ప్రధాన వార్తలు

జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ పోర్ట్ఫోలియోకు కొత్త, చాలా తక్కువ ధర ప్లాన్ను జోడించింది. బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ ను లాంచ్ చేసింది. రూ.189 విలువైన ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 2 జీబీ హైస్పీడ్ డేటా, 300 ఉచిత ఎస్ఎంఎస్లు 28 రోజుల పాటు లభిస్తాయి. తక్కువ ఖర్చుతో నెలంతా ఫోన్ యాక్టివ్ గా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్.ఈ జియో ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, తక్కువ డేటా ఉపయోగించేవారికి మాత్రమే కాకుండా, ఓటీటీ కంటెంట్ ఇష్టపడేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్కు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. అంటే వినోదం, డిజిటల్ స్టోరేజ్ అవసరాలను కూడా తీరుస్తుందన్న మాట.సెకండరీ సిమ్ ఉన్న లేదా తక్కువ ఇంటర్నెట్ ఉపయోగించే కస్టమర్ల కోసం ఈ వాల్యూ ప్యాక్ ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ కేవలం రూ.189కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. రూ.189తో 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త రూల్స్.. ఛార్జీలు పెంపు
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవింగ్స్, శాలరీ, ఎన్ఆర్ ఖాతాదారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సేవలపై ఛార్జీలను పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తన బ్రాంచ్లలో ఫిజికల్గా అందించే సేవలకు సంబంధించి ఛార్జీలను సవరించి కొత్త రేట్లను ప్రకటించింది. ముఖ్యంగా నగదు లావాదేవీలు, సర్టిఫికెట్ సేవలు, పాత రికార్డుల ప్రతులు, ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింపుముందుగా నగదు లావాదేవీల ఉచిత పరిమితిలో కీలకమైన మార్పు జరిగింది. ఇంతకు ముందు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలు ఉండేవి. వాటి మొత్తం పరిమితి రూ.2 లక్షలు. ఇప్పుడు అదే నాలుగు లావాదేవీలు ఉచితంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తం పరిమితిని రూ.1 లక్షకు తగ్గించారు. అంటే ఖాతాదారులు నెలకు రూ.1 లక్ష వరకు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఆ పరిమితిని మించితే, ప్రతి అదనపు లావాదేవీకి రూ.150 ఛార్జీ వసూలు చేయనున్నారు.కొత్త ఛార్జీలుఅలాగే బ్యాలెన్స్ సర్టిఫికెట్, వడ్డీ సర్టిఫికెట్, అడ్రస్ కన్ఫర్మేషన్ వంటి సేవలకు కూడా ఛార్జీలు విధించారు. రెగ్యులర్ కస్టమర్లకు రూ.100, సీనియర్ సిటిజన్లకు రూ.90 చొప్పున వసూలు చేయనున్నారు. ఇదే విధంగా పాత రికార్డులు, పెయిడ్ చెక్కుల కాపీల కోసం రెగ్యులర్ ఖాతాదారులు రూ.80, సీనియర్ సిటిజన్లు రూ.72 చెల్లించాలి. ఇంతకు ముందు ఈ సేవలు ఉచితంగా అందించేవారు. కానీ ఇప్పుడు వాటికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.ఫండ్ ట్రాన్స్ఫర్లకూ..ఫండ్ ట్రాన్స్ఫర్ సేవల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈసీఎస్,ఏసీహెచ్ రిటర్న్ ఛార్జీలను సవరించారు. మొదటి రిటర్న్కు రూ.450 (సీనియర్ సిటిజన్కు రూ.400), రెండవ రిటర్న్కు రూ.500 (సీనియర్కు రూ.450), మూడవ రిటర్న్ నుంచి రూ.550 (సీనియర్కు రూ.500) వసూలు చేయనున్నారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ వంటి డిజిటల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జీలను కూడా కొత్త రేట్లతో అమలు చేస్తున్నారు.ఉదాహరణకు, నెఫ్ట్ ద్వారా రూ.10,000 లోపు ట్రాన్సాక్షన్కు రూ.2, రూ.1 లక్ష వరకు రూ.4, రూ.2 లక్ష వరకు రూ.14, 2 లక్షల పైగా రూ.24 చొప్పున ఛార్జీలు విధించనున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షలు–రూ.5లక్షలు మధ్య ట్రాన్సాక్షన్కు రూ.20, రూ.5లక్షలకుపైగా లావాదేవీకి రూ.45 వసూలు చేస్తారు. ఐఎంపీఎస్ ద్వారా రూ.1,000 లోపు ట్రాన్సాక్షన్కు రూ.2.50, రూ.1లక్ష లోపు అయితే రూ.5, రూ.1లక్షకు పైగా లావాదేవీకి రూ.15 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి.

అనిల్ అంబానీకి భారీ విజయం
చాలా ఏళ్ల తర్వాత అనిల్ అంబానీకి భారీ విజయం దక్కింది. ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్పై రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డ్ (మధ్యవర్తిత్వ పరిహారం) పొందినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్ఫ్రా) తెలిపింది. 2018లో ఆరావళి పవర్ ఓ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంతో మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది.రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు‘ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మెజారిటీ తీర్పుతో ఆ రద్దు చెల్లదని తేల్చి, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుకూలంగా రూ.526 కోట్లు పరిహార తీర్పును ప్రకటించింది’ ఆర్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ అవార్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రోత్ క్యాపిటల్ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఏమిటీ వివాదం?రిలయన్స్ ఇన్ఫ్రాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీసీపీఎల్) 2018లో రద్దు చేసుకుంది. అయితే ఇది అసంబద్ధమంటూ రిలయన్స్ ఇన్ఫ్రా మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆరావళి పవర్ రద్దు నోటీసు జారీ చేయడం, అదే సంవత్సరం మధ్యవర్తిత్వాన్ని కూడా కోరడంతో వివాదం ప్రారంభమైంది.ఆర్ఇన్ఫ్రా సంస్థపై గత ఏడాది డిసెంబర్లో పొందిన రూ .600 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారాన్ని అమలు చేయాలని కోరుతూ ఆరావళి పవర్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఆర్ఇన్ఫ్రా ప్రతిస్పందనను కోరింది.విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ రంగాల్లో నిమగ్నమైన ఆర్ఇన్ఫ్రా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్లో కీలక సంస్థగా ఉంది. ఆగస్టు 13 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,501 కోట్లుగా ఉంది.

రైలు టిక్కెట్లపై 45 శాతం సబ్సిడీ
మన దేశంలో అత్యంత చవకైన ప్రజారవాణా అంటే రైల్వేలే! సుదూర ప్రాంతాలకు కూడా చాలా తక్కువ ఖర్చుతో తీసుకెళ్తాయి. ప్రయాణికుల కోసం రైలు సర్వీసులను కూడా ఏటా పెంచుతూ వస్తోంది రైల్వే శాఖ. ఈ క్రమంలో ప్యాసింజర్ టిక్కెట్ల మీద ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల సబ్సిడీని అందిస్తోంది.ఉదాహరణకు ప్యాసింజర్ రైళ్లు అందిస్తున్న సేవ విలువ రూ.100 అనుకుంటే, టిక్కెట్టు ధర రూ.55 మాత్రమే. మిగతా 45% సబ్సిడీ రైల్వే శాఖే భరిస్తోంది. మరోపక్క రైలు ప్రయాణాల్లో భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చేసే ఖర్చు ఏటా పెరుగుతోంది.కొన్ని గణాంకాలు2019–20లో దేశంలో రోజుకు సగటున నడిచిన ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 13,169.2024–25లో ఈ ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 13,940.2025–26లో... 2025 జూలై వరకు ప్రారంభమైన కొత్త రైలు సర్వీసులు 86దేశంలో 2025 ఆగస్ట్ 7 నాటికి నడుస్తున్న వందేభారత్ రైళ్లు 1442023–24లో ప్యాసింజర్ టిక్కెట్ల మీద ఇచ్చిన మొత్తం సబ్సిడీ రూ. 60,466 కోట్లురైలు ప్రయాణాలు, స్టేషన్లలో భద్రతకు సంబంధించి 2023–24లో రైల్వే శాఖ చేసిన వ్యయం రూ. 1,14,022 కోట్లు

స్టాక్ మార్కెట్లో కొత్త ఇండెక్స్
బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ విభాగం తాజాగా డిఫెన్స్ ఇండెక్స్ను ప్రారంభించింది. బీఎస్ఈ 1000 ఇండెక్స్లోని డిఫెన్స్ థీమ్ స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి. ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్లో) ఇండెక్స్లో మార్పులు, చేర్పులు చేస్తారు. విధాన సంస్కరణలు, పెరుగుతున్న బడ్జెట్ కేటాయింపులు, దేశీయంగా తయారీపై మరింతగా దృష్టి పెరుగుతుండటం తదితర సానుకూల అంశాలతో డిఫెన్స్ రంగం గణనీయంగా వృద్ధి చెందనుందని బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ వివరించింది.ఈ నేపథ్యంలో ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్ మొదలైన ప్యాసివ్ ఫండ్స్కి ఇండెక్స్ ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. అలాగే, పీఎంఎస్ వ్యూహాలు, మ్యుచువల్ ఫండ్ స్కీములు, ఫండ్ పోర్ట్ఫోలియోల పనితీరు మదింపునకు దీన్ని ప్రామాణికంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.

భారత్లో అత్యంత సరసమైన కార్లు ఇవే!
దేశీయ మార్కెట్లో ఎన్నెన్ని కొత్త కార్లను లాంచ్ అయినా.. కొనుగోలుదారులు మాత్రం సరసమైన వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు తక్కువ ధర వద్ద కూడా కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 అఫర్డబుల్ కార్లు ఏవో చూసేద్దాం.➜మారుతి సుజుకి ఆల్టో కే10: రూ. 4.23 లక్షల నుంచి రూ. 6.21 లక్షలు➜మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: రూ. 4.27 లక్షల నుంచి రూ. 6.01 లక్షలు➜రెనాల్ట్ క్విడ్: రూ. 4.70 లక్షల నుంచి 6.5 లక్షలు➜టాటా టియాగో: రూ. 5 లక్షల నుంచి రూ. 8.85 లక్షలు➜సిట్రోయెన్ సీ3: రూ. 5.25 లక్షల నుంచి రూ. 9.90 లక్షలు➜మారుతి సుజుకి సెలెరియో: రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షలు➜మారుతి సుజుకి ఈకో: రూ. 5.7 లక్షల నుంచి రూ. 6.06 లక్షలు➜మారుతి సుజుకి వ్యాగన్ ఆర్: రూ. 5.79 లక్షల నుంచి రూ. 7.02 లక్షలు➜మారుతి సుజుకి ఇగ్నిస్: రూ. 5.85 లక్షల నుంచి రూ. 8.12 లక్షలు➜హ్యుందాయ్ ఐ10 నియోస్: రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.66 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూం)ఇదీ చదవండి: ఒక్కనెలలో 4300 మంది కొన్న కారు
కార్పొరేట్

అనిల్ అంబానీకి భారీ విజయం

రైలు టిక్కెట్లపై 45 శాతం సబ్సిడీ

స్టాక్ మార్కెట్లో నిండా మునిగాడు.. ఇప్పుడు రూ.2.4 కోట్ల వేతనం!

అనుమతిస్తే పునప్రారంభానికి సిద్ధం: ఇండిగో

మరో టాప్ కంపెనీలో లేఆఫ్స్ పర్వం

భారత మార్కెట్పై మరింత ఫోకస్

కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్పై సెబీ వేటు

ఫ్రీ సర్వీస్.. మరి ఆదాయం ఎలా వస్తుంది?

కొత్తగా 20,000 ఉద్యోగాలు..

ఫ్లిప్కార్ట్ ఒక్కరోజు ప్రత్యేక సేల్

లాభాల్లో ముగిసిన మార్కెట్లు
భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు...

ఈరోజు కాస్త ఊరించిన బంగారం ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...

గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...

టారిఫ్ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!
అమెరికా టారిఫ్ల వల్ల నెలకొన్న ఒడిదుడుకుల ప్రభావం ...

రూ.5.82 లక్షల కోట్ల రుణాల మాఫీ
ప్రభుత్వరంగ బ్యాంక్లు (పీఎస్బీలు) గడిచిన ఐదు ఆర్...

స్వల్పంగా తగ్గిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
ప్రత్యక్ష పన్నుల రూపంలో ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత...

మరింత దిగొచ్చిన ధరలు
న్యూఢిల్లీ: కూరగాయలు, ఆహారోత్పత్తులు, ధాన్యాల ధరలు...

కొత్త ఆదాయపన్ను బిల్లులోని ముఖ్యాంశాలు
అరవై ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు ...
ఆటోమొబైల్
టెక్నాలజీ

16 ఏళ్లకే సొంత కంపెనీ.. రెండేళ్లలో రూ.100 కోట్ల సామ్రాజ్యం!
చేయాలనే తపన, ఆలోచించే శక్తి ఉంటే ఎవరైనా అద్భుతాలు చేస్తారు. చదువుకునే వయసులోనే సొంతంగా కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా.. కోట్ల విలువైన కంపెనీ స్థాపించింది. ఇంతకీ ఈ ఘనత సాధించినది ఎవరు?, వారు స్థాపించిన కంపెనీ ఏది అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.భారతదేశంలో పుట్టిన 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) చిన్నప్పుడే తన తండ్రి ఉపయోగించే కంప్యూటర్ చూస్తూ.. దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. ఆ తరువాత కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకుని.. ఏడేళ్ల ప్రాయానికే సొంతంగా కోడింగ్ రాసింది. 11 సంవత్సరాల వయసులో ప్రాంజలి అవస్థి.. తన కుటుంబంతో అమెరికాలోని ఫ్లోరిడాకు మారింది. అక్కడే కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత 13 ఏళ్ల వయసుకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన న్యూరల్ డైనమిక్స్ ఆఫ్ కంట్రోల్ ల్యాబ్లో ఇంటర్న్షిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి తెలుసుకుంది.ఏఐ సాయంతో చాలా పనులను సులభంగా చేయవచ్చని గ్రహించిన ప్రాంజలి.. డెల్వ్.ఏఐ (Delv.AI) ప్రారంభించింది. ఈ కంపెనీ రూ. 3.5 కోట్లతో.. ముగ్గురు ఉద్యోగులతో మొదలైంది. ప్రస్తుతం దీని విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువ. ఈ సంస్థలో పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ప్రాంజలి అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఆమె 'చాట్జీపీటీ ఇన్ హ్యాండ్' అనే కొత్త ప్రాజెక్ట్లో కూడా పనిచేస్తోంది. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది మాట్లాడటమే కాకుండా మీ కోసం కూడా పని చేయగలదని అవస్థి చెబుతోంది.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?

సెమీకండక్టర్ల మార్కెట్ @ రూ. 9.6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి 100–110 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.6 లక్షల కోట్లు) స్థాయికి చేరనుంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం రెండు రెట్లు వృద్ధి చెందనుంది. 2023లో 38 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2024–25లో 45–50 బిలియన్ డాలర్లకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం ఈ రంగంపై తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, అమెరికా తదితర దేశాల ఆధిపత్యం ఉంటోందని వివరించాయి. సెమీకండక్టర్ల ఆవశ్యకత, కోవిడ్ మహమ్మారి కాలంలో నిర్దిష్ట ప్రాంతాలపై ఆధారపడటం వల్ల ఆటోమొబైల్ తదితర సెగ్మెంట్లు ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులు, సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరిశ్రమ స్పందన తదితర అంశాల గురించి ఇందులో తెలిపాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదగాల్సిన అవసరాన్ని ప్రస్తావించాయి. ప్రకటన ప్రకారం.. ప్రపంచంలో తయారయ్యే మొత్తం సెమీకండక్టర్లలో తైవాన్ 60 శాతం ఉత్పత్తి చేస్తోంది. అత్యంత అధునాతన సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్ వాటా ఏకంగా 90 శాతం ఉంటోంది. ఒకే ప్రాంతంపై భారీగా ఆధారపడటమనేది అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కోవిడ్ తరహా మహమ్మారులు, ప్రకృతి విపత్తులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లాంటి అనేకానేక అంశాల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించాయి. దీన్ని గుర్తించే చాలా దేశాలు ప్రస్తుతం సురక్షితమైన, వైవిధ్యమైన సరఫరా వ్యవస్థలను ఏర్పర్చుకుంటున్నాయని పేర్కొన్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా దేశీయంగా చిప్ల తయారీని ప్రోత్సహించేందుకు, ఒకే ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు జాతీయ స్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయని వివరించాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న మార్పుల్లో భారత్ కూడా కీలకమైన, విశ్వసనీయమైన భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్నాయి. 1 ట్రిలియన్ డాలర్లకు గ్లోబల్ మార్కెట్ .. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 2030 నాటికి అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల మార్కెట్ 1 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్లకు చేరనుంది. భారత్ ఇందులో గణనీయమైన వాటా దక్కించుకునే అవకాశం ఉంది. సెమీకండక్టర్ల తయారీ సరఫరా వ్యవస్థకు మూడు ప్రధాన మూల స్తంభాలైన పరికరాలు, మెటీరియల్స్..సరీ్వసులు, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాల విభాగాల్లో కీలక భాగస్వామిగా ఎదిగే సత్తా భారత్కి ఉంది. సెమీకండక్టర్ల ఎక్విప్మెంట్కి అవసరమైన విడిభాగాలను ఉత్పత్తి చేసేందుకు చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) ఉపయోగించుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్ సప్లై చెయిన్ కంపెనీలకు అవసరమైన రసాయనాలు, లోహాలు మొదలైనవి మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయని వివరించాయి. ఇక సరీ్వసుల విషయానికొస్తే ఆర్అండ్డీ, లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థకు సంబంధించి కృత్రిమ మేథ, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లాంటి విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా ఉందని పేర్కొన్నాయి. ప్రభుత్వం దన్ను.. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ వేల్యూ చెయి న్లకి భారత్ను మరింతగా అనుసంధానం చేసే దిశగా సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్, డిస్ప్లేల తయారీ, చిప్ డిజైన్ మొదలైన వాటిల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పరిశ్రమకు ఆర్థిక మద్ద తు కలి్పంచేలా 2021 డిసెంబర్లో రూ. 76,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ఆవిష్కరించింది. అమెరికాకు చెందిన మెమొరీ చిప్ల తయారీ దిగ్గజం మైక్రాన్, టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (టీఎస్ఏటీ), కేనెస్ సెమీకాన్, హెచ్సీఎల్–ఫాక్స్కాన్లతో పా టు తైవాన్ సంస్థ పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ (పీఎస్ఎంసీ) భాగస్వామ్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ (టీఈపీఎల్), రెనిసాస్ అండ్ స్టార్స్ భాగస్వామ్యంలో సీజీ పవర్ అండ్ ఇండ్రస్టియల్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలైనవి భారత్లో సెమీకండక్టర్ల ఉత్పత్తి కోసం రూ. 1.55 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద చిప్ డిజైనింగ్ కోసం రూ. 1,000 కోట్లతో డిజైన్ ఆధారిత ప్రోత్సాహకాలకు కూడా ఐఎస్ఎం ప్రొవిజనింగ్ ఏర్పాటు చేసింది. అర్హత కలిగిన స్టార్టప్లకు ఆర్థికంగా మద్దతునిచ్చేందుకు ఇందులో రూ. 234 కోట్లు కేటాయించారు. ‘22 కంపెనీలు ప్రతిపాదించిన చిప్ డిజైన్ ప్రాజెక్టులకు కేంద్రం రూ. 234 కోట్ల మద్దతుకి హామీ ఇచి్చంది. ఈ మొత్తం ప్రాజెక్టుల వ్యయం రూ. 690 కోట్లుగా ఉంటుంది. ఈ చిప్లను సీసీటీవీ కెమెరాలు, మొబైల్ నెట్వర్క్లు, ఉపగ్రహాలు, కార్లు, స్మార్ట్ డివైజ్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. దేశీయంగా చిప్ల తయారీ వ్యవస్థను అభివృద్ధి చేసే క్రమంలో సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ ఇంటర్నేషనల్ (సెమీ) భాగస్వామ్యంతో కేంద్రం సెమీకాన్ ఇండియా సదస్సుకు కూడా మద్దతునిస్తోంది‘ అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సులో అంతర్జాతీయ పరిశ్రమ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, అంకుర సంస్థలు కూడా పాల్గొంటాయి. పె ట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలకు ఇది వేదికగా నిలుస్తోంది. ఈ ఏడాది సెపె్టంబర్ 2 నుంచి 4 వరకు సెమీకాన్ ఇండియా 4వ ఎడిషన్ న్యూఢిల్లీలో జరుగనుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం), సెమీ కలిసి సెమీకాన్ ఇండియా 2025ని నిర్వహించనున్నాయి. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల వ్యవస్థలో భారత్ పాత్ర గురించి చాటి చెప్పే విధంగా ఈ సదస్సు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ విస్తరణ
హైదరాబాద్: యూకే కేంద్రంగా ఉన్న ఒరాకిల్ (Oracle) భాగస్వామ్య సంస్థ ఈయాప్సిస్ (eAppSys), హైదరాబాద్లో తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను విస్తరించింది. ప్రస్తుతం ఉన్న 200 మంది ఉద్యోగుల సంఖ్యను వచ్చే రెండు సంవత్సరాల్లో 500కి పెంచే లక్ష్యాన్ని సంస్థ ప్రకటించింది. ఈ కొత్త కేంద్రాన్ని తెలంగాణ ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ విస్తరణలో భాగంగా 400 సీట్ల సామర్థ్యంతో కూడిన ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒరాకిల్ క్లౌడ్, ఈఆర్పీ, ఏఐ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల కోసం ఇది ఆసియా-పసిఫిక్ (APAC), యూరప్-మిడిల్ ఈస్ట్- ఆఫ్రికా (EMEA), నార్త్ అమెరికా ప్రాంతాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది.ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లు, ఈఆర్పీ కన్సల్టెంట్లు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు వంటి నైపుణ్యాల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ఈయాప్సిస్ సంస్థ తెలిపింది. స్థానిక ప్రతిభను అభివృద్ధి చేసేందుకు అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది.“ఈ కేంద్రం మా గ్లోబల్ వృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయి” అని ఈయాప్సిస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి బద్దం అన్నారు. “ప్రపంచ దృష్టితో ఆలోచించి, స్థానికంగా అమలు చేసే బృందాన్ని నిర్మిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఈయాప్సిస్ కంపెనీ వివిధ సంస్థలకు ఒరాకిల్ సాఫ్ట్వేర్తో సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ సేవలు అందిస్తుంది.

రక్షాబంధన్ 2025: సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్లు
దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబరాలు మొదలయ్యాయి. సోదరులు.. సోదరీమణులు రక్షా బంధన్ జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా, సైబర్ నేరస్థులు కూడా కొత్త మోసాలకు తెరలేపారు. సాంప్రదాయ విక్రేతలకు బదులుగా ఆన్లైన్లో రాఖీలు, బహుమతులు, స్వీట్లు ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతుండడంతో, సైబర్ నేరస్థులు దీనిని అదనుగా తీసుకుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ క్లౌడ్సెక్ (CloudSEK) చెబుతోంది.ఫిషింగ్ సందేశాలు: స్కామర్లు ఇన్బాక్స్లు, వాట్సాప్, ఎస్ఎమ్ఎస్ల ద్వారా.. రాఖీ గిఫ్ట్ డెలివరీలు లేదా ఎక్స్క్లూజివ్ సేల్ కూపన్ల పేరుతో మెసేజస్ పంపవచ్చు. ఇలాంటి సందేశాలను క్లిక్ చేసినప్పుడు వచ్చే లింక్స్ ఫిల్ చేయడం, లేదా ఇతర చెల్లింపు వివరాలను పూర్తి చేసినప్పుడు మీ ఖాతాలో డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది.ఫేక్ ఈ-కామర్స్ వెబ్సైట్లు: సైబర్ నేరస్థులు చట్టబద్ధమైన ప్లాట్ఫారమ్లను అనుకరించే మోసపూరిత వెబ్సైట్లను సృష్టిస్తారు. ఇలాంటి ఫేక్ వెబ్సైట్ విషయంలో కూడా వినియోగదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.సోషల్ మీడియా స్కామ్: స్కామర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నకిలీ రాఖీ యాడ్స్ కూడా ప్రచారం చేయవచ్చు. ప్లాట్ఫామ్ చట్టబద్ధమైనదని భావించి, వినియోగదారుడు ఆర్థిక వివరాలను పంచుకుంటే మీ చెబుకు చిల్లు గ్యారెంటీ.యూపీఐ & గిఫ్ట్ కార్డ్ స్కామ్లు: రాఖీ గిఫ్ట్ క్లెయిమ్ల మాదిరిగానే నకిలీ యూపీఐ అభ్యర్థనలు లేదా క్యూఆర్ కోడ్లు మీ మొబైల్ ఫోనుకు వస్తే.. వాటిపట్ల కొంత జాగ్రత్త వహించాలి.స్కామ్ల నుంచి బయటపడే మార్గాలు➤రాఖీలు, స్వీట్స్ లేదా గిఫ్ట్స్ వంటివి ఆన్లైన్లో కొనుగోలు చేయాలనుకుంటే.. వినియోగదారుడు తప్పకుండా అధికారిక వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయాలి. నకిలీ వెబ్సైట్లు ఆఫర్స్ ఎరవేసి మిమ్మల్ని ఆకర్శించే అవకాశం ఉంది. కాబట్టి విశ్వసనీయ ప్లాట్ఫామ్ల నుంచి మాత్రమే ఆర్డర్ చేసుకోవాలి.➤ఆన్లైన్ చెల్లింపుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. కొన్ని క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసినప్పుడు ఫిషింగ్ సైట్లు లేదా మాల్వేర్ డౌన్లోడ్లు జరిగే అవకాశం ఉంది. తెలియని నెంబర్స్ నుంచి వచ్చే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు.➤ఫేక్ సైట్లను గుర్తించాలి. నకిలీ సైట్లు దాదాపు అధికారిక సైట్ల మాదిరిగా కనిపించేలా స్కామర్లు పన్నాగాలు పన్నుతారు. అయితే కొన్ని చిన్న మార్పులు గమనించాలి. వెబ్సైట్ URLలలో తేడాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది.రాఖీ పండుగ సంతోషంగా జరుపుకునే సమయం. అయితే స్కామర్లు ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. ఆదమరిస్తే మోసపోవడం మీ వంతు అవుతుంది. కాబట్టి స్కామర్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా రక్షించాలి.
పర్సనల్ ఫైనాన్స్

ఆ మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాల్సిందే!
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా ఐసీఐసీఐ బ్యాంక్ బాటలోకే వచ్చేసింది. తమ బ్యాంకులో పొదుపు ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరాన్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. మెట్రో లేదా పట్టణ శాఖలో కొత్త పొదుపు ఖాతాను తెరిచే ఎవరైనా రూ .25,000 కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించాల్సి ఉంటుంది. ఇది మునుపటి అవసరం రూ .10,000 కంటే రెట్టింపు.ఈ మార్పు ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేర్కొంది. అయితే ఈ కొత్త ఎంఏబీ నిబంధన కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఇప్పటికే పొదుపు ఖాతా ఉన్న కస్టమర్లకు ఇప్పటివరకూ ఉన్న నిబంధనలే కొనసాగుతాయి. ఏదేమైనా ఆగస్టు నుంచి ఖాతాలు తెరిచే వారు అవసరమైన బ్యాంక్ బ్యాలెన్స్ను నిర్వహించకపోతే పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది.కొత్త నిబంధనలుఅప్డేట్ చేసిన నిబంధనల ప్రకారం.. ఖాతాదారులు స్థిరంగా రూ .25,000 బ్యాలెన్స్ నిర్వహించాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ ఈ పరిమితి కంటే తక్కువగా ఉంటే బ్యాంకు జరిమానా విధిస్తుంది. పట్టణ, మెట్రో శాఖలకు లోటులో 6 శాతం లేదా రూ.600లో ఏది తక్కువైతే అది జరిమానాగా లెక్కిస్తారు. ఈ సవరణకు ముందు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎంఏబీ అవసరాలు పట్టణ శాఖలకు రూ.10 వేలు, సెమీ అర్బన్ బ్రాంచ్ లకు రూ.5,000 (నెలవారీ సగటు ), గ్రామీణ శాఖలకు రూ.2,500 (త్రైమాసిక సగటు)గా ఉండేది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఈ పరిమితులు మారలేదు. తాజా సవరణ ప్రత్యేకంగా మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని కొత్త ఖాతాలకు వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంక్ మరీ భారీగా..ఓ వైపు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను రద్దు చేస్తుంటే.. ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఇప్పటికీ ఇలాంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మరింత దూకుడుగా మెట్రో, పట్టణ శాఖలలో కొత్త పొదుపు ఖాతాలకు ఎంఏబీని ఏకంగా రూ .50,000 కు పెంచేసింది. ఇది కూడా ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తుంది. కాగా విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీఐసీఐ బ్యాంక్ దిగివచ్చింది. కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) అవసరాన్ని రూ.15 వేలకు తగ్గించింది. మరి హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా అదే బాటలో తన నిర్ణయం మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.👉 చదవండి: హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్..

ఫారం 16: ఎన్నో ప్రశ్నలు.. అన్నింటికీ జవాబులు
ఫారం 16. దీనికి సంబంధించి ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు.. అలాగే వాటికి జవాబులు ఇక్కడ తెలుకుందాం.ఇదివరకే చాలాసార్లు దీనికి సమాధానం రాశాం. ముందుగా ఆదాయాన్ని లెక్కించండి. అంటే .. అందులో ఏయే అంశాలున్నాయనేది చూసుకోండి. ఉదాహరణకు వేతనమా? ఇంటి మీద అద్దె? వ్యాపారమా? ఉద్యోగం చేస్తున్నారా? క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయా? ఇవన్నీ కాకుండా అదనంగా ఇంకా ఏమేమి ఆదాయాలు ఉన్నాయి, మొత్తంగా ఎన్ని ఉన్నాయో తెలుసుకొని ఒక పద్ధతి ప్రకారం క్రమంగా వ్రాయండి. ఇలా చేయడానికి మీరు కాస్త కసరత్తు చేయాలి. జీతానికి సంబంధించిన వివరాలు, అలాగే పెన్షన్ వివరాలు.. ఒక ఏడాది కాలంలో యాజమాని లేదా ఉద్యోగం మారారా? మారితే ఫారం 16 ఇచ్చారా ? అందులో ఎంత జీతం చూపించారు. ఇద్దరూ చెరొకసారి స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చారా? అలా ఇవ్వకూడదు. అలాగే ఇద్దరూ బేసిక్ లిమిట్ పరిగణలోకి తీసుకున్నారా? అలా తీసుకోకూడదు.చాలా మంది స్టాండర్డ్ డిడక్షన్ని, బేసిక్ లిమిట్ని రెండు చోట్ల తీసుకొని.. ఎక్కడా పన్ను భారం లేదు కదా అని మురిసిపోతుంటారు. తీరా రెండూ కలిపి లెక్కలు తీసి, పన్ను భారం వేసేసరికి షాక్ అవుతుంటారు. కొందరు యజమానులను, కన్సల్టెంట్లను తిట్టుకుని, ఇరుగు పొరుగుని సంప్రదించి ఎగవేతల వెంకటేశ్వరరావుని ఆదర్శంగా తీసుకుని సంతోషపడినా.. మరొక దూరపు బంధువు జాగ్రత్తల జగన్నాధం అలాంటి ‘శషభిషలు’ పనికి రావు అని శాసిస్తే.. చివరికి సరైన దారిలోకి వస్తుంటారు.అంటే రెండు చోట్లా డిడక్షన్లు క్లయిం చేస్తారు. యజమాని సహకారం, ఉదాసీనత, అరకొర జ్ఞానం, మిడిమిడి జ్ఞానం మొదలగు వాటి ముసుగులో హెచ్ఆర్ఏ విషయంలో దొంగ రశీదులు, ఎక్కువ చెల్లించినట్లు రశీదులు, చనిపోయిన మావగారింట్లో చూరుపట్టుకొని వేలాడుతూ ఇల్లరికం అల్లుడిలా చెలామణి అవుతూ, మావగారి సంతకంతో ఒక రశీదు పడేస్తారు.ఆఫీసులో కొంతమంది ప్రబుద్ధులు, భార్యభర్తలు .. అద్దె చెల్లించకుండా, తండ్రి ఇంట్లో ఉచితంగా ఉంటూ, ఇద్దరూ హెచ్ఆర్ఏ విషయంలో క్లెయిం చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొందరు సొంత ఇంట్లోనే ఉంటూ, తన పేరు మీదే ఇల్లు ఉన్నా, గతంలో ఒక ఇల్లు/వాకిలి/స్థలం అమ్మేసిన సొమ్ము వస్తే, ఆ సంగతి ఆదాయపు పన్ను శాఖ వారికి చెప్పకుండా, అదృష్టం బాగుండి ఏ అప్పూ లేకుండా ఇల్లు పూర్తి చేస్తుంటారు. తన పేరు మీదే మున్సిపల్ ట్యాక్స్ చెల్లించినా కూడా హెచ్ఆర్ఏ సంగతి గుర్తుకు రాగానే, కంగుతిని, భార్యామణి చేత సంతకం పెట్టించి, ఆమెనే ఓనరుగా చూపించి హెచ్ఆర్ఏ క్లెయిం చేస్తుంటారు. అలాగే యజమాని సహకారం/ ప్రేమ/ జాలి / కరుణ గల ఉద్యోగ రత్నాలు తమకు వర్తించే అన్ని డిడక్షన్లు క్లెయిం చేస్తున్నారు. ఒక విధంగా దొంగ క్లెయిమ్లు చూపించి, వాటిని ఫారం 16లో పొందుపరిచి, వాటికి పవిత్రను ఆపాదించే ఉద్యోగ రాయుళ్లు ఉన్నారు.ఇదీ చదవండి: ఫారం 16లో జరిగిన మార్పులు.. గమనించారా?అందుకే కాబోలు...డిపార్ట్మెంట్ వారు కఠినంగా వ్యవహరించేందుకు సన్నద్ధులు అయ్యారు. ఆ యుద్ధం చేసే ముందు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. అదేమిటంటే ప్రతి డిడక్షన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆ కాగితాలను జతపరచకపోయినా వాటిలోని వివరాలు చాలా ఇవ్వాలి. ఇస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఇవ్వకపోతే క్లెయిమ్/డిడక్షన్ ఇవ్వరు. ఫారంలో వివరాలు ఇస్తే గనుక, రిటర్నులు దాఖలు చేయాలి. ఫారం 16 అంశాలు సమీక్షించి సరైన కాగితాలు సమకూర్చుకుని, సన్నద్ధం కండి.ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య

ఆర్థిక స్వేచ్ఛ అంతరార్థం తెలుసా?
అంతా ఆర్థిక స్వేఛ్చ గురించి మాట్లాడుతుంటారు గానీ దాని అంతరార్థం గురించి చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు. సాధారణంగా ఆర్థిక స్వేచ్ఛ అనగానే సంపద పోగేసుకుని, విశాలమైన ఇల్లు కట్టుకుని, విలాసవంతంగా విహారయాత్రలు చేస్తుండటమో, ఎర్లీగా రిటైర్ కావడమో అనుకుంటూ ఉంటారు. మన దగ్గరున్న డబ్బు గురించే తప్ప దాన్ని సంపాదించడానికి, నిలబెట్టుకోవడానికి అవసరమైన అలవాట్ల గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ, ఆర్థిక స్వేచ్ఛ అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మన విలువ ఎంతఅనేది మాత్రమే కాదు.మనం కాలక్రమేణా అలవాటు చేసుకునే ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. ఆర్థిక స్వేచ్ఛకు సరికొత్త నిర్వచనం భారీగా సంపాదించడం లేదా బాగా పొదుపు చేసుకుని దాచి పెట్టుకోవడమనేది ఆర్థిక భద్రత అనిపించవచ్చు. కానీ సంపాదన బాగా ఉన్నంత మాత్రాన మనశ్సాంతి గానీ ఆర్థిక సమస్యల నుంచి ఊరట గానీఉంటాయని గ్యారంటీ లేదు. అంతా అసూయపడేంత ఆదాయం ఉన్నవాళ్లు కూడా అప్పులతో సతమతమవుతూ నెలనెలా జీతమొస్తే గానీ గడవని పరిస్థితి ఉంటుంది. ఎంత వచ్చినా సరిపోవడం లేదనిపిస్తుంది. మరోవైపు, మరికొందరు అంతంత మాత్రం సంపాదన, ఒక మోస్తరు వనరులు ఉన్నా ఆర్థికంగా సాధికారత కలిగి ఉన్నట్లుగా కనిపిస్తారు. రెండు వర్గాల మధ్య వ్యత్యాసం క్రమశిక్షణే. పని, కుటుంబం, లైఫ్స్టయిల్ విషయాల్లో మనం సరైనవి ఎంచుకునేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇది అందిస్తుంది.సంపద పరిమితులు..బోలెడంత డబ్బుంటే ఆటోమేటిక్గా ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయనిపిస్తుంది. అయితే, సంపదతో అవకాశాలు వచ్చినా, రిస్క్లు కూడా పెరుగుతాయి. వివేకంతో వ్యవహరించకపోతే ఎంత సంపదైనా వేగంగా కరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. వారసత్వంగానో లాటరీల రూపంలోనో వచ్చిపడే డబ్బు కొన్నేళ్లలోనే ఆవిరైపోతుంది. అంతకు ముందు కన్నా పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. దీనికి కారణం వనరులు లేకపోవడం కాదు. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే. కాబట్టి సంపదతో స్వేచ్ఛను సాధిస్తామా లేక ఆర్థిక కష్టాలను మరింతగా పెంచుకుంటామాఅనేది మన అలవాట్లను బట్టే ఉంటుంది.ఆర్థిక క్రమశిక్షణకు మూలస్తంభాలుఆర్థికంగా దీర్ఘకాలిక సంక్షేమం అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. అలాగని దీనికి అసాధారణ మేథోశక్తో లేదా అదృష్టమో అవసరం లేదు. చిన్న చిన్న మంచి అలవాట్లే కాలక్రమేణా ఆర్థిక స్వేచ్ఛకు పునాదులు వేస్తాయి. అలాంటి అలవాట్లు కొన్ని చూద్దాం..బడ్జెట్ వేసుకోవడం: ఆదాయాన్ని, ఖర్చుల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉంటే అనవసర ఖర్చులను నివారించుకోవచ్చు. సిస్టమాటిక్గా పొదుపు: పొదుపు ఉద్దేశపూర్వకంగానే ఉండాలే తప్ప మిగిలిపోయిన డబ్బును దాచిపెట్టుకునే వ్యవహారంగా ఉండకూడదు. ఆటోమేటిక్గా పొదుపు చేసే అలవాటును అలవర్చుకోవాలి.నిలకడగా పెట్టుబడులు: మార్కెట్లు ఎలా ఉన్నా సరే నిలకడగా పెట్టుబడులను కొనసాగిస్తే కాలక్రమేణా కాంపౌండెడ్ వృద్ధితో ప్రయోజనాలను పొందడం సాధ్యపడుతుంది. లైఫ్స్టయిల్ ప్రలోభాలకు లొంగకపోవడం: ఆదాయం పెరిగే కొద్దీ, లైఫ్స్టయిల్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలనే కోరిక బలంగా పెరుగుతుంది. కానీ, అదనపు ఆదాయాన్ని సంపద నిర్మించుకునే అసెట్స్లోకి మళ్లిస్తూ, నిర్దిష్ట జీవన ప్రమాణాలను కొనసాగిస్తేనే సిసలైన పురోగతి సాధ్యపడుతుంది. సాధనాలు, సిస్టంలతో క్రమశిక్షణకు దన్ను క్రమశిక్షణకు సంకల్పంతో పాటు నిర్దిష్ట సాధనాలు కూడా తోడైతే మరిన్ని సత్ఫలితాలను పొందవచ్చు. పెట్టుబడుల ఆటోమేషన్: సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లనేవి (సిప్) మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా క్రమానుగతంగా నిర్దిష్ట మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ముందుకెళ్లేందుకు ఉపయోగపడతాయి. లక్ష్యాల ఆధారిత ప్లానింగ్: ఇంటి కొనుగోలు, పిల్లల చదువు లేదా రిటైర్మెంట్.. ఇలా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానికి తగ్గట్లుగా ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడులకు ఒక దశ, దిశా ఏర్పడతాయి. నిర్మాణాత్మకమైన లక్ష్యాలు స్ఫూర్తిని కలిగించేవిగా ఉంటాయి. వివేకవంతంగా కేటాయింపులుమీ ప్రొఫైల్కి తగ్గట్లుగా రిస్క్లు, రివార్డుల మధ్య సమతూకం ఉండేలా, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించాలి. వివిధ సాధనాలకు కేటాయింపుల విషయంలో క్రమశిక్షణతో ఉంటే ఒడిదుడుకుల్లోనూ మీ దీర్ఘకాలిక వ్యూహం పట్టాలు తప్పకుండా ఉంటుంది. ఇలా ఆటోమేటిక్గా పొదుపు చేయడం, ఖర్చులను సమీక్షించుకునేందుకు రిమైండర్లను పెట్టుకోవడం లాంటి చిన్న చిన్న అలవాట్లనేవి మెరుగైన ఫలితాలను అందిస్తాయి. క్రమశిక్షణను భారంగా కాకుండా రోజువారీ జీవితంలో భాగంగా మారుస్తాయి.చివరిగా చెప్పేదేమిటంటే, బ్యాంకు అకౌంటులో మ్యాజిక్ ఫిగర్ బ్యాలెన్స్తోనో, ఒకేసారి వచ్చి పడే లాభాలతోనో ఆర్థిక స్వేచ్ఛ రాదు. ఇది క్రమశిక్షణ, వివేకవంతమైన చిన్న చిన్న నిర్ణయాలతో ముడిపడి ఉండే జీవితకాలపు ప్రక్రియ. మీ ‘స్వాతంత్య్ర దినోత్సవం’ అనేది మీ సంపాదన పరిమాణంపై ఆధారపడి ఉండదు. ఆర్థిక స్వేచ్ఛకు దోహదపడే అలవాట్లను, క్రమశిక్షణను అలవర్చుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మొదటి అడుగు ముందుకు వేయండి.మైండ్సెట్లో మార్పుఇవన్నీ జరగాలంటే ముఖ్యంగా మైండ్సెట్ను మార్చుకోవాలి. సాధారణంగా రియాక్టివ్, ప్రోయాక్టివ్ అంటూ రెండు రకాల మైండ్సెట్లు ఉంటాయి. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించే రియాక్టివ్ ధోరణిలో ప్రతి నెలా ఎంత మిగిలితే అంతే పొదుపు చేయడం. అత్యవసర పరిస్థితులు వస్తే అప్పటికప్పుడు హడావిడిగా ఏర్పాట్లు చేసుకోవడం, దీర్ఘకాలికంగా పనికొచ్చేవి అలవాటు చేసుకోవడం కన్నా సత్వర లాభాల వెంట పరుగులు తీయడంలాంటి తీరు ఉంటుంది. క్రియాశీలకమైన, ప్రోయాక్టివ్ మైండ్సెట్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ముందుగా మన అవసరాలను చూసుకోవడం, అత్యవసర పరిస్థితుల కోసం ప్లానింగ్ చేసుకోవడం, ముందుగా నిర్దేశించుకున్న ఫ్రేమ్వర్క్కి లోబడే ఖర్చులు ఉండేలా చూసుకోవడంలాంటివి ఈ ధోరణిలో ఉంటాయి. ఇది ఆర్థికంగా ఆందోళనను తగ్గిస్తుంది. స్పష్టతనిస్తుంది. పరిస్థితులను మన అదుపులో ఉంచుకునేలా నియంత్రణను ఇస్తుంది. కాలక్రమంలో నిజమైన ఆర్థిక స్వేచ్ఛ దిశగా ముందుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుంది.ఇదీ చదవండి: పిల్లల విద్య కోసం పెట్టుబడి మార్గం?

పిల్లల విద్య కోసం పెట్టుబడి మార్గం?
నేను రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. వీటిపై మెరుగైన రాబడులకు ఉన్న మార్గం ఏంటి? – సుదీప్త్ సేన్ఏ ఇన్వెస్టర్ అయినా గరిష్ట రాబడి కోరుకోవడం సహజమే. కానీ, అధిక రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పెట్టుబడులపై మెరుగైన రాబడులను పొందేందుకు కొన్ని అంశాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం రాబడి కోణంలోనే పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుంటే అది నష్టానికి దారితీయవచ్చు. అందుకుని ప్రతీ పెట్టుబడి సాధనం ఎంపిక ముందు అందులోని సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. కానీ, దీనికి గ్యారంటీ ఉండదు. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. అస్థిరతలు ఎక్కువగా ఉంటుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్లు కరెక్షన్కు లోనై ఉంటే అప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకుని స్వల్పకాలానికి ఈ తరహా రిస్క్ను అధిగమించేందుకు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.ఐదేళ్లు అంతకుమించిన కాలానికి ఈక్విటీలను ఎంపిక చేసుకోవాలి. అలాగే పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక ఫండ్ బలహీన పనితీరు చూపించినా.. మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిప్ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్వల్ప కాలంలో పెట్టుబడులపై మార్కెట్ కరెక్షన్ల ప్రభావాన్ని అధిగమించొచ్చు. చివరిగా అస్సెట్ అలోకేషన్ను పాటించాలి. డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, ఆ పెట్టుబడులను ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా డెట్, ఈక్విటీ పెట్టుబడుల్లో, కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలి. నాకు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఉన్నత విద్య కోసం ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. ఇందుకు ఏ సాధనాలను ఎంచుకోవాలి? – విద్యారణ్యపిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో చాలా మంది తల్లిదండ్రులు సందేహం ఎదుర్కొంటుంటారు. ఒకే విడత పెట్టుబడితోపాటు క్రమానుగత పెట్టుబడి (సిప్)ని సైతం ఎంపిక చేసుకోవచ్చు. ఉన్నత విద్య కోసం అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలు మెరుగైన సాధనమే అని చెప్పాలి. ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది.ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్ను తగ్గిస్తుంది. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఒక డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది.