Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Oracle planning to lay off 30000 employees in 2026 know reason1
ఒరాకిల్‌ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న టెక్ దిగ్గజం ఒరాకిల్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన భారీ నిధులను సమీకరించుకోవడానికి కంపెనీ దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.నిధుల కొరతఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ టీబీ కోవెన్ పరిశోధన నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 156 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.14 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్థాయిలో అప్పులు ఇవ్వడానికి అమెరికాలోని ప్రముఖ బ్యాంకులు వెనకడుగు వేస్తుండటం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. ఈ వ్యవహారంపై ఈక్విటీ, రుణ పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో నిధుల కోసం కంపెనీ తన సొంత వనరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.తొలగింపుల ద్వారా ఎంతంటే..ఒరాకిల్ తన కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తగ్గించాలని భావిస్తోంది. ఈ భారీ లేఆఫ్స్ ద్వారా కంపెనీకి సుమారు 8 బిలియన్ల డాలర్ల నుంచి 10 బిలియన్‌ డాలర్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని టీవీ కోవెన్ అంచనా వేసింది. ఒకవేళ ఇదే జరిగితే ఒరాకిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద లేఆఫ్ అవుతుంది. గతంలో 2025 చివరలో కంపెనీ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 10,000 మందిని తొలగించింది. ఇటీవల అమెజాన్ కూడా తన ఏఐ వ్యూహంలో భాగంగా 16,000 మందిని తొలగించిన సంగతి తెలిసిందే.వ్యూహాత్మక మార్పులునిధుల సమీకరణ కోసం ఒరాకిల్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 2022లో 28.3 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ యూనిట్ ‘సెర్నర్’ను విక్రయించే ఆలోచనలో కంపెనీ ఉంది. ‘బ్రింగ్ యువర్ ఓన్ చిప్’ అనే కొత్త విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని ప్రకారం కస్టమర్లే తమ సొంత హార్డ్‌వేర్‌ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఒరాకిల్‌పై మూలధన భారం తగ్గుతుంది. మౌలిక సదుపాయాల నిర్మాణంలో నేరుగా పెట్టుబడి పెట్టాలని క్లయింట్‌లను ఒరాకిల్ కోరుతోంది.భారీ లక్ష్యాలుక్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని పెంచడానికి 2026 నాటికి 45 బిలియన్‌ డాలర్ల నుంచి 50 బిలియన్‌ డాలర్ల వరకు నిధులు సేకరించాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. సామ్ ఆల్ట్‌మాన్ నేతృత్వంలోని ఓపెన్‌ఏఐ కోసం డేటా సెంటర్లను నిర్మించే బాధ్యతను కూడా ఒరాకిల్ గతంలో చేపట్టింది. అయితే ప్రస్తుత ఫైనాన్సింగ్ ఇబ్బందులు ఈ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్‌.. భారీ తగ్గుదల!

Union Budget 2026–27 raised STT sharply what investors will do2
ఎస్‌టీటీ పెంపు.. ఇన్వెస్టర్ల జేబుకు చిల్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చే నిర్ణయం వెలువడింది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టీటీ)ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా డెరివేటివ్స్ (ఎఫ్‌ అండ్‌ ఓ) మార్కెట్‌లో విపరీతంగా పెరుగుతున్న స్పెక్యులేషన్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎస్‌టీటీ అంటే ఏమిటి? ఎందుకు పెంచారు?స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లను లేదా డెరివేటివ్స్‌ను కొనుగోలు చేసినా, విక్రయించినా ప్రభుత్వం వసూలు చేసే పన్నును ఎస్‌టీటీ అంటారు. ఇటీవలి కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎటువంటి అవగాహన లేకుండా ఫ్యూచర్స్ అండ్‌ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేస్తూ భారీగా నష్టపోతున్నట్లు సెబీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రిస్క్‌ను నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ విభాగంలోని ఫ్యూచర్స్ లావాదేవీలపై పన్ను రేటును సవరించారు. గతంలో 0.02 శాతంగా ఉన్న ఈ పన్నును ఇప్పుడు 0.05 శాతానికి పెంచారు. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. అదేవిధంగా, ట్రేడింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆప్షన్స్ విభాగంలో కూడా పన్ను భారం పెరగనుంది. గతంలో ఆప్షన్స్ విక్రయాలపై 0.1 శాతంగా ఉన్న ఎస్‌టీటీ రేటును ప్రభుత్వం 0.15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు వల్ల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్ల లావాదేవీల ఖర్చు గణనీయంగా పెరగనుంది.ఉదాహరణకు..ఒక రిటైల్ ట్రేడర్ రూ.10 లక్షల విలువైన నిఫ్టీ ఆప్షన్స్‌ను విక్రయించాడనుకుందాం. 0.1 శాతం చొప్పున పాత పన్ను విధానంలో అతను రూ.1,000 ఎస్‌టీటీ చెల్లించేవాడు. 0.15 శాతంతో కొత్త పన్ను విధానంలో ఇప్పుడు అదే లావాదేవీపై రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, కేవలం ఒక లావాదేవీపైనే 50% అదనపు పన్ను భారం పడుతోంది. ఇది చిన్న మొత్తాలతో ట్రేడింగ్ చేసేవారి లాభాలను గణనీయంగా తగ్గిస్తుంది.ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుమారుతున్న పన్ను నిబంధనల దృష్ట్యా రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి శైలిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అతిగా ట్రేడింగ్ చేయకూడదు.. పన్నులు పెరిగినప్పుడు ప్రతి ట్రేడ్‌కు అయ్యే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి లాభం తక్కువగా ఉండి పన్నులు ఎక్కువగా ఉండే చిన్న ట్రేడ్లను నివారించండి.డెరివేటివ్స్ నుంచి డెలివరీ వైపు.. కేవలం లాభం కోసం చేసే ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్ కంటే మంచి కంపెనీల షేర్లను కొని దీర్ఘకాలం ఉంచుకునే (Delivery Trading) పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల పన్ను భారం తగ్గుతుంది.ట్రేడ్ చేసేటప్పుడు కేవలం బ్రోకరేజ్ మాత్రమే కాకుండా పెరిగిన ఎస్‌టీటీ, జీఎస్టీ, స్టాంప్ డ్యూటీలను పరిగణనలోకి తీసుకోవాలి. పన్నులన్నీ పోగా లాభం మిగులుతుందో లేదో ముందే అంచనా వేసుకోవాలి.మ్యూచువల్ ఫండ్స్/ ఈటీఎఫ్‌.. నేరుగా ట్రేడింగ్ చేసి నష్టపోయే కంటే నిపుణుల ద్వారా నిర్వహించబడే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితం.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్‌.. భారీ తగ్గుదల!

Marriage Is Not An Emergency Boss Asked Employee To Work On A Nightmare Project Before Engagement3
సెలవు అడిగితే.. పెళ్లి ఎమర్జెన్సీ కాదన్న బాస్

కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో.. చాలా సందర్భాలలో తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వర్క్ కంటే పెళ్లి ముఖ్యం కాదని తమ బాస్ చెప్పినట్లు ఉద్యోగి వెల్లడించారు.నేను పనిచేస్తున్న కంపెనీలో.. నా నిశ్చితార్థం & వివాహం గురించి రెండు నెలల ముందే మేనేజర్లకు సమాచారం ఇచ్చాను. అయితే వాళ్లు దానిని సీరియస్‌గా తీసుకోలేదని.. పైగా పెళ్లి ఎమర్జెన్సీ కాదని చెప్పినట్లు ఉద్యోగి రెడ్దిట్ పోస్టు ద్వారా వివరించారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఉద్యోగం కంటే వ్యక్తిగత జీవితం ముఖ్యమని, అవసరమైతే కొంతకాలం ఉద్యోగం మానేయమని ఒకరు వెల్లడించగా.. చాలా కంపెనీలు ఇలాగే ఉన్నాయని, ఉద్యోగుల అవసరాలను సైతం గుర్తించడం లేదని మరొకరు వెల్లడించారు. జీవితంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమని ఇంకొకరు అన్నారు.కొన్ని సంస్థలు ఇప్పటికి కూడా పనికి ఇచ్చిన ప్రాధాన్యత.. ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ఈ విషయంపై గతంలో చాలా వార్తలు వెల్లడయ్యాయి. ''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా'' అంటూ గతంలో లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు.

Key Allocations for Tamil Nadu Union Budget 2026–274
తమిళనాడు సంస్కృతి పరిరక్షణకు..

డీఎంకే ఏలుబడిలో ఉన్న తమిళనాడుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా అరుదైన ఖనిజాల రవాణా కారిడార్‌ను నెలకొల్పనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతోపాటు చెన్నై మీదుగా పయనించే హైస్పీడ్‌ రైలు లింక్‌లను అభివృద్ధిచేయనున్నారు. పశ్చిమ కనుమల మార్గంలో పొధుగైమలై కొండ ప్రాంతంలో హైకింగ్, ట్రెక్కింగ్, మౌంటేన్‌ బైకింగ్‌ వంటి సదుపాయాలు కల్పించనున్నారు.పులికాట్‌ సరస్సుకు విచ్చేసే విదేశీ పక్షుల కోలాహలం, ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించేందుకు బర్డ్‌ వాచింగ్‌ పాయింట్లను నిర్మించనున్నారు. త్వరలో తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాల నిధులను భారీగా కేటాయించడం విశేషం. ఇనుప రాతి యుగం నాటి ప్రఖ్యాత ఆదిచనల్లూర్‌ ప్రాంతంలో పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ లభించిన పురాతన రాళ్లు, ఆనాటి నాగరికత వైభవాన్ని చాటే వస్తువులతో ఆర్కియాలాజికల్‌ సైట్‌ను అభివృద్ధిచేయనున్నారు.నాటి సంస్కృతికి కళ్లకు కట్టేలా అభివృద్ధి చేస్తామని ఆమె వెల్లడించారు. నడకదారిలో మొత్తం పురాతత్వ ప్రాంతాన్ని కలియతిరిగేలా వాక్‌వేలను నిర్మించనున్నారు. అక్కడి ప్రాచీన వస్తు వుల విశిష్టతను కథల రూపంలో చెప్పే లా, నాటి సాంకేతికతలను విడమర్చి విశదీకరించేలా గైడ్‌లను అందుబాటు లోకి తేనున్నారు. పాడైన ప్రాచీన వస్తు వులకు మరమ్మతులు, సంరక్షణ కోసం కన్జర్వేటివ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయ నున్నారు.పురాతత్వ ప్రాంతానికి విచ్చేసే పర్యా టకులు, విదేశీ సందర్శకుల్లో ఆ ప్రాంతంపై మరింత అవగాహన పెంచేలా ఎగ్జిబిషన్‌ల వంటివి ఏర్పా టుచేయనున్నారు. ‘అత్యంత అరుదైన మూలకాల కోసం ఖనిజాల తవ్వకం కోసం తమిళనాడులో రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ను ఏర్పాటుచేయబోతున్నాం. ఖనిజాల శుద్ధి, పరిశోధన, తయారీని మరింతగా ప్రోత్సహిస్తాం’ అని మంత్రి నిర్మల అన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్‌.. భారీ తగ్గుదల!

NHAI Scraps FASTag KYV From 1st February 20265
NHAI కొత్త రూల్.. ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు గుడ్‌న్యూస్‌!

ఫాస్ట్‌ట్యాగ్ విధానంలో.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కీలకమైన సంస్కరణను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే FASTag యాక్టివేషన్ సమయంలో వాహన వివరాలను ధృవీకరించే పూర్తి బాధ్యతను బ్యాంకులకే అప్పగించింది.ఇంతకు ముందు.. వాహన యజమానులు అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించి ఫాస్ట్‌ట్యాగ్ పొందిన తరువాత కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉండేది. దీని వల్ల యాక్టివేషన్ ఆలస్యం కావడం, టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవడం, రిఫండ్స్ నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి.కొత్త విధానంతో.. ఫాస్ట్‌ట్యాగ్ జారీ తరువాత ప్రత్యేకంగా కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకులే మొదటిసారి వాహన పత్రాలను సరిగా పరిశీలించి ధృవీకరిస్తాయి. ఫలితంగా FASTag జారీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇది లక్షలాది మంది వాహన వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుంది.కేవైసీ సడలింపు కేవలం కొత్తగా జారీ అయ్యే ఫాస్ట్‌ట్యాగ్‌లకు మాత్రమే కాకుండా.. ఇప్పటికే జారీ చేసినవాటికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇకపై కేవైసీ తప్పనిసరి కాదు. అయితే.. ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగానికి సంబంధించిన మోసాలు జరిగినట్లు అనుమానం తలెత్తితే, కేవైసీ చేసుకోవాల్సిన ఉంటుంది.

Modi 15  Budgets And Markets Fell Down Eight Times in India6
15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!

దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మొత్తం 15 సార్లు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో బడ్జెట్‌ రోజున సెన్సెక్స్‌ ఎనిమిది సార్లు నష్టాలు మూటగట్టుకుంది. ఏడు పర్యాయాలు లాభాలు ఆర్జించింది. ఇందులో 2019, 2024 సాధారణ ఎన్నికలకు ముందు రెండుసార్లు మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.బడ్జెస్ట్ రోజు సెన్సెక్స్ ఇలా..➤2014 జూలై 10 - 72 పాయింట్ల లాభం: 25,373 వద్ద ముగింపు➤2015 ఫిబ్రవరి 28 - 141 పాయింట్ల లాభం: 29,362 వద్ద ముగింపు➤2016 ఫిబ్రవరి 29 - 152 పాయింట్ల నష్టం: 23,002 వద్ద ముగింపు➤2017 ఫిబ్రవరి 1 - 486 పాయింట్ల లాభం: 28,142 వద్ద ముగింపు➤2018 ఫిబ్రవరి 1 - 58 పాయింట్ల నష్టం: 35,907 వద్ద ముగింపు➤2019 ఫిబ్రవరి 1 - 213 పాయింట్ల లాభం: 36,469 వద్ద ముగింపు➤2019 జూలై 5 - 58 పాయింట్ల నష్టం: 39,513 వద్ద ముగింపు➤2020 ఫిబ్రవరి 1 - 395 పాయింట్ల నష్టం: 39,736 వద్ద ముగింపు➤2021 ఫిబ్రవరి 1 - 2,315 పాయింట్ల లాభం: 48,601 వద్ద ముగింపు➤2022 ఫిబ్రవరి 1 - 848 పాయింట్ల లాభం: 58,863 వద్ద ముగింపు➤2023 ఫిబ్రవరి 1 - 158 పాయింట్ల లాభం: 59,708 వద్ద ముగింపు➤2024 ఫిబ్రవరి 1 - 107 పాయింట్ల నష్టం: 71,645 వద్ద ముగింపు➤2024 జూలై 23 - 73 పాయింట్ల నష్టం: 80,429 వద్ద ముగింపు➤2025 ఫిబ్రవరి 1 - 5 పాయింట్ల నష్టం: 77,506 వద్ద ముగింపు➤2026 ఫిబ్రవరి 1 - 1,843 పాయింట్ల నష్టం: 80,723 వద్ద ముగింపు

Advertisement
Advertisement
Advertisement