisement
Advertisement