Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Reliance Jio introduced cheapest plan for 28 days1
జియో కొత్త ప్లాన్‌ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోకు కొత్త, చాలా తక్కువ ధర ప్లాన్‌ను జోడించింది. బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ ను లాంచ్ చేసింది. రూ.189 విలువైన ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 2 జీబీ హైస్పీడ్ డేటా, 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు 28 రోజుల పాటు లభిస్తాయి. తక్కువ ఖర్చుతో నెలంతా ఫోన్ యాక్టివ్ గా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్.ఈ జియో ప్లాన్ అన్‌లిమిటెడ్‌ కాలింగ్, తక్కువ డేటా ఉపయోగించేవారికి మాత్రమే కాకుండా, ఓటీటీ కంటెంట్ ఇష్టపడేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. అంటే వినోదం, డిజిటల్ స్టోరేజ్ అవసరాలను కూడా తీరుస్తుందన్న మాట.సెకండరీ సిమ్ ఉన్న లేదా తక్కువ ఇంటర్నెట్ ఉపయోగించే కస్టమర్ల కోసం ఈ వాల్యూ ప్యాక్ ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ కేవలం రూ.189కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. రూ.189తో 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

HDFC Bank raises service charges for savings salary customers2
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త రూల్స్‌.. ఛార్జీలు పెంపు

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవింగ్స్, శాలరీ, ఎన్‌ఆర్‌ ఖాతాదారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సేవలపై ఛార్జీలను పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తన బ్రాంచ్‌లలో ఫిజికల్‌గా అందించే సేవలకు సంబంధించి ఛార్జీలను సవరించి కొత్త రేట్లను ప్రకటించింది. ముఖ్యంగా నగదు లావాదేవీలు, సర్టిఫికెట్ సేవలు, పాత రికార్డుల ప్రతులు, ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింపుముందుగా నగదు లావాదేవీల ఉచిత పరిమితిలో కీలకమైన మార్పు జరిగింది. ఇంతకు ముందు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలు ఉండేవి. వాటి మొత్తం పరిమితి రూ.2 లక్షలు. ఇప్పుడు అదే నాలుగు లావాదేవీలు ఉచితంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తం పరిమితిని రూ.1 లక్షకు తగ్గించారు. అంటే ఖాతాదారులు నెలకు రూ.1 లక్ష వరకు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఆ పరిమితిని మించితే, ప్రతి అదనపు లావాదేవీకి రూ.150 ఛార్జీ వసూలు చేయనున్నారు.కొత్త ఛార్జీలుఅలాగే బ్యాలెన్స్ సర్టిఫికెట్, వడ్డీ సర్టిఫికెట్, అడ్రస్ కన్ఫర్మేషన్ వంటి సేవలకు కూడా ఛార్జీలు విధించారు. రెగ్యులర్ కస్టమర్లకు రూ.100, సీనియర్ సిటిజన్లకు రూ.90 చొప్పున వసూలు చేయనున్నారు. ఇదే విధంగా పాత రికార్డులు, పెయిడ్ చెక్కుల కాపీల కోసం రెగ్యులర్ ఖాతాదారులు రూ.80, సీనియర్ సిటిజన్లు రూ.72 చెల్లించాలి. ఇంతకు ముందు ఈ సేవలు ఉచితంగా అందించేవారు. కానీ ఇప్పుడు వాటికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లకూ..ఫండ్ ట్రాన్స్‌ఫర్ సేవల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈసీఎస్‌,ఏసీహెచ్‌ రిటర్న్ ఛార్జీలను సవరించారు. మొదటి రిటర్న్‌కు రూ.450 (సీనియర్ సిటిజన్‌కు రూ.400), రెండవ రిటర్న్‌కు రూ.500 (సీనియర్‌కు రూ.450), మూడవ రిటర్న్ నుంచి రూ.550 (సీనియర్‌కు రూ.500) వసూలు చేయనున్నారు. ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌ వంటి డిజిటల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఛార్జీలను కూడా కొత్త రేట్లతో అమలు చేస్తున్నారు.ఉదాహరణకు, నెఫ్ట్‌ ద్వారా రూ.10,000 లోపు ట్రాన్సాక్షన్‌కు రూ.2, రూ.1 లక్ష వరకు రూ.4, రూ.2 లక్ష వరకు రూ.14, 2 లక్షల పైగా రూ.24 చొప్పున ఛార్జీలు విధించనున్నారు. ఆర్‌టీజీఎస్‌ ద్వారా రూ.2 లక్షలు–రూ.5లక్షలు మధ్య ట్రాన్సాక్షన్‌కు రూ.20, రూ.5లక్షలకుపైగా లావాదేవీకి రూ.45 వసూలు చేస్తారు. ఐఎంపీఎస్‌ ద్వారా రూ.1,000 లోపు ట్రాన్సాక్షన్‌కు రూ.2.50, రూ.1లక్ష లోపు అయితే రూ.5, రూ.1లక్షకు పైగా లావాదేవీకి రూ.15 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి.

Anil Ambani Reliance Infra wins Rs 526 crore arbitration award against Aravali Power3
అనిల్‌ అంబానీకి భారీ విజయం

చాలా ఏళ్ల తర్వాత అనిల్‌ అంబానీకి భారీ విజయం దక్కింది. ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్‌ అవార్డ్‌ (మధ్యవర్తిత్వ పరిహారం) పొందినట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్‌ఫ్రా) తెలిపింది. 2018లో ఆరావళి పవర్ ఓ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంతో మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు‘ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్ మెజారిటీ తీర్పుతో ఆ రద్దు చెల్లదని తేల్చి, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుకూలంగా రూ.526 కోట్లు పరిహార తీర్పును ప్రకటించింది’ ఆర్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. ఈ అవార్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రోత్ క్యాపిటల్ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఏమిటీ వివాదం?రిలయన్స్‌ ఇన్‌ఫ్రాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీసీపీఎల్) 2018లో రద్దు చేసుకుంది. అయితే ఇది అసంబద్ధమంటూ రిలయన్స్ ఇన్‌ఫ్రా మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆరావళి పవర్ రద్దు నోటీసు జారీ చేయడం, అదే సంవత్సరం మధ్యవర్తిత్వాన్ని కూడా కోరడంతో వివాదం ప్రారంభమైంది.ఆర్‌ఇన్‌ఫ్రా సంస్థపై గత ఏడాది డిసెంబర్‌లో పొందిన రూ .600 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారాన్ని అమలు చేయాలని కోరుతూ ఆరావళి పవర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఆర్ఇన్‌ఫ్రా ప్రతిస్పందనను కోరింది.విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ రంగాల్లో నిమగ్నమైన ఆర్‌ఇన్‌ఫ్రా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌లో కీలక సంస్థగా ఉంది. ఆగస్టు 13 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,501 కోట్లుగా ఉంది.

Railways spending 45pc in subsidy on passenger travel4
రైలు టిక్కెట్లపై 45 శాతం సబ్సిడీ

మన దేశంలో అత్యంత చవకైన ప్రజారవాణా అంటే రైల్వేలే! సుదూర ప్రాంతాలకు కూడా చాలా తక్కువ ఖర్చుతో తీసుకెళ్తాయి. ప్రయాణికుల కోసం రైలు సర్వీసులను కూడా ఏటా పెంచుతూ వస్తోంది రైల్వే శాఖ. ఈ క్రమంలో ప్యాసింజర్‌ టిక్కెట్ల మీద ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల సబ్సిడీని అందిస్తోంది.ఉదాహరణకు ప్యాసింజర్‌ రైళ్లు అందిస్తున్న సేవ విలువ రూ.100 అనుకుంటే, టిక్కెట్టు ధర రూ.55 మాత్రమే. మిగతా 45% సబ్సిడీ రైల్వే శాఖే భరిస్తోంది. మరోపక్క రైలు ప్రయాణాల్లో భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చేసే ఖర్చు ఏటా పెరుగుతోంది.కొన్ని గణాంకాలు2019–20లో దేశంలో రోజుకు సగటున నడిచిన ప్యాసింజర్‌ రైళ్ల సంఖ్య 13,169.2024–25లో ఈ ప్యాసింజర్‌ రైళ్ల సంఖ్య 13,940.2025–26లో... 2025 జూలై వరకు ప్రారంభమైన కొత్త రైలు సర్వీసులు 86దేశంలో 2025 ఆగస్ట్‌ 7 నాటికి నడుస్తున్న వందేభారత్‌ రైళ్లు 1442023–24లో ప్యాసింజర్‌ టిక్కెట్ల మీద ఇచ్చిన మొత్తం సబ్సిడీ రూ. 60,466 కోట్లురైలు ప్రయాణాలు, స్టేషన్లలో భద్రతకు సంబంధించి 2023–24లో రైల్వే శాఖ చేసిన వ్యయం రూ. 1,14,022 కోట్లు

BSE Launches India Defence Index5
స్టాక్‌ మార్కెట్‌లో కొత్త ఇండెక్స్‌

బీఎస్‌ఈ ఇండెక్స్‌ సర్వీసెస్‌ విభాగం తాజాగా డిఫెన్స్‌ ఇండెక్స్‌ను ప్రారంభించింది. బీఎస్‌ఈ 1000 ఇండెక్స్‌లోని డిఫెన్స్‌ థీమ్‌ స్టాక్స్‌ ఈ సూచీలో ఉంటాయి. ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్‌లో) ఇండెక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తారు. విధాన సంస్కరణలు, పెరుగుతున్న బడ్జెట్‌ కేటాయింపులు, దేశీయంగా తయారీపై మరింతగా దృష్టి పెరుగుతుండటం తదితర సానుకూల అంశాలతో డిఫెన్స్‌ రంగం గణనీయంగా వృద్ధి చెందనుందని బీఎస్‌ఈ ఇండెక్స్‌ సర్వీసెస్‌ వివరించింది.ఈ నేపథ్యంలో ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్స్‌ మొదలైన ప్యాసివ్‌ ఫండ్స్‌కి ఇండెక్స్‌ ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. అలాగే, పీఎంఎస్‌ వ్యూహాలు, మ్యుచువల్‌ ఫండ్‌ స్కీములు, ఫండ్‌ పోర్ట్‌ఫోలియోల పనితీరు మదింపునకు దీన్ని ప్రామాణికంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.

Top 10 Most Affordable Cars on Sale in India6
భారత్‌లో అత్యంత సరసమైన కార్లు ఇవే!

దేశీయ మార్కెట్లో ఎన్నెన్ని కొత్త కార్లను లాంచ్ అయినా.. కొనుగోలుదారులు మాత్రం సరసమైన వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు తక్కువ ధర వద్ద కూడా కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 అఫర్డబుల్ కార్లు ఏవో చూసేద్దాం.➜మారుతి సుజుకి ఆల్టో కే10: రూ. 4.23 లక్షల నుంచి రూ. 6.21 లక్షలు➜మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: రూ. 4.27 లక్షల నుంచి రూ. 6.01 లక్షలు➜రెనాల్ట్ క్విడ్: రూ. 4.70 లక్షల నుంచి 6.5 లక్షలు➜టాటా టియాగో: రూ. 5 లక్షల నుంచి రూ. 8.85 లక్షలు➜సిట్రోయెన్ సీ3: రూ. 5.25 లక్షల నుంచి రూ. 9.90 లక్షలు➜మారుతి సుజుకి సెలెరియో: రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షలు➜మారుతి సుజుకి ఈకో: రూ. 5.7 లక్షల నుంచి రూ. 6.06 లక్షలు➜మారుతి సుజుకి వ్యాగన్ ఆర్: రూ. 5.79 లక్షల నుంచి రూ. 7.02 లక్షలు➜మారుతి సుజుకి ఇగ్నిస్: రూ. 5.85 లక్షల నుంచి రూ. 8.12 లక్షలు➜హ్యుందాయ్ ఐ10 నియోస్: రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.66 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూం)ఇదీ చదవండి: ఒక్కనెలలో 4300 మంది కొన్న కారు

Advertisement
Advertisement
Advertisement