Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates last week in Telugu states1
బంగారం ధరలు.. ఒక్క రోజూ తగ్గలేదు!

దేశంలో బంగారం, వెండి ధరలు గత వారం చుక్కలు చూపించాయి. వారంలో ఒక్క రోజూ తగ్గకుండా వరుసగా భారీ పెరుగుదలను నమోదు చేస్తూ వచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గడిచిన ఏడు రోజుల్లో పసిడి, వెండి ధరలు పెరిగిన తీరు తెన్నుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బంగారం ధరలు24 క్యారెట్ బంగారం తులం (10గ్రాములు) ధర డిసెంబర్‌ 21న రూ.1,34,180 ఉండగా సరిగ్గా వారం తిరిగేసరికి డిసెంబర్‌ 28 నాటికి రూ.1,41,220 లకు చేరింది. అంటే వారంలో ఏకంగా రూ.7,040 ఎగిసింది.ఇక 22 క్యారెట్ బంగారం విషయానికి వస్తే.. డిసెంబర్‌ 21న రూ.1,23,000 ఉన్న తులం ధర డిసెంబర్‌ 28 నాటికి రూ.1,29,450 లకు చేరింది. అంటే వారంలో రూ.6,450 పెరిగింది.వెండి ధరలుగత వారం వెండి ధరల పెరుగుల వేగం బంగారాన్ని మించిపోయింది. డిసెంబర్‌ 21న రూ.2,26,000 ఉన్న కేజీ వెండి ధర డిసెంబర్‌ 28 నాటికి రూ.2,74,000లను తాకింది. మొత్తంగా ఏడు రోజుల్లో రూ.48,000 దూసుకెళ్లింది.పెరుగుదలకు కారణాలివే..అంతర్జాతీయ పరిస్థితులు: అమెరికా వడ్డీ రేట్ల తగ్గుదల, గ్లోబల్ ఆర్థిక అస్థిరతలుసేఫ్‑హేవెన్ డిమాండ్: పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులలో పెట్టుబడి పెంచారుఎంసీఎక్స్‌/కామెక్స్‌ ధరల ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్ రేట్లు దేశీయ ధరలను నేరుగా ప్రభావితం చేశాయి.దేశీయ వినియోగం, కొనుగోలు:భవిష్యత్తు అవసరాల కోసం స్థానిక కొనుగోలు పెరగడం.

Private Credit Growth Raises Concerns Former SEBI Chief U.K. Sinha2
‘ప్రైవేట్‌ అప్పు’ ప్రమాదకరం: సెబీ మాజీ చీఫ్‌

ప్రయివేట్‌ క్రెడిట్‌ వృద్ధి చెందడంపట్ల సెబీ మాజీ చైర్మన్‌ యూకే సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రయివేట్‌ క్రెడిట్‌ అందిస్తున్న సంస్థలు కొన్ని కారణాలరీత్యా బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని వ్యక్తులకు ఫైనాన్స్‌ సమకూర్చుతుంటాయని తెలియజేశారు.ఇదేవిధంగా బ్యాంకు రుణాలు పొందేందుకు అర్హతలేని మరికొంతమందికి సైతం రుణ సౌకర్యాలు కల్పిస్తుంటాయని పేర్కొన్నారు. దీంతో త్వరితగతిన, అధిక రిటర్నులకు వీలున్నట్లు తెలియజేశారు. అయితే ప్రత్యామ్నాయ రంగం(ప్రయివేట్‌ క్రెడిట్‌) విస్తరిస్తుండటంపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా నియంత్రణ సంస్థలకు సూచించారు. ఈ రంగం భారీగా విస్తరిస్తే వ్యవస్థాగత రిస్కులు పెరుగుతాయని తెలియజేశారు.వెరసి నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం ఒకస్థాయికి మించి ఈ రంగం వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌పై పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సదస్సులో సిన్హా ప్రసంగించారు. స్టార్టప్‌ వ్యవస్థ వృద్ధికి వీలుగా వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌కు మరింత మద్దతు ఇవ్వవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా సిన్హా తెలియజేశారు.

Axis Energy Reliance Top Bidders in Coal Blocks Auction for Gasification3
బొగ్గు బ్లాక్‌ల వేలంలో టాప్‌.. యాక్సిస్‌ ఎనర్జీ, రిలయన్స్‌

దేశీయంగా బొగ్గు గ్యాసిఫికేషన్‌ను, స్వచ్ఛ ఇంధనాల ఉత్పత్తిని పెంచే దిశగా నిర్వహించిన బొగ్గు బ్లాక్‌ల వేలంలో యాక్సిస్‌ ఎనర్జీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థలు టాప్‌ బిడ్డర్లుగా నిల్చాయి. హైదరాబాద్‌కి చెందిన పునరుత్పాదక విద్యుత్‌ సంస్థ యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా, వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా 17 బ్లాక్‌లకు బిడ్‌ చేసినట్లు సాంకేతిక బిడ్స్‌ను తెరిచిన మీదట వెల్లడైంది.ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఈ బ్లాక్‌లు ఉన్నాయి. ఇతరత్రా బిడ్డర్లలో పెన్నా ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఒరిస్సాలో ఒక బ్లాక్‌కి, ఎన్‌ఆర్‌ఎస్‌కే మైన్స్‌ అండ్‌ మినరల్స్, క్యాలిబర్‌ మైనింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ చెరి రెండు బ్లాక్‌లకు బిడ్‌ చేశాయి. సింగరేణి కాలరీస్‌–తెలంగాణ పవర్‌ జెనరేషన్‌ కార్పొరేషన్, సాయి సూర్యా ప్రొఫెషనల్‌ సరీ్వసెస్, ఎంఎంపీఎల్‌ కమర్షియల్‌ మైన్స్, మోహిత్‌ మినరల్స్‌ మొదలైనవి బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. బొగ్గును ఉద్గారాలు తక్కువగా ఉండే సింథసిస్‌ గ్యాస్‌ (సిన్‌గ్యాస్‌) ఇంధనం రూపంలోకి మార్చడాన్ని కోల్‌ గ్యాసిఫికేషన్‌గా వ్యవహరిస్తారు. పర్యావరణహిత సిన్‌గ్యాస్, హైడ్రోజన్, మిథనాల్‌లాంటివి దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా సహజ వాయువు, ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తలపెట్టింది. 2030 నాటికి 100 మిలియన్‌ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయాలని నిర్దేశించుకుంది.ఇందులో భాగంగా అక్టోబర్‌లో నిర్వహించిన 14వ విడత వేలం కోసం 41 గనులను ఎంపిక చేసింది. వీటిలో 24 బ్లాక్‌లకు 49 బిడ్లు వచ్చాయి. రెండు, అంతకు మించిన సంఖ్యలో బిడ్డర్లు ఉన్న బ్లాక్‌ల బిడ్లను మాత్రమే తెరిచారు. యాక్సిస్‌ ఎనర్జీ, రిలయన్స్‌ లాంటి దిగ్గజాలు ఇందులో పాల్గొడమనేది కోల్‌ గ్యాసిఫికేషన్‌ పాలసీపై ప్రైవేట్‌ రంగానికి గల నమ్మకానికి నిదర్శనమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Digital Intelligence Platform saves Rs 660 Cr in Online Frauds Within 6 Months4
6 నెలల్లో రూ. 660 కోట్లు కాపాడింది..

ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫాంలో 1,000కి పైగా బ్యాంకులు, థర్డ్‌ పార్టీ యాప్‌లు, పేమెంట్‌ టెక్నాలజీ సంస్థలు చేరినట్లు టెలికం శాఖ (డాట్‌) వెల్లడించింది. అవి అమలు చేస్తున్న ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్లతో (ఎఫ్‌ఆర్‌ఐ) బ్యాంకింగ్‌ వ్యవస్థలో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ. 660 కోట్ల ఆర్థిక నష్టాలను నివారించడం సాధ్యపడిందని పేర్కొంది.ఎఫ్‌ఆర్‌ఐ అమలుపై అవగాహన పెంచేందుకు సంబంధిత వర్గాల కోసం ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకు 16 సెషన్లను నిర్వహించినట్లు డాట్‌ తెలిపింది. దేశీయంగా సైబర్‌నేరాల తీరుతెన్నులు నాటకీయంగా మారిపోయాయని పేర్కొంది. మోసగాళ్లు చట్టబద్ధమైన టెలికం మార్గాల కళ్లు గప్పి, డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌ల్లాంటి అధునాతన నేరాలకు పాల్పడుతున్నారని వివరించింది.ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సంచార్‌ సాథీ ప్లాట్‌ఫాం ద్వారా ప్రజల భాగస్వామ్యం కూడా పెరగడం తోడ్పడుతోందని డాట్‌ తెలిపింది. ఈ పోర్టల్, మొబైల్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.

Retail space leasing in India top 8 cities rises 15percent 20265
నగరాల్లో రిటైల్‌ స్పేస్‌కు డిమాండ్‌ 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్‌–8 నగరాల్లోని షాపింగ్‌ మాల్స్‌లో రిటైల్‌ దుకాణ వసతులకు, ప్రధాన వీధుల్లోని రిటైల్‌ వసతులకు డిమాండ్‌ పెరుగుతున్నట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సంస్థ తెలిపింది. ఈ ఏడాది డిమాండ్‌ 15 శాతం పెరిగి 9 మిలియన్‌ చదరపు అడుగులకు (ఎస్‌ఎఫ్‌టీ) లీజింగ్‌ చేరుకోవచ్చని అంచనా వెల్లడించింది. రిటైలర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెరగనున్నట్టు తెలిపింది. 2024లో ఇవే నగరాల్లో రిటైల్‌ వసతుల లీజింగ్‌ 7.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్‌తోపాటు చెన్నై, బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, కోల్‌కతా, అహ్మదాబాద్‌ నగరాల డేటా ఇందులో ఉంది. ప్రముఖ ప్రాంతాల్లో ఇలా.. టాప్‌–8 నగరాల్లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో (హై స్ట్రీట్‌ లొకేషన్లు) ఈ ఏడాది రిటైల్‌ వసతుల లీజింగ్‌ 5.4 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చన్నది కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ అంచనా. 2024లో ఇది 5.3 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇక షాపింగ్‌ మాల్స్‌లోని రిటైల్‌ దుకాణాల లీజంగ్‌ పరిమాణం 3.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకోవచ్చని తెలిపింది. 2023లో ఇది 2.5 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 2020లో కరోనా విపత్తు అనంతరం ఒక ఏడాదిలో రిటైల్‌ వసతుల అధిక లీజింగ్‌ ఈ ఏడాదే నమోదు కానున్నట్టు, క్యూ4లో (అక్టోబర్‌–డిసెంబర్‌) కొత్త మాల్స్‌ అందుబాటులోకి రానున్నట్టు కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఈడీ గౌతమ్‌ సరాఫ్‌ తెలిపారు. వచ్చే ఏడాది కూడా రిటైల్‌ వసతుల సరఫరా (కొత్తవి ప్రారంభం) మెరుగ్గా ఉంటుందని చెప్పారు. కస్టమర్లు భౌతికంగా చూసి, కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, ప్రీమియమైజేషన్‌కు అనుగుణంగా రిటైల్‌ వసతుల విస్తరణ చోటుచేసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది కొత్త గ్రేడ్‌–ఏ మాల్స్‌ పూర్తి 0.9 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితం కావొచ్చని, 2025లో కొత్త డెలివరీలు 4.3 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని ఈ నివేదిక వెల్లడించింది. మారుతున్న జీవనశైలులు, వినియోగదారుల ప్రాధాన్యతలతో రిటైల్‌ వసతులకు డిమాండ్‌ బలంగా కొనసాగుతున్నట్టు భారతి రియల్‌ ఎస్టేట్‌ ఎండీ, సీఈవో ఎస్‌కే సన్యాల్‌ తెలిపారు. పట్టణాల్లో అనుసంధానత రిటైల్‌ వసతుల డిమాండ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.

RBI uses a Credit control monetary policy strategy6
ఎకానమీకి దేశీ డిమాండ్‌ దన్ను 

ముంబై: సమన్వయంతో కూడిన ద్రవ్య, పరపతి– నియంత్రణ విధానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు బలంగా కొనసాగడానికి సాయపడినట్టు ఆర్‌బీఐ తాజా బులెటిన్‌ పేర్కొంది. అయితే వెలుపలి రిస్క్‌ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు పూర్తి రక్షణ లేకపోవడాన్ని గుర్తు చేసింది. స్థూల ఆర్థిక మూలాలు, ఆర్థిక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి కొనసాగించడం సామర్థ్యాలు, ఉత్పాదకత పెంపునకు సాయం చేస్తుందని.. వేగంగా మారిపోతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడేందుకు దారితీస్తుందని పేర్కొంది. 2025లో అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో టారిఫ్‌లతో నెలకొన్న అసాధారణ మార్పును ప్రస్తావించింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంపై ఈ ప్రభావం ఎంతమేర ఉంటుందన్న దానిపై స్పష్టత లేదంటూ.. అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపై మాత్రం ప్రభావం ఉంటుందని పేర్కొంది. పటిష్టంగా దేశీ డిమాండ్‌ దేశీయంగా బలమైన డిమాండ్‌ మద్దతుతో 2025–26లో క్యూ2లో (సెపె్టంబర్‌ త్రైమాసికం) భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని నమోదు చేసినట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది. నవంబర్‌ నెలకు సంబంధించి కీలక సంకేతాలు సైతం డిమాండ్‌ బలంగా ఉండడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ కనిష్ట స్థాయిలోనే కొనసాగుతుండడాన్ని గుర్తు చేసింది. 2025 ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) గతేడాది ఇదే కాలంతో పోలి్చతే అధికంగా ఉన్నట్టు తెలిపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మాత్రం ప్రతికూలంగా ఉన్నట్టు తెలిపింది. భారత్‌–యూఎస్‌ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశి్చతులు, అధిక వ్యాల్యూషన్ల వద్ద ఎఫ్‌పీఐల అమ్మకాలు చేస్తున్నట్టు పేర్కొంది. ఇది రూపాయి విలువను సైతం ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ అక్టోబర్‌లో 11.87 బిలియన్‌ డాలర్లు వెచి్చంచినట్టు వెల్లడించింది.

Advertisement
Advertisement
Advertisement