Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

UMANG App Expands Digital Governance Over 2400 Government Services1
ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా?

ఉమాంగ్ యాప్ గురించి చాలా మందికి తెలుసు. కానీ అందులో ఏకంగా 2400 కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని, అవి చాలా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్ యాప్‌ను యూజర్లకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. కొత్త సర్వీసులు ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే 2400 సేవలను అందిస్తోంది. ఇప్పుడు యూజర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఉన్నచోటనే తమకు కావలసిన సేవలను పొందవచ్చు.ఉమాంగ్ యాప్ వేలాది కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సేవలను ఒకే వేదికపైకి చేర్చి, మల్టిపుల్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. 2026 నాటికి ఈ యాప్ గూగుల్ ప్లేలో 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను, లక్షలాది మంది రిజిస్ట్రేషన్ వినియోగదారులను, బిలియన్ల కొద్దీ సంచిత లావాదేవీలను కలిగి ఉంది.UMANG యాప్ ఆండ్రాయిడ్, iOS, వెబ్, SMS, KaiOS ద్వారా ఫీచర్ ఫోన్‌లలో కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఇది బహుళ భాషలకు, బయోమెట్రిక్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇది సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. గ్యాస్ బుకింగ్, ఈపీఎఫ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నో సేవలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) సంయుక్తంగా డిజిటల్ ఇండియా చొరవ కింద 2017లో UMANG యాప్‌ను (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) ప్రారంభించాయి. ఆ తరువాత వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా UMANG ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చెందింది. ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!

Banks to Remain Closed for Next Four Days2
బ్యాంక్ హాలిడేస్: ఐదు రోజుల్లో నాలుగు రోజులు సెలవు!

మార్చి నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇది ఆర్ధిక లావాదేవీలు జరిపేవాళ్లకు కొంత నిరాశను కలిగించింది. ఆర్థిక లావాదేవీల పరంగా ఎంతో కీలకమైన మార్చినెలలో ఇలా వరుస సెలవులు రావడం వల్ల ఏదైనా పెండింగ్ పడే అవకాశం ఉందేమో అని చాలామంది భావిస్తున్నారు.➤మార్చి 27:శ్రీరామనవమి కారణంగా బ్యాంకులకు సెలవు. ప్రత్యేకించి మిజోరం,మహారాష్ట్ర,కర్ణాటక,తమిళనాడు,ఉత్తరాఖాండ్,రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్,చంఢీఘర్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్,ముంబై, నాగ్‌పూర్,జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.➤ మార్చి 28: నాలుగో శనివారం సాధారణ సెలవుదినం కావడంతో, భారతదేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం.➤ మార్చి 29: ఆదివారం సెలవుదినం కావడంతో.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు క్లోజ్ అవుతాయి.➤ మార్చి 31: మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని బ్యాంకులు పనిచేయవు.అందుబాటులో ఆన్‌లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

India Growth Outlook Brightens S and P Projects 7 1 percent GDP Expansion for FY2026 273
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి ఎంతంటే?

భారత్‌కు మెరుగైన వృద్ధి అంచనాలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) 7.1 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. పూర్వపు అంచనా కంటే 0.20 శాతం అధికం కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సైతం గతంలో పేర్కొన్న అంచనాలతో పోల్చితే 0.4 శాతం పెంచి 7.6 శాతం వృద్ధి నమోదవుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది.ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొంది. అయితే మధ్యప్రాచ్యంలో ఘర్షణ వాతావరణం కారణంగా అధిక ఇంధన ధరలు ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడి కలిగించొచ్చని అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరమైన అనిశ్చితులు కారణంగా ఏర్పడే రిస్కులు భారత్‌పై ప్రభావం చూపించొచ్చని (కమోడిటీ ధరలు, ఎగుమతులు, పెట్టుబడుల రాకపై) పేర్కొంది.చమురు ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగితే భారత్‌లో విక్రయ ధరలు సైతం పెరుగుతాయని అంచనా వేసింది. అయితే ధరల పెరుగుదల భారాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులపై మోపే అవకాశం లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం 2026–27లో 4.3 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. అధిక చమురు ధరలు వాణిజ్యలోటు పెరిగేందుకు కారణం కావొచ్చంటూ.. సేవల ఎగుమతుల రూపంలో మిగులు ఈ లోటును పరిమితం చేస్తుందని వివరించింది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు చేయకుండా, స్థిరంగా కొనసాగించొచ్చని అంచనా వేసింది.చమురు ధరల సెగలు.. జూన్‌ త్రైమాసికంలో బ్రెంట్‌ బ్యారెల్‌కు సగటున 92 డాలర్ల స్థాయిలో, 2026లో సగటున 80 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే జూన్‌ త్రైమాసికంలో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌కు 185 డాలర్ల స్థాయికి, 2026 వ్యాప్తంగా 130 డాలర్ల స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదని తెలిపింది.

Vida VX2 Plus KKR Limited Edition Launched4
హీరో విడా KKR ఎడిషన్: దీని స్పెషాలిటీ ఏంటంటే?

హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగమైన విడా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తన భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని, నైట్స్ అన్‌ప్లగ్డ్ 3.0 ఈవెంట్‌లో VX2 ప్లస్ KKR లిమిటెడ్ ఎడిషన్‌ లాంచ్ చేసింది. ఇది సాధారణ విడా కంటే భిన్నంగా నైట్ పర్పుల్, గోల్డ్ కలర్ పొందింది.KKR సాధించిన మూడు ఛాంపియన్‌షిప్ విజయాలకు ప్రతీకగా మూడు యాక్సెంట్ మార్కులను ఈ బైకులో చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో కూడిన ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ముందు - వెనుక భాగాలలో ప్రత్యేకమైన ఎల్ఈడీ డీఆర్ఎల్ పొందుతుంది.VX2 ప్లస్ KKR లిమిటెడ్ డిజైన్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి ఇందులో అదే 3.4kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 142 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఎంపిక చేసిన విడా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

SEBI Launches Verified Label Google Play to Protect Investors from Fraudulent Apps5
నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లకు సెబీ చెక్‌

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రక్షణే ధ్యేయంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరో ముందడుగు వేసింది. దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేస్తూ గూగుల్ ప్లే స్టోర్‌లోని స్టాక్ ట్రేడింగ్ యాప్‌ల కోసం ‘వెరిఫైడ్’ లేబుల్‌ను సెబీ అధికారికంగా ప్రారంభించింది. ఈ నూతన వ్యవస్థ ద్వారా రిటైల్ పెట్టుబడిదారులు నిజమైన, మోసపూరిత యాప్‌ల మధ్య తేడాను సులభంగా గుర్తించే అవకాశం లభించనుంది.ముంచుకొస్తున్న ముప్పుఇటీవల కాలంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల పేర్లను, లోగోలను పోలి ఉండేలా నకిలీ యాప్‌లను సృష్టించి పెట్టుబడిదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు భారీగా పెరుగుతున్నాయి. ‘ఈ అక్రమ యాప్‌లు అచ్చం ఒరిజినల్ ప్లాట్‌ఫారమ్‌ల వలె కనిపిస్తూ తమ డబ్బు నియంత్రిత మార్కెట్‌కే వెళ్తోందని పెట్టుబడిదారులు నమ్మేలా చేస్తున్నాయి. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు తీవ్ర ముప్పు’ అని సెబీ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సవాలును ఎదుర్కోవడానికి సెబీ గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల యాప్‌లకు మాత్రమే ‘వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌’ గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం 600కి పైగా స్టాక్ ట్రేడింగ్ యాప్‌లను ఇప్పటికే వెరిఫై చేసినట్లు రెగ్యులేటర్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇతర ఆర్థిక మధ్యవర్తుల (Intermediaries) యాప్‌లకు కూడా ఈ ఫీచర్‌ను విస్తరించనున్నారు.‘ఫిన్‌ఫ్లుయెన్సర్ల’పై నిఘాఈ సందర్భంగా సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సలహాలిచ్చే ఫిన్‌ఫ్లుయెన్సర్లను ఏరిపారేయడానికి కృత్రిమ మేధ సాధనాలను వాడాలని గూగుల్‌ను కోరినట్లు తెలిపారు. ‘డిజిటల్ ప్రపంచంలో సమాజానికి సమస్యగా మారుతున్న వ్యవస్థలను రూపుమాపడానికి చట్టాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాల్సి ఉంది’ అని పాండే చెప్పారు.ఇదీ చదవండి: పెట్రోల్‌, డీజిల్‌ ఎ‍క్కడెంత వాడుతున్నారంటే..పెట్టుబడిదారులు ఎలా మోసపోతున్నారు?సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా అసాధారణ లాభాలు వస్తాయని ఆశ చూపుతారు.సెబీ బ్రోకర్‌ను పోలి ఉండే నకిలీ యాప్ లింక్ పంపి డౌన్లోడ్ చేయిస్తారు.యాప్‌లో గ్రాఫ్‌లు, లాభాలు కనిపిస్తున్నా వాస్తవానికి ఆ డబ్బు నిందితుల ఖాతాలకు మళ్లుతుంది.పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించే సమయానికి స్కామర్లు అదృశ్యమవుతారు.

Silver Prices Crash 44 Percent From Jan 2026 Know The Details Here6
గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!

2026 ప్రారంభంలో భారీగా పెరిగిన వెండి, క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ ముందుకు సాగింది. మూడు నెలల కాలంలో ఏకంగా 44 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి సమయంలో వెండి కొనాలా?, ఇంకొంత కాలం వేచి చూడాలా? అని చాలామందికి అనుమానం కలిగింది. ఈ కథనంలో మీ అనుమానాలకు సమాధానం చూసేద్దాం.జనవరి 2026లో రూ.4.20 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. నేటికి (మార్చి 26) రూ.2.60 లక్షల వద్దకు చేరింది. అంటే మూడు నెలలు ఇంకా గడవక ముందే సిల్వర్ రేటు రూ.1.60 లక్షలు తగ్గింది. సాధారణంగా.. ధరలు 20 శాతం కంటే తగ్గితే లేదా నష్టపోతే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఇప్పుడు వెండి పరిస్థితి ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు.వెండి ధరలు తగ్గడానికి కారణం?సిల్వర్ ధరలు ఇంతలా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాలర్ విలువ బలపడటం అనే చెప్పాలి. ఇది కాకుండా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల సరఫరా అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండవచ్చని అంచనాలు కూడా వెండి ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయి.నిపుణుల అభిప్రాయంక్రమంగా తగ్గిన వెండి ధరలు మెల్లగా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే.. ఇప్పుడున్న ధరలు చాలా తక్కువ. కాబట్టి వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని కొందరు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకొంతకాలం వేచి ఉండటం మంచిదని మరికొందరు చెబుతున్నారు.పెట్టుబడిదారులకు సూచనలుబంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. అది ఆభరణాలుగా కొనుగోలు చేస్తారా?, బిస్కెట్స్, కడ్డీల రూపంలో కొనుగోలు చేస్తారా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి అనేది మీ సొంత నిర్ణయం. అవసరమైన నమ్మకమైన నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: రూ.3 లక్షలకి ఆర్డర్‌ పెడితే.. వాషింగ్‌ పౌడర్‌ వచ్చింది!

Advertisement
Advertisement
Advertisement