Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Silver prices in Delhi jumped to a record Rs 1,94,400 per kilogram1
రూ.2,00,000 చేరువలో వెండి

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్‌ నెలకొనడంతో వెండి ధర వరుసగా మూడో రోజు బలపడి, రూ. 2 లక్షల మార్కుకు మరింత చేరువలోకి వచి్చంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం శుక్రవారం న్యూఢిల్లీ మార్కెట్లో కిలోకి ఏకంగా రూ.5,100 మేర పెరిగి రూ. 1,99,500 వద్ద క్లోజయ్యింది. ఇది సరికొత్త రికార్డు స్థాయి. ‘దేశీ మార్కెట్లో స్పాట్‌ వెండి ధరలు మరో కొత్త గరిష్టానికి ఎగిశాయి. అటు బంగారం కూడా భారీగా పెరిగి, రికార్డు స్థాయికి దగ్గర్లో ట్రేడవుతోంది. గత కొద్ది రోజులుగా కన్సాలిడేట్‌ అవుతున్న పసిడి రేటు, రూపాయి బలహీనంగా ఉండటం లాంటి అంశాల కారణంగా, మళ్లీ పెరగడం మొదలైంది‘ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్టు దిలీప్‌ కుమార్‌ తెలిపారు. స్థానిక బులియన్‌ స్పాట్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,100 పెరిగి రూ. 1,33,600 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 58.61 డాలర్లు (1.37 శాతం) పెరిగింది. 4,338.40 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్‌ మార్కెట్లో వెండి రేటు 64.95 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను పావు శాతం (25 బేసిస్‌ పాయింట్లు) తగ్గించడంతో పసిడి, వెండి ధరలు తదనుగుణంగా స్పందిస్తున్నట్లు కోటక్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (కరెన్సీ, కమోడిటీ) అనింద్య బెనర్జీ పేర్కొన్నారు.

Mexico new import duties put pressure on auto component exporters2
ఎగుమతులకు మెక్సికో టారిఫ్‌ల దెబ్బ

న్యూఢిల్లీ: దేశీ ఎగుమతులపై మెక్సికో ప్రకటించిన టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ఆటో, ఆటో విడిభాగాలు, మెటల్, ఎల్రక్టానిక్స్, కెమికల్స్‌ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన మెక్సికో తాజాగా భారత్‌ దిగుమతులపై సుంకాల పెంపును చేపట్టింది. ఇవి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మెక్సికోతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం పరిధిలోలేని దేశాలపై 5 నుంచి 50 శాతంవరకూ దిగుమతి సుంకాలు వర్తించనున్నాయి. భారత్‌సహా చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాలలోని వివిధ రంగాలు, పరిశ్రమలపై ఈ టారిఫ్‌లు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది(2024–25) మెక్సికోకు 5.75 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులను భారత్‌ చేపట్టింది. అయితే తాజా టారిఫ్‌ల పెంపు కారణంగా మెక్సికోకు ఎగుమతులు వ్యయభరితమయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గతేడాది ప్రయాణికుల వాహన ఎగుమతులు 938.35 మిలియన్‌ డాలర్లుకాగా.. 20 శాతం నుంచి 35 శాతం మధ్య టారిఫ్‌ పెంపు వర్తించనున్నట్లు గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనేíÙయేటివ్‌(జీటీఆర్‌ఐ) తెలియజేసింది. దీంతో ధరల పోటీతత్వం నీరసించవచ్చని అభిప్రాయపడింది. ఆటో విడిభాగాలపై ఇది మరింత అధికంగా కనిపించనున్నట్లు పేర్కొంది. ఆటో విడిభాగాల ఎగుమతులు 507.26 మిలియన్‌ డాలర్లుకాగా.. 10–15% సుంకాలు 35 శాతానికి పెరగనున్నట్లు జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలియజేశారు. ఇదేవిధంగా 390.25 మిలియన్‌ డాలర్ల విలువైన మోటార్‌సైకిళ్ల ఎగుమతులు సైతం సవాళ్లను ఎదుర్కోనున్నట్లు తెలియజేశారు. వీటిపై సుంకాలు 20% నుంచి 35 శాతానికి పెరగనున్నట్లు వెల్లడించారు. ఆటో విడిభాగాలపై ఎఫెక్ట్‌ దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమపై తాజాగా మెక్సికో చేపట్టిన దిగుమతి సుంకాల పెంపు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమల సమాఖ్య ఏసీఎంఏ పేర్కొంది. భారత్‌ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో 37 కోట్ల డాలర్ల విలువైన ఆటో విడిభాగాలను మెక్సికోకు ఎగుమతి చేసింది. సుంకాలు భారత్‌ ఎగుమతులపై 35–50% స్థాయిలో పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొ న్నాయి. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చలు వృద్ధిలో ఉన్న ఆటోమోటివ్‌ వాణిజ్యానికి నిలకడను తీసుకురాగలదని విశ్వసిస్తున్నట్లు దేశీ ఆటోమోటివ్‌ విడిభాగ తయారీదారుల అసోసియేషన్‌(ఏసీఎంఏ) డైరెక్టర్‌ జనరల్‌ విన్నీ మెహతా చెప్పారు.

India drone, space-tech boom to add over 2 lakh jobs by 20333
ఉద్యోగాలకు స్పేస్‌ టెక్‌ దన్ను

ముంబై: దేశీ ఏరోస్పేస్, డ్రోన్స్, స్పేస్‌ టెక్‌ పరిశ్రమ 2033 నాటికి అయిదు రెట్లు వృద్ధి చెందనుంది. 44 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. అదే సమయంలో 2 లక్షలకు పైగా ఇంజనీర్లు, పరిశోధకులు, డేటా సైంటిస్టులకు ఉద్యోగావకాశాలు సృష్టించనుంది. వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా ఒక నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన గణాంకాలకు మార్కెట్‌పై పరిశోధనల ఫలితాలను జోడించడం ద్వారా అడెకో దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్కరణలు, ప్రైవేట్‌ రంగం, అంతర్జాతీయ భాగస్వామ్యాల దన్నుతో పరిశోధనల ఆధారిత ధోరణి నుంచి ఏరోస్పేస్, డ్రోన్స్, స్పేస్‌ టెక్‌ పూర్తి స్థాయి పరిశ్రమగా ఎదిగింది. ఈ నేపథ్యంలో స్పేస్‌ పాలసీ అనలిస్టులు, రోబోటిక్స్‌ ఇంజనీర్లు, ఏవియోనిక్స్‌ స్పెషలిస్టులు, జీఎన్‌సీ (గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్‌) నిపుణుల్లాంటి కొత్త రకం ఉద్యోగాలు వస్తున్నాయని నివేదిక తెలిపింది. వీరంతా అంతరిక్ష రంగంలో దేశ లక్ష్యాల సాధనలో కీలకంగా నిలుస్తున్నారని వివరించింది. ‘ప్రభుత్వ దార్శనికత, క్రియాశీలకమైన స్టార్టప్‌ వ్యవస్థ దన్నుతో భారత్‌ అంతర్జాతీయ స్పేస్‌ హబ్‌గా ఎదగనుంది. దీనితో ఇంజనీరింగ్, రీసెర్చ్, డేటా, బిజినెస్‌ తదితర విభాగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు రానున్నాయి’ అని అడెకో ఇండియా డైరెక్టర్‌ దీపేష్‌ గుప్తా తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పుణేలాంటి ప్రాంతాల్లో అత్యధికంగా అవకాశాలు రానున్నాయి. → ఏవియోనిక్స్, క్రయోజెనిక్స్, ఏటీడీసీ (యాటిట్యూడ్‌ డిటరి్మనేషన్, కంట్రోల్‌ సిస్టమ్స్‌), రిమోట్‌ సెన్సింగ్‌ నిపుణులు, స్పేస్‌ హ్యాబిటాట్‌ ఇంజనీర్లకు భారీ వేతనాలు లభించనున్నాయి. సాధారణ టెక్నికల్‌ ఉద్యోగులతో పోలిస్తే 20–30% అధికంగా ఉండనున్నాయి. → భారతీయ అంతరిక్ష పాలసీ 2023 లాంటి సంస్కరణలు, 250 పైచిలుకు స్పేస్‌ స్టార్టప్‌లు, ఇన్‌–స్పేస్‌ కింద రూ. 1,000 కోట్ల వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దన్నుగా నిలుస్తాయి. కొత్త ఆవిష్కరణలు, ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు తోడ్పడనున్నాయి. → అంతరిక్ష రంగంలో సిబ్బందిపరంగా వైవిధ్యం పెరగనుంది. ఇస్రో యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రాం (యువికా), విజ్ఞాన్‌ జ్యోతి ప్రోగ్రాం, సమృద్ధ్‌ లాంటి స్కీములతో ఎంట్రప్రెన్యూర్‌íÙప్, సాంకేతిక, పరిశోధన విభాగాల్లోకి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. → గగన్‌యాన్‌ మిషన్, యాక్సియోమ్‌–4 ఐఎస్‌ఎస్‌ ప్రోగ్రాంలో భారత్‌ భాగం కావడం, సొంత స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణంపై కసరత్తు చేస్తుండటం మొదలైన వాటి వల్ల ఆయా రంగాల్లో ప్రతిభావంతులకు డిమాండ్‌ మరింతగా పెరగనుంది. → ప్రస్తుతం అంతర్జాతీయ స్పేస్‌ ఎకానమీలో భారత్‌ వాటా సుమారు 2 శాతంగా ఉంది. 2033 నాటికి 11 బిలియన్‌ డాలర్ల ఎగుమతులతో పాటు తన మార్కెట్‌ను 44 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవడంపై భారత్‌ దృష్టి పెడుతోంది. తద్వారా గ్లోబల్‌ స్పేస్‌ ఎకానమీలో 7–8% వాటాను సాధించాలని నిర్దేశించుకుంది.

Gold Price Again Hike Today4
గంటల వ్యవధిలో.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 12) ఉదయం గరిష్టంగా రూ. 2180 పెరిగింది. అయితే.. సాయంత్రానికి రేటు మళ్లీ పెరిగింది. దీంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు ఎలా ఉందనే.. విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,21,600 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,22,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 500 పెరిగిందన్న మాట. (ఉదయం 1750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 500 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 2250 పెరిగింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 2450 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,33,200 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 1910 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 540 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 2450 పెరిగింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 2450 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,33,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 2250 పెరిగి.. 1,22,250 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 3490 పెరగడంతో రూ. 1,34,950 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 3200 పెరిగి.. 123700 రూపాయల వద్దకు చేరింది.

IndiGo moves to Delhi High Court for Rs 900 crore customs refund5
కోర్టుకు ఎక్కిన ఇండిగో..

ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కోర్టుకు ఎక్కింది. విమాన ఇంజిన్లు, విదేశీ మరమ్మతుల తర్వాత తిరిగి దిగుమతి చేసుకున్న విడిభాగాలపై చెల్లించిన రూ .900 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.ఆన్‌లైన్‌ లీగల్‌ సమాచార పోర్టల్‌ బార్‌ & బెంచ్‌ కథనం ప్రకారం.. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ శైల్ జైన్ లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ కేసును విచారించింది. అయితే, తన కుమారుడు ఇండిగోలో పైలట్ గా పనిచేస్తున్నాడని పేర్కొంటూ జస్టిస్ జైన్ ఈ కేసు నుండి వైదొలిగారు. ఈ విషయాన్ని ఇప్పుడు వేరే ధర్మాసనం ముందు ఉంచనున్నట్లు నివేదిక తెలిపింది.ఇండిగో వాదన ఇదీ..మరమ్మతుల తర్వాత తిరిగి చేసుకునే దిగుమతులను సర్వీస్‌గా పరిగణించాలే తప్ప తాజా వస్తువుల దిగుమతిగా కాదు.. అనేది ఇండిగో వాదన. తదనుగుణంగానే పన్ను విధించాలని ఈ ఎయిరలైన్స్‌ కోరుతోంది. సంక్షిప్త విచారణ సందర్భంగా, ఇండిగో తరపున సీనియర్ న్యాయవాది వి.లక్ష్మీకుమారన్.. కస్టమ్స్ సుంకం రాజ్యాంగ విరుద్ధమని, అదే లావాదేవీపై "డబుల్ లెవీ" అని వాదించారు.ఇండిగో ఇప్పటికే పునర్‌-దిగుమతి చేసుకునే సమయంలోనే ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని చెల్లించిందని, మరమ్మతులను సర్వీసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద విడిగా జీఎస్టీని చెల్లించిందని చెప్పారు. అయితే, కస్టమ్స్ అధికారులు పునర్‌-దిగుమతిని తాజాగా వస్తువుల దిగుమతిగా పరిగణించి మళ్లీ సుంకాన్ని డిమాండ్ చేశారని విన్నవించారు.మరమ్మతు తర్వాత పునర్‌-దిగుమతులపై రెండుసార్లు సుంకం విధించలేరని కస్టమ్స్ ట్రిబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది. అయితే, ట్రిబ్యునల్ తరువాత మినహాయింపు నోటిఫికేషన్ ను సవరించింది, అటువంటి మార్పులు భవిష్యత్తులో పనిచేస్తాయని స్పష్టం చేసింది. అదనపు లెవీని అనుమతించే నోటిఫికేషన్ లోని భాగాన్ని ట్రిబ్యునల్ కొట్టివేసిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఇండిగో కోర్టుకు తెలిపింది.అదనపు సుంకం చెల్లించి తీరాల్సిందేనని కస్టమ్స్ అధికారులు బలవంతం చేశారని, అంత వరకూ విమానాన్ని నిరవధికంగా గ్రౌండ్ చేయనీయకపోవడంతో తప్పని పరిస్థితిలో 4,000 కంటే ఎక్కువ ఎంట్రీ బిల్లుల ద్వారా రూ.900 కోట్లకు పైగా డిపాజిట్ చేసినట్లు ఇండిగో వివరించింది.

Uses Of Ethanol and Disadvantages Explain6
వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా?

ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్, సీఎన్జీల విషయాన్ని పక్కన పెడితే.. డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి మనదేశంలో చాలా తక్కువ. దేశంలోని కార్లకు సరిపడా ఫ్యూయెల్ కావాలంటే.. ఇతర దేశాల నుంచి తప్పకుండా దిగుమతి చేసుకోవాల్సిందే. దీనికోసం లక్షల కోట్ల డబ్బు ఖర్చు చేయాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. దీనికి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారు. ఈ ఆలోచనల్లో పుట్టుకొచ్చించిందే బ్లెండెడ్ ఇథనాల్.భారతదేశంలో బ్లెండెడ్ ఇథనాల్ ప్రయోగం ఇప్పుడు వచ్చింది కాదు. 2001లోనే ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. అప్పట్లో కేంద్రం 5 శాతం ఇథ‌నాల్‌ను పెట్రోల్‌లో కలిపి మహారాష్ట్ర & ఉత్తరప్రదేశ్‌లో వినియోగించడం ప్రారంభించారు. ఆ తరువాత 2002లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌ను ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఉపయోగించడం ప్రారంభించారు. 2019లో E10, 2022 డిసెంబర్ 15న E20 (20 శాతం ఇథనాల్ - 80 శాతం పెట్రోల్)ను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రవేశపెట్టారు.పెట్రోల్ వినియోగాన్ని కొంత వరకు తగ్గించడానికి.. ఈ ప్రయోగం సరైనదే అయినప్పటికీ, కొంతమంది వినియోగదారుల్లో అపోహలు, అనుమానాలు తలెత్తాయి. కానీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాత్రం.. ఇథనాల్ వినియోగం వల్ల సమస్యలు లేవని, దీనివల్ల పెట్రోల్ దిగుమతి తగ్గిందని.. తద్వారా రూ. 1.40 లక్షల కోట్లు అదా అయిందని లోక్‌సభలో వెల్లడించారు. నిపుణులు కూడా ఇథనాల్ వినియోగం వల్ల లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.ఇథనాల్ వినియోగం వల్ల నిజంగా లాభాలు ఉన్నాయా?, వాహన వినియోగదారులు చెప్పినట్లు నష్టాలు ఉన్నాయా?.. అనేది ఇక్కడ వివరంగా పరిశీలిస్తే..నిపుణులు చెబుతున్న ఉపయోగాలుకాలుష్యం తక్కువ: పెట్రోల్ వినియోగించినప్పుడు వెలువడే.. కాలుష్య కారకాల కంటే ఇథనాల్ ఉపయోగించడం వల్ల వెలువడే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు వంటి ఇతర హానికర కారకాల విడుదల కొంత తక్కువగా ఉంటుంది. గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలు కూడా కొంత తగ్గుతాయిఖర్చు తక్కువ: పెట్రోల్ ధరతో పోలిస్తే.. ఇథనాల్ ధర కొంత తక్కువే. దీనివల్ల డబ్బు కొంత ఆదా చేసుకోవచ్చు.ఇంజిన్ పనితీరు: కొంతమంది E10/E20 వంటి ఇథనాల్ మిశ్రమాలు ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.చమురు దిగుమతులను తగ్గిస్తుంది: భారతదేశం సుమారు 85 శాతం డీజిల్, పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది. ఇథనాల్ స్థానికంగా తయారవుతుంది, కాబట్టి ఫ్యూయెల్ దిగుమతి కొంతవరకు తగ్గించుకోవచ్చు. తద్వారా ఖర్చు తగ్గుతుంది. ఇది పునరుత్పత్తి అయ్యే ఇంధనం కాబట్టి.. భవిష్యత్తులో ఇంధన సంక్షోభం వచ్చే అవకాశం లేదు.వాహన వినియోగదారులు చెప్పినట్లు నష్టాలుమైలేజ్: ఇథనాల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందనేది వాహనదారులు చెబుతున్న ప్రధాన అంశం. ఇది పెట్రోల్ కంటే కూడా 30 శాతం తక్కువ ఎనర్జీ ఉత్పత్తి చేయడమే కాకుండా.. మైలేజ్ 4 శాతం నుంచి 5 శాతం తగ్గుతుందని పేర్కొంటున్నారు. రోజువారీ వినియోగదారుడికి ఇది ప్రధానమైన నష్టం.వాహనాల్లో సమస్యలు: 2005 కన్నా పాత కార్లు, బైకులకు ఇథనాల్ సరిపడకపోవచ్చు. దీనివల్ల రబ్బరు హోస్‌లు, ఫ్యూయల్ పంపులు, ఇతర వాహన భాగాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఫ్యూయెల్ లీక్స్, ఇంజిన్ స్టార్టింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. ఇథనాల్ వల్ల ఇంధన ట్యాంక్‌లో తేమ పెరగడం, ఫ్యూయల్ సిస్టమ్‌లో తుప్పు పెరగడం వంటివి జరుగుతాయి.చివరగా..ఇథనాల్ వినియోగం వల్ల.. వచ్చే నష్టాల కంటే, లాభాలే ఎక్కువ. అయితే వాహనదారులు చెప్పిన సమస్యలు కూడా వచ్చే అవకాశం లేదని గడ్కరీ పేర్కొన్నారు. ఒకవేళా సమస్యలు తలెత్తితే.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఇథనాల్ ఉపయోగిస్తున్న దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా.. బ్రెజిల్, అమెరికా, చైనా, పోలాండ్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, కెనడా మొదలైన దాదాపు 70 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement