Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

 Gujarat Kidney and Super Speciality IPO: Company sets price band at Rs 108 and Rs 114 per share1
గుజరాత్‌ కిడ్నీ @ రూ. 108–114

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ కంపెనీ గుజరాత్‌ కిడ్నీ అండ్‌ సూపర్‌ స్పెషాలిటీ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభంకానుంది. 24న ముగియనున్న ఇష్యూకి తాజాగా రూ. 108–114 ధరల శ్రేణి ప్రకటించింది. దీనిలో భాగంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా దాదాపు రూ. 251 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇన్వెస్టర్లు కనీసం 128 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.ఈక్విటీ జారీ నిధులను అహ్మదాబాద్‌లోని పరేఖ్స్‌ హాస్పిటల్‌ కొనుగోలుతోపాటు.. ఇప్పటికే సొంతం చేసుకున్న అశ్విని మెడికల్‌ సెంటర్‌ పాక్షిక చెల్లింపులకు వెచ్చించనుంది. అంతేకాకుండా వడోదరలో కొత్త ఆసుపత్రి ఏర్పాటు, రోబోటిక్స్‌ పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులకు సైతం నిధులు కేటాయించనుంది. కంపెనీ గుజరాత్‌లో మధ్యస్థాయి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్‌ను నిర్వహిస్తోంది.

Green Signal For Vedanta NCLT Approves Demerger Plan2
వేదాంతా విడదీతకు ఓకే

ముంబై: ప్రైవేటు రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ బిజినెస్‌ల విడదీత ప్రణాళికకు తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఓకే చెప్పింది. దీంతో వివిధ బిజినెస్‌ విభాగాలను రంగాలవారీగా ఐదు స్వతంత్ర కంపెనీలుగా విడదీసేందుకు వేదాంతాకు వీలు చిక్కనుంది. కంపెనీ విడదీత పథకానికి ట్రిబ్యునల్‌ ముంబై బెంచ్‌ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా అల్యూమినియం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఐరన్‌ అండ్‌ స్టీల్, విద్యుత్‌ తదితర బిజినెస్‌లను విడిగా లిస్ట్‌ చేయనుంది. కాగా.. నవంబర్‌లో విచారణ తదుపరి బెంచ్‌ తీర్పును రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే.ఎన్‌సీఎల్‌టీ అనుమతి వేదాంతా ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కీలక మైలురాయని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. తాజా అనుమతితో విడదీత పథక అమలుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2023లోనే వేదాంతా బిజినెస్‌ల విడదీత ప్రణాళికను ప్రకటించింది. దీనిలో భాగంగా వేదాంతా పేరుతో అల్యూమినియం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, పవర్, ఐరన్‌ అండ్‌ స్టీల్‌తోపాటు.. పునర్వ్యవస్థీకరించిన వేదాంతా లిమిటెడ్‌గా ఐదు కంపెనీలకు తెరతీయనుంది. వేదాంతా లిమిటెడ్‌లో జింక్, సిల్వర్‌ బిజినెస్‌లు కొనసాగనున్నాయి. తాజా అనుమతితో వేదాంతా షేరు ఎన్‌ఎస్‌ఈలో 4% జంప్‌చేసి రూ. 573 వద్ద ముగిసింది.

SEBI Gives Green Light to Seven Companies3
లిస్టింగ్‌కు 7 కంపెనీలు రెడీ

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడం ద్వారా నిధులు సమీకరించేందుకు తాజాగా సెబీ 7 కంపెనీలకు ఓకే చెప్పింది. జాబితాలో యశోదా హెల్త్‌కేర్‌ సర్విసెస్, ఫ్యూజన్‌ సీఎక్స్, ఓరియంట్‌ కేబుల్స్, టర్టిల్‌మింట్‌ ఫిన్‌టెక్‌ సొల్యూషన్స్, ఆర్‌ఎస్‌బీ రిటైల్‌ ఇండియా, ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీస్, లోహియా కార్ప్‌ చేరాయి. లిస్టింగ్‌కు అనుమతించమంటూ ఈ కంపెనీలన్నీ ఈ ఏడాది మే నుంచి సెపె్టంబర్‌ మధ్యకాలంలో సెబీకి దరఖాస్తు చేశాయి. వెరసి ఉమ్మడిగా రూ. 6,000 కోట్లు సమీకరించేందుకు సమాయత్తంకానున్నాయి. కంపెనీలన్నీ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి. యశోదా హెల్త్‌కేర్‌ గోప్యతా విధానంలో యశోదా హెల్త్‌కేర్‌ సర్విసెస్‌ సెబీకి సెప్టెంబర్‌లో దరఖాస్తు చేసింది. సంబంధిత వర్గాల అంచనా ప్రకారం ఐపీవో ద్వారా రూ. 3,000–4,000 కోట్ల మధ్య సమీకరించే అవకాశముంది. రహస్య మార్గంలో దరఖాస్తు చేయడం ద్వారా కంపెనీలు ప్రాస్పెక్టస్‌ వివరాలు తొలిదశలో వెల్లడికాకుండా నిలువరించవచ్చు. ఆర్‌ఎస్‌బీ రిటైల్‌ రిటైల్‌ రంగ ఫ్యాషన్‌ టెక్స్‌టైల్స్‌ హైదరాబాద్‌ కంపెనీ ఆర్‌ఎస్‌బీ రిటైల్‌ ఇండియా ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 2.98 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులుసహా.. ఆర్‌ఎస్‌ బ్రదర్స్, సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ తదితర కొత్త స్టోర్ల ఏర్పాటుకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. టర్టీల్‌మింట్‌ ఫిన్‌టెక్‌ 2015లో ఏర్పాటైన టర్టీల్‌మింట్‌ ఫిన్‌టెక్‌ సొల్యూషన్స్‌ గోప్యతా మార్గంలోనే సెపె్టంబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. అమన్సా క్యాపిటల్, జంగిల్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌కు పెట్టుబడులున్న కంపెనీ బీమా పాలసీల కొనుగోలు, నిర్వహణను సరళతరం చేసింది. తద్వారా సొంత నెట్‌వర్క్‌ ద్వారా 1.6 కోట్ల పాలసీలను విక్రయించింది. ఫ్యూజన్‌ సీఎక్స్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్విసుల సంస్థ ఫ్యూజన్‌ సీఎక్స్‌ ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులుసహా.. అనుబంధ సంస్థల ఐటీ టూల్స్‌ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. ఓరియంట్‌ కేబుల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఓరియంట్‌ కేబుల్స్‌(ఇండియా) లిమిటెడ్‌ రూ. 700 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 380 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాల కొనుగోళ్లతోపాటు తయారీ ప్లాంటు సివిల్‌ పనులకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌వేస్ట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ సొల్యూషన్లు సమకూర్చే ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీస్‌ ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.23 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు కేటాయించనుంది. లోహియా కార్ప్‌ ఐపీవోలో భాగంగా టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ తయారీ సంబంధిత మెషీనరీ, పరికరాల తయారీ కంపెనీ లోహియా కార్ప్‌ 4.22 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు.

Lionel Messi Visit To Vantara4
వంతారాలో లియోనెల్ మెస్సీ

గ్లోబల్ ఫుట్‌బాల్ ఐకాన్.. లియోనెల్ మెస్సీ 'అనంత్ అంబానీ' స్థాపించిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం & పరిరక్షణ కేంద్రం వంతారాను సందర్శించారు. వంతారాలో కార్యక్రమాలు సాధారణంగా సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం, ప్రకృతి & సమస్త జీవుల పట్ల గౌరవాన్ని చాటే విధంగా ప్రారంభమవుతాయి. ఈ సంప్రదాయాలను గౌరవిస్తూ మెస్సీ కూడా హిందూ ఆచారాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.మెస్సీతో పాటు ఆయన సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డీ పాల్‌కు సంప్రదాయ జానపద సంగీతం, పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఆ తరువాత అంబే పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివాభిషేకంతో కూడిన మహా ఆరతిలో పాల్గొని, ప్రపంచ శాంతి & ఐక్యత కోసం ప్రార్థించారు.వంతారాలో మెస్సీ .. సింహాలు, పులులు, ఏనుగులు, శాకాహార జంతువులు, సరీసృపాలు, జంతు పిల్లలను చూశారు. జంతువులకు అందిస్తున్న ఆధునిక వైద్య సదుపాయాలు, పోషణ, సంరక్షణ పద్ధతులు చూసి ఆయన ఎంతో సంతోషించారు. ప్రత్యేక వన్యప్రాణి ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్సలు, శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా వీక్షించారు. అలాగే జిరాఫీలు, ఖడ్గమృగాలు, ఒకాపీలు, ఏనుగులకు ఆహారం కూడా పెట్టారు.అనాథ & బలహీన జంతు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఫోస్టర్ కేర్ సెంటర్‌లో, వాటి జీవన ప్రయాణాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ & రాధిక అంబానీ కలిసి ఒక సింహపు పిల్లకు మెస్సీ గౌరవార్థంగా “లియోనెల్” అని పేరు పెట్టారు. ఈ పర్యటనలో అత్యంత గుర్తుండిపోయే సంఘటన ఏనుగుల సంరక్షణ కేంద్రంలో జరిగింది. అక్కడ ఏనుగు పిల్ల 'మణిక్లాల్'తో మెస్సీ సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. ఆట ద్వారా జంతువులతో అనుబంధాన్ని చూపిస్తూ, ఆట అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే భాష అని నిరూపించారు. ఆ దృశ్యం అక్కడున్న అందరి మనసులను ఆకట్టుకుంది.

Legal Advice Demonetized Notes Old Rs 500 and 1000 Notes Know The Details5
పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరమా.. జరిమానా ఎంత?

నవంబర్ 2016లో మన దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఆ సమయంలో వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి లేదా.. మార్చుకోవడానికి సమయం ఇచ్చారు. ఆ తరువాత వీటి వాడకం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ.. ఇప్పటికి కూడా కొంతమంది దగ్గర ఈ నోట్లు ఉన్నట్లు అప్పుడప్పుడు సంబంధిత అధికారులు గుర్తిస్తూ ఉంటారు.పాత రూ. 500, రూ. 1000 నోట్లు ఉపయోగించడం నేరమా?, ఒక వ్యక్తి దగ్గర ఎన్ని నోట్లు ఉండొచ్చు?, చట్టం ఏం చెబుతోంది? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.చట్టం ఏం చెబుతోందంటే?స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టం 2017 ప్రకారం.. రద్దు అయిన రూ. 500, రూ. 1000 నోట్లు తక్కువ సంఖ్యలో ఉండటం నేరమేమీ కాదు. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే నేరమవుతుంది. ఒక వ్యక్తి దగ్గర 10 నోట్ల వరకు ఉండవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య రాదు.10 కంటే ఎక్కువ రూ. 500 లేదా రూ. 1000 నోట్లు ఉంటే.. మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అభిరుచి కలిగిన నాణేలను సేకరించేవారు గరిష్టంగా 25 నోట్ల వరకు ఉంచుకోవచ్చు. అయితే వీటిని ఆర్ధిక లావాదేవీల కోసం ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించుకోకూడదు.ఐదు రెట్లు జరిమానా!ఒక వ్యక్తి పరిమితి కంటే ఎక్కువ సంఖ్యలో రద్దు చేసిన నోట్లను కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే.. కనీసం రూ. 10వేలు జరిమానా లేదా ఆ వ్యక్తి దగ్గర ఉన్న నోట్ల విలువకు ఐదు రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీదగ్గర రూ. 20వేలు విలువైన రద్దు చేసిన నోట్లు ఉన్నాయనుకుంటే.. రూ. లక్ష (ఐదు రెట్లు) జరిగిమానా చెల్లించాలన్నమాట. అయితే జైలు శిక్ష ఉండదు.రద్దు చేసిన నోట్లను ఎక్కువగా ఉంచుకున్నప్పటికీ.. దానిని ఆర్ధిక నేరంగా పరిగణించరు. అయితే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రద్దు చేసిన నోట్లు చట్టబద్దమైనవి కాదు. కాబట్టి వీటిని ఎక్కడా ఉపయోగించలేరు. ఉపయోగించకూడదు కూడా.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..

Buying When Second Hand Car And Know These Details6
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?: ఇవి తెలుసుకోండి

కొత్త కారు కొనడానికి కావలసినంత డబ్బు లేనప్పుడు, చాలామంది సెకండ్ హ్యాండ్ కారు లేదా యూస్డ్ కార్లను కొంటుంటారు. అయితే ఇలా కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.డాక్యుమెంట్లు చెక్ చేయాలిమీరు కొంటున్న కారుకు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా?, లేదా?.. అని చెక్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ చెల్లుబాటు అవుతోందా?, క్లెయిమ్స్ ఉన్నాయా కూడా చెక్ చేసుకోవాలి. పొల్యూషన్ సర్టిఫికెట్ తనిఖీ చేయాలి. ఒకవేల లోన్ ఉంటే.. బ్యాంక్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుంటే.. అనుకోని సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది.మీరు కొంటున్న కారు సెకండ్ హ్యాండ్ కారా? లేక ఎంతమంది చేతులు మారిందనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒక ఓనర్ మాత్రమే కారును ఉపయోగించి ఉంటే.. అది మంచి కండిషన్లో ఉంటుంది. ఎక్కువమంది చేతులు మారి ఉంటే.. కారులో లెక్కలేనన్ని సమస్యలు తలెత్తుతాయి. దీనికోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.కారు కండీషన్మీరు కొంటున్న కారు ఎలాంటి స్థితిలో ఉందనే విషయం గమనించాలి. స్క్రాచులు, డెంట్స్ ఏమైనా ఉన్నాయా?, పెయింట్ ఒకేలా ఉందా? అనేది పరిగణలోకి తీసుకోవాలి. టైర్లు ఎలాంటి కండిషన్లో ఉన్నాయనేది చూడాలి. ప్రమాదాలకు గురైన కార్లకు చిన్న చిన్న మరమ్మత్తులు చేసి.. మార్కెట్లో అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని తప్పకుండా గమనించాలి.ఇంజిన్ స్థితికారుకు గుండె వంటి ఇంజిన్ పరిస్థితి ఎలా ఉందనేది చూడాల్సి ఉంటుంది. ఇంజిన్ శబ్దం స్మూత్‌గా ఉందా?, స్టార్ట్ చేయగానే ఎక్కువ శబ్దం లేదా పొగ వస్తుందా?, గేర్ షిఫ్టింగ్ సరిగ్గా ఉందా? అని పరిశీలించాలి. మీకు ఈ విషయాలను చెక్ చేయడంలో అనుభవం లేకపోతే.. నమ్మకమైన మెకానిక్‌తో చెక్ చేయించడం మంచిది.టెస్ట్ డ్రైవ్ & ఓడోమీటర్ రీడింగ్కారు కొనడానికి ముందు టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి. టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో.. బ్రేకులు బాగా పని చేస్తున్నాయా?, స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా?, సస్పెన్షన్ శబ్దం ఉందా? అనేవి గమనించాలి. పరిశీలించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఓడోమీటర్ చెక్ చేసుకోవాలి. తక్కువ కిలోమీటర్లు ప్రయాణించినట్లు చూపిస్తుంటే.. తప్పకుండా అనుమానించాల్సిందే. అలాంటప్పుడు సర్వీస్ రికార్డ్స్‌తో పోల్చుకోవాలి.ధర & ట్రాన్స్‌ఫర్ ప్రక్రియసెకండ్ హ్యాండ్ కారు ధర మార్కెట్లో ఎలా ఉందో తెలుసుకోవాలి. ఒకవేల చాలా తక్కువ ధరకు విక్రయిస్తుంటే.. కారణం కనుక్కోవాల్సిందే. ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) తప్పకుండా మీ పేరు మీదకు చేయించుకోవాలి. ఫారమ్ 29, 30 సరిగ్గా సబ్మిట్ చేయాలి.ఛలాన్స్మీరు కొంటున్న కారుపై ఏమైనా పెండింగ్ ఛలాన్స్ ఉన్నాయా?, దొంగతనం కేసులు వంటివి ఉన్నాయా? కూడా చెక్ చేసుకోవాలి. ఇలాంటి చెక్ చేసుకోకపోతే.. ఆ భారం మీ మీద పడుతుంది. అనుకోని సమస్యలను ఎదుర్కోవాలి ఉంటుంది.డీలర్ vs డైరెక్ట్ ఓనర్కొత్త కారును డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. అయితే యూస్డ్ కారును నేరుగా ఓనర్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం మంచిది. మధ్యవర్తులను ఆశ్రయించకపోవడం మంచిది. ఒకవేల డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేయాలనుకుంటే.. నమ్మకమైన డీలర్ నుంచి కొనుగోలోను చేయడం మంచిది.

Advertisement
Advertisement
Advertisement