ప్రధాన వార్తలు
బాహుబలి ఎక్స్కవేటర్ వచ్చేసింది!
దక్షిణాసియాలోనే అతిపెద్ద నిర్మాణ పరికరాల ప్రదర్శన అయిన ఎక్స్కాన్-2025లో జేసీబీ ఇండియా చారిత్రక ఆవిష్కరణ చేసింది. భారత మౌలిక సదుపాయాలకు అనుగుణంగా 400 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన ఇంజిన్తో శక్తివంతమైన 52-టన్నుల జేసీబీ 520 ఎక్స్ఎల్ ఎక్స్కవేటర్ను ఆవిష్కరించింది. భారతదేశంలో తయారు చేసిన అత్యంత భారీ యంత్రంగా నిలిచిన ఈ ఎక్స్కవేటర్ దేశీయ భారీ నిర్మాణాల అవసరాలకు ఎంతో తోడ్పడుతుందని జేసీబీ తెలిపింది.ఇది జాతీయ రహదారుల ప్రాజెక్టులు, విస్తృత మైనింగ్ కార్యకలాపాలు, పట్టణ విస్తరణలో అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ యంత్రం లాంచ్తో జేసీబీ హెవీ డ్యూటీ సెగ్మెంట్లోకి ప్రవేశించినట్టు స్పష్టమవుతోంది. ఇది భారత మౌలిక సదుపాయాల వృద్ధిని మరింత వేగవంతం చేయగలదని కంపెనీ చెప్పింది. ప్రపంచ ఎగుమతుల మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు పేర్కొంది.ఈ ప్రదర్శనలో జేసీబీ ఒక్క 520 ఎక్స్ఎల్ను మాత్రమే కాకుండా మొత్తం 10కి పైగా కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఈ ఉత్పత్తులన్నీ కస్టమర్ కేంద్రీకృత ఇన్నోవేషన్లుగా ఉంటాయని కంపెనీ చెప్పింది. ఎన్హాన్స్ బ్యాక్హో లోడర్లు, కొత్త 2-5 టన్నుల ఎక్స్కవేటర్ రేంజ్తో సహా ఈ మెషిన్లు లో మేనేజ్మెంట్ ఖర్చు, మెరుగైన ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. గత 15 సంవత్సరాల్లో జేసీబీ తన యంత్రాల్లో 45% ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు చెప్పింది.హైడ్రోజన్ జెన్ సెట్ ఆవిష్కరణస్థిరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ జేసీబీ తన హైడ్రోజన్ పోర్ట్ఫోలియోను విస్తరించింది. 2023లో ప్రవేశపెట్టిన హైడ్రోజన్ బ్యాక్హో లోడర్ విజయవంతం అయిన తరువాత కంపెనీ ఇప్పుడు హైడ్రోజన్ ఎనర్జీతో నడిచే జెన్ సెట్ను ప్రకటించింది. ఈ ఆవిష్కరణ జీరో-కార్బన్ ఎమిషన్లతో స్వచ్ఛ ఇంధన పరిష్కారాలను అందిస్తుంది.కస్టమర్ సపోర్ట్ బలోపేతండిజిటల్ పరివర్తనలో భాగంగా జేసీబీ అనేక కొత్త ప్లాట్ఫామ్లను ప్రవేశపెట్టింది. ‘పార్ట్స్ ఆన్లైన్’ పోర్టల్ ద్వారా ఈ-కామర్స్ తరహాలో విడి భాగాల కేటలాగ్ను అందిస్తూ, లావాదేవీలను వేగవంతం చేస్తుంది. నెక్స్ట్-జెన్ టెలిమాటిక్స్ వ్యవస్థ ద్వారా మెషిన్ కంటిషన్ను మెరుగుపరుస్తుంది. రియల్-టైమ్ ఆపరేషనల్ ఇన్సైట్స్ అందిస్తుంది.నైపుణ్యాభివృద్ధికి సిమ్యులేటర్లుశిక్షణా విభాగంలో జేసీబీ ‘దక్ష్’ ద్వారా సిమ్యులేటర్లను అందిస్తుంది. ఇది శిక్షణా ఖర్చులను తగ్గించడంతోపాటు భద్రతను పెంచుతుందని కంపెనీ తెలిపింది. 2026 ప్రారంభంలో ఎక్స్కవేటర్ సిమ్యులేటర్ కూడా విడుదల కానున్నట్లు పేర్కొంది. చిన్న కాంట్రాక్టర్లు ఈ సిమ్యులేటర్ల ద్వారా ఖరీదైన శిక్షణ లేకుండానే ఆపరేటర్ల నైపుణ్యాలను మెరుగుపరచవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: జీవిత బీమాపై అపోహలు తగ్గాలి
పెరగనున్న బెంజ్ కార్ల ధరలు: జనవరి 1 నుంచే..
2025 ముగుస్తోంది, 2026 రాబోతోంది. ఈ సమయంలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' తన మొత్తం ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.వచ్చే ఏడాది ప్రారంభం (జనవరి 1) నుంచే బెంజ్ కార్ల ధరలు 2 శాతం పెరగనున్నాయి. కరెన్సీ అస్థిరత, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిరంతర లాజిస్టికల్ సవాళ్లు మొదలైన కారణాల వల్ల.. ధరలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. యూరోతో పోలిస్తే భారత రూపాయి బలహీనమైన నేపథ్యంలో బీఎండబ్ల్యూ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. ఇప్పుడు బెంజ్ కంపెనీ ఈ జాబితాలో చేరింది.2026 జనవరి 1నుంచి 2 శాతం ధరలు పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. కానీ ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని సంస్థ స్పష్టంగా వెల్లడించలేదు. మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో వివిధ రకాల బాడీ స్టైల్స్లో లగ్జరీ కార్లను విక్రయిస్తుంది. వీటిలో స్థానికంగా తయారు చేసినవి, స్థానికంగా అసెంబుల్ చేసినవి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) మోడల్లు ఉన్నాయి. అయితే కొత్త ధరలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టెస్టింగ్ కోసం మిరాయ్: త్వరలో రానుందా?
మరింత పెరగనున్న వైద్య ఖర్చులు
కొత్త సంవత్సరం వస్తోంది. ఉద్యోగులు వచ్చే ఏడాది ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నూతన సంవత్సరం మరింత ఖరీదైన వైద్య ఖర్చుల భారాన్ని కూడా మోసుకొస్తోంది. దేశంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు 2026లో 11.5% పెరుగుతాయని అయోన్ గ్లోబల్ మెడికల్ ట్రెండ్ రేట్స్ రిపోర్ట్ తెలిపింది.వైద్య ఖర్చుల పెరుగుదల 2025లో ఉన్న 13% కంటే కొత్త ఏడాదిలో తక్కువే అయినప్పటికీ దేశ వైద్య సంబంధ ద్రవ్యోల్బణం ప్రపంచ సగటు 9.8% కంటే ఎక్కువగా ఉంది. హృదయ సంబంధ వ్యాధులు, జీర్ణశయ రుగ్మతలు, క్యాన్సర్ వంటివి వైద్య ఖర్చులను మరింత పెంచుతాయని నివేదిక హైలైట్ చేస్తోంది. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, పోషకాహారలేమి వంటి కారకాలు ఖర్చుల భారం పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడింది.వైద్య ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయంటే..ఇటీవల కాలంలో వైద్య సాంకేతికతల్లో అత్యంత పురోగతి వచ్చింది. కొత్త కొత్త వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అధునాతన రొబోటిక్స్, ఏఐ టెక్నాలజీని వైద్య చికిత్సల్లో వినియోగిస్తున్నారు.ప్రాణాంతకమైన అనేక జబ్బులకు ఇటీవల నూతన ఔషధాలు కనుగొంటున్నారు. సాధారణంగా ఇవి అత్యంత ఖరీదైనవిగా ఉంటున్నాయి.దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఆస్థాయిలో నాణ్యమైన ఆసుపత్రులు, నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులు ఉండటం లేదు. దీంతో మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది.పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి రక్షించుకోవడానికి చాలా మంది ఉద్యోగులు వైద్య బీమాను ఆశ్రయిస్తుంటారు. అయితే వాటిలో ఇటీవల క్లెయిమ్లు పెరగడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంలను పెంచేస్తున్నాయి.
ఇండిగో సంక్షోభం.. నలుగురు అధికారుల సస్పెన్షన్
విమానయన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభానికి సంబంధించి నలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. గడిచిన పది రోజుల్లో ఇండిగో భారీగా విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డారు. ఈ అసౌకర్యానికి అంతటికీ బాధ్యులను చేస్తూ నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్లను (ఎఫ్ఐఓ) ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ శుక్రవారం సస్పెండ్ చేసింది.సస్పెండ్ అయిన ఈ నలుగురు అధికారులు విమానయాన భద్రత, పైలట్ శిక్షణ, నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు చూస్తారు. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు ఏవియేషన్ రెగ్యులేటర్ ముందు హాజరవుతున్న తరుణంలోనే అధికారుల సస్పెన్షన్ జరగడం గమనార్హం.విమానాల అనూహ్య రద్దుతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. వేల సంఖ్యలో ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే శుక్రవారం రోజున అత్యధికంగా 1,600కి పైగా విమానాలు రద్దు కావడం అత్యవసర ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది.
పసిడి పిడుగు.. సిల్వర్ షాక్!! దారుణంగా ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు మరింత దూసుకెళ్లాయి. బంగారం ధరలు వరుసగా మూడో రోజూ భారీగా పెరిగి హ్యాట్రిక్ కొట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) ఒక్కసారిగా ఎగిశాయి. ఇక వెండి ధరలు అయితే వరుసగా ఐదో రోజూ భారీ స్ఠాయిలో దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 119 పాయింట్లు పెరిగి 26,017కు చేరింది. సెన్సెక్స్(Sensex) 408 పాయింట్లు లాభపడి 85,226 వద్ద ట్రేడవుతోంది.ఎల్ అండ్ టీ, హిందాల్కో, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, జియో ఫైనాన్స్, మారుతి సుజుకీ, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు నిఫ్టీ గెయినర్లుగా నిలిచాయి. విప్రో, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, హెచ్ యూఎల్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ ఎం షేర్లు లాభాల బుకింగ్ లో పతనమయ్యాయి.Today Nifty position 12-12-2025(time: 9:51 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కార్పొరేట్
ఇండిగో సంక్షోభం.. నలుగురు అధికారుల సస్పెన్షన్
మాకంటూ సొంత బాట
జనవరి 21 నుంచి ఇమ్టెక్స్ ఫార్మింగ్ ఎక్స్పో
బ్యాంక్ ఉద్యోగ నియామకాల్లో మార్పులు
టాటా ప్లాంట్లలో ఇంటెల్ చిప్ల తయారీ
2025లో ఐపీవోల సెంచరీ
500 సార్లు అప్లై చేసినా రాని ఉద్యోగం!: చివరికి ఏం చేసిందంటే?
రెండు లక్షలపైగా సంస్థలకు స్టార్టప్ గుర్తింపు
ఉన్నదొకటి.. చెబుతున్నది ఇంకొకటి: ఐఐఎఫ్ఎల్ రిపోర్ట్
బ్యాంకు పరీక్షల్లో భారీ మార్పులు!!
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
సిల్వర్ సునామీ.. పసిడి ధరల తుపాను!!
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా ఎగిశాయి. ఒక రోజు ...
Stock Market Updates: లాభాల్లోకి మార్కెట్లు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయానికి ముంద...
వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. పెట్టుబడికి సంబం...
ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్
అంచనాలను మించిన ఆర్థిక పురోగతికి దన్నుగా రిజర్వ్ ...
ఇదో అవకాశంగా చూడాలి.. ఆర్బీఐ గవర్నర్
భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప...
ఆర్బీఐ వడ్డీ రేటు పావు శాతం కోత
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీల...
రష్యాకి మరిన్ని ఎగుమతులపై దృష్టి
వాణిజ్య లోటును భర్తీ చేసుకునే దిశగా రష్యాకు ఎగుమతు...
ఆటోమొబైల్
టెక్నాలజీ
భారత్లో భారీ పెట్టుబడి!: సత్య నాదెళ్ల కీలక ప్రకటన
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి 17.5 బిలియన్ డాలర్లు (రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సత్య నాదెళ్ల.. ఈ విషయాన్ని వెల్లడించారు.భారతదేశ ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయకమైన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. దేశ ఆశయాలకు మద్దతుగా, మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం.. భారతదేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి నిబద్దతతో ఉందని సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.''ఏఐ విషయంలో.. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. సత్య నాదెళ్లతో చర్చలు జరిగాయి. ఆసియాలో ఇప్పటివరకు అతిపెద్ద పెట్టుబడి పెట్టే ప్రదేశం ఇండియా కావడం చాలా ఆనందంగా ఉంది'' అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు.When it comes to AI, the world is optimistic about India! Had a very productive discussion with Mr. Satya Nadella. Happy to see India being the place where Microsoft will make its largest-ever investment in Asia. The youth of India will harness this opportunity to innovate… https://t.co/fMFcGQ8ctK— Narendra Modi (@narendramodi) December 9, 2025
అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’(Project Suncatcher)గా పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్లో మూన్ షాట్లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.2027లో తొలి పరీక్షలుఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్లను శాటిలైట్ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్ఫాంమ్లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.Interesting https://t.co/yuTy9Yr3xw— Elon Musk (@elonmusk) December 8, 2025ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది?
చాట్జీపీటీలో ప్రకటనలు..?
ఓపెన్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీలో ప్రకటనలు రాబోతున్నాయని ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దాంతో ఓపెన్ఏఐ అధికారికంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి చాట్జీపీటీ యాప్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ నిక్ టర్లీ రంగంలోకి దిగి స్పష్టతనిచ్చారు.ఇటీవలి వారాల్లో చాట్జీపీటీ సంభాషణల్లో యాడ్ ప్యానెళ్లు కనిపిస్తున్నాయని కొందరు వినియోగదారులు పేర్కొంటూ, స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటిని ఖండిస్తూ నిక్ టర్లీ ఎక్స్లో లో ఒక పోస్ట్ చేశారు. ‘చాట్జీపీటీలో ప్రకటనల పుకార్ల గురించి చాలా వార్తాలొస్తున్నాయి. వీటిని నమ్మొద్దు. ఎలాంటి ప్రకటన టెస్ట్లు కంపెనీ నిర్వహించలేదు. మీరు చూసిన స్క్రీన్ షాట్లు నిజమైనవి కావు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్🚨 OpenAI has denied the rumors of testing advertisements inside its popular AI chatbot, ChatGPT. pic.twitter.com/vbs3vH8krz— Indian Tech & Infra (@IndianTechGuide) December 7, 2025
భారత్లో స్టార్లింక్ ధరలు ఖరారు
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ఎక్స్ భారతదేశంలో ప్రారంభించనున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల ధరలను అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడానికి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శాటిలైట్ ద్వారా నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించే ఈ ప్రీమియం సేవను భారతదేశ మార్కెట్లో త్వరలో మొదలు పెట్టనున్నారు.ధరల వివరాలునెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు: రూ.8,600. ఇది ప్రతి నెల సేవలను అందింస్తున్నందుకు వినియోగదారులు చెల్లించే రుసుం.వన్-టైమ్ హార్డ్వేర్ కిట్ ఖర్చు: రూ.34,000. ఇది తొలిసారిగా చెల్లించాల్సిన పరికరాల ధర.హార్డ్వేర్ కిట్లో ఏముంటాయి?రూ.34,000 వన్-టైమ్ ఖర్చుతో వచ్చే ఈ కిట్లో శాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. దీనిని ఇన్స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు స్టార్లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సముదాయానికి కనెక్ట్ అవుతారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.దీని లక్ష్యం..భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఫైబర్ లేదా మొబైల్ నెట్వర్క్లు బలహీనంగా ఉన్న చోట ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం ద్వారా డిజిటల్ సర్వీసులు మెరుగుపరవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న వ్యాపారాలు డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించవచ్చు. వెనుకబడిన కమ్యూనిటీలకు ఆన్లైన్ విద్యను తీసుకురావడం ద్వారా విద్యా అవకాశాలను మెరుగవుతాయి.మార్కెట్ సవాళ్లుసాధారణంగా భారతదేశంలో సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ సేవలు నెలకు రూ.500 నుంచి రూ.1,500 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్లింక్ నెలకు రూ.8,600 ధర వసూలు చేయడంతో ఎంతమేరకు సబ్స్క్రైబర్లు వస్తారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?
పర్సనల్ ఫైనాన్స్
అతిపెద్ద ఆర్థిక పతనం వస్తోంది.. ఇది ఎనిమిదో పాఠం
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పతనం” దిశగా సాగుతోందని సోషల్ మీడియాలో వరుస పోస్ట్లు చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెబుతున్నారు. అందులోభాగంగా ఎనిమిదో పాఠాన్ని తాజాగా ‘ఎక్స్’లో పంచుకున్నారు.చరిత్ర చూడండి..ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.ఈ పరిణామాలు ప్రపంచాన్ని “రుణ ఆర్థిక వ్యవస్థగా” మార్చాయని, దీని ఫలితంగా అమెరికా జపాన్ వంటి దేశాలు భారీ రుణభారంతో సతమతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డునపడుతున్నారన్నారు.కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం వెండి విదేశాల్లో నిల్వ చేస్తానని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణెం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకొనే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుందని అన్నారు.ఫెడ్ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలంప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వ్నేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి లను “దేవుని సొమ్ము”గా.. బిట్కాయిన్, ఈథీరియంను “ప్రజల డబ్బు”గా కియోసాకి అభివర్ణించారు.ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా, సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని కియోసాకి పునరుద్ఘాటించారు. “వాళ్లే విజేతలు” అని, “ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది” అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు.స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడంలేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికివారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ, బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ, రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళన ఉన్న పలువురికి ఆయన సందేశం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. LESSON # 8: How you can get richer as the world economy collapses.CRASHES do not happen over night.CRASHES take decades to occur.For Example:Silver crashed in 1965: when the US government turned silver coins into fake coins…. Violating Greshams Law which stated when…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 10, 2025
22..? 24..? ఏది మంచిది?
ఫైనాన్షియల్ వ్యవహారాలపై చాలామందికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. దాంతో పెద్దగా రాబడులు రాని విధానాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో భారీగా నష్టపోతుంటారు. ఈక్రమంలో ఏది మేలో.. ఏది కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంగారం, బ్యాంకులు, రియల్టీ, స్టాక్ మార్కెటు, మ్యూచువల్ ఫండ్స్.. వంటి ఎన్నో సాధనాల్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి చాలానే ప్రశ్నలుంటాయి. వీటిలో కొన్నింటిపై నిపుణులు ఇస్తున్న సమాధానాలు చూద్దాం.బంగారంతరచూ బంగారంలో 22 కేరెట్లు, 24 కేరెట్లు అంటుంటారు కదా! ఏది మంచిది?ఆభరణాల కోసమైతే 22 కేరెట్ల బంగారాన్ని కొంటే సరిపోతుంది. అలాకాకుండా ఇన్వెస్ట్ చేయడానికైతే 24 కేరెట్ల బంగారమే బెటర్. దీన్లో తరుగు ఉండదు కాబట్టి స్వచ్ఛమైన 24 కేరెట్ల బంగారమైతే ఎప్పుడు విక్రయించినా అప్పుడు మార్కెట్లో ఉన్న రేటు మనకు లభిస్తుంది. సాధారణంగా కాయిన్లు, బిస్కెట్ల వంటివి 24 కేరెట్లలోనే లభిస్తుంటాయి. ధర కూడా 22 కన్నా 24 కేరెట్లు కాస్త ఎక్కువ ఉంటుంది. కొందరైతే ఆభరణాల కోసం 18 కేరెట్ల బంగారాన్ని కూడా వాడతారు. ఇది మరికొంత చౌక.స్టాక్ మార్కెట్లు..ఈ ఏడాది చాలా ఐపీఓలు వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఇలాగే రావచ్చేమో. మరి 2026లో ఐపీఓల్లో పెట్టుబడి పెట్టవచ్చా?ఈ మధ్య కాలంలో చాలా ఐపీఓలు అత్యధిక ధర వద్ద ఇష్యూకు వస్తున్నాయి. లిస్టింగ్ నాడు లాభాలొస్తున్నా... అది దైవాదీనమనుకోవాలి. ఎందుకంటే చాలా ఐపీఓలు లిస్ట్ అయిన నెల–రెండు నెలలకే నేల చూపులు చూస్తున్నాయి. కాబట్టి ఏ ఐపీఓలో పెట్టుబడి పెట్టినా కంపెనీ ఫండమెంటల్స్ చూడండి. ఫండమెంటల్స్ బాగుండి, ఆ వ్యాపారానికి భవిష్యత్ ఉందనిపిస్తే పెట్టండి. దీర్ఘకాలానికైనా పనికొచ్చేలా ఉండాలి.రియల్టీ..నేనో స్థలం కొందామనుకుంటున్నాను. గేటెడ్ కమ్యూనిటీలో అయితే మంచిదా... లేకపోతే మామూలు సింగిల్గా ఉండే ప్లాటయితే మంచిదా?ప్లాట్ల విషయానికొచ్చినపుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉండే స్థలానికున్న రక్షణ బయట సింగిల్గా ఉండే స్థలాలకు ఉండదు. కబ్జాలకు అవకాశం తక్కువ. కాకపోతే స్థలమన్నది ఎక్కడ కొన్నా ముందుగా చెక్ చేసుకుని కొనటం తప్పనిసరి. గేటెడ్ అయితే రీసేల్ కాస్త సులువుగా అవుతుంది. దీనికోసం 10–20 శాతం ధర ఎక్కువ పెట్టాల్సి వచ్చినా పర్వాలేదు. బ్యాంకింగ్..నేను భవిష్యత్ లక్ష్యాల కోసం క్రమానుగత ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేయటం మంచిదా... మ్యూచువల్ ఫండ్స్ మంచివా? దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసేటపుడు మ్యూచ్వల్ ఫండ్స్ను ఎంచుకోవటమే సరైన నిర్ణయం అనిపిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి షేర్ మార్కెట్కు ఉంటుంది. పైపెచ్చు ఆర్డీతో పోలిస్తే దీర్ఘకాలానికి ఫండ్లే మంచి రాబడినిస్తాయి. ఆర్డీ సురక్షితమే అయినా రాబడి తక్కువ. స్వల్పకాలానికైతే అది మంచిది.ఫండ్స్...నేను మ్యూచువల్ పండ్స్లో పెట్టుబడి పెడుతున్నాను. ప్రస్తుతం నా పోర్ట్ఫోలియోలో 22 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇది మంచిదేనా? అసలు ఎన్ని ఫండ్స్ ఐతే బెటర్?వాస్తవానికి అన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని ఫండ్ల పనితీరూ ఒక్కలా ఉండదు. ఇలా పెట్టడమంటే షేర్లలో పెట్టినట్లే. షేర్లలో పెట్టుబడి పెడితే రిస్కు ఎక్కువనే కదా మీరు మ్యూచువల్ ఫండ్లు ఎంచుకున్నది. మరి ఇన్ని ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే అన్నింటి పనితీరునూ ఎప్పటికపుపడు గమనిస్తూ వెళ్లగలరా? అందుకే నా సూచనేమిటంటే కనిష్టంగా 3, గరిష్ఠంగా 5 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.ఇన్సూరెన్స్...క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే ఏంటి? ఎంతవరకూ ఉపకరిస్తుంది? అది తీసుకోవటం మంచిదేనా? మంచిదే. మీ ఆరోగ్య బీమా ప్రీమియానికి కొంత మొత్తాన్ని జోడించటం ద్వారా ఈ రైడర్ను తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కేన్సర్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, మేజర్ అవయవ మారి్పడి వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాస్తవంగా ఆసుపత్రి బిల్లు ఎంతయిందనే అంశంతో సంబంధం లేకుండా ఇన్సూర్ చేసిన మొత్తాన్ని కంపెనీ మీకు చెల్లించేస్తుంది. ఆ మొత్తాన్ని మీరు చికిత్సకు, రికవరీకి, ఈ మధ్యలో చెల్లించాల్సిన ఈఎంఐల వంటి ఖర్చులు వాడుకోవచ్చు. ఊహించని వ్యాధులొచ్చినపుడు ఈ రైడర్ వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటమనేది తప్పుతుంది. కాబట్టి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ను తీసుకోవటం సరైనదే.ఇదీ చదవండి: ఇండిగో కొంప ముంచింది ఇదే..
అంత క్యాష్ కనిపించిందా.. కొరడానే!
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ మార్పులు వ్యక్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ నిర్వహించే రోజువారీ నగదు ప్రవాహంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.కొత్త నిబంధనల ప్రకారం, లెక్కల్లో చూపని నగదుపై జరిమానాలు, సర్ఛార్జీలు, సెస్సులు కలిసి మొత్తం 84% వరకు పన్ను భారం పడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించారు.అహుజా పేర్కొన్నట్లుగా, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా స్వాధీనం సందర్భాల్లో వ్యక్తి వద్ద లెక్కలు లేని నగదు పట్టుబడితే ఈ అధిక పన్ను రేటు వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త మార్పుల నేపథ్యంలో ఇటు వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు నగదు వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.కొత్త నిబంధనలు ఇవే..కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తాల నగదు లావాదేవీలను నిశితంగా పర్యవేక్షించనున్నాయి.ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.రూ. 20 లక్షలకు పైగా ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు తక్షణమే టీడీఎస్ (TDS) కట్ చేస్తాయి.తరచుగా పెద్ద మొత్తాల నగదు ఉపసంహరణలు జరిగితే, వాటి మూలం అనుమానాస్పదంగా కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా జప్తు చర్యలు కూడా ప్రారంభించవచ్చు.వీటికి 100% జరిమానా తప్పదుకొన్ని ప్రత్యేక నగదు లావాదేవీలపై ఇకపై 100 శాతం జరిమానా వర్తించనుంది. అటువంటి లావాదేవీలు ఇవే..స్థిరాస్తి విక్రయం సమయంలో రూ. 20,000 కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే, ఆ మొత్తంపైనే 100% జరిమానా ఉంటుంది.ఒకే రోజులో ఒక కస్టమర్ నుండి రూ. 2 లక్షలకు పైగా నగదు అందుకుంటే ఆ మొత్తంపైనే జరిమానా విధిస్తారు.వ్యక్తులు నగదు రూపంలో రుణాలు పొందడం ఇకపై పూర్తిగా నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే రుణ మొత్తం అంతటిపై 100% జరిమానా పడుతుంది.ఈ జాగ్రత్తలు అవసరంప్రభుత్వం కట్టుదిట్టమైన నగదు నియంత్రణ వ్యవస్థను నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరంపెద్ద మొత్తాల నగదు లావాదేవీలు తప్పకుండా బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా జరపాలి.నగదు రసీదులు స్పష్టమైన ఆధారాలతో ఉండాలి.అక్రమ, లెక్కల్లో లేని నగదు ఖచ్చితంగా గణనీయమైన పన్ను భారం, జరిమానాలు తెచ్చిపెడుతుంది.
Income Tax: అక్విజిషన్ డేటు V/S రిజిస్ట్రేషన్ డేటు
ఎన్నో స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో ఇదొక సమస్య. ఈ విషయంలో ఎన్నో వివాదాస్పదమైన చర్చలు, సంభాషణలు జరిగాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ. చట్టరీత్యా చెయ్యాలి. అలా చేసిన తర్వాతే కొనుక్కునే వారికి హక్కు ఏర్పడుతుంది. అందుకని రిజిస్ట్రేషన్ డేటునే ప్రాతిపదికగా తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ తేదీ నాడే హక్కు సంక్రమిస్తుంది. హోల్డింగ్ పీరియడ్.. అంటే ఆ సదరు ఆస్తి ఎన్నాళ్ల నుంచి ఆ వ్యక్తి వద్ద ఉంది అనేది. కొన్న తేదీ అలాగే అమ్మిన తేదీ .. ఈ రెండూ కూడా ఒప్పందం/అగ్రిమెంట్/డీడ్ ప్రకారం రిజిస్ట్రేషన్ తేదీలే. ఈ మధ్య వ్యవధిని హోల్డింగ్ పీరియడ్ అంటారు. ఇక కొనుగోలు తేదీ నుంచి అమ్మకపు తేదీల మధ్య వ్యవధి .. దీన్ని నిర్ణయించడానికి రిజిస్ట్రేషన్ తేదీనే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ హోల్డింగ్ పీరియడ్.. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో 2 సంవత్సరాలు దాటితే దీర్ఘకాలికం. రెండు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే స్వల్పకాలికం అంటారు. దీర్ఘకాలికం అయితే ఒక రకమైన పన్ను రేటు ఉంటుంది. (రెసిడెంటుకి 20 శాతం, నాన్ రెసిడెంటుకి 12.5 శాతం) స్వల్పకాలికం అయితే, ఇతర ఆదాయాలతో కలిసి శ్లాబుల ప్రకారం రేట్లు విధిస్తారు. హోల్డింగ్ పీరియడ్ కాకుండా కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ లెక్కించడానికి అక్విజిషన్ డేటును ప్రాతిపదికగా తీసుకుంటారు.ఈ మేరకు ఎన్నో ట్రిబ్యునల్స్, కోర్టులు కూడా రూలింగ్ ఇచ్చాయి. వీటి సారాంశం ఏమిటంటే .. కొన్న వ్యక్తి మొత్తం ప్రతిఫలం చెల్లించి, ఆ ఆస్తిని తీసుకుని అనుభవిస్తున్నారు. అనుభవించడం అంటే తాను ఆ ఇంట్లో ఉండటం గానీ లేదా అద్దెకి ఇచ్చి.. ఆ అద్దెని ఇన్కం ట్యాక్స్ లెక్కల్లో చూపించినట్లయితే గానీ అని అర్థం. అయితే, ఏదో ఒక కారణం వల్ల రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ పెండింగ్లో పడింది. అలాంటప్పుడు అలాట్మెంట్నే పరిగనలోకి తీసుకుంటారు. సుప్రీం కోర్టు: సీఐటీ వర్సెస్ ఘన్శ్యామ్ 2009 రాజస్తాన్ హైకోర్టు: సీఐటీ వర్సెస్ రుక్మిణీ దేవి 2010.పైన చెప్పిన కేసుల్లో ఈ విషయాన్ని నిర్ధారించారు. వీటి సారాంశం ఏమిటంటే ఏ తేదీన అయితే స్వాధీనపర్చుకున్నారో, అంటే డేట్ ఆఫ్ అక్విజిషన్, ఆ తేదీనే రిజి్రస్టేషన్ తేదీగా పరిగణిస్తారు. కాబట్టి డేట్ ఆఫ్ అక్విజిషన్ ముఖ్యం. ఇక అలాట్మెంట్ డేట్ వేరు. ముఖ్యంగా సొసైటీల్లో, డెవలప్మెంట్ అథారిటీపరంగా ఎన్నెన్నో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఫలితంగా అలాట్మెంట్ జరుగుతుంది.. అక్విజిషన్ కూడా జరుగుతుంది.. కానీ న్యాయపరమైన చిక్కులు, కోర్టు లిటిగేషన్స్ వల్ల చట్టపరంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్ సంవత్సరాల తరబడి వాయిదా అవుతుంది. బేరసారాలు జరిగి, అగ్రిమెంటు ప్రకారం ప్రతిఫలం ఇచ్చి అక్వైర్ (acquire) చేసుకున్నా, రిజి్రస్టేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. పెండింగ్ పడిపోతుంది. ఇదొక సాంకేతిక సమస్య తప్ప న్యాయపరమైనది లేదా హక్కులపరమైన సమస్య కాదు.అందుకని హోల్డింగ్ పీరియడ్కి, కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్కి డేట్ ఆఫ్ అక్విజిషన్నే ప్రాతిపదికగా తీసుకుంటారు. క్రయవిక్రయాలు చేసే ముందు, లింక్ డాక్యుమెంట్లు, దస్తావేజులను క్షుణ్నంగా చదవాలి. అప్పుడే ముందడుగు వేయాలి. మరొక జాగ్రత్త. సేల్ డీడ్లో మార్కెట్ విలువను ప్రస్తావిస్తారు. ప్రతిఫలం కన్నా మార్కెట్ విలువ ఎక్కువ ఉంటే, మార్కెట్ విలువనే అమ్మకపు విలువగా తీసుకుంటారు. తగిన జాగ్రత్త వహించండి.


