Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Branchless Paperless Bank Accounts Gain Popularity in India1
బ్రాంచ్‌ లేని బ్యాంక్‌ అకౌంట్లు..

దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్‌ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్‌లెస్, బ్రాంచ్‌లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.అంతేకాకుండా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్‌లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

Nihar Info Joins Amazons IXD Program to Strengthen Supply Chain2
అమెజాన్‌ ఐఎక్స్‌డీ ప్రోగ్రాంలో నిహార్‌ ఇన్ఫో

సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా అమెజాన్‌ ఇంటర్‌–స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ డెలివరీ (ఐఎక్స్‌డీ) ప్రోగ్రాంలో చేరినట్లు ఈ–కామర్స్‌ సంస్థ నిహార్‌ ఇన్ఫో గ్లోబల్‌ ఎండీ దివ్యేష్‌ నిహార్‌ తెలిపారు. ఐఎక్స్‌డీ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లు పొందినట్లు పేర్కొన్నారు.ఇప్పటివరకు కంపెనీ రెండు వేర్‌హౌస్‌లతో కార్యకలాపాలు సాగిస్తుండగా, ప్రోగ్రాంలో చేరడంతో సదరు రాష్ట్రాల్లోని 20కి పైగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను ఉపయోగించుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు.సమర్ధవంతంగా నిల్వలను పాటించేందుకు, వ్యయాల భారాన్ని తగ్గించుకుని దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్, పంపిణీ సామర్థ్యాలను పెంచుకునేందుకు, వేగవంతంగా డెలివరీలు చేసేందుకు ఇది తోడ్పడుతుందని వివరించారు. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు మొదలైనవి ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌లలో విక్రయిస్తోంది.

Food Delivery Boy Built Rs 1 8 Crore Empire Know The Details Here3
డ‌బ్బు సంపాద‌న ధ్యేయంగా.. రోజుకు 14 గంటలు పని!

వ్యాపారం చేసి రాణిద్దామనుకున్నాడు. ప్రారంభించిన నెల‌ల వ్య‌వ‌ధిలోనే భారీగా న‌ష్ట‌పోయి, అప్పుల పాల‌య్యాడు. ఎలాగైనా అప్పు తీర్చి.. మ‌రోసారి వ్యాపారం చేయ‌డానికి పెట్టుబ‌డి సిద్ధం చేసుకోవాల‌నే దృఢ సంక‌ల్పంతో అడుగులు ముందుకు వేశాడు. కేవ‌లం ఐదేళ్ల వ్య‌వ‌ధిలో కోటీశ్వ‌రుడ‌య్యాడు. అప్పు తీర్చ‌డ‌మే కాకుండా.. కొత్త ఏడాదిలో కోటి రూపాయ‌ల‌తో రెండు టిఫిన్ సెంట‌ర్లు కూడా ప్రారంభిస్తాడ‌ట‌. నిరాశ‌తో కూరుకుపోయిన జీవితాన్ని స్వ‌యంకృషితో ముందుకు సాగిన చైనాకు చెందిన పాతికేళ్ల కుర్రాడి గురించి అక్క‌డి మీడియాలో ప్ర‌శంస‌లు వెలువెత్తుతున్నాయి. ఫుడ్‌డెలివ‌రీ బాయ్‌గా కోట్లు ఎలా సంపాదించాడో గ‌ర్వంగా చెప్పుకుంటున్నాడు. శ్ర‌మ‌, ప‌ట్టుద‌ల ఉంటే అసాధ్య‌మేదీ కాద‌ని నిరూపించిన చైనా యువ‌కుడు జాంగ్ జుకియాంగ్ గురించి తెలుసుకుందాం.వ్యాపారంలో నష్టంద‌క్షిణ చైనాలోని షాంఘై న‌గ‌రానికి చెందిన పాతికేళ్ల 'జాంగ్ జుకియాంగ్' 2020లో ఓ వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభించిన కొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలోనే న‌ష్టాల్లో కూరుకుపోయి వ్యాపారం మూసివేశాడు. న‌ష్టంతో పాటు అప్ప‌టికే అత‌నికి 50వేల యువాన్‌లు ఇక్క‌డి క‌రెన్సీ ప్ర‌కారం. సుమారు ఆరున్న‌ర ల‌క్ష‌లు అప్పు కూడా అయింది. స‌ర్దుకున్న జాంగ్ నిరాశ‌ప‌డ‌లేదు. ఎలాగోలా ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకుని షాంఘైలో ఓ పెద్ద ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్‌లో చేరాడు. ఫుడ్ ఆర్డ‌ర్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌సాగాడు. తోటి డెలివ‌రీ బాయ్స్‌లా కాకుండా.. త‌న‌కంటూ ఓ ల‌క్ష్యాన్ని పెట్ట‌కున్నాడు. నెల‌కు క‌నీసం ఇక్క‌డి క‌రెన్సీలో చూస్తే మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.365 రోజులు ప‌ని & రోజుకు 300 పార్శిళ్లుఏడాది మొత్తంలో 365 రోజులు ప‌ని చేయ‌డం, రోజూ కేవ‌లం విశ్రాంతి, తిన‌డానిక‌య్యే స‌మ‌యాన్ని మిన‌హాయించి మిగ‌తా స‌మ‌యం అంతా ఫుడ్ డెలివ‌రీ కోసం కేటాయించాడు. నిత్యం ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి ఒంటి గంట వ‌ర‌కు అంటే సుమారు 14 గంట‌లు ఫుడ్ డెలివ‌రీ కోసం తిరిగాడు. రోజూ క‌నీసం 300 పార్శిళ్ల‌ను ల‌క్ష్యంగా పెట్ట‌కుని వాటిని క‌స్ట‌మ‌ర్ల‌కు అంద‌జేశాడు. ప్ర‌తిరోజు సుమారు 9 గంట‌ల పాటు విశ్రాంతి తీసుకునే వాడు. చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవుల్లో కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకుని మిగ‌తా స‌మ‌యాన్ని ఫుడ్ డెలివ‌రీకి కేటాయించాడు.డ‌బ్బు సంపాద‌న ధ్యేయంగా ప‌ని చేసిన జాంగ్ రోజూ 300 పార్శిళ్లు ఇవ్వ‌డం... ప్ర‌తి పార్శిల్‌కు అత్య‌ధికంగా 20 నుంచి25 నిముషాలకు మించి స‌మ‌యం తీసుకోకుండా త్వ‌రిత‌గ‌తిన డెలివ‌రీ చేయడంలోనూ ఫుడ్ డెలివ‌రీ కంపెనీలో రికార్డు సృష్టించాడు. ఐదేళ్ల వ్య‌వ‌ధిలో జాంగ్ డెలివ‌రీ కోసం 3ల‌క్ష‌ల 24వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌డంతో పాటు ల‌క్ష‌న్న‌రకు పైగా ఫుడ్ డెలివ‌రీ పార్శిళ్ల‌ను అంద‌జేశాడు. అత‌ని అంకిత‌భావాన్ని చూసి తోటి ఉద్యోగ‌లు అత‌నికి ఆర్డ‌ర్ కింగ్ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఐదేళ్ల కాలంలో జాంగ్ మొత్తం కోటి 80ల‌క్ష‌లు సంపాదించి.. వాటిలో కోటి 42 ల‌క్ష‌లు పొదుపు చేయ‌గ‌లిగాడు. ఆ డ‌బ్బుతో తిరిగి వ్యాపారం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుత‌న్నాడు.

Central Bank of India Celebrating 115 years4
ఈ బ్యాంకుకు 115 ఏళ్లు..

ప్రభుత్వ రంగ దిగ్గజం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ 115 వ్యవస్థాపక దినోత్సవాన్ని ముంబైలో జరుపుకొంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు పాల్గొన్నారు.తొలి స్వదేశీ బ్యాంక్‌ అయిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్టం చేయడంలో, సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. బ్యాంకు రుణాల్లో ఆర్‌ఏఎం (గ్రామీణ, వ్యవసాయ, చిన్న–మధ్య తరహా సంస్థలకు లోన్స్‌) వాటా 72 శాతంగా ఉండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.మరోవైపు, దేశవ్యాప్తంగా 4,556 శాఖలు, 21,492 టచ్‌ పాయింట్లతో విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లు బ్యాంకు ఎండీ కల్యాణ్‌ కుమార్‌ తెలిపారు. వ్యాపార పరిమాణం రూ. 7,37,938 కోట్లకు చేరినట్లు వివరించారు.భారతదేశంలో తొలి స్వదేశీ బ్యాంకుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) పేరుగాంచింది. 1911లో పూర్తిగా భారతీయుల యాజమాన్యంలో, నిర్వహణలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడింది. సోరాబ్జీ పోచ్‌ఖానావాలా దీనిని స్థాపించారు.

Aadhaar PAN Link Deadline Dec 31st Know The How To Link Step By Step Guide5
ఆధార్‌ పాన్ లింక్: ఇంకొన్ని రోజులే గడువు

ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రజలు రెండు గుర్తింపు కార్డులను లింక్ చేయడానికి తొందరపడుతున్నారు. 2025 డిసెంబర్ 31లోపు తమ పాన్ & ఆధార్ కార్డులను లింక్ చేయని వారికి రూ.1000 ఆలస్య రుసుము విధించనున్నారు.ఆధార్‌తో పాన్‌ కార్డులు లింక్‌ చేసుకోనివారు.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ను ఫైల్‌ చేయలేరు. ట్యాక్స్‌ రిఫండ్‌ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్‌, షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు. పన్ను ఎగవేతలను.. అక్రమాలను అరికట్టడానికి ఆధార్‌, పాన్‌ కార్డులను లింక్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడో నిబంధన తెచ్చింది. కాబట్టి అందరూ తమ పాన్, ఆధార్ కార్డులను తప్పకుండా లింక్ చేసుకోవాలి.ఆన్‌లైన్‌లో పాన్-ఆధార్ లింక్ చేసుకోవడం ఎలాఅధికారిక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి."లింక్ ఆధార్"పై క్లిక్ చేసి మీ పాన్, ఆధార్ నంబర్, మొబైల్ నంబరును నమోదు చేయండి.ఇప్పుడు మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి వివరాలను వెరిఫై చేయండి.లింకింగ్ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి, వెబ్‌సైట్లో ‘క్విక్ లింక్స్‌’కు వెళ్లి ఆధార్ స్టేటస్ లింక్‌పై క్లిక్‌ చేయండి.

Bajaj Pulsar 150 Classics 2026 launched in India price features and more6
బజాజ్ పల్సర్ 150 బైక్‌.. ‘కొత్త’గా వచ్చేసింది!

ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ ‌బజాజ్ ఆటో తమ పాపులర్‌ పల్సర్ 150 బైక్‌ను మరింత ఆకర్షణీయంగా అప్ డేట్ చేసింది. దాని మెకానికల్ సెటప్‌లో ఎలాంటి మార్పులు లేకుండా చిన్నపాటి డిజైన్, ఫీచర్ మెరుగుదలలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పల్సర్ 150 ఇప్పుడు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌తో వస్తోంది. కాగా బైక్‌లో ఇప్పుడున్న వేరియంట్‌లు అలాగే ఉంటాయి.బజాజ్ 2026 ద్వితీయార్ధంలో పల్సర్ క్లాసిక్ శ్రేణిలో మార్పులు చేస్తుందని ఓవైపు ఊహాగానాలు నడుస్తుండగానే బజాజ్ ఆటో తన అత్యంత ఐకానిక్ మోటార్ సైకిళ్లలో ఒకటైన పల్సర్ 150ను రిఫ్రెష్ చేసింది. అప్‌డేటెడ్‌ పల్సర్ 150 శ్రేణి ధర రూ. 1.08 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. పల్సర్ 150 ఎస్‌డీ ధర రూ .1,08,772, పల్సర్ 150 ఎస్‌డీ యూజీ ధర రూ. 1,11,669లుగా ఉంది. ఇక టాప్-స్పెక్ అయిన పల్సర్ 150 టీడీ యూజీ ధర రూ. 1,15,481. (ఇవన్నీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు).ఏం మారాయి..? సమకాలీన మోడల్‌ బైక్‌లతో పోటీపడేలా బజాజ్‌ పల్సర్‌ 150లో అప్ డేటెడ్‌ గ్రాఫిక్స్‌ తో డీటైల్స్‌ను కాస్త మెరుగుపరిచి కొత్త కలర్ ఆప్షన్లు తీసుకొచ్చింది. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌ను జోడించడం అత్యంత ముఖ్యమైన ఫంక్షనల్ అప్ గ్రేడ్. ఇది బైక్‌కు విజిబులిటీని పెంచడమే కాకుండా మొత్తం డిజైన్‌కే మోడ్రన్‌ టచ్‌ ఇస్తుంది.పల్సర్ 150 బైకులోని 149.5 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పీఎం వద్ద 13.8 బీహెచ్‌పీ పవర్, 6,500 ఆర్‌పీఎం వద్ద 13.25 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.ఇక బ్రేకింగ్ హార్డ్ వేర్ విషయానికి వస్తే 260 మి.మీ ఫ్రంట్ డిస్క్, సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో రియర్ డ్రమ్ సెటప్ ఉన్నాయి. కాగా సస్పెన్షన్ పనిని టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు,ట్విన్ గ్యాస్-ఛార్జ్‌డ్ రియర్ షాక్ అబ్జార్బర్లు చూసుకుంటాయి.

Advertisement
Advertisement
Advertisement