Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Air India Slashes International Flights as Fuel Costs Soar1
ఎయిరిండియా సంచలన నిర్ణయం

టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిరిండియా అంతర్జాతీయ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు విపరీతంగా పెరగడం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో మే నెలలో పలు కీలక అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను భారీగా తగ్గించింది. వివిధ మార్గాల్లో 5 శాతం నుంచి ఏకంగా 25 శాతం వరకు విమానాల రద్దు జరిగినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.ముఖ్యమైన రూట్లలో కోతలు ఇలా..చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) మే 1 నుంచి అంతర్జాతీయ విమాన ఇంధన ధరలను 5 శాతం పెంచడంతో ఎయిరిండియా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.ఉత్తర అమెరికా: ఈ మార్గంలో కార్యకలాపాలను 20 శాతం తగ్గించారు. షెడ్యూల్ చేసిన 200 విమానాల్లో సుమారు 40 విమానాలను రద్దు చేశారు.యూరోప్: పారిస్, కోపెన్‌హాగన్, జ్యూరిచ్ వంటి నగరాలకు వారంతపు సర్వీసులను తగ్గించారు. మొత్తం 450 విమానాల్లో దాదాపు 20 విమానాలు రద్దు అయ్యాయి.ఆస్ట్రేలియా: మెల్‌బోర్న్, సిడ్నీ రూట్లలో వారానికి నడిచే ఏడు విమానాల్లో రెండింటిని నిలిపివేశారు.ఆగ్నేయ ఆసియా: ఈ ప్రాంతానికి సర్వీసులను 10 శాతం వరకు కుదించారు.కారణాలేమిటి?.. సీఈఓ వివరణనెట్‌వర్క్ ఆప్టిమైజేషన్, డిమాండ్‌లో మార్పులు, పెరుగుతున్న ఇంధన ధరలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ ఉద్యోగులకు రాసిన లేఖలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ‘పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విమాన మార్గాల మూసివేత వల్ల ప్రయాణ కాలం పెరగడం, కరెన్సీ మార్పిడి రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల అనేక అంతర్జాతీయ సర్వీసులు నష్టాల్లో నడుస్తున్నాయి’ అని చెప్పారు.దేశీయ విమాన సర్వీసులపై ప్రభుత్వ జోక్యం వల్ల ధరల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ రూట్లలో మాత్రం భారం తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. జూన్, జులై నెలల్లో కూడా పరిస్థితులను బట్టి షెడ్యూల్‌లో మార్పులు ఉండొచ్చని సూచించారు.ఇండిగో, అంతర్జాతీయ సంస్థల పరిస్థితిమరోవైపు, ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. మే నెలలో అంతర్జాతీయ సర్వీసులను యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే గల్ఫ్ దేశాలకు సర్వీసులను ఇప్పటికే 10 శాతం తగ్గించింది. అంతర్జాతీయంగా చూస్తే.. లుఫ్తాన్సా మే నుంచి అక్టోబర్ మధ్య ఏకంగా 20,000 విమానాలను రద్దు చేయగా క్వాంటాస్ భారత్‌కు నడిపే తన సర్వీసులను అక్టోబర్ వరకు తగ్గించుకుంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

India Pushes Ethanol Biofuels - New Rules to Cut Imports, Pollution2
ఇథనాల్‌ వినియోగంపై మోటర్‌ నిబంధనలకు సవరణలు

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో ఇథనాల్, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా పెంచే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సెంట్రల్‌ మోటర్‌ వెహికల్స్‌ రూల్స్‌ 1989లో ఉద్గారాల నిబంధనలను సవరించేందుకు పలు ప్రతిపాదనలు చేసింది. ఈ85 (85 శాతం ఇథనాల్‌ కలిసిన పెట్రోల్‌), ఈ100 (పూర్తిగా ఇథనాల్‌ మీదే నడిచే వాహనాలు), బీ100 బయోడీజిల్, హైడ్రోజెన్‌–సీఎన్‌జీ మేళవించిన ఇంధన వినియోగానికి కూడా చోటు కల్పించేలా ఇవి ఉన్నాయి. ఇంధన దిగుమతులను, కర్బన ఉద్గారాలపరమైన కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ఇవి దోహదపడనున్నాయి.ఇప్పటికే దేశీయంగా ఈ20 (20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌) ఇంధనాన్ని వినియోగంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదనలపై 30 రోజుల పాటు ప్రజలతో సంప్రదింపులు జరిపిన మీదట సవరణలు చేయనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, హైవేస్‌ శాఖ ఏప్రిల్‌ 27న ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌లో తెలిపింది. వాహన కాలుష్య నిబంధనలకు సంబంధించి తేలికపాటి వాణిజ్య వాహనాల బరువు పరిమితిని అంతర్జాతీయ ప్రమా ణాలకు అనుగుణంగా 3,000 కేజీల నుంచి 3,500 కేజీలకు పెంచడం మొదలైనవి ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ సవరణతో అన్ని విభాగాల్లోను ఫ్లెక్స్‌ ఫ్యూయల్, పూర్తిగా బయోఫ్యుయల్‌ వాహనాలను ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

India Shines At Venice Biennale, Nita Ambani Leads Cultural Revival World Stage3
ప్రపంచ వేదికపై భారతీయ కళా వైభవం

ప్రపంచ కళా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వెనిస్‌ బినాలే’ వేదికపై భారతీయ ప్రాభవం మెరవనుంది. భారత ప్రభుత్వ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఏసీసీ) భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ‘ఇండియా పెవిలియన్‌’ను తిరిగి వెనిస్‌ బినాలేకు తీసుకువెళ్లడంతోపాటు మన దేశ అద్భుతమైన కళా సంపదను, హస్తకళలను ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించనున్నారు.సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే వేదికకళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ముందుండే రిలయన్స్ ఫౌండేషన్ ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా భారతీయ కళాకారులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ముందడుగుపై కళా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించే అద్భుత ఘట్టమని చెబుతున్నారు. ‘ప్రపంచంలోని గొప్ప వేదికల్లో ఒకటైన వెనిస్‌లో మన దేశ కళ, సంస్కృతి, హస్తకళలను వేడుకగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం’ అని ఓ సీనియర్ ఆర్ట్ క్రిటిక్ అన్నారు.కళాత్మక హొయలతో నీతా అంబానీఈ చారిత్రాత్మక క్షణాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ నీతా అంబానీ తన వస్త్రధారణతో భారతీయ హస్తకళల ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన షిఫాన్-జార్జెట్ చీరలో ఆమె మెరిసిపోయారు. దీనికి జతగా బనారసీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ లేస్ బ్లౌజ్ ధరించారు. మన నేత కళకు నిదర్శనమైన ‘స్వదేశ్’ రూపొందించిన, చేతితో నేసిన బుటిదార్ సోజ్ని శాలువా ఆమె రాజసాన్ని మరింత పెంచింది. ప్రఖ్యాత జ్యువెలరీ ఆర్టిస్ట్ వాలెస్ చాన్ రూపొందించిన ఇయర్ రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

GCC NRIs shift investments from real estate to Indian stocks4
భారత్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రవాసుల ఆసక్తి

న్యూఢిల్లీ: గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపిస్తున్న నిధుల్లో (రెమిటెన్స్‌లు) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంపాదనలో మిగులు నిధులను మాతృదేశానికి పంపడాన్ని ఒక తప్పనిసరి బాధ్యతగా వారి ఇప్పుడు చూడడం లేదు. వ్యూహాత్మకంగా సంపద సృష్టించుకోవాలన్న ప్రణాళికతో స్వదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడుల దృష్టితో మాతృదేశానికి నిధులు పంపిస్తున్నట్టు ఈక్విరస్‌ వెల్త్‌ సర్వే నివేదిక వెల్లడించింది. గల్ఫ్‌ ప్రాంతంలోని (జీసీసీ) 8,300 మంది ఎన్‌ఆర్‌ఐల అభిప్రాయాల ఆధారంగా ఈక్విరస్‌ ఈ వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. గల్ఫ్‌ ప్రాంత ఎన్‌ఆర్‌ఐలకు సంపద సృష్టి కేంద్రంగా భారత్‌ స్థానం స్థిరపడుతోంది. అక్కడి వారు భారత్‌కు పంపిస్తున్న నిధుల్లో సగం పెట్టుబడులు, రిటైర్మెంట్‌ ప్రణాళికల కోసమే ఉంటున్నాయి. సర్వే అంశాలు.. → జీసీసీ దేశాల ఎన్‌ఆర్‌ఐలు భారత్‌కు పంపిస్తున్న మొత్తం నిధుల్లో 27 శాతం పెట్టుబడుల కోసం ఉద్దేశించినవే. → ఆ తర్వాత 22 శాతం రెమిటెన్స్‌లు రిటైర్మెంట్‌ ప్రణాళిక కోసం ఉంటున్నాయి. → ఇక 26 శాతం మేర నిధులు భారత్‌లోని తమ కుటుంబాల జీవన అవసరాల కోసం పంపిస్తున్నారు. → ప్రవాస భారతీయుల పెట్టుబడి ధోరణిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో భూములు, ఇళ్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపించగా, ఇప్పుడు ఆర్థిక సాధనాల వైపు ఆకర్షితులవుతున్నారు. → 40% మంది రియల్‌ ఎస్టేట్‌ (స్థిరాస్తి) నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. → 73% మంది భారత స్టాక్‌ మార్కెట్లలో తమ పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటున్నారు. → 75% మంది దీర్ఘకాల చురుకైన ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం ప్రాంతీయ అస్థిరతలు నెలకొన్నప్పటికీ, ప్రవాస భారతీయులు తమ పొదుపు మొత్తాలను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్టు ఈక్విరస్‌ వెల్త్‌ నివేదిక వెల్లడించింది. 83 శాతం మంది భౌగోళిక రాజకీయ పరిస్థితులు తమ ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయని అంగీకరించారు. ప్రాంతీయ అస్థిరతలపై 41 శాతం మంది ఆందోళన చెందుతుండగా.. 23 శాతం మంది ద్రవ్యోల్బణంపై, 13 శాతం మంది అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రకంగా గల్ఫ్‌ ప్రాంత ఎన్‌ఆర్‌ఐలకు ఉద్యోగ భద్రత, వీసా ప్రాధాన అంశాలుగా ఉంటుండగా.. ఇప్పుడు ఈ అంశాలపై కేవలం 12 శాతం మందే ఆందోళన చెందుతున్నారు. తమ ఆదాయ స్థిరత్వంపై వారిలో పెరిగిన నమ్మకాన్ని ఇది తెలియజేస్తున్నట్టు ఈక్విరస్‌ వెల్త్‌ నివేదిక పేర్కొంది.

Record 20 5 Billion Dollars Investments in the United States by Indian Companies Announced at SelectUSA Summit5
అమెరికాలో భారత్ కంపెనీలు: ఒక్కరోజే భారీ పెట్టుబడులు!

అమెరికాలో జరిగిన 2026 సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో భారతదేశం నుంచి వచ్చిన భారీ పెట్టుబడులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. వివిధ కంపెనీలు.. మొత్తం సుమారు 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను యూఎస్‌లో పెట్టడానికి సన్నద్ధమవుతున్నాయి.''అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి. భారతీయ కంపెనీలు టెక్, తయారీ, ఫార్మాస్యూటికల్స్ వంటి వివిధ రంగాలలో 20.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళిక వేస్తున్నాయి. ఇందులో, ఈరోజే 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన 12 భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. దీని ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి వ్యాపారం చేసినప్పుడు అందరూ గెలుస్తారనడానికి ఇదే నిదర్శనం'' అని అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.Under President Trump’s leadership investment is flowing back into the United States at record levels! Indian companies plan to invest over $20.5 billion in various sectors including tech, manufacturing, and pharmaceuticals. This includes the 12 Indian companies who announced…— Ambassador Sergio Gor (@USAmbIndia) May 6, 2026ఈ పెట్టుబడుల్లో అత్యధిక భాగం భారత ఫార్మా రంగం నుంచే వచ్చింది. సుమారు 19.1 బిలియన్ డాలర్లు.. అమెరికాలో తయారీ యూనిట్లు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, కొత్త ఫ్యాక్టరీల కోసం పెట్టుబడి పెట్టనున్నారు. ఇది ఔషధ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలపరుస్తుంది. అదేవిధంగా ఉక్కు పరిశ్రమ, ఇంధన సరఫరా వ్యవస్థలు, కనెక్టివిటీ ప్రాజెక్టులు కూడా ఈ పెట్టుబడుల్లో భాగమయ్యాయి.సెర్జియో గోర్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం ద్వారా రెండు దేశాలకు సమానంగా లాభం కలిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Gold Climbs Over 3 Percent As Middle East Peace Hopes Drag Down Dollar and Oil6
అందుకేనా.. బంగారం ఇంతలా పెరిగింది!

బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం సాధ్యమవుతుందనే ఆశలు పెరగడంతో, డాలర్ విలువ, చమురు ధరలు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణ భయం తగ్గింది. గోల్డ్ రేటు ఊపందుకుంది.స్పాట్ గోల్డ్ ధర 3.4 శాతం పెరిగి ఔన్సుకు సుమారు 4,708 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది గడిచిన వారం రోజుల్లో అత్యధికం అనే చెప్పాలి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల అంచనాలు ప్రధాన కారణాలు.చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెరుగుతాయి. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదే సమయంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కూడా చమురు ధరలు తగ్గడంతో పెరుగుదల చూపాయి. ఇది పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచింది. మరోవైపు డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం ఇతర కరెన్సీలు కలిగిన వారికి మరింత చౌకగా మారింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు కూడా పెరగడం గ్లోబల్ మార్కెట్‌లో బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

Advertisement
Advertisement
Advertisement