Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

West Asia Tensions Ignite Gas Shock Driving Up India Liquor Bottle Costs1
మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు!

పశ్చిమాసియాలోని యుద్ధ భయం భారత్‌లో మందుబాబుల పాలిట శాపంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలు మన దేశంలోని మద్యం బాటిళ్ల ధరలను పెంచేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వీటి ధరలు పెరగకపోయినా సమీప భవిష్యత్తులో మద్యం మరింత ప్రియం కానుందని కొందరు భావిస్తున్నారు.బాటిళ్ల తయారీకి గ్యాస్ సెగమద్యం తయారీలో ముడిసరుకు కంటే ప్యాకేజింగ్ ఖర్చే ఇప్పుడు కంపెనీలకు భారంగా మారింది. దీనికి ప్రధాన కారణం సహజ వాయువు. మద్యం బాటిళ్లు తయారు చేసే గాజు ఫర్నెస్‌లను(కొలిమి) నిరంతరం మండించాలంటే గ్యాస్ తప్పనిసరి. బీర్ తయారీ ఖర్చులో ప్యాకేజింగ్ వాటా సుమారు 40% కాగా, స్పిరిట్స్ (విస్కీ, బ్రాండీ తదితరాలు)లో ఇది 20% వరకు ఉంటుంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సహజ వాయువు దిగుమతిదారు అయిన భారత్ తన అవసరాల కోసం 40% వరకు ఖతార్‌ పైనే ఆధారపడుతోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే అది నేరుగా గాజు బాటిళ్ల ఉత్పత్తిపై దెబ్బకొడుతుంది.ధరల పెరుగుదల ఎంత ఉండవచ్చు?ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ (ఐఎండబ్ల్యూఏ) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రాజేష్ చోప్రా అంచనా ప్రకారం, కేవలం గ్యాస్ ధరల వల్లే గాజు బాటిళ్ల ధర 15-20% పెరిగింది. దీనికి అదనంగా షిప్పింగ్ ఛార్జీలు తోడవ్వడంతో కంపెనీలు బ్రాండ్ల వారీగా 10-15% ధరల సవరణ కోరుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లలో ఈ ప్రభావం తక్షణమే కనిపించనుంది.బీర్ కొరత పొంచి ఉందా?వేసవి కాలం బీర్లకు గరిష్ట డిమాండ్ ఉండే సమయం. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో సరఫరా తగ్గితే వినియోగదారులు ఇబ్బందులు పడక తప్పదు. ‘గ్యాస్ లభ్యత తగ్గితే గాజు ఫర్నెస్‌లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవు. ఫలితంగా బాటిళ్ల కొరత ఏర్పడి పీక్ సీజన్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండకపోవచ్చు’ అని మెడుసా బేవరేజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్దీప్ సింగ్ హెచ్చరించారు. ప్రస్తుతం పరిశ్రమ ఇప్పటికే 12-13 కోట్ల బాటిళ్ల వార్షిక కొరతను ఎదుర్కొంటోంది. అల్యూమినియం ధరలు కూడా 15% పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.ఇన్వెంటరీయే రక్షణ కవచంప్రస్తుతానికి కొన్ని కంపెనీలు ముందస్తు జాగ్రత్తలతో గండం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. రాడికో ఖైతాన్ కంపెనీకి సొంత పవర్ ప్లాంట్ ఉండటం వల్ల ఇంధన ధరల అస్థిరత నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. అలైడ్ బ్లెండర్స్ తమ వద్ద ఒకటిన్నర నెలలకు సరిపడా గాజు బాటిళ్ల స్టాక్ ఉందని, ఇది తక్షణ షాక్ నుంచి కాపాడుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?

Fitch Warns RBI Liquidity Moves to Pressure Indian Banks Margins in FY272
బ్యాంకుల మార్జిన్లు డీలా

దేశీయంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్థానిక కరెన్సీ లిక్విడిటీని పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకునే చర్యలతో బ్యాంకుల మార్జిన్లపై ఒత్తిడి పెరగనున్నట్లు గ్లోబల్‌ దిగ్గజం ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది. మరోపక్క రూపాయిలో హెచ్చుతగ్గుల నివారణకు తీసుకునే చర్యలతో లిక్విడిటీ ప్రయత్నాలు మందగించవచ్చని తెలియజేసింది. అయితే బ్యాంకుల ప్రత్యక్ష విదేశీ కరెన్సీ రిసు్కలు మాత్రం పరిమితంకానున్నట్లు అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి(2026–27) బ్యాంకింగ్‌ రంగ మార్జిన్లు 0.2–0.3 శాతంమేర క్షీణించవచ్చని తెలియజేసింది. పశ్చిమాసియాలో ఆందోళనలు కొనసాగితే నిధుల సమీకరణ వ్యయాలు పెరిగి ప్రస్తుత అంచనాలు 3.1 శాతానికంటేలోపునకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నిర్వహణా లాభ/రిస్క్‌ వెయిటెడ్‌ అసెట్స్‌(ఆర్‌డబ్ల్యూఏలు) 0.3–0.4 శాతంమేర నీరసించవచ్చని తెలియజేసింది. ప్రస్తుత అంచనాలు 2.5 శాతంలో క్షీణత కనిపించవచ్చని అభిప్రాయపడింది. డిపాజిట్‌ వ్యయాలపై..బేస్‌కేస్‌ ప్రకారం తగినంత లిక్విడిటీ కారణంగా డిపాజిట్‌ వ్యయాలు తగ్గనున్నాయి. 2024 నుంచి ఆర్‌బీఐ కీలక రెపో రేటులో 1.25 శాతం కోత పెట్టినప్పటికీ 2026కల్లా 0.44 శాతమే డిపాజిట్‌ రేట్లకు బదిలీ అయినట్లు ఫిచ్‌ ప్రస్తావించింది. డిపాజిట్లను మించుతున్న రుణ వృద్ధి కారణంగా డిపాజిట్ల సమీకరణలో పోటీ పెరిగినట్లు వెల్లడించింది. వెరసి డిపాజిట్‌ రేట్లలో మరిన్ని సర్దుబాట్లకు అవకాశమున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్‌లు, ఓపెన్‌ మార్కెట్‌ కొనుగోళ్ల ద్వారా ఆర్‌బీఐ 2024–25 ద్వితీయార్థంలో లిక్విడిటీని నిలకడగా పంప్‌చేసినట్లు ప్రస్తావించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీని కొనసాగించేందుకు క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు ఆర్‌బీఐ సంకేతాలిచ్చినట్లు తెలియజేసింది. అయితే కరెన్సీ ఒత్తిళ్లు కొనసాగితే లిక్విడిటీ చర్యలు పరిమితంకానున్నట్లు పేర్కొంది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా 2026 మార్చి29కల్లా బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ మిగులు డిపాజిట్లలో 0.5 శాతానికి చేరినట్లు వెల్లడించింది. ఫిబ్రవరిలో ఇది 0.8 శాతంకాగా.. రూపాయి సైతం 4.5 శాతం పతనమైనట్లు పేర్కొంది. రూపాయి ఒత్తిళ్లు కొనసాగితే బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ నిలిపేందుకు ఆర్‌బీఐకున్న అవకాశాలు తగ్గిపోనున్నట్లు వివరించింది. ఇందుకు తీసుకునే చర్యలు బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్థానిక కరెన్సీ లిక్విడిటీని దెబ్బతీస్తుందని తెలియజేసింది. రూపాయి హెచ్చుతగ్గులు దేశీ బ్యాంకులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవని, బ్యాంకింగ్‌ రంగంలో విదేశీ రుణాలు సైతం 10 శాతానికంటే తక్కువేనని తెలియజేసింది. ఈ బాటలోనే తాజాగా 100 మిలియన్‌ డాలర్లకుపైన ఫారెక్స్‌ పొజిషన్లకు తెరవేయమని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించింది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?

India Unincorporated Sector Jobs Surge New Opportunities3
అసంఘటిత రంగంలో ఉపాధి మెరుగు

అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు 2025లో 6.18 శాతం పెరిగి 12,80,51,800కు చేరాయి. గతేడాది 74.52 లక్షల కొత్త అవకాశాలు వచ్చాయి. ఇందులో 35 లక్షల ఉపాధి అవకాశాలు ఇతర సేవల విభాగంలో ఏర్పడ్డాయి. ఈ వివరాలను అన్‌ఇన్‌కార్పొరేటెడ్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఆసుసే) నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఈ వార్షిక సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 2023 అక్టోబర్‌ చివరికి ఈ రంగలో ఉపాధి అవకాశాలు 12,05,99,800గానే ఉన్నాయి.అసంఘటిత రంగంలో సంస్థల సంఖ్య 7.34 కోట్ల నుంచి 7.92 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఇతర సేవల విభాగంలో సంస్థల సంఖ్య 10.29 శాతం పెరిగింది. ఆ తర్వాత తయారీ రంగంలో 6.48 శాతం, వాణిజ్య విభాగంలో 6.18 శాతం చొప్పున కొత్త సంస్థలు అవతరించాయి. ఆర్థిక పనితీరును సూచించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) 10.87 శాతం ఎగిసింది. ట్రేడ్‌ విభాగంలో 16.77 శాతం, తయారీలో 8.52 శాతం, సేవల విభాగంలో 7.36 శాతం మేర జీవీఏ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. ఇతర సేవల విభాగం వాటా జీవీఏలో 42 శాతంగా ఉంటే, ట్రేడ్‌ విభాగం 37 శాతం, తయారీ 21 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఒక్కో కారి్మకుడి జీవీఏ (కార్మికుల ఉత్పాదకత) 2023–24లో ఉన్న రూ.1,49,742 నుంచి రూ.1,56,539కు చేరింది. అన్‌ఇన్‌కార్పొరేటెడ్‌ అంటే వ్యవసాయేతర రంగాల్లోని ప్రైవేటు సంస్థలతో కూడినది కావడం గమనార్హం. మహిళా సంస్థల్లో వృద్ధి..మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు 2023–24లో 26.2 శాతంగా ఉంటే, 2025లో 27 శాతానికి పెరిగాయి. ఒక్కో ఉద్యోగికి చెల్లించే వేతనం గతేడాది 3.88 శాతం పెరిగింది. ముఖ్యంగా ట్రేడ్‌ విభాగంలో కారి్మకుల వేతనం అత్యధికంగా 8.5 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్‌ను వినియోగించే సంస్థల సంఖ్య సైతం 26.7 శాతం నుంచి 39.4 శాతానికి పెరిగాయి. వ్యాపార నిర్వహణలో టెక్నాలజీ స్వీకరణను ఇది తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 6,70,289 సంస్థల డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?

India Mobile Data Usage Surges 31GB Per User Monthly in 20254
మొబైల్‌ డేటా జోరు

దేశీయంగా మొబైల్‌ డేటా వినియోగం గణనీయంగా పెరుగుతోంది. 2024లో ప్రతి యూజరు నెలకు సగటున 27.5 జీబీ వినియోగించగా 2025లో ఇది 31 జీబీకి పెరిగింది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వార్షిక మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండెక్స్‌ (ఎంబీఐటీ) 13వ ఎడిషన్‌ ప్రకారం గత ఐదేళ్లలో డేటా వినియోగం వార్షిక ప్రాతిపదికన 18 శాతం మేర వృద్ధి చెందింది. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ అప్లికేషన్స్, 4కే వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్‌ గేమింగ్‌లాంటి అవసరాల కోసం డేటాకి డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. 2025లో భారత్‌లో మొత్తం డేటా ట్రాఫిక్‌ ప్రతి నెలా 27 ఎక్సాబైట్స్‌కి (ఈబీ) చేరింది. సంఖ్యాపరంగా 5జీ యూజర్లకు సంబంధించి భారత్‌.. ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.మరిన్ని విశేషాలు..డేటా ట్రాఫిక్‌ వృద్ధికి ఫిక్సిడ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (ఎఫ్‌డబ్ల్యూఏ) కూడా కీలకంగా ఉంటోంది. మొత్తం 5జీ డేటాలో ఈ విభాగం వాటా 25 శాతం పైగా ఉంది. వార్షికంగా 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య రెండు రెట్లు పెరిగింది.5జీ వినియోగం వేగవంతంగా పెరుగుతుండటం, ఏఐ ఆధారిత యాప్స్‌ ప్రభావంతో భారత్‌లో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విభాగం కొత్త దశలోకి అడుగుపెడుతోంది.5జీ వినియోగంలో మెట్రో సర్కిల్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆయా మార్కెట్లలో మొత్తం మొబైల్‌ డేటా ట్రాఫిక్‌లో 58 శాతం వాటా 5జీ టెక్నాలజీదే ఉంటోంది.యాక్టివ్‌ 4జీ డివైజ్‌ల సంఖ్య 2025లో 89.2 కోట్లకు చేరింది. ఇందులో 5జీ సామర్థ్యాలు ఉన్న డివైజ్‌ల సంఖ్య 38.3 కోట్లుగా ఉంది. బడ్జెట్‌ 5జీ ఫోన్ల (100 డాలర్ల లోపు ధర) సంఖ్య పది రెట్లు పైగా వృద్ధి చెందింది. గతేడాది విక్రయించిన 90 శాతం స్మార్ట్‌ ఫోన్లు 5జీని సపోర్ట్‌ చేస్తాయి.రాబోయే రోజుల్లో 2031 నాటికి భారత్‌లో 5జీ సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 100 కోట్ల స్థాయిని దాటుతుందని అంచనా.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?

Rupee Soars 152 Paise to 12 Year High as RBI Tightens Dollar Rupee Trading5
పుష్కరకాలం తర్వాత రూపాయి భారీ ర్యాలీ

బ్యాంకుల డాలర్‌–రూపాయి ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకోవడంతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 152 పైసలు బలపడి 93.18 వద్ద ముగిసింది. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో 94.62 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 188 పైసలు బలపడి 92.82 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. గడిచిన 12 ఏళ్లల్లో ఒకరోజులో ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి.‘ఫారెక్స్‌ మార్కెట్లో మార్పులను సమీక్షించిన తర్వాత ఆర్‌బీఐ కొన్ని నియంత్రణ చర్యలు ప్రకటించింది. రూపాయికి సంబంధించిన నాన్‌–డెలివరబుల్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులను రెసిడెంట్, నాన్‌–రెసిడెంట్‌ వినియోగదారులకు అందించకుండా బ్యాంకులను ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. అలాగే, ఈ ఆదేశాల తర్వాత రద్దు చేసిన ఎలాంటి ఫారెక్స్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులను అయినా మళ్లీ బుక్‌ చేసుకోవడాన్ని కూడా పరిమితం చేసింది. దీనివల్ల డాలర్లకున్న కృత్రిమ డిమాండ్‌ తగ్గడంతో రూపాయికి బలం చేకూరింది’ అని మీరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ నిపుణుడు అనుజ్‌ చౌదరీ తెలిపారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్‌ సోర్స్ కోడ్ లీక్‌!

India Extends SIM Binding Deadline WhatsApp Telegram6
సిమ్‌ బైండింగ్‌ గడువు పొడిగింపు

వాట్సాప్, టెలిగ్రాం, సిగ్నల్‌లాంటి మొబైల్‌ మెసేజింగ్‌ యాప్‌లను తప్పనిసరిగా సిమ్‌తో అనుసంధానం చేసేందుకు విధించిన డెడ్‌లైన్‌ని కేంద్రం డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిమ్‌ బైండింగ్‌ నిబంధన ప్రకారం మొబైల్‌లో సిమ్‌ యాక్టివ్‌గా ఉంటేనే మెసేజింగ్‌ ప్లాట్‌ఫాంలు సర్వీసులు అందించాల్సి ఉంటుంది.2025 నవంబర్‌ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆపరేటర్లు దీన్ని ఫిబ్రవరి 26 నుంచి అమలు చేసి, మార్చి 28 నాటికి టెలికం శాఖకు నివేదికనివ్వాలి. సాధారణంగా సిమ్‌ని తొలగించినా, డీయాక్టివేట్‌ చేసినా లేదా విదేశాలకు వెళ్లిపోయినా, దానితో ముడిపడి ఉన్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్, కాలింగ్‌ యాప్‌లు పని చేస్తూనే ఉండటాన్ని అలుసుగా తీసుకుని సైబర్‌క్రిమినల్స్‌ నేరాలకు పాల్పడుతున్నారు. వాటిని అడ్డుకునేందుకే తాజా నిబంధనను ఉద్దేశించారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్‌ సోర్స్ కోడ్ లీక్‌!

Advertisement
Advertisement
Advertisement