Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock market news and views1
గణాంకాలతో మార్కెట్ల తీరెటు?

దేశీ స్టాక్‌ మార్కెట్లకు ఈ వారం ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. అయితే ఇటీవల ఆంత్రోపిక్, శాప్‌ ఏఐ టూల్స్‌ అమెరికా నుంచి ఆసియా వరకూ టెక్నాలజీ రంగాన్ని కుదిపేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇకపై మార్కెట్లు, ఇన్వెస్ట్‌మెంట్ల తీరెలా ఉండవచ్చంటూ నిపుణుల మధ్య చర్చలు అధికమయ్యాయి. వీటిమధ్య ఈ వారం ట్రెండ్‌పై పలు అంశాల ప్రభావం ఉంటుందని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. దేశీయంగా నేడు(16న) జనవరి నెల టోకు ధరల వివరాలు(డబ్ల్యూపీఐ) వెల్లడికానున్నాయి. 2025 నవంబర్‌లో 0.32 శాతం నీరసించినప్పటికీ డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ వార్షికంగా 0.83 శాతం బలపడింది. వెరసి గత మూడు నెలల్లో తొలిసారి పెరిగింది. ఏప్రిల్‌ తదుపరి వేగమందుకుంది. రిటైల్‌ ధరలు(సీపీఐ) 2.75 శాతం ఎగసిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క వాణిజ్య గణాంకాలు సైతం వెలువడనున్నాయి. డిసెంబర్‌లో ఎగుమతులకంటే దిగుమతులు అధికమై వాణిజ్య లోటు 25 బిలియన్‌ డాలర్లకు చేరింది. నవంబర్‌లో ఇది 24.53 బిలియన్‌ డాలర్లుకాగా.. 2024 డిసెంబర్‌లో 20.6 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ బాటలో వారాంతాన ఫిబ్రవరి నెలకు తయారీ, సరీ్వసులు, కాంపోజిట్‌ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. విదేశీ అంశాలు ఫిబ్రవరి 17న యూఎస్‌ ఏడీపీ ఉపాధి గణాంకాలు, హౌసింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్, పారిశ్రామికోత్పత్తి వివరాలు విడుదలకానున్నాయి. అంతేకాకుండా ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ సమీక్షా వివరాలు(మినిట్స్‌) సైతం వెల్లడికానున్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లను యథాతథంగా 3.5–3.75 శాతం వద్ద కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇవి 2022 తదుపరి కనిష్టంకాగా.. తద్వారా మూడు వరుస రేట్ల కోతకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. వీటితోపాటు వ్యక్తిగత వ్యయాల ఇండెక్స్, 2025 అక్టోబర్‌–డిసెంబర్‌ జీడీపీ ముందస్తు అంచనాలు సైతం విడుదలకానున్నాయి. పెట్టుబడుల ప్రవాహమెటు? → ఆంత్రోపిక్, శాప్‌ విడుదల చేసిన ఏఐ టూల్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారిత సరీ్వసుల రంగంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు నిర్వహించే కొన్ని రకాల ప్రాజెక్టులకు చెక్‌ పడటంతోపాటు.. సిబ్బందిపై సైతం భారీ సంఖ్యలో వేటు వేయవలసి వస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇవి ఆందోళనలుగా మారి ప్రపంచవ్యాప్తంగా ఐటీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలకు కారణమవుతున్నాయి. దీంతో ప్రపంచ ఇన్వెస్టర్ల దృష్టి ఇతర రంగాలవైపు మళ్లవచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీ కస్టమర్‌ ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఆటోసహా కొన్ని వినియోగ ఆధారిత రంగాలవైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు. → టారిఫ్‌ ఆందోళనలు ఉపశమిస్తున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాల తీరు, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులు, ఆర్‌బీఐ, ఫెడరల్‌ రిజర్వ్‌ భవిష్యత్‌ పాలసీ నిర్ణయాలపై అంచనాలు తదితర అంశాలు సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు విశ్లేషకులు వివరించారు. యూఎస్, భారత్‌లలో ద్రవ్యోల్బణం, జీడీపీ పురోగతి వంటి అంశాలు ఫెడ్, ఆర్‌బీఐ పరపతి విధానాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వెరసి వీటికి ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. → క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాల ప్రభావంతో పలు రంగాల కౌంటర్లు యాక్టివ్‌గా కదులుతున్నట్లు నాయిర్‌ తెలియజేశారు. పటిష్ట ఫలితాలు, ఆర్డర్లు సాధించిన కౌంటర్లు బలపడుతుంటే.. నిరాశపరచిన స్టాక్స్‌ నుంచి ఇన్వెస్టర్లు తప్పుకుంటున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి మార్కెట్‌ భారీ ఆటుపోట్లలోనూ విభిన్న రంగాల కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నట్లు వివరించారు. → గత వారాంతాన వెలువడిన ఆశావహ యూఎస్‌ ఉపాధి గణాంకాలు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు యోచనకు చెక్‌ పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం విదేశీ మార్కెట్లలోనూ అమ్మకాలు తలెత్తినట్లు మిశ్రా తెలియజేశారు.ఇండెక్సులు అటా.. ఇటా?గత వారం యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌ ఆశలు కలి్పంచినప్పటికీ ఏఐ ఆందోళనలు అమ్మకాలకు దారి చూపాయి. వెరసి ఈ వారం సైతం ఇండెక్సులు బలహీనంగా కదిలే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. → నిఫ్టీకి 25,200–25,100 పాయింట్ల వద్ద మద్దతుకు వీలుంది. ఒకవేళ బలపడితే 26,000–26,100 పాయింట్లవరకూ బౌన్స్‌కావచ్చు. అయితే నిఫ్టీ 25,100 దిగువకు చేరితే 24,700వరకూ పతనంకావచ్చు. → సెన్సెక్స్‌ తొలుత 82,450–82,000 పాయింట్ల వద్ద సపోర్ట్‌ తీసుకునే వీలుంది. ఒకవేళ తదుపరి జోరందుకుంటే 84,500–85,000 వరకూ పుంజుకునే చాన్స్‌ ఉంది. అయితే నీరసిస్తే 82,000 పాయింట్ల దిగువన 80,500–80,000 స్థాయిలో మద్దతు కనిపించవచ్చు.గత వారమిలా..గత వారం(9–13) దేశీ స్టాక్‌ మార్కెట్లు ఐటీ రంగ కౌంటర్లలో భారీ అమ్మకాల కారణంగా డీలా పడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నికరంగా 954 పాయింట్లు(1.15 శాతం) క్షీణించి 82,627 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 223 పాయింట్లు(0.9 శాతం) నీరసించి 25,471 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ సైతం 1.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి.ఎఫ్‌పీఐల కొనుగోళ్లుఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఈ నెల 2–13 మధ్య నికరంగా రూ. 19,675 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. యూరప్‌సహా.. యూఎస్‌తోనూ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే అంతకుముందు 2026 జనవరి(రూ. 35,962 కోట్లు), 2025 డిసెంబర్‌(రూ. 22,611 కోట్లు), నవంబర్‌(3,765 కోట్లు)లలో నికరంగా అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Bank Locker Liability in India, sakshi special story2
మీ లాకర్‌ ఎంత భద్రం?

బ్యాంకు లాకర్లో పెట్టేదే భద్రంగా ఉంటాయని. మరి అక్కడే చోరీ జరిగితే? తమకు సంబంధం లేదని బ్యాంకులు తప్పించుకోజూస్తే? పశి్చమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఇదే జరిగింది. 2016లో ఈ బ్యాంకు లాకర్లో ఓ కస్టమర్‌ ఉంచిన విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. రాష్ట్ర వినియోగ వివాదాల పరిష్కార కమిషన్‌ రూ.59 లక్షల పరిహారానికి ఆదేశించింది. బ్యాంకు జాతీయ కమిషన్‌కు అప్పీల్‌ చేసింది. తాజాగా జాతీయ కమిషన్‌ తీర్పునిస్తూ... లాకర్‌ భద్రతలో వైఫల్యం ఉన్నప్పుడు బ్యాంక్‌ తప్పించుకోలేదని స్పష్టంచేసింది. నష్ట పరిహారాన్ని రూ.5 లక్షలకు తగ్గించింది. మరి ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిందేంటి? అదే ఈ ‘వెల్త్‌’ స్టోరీ...రెండేళ్లలో బంగారం ధర 150 శాతానికి పైనే పెరిగింది. వెండి ధర ఐదు రెట్లు ఎగిసింది. మరి ఇంతటి విలువైన వస్తువుల్ని ఇంట్లో ఉంచటం సేఫేనా? పోనీ బ్యాంకు లాకర్లో పెడితే భద్రతకు గ్యారంటీ ఉంటుందా? వాస్తవానికి ఇల్లయినా, బ్యాంకయినా పటిష్ట రక్షణ చర్యలతోనే అక్కడ పెట్టిన వస్తువులకు భద్రత. ఒకవేళ లాకర్‌లో విలువైన వస్తువులను కోల్పోతే పరిస్థితేంటి? అందుకు బ్యాంక్‌లు పూర్తి బాధ్యత తీసుకోవా? సేఫ్ట్‌ లాకర్‌ విషయంలో కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయా? అసలు లాకర్‌ ఎవరికి అవసరం? ఒకసారి చూద్దాం...లాకర్‌ చార్జీలు ఎంతంటే..→ ప్రాంతం, బ్యాంక్, లాకర్‌ పరిమాణం ఆధారంగా చార్జీలుంటాయి → సాధారణంగా చిన్న లాకర్‌కు వార్షిక చార్జీ రూ.1,000–3,000 → మధ్యస్థ లాకర్‌కు రూ.3– 6వేలు... పెద్ద లాకర్‌కు రూ.6 –12 వేలు → ఈ చార్జీపై జీఎస్‌టీని ... ఒప్పందానికి సంబంధించి స్టాంప్‌ డ్యూటీని చెల్లించాలి. → లాకర్‌ కోసం బ్యాంక్‌లు డిపాజిట్లు అడుగుతాయి. లాకర్‌ను క్లోజ్‌ చేసినప్పుడు వీటిని తిరిగి పొందొచ్చు. → వార్షిక చార్జీలు బకాయి పడి, కస్టమర్‌ స్పందించని సందర్భాల్లో లాకర్‌ బ్రేకింగ్‌కు అయ్యే చార్జీలను బ్యాంక్‌లు వసూలు చేస్తాయి.బ్యాంకులపై బాధ్యత లేదా..?→ లాకర్ల నిర్వహణకు సంబంధించి బ్యాంకులపై బాధ్యత ఎంత వరకు అన్నది కస్టమర్‌తో కుదుర్చుకునే ఒప్పంద పత్రాల్లో వివరంగా ఉంటుంది. → నిర్లక్ష్యం లేదా భద్రత వైఫల్యం కారణంగా లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే అందుకు బ్యాంకులదే బాధ్యత. → చోరీ, దోపిడీ, అగ్ని ప్రమాదం, భవనం కూలిపోవడం లేదా బ్యాంక్‌ ఉద్యోగుల మోసం కారణంగా నష్టం ఏర్పడితే పరిహారం చెల్లించాల్సిందే. → ప్రకృతి విపత్తులు, భూకంపాలు, వరదల కారణంగా లాకర్లలో వాటికి నష్టం కలిగితే బ్యాంకులపై బాధ్యత ఉండదు. కానీ, బ్యాంక్‌ తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్ల ఈ సమయాల్లో నష్టం ఏర్పడితే అప్పుడు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. → లాకర్‌లోని వాటికి నష్టం జరిగినప్పటికీ.. బ్యాంకుల బాధ్యత పరిమితంగానే ఉంటుంది. లాకర్‌ వార్షిక అద్దె చార్జీలకు గరిష్టంగా 100 రెట్ల వరకే అవి చెల్లిస్తాయి. ఉదాహరణకు లాకర్‌లోని రూ.20 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకుండాపోయాయనుకోండి. లాకర్‌ చార్జీ రూ.6,000 ఉంటే, అప్పుడు గరిష్టంగా రూ.6 లక్షల మొత్తాన్ని బ్యాంక్‌ చెల్లిస్తుంది. → వరుసగా మూడేళ్ల పాటు వార్షిక చార్జీలు చెల్లించకపోతే లేదా ఏడేళ్లపాటు లాకర్‌ను తెరవకపోతే నోటీసు జారీ చేసి.. మూడు నెలల తర్వాత లాకర్లను బ్యాంక్‌లు బ్రేక్‌ చేయాల్సి ఉంటుంది. నోటీసులకు స్పందన రానప్పుడు.. పేపర్‌ ప్రకటన ఇచ్చి, ఇద్దరు సాక్షుల సమక్షంలోనే ఈ పని చేయాలి. ఇన్సూరెన్స్‌తో రక్షణ → లాకర్లను సురక్షితంగా ఉంచేందుకు దాదాపు అన్ని బ్యాంక్‌లు గట్టి చర్యలు చేపడతాయి. అయినా, కొన్ని ఘటనల్లో కస్టమర్లకు నష్టం జరుగుతుంటుంది → కాబట్టి లాకర్లలో విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్లు ఉంచే వారు వ్యక్తిగతంగా వాటికి ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలి. → బ్యాంకుల మాదిరి లాకర్‌ చార్జీకి గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం అన్న పరిమితి బీమాలో ఉండదు. → బంగారం, వెండి ఆభరణాలు, విలువైన రాళ్లు, ఇతర విలువైన వస్తువులు, పత్రాలకు సైతం బీమా రక్షణ పొందొచ్చు. → దోపిడీ, దొంగతనాలు, బ్యాంకు ఉద్యోగుల నిర్లక్ష్యం లేదా మోసం, అగ్ని ప్రమాదాలు, పేలుడు, భూకంపాలు లేదా వరదలు కారణంగా లాకర్‌లోని వాటికి ఏర్పడే నష్టానికి బీమా పరిహారం పొందొచ్చు. → లాకర్లలో ఉంచిన కరెన్సీ నోట్లకు నష్టం వాటిల్లితే బీమా పరిహారం రాదు. → తుప్పు పట్టడం, చెద పురుగులు, వాతావరణంలో తేమ కారణంగా ఏర్పడే నష్టానికి కూడా బీమా పాలసీలో రక్షణ ఉండదు. ఇలాంటి లాకర్లుంటేనే భరోసా... → బ్యాంక్‌లు లాకర్లకు సంబంధించి సీసీటీవీ కెమెరా, అలారమ్‌ (హెచ్చరించే) సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. → లాకర్‌లు సురక్షితంగా ఉండేలా భవన నిర్మాణం ఉండాలి. రాత్రిళ్లు తగినంత భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. → లాకర్‌ తెరిచిన ప్రతి సందర్భంలో ఖాతాదారుడి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ను పంపించాల్సి ఉంటుంది. → లాకర్‌కు సంబంధించి బ్యాంక్‌లకు ఉండే బాధ్యత ఎంత మేర? అనేది ఒప్పందంలో వివరంగా ఉండాలి. → నామినేషన్‌ సదుపాయం కలి్పంచాలి. ఒప్పందంపై సంతకాలు చేయించుకుని, కాపీని కస్టమర్‌కు సైతం అందించాలి.వీరికి పెద్దగా ఉపయోగం ఉండదు.. → కేవలం కొన్ని ఆభరణాలే ఉన్నా... వాటి విలువ తక్కువగా ఉన్నా.. → బ్యాంక్‌కు వెళ్లి లాకర్‌ నుంచి తీసుకొచ్చి, మళ్లీ లాకర్లో పెట్టడం వీలు పడని వారు.అసలు లాకర్లు ఎవరికి..? → అధిక విలువ కలిగిన ఆభరణాలున్నప్పుడు. ముఖ్యంగా వారసత్వంగా వచి్చన ఆభరణాలున్నవారికి అనుకూలం. → వ్యాపార లావాదేవీలకు సంబంధించి సున్నితమైన డాక్యుమెంట్లు ఉన్నప్పుడు. → ప్రాపర్టీ ఒరిజినల్‌ డాక్యుమెంట్లు, పార్టనర్‌íÙప్‌ డీడ్లు ఉన్నవారు. → పటిష్టమైన రక్షణ చర్యలు లేని అద్దె ఇళ్లలో నివసించే వారు. → ఇళ్లల్లో కేవలం వృద్ధులే ఉండే వారికి బ్యాంకు లాకర్లు ఎంతో ఉపయోగకరం. లాకర్‌లో వేటికి చోటు..? → బంగారం, వజ్రాభరణాలు → ప్రాపర్టీ క్రయ, విక్రయ దస్తావేజులు → వీలునామాలు, చట్టబద్ధమైన పత్రాలు → బాండ్‌ సరి్టఫికెట్లు, అరుదైన కలెక్షన్లునమోదు చేస్తే నయం...→ లాకర్‌లో ఏవేవి ఉంచుతున్నారనే విషయాన్ని ఒక రికార్డులో రాసి ఉంచుకోవటం మంచిది. → ఆభరణాలు, వాటి బరువు, వస్తువుల వివరాలు రాయండి. వీటి కొనుగోలు బిల్లులు, ఫొటోలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. → లాకర్‌లో తీసి, పెడుతున్న ప్రతి సారీ వాటి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి. → ఆభరణాలకు సంబంధించి విలువ నిర్ధారణ సరి్టఫికెట్లు దగ్గర ఉంచుకోవాలి. → లాకర్‌కు తప్పకుండా నామినేషన్‌ తీసుకోవాలి. అవసరమైనప్పుడు నామినీని అప్‌డేట్‌ చేసుకోవాలి. → ఏడాదిలో ఒకసారి అయినా లాకర్‌ను తెరిచి, మూయడం చేయాలి. → డాక్యుమెంట్లు తేమ కారణంగా దెబ్బతినే రిస్క్‌ ఉంటుంది. కనుక దెబ్బతినని విధంగా ప్యాక్‌ చేసి పెట్టాలి.వీటిని ఉంచకండి.. → దేశ, విదేశీ కరెన్సీ నోట్లు → హానికారక మెటీరియల్స్‌ → పాడైపోయే వస్తువులు → ప్రమాదకరమైన వస్తువులు → ఆయుధాలు, డ్రగ్స్, మందుగుండు సామగ్రి → చట్టవిరుద్ధమైనవి కూడా..నష్టం జరిగితే... → లాకర్లో ఉంచినవి దెబ్బతిన్నట్టు గుర్తించినా లేదా కనిపించక పోయినా బ్యాంక్‌ మేనేజర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. → బ్యాంక్‌ ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందో అక్కడి వెళ్లి ఫిర్యాదు చేయాలి. → కస్టమర్‌ నిర్లక్ష్యం లేని సందర్భాల్లో జరిగిన నష్టానికి బ్యాంక్‌లు పరిహారం చెల్లించాల్సిందే. → బ్యాంక్‌లు పరిహారానికి నిరాకరిస్తే బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించొచ్చు. → అక్కడ న్యాయం జరగకపోతే జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను సంప్రదించాలి.

Are You Going To Be Charged On Every Rs 1000 UPI Transfer Know The Details3
గూగుల్ పే, ఫోన్‌పే ట్రాన్సాక్షన్.. రూ.1000 దాటితే ఫీజులా?

దేశంలో యూపీఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజూ లెక్కకు మించిన నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రూ. 1000 కంటే ఎక్కువ మొత్తం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.రూ.1000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే.. సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖండించింది. ప్రస్తుతం వ్యక్తుల మధ్య లేదా వ్యక్తులు - వ్యాపారాలు మధ్య జరిగే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించింది. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని దెబ్బతీసే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. 2026–27 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం UPI & RuPay డెబిట్ కార్డ్ లావాదేవీలకు మద్దతు ఇవ్వడానికి రూ. 2,000 కోట్లు కేటాయించింది. చిరు వ్యాపారులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) భారం పడకుండా ఉండటానికి ఈ నిధులను కేటాయించనున్నారు. దీని ద్వారానే బ్యాంకులకు, పేమెంట్ అగ్రిగేటర్లకు ప్రోత్సాహకాలు ఇస్తోంది.ఇదీ చదవండి: ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?ప్రస్తుతం భారతదేశంలో చాలావరకు యూపీఐ లావాదేవీలే జరుగుతున్నాయి. నేడు చిన్న బట్టి కొట్టు నుంచి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వరకు దాదాపు అందరూ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రోజుకు ఒక లక్ష రూపాయల వరకు పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. బిజినెస్ అకౌంట్ అయితే రోజుకి రూ. 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.

Globally Gold and Silver Are Slowly Coming Out of The High Volatility Phase4
ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?

కొన్ని రోజులకు ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. రేట్లు పెరుగుతున్నప్పుడు.. ఏ ధరకైనా కొనేయాలని ఎగబడిన కొంతమంది జనం.. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా అని వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తున్నారని ప్రముఖ ఇన్వెస్టర్, మార్కెట్ మాస్ట్రోలో డైరెక్టర్ 'అంకిత్ యాదవ్' తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.ధరలు పెరిగినప్పుడు ఉత్సాహం చూపించారని, రేటు తగ్గుతున్నప్పుడు ప్రజలు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఇది మార్కెట్‌లో సహజమైన అంశం. అయితే ఇది పూర్తి స్థాయి క్రాష్ అని నిర్దారించలేము. ఇదొక స్లోడౌన్ దశ మాత్రమే.వెండి ధర భవిష్యత్తులో 100 డాలర్లు లేదా 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రధాన కారణమవుతాయి.ప్రపంచం మొత్తం.. ప్రస్తుతం భారీ రుణభారంతో ఉంది. ముఖ్యంగా అమెరికా అప్పులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్‌కు (Fed) అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో వారు ఎక్కువ లిక్విడిటీ అందించడం, అంటే మరింత డబ్బు ముద్రించడానికి సిద్దపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంటుంది.డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే బంగారం లేదా వెండి కలిగి ఉన్నవాళ్లు దాన్ని నిల్వ చేసుకోండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కొత్తగా గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటే.. తప్పకుండా ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ధరలు చౌకగా లేవు. ఎప్పుడైనా ఎక్కువ ధర వద్ద పెట్టుబడి పెట్టడం వల్ల మూలధన నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి త్వరగా ధనవంతులు కావాలని తొందరపడకూడదు. కొంత ఓపిగ్గా ఎదురు చూడండి అని.. అంకిత్ యాదవ్ వివరించారు.🚨 Big update: Gold & Silver 🩶💛✅Globally, gold and silver are slowly coming out of the high‑volatility phase. The craze to buy silver at any price is clearly cooling off – one small slowdown or mini‑crash and people’s attention has already shifted.While prices were rising…— Ankit Yadav (@ankit_investing) February 14, 2026

Tata Punch EV Facelift 590 Km Range On Single Charge5
పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్.. 593 కిమీ రేంజ్!

టాటా మోటార్స్ ఫిబ్రవరి 20న.. భారతదేశంలో పంచ్ ఫేస్‌లిఫ్టెడ్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనుంది. అయితే ఈ కారు లాంచ్ కావడానికి ముందే.. టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది ఎంత రేంజ్ ఇస్తుందనే విషయం కూడా లీక్ అయింది. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ ఒక ఫుల్ ఛార్జ్‌పై 593.6కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. కారు చిన్నదే అయినా.. మంచి పర్ఫామెన్స్ ఇస్తుందని తెలుస్తోంది. దీని ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది.టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ 25 కిలోవాట్, 35 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లను పొందుతుంది. చిన్న బ్యాటరీ 82 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. పెద్ద బ్యాటరీ 122 హార్స్ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 45 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలో కూడా లభించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీటాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్.. బంపర్ క్లీనర్ లేఅవుట్‌తో రీడిజైన్ చేయబడి ఉండటం చూడవచ్చు. వై షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఛార్జింగ్ స్లాట్ అదే విధంగా ఉంటుంది. ఎయిర్ డ్యామ్ & స్కిడ్ ప్లేట్ కూడా కొంత అప్డేట్ అయ్యాయి. వెనుక వైపు.. ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్ కనిపిస్తుంది.

India To Build 1st Underwater Road Rail Tunnel At Rs 18000 Crore6
దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం

అస్సాంలో గోహ్‌పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ విలువ ఏకంగా రూ. 18,662 కోట్లు. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం నిర్మించనున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది.ప్రస్తుతం.. NH715లోని నుమాలిఘర్ & NH-15లోని గోహ్‌పూర్ మధ్య దూరం 240 కి.మీ. ఇది NH-52లోని సిల్‌ఘాట్ సమీపంలోని కాలియాభంభోరా మీదుగా వెళుతుంది. ఈ ప్రయాణం నుమాలీగఢ్, కాజిరంగ నేషనల్ పార్క్, బిస్వనాథ్ టౌన్ వంటి ప్రాంతాల గుండా సాగుతుంది. కొత్త గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణంతో దూరం & ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీనిని ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్స్ట్రక్షన్ (EPC) మోడల్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదికి కింద నిర్మించే ఈ రోడ్డు - రైలు టన్నెల్ ద్వారా.. అస్సాం మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ & ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీఈ కారిడార్ 11 ఆర్థిక కేంద్రాలు, మూడు సామాజిక కేంద్రాలు, రెండు పర్యాటక కేంద్రాలు & ఎనిమిది లాజిస్టిక్ కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అంతే కాకుండా నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు, రెండు విమానాశ్రయాలు, రెండు అంతర్గత జలమార్గాలతో కూడిన మల్టీ మోడల్ కనెక్టివిటీని ఇది బలోపేతం చేస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యం పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.

Advertisement
Advertisement
Advertisement