Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Salaries in India Projected to Rise 9 Percent in 20261
2026లో జీతాలు పెరిగేది వీరికే!

భారతదేశంలో 2026లో జీతాలు 9 శాతం పెరుగుతాయని, Aon యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్ అండ్ టర్నోవర్ సర్వే ద్వారా వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ, 2025లో నమోదైన 8.9 శాతం జీతాల వృద్ధి కంటే.. ఈ అంచనా స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది.రియల్ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) వరుసగా 10.9 శాతం, 10 శాతం చొప్పున అత్యధిక జీతాల పెరుగుదలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎగుమతులు తగ్గడం, ఏఐ (కృత్రిమ మేధస్సు) ప్రభావం కారణంగా టెక్నాలజీ కన్సల్టింగ్ రంగాలు మాత్రం 6.5 శాతానికి పరిమితం చేయనున్నాయి. 2025 ఐటీ కంపెనీలు 7 శాతం జీతాల పెరుగుదలను ప్రకటించాయి.టాప్/సీనియర్ & మిడిల్ మేనేజ్‌మెంట్ జీతాల వృద్ధి వరుసగా 8.5 శాతం, 8.9 శాతం వద్ద ఉంటాయి. అయితే.. జూనియర్ మేనేజ్‌మెంట్ జీతాలు మాత్రం 9.5 శాతానికి (2025లో 9.3 శాతం పెరుగుదల) చేరే అవకాశం ఉంది. పోటీ మార్కెట్‌లో యువ ప్రతిభను ఆకర్షించడంలో భాగంగానే ఈ కొంత జీతాల పెంపు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఉద్యోగ విరమణ 17.1 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.1060 కంపెనీల నుంచి సేకరించిన డేటాఈ నివేదికను.. 45 పరిశ్రమలలోని 1,060 కంటే ఎక్కువ కంపెనీల నుంచి డేటా ఆధారంగా రూపొందించారు. ఇందులో సుమారు 43 శాతం కంపెనీలు FY26కి వార్షిక ఆదాయ వృద్ధిని 10 శాతం కంటే ఎక్కువ అంచనా వేయగా.. 27 శాతం మంది 5–10 శాతం వృద్ధిని ఆశిస్తున్నారు. మరో 12 శాతం మంది ఎటువంటి ప్రభావం లేదని అంచనా వేస్తున్నారు. 14 శాతం మంది 0–5 శాతం వృద్ధిని చూస్తున్నారు. 4 శాతం మంది మాత్రం ప్రతికూల వృద్ధిని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు

Man Find 30 Years Old JSW Steel Shares Now Worth Rs 1 83 Crore2
కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు

ఎప్పుడు, ఎవరు, ఎలా కోటీశ్వరులవుతారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇది అందరి జీవితంలో జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఒకవేళా జరిగితే మాత్రం.. వారిని మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్స్ గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని కొందరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఊహకందని నష్టాలను కూడా చూడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలు వచసాయి. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడంతా పేపర్ రూపంలోనే లావాదేవీలు జరిగేవి. ఆ నాటి పేపర్స్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టులో.. సుమారు 30ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన షేర్లకు సంబంధించిన పేపర్లు దొరకడంతో ఒక వ్యక్తి.. ఇప్పటి వాటి విలువను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ వ్యక్తి 1995లో జేవీఎస్ఎల్ (JVSL) కంపెనీకి సంబంధించిన షేర్లను ఒక్కక్కరి రూ. 10 చొప్పున.. 100 కొనుగోలు చేసాడు. 1000 రూపాయలు పెట్టి కొన్న షేర్స్.. ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అవి ఇప్పుడు దొరికాయి. వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ. 1.83 కోట్లు అయింది.ఇదీ చదవండి: మిలియనీర్‌గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!2005లో జేవీఎస్ఎల్ కంపెనీ.. జేఎస్‌డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. ఆ సమయంలో ఒక జేవీఎస్ఎల్ షేర్ ఉన్న వారికి.. జేఎస్‌డబ్ల్యూ కంపెనీ 16 షేర్స్ ఇచ్చింది. దీంతో 1995లో కొన్న వ్యక్తి 1000 షేర్స్ 16000 షేర్స్ అయ్యాయి. ఈ విషయాన్ని మార్కెటింగ్ గ్రోమాటిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం JSW ధర ఒక్కో షేరుకు రూ. 1,146 ఉంది. దీంతో ఆ షేర్స్ విలువ రూ. 1.83కోట్లుగా మారింది. ఆ వ్యక్తి ఒకేసారి కోటీశ్వరుడయ్యాడు. View this post on Instagram A post shared by Startup | Marketing (@marketing.growmatics)

IIHL Mauritius Acquires Sterling Bank3
ఐఐహెచ్‌ఎల్‌ మారిషస్‌ చేతికి స్టెర్లింగ్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ: బహమాస్‌కి చెందిన స్టెర్లింగ్‌ బ్యాంకులో మిగతా 49 శాతం వాటాలను దక్కించుకున్నట్లు ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ (ఐఐహెచ్‌ఎల్‌) మారిషస్‌ వెల్లడించింది. దీనితో బ్యాంకు కొనుగోలు పూర్తయినట్లు వివరించింది.2022 సెప్టెంబర్‌లో బ్యాంకులో 51 శాతం వాటాను ఐఐహెచ్‌ఎల్‌ మారిషస్‌ కొనుగోలు చేసింది. బ్యాంకు పేరును ’ఐఐహెచ్‌ఎల్‌ బ్యాంక్‌ అండ్‌ ట్రస్టు’ గా మార్చనున్నట్లు సంస్థ తెలిపింది. బ్యాంకింగ్, బీమా తదితర ఆర్ధిక సేవలందించే ఐఐహెచ్‌ఎల్‌ నికర విలువ 1.26 బిలియన్‌ డాలర్లుగా ఉంది. భారత్‌లో అయిదో పెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌నకు ఐఐహెచ్‌ఎల్‌ ప్రమోటరుగా ఉంది.

Barber Turned Millionaire And Buys Rs 3 Crore Range Rover To Use As Luxury Taxi4
మిలియనీర్‌గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!

ఎక్కడైనా ట్యాక్సీ కోసం.. మారుతి కారునో, మహీంద్రా కారునో లేదా టాటా కారునో ఉపయోగిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన ఒక బార్బర్ ఏకంగా రూ.3.2 కోట్ల విలువైన కారును ట్యాక్సీగా అద్దెకు ఇవ్వడానికి కొనుగోలు చేశారు.బెంగళూరుకు చెందిన రమేష్ బాబు.. టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లెక్కలేనన్ని కార్లను ఈ ఫ్లీట్‌లో చేర్చిన ఈయన.. తాజాగా 'రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యుబీ' కారును చేర్చారు. ఈ కారును డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.రమేష్ బాబు టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో.. ఇప్పటికే రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ మేబాచ్, జీ వ్యాగెన్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130, బీఎండబ్ల్యు ఐ7 వంటి కార్లు చేరాయి. ఇప్పుడు తాజాగా రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యుబీ చేరింది. ఈ కారు ఫుజి వైట్ క్లాసీ షేడ్‌లో ఉన్న హెచ్ఎస్ఈ లాంగ్ వీల్‌బేస్ వేరియంట్. ఇది 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా 346 బీహెచ్పీ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.రమేష్ బాబు లగ్జరీ కార్లురమేష్ బాబు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కష్టాలను అధిగమించి.. నేడు మిలియనీర్‌ స్థాయికి ఎదిగారు. బెంగళూరులో జన్మించిన రమేష్ బాబు తండ్రి బార్బర్, అయితే తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో.. తల్లి తమను పోషించడానికి పనిమనిషిగా పనిచేసింది. ఈ క్రమంలో రమేష్ బాబు చిన్న చిన్న పనులు చేస్తూ.. పాఠశాల విద్యను పూర్తి చేసి, తండ్రికి చెందిన బార్బర్ షాప్ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులోనే మెల్లగా ఎదిగి, మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: రోజుకు 12 గంటల నిద్ర!.. ఇదే నా సక్సెస్ సీక్రెట్: టెలిగ్రామ్ సీఈఓమారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేసిన తరువాత.. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఆలా అద్దెకు కార్లను ఇవ్వడం ద్వారా సంపాదించడం ప్రారభించి.. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రీమియం కార్ల అద్దె కంపెనీ ఏర్పాటు చేశారు. 2011లో అద్దెకు ఇవ్వడానికి రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ I కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈయన అనేక ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తున్నారు.

Passive Funds Are Gaining Popularity5
ప్యాసివ్‌ ఫండ్స్‌కు పెరుగుతున్న ఆదరణ

న్యూఢిల్లీ: ప్యాసివ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. ఇందుకు నిదర్శనంగా ప్యాసివ్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల (ఏయూఎం) విలువ 2025 మార్చి నాటికి రూ.12.2 లక్షల కోట్లకు చేరింది. 2019 నాటికి ఉన్న రూ.1.91 లక్షల కోట్ల నుంచి ఆరు రెట్లు పెరిగింది.మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మూడో ఎడిషన్‌ ‘ప్యాసివ్‌ సర్వే 2025’ ఈ వివరాలు విడుదల చేసింది. 2023 మార్చి నుంచి చూసినా ప్యాసివ్‌ ఫండ్స్‌ ఏయూఎం 1.7 రెట్లు పెరిగింది. మూడు వేల మందికి పైగా ఇన్వెస్టర్లు, ఫండ్స్‌ పంపిణీదారుల నుంచి అభిప్రాయాలను సర్వేలో భాగంగా మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తెలుసుకుంది.ప్యాసివ్‌ ఫండ్స్‌ (ఇండెక్స్‌ ఫండ్స్‌/ఈటీఎఫ్‌లు) అన్నవి నిర్దేశిత సూచీల్లోని స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. రాబడి కూడా సూచీల స్థాయిలోనే ఉంటుంది. యాక్టివ్‌ ఫండ్స్‌ మెరుగైన రాబడుల అవకాశాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూ, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. యాక్టివ్‌ ఫండ్స్‌తో పోల్చి చూస్తే ప్యాసివ్‌ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉంటుంది. సర్వే అంశాలు..76 శాతం మంది ఇన్వెస్టర్లు తమకు ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌ల పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పడం గమనార్హం.68 శాతం ఇన్వెస్టర్లు కనీసం ఒక ప్యాసివ్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టారు. 2023లో ఇలాంటి వారు 61 శాతంగా ఉన్నారు.ప్యాసివ్‌ ఫండ్స్‌కు ఆదరణ పెరిగినప్పటికీ.. యాక్టివ్‌ ఫండ్స్‌పైనా కొందరు ఇన్వెస్టర్లలో అమిత విశ్వాసం కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు యాక్టివ్‌ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. వీరికి ప్యాసివ్‌ ఫండ్స్‌ గురించి పెద్దగా తెలియకపోవడం కూడా ఒక కారణం.ప్యాసివ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి తక్కువ వ్యయాలు కారణమని 54 శాతం మంది చెప్పారు. సులభత్వం, పారదర్శక గురించి 46 శాతం మంది ప్రస్తావించారు. 29 శాతం మంది పనితీరును కారణంగా పేర్కొన్నారు.మ్యూచువల్‌ ఫండ్స్‌ పంపిణీదారుల్లోనూ 93% మందికి ప్యాసివ్‌ ఫండ్స్‌పై అవగాహన ఉంది.సర్వేలో పాల్గొన్న ఇన్వెస్టర్లలో 85 శాతం మంది మూడేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. దీర్ఘకాలం కోసం పెట్టుబడుల ధోరణి వారిలో కనిపించింది. ఏడాది నుంచి మూడేళ్ల మధ్య పెట్టుబడులు కొనసాగిస్తున్న వారు 13 శాతంగా ఉన్నారు.57 శాతం మంది ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌), ఒకే విడతలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. 26 శాతం మంది కేవలం సిప్‌లో, 17 శాతం ఒకే విడత పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.ఆర్థిక స్వేచ్ఛ కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు 61 శాతం మంది చెప్పగా, రిటైర్మెంట్‌ నిధి కోసం 49 శాతం ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.

Telegram CEO Pavel Durov Secret of Success6
రోజుకు 12 గంటల నిద్ర!.. ఇదే నా సక్సెస్ సీక్రెట్

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుందని.. అందరూ నమ్ముతుంటే, ఫోన్ వాడకపోవడం వల్లే నేను సక్సెస్ సాధించా అని టెలిగ్రామ్ కో-ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov) చెబుతున్నారు. ఇంతకీ అదెలా సాధ్యమైంది?, వివరాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం.లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ''రోజులో వీలైనంత సమయం.. సుమారు 11 నుంచి 12 గంటలు నిద్ర కోసం కేటాయించడానికి ప్రయత్నిస్తాను. అయితే అన్ని గంటలు నిద్రకోసం కేటాయించినా.. నిద్రపోను. మంచం మీద పడుకుని ఆలోచిస్తూనే ఉంటాను'' అని దురోవ్ పేర్కొన్నారు.పడుకున్నప్పుడే.. నాకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. తాను సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఉన్నప్పటికీ.. స్మార్ట్‌ఫోన్ వాడకం చాలా తక్కువని పేర్కొన్నారు. నిద్ర లేచిన వెంటనే తన ఫోన్‌ చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. నోటిఫికేషన్‌లు, సోషల్ మీడియా వంటివన్నీ ఒక వ్యక్తి రోజును డిసైడ్ చేస్తాయని నమ్ముతాను.జీవితంలో ఏది ముఖ్యమైనదో నిర్ణయించుకోవాలి. ఇతర వ్యక్తులు, కంపెనీ వంటివన్నీ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి కాదు. ప్రతి రోజూ ఉదయం ఫోన్ లేకుండానే మీ దినచర్యను ప్రారభించడం అలవాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలువ్యాయామం చేసేటప్పుడు.. ఇతరత్రా పనులు చేసేటప్పుడు కూడా వీలైనంత ఫోనుకు దూరంగా ఉండాలి. ఫోన్ దూరంగా ఉన్నప్పుడే మీకు అద్భుతమైన ఆలోచనలు రావొచ్చని దురోవ్ చెబుతున్నారు. టెక్నాలజీ, కనెక్టివిటీ వంటి వాటికి మద్దతు ఇస్తున్నప్పటికీ.. జీవితంలో ఏది ముఖ్యమో దానికోసం సమయం వెచ్చించాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement
Advertisement