Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

gold and silver rates on 30th january 2026 in Telugu states1
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోతులం బంగారం22 క్యారెట్స్--రూ.1,56,400--రూ.7,550 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,70,620--రూ.8,230 తగ్గింపుచెన్నైలో22 క్యారెట్స్--రూ.1,62,000--రూ.6.000 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,76,730--రూ.6,550 తగ్గింపుదేశ రాజధాని నగరం దిల్లీలో22 క్యారెట్స్--రూ.1,56,550--రూ.7,550 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,70,770--రూ.8,230 తగ్గింపువెండి ధరలుకేజీ వెండి రూ.4,15,000. రూ.10000 తగ్గింపు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

budget2026-viksitbharat-middleclass-hopes2
బడ్జెట్ 2026: వికసిత్‌ భారత్ దిశగా అడుగులు!

భారత జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతున్న వేళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే 2025-26లోని వివరాల ప్రకారం.. ఈసారి బడ్జెట్ కేవలం అంకెలు మాత్రమే కాదు, సామాన్యుడి ఆశల ప్రతిరూపంగా ఉండనుందనే అంచనాలున్నాయి.వేతన జీవులకు..కేంద్ర బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు అనేది వేతన జీవులకు అత్యంత కీలకమైన అంశంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే తగ్గింపు. అంటే, మొత్తం వార్షిక ఆదాయం నుంచి ఎటువంటి ఖర్చులు చూపించాల్సిన అవసరం లేకుండానే ఈ మొత్తాన్ని నేరుగా మినహాయించుకోవచ్చు.పెంపు ఎందుకు అవసరం?గత కొన్ని ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న రూ.75,000 (గత సవరణల ప్రకారం) స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుత జీవన వ్యయానికి సరిపోవడం లేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగుల చేతిలో ఖర్చు చేయడానికి మరింత నగదు మిగులుతుంది. ప్రజల చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటే మార్కెట్‌లో వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచి జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది.మౌలిక సదుపాయాలకు బూస్ట్దేశాభివృద్ధికి మౌలిక వసతులే కీలకమని నమ్ముతున్న కేంద్రం ఈసారి మూలధన వ్యయం (Capital Expenditure) కేటాయింపుల్లో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల గడువును పెంచడం ద్వారా స్థానికంగా రోడ్లు, బ్రిడ్జిల వంటివాటి నిర్మాణం వేగవంతం అవుతుంది. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (PLI) మరింత విస్తరించనున్నారు.యువత - ఉపాధిరాబోయే రోజుల్లో లక్షల మంది పట్టభద్రులు ఉద్యోగ వేటలో పడనున్నారు. దీన్ని ఆర్థికంగా అందిపుచ్చుకోవడానికి బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రధానంగా జౌళి (Textiles), పర్యాటకం, ఈ-కామర్స్ రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీలు ఉండొచ్చు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వృత్తి విద్యా కోర్సులు, శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ఎంఎస్‌ఎంఈచిన్న తరహా పరిశ్రమల ఆర్థిక ఇబ్బందులను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎంఎస్‌ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని మరింత సరళతరం చేస్తూ కొలేటరల్(పూచీకత్తు) లేకుండా రుణాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా వస్తువులను ప్రపంచ మార్కెట్లకు చేర్చడానికి ఎగుమతి సుంకాల్లో సడలింపులు ఉండవచ్చు.వ్యవసాయం, గ్రామీణ వికాసంవాతావరణ మార్పుల ధాటికి తట్టుకునేలా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ప్రస్తుత తక్షణ అవసరం.రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని(‍ప్రస్తుతం ఏటా రూ.6000) పెంచాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది.భూ రికార్డుల డిజిటలైజేషన్, డ్రోన్ల వినియోగం, ఆధునిక గోదాముల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ‘అందరికీ ఇల్లు’ లక్ష్యాన్ని చేరుకోవడానికి గృహ నిర్మాణ రంగానికి అదనపు కేటాయింపులు చేయనున్నారు.ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే

stock market updates on 30th january 20263
బడ్జెట్‌ సెషన్‌కు ముందు ఊగిసలాడుతున్న నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 167 పాయింట్లు తగ్గి 25,247 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 522 పాయింట్లు నష్టపోయి 82,071 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 30-01-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Key Highlights from JLL India Office Leasing Report 20254
ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం

భారత కార్యాలయ వసతుల లీజింగ్‌లో (ఆఫీస్‌ స్పేస్‌) అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం అంతకంతకూ పెరుగుతోంది. 2025లో దేశ వ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో 58 శాతం మేర ఆఫీస్‌ వసతులను అంతర్జాతీయ కంపెనీలే లీజింగ్‌కు తీసుకున్నట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతేడాది దేశవ్యాప్తంగా టాప్‌–7 నగారల్లో స్థూల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగి 83.3 మిలియన్‌ చదరపు అడుగులకు (ఎస్‌ఎఫ్‌టీ) చేరింది. ఇందులో 48.6 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీని అంతర్జాతీయ కంపెనీలు తీసుకున్నాయి. 2024లో స్థూల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 77.2 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది.హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె, కోల్‌కతా నగరాల్లోని లీజింగ్‌ను విశ్లేషించిన అనంతరం జేఎల్‌ఎల్‌ ఇండియా ఈ వివరాలు విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ వ్యూహాత్మక వ్యాపార కేంద్రంగా భారత్‌ స్థానం మరోసారి రుజువైనట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌ నైపుణ్యాలున్న మానవ వనరుల లభ్యతకుతోడు ప్రముఖ నగరాల్లో అందుబాటు ధరలకే ప్రీమియం ఆఫీస్‌ స్పేస్‌ లభ్యత అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడుల దిశగా ఆకర్షిస్తున్నట్టు తెలిపింది. 60 శాతం జీసీసీల్లోనే..అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో గేతడాది 48.6 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ వసతులను అద్దెకు తీసుకుంటే.. అందులో 31.4 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల్లోనే (జీసీసీలు) ఉండడం గమనార్హం. 7 నగరాల్లో గతేడాది మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో దేశీ సంస్థలు 34.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీని లీజుకు తీసుకున్నాయి. అంతర్జాతీయ సంస్థల వ్యాపార విస్తరణకు బెంగళూరు అత్యంత ప్రాధాన్య నగరంగా ఉంది. భారత ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ మార్కెట్‌లో జీసీసీలు ప్రముఖ శక్తిగా ఉన్నట్టు జేఎల్‌ఎల్‌ భారత ఎండీ రాహుల్‌ అరోరా పేర్కొన్నారు. గతేడాది ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో కోవర్కింగ్‌ ఆపరేటర్లు కూడా కీలక పాత్ర పోషించినట్టు జేఎల్‌ఎల్‌ నివేదిక తెలిపింది. భవిష్యత్‌కు వీలైన పని ప్రదేశాలుగా, నిపుణుల లభ్యత, నిర్వహణ సౌలభ్యంతో జీసీసీలు కీలకంగా మారినట్టు భైవ్‌ వర్క్‌స్పేస్‌ సీఈవో శేష్‌ రావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే

Flamingo Aerospace signed landmark deal at Wings India 20265
వింగ్స్‌ ఇండియా 2026లో విమానాల కొనుగోలు ఒప్పందం

రష్యాకి చెందిన యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ (యూఏసీ)తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ ఏరోస్పేస్‌ సంస్థ ఫ్లెమింగో ఏరోస్పేస్‌ ఫౌండర్‌ శుభకర్‌ పప్పుల తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలో ఆరు ఐఎల్‌–114–300 రకం విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. వీటి విలువ 180–200 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని చెప్పారు.ఈ విమానాలను పూర్తిగా దేశీయంగానే తయారు చేసేలా, సాంకేతికంగా కూడా తోడ్పడేలా ఈ భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక్కడే విమానాల అసెంబ్లీ, కస్టమైజేషన్, మెయింటెనెన్స్‌ మొదైలనవి చేపట్టవచ్చని పేర్కొన్నారు. 2032 నాటికి వీటిని పూర్తి స్థాయిలో దేశీయంగా రూపొందించగలమన్నారు. ప్రాంతీయంగా స్వల్ప, మధ్య స్థాయి దూరాలకు ఈ 68 సీటర్ల విమానాలు అనువుగా ఉంటాయని శుభకర్‌ వివరించారు.ఇండో–పసిఫిక్‌ ఏవియేషన్‌కి అవార్డుజెట్‌సెట్‌గో అనుబంధ సంస్థ ఇండోపసిఫిక్‌ ఏవియేషన్‌కి ‘బెస్ట్‌ ఎన్‌ఎస్‌వోపీ–ఫిక్సిడ్‌ వింగ్స్‌’ పురస్కారం దక్కింది. నాన్‌–షెడ్యూల్డ్‌ ఏవియేషన్‌ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరుకు గాను సంస్థ ఈ అవార్డును దక్కించుకుంది. వింగ్స్‌ ఇండియా 2026 కార్యక్రమం సందర్భంగా జెట్‌సెట్‌గో ఫౌండర్‌ కనికా టేక్రివాల్‌కి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు పురస్కారాన్ని అందజేశారు. రెండోసారి ఈ అవార్డును దక్కించుకోవడమనేది కచ్చితత్వానికి, భద్రతకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందని కనిక తెలిపారు.ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే

India commercial fleet may reach 2250 by 2035: Airbus6
కమర్షియల్‌ విమానాలు మూడు రెట్లు వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మూడో అతి పెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌గా భారత్‌ వృద్ధి చెందే క్రమంలో దేశీయంగా 100 సీట్ల పైగా సామర్థ్యం ఉండే కమర్షియల్‌ విమానాల సంఖ్య వచ్చే దశాబ్ద కాలంలో మూడు రెట్లు పెరుగుతుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌ అంచనా వేస్తోంది. దీని ప్రకారం ప్రస్తుతం 850గా ఉన్న సంఖ్య 2035 నాటికి 2,250కి పెరగనుంది. దేశీయంగా ఏవియేషన్‌ మార్కెట్‌ వృద్ధి చెందుతుండటం, అంతర్జాతీయ రూట్లలో కూడా కార్యకలాపాలను విస్తరించడంపై దేశీ విమానయాన సంస్థలు గణనీయంగా దృష్టి పెడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.వింగ్స్‌ ఇండియా 2026 సందర్భంగా గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎయిర్‌బస్‌ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్‌ జర్జెన్‌ వెస్టర్‌మెయర్‌ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం భారత ఎయిర్‌లైన్స్‌ నుంచి 1,250 విమానాలకు ఆర్డర్ల బ్యాక్‌లాగ్‌ ఉందని వివరించారు. ఏటా సగటున 120–150 వరకు విమానాలను అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.వచ్చే పదేళ్లలో భారత్‌లో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ వృద్ధి వార్షికంగా 8.9 శాతంగా ఉండొచ్చని, విమానాశ్రయాల సంఖ్య మరో 50 మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు వెస్టర్‌మెయర్‌ తెలిపారు. కమర్షియల్‌ విమానాల సంఖ్య పెరగడంతో పాటు వార్షికంగా సరుకు రవాణా సామర్థ్యం పెరిగేందుకు కూడా అవకాశం ఉందని ఆయన చెప్పారు. భారతీయ విమానయాన సంస్థలు సుమారు 1,700 విమానాలకు ఆర్డర్లివ్వగా, ఎయిర్‌బస్‌ దగ్గర 72% బ్యాక్‌లాగ్‌ ఉందని వెస్టర్‌మెయర్‌ తెలిపారు. 35 వేల మంది పైలట్లు కావాలి.. విమానాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో 2035 నాటికి 35,000 మంది పైగా పైలట్లు అవసరమవుతారని, అలాగే సాంకేతిక సిబ్బంది సంఖ్య కూడా మూడు రెట్లు పెరిగి 34,000 స్థాయిలో కావాల్సి ఉంటుందని వెస్టర్‌మెయర్‌ చెప్పారు. ప్రస్తుతం పైలట్ల సంఖ్య 12,000గా, సాంకేతిక సిబ్బంది సంఖ్య సుమారు 11,000గా ఉన్నట్లు ఆయన తెలిపారు. విమానాల సంఖ్య మూడు రెట్లు పెరిగే క్రమంలో భారత్‌ వేగంగా మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్‌ కార్యకలాపాలకి హబ్‌గా ఎదుగుతుందని వెస్టర్‌మెయర్‌ చెప్పారు.ఎయిర్‌ఫ్రేమ్‌లు, ఇంజిన్లు, విడిభాగాల మార్కెట్‌ 2035 నాటికి మూడు రెట్లు పెరిగి 9.5 బిలియన్‌ డాలర్లకు చేరగలదని పేర్కొన్నారు. ఇక ఫ్లయిట్, గ్రౌండ్, సాంకేతిక కార్యకలాపాల డిజిటలైజేషన్‌తో పాటు సైబర్‌ సెక్యూరిటీ మొదలైన వాటిపై భారతీయ ఎయిర్‌లైన్స్‌ 1 బిలియన్‌ డాలర్ల వరకు వెచ్చించే అవకాశం ఉందన్నారు.భారత్‌లో తొలిసారిగా రూపొందించి, అసెంబుల్‌ చేసిన ఎయిర్‌బస్‌ సీ–295 ట్విన్‌ ఇంజిన్‌ మీడియం మిలటరీ రవాణా విమానాన్ని 2026 మూడో త్రైమాసికంలో డెలివర్‌ చేయనున్నట్లు వెస్టర్‌మెయర్‌ వివరించారు. ఎయిర్‌బస్‌ హెచ్‌125 హెలికాప్టర్ల కోసం ఫైనల్‌ అసెంబ్లీ లైన్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి డెలివరీలు ప్రారంభం కాగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌ నుంచి 1.5 బిలియన్‌ డాలర్ల మేర కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement