Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Tata Punch EV Facelift Launched at Rs 9. 69 lakh1
టాటా పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ రెడీ

ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌(పీవీ) కొత్త టాటా పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ప్రారంభ ధర ఎక్స్‌ షోరూమ్‌ రూ.9.7 లక్షలుగా ఉంది. బ్యాటరీ యాజ్‌ ఏ సరీ్వసెస్‌(బీఏఏఎస్‌) ఫైనాన్స్‌ ఆప్షన్‌తో రూ.6.5 లక్షలు (ఎక్స్‌–షోరూమ్‌)కే కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత కస్టమర్లు ప్రతి కిలోమీటరుకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీ ఈఐఎంలు కిలోమీటరుకు రూ.2.6 నుంచి ప్రారంభమవుతాయి. బ్యాటరీ–రేంజ్‌ పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ 40 కేడబ్ల్యూహెచ్, 30 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. ఇందులో 40 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ను సింగిల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌తో జత చేశారు. ఈ పవర్‌ట్రెయిన్‌ సింగిల్‌ చార్జ్‌పై ఏఆర్‌ఏఐ–సర్టిఫైడ్‌ 468 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. వాస్తవ డ్రైవింగ్‌ పరిస్థితుల్లో 355 కిలోమీటర్ల కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇక 30 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఇది ఏఆర్‌ఏఐ ప్రమాణాల ప్రకారం 365 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. ఈ మోడల్‌లో 65 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. దీనితో బ్యాటరీని 26 నిమిషాల్లో 20–80% వరకు చార్జ్‌ చేయవచ్చు, 15 నిమిషాల్లో 135 కి.మీ రేంజ్‌ టాప్‌–అప్‌ చేయవచ్చు. ఎంట్రీ సెగ్మెంట్‌లో 40 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో 350 కిలోమీటర్ల రియల్‌–వరల్డ్‌ రేంజ్‌ అందించే తొలి కారు టాటా పంచ్‌ ఈవీగా రికార్డు సృష్టిస్తోందని కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్‌ చంద్ర పేర్కొన్నారు.

Swiss Drug Major Novartis AG To Sell India Arm To ChrysCapital-Led Group2
క్రిస్‌ క్యాపిటల్‌ చేతికి నోవార్టిస్‌ 

న్యూఢిల్లీ: స్విస్‌ దిగ్గజం నోవార్టిస్‌ ఏజీ తాజాగా దేశీ విభాగంలో మెజారిటీ వాటా విక్రయించింది. దేశీ ఫార్మా బిజినెస్‌ నోవర్తిస్‌ ఇండియా లిమిటెడ్‌లో 70.68 శాతం వాటా అమ్మివేసేందుకు క్రిస్‌క్యాపిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 1,446 కోట్ల విలువైన డీల్‌కు తెరతీసింది. 2026 అక్టోబర్‌–డిసెంబర్‌కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా. కాగా.. తాజా డీల్‌ నేపథ్యంలో నోవార్టిస్‌ ఇండియా వాటాదారులకు క్రిస్‌క్యాపిటల్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించవలసి ఉంటుంది. నిబంధనల ప్రకారం పబ్లిక్‌ నుంచి 26 శాతం వాటా కొనుగోలు చేపట్టవలసి ఉంది. వెరసి షేరుకి రూ. 860.64 ధరలో 64,19,608 షేర్ల కొనుగోలుకి ఆఫర్‌ ఇవ్వనుంది. ఇందుకు రూ. 552 కోట్లకుపైగా వెచి్చంచనుంది. నోవార్టిస్‌ గ్రూప్‌ పూర్తి అనుబంధ సంస్థ నోవార్టిస్‌ హెల్త్‌కేర్‌ ప్రయివేట్‌ ద్వారా నోవర్తిస్‌ ఏజీ దేశీయంగా కార్యకలాపాలు కొనసాగించనుంది. హైదరాబాద్‌లోని నోవార్టిస్‌ కార్పొరేట్‌ సెంటర్, దేశీయంగా 300 ప్రాంతాలలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న ఆర్‌అండ్‌టీ బృందాలు హెల్త్‌కేర్‌ విభాగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోవార్టిస్‌ ఇండియా షేరు బీఎస్‌ఈలో అమ్మకందారులు కరవుకావడంతో 20 శాతం అప్పర్‌ సీలింగ్‌ను తాకి రూ. 997 వద్ద నిలిచింది.

Brigade Group Debuts Flagship Brigade Showcase in Hyderabad3
మూడేళ్లలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ మార్కెట్లో ప్రాజెక్టులపై వచ్చే 3 సంవత్సరాల్లో సుమారు రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఈడీ అమర్‌ మైసూర్‌ తెలిపారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మొదలైన వాటికి సంబంధించి సుమారు 3.5 మిలియన్‌ చ.అ. అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఇటీవలే దాదాపు రూ. 500 కోట్లతో 4.03 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు కొనసాగుతుండగా, మరో రెండింటిని ప్రారంభించబోతున్నామన్నారు. తమ వృద్ధి వ్యూహంలో హైదరాబాద్‌ కీలక మార్కెట్‌గా ఉంటుందని అమర్‌ వివరించారు. ఈ నేపథ్యంలో బ్రిగేడ్‌ షోకేస్‌ పేరిట రెండు రోజుల ఎక్స్‌పో నిర్వహిస్తున్నామన్నారు.

India rolls out seven steps to boost exports4
ఎగుమతుల ఇంద్రధనుస్సు 

న్యూఢిల్లీ: దేశ ఎగుమతులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు కీలక చర్యలను ప్రకటించింది. లోకల్‌ ప్రొడక్ట్‌ గ్లోబల్‌ మార్కెట్‌ అనే కొత్త గేమ్‌ చేంజర్‌ విధానానికి తెరతీసింది. రూ. 25,060 కోట్ల ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌లో భాగంగా ఈ చర్యలను అమలు చేయనున్నారు. ఈ–కామర్స్‌ ఎగుమతి సంస్థలకు రుణ సాయం, ఎగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ సాధనాలు తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. దీంతో చిన్న వ్యాపారులకు ఎగుమతుల పరంగా కొత్త మార్కెట్లలో కొత్త అవకాశాలు దక్కనున్నాయి. → ప్రత్యక్ష ఈ–కామర్స్‌ రుణ సదుపాయం కింద.. రూ.50 లక్షల వరకు రుణాన్ని 90 శాతం హామీపై ఈ–కామర్స్‌ ఎగుమతిదారులకు ఇవ్వనున్నారు. → ఓవర్సీస్‌ ఇన్వెంటరీ క్రెడిట్‌ ఫెసిలిటీ కింద రూ.5 కోట్ల వరకు రుణాన్ని 75 శాతం గ్యారంటీ కవరేజీతో ఇవ్వనున్నారు. 2.75 శాతం మేర వడ్డీ రేటులో రాయితీ లభిస్తుంది. ఒక ఏడాదిలో ఇలా ఇచ్చే వడ్డీ రాయితీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు. → ఎగుమతులకు సంబంధించి రావాల్సిన చెల్లింపులపై రుణ సదుపాయం కలి్పంచడం (ఫ్యాక్టరింగ్‌) ఇందులో ఒకటి. ఆర్‌బీఐ/ఐఎఫ్‌ఎస్‌సీఏ నమోదిత కంపెనీల ద్వారా చేసే లావాదేవీలపై ఫ్యాక్టరింగ్‌ వ్యయంలో 2.75 శాతం వడ్డీ రాయితీగా ఇవ్వనున్నారు. ఎంఎస్‌ఎంఈల మూలధన నిధుల అవసరాలకు ఇది పరిష్కారం చూపుతుందని కేంద్రం భావిస్తోంది. → ఒక ఎంఎస్‌ఎంఈకి ఏడాదిలో సాయం రూ.50 లక్షలకు పరిమితం. → విదేశీ గోదాములు, ఫుల్‌ఫిల్‌మెంట్‌ సదుపాయాలు, ఈ–కామర్స్‌ హబ్‌లను ఎగుమతిదారులు వినియోగించుకుని అంతర్జాతీయ పంపిణీ నెట్‌వర్క్‌లతో అనుసంధానమయ్యేందుకు వీలుగా.. ఆమోదిత ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం సాయాన్ని మూడేళ్ల కాలానికి అందించనున్నారు. → ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంతాల్లోని ఎగుమతిదారులు భౌగోళికంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతల నుంచి ఉపశమనం కల్పించేందుకు, లాజిస్టిక్స్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫర్‌ ఫ్రైట్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (లిఫ్ట్‌)ను తీసుకొచ్చారు. దీని కింద ఒక్కో ఎగుమతి సంస్థకు అయ్యే రవాణా వ్యయంలో 30 శాతం రీయింబర్స్‌మెంట్‌ (తిరిగి పొందడం/సబ్సిడీ) లభిస్తుంది. ఒక్కో ఎగుమతి సంస్థకు (ఐఈసీ) గరిష్టంగా రూ.20 లక్షల వరకే ఇది పరిమితం. → సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) అంతర్జాతీయ మార్కెట్లలో రాణించేలా చూడడమే ప్రభుత్వ చర్యల ఉద్దేశమని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) విస్తరణతో భారత ఎగుమతిదారులకు మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఇప్పటికే చేసుకున్న తొమ్మిది ఎఫ్‌టీఏలతో ప్రపంచ జీడీపీలో 70% మేర, ప్రపంచ వాణిజ్యంలో మూడింట రెండొంతుల మేర భారత సంస్థలకు అందుబాటులోకి రానున్నట్టు చెప్పా రు. అంత ర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలు ప్రతీ ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్, వ్యాపారవేత్తకు అందుబాటులోకి రావాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ చర్యలతో ఎగుమతిదారులకు నిధుల వ్యయాలు దిగొస్తాయని, వాణిజ్య రుణాలకు మరిన్ని మార్గాలు ఏర్పడతాయని లాజిస్టిక్స్‌ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది.

Latest Gold and Silver Price in India5
సాయంత్రానికి పెరిగిన రేటు.. బంగారం ధరలు ఇలా..

శుక్రవారం ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు మారిపోయాయి. ఈ కథనంలో ప్రస్తుత పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,43,150 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,44,250 వద్ద నిలిచింది. 1,56,170 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,57,370 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి.ఢిల్లీలో 1,43,330 వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల ధర 1,44,400 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,56,320 రూపాయల వద్ద నుంచి రూ. 1,57,520 వద్దకు చేరింది. అయితే చెన్నైలో.. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల రేటు రూ.1,44,200 వద్ద, 24 క్యారెట్ల రేటు 157310 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలువెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.70 లక్షల వద్ద ఉంది. నిన్న (గురువారం) రూ.10 వేలు పెరిగిన రేటు.. ఈ రోజు (శుక్రవారం) స్థిరంగా ఉంది.ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు?

Meaning Of Car Back Side Engine Capacity Decoded6
కారు వెనుక నెంబర్స్.. మీనింగ్ ఏంటో తెలుసా?

సాధారణంగా ఒక కారును నిశితంగా పరిశీలిస్తే.. దాని ముందు, వెనుక బ్రాండ్ లోగో లేదా అక్షరాలు, సైడ్ డోర్స్ మీద కొన్ని స్టిక్కర్స్, వెనుక బీఎస్ 6 లేదా బీఎస్ 4 మోడల్స్ అని తెలిపే గుర్తులు వంటివి కనిపిస్తాయి. అయితే వెనుక భాగంలోనే 1.2, 1.5, 2.4 వంటి నెంబర్స్ కనిపిస్తుంటాయి. వీటి అర్థం కొందరికి తెలిసి ఉన్నా.. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.కారు వెనుక కనిపించే ఈ నెంబర్స్.. మోడల్ నెంబర్స్ అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి ఇంజిన్ కెపాసిటీని సూచిస్తాయి. బైకులలో ఇంజిన్ కెపాసిటీని సీసీ అంటారు. ఉదాహరణకు 100 సీసీ ఇంజిన్, 150 సీసీ ఇంజిన్ ఇలా. ఇక్కడ సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్ల అని అర్థం.ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలుకారు ఇంజిన్.. బైక్ ఇంజిన్ కంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి కారు ఇంజిన్ కెపాసిటీని లీటర్లలో కొలుస్తారు. లీటర్ నెంబర్‌ను 1000తో గుణించడం ద్వారా.. కారు ఇంజిన్ సీసీ కెపాసిటీ తెలుస్తుంది. అంటే.. 1.2 అనేది 1200 సీసీ ఇంజిన్‌ను, 1.5 అనేది 1500 సీసీ ఇంజిన్‌ను సూచిస్తుంది. కారు వెనుక ఉన్న నెంబర్ ఎంత పెద్దది అయితే.. ఇంజిన్ పరిమాణం కూడా ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రీమియం కార్లలో ఇంజిన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement