Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Govt plans Bharat NCAP Style Safety Standards for E Rickshaws Says Nitin Gadkari1
భద్రతే లక్ష్యంగా కొత్త రూల్: నితిన్ గడ్కరీ

ఇప్పటివరకు కార్లకు మాత్రమే న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (NCAP) ద్వారా సేఫ్టీ రేటింగ్ అందించేవారు. అయితే ఈ-రిక్షాలకు భద్రతా ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా చర్యలను పెంపొందించడానికి ఈ చర్యను చేపడుతున్నట్లు ఆయన వివరించారు.ఎఫ్ఐసీసీఐ రోడ్డు భద్రతా అవార్డులు & సింపోజియం 7వ ఎడిషన్‌ కార్యక్రమంలో, మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రోడ్డు భద్రత ఒక ముఖ్యమైన అంశం అని అన్నారు. దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ 1.8 లక్షల మరణాలలో.. దాదాపు 66.4 శాతం మంది 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారే అని ఆయన పేర్కొన్నారు.ఈ-రిక్షాల సంఖ్య భారతదేశంలో ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ ఎన్‌సీఏపీ లాంటి ప్రమాణాలు తీసుకురావలసిన అవసరం ఉంది. ఇది భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నితిన్ గడ్కరీ వివరించారు. 2023లో భారత్ ఎన్‌సీఏపీ ప్రారంభమైంది. ఇది వాహనాల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.రోడ్డు ప్రమాదాలపై మరింత మాట్లాడుతూ.. హెల్మెట్లు ఉపయోగించకపోవడం వల్లే దాదాపు 30,000 మరణాలు సంభవిస్తున్నాయని, సీటు బెల్టులు ఉపయోగించకపోవడం వల్లే 16,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రమాదాలకు కారణాన్ని కనుగొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ఆడిట్‌లు నిర్వహిస్తున్నట్లు గడ్కరీ అన్నారు.ఇదీ చదవండి: ఈ కార్ల ధరలు రూ. 50వేలు తగ్గే అవకాశం..రోడ్డు ప్రమాదాల గురించిరోడ్డు ప్రమాదం ఒక సామాజిక సమస్య. ఇతర రంగాలలో మనం విజయాలను సాధించాము. కానీ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో మాత్రం విజయం సాధించలేకపోతున్నామని గడ్కరీ అన్నారు. ఒకవేళా ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రులకు తీసుకెళ్లాలని ప్రజలను కోరారు, ఎందుకంటే ముందస్తు చికిత్స దాదాపు 50,000 మంది ప్రాణాలను కాపాడుతుందని అన్నారు.

AI Agent Control Tower from Covasant2
కోవాసెంట్‌ నుంచి.. ఏఐ ఏజెంట్‌ కంట్రోల్‌ టవర్‌

కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ తాజాగా ఏఐ ఏజెంట్‌ కంట్రోల్‌ టవర్‌ (ఏఐ–యాక్ట్‌) పేరిట కొత్త టూల్‌ను ఆవిష్కరించింది. వివిధ ఏఐ ప్రోగ్రాంలను (లేదా ఏజెంట్లను) సమన్వయపర్చుకుంటూ, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు ఇది సహాయకరంగా ఉంటుంది.ప్రస్తుతం వివిధ కార్యకలాపాలకు వివిధ ఏఐ ఏజెంట్లను ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం, భద్రతాపరమైన రిస్కులు తలెత్తుతున్నాయని కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఏఐ ఏజెంట్లన్నింటికీ ఏఐ యాక్ట్‌ అనేది ఒక సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌లాగా పని చేస్తుందని ఆయన వివరించారు.

Finfluencer Advises Against Buying A Home In Indian Metros3
'నగరంలో సొంత ఇల్లు.. మీరు చేసే పెద్ద తప్పు'

నగరంలో సొంత ఇల్లు కట్టుకోవాలనుకోవడం లేదా కొనుగోలు చేయాలనుకుకోవడం చాలామంది కల. ఈ కల నెరవేర్చుకోవడానికి ఎన్నెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే కొందరు మాత్రం సొంత ఇల్లు ఉండాలా?, అద్దె ఇంట్లోనే ఉండాలా? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడంలోనే మునిగిపోతారు. ఈ ప్రశ్నకు చాన్నాళ్ల నుంచే వాదోపవాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై తాజాగా ఫిన్‌ఫ్లూయెన్సర్ 'అక్షత్‌ శ్రీవత్సవ' స్పందించారు.''భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇళ్లు కొనడం అంటేనే.. మీరు చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి. ఎందుకంటే ఈ మార్కెట్ మొత్తం బిల్డర్ల నియంత్రణలోనే ఉంటుంది.. కాబట్టి ఇల్లు కొనాలంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మౌలిక సదుపాయాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మీరు ఆ ఇల్లును అమ్మడం కూడా ఒక పెద్ద సవాలు. కాబట్టి అద్దెకు తీసుకోండి, ప్రశాంతంగా జీవించండి'' అని అక్షత్‌ శ్రీవత్సవ అన్నారు. ఒకవేళా ఇల్లు కొనాలంటే.. తప్పకుండా 30 ఏళ్లు నివసించడానికి ఉండే దాన్ని కొనండి అని సూచించారు.ప్రస్తుతం శ్రీవత్సవ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఇంటిని సొంతం చేసుకోవడం వల్ల గణనీయమైన రాబడి వస్తుందని చెబుతున్నారు. సొంత ఇల్లు ఉంటె అద్దె వంటివి తగ్గుతాయని ఇంకొందరు చెబుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఇల్లు కొనడం దీర్ఘకాలిక సంపదను పెంచుతుందని.. స్థిరత్వాన్ని అందిస్తుందని వాదించారు.Buying a property in an Indian Metro is going to be one of your worst mistakes: ---1) Entire market is builder controlled (so you buy very expensive)2) Overdevelopment is causing infrastructure issues (so the cities are becoming unlivable)3) With constant new developments,…— Akshat Shrivastava (@Akshat_World) September 2, 2025

Top 10 Richest People in Delhi4
ఢిల్లీ కుబేరులు.. ఇదిగో టాప్ 10 జాబితా

ఢిల్లీ భారతదేశానికి రాజధాని నగరం. ఇది రాజకీయాలకు, వ్యాపారాలకు ప్రధాన కేంద్రం కూడా. ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఎక్కువ మంది ధనవంతులు నివసిస్తున్న నగరాల్లో కూడా ఢిల్లీ స్థానం సంపాదించుకుంది. ఈ కథనంలో ఢిల్లీలోని అత్యంత ధనవంతులు ఎవరు?, వారి నెట్‌వర్త్ ఎంత అనే విషయాలు తెలుసుకుందాం.➤శివ్ నాడార్: 40.2 బిలియన్ డాలర్లు➤సునీల్ మిట్టల్ & కుటుంబం: 30.7 బిలియన్ డాలర్లు➤రవి జైపురియా: 17.3 బిలియన్ డాలర్లు➤బర్మన్ కుటుంబం: 10.4 బిలియన్ డాలర్లు➤కపిల్ & రాహుల్ భాటియా: 10.1 బిలియన్ డాలర్లు➤వినోద్, అనిల్ రాయ్ గుప్తా & కుటుంబం: 9.5 బిలియన్ డాలర్లు➤వివేక్ చాంద్ సెహగల్ & కుటుంబం: 8.9 బిలియన్ డాలర్లు➤విక్రమ్ లాల్ & కుటుంబం: 8.8 బిలియన్ డాలర్లు➤కులదీప్ సింగ్ & గుర్బచన్ సింగ్ ధింగ్రా: 7.5 బిలియన్ డాలర్లు➤రమేష్, రాజీవ్ జునేజా & కుటుంబం: 7 బిలియన్ డాలర్లుఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?పైన వెల్లడించిన లిస్టులో ఉన్న ప్రముఖులు ఢిల్లీలో మాత్రమే కాదు.. ప్రపంచ ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. వీరందరూ పారిశ్రామిక రంగంలో తమదైన ముద్రవేసి, ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2025 ఆగస్టులో ఢిల్లీలో జీఎస్టీ వసూళ్లు రూ. 5725 కోట్లు అని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే.. దేశ ఆర్ధిక వృద్ధికి ఢిల్లీ ఎంత ముఖ్యమైన నగరమో అర్థం చేసుకోవచ్చు.

GST Cut Will Reduce Prices of Alto and Wagon R Says Maruti Chief R C Bhargava5
ఈ కార్ల ధరలు రూ. 50వేలు తగ్గే అవకాశం..

వినియోగ వస్తువులపై పన్నులను తగ్గించడానికి.. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తరువాత ఆల్టో ధర రూ.40000 నుంచి రూ. 50,000 & వ్యాగన్ ఆర్ ధరలు రూ.60,000 నుంచి రూ. 67,000 వరకు తగ్గే అవకాశం ఉందని మారుతి సుజుకి చైర్మన్ 'ఆర్‌ సీ భార్గవ' పేర్కొన్నారు.కార్లను 18 శాతం జీఎస్టీ స్లాబులో చేర్చడం వల్ల ప్యాసింజర్ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతుంది. వడ్డీ రేట్లు తగ్గడం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు అన్నే కూడా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కౌన్సిల్ చిన్న కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?కౌన్సిల్ నిర్ణయం ఆటోమేకర్ల రవాణా ఖర్చులు.. డీలర్ మార్జిన్లపై ప్రభావం చూపదని పరిగణనలోకి తీసుకుంటే కార్ల ధరలు 9 శాతం తగ్గే అవకాశం ఉంది. చిన్న కార్ల మార్కెట్ ఈ సంవత్సరం 10 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు భార్గవ తెలిపారు. కాగా రూ. 20 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లు 5 శాతం స్లాబులో ఉన్నాయి.

Mukesh Ambanis Jio Financial Services raises Rs 3956 crore from promoters6
జియో ఫైనాన్షియల్‌కు భారీగా నిధులు

విస్తరణకు వీలుగా జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీలు తాజాగా రూ. 3,956 కోట్ల పెట్టుబడులు సమకూర్చాయి. ఒక్కో వారంట్‌కు రూ. 316.5 ధరలో కంపెనీ బోర్డు 50 కోట్ల వారంట్లను జారీ చేసింది. వెరసి ప్రమోటర్‌ సంస్థలు సిక్కా పోర్ట్స్‌ అండ్‌ టెర్మినల్స్, జామ్‌నగర్‌ యుటిలిటీస్‌ అండ్‌ పవర్‌కు 25 కోట్లు చొప్పున వారంట్లను అందుకున్నాయి.తద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ ఎన్‌బీఎఫ్‌సీ.. జియో ఫైనాన్షియల్‌ రూ. 3,956 కోట్లు అందుకుంది. ఈ ఏడాది జూలైలో ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు మార్పిడికివీలయ్యే వారంట్ల జారీకి కంపెనీ బోర్డు అంగీకరించిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 15,825 కోట్లు సమీకరించేందుకు ప్రణాళికలు వేసింది.ప్రమోటర్లుగా ముకేశ్‌ అంబానీ కుటుంబంతోపాటు.. ఇతర సంస్థలు ప్రస్తుతం కంపెనీలో ఉమ్మడిగా 47.12 శాతం వాటా కలిగి ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 325 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 418 కోట్ల నుంచి రూ. 619 కోట్లకు జంప్‌ చేసింది.

Advertisement
Advertisement
Advertisement