Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Nissan GRAVITE CNG Debuts Know The Details1
ఎక్కువ మైలేజ్ కోసం ఒక్క కిట్: రూ.83 వేలతో..

నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NMIPL) ఆల్ న్యూ నిస్సాన్ గ్రావైట్ కోసం.. ప్రభుత్వ ఆమోదం పొందిన సీఎన్‌జీ రిట్రోఫిట్ కిట్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 82,999. ఇది దేశంలోని 16 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది.ఈ సీఎన్‌జీ కిట్‌ను మోటోజెన్ తయారు చేసి.. నాణ్యతను కూడా నిర్ధారించింది. వినియోగదారులు ఈ కిట్‌ను నిస్సాన్ అధికారిక డీలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ కిట్‌పై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ కూడా లభిస్తుంది.సీఎన్‌జీ రిట్రోఫిట్ కిట్‌లో రెండు 25 లీటర్ సిలిండర్లు ఉంటాయి. కాబట్టి దీనిని కారులో ఫిక్స్ చేసినప్పుడు కూడా అదే స్పేస్ ఉంటుంది. మూడో వరుస సీటింగ్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువ ఖర్చుతో.. కొంత ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు ఈ కిట్ ఏర్పాటు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: విజయ్ కార్ కలెక్షన్: లెక్సస్ నుంచి స్విఫ్ట్ వరకు..

Stock Market Closing Update Sun Tv Network Shares Down2
మార్కెట్ గ్రీన్.. సన్ టీవీ రెడ్!

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 355.90 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 77,269.40 వద్ద, నిఫ్టీ 121.75 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 24,119.30 వద్ద నిలిచాయి.కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్, ఐఎఫ్‌బి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాలర్ ఎస్టేట్ లిమిటెడ్, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ లిమిటెడ్, ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేతాన్ టిఎమ్‌టి లిమిటెడ్, మనోమయ్ టెక్స్ ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, కేఎస్‌బి లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిసినప్పటికీ.. తమిళనాట ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో.. కలానిధి మారన్ స్థాపించిన 'సన్ టీవీ నెట్‌వర్క్' షేర్స్ మాత్రం భారీ పతనం చవిచూడాల్సి వచ్చింది. సంస్థ షేర్స్ ట్రేడింగ్ క్లోసీ అయ్యే సమయానికి 5.38 శాతం పడిపోయాయి. ఉదయం 10:40 గంటలకు, సన్ టీవీ షేర్లు 8% తగ్గి ఒక్కో షేరుకు రూ. 557.65 వద్ద ట్రేడవుతున్నాయి. ఆగస్టు 2024 తర్వాత ఈ స్టాక్ ఒకే రోజులో అత్యంత భారీ పతనాన్ని నమోదు చేసింది.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Actor Vijay Garage Holds Some Iconic Cars Maruti Swift To BMW i73
విజయ్ కార్ కలెక్షన్: లెక్సస్ నుంచి స్విఫ్ట్ వరకు..

నటుడుగా, రాజకీయ నాయకుడుగా మాత్రమే తెలిసిన విజయ్.. ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగా ఆయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి చిన్న కారు కూడా ఉంది. ఈ కథనంలో విజయ్ కాల్ కలెక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం.లెక్సస్ ఎల్ఏం 350హెచ్విజయ్ ఉపయోగించే కార్ల జాబితాలో లెక్సస్ ఎల్ఏం 350హెచ్ ఒకటి. దీని ధర సుమారు రూ.2.20 కోట్లు. మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. 48 అంగుళాల డిస్‌ప్లే, అల్ట్రా-ప్రీమియం సీటింగ్ వంటి ఫీచర్ల కారణంగా ఇదొక ప్రైవేట్ లాంజ్‌ మాదిరిగా అనిపిస్తుంది.బీఎండబ్ల్యూ 5 సిరీస్బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 5 సిరీస్ కూడా విజయ్ గ్యారేజిలో ఉంది. రూ.74.80 లక్షల ధర వద్ద లభించే ఈ కారు 2.0 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, అత్యుత్తమ సౌండ్ సిస్టమ్‌తో సహా ప్రీమియం ఇంటీరియర్‌ ఇందులో చూడవచ్చు. ఇది రోజువారీ వినియోగం కోసం ఉపయోగపడే లగ్జరీ సెడాన్.బీఎండబ్ల్యూ ఐ7విజయ్ గ్యారేజిలోని ఎలక్ట్రిక్ సెడాన్ బీఎండబ్ల్యూ ఐ7. దీని ధర రూ.2.5 కోట్లు. ఇది 449 హార్స్ పవర్ అందిస్తుంది. థియేటర్ స్క్రీన్, యాంబియంట్ లైటింగ్ వంటివి ఈ కారులో ఉన్నాయి. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.టయోటా వెల్‌ఫైర్‌రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ టయోటా వెల్‌ఫైర్‌ కారును ఎంచుకున్నట్లు సమాచారం. సుమారు రూ. 1.19 కోట్ల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారును ఎక్కువ మంది సెలబ్రిటీలు, రాజకీయంగా నాయకులు ఉపయోగిస్తున్నారు. సౌకర్యవంతమైన సీట్లు, 2.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండటం వల్ల ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.మారుతి సుజుకి స్విఫ్ట్టీవీకే అధినేత విజయ్ వద్ద మారుతి స్విఫ్ట్ కూడా ఉంది. ఎన్నికల సమయంలో దీనిని ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు సరసమైనది మాత్రమే కాదు, ఆచరణాత్మకమైనది.. భారతదేశంలో అత్యంత ఇష్టపడే హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే ఈ కారు రోజువారీ వినియోగానికి ఉపయోగకరంగా ఉంటుంది.రోల్స్ రాయ్స్ ఘోస్ట్విజయ్ గతంలో రోల్స్-రాయ్స్ ఘోస్ట్ సిరీస్ I కారును కలిగి ఉండేవారు, దానిని విక్రయించినట్లు సమాచారం. ఈ లగ్జరీ సెడాన్‌లో 6.6 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ ఉండేది. ఇది 563 Bhp పవర్, 780 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, రియర్-వీల్ డ్రైవ్‌తో ఉంటుంది. దీని ధర రూ. 2 కోట్ల ధరకు అందుబాటులో ఉండేది.

From Zero Coding to Full App AI Revolution Everyone Talking About4
సరైన ప్రశ్నలు అడగండి.. రాత్రికి రాత్రే యాప్ రెడీ

సాఫ్ట్‌వేర్ అభివృద్ధి అంటేనే ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, వేల గంటల శ్రమ, సంక్లిష్టమైన కోడింగ్‌తో కూడిన సుదీర్ఘ ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. సరైన ప్రశ్న అడగడం తెలిస్తే చాలు సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా అద్భుతాలు సృష్టించవచ్చని తాజాగా జరిగిన ఒక ఉదంతం నిరూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్‌వేర్ తయారీ రంగాన్ని ఎలా మారుస్తుందో చెప్పే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.రాత్రికి రాత్రే ఫంక్షనల్ యాప్ప్రముఖ వ్యవస్థాపకుడు సందీప్ మాల్ ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అందులోని వివరాల ప్రకారం.. తన కుమారుడు అసలు ప్రోగ్రామింగ్ నేపథ్యమే లేని మార్కెటింగ్ గ్రాడ్యుయేట్ ‘క్లాడ్’ అనే ఏఐ సాధనాన్ని ఉపయోగించి కేవలం ఒక్క రాత్రిలో పూర్తి స్థాయి వెండర్ మేనేజ్‌మెంట్ యాప్‌ను రూపొందించాడని ఆయన వెల్లడించారు. ఈ యాప్‌లో కెపాసిటీ ట్రాకింగ్, క్వాలిటీ మానిటరింగ్, వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయని, ఒక ప్రొఫెషనల్ యాప్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు.సాంప్రదాయకంగా సాఫ్ట్‌వేర్ తయారీలో ప్రోగ్రామింగ్ భాషల వాక్యనిర్మాణం (సింట్యాక్స్‌) తెలుసుకోవడం అత్యంత కీలకం. అయితే, ఈ ఘటన తర్వాత జరుగుతున్న చర్చలో నెటిజన్లు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఏఐ యుగంలో కోడింగ్ నేర్చుకోవడం కంటే, సమస్యను ఎలా ఫ్రేమ్ చేయాలి? ఏ ప్రశ్న అడిగితే సరైన పరిష్కారం వస్తుంది? అనే జడ్జిమెంట్ (నిర్ణయాత్మక సామర్థ్యం)కు ప్రాధాన్యత పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలంటే టీమ్, భారీ పెట్టుబడి అవసరమయ్యేవి. ఇప్పుడు ఆ ప్రవేశ అడ్డంకులు కనుమరుగవుతున్నాయి.సవాళ్లు లేకపోలేదుఈ పరిణామాన్ని అందరూ ఆహ్వానిస్తున్నప్పటికీ వాస్తవిక దృక్పథాన్ని కోల్పోవద్దని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ప్రోటోటైప్‌ను తయారు చేయడం వేరు. దాన్ని యాప్ స్టోర్‌లోకి తీసుకురావడం, భద్రతా ప్రమాణాలను పాటించడం, దీర్ఘకాలంలో నిర్వహించడం వంటివి చాలా క్లిష్టమని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా, ఏఐ సృష్టించిన కోడ్‌లో వచ్చే బగ్‌లను గుర్తించి డీబగ్ చేయడం ఇప్పటికీ ఒక సవాలుతో కూడిన నైపుణ్యమేనని అభిప్రాయపడుతున్నారు.My younger one is a marketing grad. Zero coding knowledge. Sat through one night with Claude and built a complete vendor management app - capacity, quality, workload, the works.Old wisdom says: ask the right questions. Turns out, that’s all you need in the AI world too. 🙌— Sandeep Mall (@SandeepMall) May 4, 2026భవిష్యత్తు దిశగా..సాంకేతిక నైపుణ్యం కంటే ఆలోచన, దాన్ని అమలు చేసే స్పష్టతకు విలువ పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్ తయారీ అనేది ఇప్పుడు కేవలం ఇంజినీర్లకే పరిమితం కాదు, సృజనాత్మకత ఉన్న ఎవరైనా సరే ఏఐతో తమ సొంత పరిష్కారాలను నిర్మించుకునే యుగం మొదలైంది.ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు

Degree is Not Enough: AI Skills Now Mandatory for Jobs Says Unstop Report 20265
డిగ్రీ ఉంటే సరిపోదు.. స్కిల్‌ ఉంటేనే జాబ్‌

ముంబై: నేటి తరం విద్యార్థుల వేతన అంచనాలకు, మార్కెట్లోని వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. పట్టభద్రులవుతున్న విద్యార్థుల్లో దాదాపు 73 శాతం మంది రూ.5 లక్షలకు మించి వార్షిక వేతనాన్ని (ఎల్‌పీఐ) ఆశిస్తుండగా.. కేవలం 40 శాతం మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారని ‘అన్‌స్టాప్‌ టాలెంట్‌ రిపోర్ట్‌ 2026’ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 37 వేలకు పైగా విద్యార్థులు, 500 మందికి పైగా హెచ్‌ఆర్‌ ప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.డిగ్రీ ‘ప్రీమియం’ కనుమరుగు: ఒకప్పుడు పెద్ద కోర్సులు చదివిన వారికి మాత్రమే దక్కే ‘అదనపు వేతన ప్రాధాన్యం’ క్రమంగా తగ్గుతోంది. ఎంబీఏ పూర్తి చేసిన వారిలో 30 శాతం మంది రూ. 10 లక్షల కంటే తక్కువ వార్షిక వేతనం పొందుతుండగా, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 39 శాతం మంది రూ. 7 లక్షల లోపు వేతనాలకే పరిమితమవుతున్నారు. దీనిని బట్టి వివిధ కోర్సుల మధ్య ఉన్న ‘వేతన అంతరం’ తగ్గుముఖం పడుతోందని స్పష్టమవుతోంది.విద్యార్థుల ఆలోచనా ధోరణిలో మార్పు: పెరుగుతున్న పోటీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సైతం వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మెరుగైన అభ్యాస అవకాశాలు, కెరీర్‌ వృద్ధి ఉంటే 90 శాతం మందికి పైగా విద్యార్థులు తక్కువ జీతానికైనా పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే 82 శాతం మంది విద్యార్థులు తక్షణ ఆర్థిక స్థిరత్వం కోసం అదనపు ప్రయోజనాల (పెర్క్స్‌) కంటే చేతికి వచ్చే జీతానికే (ఇన్‌–హ్యాండ్‌ శాలరీ) ప్రాధాన్యత ఇస్తున్నారు.నైపుణ్యమే అసలైన ‘గేట్‌కీపర్‌’: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నియామక ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు చూసి ఉద్యోగాలిచ్చిన కంపెనీలు, ఇప్పుడు అభ్యర్థుల్లోని నైపుణ్యాలు (స్కిల్స్‌), కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. సుమారు 64 శాతం మంది హెచ్‌ఆర్‌ ప్రతినిధులు ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సాంకేతికతలపై పట్టున్న వారినే ‘ప్రీమియం టాలెంట్‌’గా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ (49%), ఏఐ పరిజ్ఞానం (39%), ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ (30%) వంటి సామర్థ్యాలు ఉన్నవారికే అత్యధిక డిమాండ్‌ ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.ఎంపిక ప్రమాణాలు మారాయి: భారత ఉద్యోగ విపణిలో అవకాశాలు తగ్గలేదు, కానీ ఒక నిర్మాణాత్మక మార్పు జరుగుతోంది. నైపుణ్యం, ఏఐ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. బలమైన పునాదులతో పాటు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, ఏఐ ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులే ఈ పోటీలో నిలబడతారు’’ అని అన్‌స్టాప్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్‌ అగర్వాల్‌ విశ్లేషించారు.

Robert Kiyosaki Massive Warning MOST POWERFUL FINANCIAL POSITION CHANGES HANDS6
చేతులు మారుతున్న ‘ప్రపంచ ఆర్థిక శక్తి’.. కియోసాకి వైరల్‌ పోస్ట్‌

ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఇన్వెస్టర్లను మరోసారి హెచ్చరించారు. సరిగ్గా 12 రోజుల్లో, అంటే మే 15న, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక పీఠం (అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్) చేతులు మారబోతోంది. అయితే మెజారిటీ ప్రజలకు దీని పర్యవసానాలు ఏంటో తెలియడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఆయన ఓ పోస్ట్‌ చేశారు.వార్ష్ చేతుల్లోకి పగ్గాలు..గత ఎనిమిదేళ్లుగా ఫెడ్ చైర్మన్‌గా ఉన్న జెరోమ్ పావెల్ మే 15న పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ నమ్మకస్తుడు కెవిన్ వార్ష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గత 50 ఏళ్లలో ఏ ఫెడ్ చైర్మన్ ఎదుర్కోనంతటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య వార్ష్ పదవిలోకి వస్తున్నారని కియోసాకి విశ్లేషించారు.వార్ష్ ముందున్న సవాళ్లు ఇవే..చమురు మంట: బ్యారెల్ ఆయిల్ ధర 120 డాలర్ల వద్ద ఉంది.ద్రవ్యోల్బణ సెగ: 3.3 శాతంతో ద్రవ్యోల్బణం గత రెండేళ్ల గరిష్టానికి చేరింది.వడ్డీ రేట్ల సందిగ్ధత: ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో, ఫెడ్ వడ్డీ రేట్లను 3.5% - 3.75% వద్దే కొనసాగించాల్సి వస్తోంది.కియోసాకి మాటల్లో 'వార్ష్ ట్రాప్'కెవిన్ వార్ష్ ఒక ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకున్నారని కియోసాకి అభివర్ణించారు. ఆయన ముందున్నవి కేవలం మూడు మార్గాలు, ఆ మూడూ నష్టదాయకమే. రేట్లు తగ్గించడం: రేట్లు తగ్గిస్తే, అప్పటికే మండుతున్న ద్రవ్యోల్బణంపై పెట్రోల్ పోసినట్లవుతుంది.రేట్లు మార్చకపోవడం: ఇది అధ్యక్షుడు ట్రంప్‌ను నిరాశపరచడమే కాకుండా, యుద్ధం వల్ల కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది.రేట్లు పెంచడం: ఇది దేశాన్ని నేరుగా ఆర్థిక మాంద్యం (Recession)లోకి నెట్టివేస్తుంది. తొలగని పావెల్ నీడ!ఈ కథనంలో మరో ఆసక్తికరమైన మలుపు ఏంటంటే.. చైర్మన్ పదవి నుంచి దిగిపోయినా, జెరోమ్ పావెల్ ఫెడ్ బోర్డు నుంచి వెళ్లడం లేదు. 2028 వరకు ఆయన బోర్డు మెంబర్‌గా కొనసాగుతారు. 1951 తర్వాత ఒక మాజీ చైర్మన్ ఇలా బోర్డులో ఉండిపోవడం ఇదే తొలిసారి. అంటే, ట్రంప్ తనకిష్టమైన వారిని ఆ సీటులో కూర్చోబెట్టి వడ్డీ రేట్లు తగ్గించేలా చక్రం తిప్పాలని చూసినా, పావెల్ అక్కడ ‘వాచ్ డాగ్’లా అడ్డుపడే అవకాశం ఉంది.అసలు బాస్ ఎవరు?కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఇప్పుడు ఫెడ్ చైర్మన్ ఎవరన్నది ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది వార్ష్ కాదు, ట్రంప్ అంతకన్నా కాదు. కేవలం 21 మైళ్ల వెడల్పు ఉన్న 'హార్ముజ్ జల సంధి' (Strait of Hormuz)."ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణం సాధారణ స్థితికి వచ్చే వరకు.. ద్రవ్యోల్బణం 2%కి తగ్గే వరకు.. ఫెడ్ రేట్లు తగ్గించే సాహసం చేయలేదు. ఎవరు చైర్మన్ సీటులో కూర్చున్నా సరే.. ప్రస్తుతానికి 'హార్ముజ్ జలసంధి' మాత్రమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయిస్తోంది." అని కియోసాకి తేల్చి చెప్పారు.ఇన్వెస్టర్లు కేవలం వ్యక్తుల మార్పును మాత్రమే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను గమనించాలని కియోసాకి సూచించారు. వార్ష్ రాకతో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం కంటే, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం మేలని ఆయన పోస్ట్ సారాంశం.

Advertisement
Advertisement
Advertisement