Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Govt to divest 6pc stake in Bank of Maharashtra1
ప్రభుత్వ బ్యాంకులో వాటా విక్రయం

పీఎస్‌యూ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర(బీవోఎం)లో ప్రభుత్వం 6 శాతం వాటా విక్రయించనుంది. మంగళవారం(2న) ప్రారంభమైన ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)కు భారీ డిమాండ్‌ కనిపించిన నేపథ్యంలో గ్రీన్‌ షూ ఆప్షన్‌కింద ప్రభుత్వం 6 శాతం వాటా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకు ఫ్లోర్‌ ధర షేరుకి రూ. 54కాగా.. సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైన ఆఫర్‌ డిసెంబర్‌ 3న రిటైలర్లకు అందుబాటులోకి రానుంది.ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా ప్రభుత్వం బ్యాంక్‌లో తొలుత 5 % వాటాకు సమానమైన 38,454,77,748 షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే ఆఫర్‌ తొలి రోజునే 400 శాతం సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. దీంతో మరో 7,69,15,549 షేర్లను(1 శాతం వాటా) సైతం అమ్మివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్స్‌లో పోస్ట్‌ ద్వారా దీపమ్‌ కార్యదర్శి అరునిష్‌ చావ్లా వెల్లడించారు. వెరసి ప్రభుత్వం 6 శాతం వాటాకు సమానమైన 46.14 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది. రూ. 2,492 కోట్లు ఫ్లోర్‌ ధర ప్రకారం బీవోఎంలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 2,492 కోట్లు అందనుంది. సోమవారం ముగింపు ధర రూ. 57.66తో పోలిస్తే 6.3% డిస్కౌంట్‌లో ఫ్లోర్‌ ధరను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంక్‌లో ప్రభుత్వానికి 79.6% వాటా ఉంది. తాజా వాటా విక్రయం ద్వారా బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 75% దిగువకు దిగిరావడంతోపాటు.. పబ్లిక్‌కు కనీసం 25% వాటా నిబంధన అమలుకు వీలు చిక్కనుంది. కాగా.. మరో 4 పీఎస్‌యూ బ్యాంకులలో సైతం ప్రభుత్వం గడువులోగా మైనారిటీ వాటాను పబ్లిక్‌కు ఆఫర్‌ చేయవలసి ఉంది. ఈ జాబితాలో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌( ప్రభుత్వ వాటా 94.6 శాతం), పంజాబ్‌– సింద్‌ బ్యాంక్‌(93.9 శాతం), యుకో బ్యాంక్‌(91 శాతం), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(89.3 శాతం) చేరాయి.

Gold and Silver rates on 3rd December 2025 in Telugu states2
సిల్వర్‌ షాక్‌.. బంగారం ధరలు ఒక్క రోజులోనే రివర్స్‌..

దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. క్రితం రోజున కాస్త ఉపశమనం ఇచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలలో మార్పలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) ఎగిశాయి. వెండి ధరలు అమాంతం దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on December 3rd 20253
Stock Market Updates: నష్టాల్లో కదులుతున్న సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 90.35 పాయింట్లు తగ్గి 25,941.85 కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 241.18 పాయింట్లు నష్టపోయి 84,897.09 వద్ద ట్రేడవుతోంది.హెచ్‌యూఎల్, టైటాన్, టాటా మోటార్స్ పీవీ, ఎన్టీపీసీ, బీఈఎల్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకీ, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, ఐటీసీ నేతృత్వంలోని 30 సెన్సెక్స్ స్టాక్స్ ఈ రోజు నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ ఎం, అదానీ పోర్ట్స్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి.రంగాలవారీగా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా సూచీలు వరుసగా 0.7 శాతం, 0.3 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Nirmala Sitharaman calls for coordinated global effort4
క్రిప్టో తరహా ఆర్థిక ఉత్పత్తులతో సవాళ్లు

ఆర్థిక వ్యవస్థలు డిజటల్‌గా మారుతుండడం, క్రిప్టో, స్టెబుల్‌ కాయిన్లు తరహా కొత్త ఆర్థిక ఉత్పత్తులు పుట్టుకొస్తుండడంతో.. వీటి కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.లబ్ధిదారుల వివరాలు, పన్నుల సమాచారాన్ని సకాలంలో పంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇందుకోసం కృత్రిమ మేథ (ఏఐ) వంటి సాధనాలను వినియోగించుకోవాలని, దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఇందుకు వీలుగా అంతర్జాతీయ ఫోరమ్‌ కోసం మంత్రి సీతారామన్‌ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంతోపాటు పంచుకున్న సమాచారం ఆధారంగా ఫలితాలు సాధించేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.ఢిల్లీలో మంగళవారం 18వ గ్లోబల్‌ ఫోరమ్‌ ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్‌ మాట్లాడారు. ఏ ఒక్క దేశం తనంతట తాను ఈ సవాళ్లను పరిష్కరించలేదన్నారు. సహకారం, విశ్వాసం, సకాలంలో సరైన సమాచారం పంచుకోవడం అవసమరన్నారు. స్పష్టమైన నిబంధనల మేరకు నడుచుకుంటే పన్నుల్లో పారదర్శకత, కచ్చితత్వం ఉంటుందన్నారు.గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో స్వచ్చంద నిబంధనల అమలు మెరుగుపడినట్టు మంత్రి చెప్పారు. సకాలంలో సమాచారాన్ని గుర్తించేందుకు ఏఐ తరహా టెక్నాలజీలు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణలు అన్నవి జవాబుదారీగా ఉండాలంటూ.. ఇవి వ్యవస్థలకు బలాన్ని, విశ్వసనీయతను తెచ్చిపెట్టే విధంగా ఉండాలన్నారు. రహస్య సమాచారం.. డేటా గోప్యతకు సంబంధించి బలమైన వ్యవస్థల దిశగా దేశాలు కలసి పనిచేయాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్‌ శ్రీవాస్తవ పిలుపునిచ్చాన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంచుకునే సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు.

IndiGo Faces Rs 117 Crore Penalty on Input Tax Credit5
ఇండిగో సంస్థకు భారీ జరిమానా

విమానయాన సంస్థ ఇండిగోకు జీఎ‍స్టీ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌కు సంబంధించి కేరళలోని సీజీఎస్టీ కొచ్చి కమిషనరేట్లోని సెంట్రల్ టాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ రూ .117.52 కోట్ల జరిమానా విధించారని, దీన్ని సవాలు చేస్తామని ఇండిగో తెలిపింది.ఇండిగో రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. జరిమానా 2018-19 నుంచి 2021-22 మధ్య కాలానికి సంబంధించి కంపెనీ పొందిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను డిపార్ట్మెంట్ తిరస్కరించింది. దీంతో జరిమానాతో సహా డిమాండ్ ఆర్డర్ జారీ చేసింది. ‘అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు తప్పుగా ఉన్నాయని కంపెనీ నమ్ముతోంది. అలాగే బాహ్య పన్ను సలహాదారుల సహాయంతో కేసుపై బలం తమ వైపే ఉంటుందని కంపెనీ విశ్వసిస్తోంది’ అని ఇండిగో ఫైలింగ్‌లో పేర్కొంది.పన్ను అధికారులు ఇచ్చిన జరిమానా నోటీసును తగిన అధికారుల ముందు సవాలు చేస్తామని తెలిపిన ఇండిగో యాజమాన్యం.. దీని వల్ల తమ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ లేదా ఇతర కార్యకలాపాలపై పెద్ద ప్రభావమేమీ ఉండదని వివరించింది.ఏమిటీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌?ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అనేది వ్యాపార సంస్థలు ఇన్‌పుట్లపై చెల్లించిన పన్నులకు క్రెడిట్ క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను బాధ్యతను తగ్గించుకునేందుకు అనుమతించే జీఎస్టీ కింద ఒక యంత్రాంగం. ఈ అర్హతను ఆయా వ్యాపార సంస్థలు పొందాయా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలిస్తారు. ఒకే వేళ వ్యత్యాసాలు గుర్తిస్తే ఆ ట్యాక్స్‌ క్రెడిట్‌ను జరిమానాతో సహా తిరిగి వసూలు చేస్తారు.

Reliance completes merger of Star Tv with Jiostar6
రిలయన్స్‌లో కీలక విలీనం పూర్తి

జియోస్టార్‌తో అనుబంధ సంస్థ స్టార్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్స్‌ లిమిటెడ్‌(ఎస్‌టీపీఎల్‌) విలీనాన్ని పూర్తిచేసినట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా వెల్లడించింది. స్టార్‌ బ్రాండ్‌తోపాటు.. గ్రూప్‌ కంపెనీలకు లైసెన్సులను ఎస్‌టీపీఎల్‌ కలిగి ఉంది. స్టార్‌ ఇండియాతో ఎస్‌టీపీఎల్‌ విలీనం(ప్రస్తుతం జియోస్టార్‌ ఇండియా)పై 2024 నవంబర్‌ 14న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.జియోస్టార్‌ సైతం రిలయన్స్‌కు అనుబంధ కంపెనీకాగా.. 2025 నవంబర్‌ 30 నుంచి జియోస్టార్‌లో ఎస్‌టీపీఎల్‌ విలీనం అమల్లోకి వచ్చినట్లు తెలియజేసింది. నిజానికి రిలయన్స్‌ మీడియా బిజినెస్, గ్లోబల్‌ మీడియా దిగ్గజం వాల్ట్‌ డిస్నీ దేశీ బిజినెస్‌ మధ్య భాగస్వామ్య కంపెనీగా 2024 నవంబర్‌లో జియోస్టార్‌ అవతరించింది. వెరసి సంయుక్త సంస్థ విలువ 8.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.దీంతో దేశీయంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తున్న కంపెనీ జూలై–సెపె్టంబర్‌ త్రైమాసికంలో రూ. 7,232 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 1,322 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ జియోసినిమా, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ కలయికతో జియో హాట్‌స్టార్‌ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement