Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Top 10 Philanthropists in India Know The Latest Report1
శివ్ నాడార్.. జాబితాలో అంబానీ కంటే ముందు: రూ.2708 కోట్లు..

భారతదేశంలోని బిలియనీర్లు డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. దానం చేయడంలో కూడా ముందున్నారు. హురున్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. 2025లో దేశంలోని ధనవంతులు రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ విరాళాలు గత ఏడాదికంటే 85 శాతం ఎక్కువ కావడం గమనార్హం.హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ & కుటుంబం.. ఏడాదిలో రూ. 2,708 కోట్ల విరాళాలు ఇచ్చి, నాల్గవసారి భారతదేశ అత్యంత ఉదారవాది అనే బిరుదును నిలుపుకున్నారు. నాడార్ రోజుకు రూ. 7.4 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్య, కళలు, సంస్కృతి వంటిని ప్రోత్సహించే శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా డబ్బును ఖర్చు చేశారు.జాబితాలోని ఈ ఏడాది.. టాప్ 10 దాతలు సమిష్టిగా రూ. 5,834 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది గత సంవత్సరం కంటే 26 శాతం ఎక్కువ, అంటే మొత్తం విరాళాలలో 56 శాతం అన్నమాట. జాబితాలో రెండో స్థానంలో ముకేశ్ అంబానీ & ఫ్యామిలీ ఉంది.కుటుంబం & విరాళాలు➤శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2708 కోట్లు➤ముకేశ్ అంబానీ & ఫ్యామిలీ: రూ. 626 కోట్లు➤బజాజ్ ఫ్యామిలీ: రూ. 446 కోట్లు➤కుమార్ మంగళం బిర్లా & కుటుంబం: రూ. 440 కోట్లు➤గౌతమ్ అదానీ & ఫ్యామిలీ: రూ. 386 కోట్లు➤నందన్ నీలేకని: రూ. 365 కోట్లు➤హిందుజా ఫ్యామిలీ: రూ. 298 కోట్లు➤రోహిణి నీలేకని: రూ. 204 కోట్లు➤సుధీర్ & సమీర్ మెహతా: రూ. 189 కోట్లు➤సైరస్ & ఆడారు పూనావాలా: రూ. 173 కోట్లుThe Top 10 philanthropists in the EdelGive Hurun India Philanthropy List 2025 donated INR 5,834 Cr — up 26% YoY, forming 56% of India’s total giving.Shiv Nadar & family lead with INR 2,708 Cr, followed by Mukesh Ambani & family, Bajaj family, Kumar Mangalam Birla & family. pic.twitter.com/kS2ZVxlCW4— HURUN INDIA (@HurunReportInd) November 6, 2025

TCS Techie Gets Increment Of Rs 422 Per Month After Working 4 Years Redditt Post  2
టీసీఎస్‌ షాకింగ్‌ శాలరీ.. నెలకు రూ.422 పెరిగితే..

ఒక టీసీఎస్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాలుగేళ్లకు పైగా పనిచేసిన తనకు ఈ సంవత్సరం నెలకు కేవలం రూ.422 ఇంక్రిమెంట్ మాత్రమే వచ్చిందని అతను పేర్కొన్నారు. “టీసీఎస్ నాకు 4 సంవత్సరాల తర్వాత రూ.422 పెంపు ఇచ్చింది..” అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు.2021లో కంపెనీలో చేరినట్లు పేర్కొన్న రెడిటర్‌ .. “ఇది నా చెడు నిర్ణయాల ఫలితం” అని పేర్కొంటూ, తాను సపోర్ట్‌ ప్రాజెక్ట్‌లో పనిచేశానని, అక్కడ “జీరో లెర్నింగ్, జీరో గ్రోత్, అంతులేని అరుపులు, మైక్రోమేనేజ్మెంట్” ఉండేదని రాసుకొచ్చారు. తన పెంపు ఆరు నెలల ఆలస్యంగా వచ్చిందని, ఈ పరిస్థితుల్లో టీసీఎస్ వంటి సంస్థలు “పల్లీలు కొనుక్కునే చెల్లింపులు” ఇస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన “మీ విలువ తెలుసుకోండి” అని టీసీఎస్ ఉద్యోగులు, ఫ్రెషర్లకు సూచించారు.వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విస్తృతంగా స్పందించారు. ‘ఇంక్రిమెంట్ దారుణంగా ఇవ్వడంతో నేను 7 సంవత్సరాల తర్వాత టీసీఎస్ వీడాను’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. ఈ సంవత్సరం తనకు జీరో హైక్‌ వచ్చిందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “ఐటీని విడిచిపెట్టడం ఉత్తమ మార్” అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.ఇక టీసీఎస్ కూడా ఈ ఘటనపై స్పందించింది. “వ్యక్తిగత కేసులపై మేం వ్యాఖ్యానించం. కానీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నవి అవాస్తవాలు” అని టీసీఎస్‌ ప్రతినిధి పేర్కొన్నారు. “సెప్టెంబర్ 1 నుంచి మా ఉద్యోగుల 80% మందికి వేతన సవరణలు అమలయ్యాయి. సగటు ఇంక్రిమెంట్ 4.5% నుంచి 7% మధ్య ఉంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల పెంపు ఇచ్చాం” అని తెలిపారు

Tata Motors To Gift New Sierra To India Women World Cup Winners3
విశ్వవిజేతలకు టాటా మోటార్స్ అదిరిపోయే గిఫ్ట్!

ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన ఇండియా ఉమెన్స్ టీమ్.. ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. ఈ తరుణంలో టాటా మోటార్స్ వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జట్టులోని సభ్యులకు ఒక్కొక్కరికి.. ఒక్కో సియెర్రా కారును గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.టాటా మోటార్స్.. తన సియెర్రా కారును నవంబర్ 25న దేశీయ విఫణిలో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఇది 5 డోర్స్ మోడల్. కాబట్టి కుటుంబ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, సొగసైన డోర్ హ్యాండిల్స్ పొందుతుంది.టాటా సియెర్రా.. మూడు స్క్రీన్ లేఅవుట్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్ పొందుతుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం సెంట్రల్ టచ్‌స్క్రీన్, ముందు ప్రయాణీకుడి కోసం అదనపు స్క్రీన్ వంటివి ఉన్నాయి. సరికొత్త స్టీరింగ్ వీల్ కూడా పొందుతుంది. ఈ కారు పసుపు, ఎరుపు రంగుల్లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: హీరో ఎలక్ట్రిక్ కారు: నానో కంటే చిన్నగా!టాటా సియెర్రా యొక్క పవర్‌ట్రెయిన్ గురించి.. కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది పెట్రోల్ & డీజిల్ ఇంజిన్‌ ఎంపికలతో లభించనుంది. అయితే ప్రస్తుతం హారియర్ & సఫారీ మోడళ్లలోని 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఎంపికలే.. సియెర్రాలో కూడా ఉంటాయని సమాచారం. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో మాన్యువల్ & ఆటోమేటిక్ ఉండనున్నాయి.

Hero Unveils New Electric Car Concept At EICMA 2025 Automobile4
హీరో ఎలక్ట్రిక్ కారు: నానో కంటే చిన్నగా!

ఇప్పటి వరకు టూ వీలర్స్ లాంచ్ చేసిన హీరోమోటోకార్ప్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఫోర్ వీలర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. NEX 3ను EICMA 2025 వేదికపై ఆవిష్కరించింది. ఇది చూడటానికి.. పరిమాణం పరంగా నానో కారు మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఇది ఎలక్ట్రిక్ కారు కావడంతో.. కొంత భిన్నంగా, చిన్నదిగా ఉంటుంది.హీరో మోటోకార్ప్ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ కేవలం.. ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే అనుమతిస్తుంది. అంటే డ్రైవర్, పిలియన్ మాదిరిగా అన్నమాట. నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రయాణానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: 42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!హీరో మోటోకార్ప్.. EICMA 2025 వేదికపై NEX 3తో పాటు.. VIDA విభాగం రెండు కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఆవిష్కరించారు. అంత కాకుండా.. హీరో బ్రాండ్ యూరోపియన్ మార్కెట్లోకి అధికారిక ప్రవేశాన్ని సూచించే అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన VIDA VX2 ను కూడా విడుదల చేశారు. అదనంగా.. కంపెనీ VIDA DIRT.E సిరీస్‌ను ఆవిష్కరించింది. వీటిలో 4 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం DIRT.E K3 & అధిక పనితీరు గల DIRT.E MX7 రేసింగ్ కాన్సెప్ట్ ఉన్నాయి.

Gold Sovereign Bond Redemption 317pc Returns5
‘బాండ్‌’ బంగారం.. మూడు రెట్లు లాభం!

బంగారంపై పెట్టుబడులంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ లోహం రూపంలో పసిడిని కొనడం కొందరికి ఇష్టం ఉండదు. అలాంటివారి కోసం పెట్టుబడి అవకాశంగా ప్రభుత్వం తీసుకొచ్చినదే సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకం (SGB). అలా సావరిన్ గోల్డ్ బాండ్స్ 2017–18 సిరీస్ VIలో పెట్టుబడిపెట్టినవారికి ఇప్పుడు మూడు రెట్లకు పైగా లాభం వస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రాముకు రూ.12,066 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. అంటే 8 సంవత్సరాల కాలంలో 317 శాతం లాభం అన్నమాట.2017 నవంబర్‌లో గ్రాముకు రూ.2,945 వద్ద జారీ చేసిన బాండ్లు ఇ‍ప్పుడు రూ. 9,171 లాభాన్ని ఇచ్చాయి. దీనికి ఆర్నెళ్లకోసారి చెల్లించే 2.5% వార్షిక వడ్డీ అదనం. 2025 అక్టోబర్ 31, నవంబర్‌ 3, 4 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం సగటు ముగింపు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా రిడంప్షన్ ధరను నిర్ణయించారు.ఏమిటీ సావరిన్ గోల్డ్ బాండ్స్?బంగారం దిగుమతులను తగ్గించడంతోపాటు.. పసిడిపై పెట్టుబడులను డిజిటల్‌వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్‌ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్‌ అయింది. కానీ, బంగారం దిగుమతులు మాత్రం తగ్గలేదు.ఎస్‌జీబీలకు (Sovereign Gold Bonds) ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ఎస్‌జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. దీంతో సావరిన్‌ గోల్డ​్‌ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపేసింది.కాగా సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 2017–18 సిరీస్ IVలో పెట్టుబడిపెట్టినవారు గత అక్టోబర్‌లో తుది రిడంప్షన్‌ను అందుకున్నారు. ఆ సిరీస్‌ బాండ్లకు ఆర్బీఐ గ్రాముకు రూ.12,704 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. 2017–18 సిరీస్ IV మదుపరులు 8 ఏళ్ల కాలంలో 325 శాతం రాబడిని పొందారు.

Central Banks Buying 39000 kg Gold in September 2025 World Gold Council Report6
39 టన్నుల బంగారం: అందుకే డిమాండ్!

భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. నేడు (నవంబర్ 06) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.21 లక్షల వద్ద ఉంది. రేటు పెరగడానికి ప్రధాన కారణం.. పండుగ సీజన్ మాత్రమే కాదు. వివిధ దేశాల బ్యాంకులు ఎక్కువ మొత్తంలో పసిడి కొనుగోలు చేయడం కూడా.. అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది.2025 సెప్టెంబర్ నెలలో కేంద్ర బ్యాంకులు గరిష్టంగా 39 టన్నుల (39,000 కేజీలు) బంగారం కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఈ ఏడాది మొత్తంలో గోల్డ్ కొనుగోళ్లు సెప్టెంబర్‌లో జరిగినట్లు సమాచారం. కాగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం 634 టన్నులు కావడం గమనార్హం.సెప్టెంబర్ 2025లో.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ 15 టన్నుల గోల్డ్ కొనుగోలు చేయగా.. బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా 6 టన్నులు కొనుగోలు చేసింది. రష్యా బ్యాంక్ 3 టన్నులు, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజికిస్థాన్ 8 టన్నుల బంగారం కొనేసింది. టర్కీ బ్యాంక్ మాత్రం 2 టన్నుల పసిడి కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడంతో.. పసిడికి డిమాండ్ అమాంతం పెరిగిందని గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.ఇదీ చదవండి: ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!తగ్గుతున్న గోల్డ్ రేటు - కారణాలుసెంట్రల్ బ్యాంకుల విషయాన్ని పక్కనపెడితే.. పెట్టుబడిదారులు కూడా బంగారం సురక్షితమైన పెట్టుబడి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ ధరలను పెంచేసింది. అయితే ప్రస్తుతం గోల్డ్ రేటు కొంత తగ్గుముఖం పట్టింది. దీనికి కారణం.. అమెరికా డాలర్ బలపడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం, రాజకీయ పరిస్థితులు అని తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement