ప్రధాన వార్తలు
వసూల్ రాజాలకు వార్నింగ్
ముంబై: రికవరీ ఏజెంట్ల ఆగడాలకు కళ్లెం దిశగా రిజర్వ్ బ్యాంక్ గురువారం కొన్ని ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం లోన్ రికవరీ బాధ్యతలు నిర్వర్తించే ఏజెంట్లు తప్పనిసరిగా దానికి సంబంధించిన శిక్షణ పొందాలి. బ్యాంకు ఉద్యోగి లేదా రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతతో గౌరవప్రదంగా మాట్లాడాలి. వసూలు కోసం వెళ్లినప్పుడు కూడా మర్యాదకరంగా వ్యవహరించాలి. రుణగ్రహీతలకు ఏజెంట్లు చేసే ఫోన్ కాల్స్ అన్నీ కూడా తప్పకుండా రికార్డ్ అయ్యేలా బ్యాంక్ చర్యలు తీసుకోవాలి. ఏజెంట్లు లేదా ఉద్యోగుల దగ్గరున్న కస్టమర్ల వివరాలు దురి్వనియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రికవరీ ప్రయత్నాల్లో భాగంగా ఏజెంట్లు దుర్భాషలాడటం, అనుచిత మెసేజీలు పంపించడంలాంటివి చేయకూడదు. రుణ గ్రహీత కుటుంబం దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో, వివాహ వేడుకలు, పండుగల్లాంటి సందర్భాల్లో లోన్ రికవరీ ప్రయత్నాలు చేయకూడదు. రికవరీ ఏజెంట్లుగా వ్యవహరించే వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) నిర్వహించే ’డెట్ రికవరీ ట్రైనింగ్’ తీసుకోవడాన్ని తప్పనిసరి చేసే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది. రికవరీ ఏజెన్సీలు తాము నియమించుకునే ఏజెంట్ల పూర్వచరిత్ర గురించి కూడా తెలుసుకునేలా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ రుణ బాకీల అంశం న్యాయస్థానం పరిధిలో ఉంటే ఆ వ్యవహారాన్ని ఉద్యోగులకు లేదా రికవరీ ఏజెంట్లకు రిఫర్ చేసే విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మానిటరీ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రికవరీలపై నిర్దిష్ట ప్రకటన చేసిన మీదట రిజర్వ్ బ్యాంక్ తాజా ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించడం గమనార్హం.
ఇక ధరల లెక్క కొత్తగా
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ సూచీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ ధరలను ప్రతిఫలించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి సమాధానంగానా అన్నట్టు.. కేంద్ర ప్రభుత్వం వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ)లో కీలక మార్పులు, చేర్పులు చేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్)కు ఇప్పటివరకు 2012 బేస్ ఇయర్గా ఉండగా దీన్ని 2024కు మార్చింది. గృహ వినియోగ, వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) 2023–24ను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. సీపీఐలో కొన్ని వినియోగ వస్తువులను, సేవలను చేరుస్తూ.. అదే సమయంలో కొన్నింటిని తొలగించింది. కొన్నింటి వెయిటేజీ తగ్గిస్తూ.. కొన్నింటికి పెంచింది. కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా చూస్తే ఈ ఏడాది జనవరిలో నిత్యావసర ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతానికి ఎగిసింది. 2012 బేస్ సంవత్సరం ప్రకారం డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.33 శాతమే. సీక్వెన్షియల్గా (నెలవారీ) పెరగ్గా.. 2025 జనవరిలో ఉన్న 4.26 శాతంతో పోలి్చనప్పుడు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జనవరిలో 2.77 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 2.73 శాతంగా నమోదైంది. ముఖ్యంగా ఆహారం, మెటల్స్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణం ఎగిసేందుకు దారితీసింది. దీంతో ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలోనూ పెరిగినట్టయింది. అయినప్పటికీ ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది. → కొత్త సిరీస్ ప్రకారం దేశంలో అత్యధికంగా 4.92 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడులో అధిక ద్రవ్యోల్బణం కనిపించింది. → జనవరిలో ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 2.13 శాతంగా, హౌసింగ్లో 2.05 శాతం చొప్పున నమోదైంది. వ్రస్తాలు, పాదరక్షల విభాగంలో 2.98 శాతంగా ఉంది. → వెల్లుల్లి, ఉల్లి, ఆలుగడ్డలు, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గాయి. → వెండి, బంగారం, వజ్రం, ప్లాటినం ఆభరణాలు, టమాటాలు, కొబ్బరి, కొబ్బరి నూనె ధరలు పెరిగాయి. → కొత్త సిరీస్లో వస్తువులు 259 నుంచి 308కి పెరిగాయి. సేవలు సైతం 40 నుంచి 50కు చే రాయి. ధరల ప్రభావం మరింత వాస్తవికంగా ఉండేందుకు ఈ చేరికలు సాయపడనున్నాయి. → సూచీలో ఆహారం, పానీయాలకు ఇప్పటి వరకు 45.86 శాతం వాటా ఉంటే, కొత్త సిరీస్లో 36.75 శాతానికి తగ్గింది. సీపీఐలో చేరినవి → గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు (అద్దెలు, నిర్వహణ వ్యయాలు) → ఆన్లైన్ మీడియా సర్వీస్ ప్రొవైడర్లు/స్ట్రీమింగ్ సేవలు → విలువ ఆధారిత పాడి ఉత్పత్తులు → బార్లీ, సంబంధిత ఉత్పత్తులు → పెన్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ → వ్యాయామ పరికరాలు → అటెండెంట్, బేబీ సిట్టర్ (ఇళ్లలో సహాయకులు)సీపీఐ నుంచి తొలగించినవి → వీసీఆర్/వీసీడీ/డీవీడీ ప్లేయర్లు → రేడియో, టేప్రికార్డర్ → వినియోగించిన వ్రస్తాలు → సీడీ/డీవీడీలు, ఆడియా/వీడియో క్యాసెట్లు → కాయిర్/రోప్ → హైరింగ్ చార్జీలు (బాడుగకు తీసుకున్న వాటికి చెల్లించేవి)
ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఫ్లిప్కార్ట్!
ఈ కామర్స్ విభాగంలో ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఫ్లిప్కార్ట్.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టనుంది. కంపెనీ ఎప్పటి నుంచి ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేయనుంది?,.. ఈ రంగంలో జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఫ్లిప్కార్ట్ 2026 మే-జూన్ నాటికి బెంగళూరులో ప్రయోగాత్మకంగా డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ ఏడాది చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఫుడ్ డెలివరీ ప్రారంభించనున్నట్లు సమాచారం.వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్.. ఫుడ్ డెలివరీ ప్రారభించినట్లయితే.. ఇప్పుడు ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్లిప్కార్ట్ మార్కెట్ విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో 9 బిలియన్ డాలర్లు, కాగా ఇది 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ఫుడ్ డెలివరీ చేయడానికి ఫ్లిప్కార్ట్ ఇప్పటికే టీమ్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రెండేళ్ల క్రితమే ఈ కంపెనీ ఓలా, పేటీఎం సంస్థలతో కలిసి ఓఎన్డీసీ ద్వారా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టాలని యోచించింది. అయితే ఈ చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ ఫుడ్ డెలివరీ విషయం తెరమీదికి వచ్చింది. కానీ దీనిపై ఫ్లిప్కార్ట్ అధికారిక ప్రకటన వెల్లడించలేదు.ఫుడ్ డెలివరీ చేయడానికి చాలా కంపెనీలే పుట్టుకొచ్చాయి. కానీ జొమాటో,స్విగ్గీ మాదిరిగా పాపులర్ కాలేదు. ఇప్పుడు ఈ రంగంలో అడుగుపెట్టనున్న ఫ్లిప్కార్ట్ సక్సెస్ సాధిస్తుందా?, లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా.. ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపించగానే జొమాటో, స్విగ్గీ షేర్స్ తగ్గుముఖం పట్టాయి.
బీఎండబ్ల్యూ రీకాల్.. లక్షల కార్లపై ఎఫెక్ట్!
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వాహనాల్లోని స్టార్టర్ మోటార్ లోపభూయిష్టంగా ఉండటం వల్ల.. ఒకానొక సందర్భంలో వాహనంలో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. దీనిని పరిష్కరించడానికే బీఎండబ్ల్యూ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య సుమారు 5,75,000 కార్లలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!జూలై 2020 నుంచి జూలై 2022 మధ్య ఉత్పత్తి అయిన సుమారు 16 మోడల్స్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య గురించి కంపెనీ.. తన కస్టమర్లకు ఈమెయిల్స్ లేదా మెసేజస్ రూపంలో వెల్లడించనుంది. దీనికోసం కస్టమర్లు ప్రత్యేకించి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు ఝలక్!
ఇండియా నుంచి వెళ్ళిపోయి.. యూకేలో ఉంటున్న విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు స్పందించింది. మీరు భారత్కు తిరిగి రావాలి, లేకుంటే.. మేము మీ పిటిషన్ (ఆర్థిక నేరస్థుల చట్టం, 2018)ను విచారించలేము వెల్లడించింది.పిటిషన్ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటే, ముందుగా మీరు (విజయ్ మాల్యా) భారతదేశానికి తిరిగి రావాలి. మేము ఇప్పటికీ కేసును కొట్టివేయడం లేదు.. మీకు మరొక అవకాశం ఇస్తున్నామని కోర్టు వెల్లడించింది. విదేశాల్లో ఉండి ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేరని స్పష్టం చేసింది.ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టంగా వ్యాఖ్యానించింది. మీరు కోర్టు అధికార పరిధిని తప్పించుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో మీరు సమాన న్యాయం కోరలేరు. ముందుగా మీరు భారతదేశానికి తిరిగి రావాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే మాల్యా భారత్కు వస్తారా లేదా అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు ఫిబ్రవరి 18న మళ్లీ విచారణకు రానుంది.ఆర్ధిక నేరాలకు పాల్పడి పరారీలో ఉన్న నిందితులు విచారణను ఎదుర్కొనేందుకు తిరిగి వచ్చేలా.. భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఇందులో విజయ్ మాల్యా మాత్రమే కాకుండా.. లలిత్ మోదీ కూడా ఉన్నారు. వీరిని తీసుకురావడానికి ప్రభుత్వం చురుకుగా ప్రయత్నిస్తోందని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే రష్యా ప్రయత్నం?2018లో అమలులోకి వచ్చిన ఎఫ్ఈఓ చట్టం ప్రకారం.. మొత్తం 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులుగా ప్రకటించారు. వీరిలో 9 మంది ప్రభుత్వ బ్యాంకులకు సుమారు రూ. 26,645 కోట్ల నష్టం కలిగించారు. 2025 అక్టోబర్ 31 వరకు వడ్డీ కలిపి ఈ మొత్తం రూ. 31,437 కోట్లకు చేరింది. ఇందులో రూ. 19,187 కోట్లు ఇప్పటివరకు తిరిగి వసూలు చేశారు.
పాన్ కార్డు రూల్స్ మారుతున్నాయ్..
పాన్ కార్డుకు సంబంధించి పలు నిబంధనలు మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు–2026’లో పాన్ కార్డు (PAN) బహిర్గతం తప్పనిసరి అయ్యే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పరిమితుల్లో మార్పులను ప్రతిపాదించింది. లక్ష్యం ఏమిటంటే.. సాధారణ, తక్కువ విలువైన లావాదేవీలకు పాన్ కార్డు అవసరాన్ని తగ్గిస్తూ, పెద్ద మొత్తాల లావాదేవీలలో పారదర్శకత పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ముసాయిదాపై ఫిబ్రవరి 22 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. తుది ఆమోదం అనంతరం కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, మోటారు వాహనాల కొనుగోలు, హోటల్, రెస్టారెంట్ బిల్లులు, స్థిరాస్తి లావాదేవీలు, ఇన్సూరెన్స్ పాలసీలు ప్రీమియం చెల్లింపులకు సంబంధించి పాన్ కార్డు అవసరం ఎలా మారబోతోందో ఈ కింద తెలుసుకుందాం.నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు ప్రస్తుతం ఒకే రోజులో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణ చేసినప్పుడు మాత్రమే పాన్ తప్పనిసరి అవుతుంది.మోటారు వాహనాల కొనుగోలుప్రస్తుత నిబంధనల ప్రకారం మోటార్ సైకిళ్లు మినహా అన్ని వాహనాల కొనుగోలుకు పాన్ అవసరం. ప్రతిపాదిత మార్పుల ప్రకారం రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలు (బైక్లు సహా) కొనుగోలు చేసినప్పుడు మాత్రమే పాన్ అవసరం ఉంటుంది.హోటల్, రెస్టారెంట్ బిల్లులుఇప్పటి వరకు ఒక చెల్లింపులో రూ.50,000 దాటితే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ముసాయిదాలో ఈ పరిమితిని రూ.1 లక్షకు పెంచాలని సూచించారు.స్థిరాస్తి లావాదేవీలుప్రస్తుతం రూ.10 లక్షలకు పైబడిన ఆస్తి లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ప్రతిపాదన ప్రకారం ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచనున్నారు.ఇన్సూరెన్స్ పాలసీలుఇప్పటివరకు రూ.50,000 పైగా ప్రీమియం చెల్లింపులకు మాత్రమే పాన్ అవసరం ఉండేది. ఇకపై బీమా సంస్థలతో ఏదైనా ఖాతా ఆధారిత సంబంధం ఏర్పరిస్తేనే పాన్ తప్పనిసరి చేయాలని సూచించారు.
కార్పొరేట్
ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఫ్లిప్కార్ట్!
పోలియో నిర్మూలనకు బీఈ వ్యాక్సిన్
బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన
క్రేజీ క్రేజీ.. మేడిన్ ఇండియా లగేజీ
పీఎల్ఐ పథకానికి 55 కంపెనీలు సై..
రిలయన్స్ చేతికి సదరన్ హెల్త్ ఫుడ్స్
భారత్లో సాక్ష్యాల సేకరణకు సాయం కోరిన వెంబు భార్య
వరుసగా 200 మెసేజ్లు.. రూ.10 లక్షలు మాయం
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్ బాంబు!
ఆరు ఎన్బీఎఫ్సీ లైసెన్సుల సరెండర్
స్టాక్ మార్కెట్ ర్యాలీకి బ్రేక్.. పడిపోయిన ఐటీ షేర్లు
భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్ట...
బంగారం ధరల్లో స్వల్ప ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
26,000 మార్కు చేరువలో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభా...
తడబడిన వెండి ఎగసిన పసిడి
న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి వెండి నష్టపోగా.. కొన...
బ్యాంకులకు లాభాల కళ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక ...
EPFO 3.0: పీఎఫ్ విత్డ్రా మరింత సులభం!
ఈపీఎఫ్ఓ చందాదారులు.. తమ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ...
ఆదాయపు పన్ను చట్టంలో కొత్త మార్పులు!
కేంద్ర ప్రభుత్వం.. ఆదాయ పన్ను చట్టం 2025ను.. 2026 ...
దేశవ్యాప్తంగా కోటి మందికి ఆధార్ అప్డేట్ పూర్తి
దేశంలోని పాఠశాల విద్యార్థుల ఆధార్ డేటా అప్డేట్ ప్...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే..
గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) ఉద్యోగుల కోసం మరోసారి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను (Voluntary Exit Packages - VEP) ప్రకటించింది. ఏఐ (AI) ఆధారిత భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్న సంస్థగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.“కొత్త సంవత్సరాన్ని మనం బలమైన స్థితిలో ప్రారంభిస్తున్నాం. 2025లో మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. అయితే టెక్నాలజీ రంగం వేగంగా మారుతోంది. పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి మన ఏఐ మిషన్కు పూర్తిగా అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తి అవసరం” అని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపారు.ఏఐ-ఫస్ట్ దిశగా అడుగులుగూగుల్ ఇప్పుడు పూర్తిగా “ఏఐ-ఫస్ట్” సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వ్యాపార విభాగంలోని ప్రతి ఉద్యోగీ ఏఐని స్వీకరించి, ఎక్కువ ప్రభావాన్ని చూపాలని సంస్థ స్పష్టం చేసింది. “ఈ వేగానికి సరిపోలలేనివారు లేదా ముందుకు సాగడానికి సిద్ధంగా లేనివారు స్వచ్ఛందంగా నిష్క్రమించేందుకు కంపెనీ అవకాశం ఇస్తుంది” అని షిండ్లర్ పేర్కొన్నారు.ఎవరిపై ప్రభావం?ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలు ముఖ్యంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్ విభాగం, కార్పొరేట్ డెవలప్మెంట్, ఇతర సంబంధిత వ్యాపార విభాగాల వారికి వర్తిస్తాయి. అయితే, అమెరికాలోని పెద్ద కస్టమర్ సేల్స్ టీమ్స్, కొన్ని కస్టమర్-ఫేసింగ్ పాత్రలకు ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు. “మా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని షిండ్లర్ తెలిపారు.ఏడాదిలో మూడోసారి.. ఇది గూగుల్ అమలు చేస్తున్న మూడో స్వచ్ఛంద నిష్క్రమణ ప్రణాళిక. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. 2025 జూన్లో ‘రిటర్న్-టు-ఆఫీస్’ విధానం కఠినతరం చేసిన సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. మళ్లీ 2025 అక్టోబర్లోనూ యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎగ్జిట్ ప్యాకేజీలు ప్రకటించింది.వీఈపీ ప్యాకేజీలో ఏం ఉంటాయంటే..గూగుల్ వీఈపీ (Voluntary Exit Program) ప్యాకేజీని ఎంచుకుని స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు సాధారణంగా వారి సర్వీస్ పీరియడ్, దా ఆధారంగా లంప్సమ్ సెవరెన్స్ పే (కొన్ని వారాలు/నెలల జీతం), ప్రోరేటెడ్ బోనస్ చెల్లింపు, ఉపయోగించని సెలవులకు నగదు, కొంతకాలం వరకు ఆరోగ్య బీమా కొనసాగింపు, ఇప్పటికే వెస్ట్ అయిన RSUs/స్టాక్లపై హక్కులు, అలాగే కొత్త ఉద్యోగం కోసం కెరీర్ ట్రాన్సిషన్ లేదా అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు అందిస్తారు.
ఎయిర్టెల్ సరికొత్త ఏఐ ఫ్రాడ్ అలర్ట్ ప్రారంభం
దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లీకేజీల ద్వారా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఫ్రాడ్ అలర్ట్’ ఫీచర్ను కంపెనీ ఆవిష్కరించింది.ఏమిటీ ఏఐ ఫ్రాడ్ అలర్ట్?సాధారణంగా డెలివరీ బాయ్స్ లేదా సర్వీస్ ఏజెంట్ల పేరుతో ఫోన్ చేసే మోసగాళ్లు వినియోగదారులను మాటల్లో పెట్టి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలను కాజేస్తుంటారు. ఇలాంటి దాడుల నుంచి కస్టమర్లను రక్షించడమే ఈ ఏఐ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.ఒక కస్టమర్ కాల్లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకింగ్ ఓటీపీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఏఐ గుర్తించినట్లయితే నెట్వర్క్ స్థాయిలో ఎయిర్టెల్ వెంటనే జోక్యం చేసుకుంటుంది. కాల్ సమయంలో కస్టమర్కు వెంటనే ‘ఫ్రాడ్ అలర్ట్’ ద్వారా హెచ్చరిక పంపుతుంది. తద్వారా కస్టమర్ అప్రమత్తమై తన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త పడవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఎయిర్టెల్ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నెట్వర్క్గా మార్చాలన్నదే లక్ష్యం. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీలు కీలకమే అయినప్పటికీ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే నెట్వర్క్ స్థాయిలోనే ఈ మోసాలను అడ్డుకునే ఏఐ పరిష్కారాన్ని తీసుకొచ్చాం. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది’ అని పేర్కొన్నారు.అందుబాటులోకి ఎప్పుడు?గత రెండేళ్లుగా స్పామ్ కాల్ హెచ్చరికలు, హానికరమైన లింక్లను కట్టడి చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న ఎయిర్టెల్ ఇప్పుడు ఈ ఓటీపీ ప్రొటెక్షన్ను మరింత బలోపేతం చేసింది. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో భాగంగా హరియాణా రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీసును విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా నెట్వర్క్ స్థాయి ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి యాప్లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్వర్క్ స్థాయిలోనే మోసపూరిత కాల్స్, ఓటీపీ లీకేజీలను గుర్తించి అడ్డుకుంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట
ఏఐ వినియోగంలో భారత్ జోరు
దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎంటర్ప్రైజ్ విభాగంలో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెర్నిగ్) కార్యకలాపాలకు సంబంధించి అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. క్లౌడ్ సెక్యూరిటీ సేవల దిగ్గజం జీస్కేలర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ భద్రతాపరమైన సవాళ్లు గణనీయంగా ఉంటున్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఏజెంటిక్ ఏఐని ఆయుధంగా ఉపయోగించకోవడం, నవకల్పనలు–భద్రత చర్యల మధ్య అంతరం భారీగా ఉండటం మొదలైనవి ఇందులో ఉన్నాయని వివరించింది. 2025 జనవరి–డిసెంబర్ మధ్య జీస్కేలర్ జీరో ట్రస్ట్ ఎక్సే్చంజ్ ప్లాట్ఫాంపై నమోదైన లక్ష కోట్ల ఏఐ, మెషిన్ లెరి్నంగ్ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా జీస్కేలర్ ఈ రిపోర్టును రూపొందించింది. ఫిబ్రవరి 16–20 మధ్య భారత్లో ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎని్వడియా సీఈవో జెన్సన్ హువాంగ్, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆంథ్రోపిక్ సీఈవో డేరియో, క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఎమోన్ తదితర దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గోనున్నారు. నివేదిక ప్రకారం..దేశీ కంపెనీలు 2025 జూన్–డిసెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,230 కోట్ల ఏఐ/ఎంఎల్ లావాదేవీలు నిర్వహించాయి. ఆసియా–పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో నమోదైన మొత్తం ఏఐ లావాదేవీల్లో ఇది 46.2 శాతం కావడం గమనార్హం. దీనితో ప్రాంతీయంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది.డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వం దన్నుగా నిలవడంతో పాటు ఏఐ మౌలిక సదుపాయాలు–నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వ–ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏఐ సామర్థ్యాలున్న సిబ్బంది పెరుగుతుండటం, ఏఐ సేవలను వేగంగా, భారీ స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు వీలు కలి్పంచే క్లౌడ్–ఫస్ట్ విధానాలనేవి గతంతో పోలిస్తే భారత్ చాలా వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడ్డాయి. దేశీయంగా ఏఐ కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తున్న రంగాల్లో టెక్నాలజీ–కమ్యూనికేషన్ (3,130 కోట్ల లావాదేవీలు), తయారీ (1,570 కోట్లు), సరీ్వసులు (1,260 కోట్లు), ఫైనాన్స్–ఇన్సూరెన్స్ (1,220 కోట్ల లావాదేవీలు) ఉన్నాయి. కంపెనీల పర్యవేక్షణ సామర్థ్యాలకు మించిన వేగంతో ఎంటర్ప్రైజ్ ఏఐ వినియోగం పెరుగుతోంది. కానీ చాలా సంస్థల్లో కీలకమైన డేటా ఏ దశలో బహిర్గతమయ్యే అవకాశం ఉందో కనిపెట్టలేని భద్రతపరమైన లోపాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. ఏఐని దేనికోసం వినియోగిస్తున్నారు, ఏ డేటాను షేర్ చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతూ, లీకేజీలను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలను అమలు చేస్తూ ఉండాలి. మార్కెట్ డిమాండ్కి తగ్గట్లుగా సురక్షితమైన ఏఐ వైపు మళ్లాలంటే డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం. ప్రతికూల పరిస్థితులను సృష్టించి ఎంటర్ప్రైజ్ ఏఐ సిస్టంలను పరీక్షించినప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటి బలహీనతలు బయట పడిపోతుండటమనేది సెక్యూరిటీపరంగా నెల కొన్న రిస్క్లను సూచిస్తోంది.స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకుని, చర్యలు కూడా తీసుకోగలిగే సామర్థ్యాలున్న ఏజెంటిక్ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఆయుధంగా మార్చుకుంటున్నారు. సైబర్క్రిమినల్స్, నిఘా గ్రూప్లు ఏఐని ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు తెరపైకి వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు నిఘా, చొరబాటు, విస్తృత దాడుల బాధ్యతలు తీసుకుంటున్నాయి. స్వతంత్రంగా, మెషిన్ వేగంతో, భారీ స్థాయిలో సైబర్ దాడులకు దిగుతున్నాయి. ఏఐ కేవలం ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడే సాధనంగానే ఉండటం లేదు, నేరగాళ్లకు ఆయుధంగా కూడా మారుతోంది. డేటా చౌర్యం తీవ్ర ఆందోళనకర అంశంగా మారుతోంది. 2025లో అంతర్జాతీయంగా ఏఐ అప్లికేషన్స్లోకి 18,000 టెరాబైట్స్ డేటా వచ్చి చేరింది. ఇది దాదాపు 360 కోట్ల డిజిటల్ ఫొటోలకు సమానం. ఏజెంటిక్ ఏఐ చొరబడిందంటే, సంప్రదాయ రక్షణ పద్ధతులు అడ్డుకోలేవు. నిమిషాల వ్యవధిలో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగిపోతుంది. ఈ రిస్క్లను ఎదుర్కొనాలంటే ఏఐని కట్టడి చేసేందుకు కంపెనీలు ఏఐనే ఆయుధంగా మార్చుకోవాలి. దాడులకు ఉపయోగపడే ఆస్కారమున్న అన్ని మార్గాలను మూసివేసేందుకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఇంటెలిజెంట్ జీరో ట్రస్ట్ వ్యవస్థను వినియోగించుకోవాలి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్
బిలియన్ డాలర్ల...భావోద్వేగాల బిజినెస్
సాక్షి, బిజినెస్ డెస్క్: భారత్లో ఇప్పుడు కొత్త తరహా డిజిటల్ స్నేహితులు అడుగుపెడుతున్నారు. ఏఐ ఆధారిత వర్చువల్ పెట్స్ (ఏఐ పెట్స్) యువతలో వేగంగా ఆదరణ పొందుతున్నాయి. నగర జీవనంలో పెరుగుతున్న ఒంటరితనం, నిజమైన పెంపుడు జంతువుల బాధ్యతలు తీసుకోలేని పరిస్థితుల్లో ఏఐ పెట్స్ ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. భావోద్వేగంగా స్పందించడం, మాటలతో ఆదుకోవడం వంటి లక్షణాల వల్ల ఇవి యువతను ఆకర్షిస్తున్నాయి. వీటితో యూజర్లు నిజమైన జంతువును పెంచుకుంటున్న అనుభూతి పొందుతారు.వీటితో కూడా రోజువారీ రొటీన్ను ఫాలో అవచ్చు. ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, ఆడించడం, నిద్ర షెడ్యూల్ చూసుకోవడం వంటి పనులు చేస్తూ నిజమైన పెంపుడు జంతువును ఆడించినట్లే ఆనందిస్తారు. ఈ పెట్ అప్లికేషన్లలో వినియోగదారులు తమ పెంపుడు జంతువుకు దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. నెలకు సగటున రూ. 30 నుంచి రూ. 60 వరకు ఖర్చు చేస్తూ, ఆ ఏఐ పెట్ను సంరక్షించడం, శిక్షణ ఇవ్వడం, భావోద్వేగంగా స్పందించేలా నేరి్పంచడం చేస్తున్నారు. పెరుగుతున్న మార్కెట్ వర్చువల్ పెట్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు 150 మిలియన్ డాలర్లని అంచనా. వెంచర్ క్యాపిటలిస్టులు ఈ రంగం 35–40 శాతం వార్షిక వృద్ధితో బిలియన్ డాలర్లకు చేరుతుందని ఊహిస్తూ అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ యాప్లు ప్రధానంగా సబ్ర్స్కిప్షన్లు,ఇన్–యాప్ కొనుగోళ్లు, పెట్ యాక్సెసరీస్ ద్వారా ఆదాయం పొందుతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాయిస్ ఆధారిత ఇంటరాక్షన్, మల్టీప్లేయర్ ఫీచర్లు, వివిధ లొకేషన్లలో పెట్స్ను కలుసుకునే అవకాశాలతో ఈ రంగం మరింత విస్తరిస్తోంది. అయితే ఏఐ పెట్స్ టెక్నాలజీ నిజమైన మానవ సంబంధాల నుంచి మనుషులను దూరం చేస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.టమాగోచ్చి నుంచి ఏఐ వరకువాస్తవానికి డిజిటల్ పెట్స్ కాన్సెప్ట్ కొత్తది కాదు. జపాన్లో 1990లలో వచి్చన టమాగోచ్చి వీడియో గేమ్ వర్చువల్ పెట్స్కు బాట వేసింది. ఆ తర్వాత 2000లలో టాకింగ్ టామ్, ఫ్రెండ్స్ యాప్స్, విడ్జెట్స్ వంటి అప్లికేషన్లు పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఈ వర్చువల్ పెట్స్ మరింత అడ్వాన్స్డ్గా మారాయి. పాకెట్ పెట్, క్రిప్టో కిట్టీస్, జూమీ వంటి యాప్లు యూజర్లు తమ ఊహలకు అనుగుణంగా పెంపుడు జంతువులను సృష్టించుకునే అవకాశం ఇస్తున్నాయి.
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీములు
ముంబై: కోటక్ మహింద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. కోటక్ సర్వీసెస్ ఫండ్ పేరుతో కొత్త పథకాన్ని (ఎన్ఎఫ్వో) ప్రారంభించింది. ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. దేశ జీడీపీలో 55 శాతం వాటా ఆక్రమిస్తూ, వృద్ధికి కీలక చోదకంగా ఉన్న సేవల రంగంలో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుందని కోటక్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది.వినియోగ సేవలు, టెలికం, హెల్త్కేర్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, ఐటీ, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాలతో కూడిన సేవలు దీర్ఘకాల పెట్టుబడులకు మంచి వృద్ధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. మంచి వృద్ధి అవకాశాలు, సహేతుక ధరల వద్దనున్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపారం, యాజమాన్యం, కంపెనీ విలువకు ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రకాల మార్కెట్ విలువల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.నాణ్యమైన వ్యాపారం, బలమైన నగదు ప్రవాహాలను చూస్తుంది. కనీసం రూ.1,000, అంతకుమించి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ముగిసిన కొన్ని రోజుల అనంతరం తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో, దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధిని కోరుకునే వారికి ఈ పథకం అనుకూలమని కోటక్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.360 వన్ ఎంఎఫ్ నుంచి సిఫ్ పథకం సంపన్న ఇన్వెస్టర్ల కోసం 360 వన్ మ్యుచువల్ ఫండ్ తాజాగా డైనాసిఫ్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్ పేరిట స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్)ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 20న ముగుస్తుంది. ఇది కనీసం 80 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్కి కేటాయిస్తుంది. ఈక్విటీ డెరివేటివ్స్ ద్వారా 25 శాతం వరకు షార్ట్ ఎక్స్పోజర్ తీసుకునేందుకు, డెట్ అలాగే ఇని్వట్స్లో 20 శాతం వరకు ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది.దీనికి బీఎస్ఈ 500 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 10 లక్షలు (అక్రెడిటెడ్ ఇన్వెస్టర్లయితే రూ. 1,00,000) ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యుచువల్ ఫండ్స్ పరమైన ట్యాక్సేషన్ ప్రయోజనాలతో పాటు మరింత మెరుగైన రాబడులను అందించే విధంగా ఈ ఫండ్ ఉంటుందని 360 వన్ అసెట్ మేనేజ్మెంట్ సీఈవో రాఘవ్ అయ్యంగార్ తెలిపారు. డీఎస్పీ మల్టీ అసెట్ ఆమ్ని ఎఫ్వోఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను సరళతరం చేసే దిశగా డీఎస్పీ మ్యుచువల్ ఫండ్ సంస్థ మల్టీ అసెట్ ఆమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్)ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 19 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థకు చెందిన స్వంత మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ డీఎస్పీ నేత్ర దన్నుతో ఇది పని చేస్తుంది. ఈక్విటీ, డెట్ ఆధారిత స్కీములు, గోల్డ్..సిల్వర్ ఈటీఎఫ్ల్లాంటి కమోడిటీ ఆధారిత స్కీములు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది.మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ ఆధారిత స్కీముల్లో 25–75 శాతం, డెట్ స్కీముల్లో 15–50 శాతం, గోల్డ్–సిల్వర్ ఈటీఎఫ్లలో 10–50 శాతం మేర ఇది పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు ఈక్విటీల్లో పెట్టుబడులను కనిష్టంగా 25 శాతానికి కూడా తగ్గించే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడులను వివిధ సాధనాల్లో డైవర్సిఫై చేయడం వల్ల రాబడుల కోసం కేవలం ఒకే సాధనంపై ఆధారపడాల్సిన రిసు్కలు తగ్గుతాయని సంస్థ ప్రోడక్ట్ హెడ్ సాహిల్ కపూర్ తెలిపారు.
పిల్లలకు ప్రత్యేక బీమా పథకాలు
పిల్లల భవిష్యత్ ప్రణాళికల కోసం ఉపయోగపడేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ స్మార్ట్కిడ్ 360 ప్లాన్ని ప్రవేశపెట్టింది. ఇది బీమా ప్రయోజనాలను కల్పించడంతో పాటు దీర్ఘకాలిక పొదుపు పథకంగా కూడా ఉపయోగపడుతుంది. పాలసీదారుకేదైనా జరిగితే ప్రీమియంల నుంచి మినహాయింపు, ప్రయోజనాల కొనసాగింపు, కుటుంబానికి క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే ఫ్యామిలీ ఇన్కం బెనిఫిట్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పిల్లల చదువులు తదితరాలకు మనీబ్యాక్ పొందే వీలుంది. బజాజ్ జనరల్ ఫీటల్ ఫ్లరిష్ ఆరోగ్య బీమా గర్భస్త శిశువు ఆరోగ్యానికి సంబంధించి ‘ఫీటల్ ఫ్లరిష్’ పేరిట బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రత్యేక ఇన్సూరెన్స్ రైడర్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని అధునాతన ఇన్–యుటెరో ప్రొసీజర్లు, రిస్కులు ఎక్కువగా ఉండే ప్రెగ్నెన్సీలకు కవరేజీ లభిస్తుంది. ‘మై హెల్త్ కేర్ ప్లాన్’, ‘హెల్త్ గార్డ్’ పథకాలతో కలిపి ఈ రైడర్ని తీసుకోవచ్చు. 18–45 ఏళ్ల వయస్సు గల మహిళలకు, ఒక్కో ప్రసవానికి రూ. 2 లక్షల సమ్ ఇన్సూర్డ్తో రెండు ప్రసవాల వరకు వర్తిస్తుంది. ప్రీమియం రూ. 1,025గా ఉంటుంది.
బంగారానికి బదులుందా? బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్కాయిన్కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్కాయిన్కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki) తెలిపారు. బిట్కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత బిట్కాయిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్కాయిన్ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్ మైనింగ్, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయినప్పటికీ, బిట్కాయిన్ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.I am often asked:Which is a better investment?Gold or Bitcoin.Obviously I would say both for diversification of assets and add silver.Yet if I had to choose only one asset I would choose Butcoin.Why?Because gold is in theory infinite. When the price of gold rises…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026
Income Tax: ఆదాయం కరెక్టుగా రిపోర్ట్ చేయండి
రూల్ 114బీ ప్రకారం ఫారం ‘60’ ఇవ్వాలి. వ్యక్తులు.. అంటే మనం అందరం మనకు పర్మనెంట్ అకౌంట్ నంబరు లేకపోతే, నిర్దేశించిన హై–వేల్యూ ఆర్థిక వ్యవహారాలు జరపాలంటే, ఈ ఫారం 60ని సబ్మిట్ చేసి ఆ వ్యవహారాన్ని అయ్యిందనిపిస్తాం.నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలేమిటంటే ▪️ బ్యాంకులో ఖాతా తెరవడం ▪️ డీమ్యాట్ ఖాతా తెరవడం ▪️ బ్యాంకులో రూ. 50,000 దాటి నగదు డిపాజిట్ చేసినప్పుడు ▪️ రూ. 10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ స్థిరాస్తి క్రయ, విక్రయాలు ▪️ రెండు చక్రాల బండి తప్ప ఇతర ఏ మోటర్ వాహనం కొన్నా ▪️ రూ. 50,000 దాటి ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ కొన్నా ▪️ విదేశీ మారకం/యాత్ర రూ. 50,000 దాటితే ▪️ జీవిత బీమా ప్రీమియం రూ. 50,000 దాటితేతీసుకోవాల్సిన జాగ్రత్తలు ▪️ పాన్ లేని వారు ఫారం 60 సబ్మిట్ చేసి వ్యవహారం పూర్తి చేయొచ్చు. పాన్ ఉన్నవారు కాదు. ▪️ ఫారం 60లో చాలా అంశాలుంటాయి. మీ వివరాలు సరిగ్గా ఇవ్వాలి. వివరాలకు ఆధారాలుండాలి. వాటితో సరిపోవాలి. అలా ఇవ్వకపోతే వ్యవహారం ఆగిపోవచ్చు. ▪️ అసలు అర్హత ఉందా. అవసరం లేకుండా అబద్ధాలు చెప్పి దాఖలు చేయొద్దు. ▪️ మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి. ▪️ మీకు పాన్ ఎందుకు లేదో కారణాలు తెలియజేయాలి ▪️ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి ▪️ జాయింటు వ్యవహారాలు అయితే, అందరి వివరాలు ఇవ్వాలి ▪️ మైనర్ తరఫున అయితే, తల్లిదండ్రులు, గార్డియన్ ఇవ్వాలితప్పుడు ధ్రువీకరణలు ఇస్తే.. తప్పుడు సమాచారం, తప్పు ధృవీకరణలు ఇచ్చిన పక్షంలో కఠిన కారాగార శిక్షలుంటాయి. తప్పించుకోలేరు. పన్ను ఎగవేత మొత్తం నుంచి రూ. 25,00,000ల వరకు పెనాల్టీ వేస్తారు. కారాగారంతో పాటు ఫైన్ కూడా వేస్తారు. మరో ఫారం 61. ఈ ఫారం అనేది వ్యక్తులకు, కేవలం వ్యవసాయ ఆదాయం ఉండి, ఏ ఇతర ఆదాయం లేని వారు దాఖలు చేయాలి. ఫారం 60 వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుంది. ఫారం 60, వ్యవహారం జరిపే ముందు ఇవ్వాలి. ఫారం 61 అనేది ప్రతి సంవత్సరంలో రెండుసార్లు, ఆర్నెల్లకోసారి ఇవ్వాలి. రెండు ఫారం విషయాల్లోను తప్పులు దొర్లితే శిక్షకు అర్హులే. కఠిన కారాగార శిక్ష, పెనాల్టీ, ఫైన్ మామూలే. మిస్రిపోర్టింగ్ జరిగితే 50 శాతం నుంచి 200 శాతం వరకు పెనాల్టీ వేస్తారు. ‘‘మన తక్షణ కర్తవ్యం ఏమిటి’’ అనే ప్రశ్నకు జవాబుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్ చాలా స్పష్టంగా ఇచ్చిన జవాబు సారాంశం ఏమిటంటే, ఈ సంవత్సరం పెండింగ్, లిటిగేషన్ తగ్గిస్తారు. అసెస్మెంట్ ప్రొసీడింగ్స్, పెనాల్టీ ప్రొసీడింగ్స్ కలిపి ఒకేసారి పూర్తి చేస్తారు. విడిగా అసెస్మెంట్ని 4–5 సంవత్సరాల సమయం, పెనాల్టీకి 7–8 సంవత్సరాలు పడుతోంది. ఒకేసారి ఆర్డర్ పాస్ చేస్తే సమయం కలిసి వస్తుంది. అసెస్మెంట్ తర్వాత, మీకో అవకాశం ఇస్తారు... రివైజ్ చేసుకునేందుకు. దీన్నే అప్డేట్ చేసుకోవాలి. శాంతిని పొందాలి. అప్పీలుకు వెళ్లడం వల్ల ఖర్చు, కాలయాపన, వడ్డీ, పెనాల్టీలు అవుతాయి. న్యూ రూల్స్ ఇంకా నోటిఫై చేయలేదు. ఫారం 60బీకి సంబంధించి ఉదాహరణగా ఒకప్పుడు బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్/సిస్టమ్స్ లేనప్పుడు పాన్ లేనివారికి ఫారం 60 తీసుకున్నవారు. ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో సీబీఎస్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భానికి ఫారం 60 విషయంలో తగిన మార్పులు చేయొచ్చు. అలాగే ఆడిట్ రిపోర్టులోని అంశాల్లో రిటర్నులు ముందే నింపేలా చేయొచ్చు.అంటే స్మార్ట్ ఫారంల ద్వారా వారికి కావల్సిన సమాచారాన్ని రాబట్టుకుంటారు. ఫారాలు, రిపోర్టులు ఉన్న సమాచారం, రిటర్నుల్లో ముందే వచ్చేలా ఆలోచిస్తున్నారు. దీన్నే ఆటోమేటిక్ ప్రీ–పాపులేట్ అంటారు. ఈ డేటా వల్ల అర్థవంతమైన (అర్థపరమైన) విశ్లేషణకు దారి సుగమం. ఇదే కొత్త మంత్రం. ఇన్కం కరెక్టుగా రిపోర్ట్ చేయండి. అప్పుడు వారికి చెకింగ్ టైమ్ తగ్గుతుంది. మంచివారిని వదిలేసి ‘దేశముదురు’లను.. అంటే పన్ను ఎగవేసే వారి మీద దృష్టి పెట్టొచ్చు.


