Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Union Budget 2026 Draws Positive Response from Industry1
ఇక ఇండియన్‌ ఐటీ పరిశ్రమదే కీలక పాత్ర

కేంద్ర బడ్జెట్‌ 2026లోని ప్రతిపాదనలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధన–అభివృద్ధిపై ప్రభుత్వం పెట్టిన దృష్టిని వారు ప్రశంసించారు.సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామిగా భారత్‌కేంద్ర బడ్జెట్‌ 2026 భారతదేశాన్ని విశ్వసనీయ సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామిగా నిలబెడుతుంది. సుపరిపాలన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రభుత్వం ప్రాధాన్యంగా గుర్తించడం ప్రోత్సాహకరం. ఇది ఆవిష్కరణ, సమర్థత, స్కేలబుల్ డిజిటల్ పరిష్కారాలను అందించడంలో భారతీయ ఐటీ పరిశ్రమ పాత్రను బలోపేతం చేస్తుంది. ఇండియాఏఐ మిషన్, నేషనల్ క్వాంటం మిషన్, నేషనల్ రీసెర్చ్ ఫండ్, అలాగే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 వంటి కార్యక్రమాలు భవిష్యత్తుకు సిద్ధమైన దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి.— అతుల్ సోనేజా, సీఓఓ, టెక్ మహీంద్రాక్రిప్టో రంగానికి దీర్ఘకాలిక లాభంభవిష్యత్తు సాంకేతికతల పట్ల కేంద్ర బడ్జెట్‌ స్పష్టమైన నిబద్ధతను చూపుతోంది. ఇండియాఏఐ మిషన్‌కు రూ.2,000 కోట్లు, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు రూ.500 కోట్లు కేటాయించడం డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. క్రిప్టో రంగానికి ఇది తక్షణ ధరల ప్రభావం కన్నా, బలమైన ఆర్ & డి, టాలెంట్ అభివృద్ధి, నియంత్రిత, ఇండియా-ఫస్ట్ వినియోగాల నిర్మాణానికి దీర్ఘకాలిక మద్దతుగా నిలుస్తుంది. బ్లాక్‌చెయిన్ ఎంటర్‌ప్రైజ్ స్వీకరణకు, సురక్షిత ఆర్థిక మౌలిక సదుపాయాలకు కీలకమవుతుంది.— విక్రమ్ సుబ్బూరాజ్, సీఈఓ, జియోటస్.కామ్తెలంగాణ లైఫ్ సైన్సెస్ వృద్ధికి ఊతంకేంద్ర బడ్జెట్‌ లైఫ్ సైన్సెస్ రంగంపై చూపుతున్న దృష్టి తెలంగాణలో వృద్ధికి మరింత ఊతమిస్తుంది. లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30లో పేర్కొన్న అధునాతన తయారీ, ఆవిష్కరణలు, ఆర్ & డి లక్ష్యాలు ఈ బడ్జెట్‌తో మరింత వేగం పొందనున్నాయి. దీని ద్వారా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల లక్ష్యాలు సాధ్యమవుతాయని, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ స్థానం బలపడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.— శక్తి ఎం. నాగప్పన్, సీఈఓ, తెలంగాణ లైఫ్ సైన్సెస్

Centre Showers Boon on Hyderabad with High Speed Rail Corridors2
హైదరాబాద్‌కు హై-స్పీడ్ రైళ్లు..

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌పై వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్‌ 2026-27లో భాగంగా హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ పలు హై-స్పీడ్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మొత్తం ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించగా, వాటిలో మూడు కారిడార్లు హైదరాబాద్‌ నుంచి ఉండటం విశేషం.ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు ఇవే..* ముంబై – పూణే* పూణే – హైదరాబాద్* హైదరాబాద్ – బెంగళూరు* హైదరాబాద్ – చెన్నై* చెన్నై – బెంగళూరు* బెంగళూరు – వారణాసి* వారణాసి – సిలిగురిఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్ దేశవ్యాప్తంగా కీలక రవాణా కేంద్రంగా మరింత బలోపేతం కానుంది.

Proposed telecom outlay raised BSNL gets Rs 28,473 crore3
బీఎస్ఎన్ఎల్‌కు రూ.28,473 కోట్లు

కేంద్ర బడ్జెట్‌ 2026-27లో టెలికాం రంగానికి ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యయం గణనీయంగా పెరిగిందని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారత్ నెట్, బీఎస్ఎన్ఎల్ మూలధన అవసరాలు, స్పెక్ట్రమ్ వ్యయం, నెట్‌వర్క్ రోలౌట్‌తో పాటు ఇతర అంతర్గత అవసరాలను తీర్చేందుకు ఈ కేటాయింపులు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం టెలికాం రంగానికి రూ.53,000 కోట్ల కేటాయింపు ఉండగా, తాజా బడ్జెట్‌లో దాన్ని రూ.73,000 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఇది దాదాపు 40 శాతం వృద్ధి అని సింధియా వెల్లడించారు. టెలికాం మంత్రిత్వ శాఖకు, ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్‌కు కేటాయింపులు పెరగడానికి గల కారణాలపై ప్రశ్నించగా, బీఎస్ఎన్ఎల్‌ను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.“బీఎస్ఎన్ఎల్ ఏఆర్‌పీయూ (సగటున ఒక్కో యూజర్‌ ద్వారా వచ్చే ఆదాయం) రూ.90 నుంచి రూ.99కు దాదాపు 9 శాతం పెరిగింది. త్వరలో మూడు అంకెల స్థాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా మూడు విభాగాల్లోనూ ఆదాయం పెరిగింది. అంతర్గత నగదు ప్రవాహాలతో పాటు క్యాపెక్స్ ఇంజెక్షన్ అవసరం ఉంది. తద్వారా బీఎస్ఎన్ఎల్‌ను పునరుజ్జీవన మార్గంలో ముందుకు తీసుకెళ్లగలుగుతాం,” అని మంత్రి తెలిపారు.ప్రతిపాదిత అదనపు బడ్జెట్‌లో గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్ట్ అయిన భారత్ నెట్‌కు నిధులు కేటాయించినట్లు ఆయన చెప్పారు. బీఎస్ఎన్ఎల్‌కు స్పెక్ట్రమ్ కోసం సుమారు రూ.1.39 లక్షల కోట్ల విలువైన కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. టవర్లు, మౌలిక వసతులు, బ్యాటరీలు వంటి అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అలాగే ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కేటాయింపులు కూడా గణనీయంగా పెరిగాయని సింధియా తెలిపారు. గతంలో రూ.4,495 కోట్లుగా ఉన్న సవరించిన అంచనాలను రూ.6,800 కోట్లకు పెంచామని, ఇది దాదాపు 50 శాతం వృద్ధి అని వివరించారు. ఈ బడ్జెట్‌లో ఈశాన్య ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్న ఆయన, పట్టణీకరణ, ఆరు రాష్ట్రాల్లోని ఐదు బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి, 4,000 ఈ-బస్సుల ప్రవేశపెట్టడం, అలాగే ఆరోగ్యం మరియు విద్యా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

Union Budget 2026–27 Manufacturing Strategic Frontier Sectors4
పారిశ్రామిక విప్లవానికి బడ్జెట్ బాటలు

కేంద్ర బడ్జెట్ 2026-27లో భారత ప్రభుత్వం దేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కొన్ని పథకాలను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ‘వికసిత్ భారత్’ దిశగా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే కొన్ని వ్యూహాత్మక రంగాలకు పెద్దపీట వేశారు.ప్రపంచానికి తయారీ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ అడుగులు వేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా కేంద్రం పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చిప్ తయారీ నుంచి చౌకైన క్రీడా సామాగ్రి వరకు.. ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు.ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) 2.0సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఐఎస్‌ఎం 2.0ను ప్రకటించారు. కేవలం చిప్ తయారీ మాత్రమే కాకుండా, సెమీకండక్టర్ పరికరాలు, మెటీరియల్స్ ఉత్పత్తి, భారతీయ మేధో సంపత్తిని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఇందుకోసం పరిశ్రమల భాగస్వామ్యంతో పరిశోధన, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.బయోఫార్మా ‘శక్తి’ఫార్మా రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి రూ.10,000 కోట్ల కేటాయింపుతో ‘బయోఫార్మా శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మూడు కొత్త నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER)లను ఏర్పాటు చేస్తారు. 1000కి పైగా గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ సైట్‌ల నెట్‌వర్క్‌ను రూపొందిస్తారు.అరుదైన ఖనిజాల అభివృద్ధి పథకంచైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేస్తారు. అరుదైన ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, శాశ్వత అయస్కాంతాల తయారీకి ఈ పథకం ఊతమిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగానికి అత్యంత కీలకం.డెడికేటెడ్ కెమికల్ పార్కులుదేశీయ రసాయన ఉత్పత్తిని పెంచడానికి రూ.600 కోట్లతో మూడు ప్రత్యేక కెమికల్ పార్కులను ‘ఛాలెంజ్ రూట్’(సాధారణంగా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టును ఒకే చోట కాకుండా ఏ రాష్ట్రం అయితే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందో అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తారు. ఇందుకోసం రాష్ట్రాల మధ్య నిర్వహించే పోటీనే ఛాలెంజ్ రూట్) ద్వారా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు.ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్‌)ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు ఈ పథకం కేటాయింపులను ఏకంగా రూ.40,000 కోట్లకు పెంచారు. దీనివల్ల మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల విడిభాగాలు భారత్‌లోనే తయారవుతాయి.టెక్స్‌టైల్స్ రంగం - ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్వస్త్ర పరిశ్రమ బలోపేతానికి నేషనల్ ఫైబర్ స్కీమ్, టెక్స్‌టైల్ విసర్తణ, ఉపాధి పథకాలు ఉన్నాయి. పాత టెక్స్‌టైల్ క్లస్టర్లను ఆధునీకరించడం వీటి ప్రధాన ఉద్దేశం.ఇతర కీలక మౌలిక సదుపాయాల పథకాలుకంటైనర్ తయారీ: గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ వాటాను పెంచడానికి రూ.10,000 కోట్లతో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్.ఇండస్ట్రియల్ క్లస్టర్లు: దేశవ్యాప్తంగా ఉన్న 200 పాత పారిశ్రామిక వాడలను (Clusters) ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించనున్నారు.హైటెక్ టూల్ రూమ్స్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యాధునిక టూల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈలకు సాంకేతిక సహాయం అందిస్తారు.క్రీడా సామగ్రి: సరసమైన ధరల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా సామగ్రిని తయారు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.నిర్మాణ పరికరాలు: అధిక విలువ కలిగిన నిర్మాణ, మౌలిక సదుపాయాల యంత్రాల తయారీని దేశీయంగా బలోపేతం చేయనున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026-27 లైవ్‌ అప్‌డేట్స్‌

Stock Market On 1st February 2026: Sensex, Nifty crashes as STT hike5
బడ్జెట్‌ దెబ్బ.. కుప్పకూలిన మార్కెట్లు

బడ్జెట్‌ 2026 దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టీటీ)ను 50-150 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించిన తరువాత మదుపరులు ఈక్విటీ మార్కెట్ల నుండి పారిపోవడంతో భారత ఈక్విటీ మార్కెట్లు ఆదివారం ప్రత్యేక సెషన్‌ తీవ్ర నష్టాలతో ముగించాయి.ఫ్యూచర్ ట్రేడ్స్ పై ఎస్టీటీని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆప్షన్స్ ప్రీమియంపై ఎస్టీటీని 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,843 పాయింట్లు లేదా 2.23 శాతం 80,723 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 495 పాయింట్లు లేదా 1.96 శాతం నష్టపోయి 24,825 వద్ద నిలిచింది.సెషన్‌లో అంతకుముందు సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు పడిపోయి 79,899.42 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 24,572 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది.విస్తృత మార్కెట్లు కూడా భారీ అమ్మకపు ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 2 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 2.7 శాతం నష్టపోయాయి. పెట్టుబడిదారులలో భయాన్ని సూచించే ఫియర్ గేజ్ - ఇండియా వీఐఎక్స్ దాదాపు 12 శాతం పెరిగింది.రంగాలవారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మినహా అన్ని సూచీలు పడిపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 6 శాతం, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 2 శాతానికి పైగా క్షీణించాయి.నిఫ్టీలోని 50 స్టాక్‌లలో భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, ఓఎన్జీసీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. వాటి షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయాయి. ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, నెస్లే ఇండియా, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రధానంగా నష్టపోయిన స్టాక్స్‌లో ప్రముఖంగా ఉన్నాయి. మరోవైపు విప్రో, టీసీఎస్, మ్యాక్స్ హెల్త్‌కేర్‌ లాభాలను అందుకున్నాయి. ఒక్కొక్కటి 2 శాతం లాభపడ్డాయి.

Tax Relief for Tech Firms Clarity on Data Center Investments Budget 20266
డేటా సెంటర్ పెట్టుబడులపై స్పష్టత

భారతదేశాన్ని గ్లోబల్ డేటా హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విదేశీ సంస్థలు భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న పన్ను సంబంధిత అడ్డంకులను తొలగిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ అనంతర విలేకరుల సమావేశంలో స్పష్టతనిచ్చింది. క్లౌడ్ ఆధారిత సేవలు అందించే అంతర్జాతీయ సంస్థలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పణ అనంతరం మీడియా సమావేశంలో ఆర్థికశాఖ వివరాల ప్రకారం.. ‘ఒక అంతర్జాతీయ సంస్థ భారత్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆదాయంపై భారత్‌లో పన్ను విధించబోం. విదేశీ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది దేశానికి నికర ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. భారత్‌లో ఉన్న డేటా సెంటర్ కార్యకలాపాలకు మాత్రమే పన్ను వర్తిస్తుంది. సదరు సంస్థ తన సేవలను భారత్‌లోని రీసెల్లర్ ద్వారా విక్రయిస్తే, ఆ విక్రయాలపై వచ్చే ఆదాయానికి యథావిధిగా పన్ను విధిస్తారు’ అని తెలిపింది.ఎందుకు ఈ నిర్ణయం?క్లౌడ్ సేవలు అందించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వందలాది డేటా సెంటర్లను ఉపయోగిస్తాయి. ఏ నిర్దిష్ట సెంటర్ వల్ల ఎంత ఆదాయం వచ్చిందో లెక్కించడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ‘గ్లోబల్ సంస్థలు భారతదేశంలో తమ సేవలను పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. పన్నుల భయంతో వారు వెనకడుగు వేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.దీనివల్ల కలిగే ప్రయోజనాలుఅమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌లో మరిన్ని డేటా సెంటర్లను నిర్మించే అవకాశం ఉంది. నిర్మాణ, నిర్వహణ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలో డేటా స్టోరేజ్ సామర్థ్యం పెరగడం వల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ సరళీకృత నిబంధనలు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి భరోసా ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలోని కీలక ప్రకటనలు

Advertisement
Advertisement
Advertisement