Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India Leads World AdTech AI Adoption Says Taboola CEO Adam Singolda1
ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం

సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు ప్రకటనల రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో భారత్ ప్రపంచ దేశాల కంటే వేగంగా దూసుకుపోతోందని ప్రముఖ గ్లోబల్ యాడ్‌టెక్ సంస్థ తబూలా (Taboola) వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్ సింగోల్డా స్పష్టం చేశారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ప్రకటనకర్తలు, పబ్లిషర్లు కొత్త ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడటం లేదన్నారు. వైఫల్యాలు ఎదుర్కోవడానికైనా సిద్ధపడుతూ ఏఐ స్వీకరణలో దూకుడు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. సింగోల్డా తన 15 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చూడనంత గణాంకాలను భారత్‌లో చూస్తున్నట్లు వెల్లడించారు. ‘కంపెనీ ప్రవేశపెట్టిన డీపర్ డైవ్ ప్రొడక్ట్ ద్వారా వినియోగదారులు పబ్లిషర్ సైట్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని ‘క్లిక్-త్రూ రేట్’ డబుల్ డిజిట్‌లో ఉంది. ఏఐ ఆధారిత ఈ యాడ్‌ ప్లాట్‌ఫామ్ కోసం ఏటా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేసే ప్రకటనకర్తల సంఖ్య గతేడాది భారీగా పెరిగింది’ అని అన్నారు.డిజిటల్ డిమాండ్ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ మెడిసన్ వరల్డ్ తన తాజా వ్యయ నివేదికలో 2026 నాటికి భారతీయ మార్కెట్ పూర్తిగా డిజిటల్ డిమాండ్‌తో నడుస్తుందని విశ్లేషించింది. ఏఐ టూల్స్ వాడటం వల్ల క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్‌లో వారానికి సగటున 5.2 గంటలు (ఏడాదికి దాదాపు 30 పనిదినాలు) ఆదా అవుతున్నట్లు పేర్కొంది. ఏఐ ద్వారా విజువల్స్, కంటెంట్ రూపొందించడం సులభతరం కావడంతో చిన్న సంస్థలు కూడా పెద్ద కార్పొరేట్ కంపెనీల స్థాయిలో నాణ్యమైన ప్రకటనలు ఇవ్వగలుగుతున్నాయని తెలిపింది.2027 నాటికి ఏజెన్సీల విభజనభవిష్యత్తులో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు రెండు విభాగాలుగా విడిపోయే అవకాశం ఉందని మెడిసన్ వరల్డ్ అంచనా వేసింది. అందులో సిస్టమ్స్ ఏజెన్సీలు సొంతంగా ఏఐ ఫ్రేమ్‌వర్క్‌లు, మేధో సంపత్తిని కలిగి ఉండి ఫలితాల ఆధారంగా పని చేస్తాయి. సర్వీస్ ఏజెన్సీలు కేవలం ప్లాట్‌ఫామ్ టూల్స్‌ను ఉపయోగించి క్లయింట్‌లకు సేవలను అందిస్తాయని చెప్పింది.వినియోగదారుల అలవాట్లుభారత్‌లో వినియోగదారులు కూడా టెక్నాలజీని వేగంగా స్వీకరిస్తున్నారు. గణాంకాల ప్రకారం, 65 శాతం మంది భారతీయులు రోజూ ఏదో ఒక రూపంలో ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్‌గా ఉన్న భారత్ ఏఐ అడ్వర్టైజింగ్‌కు అడ్డాగా మారబోతోందని సింగోల్డా ధీమా వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే ఏఐని ప్రాథమిక దశలో కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించే సంస్థలకు, వెనుకబడిన సంస్థలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం

Indian Women Drive Financial Independence From Earnings to Smart Investments2
ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం

భారతీయ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం సంపాదనకే పరిమితం కాకుండా తమ కష్టార్జితాన్ని ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలనే విషయంలో మునుపెన్నడూ లేని విధంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ‘డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ విన్వెస్టర్ పల్స్’ నివేదిక ఈ ఆసక్తికర మార్పును వెల్లడించింది.పెరిగిన అవగాహన.. మారిన ధోరణిదేశవ్యాప్తంగా 5,050 మంది ఇన్వెస్టర్లపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే మహిళలు 2022లో 44 శాతంగా ఉండగా ప్రస్తుతం అది 56 శాతానికి పెరిగింది. ఆన్‌లైన్ వేదికల ద్వారా లభిస్తున్న సమాచారం, పెరిగిన ఆర్థిక అక్షరాస్యత ఇందుకు ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. సర్వే ప్రకారం.. ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ప్రొఫెషనల్ అడ్వైజర్ల సలహా తీసుకుంటూ పూర్తి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆన్‌లైన్ అడ్వైజర్లకు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. అందుకే ఇప్పటికీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్లకే మొగ్గు చూపుతున్నారు.పురుషులు వర్సెస్ మహిళలుపెట్టుబడుల విషయంలో స్త్రీ, పురుషుల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని సర్వే తెలిపింది. మార్కెట్లు పతనమైనప్పుడు పెట్టుబడులను పెంచే విషయంలో పురుషులు (15%) ముందుండగా, మహిళలు (10%) కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మహిళలు ఎక్కువగా డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఇది వారు రిస్క్ మేనేజ్‌మెంట్‌లో పరిణతి సాధిస్తున్నారని సూచిస్తోంది.‘మహిళలు కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు, సమాచారంతో కూడిన స్వతంత్రతను ప్రదర్శిస్తున్నారు. మార్కెట్లను అర్థం చేసుకుంటూ తమ ఆశయాలకు అనుగుణంగా పెట్టుబడులను మలుచుకుంటున్నారు’ అని డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ చైర్‌పర్సన్ అదితి కొఠారీ దేశాయ్ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ సంక్షోభం.. ఏం చేయాలో ఆలోచించాలి!

JP Morgan CEO Jamie Dimon Predicts AI Will Cut Workdays3
ఏఐ సంక్షోభం.. ఏం చేయాలో ఆలోచించాలి!

ప్రపంచంలోని టాప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీల్లో ఒకటిగా ఉన్న జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మొన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించిన డిమోన్.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వల్ల పని దినాలు తగ్గుతాయని అంచనా వేయడం గమనార్హం.వారానికి 3.5 రోజుల పనే!బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమోన్ మాట్లాడుతూ.. ఏఐ ప్రభావంతో భవిష్యత్ తరాల జీవనశైలి పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు. ‘వచ్చే మూడు నాలుగు దశాబ్దాల్లో మన పిల్లలు వారానికి కేవలం నాలుగు లేదా మూడున్నర రోజులు మాత్రమే పని చేసే స్థాయికి ఏఐ ఉత్పాదకతను పెంచుతుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత వల్ల పని గంటలు తగ్గి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడటం అనేది ఒక అద్భుతమైన విషయం అన్నారు.జేపీ మోర్గాన్‌లో ఇప్పటికే ఏఐ జోరుకేవలం అంచనాలు వేయడమే కాకుండా, తన బ్యాంకులో ఇప్పటికే ఏఐని భారీగా వినియోగిస్తున్నట్లు డిమోన్ వెల్లడించారు. మోసాల గుర్తింపు, రిస్క్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఎర్రర్ రిడక్షన్ వంటి చాలా విభాగాల్లో ఏఐని వాడుతున్నట్లు చెప్పారు. సంస్థలోని సుమారు 1,50,000 మంది ఉద్యోగులు ఇప్పటికే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.‘సాంకేతికత ఎప్పుడూ ఉద్యోగాలను మారుస్తూనే ఉంటుంది. కానీ ఏఐ తెచ్చే మార్పులు వేగంగా ఉంటాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు ఈ మార్పునకు ఇప్పుడే సిద్ధం కావాలి’ అని జామీ డిమోన్ తెలిపారు.ఉద్యోగ ముప్పుపై హెచ్చరికఒకవైపు ఆశావాదాన్ని ప్రకటిస్తూనే, మరోవైపు ఉద్యోగాల తొలగింపుపై డిమోన్ వాస్తవాలను బయటపెట్టారు. పరిశ్రమలు ఏఐని స్వీకరించే క్రమంలో ఉద్యోగాల నష్టాన్ని తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు. రాబోయే ఐదేళ్లలో ఏఐ వల్ల పెరిగే ఉత్పాదకత కారణంగా బ్యాంకులో తక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉంటుందని అంగీకరించారు. ఉద్యోగాలు కోల్పోయే వారిని ఎలా ఆదుకోవాలనే అంశంపై ప్రభుత్వాలు, సంస్థలు ఆలోచించాలని సూచించారు.ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!

Gold and Silver rates on 5th March 2026 in India4
మరింత తక్కువకు బంగారం.. కొనేవారిదే భాగ్యం!

దేశంలో బంగారం ధరల (Today Gold Rate) తగ్గుదల కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఉపశమనం కలుగుతోంది. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

EPFO Moves to Complete Automation Ends Manual Services5
EPFO : ఉద్యోగులకు అలెర్ట్‌.. KYC పూర్తి చేశారా?

సాక్షి, హైదరాబాద్‌: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) ద్వారా అందే సేవలను పూర్తిగా ఆటోమేషన్‌ పద్ధతిలో నిర్వహించాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) నిర్ణయించింది. ఇందుకు ప్రతి చందాదారుడు తప్పనిసరిగా కేవైసీ సమర్పించాలని సూచించింది. అలా కేవైసీ సమర్పించిన వారికి ఈ సేవలన్నీ ఆటోమేషన్‌ పద్ధతిలో అందుతాయి.ఇకపై మాన్యువల్‌ విధానానికి తావు ఇవ్వొద్దని సీబీటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కసరత్తు చేయాలని ఈపీఎఫ్‌ఓ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన జరిగిన సీబీటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చందాదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న తరుణంలో సేవలను వేగంగా అందించే లక్ష్యంతో డిజిటల్‌ రీఫార్మ్స్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.మానవ జోక్యం లేకుండా... క్లెయిమ్‌ ప్రాసెస్‌ను మానవ జోక్యం లేకుండా పూర్తి చేసే వ్యవస్థను ఈపీఎఫ్‌ఓ అభివృద్ధి చేస్తోంది. పూర్తిగా ఆటో సెటిల్‌మెంట్‌ విధానాన్ని విస్తరిస్తోంది. ఒక క్లెయిమ్‌ పరిష్కారానికి ఇదివరకు మాన్యువల్‌గా కాగితాల సమర్పణ, అధికారుల ఆమోదం లాంటివి ఉండేవి. ఇకపై అలాంటి జాప్యం లేకుండా ఆటోమేషన్‌ పద్ధతిలో క్లెయిమ్స్‌ ప్రాసెస్‌ చేస్తారు. ఇందుకోసం చందాదారుడు ఆధార్, బ్యాంకు కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.దీంతో మానవ ప్రమేయం లేకుండా సిస్టమ్‌ ఆధారంగానే క్లెయిమ్స్‌ సెటిల్‌ చేస్తారు. ఈ సందర్భంలోనే ఆన్‌లైన్‌ ట్రాకింగ్, ఎస్‌ఎంఎస్‌/ ఈ –మెయిల్‌ అప్‌డేట్‌ను మరింత పారదర్శకం చేయనున్నారు. ఇనాపరేటివ్‌ ఖాతాల నిర్వహణకు చెక్‌ పెట్టాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్‌ ఉన్న ఈపీఎఫ్‌ ఖాతాలు, చాలాకాలంగా నిర్వహణ లేని వాటిని ఆటో–ఇనిషియేషన్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ చేసేందుకు సీబీటీ నిర్ణయం తీసుకుంది.ఇలాంటి ఖాతాలు దాదాపు 3 లక్షలకు పైబడి ఉన్నాయి. ఆటో–ఇనిషియేషన్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ విధానాన్ని పైలట్‌ పద్ధతిలో ప్రారంభించనుంది. చిన్న మొత్తాలున్న ఖాతాలు, ఏళ్ల తరబడి నిర్వహణ లేని ఖాతాలను స్వయంచాలకంగా గుర్తించి, సభ్యుల బ్యాంక్‌ వివరాలు సరైనవని నిర్ధారించుకొని ఆ నిధులను వెనక్కి ఇచ్చేస్తారు. దీంతో ఏటా వడ్డీ చెల్లింపులు, నిర్వహణ భారం తగ్గుతుంది. ఈడీఎల్‌ఐ పథకం అమలు కూడా మరింత వేగవంతం కానుంది.క్లెయిమ్స్‌ను వేగంగా పరిష్కరించేలా ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రావిడెంట్‌ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్‌ విభాగాల మధ్య డేటా సమన్వయానికి చర్యలు చేపట్టనున్నారు. చందాదారులకు ఒకేచోట సేవలు అందేలా యూనిఫైడ్‌ పోర్టల్‌ అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇదివరకే తీసుకోగా... పనుల ప్రగతి నివేదికపైనా సీబీటీ సమావేశంలో చర్చించారు.యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌) ఆధారంగా రికార్డుల నవీకరణ, పేరు, పుట్టిన తేదీ సవరణను సులభతరం చేయనున్నారు. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తారు. ఫిర్యాదుకు సంబంధించిన సమస్య పరిష్కారానికి నిర్దేశించిన గరిష్ట సమయం కంటే ముందే పరిష్కరించేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.

Stock market updates on 05 March 20266
స్టాక్‌ మార్కెట్‌ సూచీల దారెటు?

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 117 పాయింట్లు పెరిగి 24,596 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 375 పాయింట్లు పుంజుకొని 79,502 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement