Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

manage monthly subscriptions within a family budget effectively1
జస్ట్‌ 99.. కానీ కాస్ట్‌లీ

ఓ 20 ఏళ్ల కిందటి మాట. అప్పట్లో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు ఒకటి రెండు రూపాయలు పెరిగితే చాలు. దేశమంతా భగ్గుమనేది. ప్రతిపక్షాలు బంద్‌లకు పిలుపునిచ్చేవి. ధర్నాలు, రాస్తారోకోలు మామూలే. చివరికి ప్రభుత్వం దిగివచ్చి పెంచినదాంట్లో కొంత తగ్గించేది. దాంతో పరిస్థితి సర్దుమణిగేది. కానీ 2017 జులైలో కేంద్ర ప్రభుత్వం రోజువారీ ధరలు మారే విధానాన్ని అమల్లోకి తెచి్చంది. అంటే అంతర్జాతీయ ధరలకనుగుణంగా ఏ రోజుకారోజు ధరలను సవరించటమన్న మాట. కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేనాటికి పెట్రోలు ధర లీటరుకు రూ.65. నాటి నుంచీ ధరలు రోజూ పైసా నుంచి 5 పైసల వరకు పెరగటం మొదలయ్యాయి. అప్పుడప్పుడూ తగ్గినట్లు కనిపించినా... అది తాత్కాలికమే. మెల్లగా ఎనిమిదేళ్లు తిరిగేసరికి ప్రస్తుతం లీటరు ధర ఏకంగా రూ.105కు చేరింది. విచిత్రమేంటంటే ఇంతలా పెరిగినా బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలు జరగలేదు. జనం కనీసం ఆగ్రహాన్ని కూడా వ్యక్తంచేయటం లేదు. ఎందుకంటే ఈ పెరుగుదల అనేది వారికి నొప్పి తెలియకుండా జరిగింది. ఇదంతా ఎందుకంటే... నెలవారీ సబ్ర్‌స్కిప్షన్లు కూడా ఇలా నొప్పి తెలియకుండా మన జేబుకు చిల్లు పెట్టేవే. కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తే... వీటిద్వారా వృధా కాకుండా బాగానే ఆదా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...ఏడాదికి 30వేల నుంచి లక్ష వరకూ డిజిటలైజేషన్‌ పెరిగాక సబ్ర్‌స్కిప్షన్ల యుగం మొదలైంది. ఇపుడవి నగరవాసుల జీవితాల్లో భాగమైపోయాయి. ఓటీటీలు, మ్యూజిక్, క్లౌడ్‌ స్టోరేజీ, లెరి్నంగ్‌ యాప్‌లు, ఏఐ యాప్‌లు... ఇలా ఒకటేమిటి!. రకరకాల యాప్‌లు. వాటిలో నిజంగా ఏది అవసరం, ఏది అనవసరం అనేది కాస్త ఆగి, ఆలోచించకుండా, ఎడా పెడా సబ్‌్రస్కయిబ్‌ చేసేసే ధోరణి పెరుగుతోంది. పైపెచ్చు ఎదిగిన పిల్లలున్న ఇంట్లో అయితే ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే యాప్‌ను సబ్‌్రస్కయిబ్‌ చేస్తున్న సందర్భాలు అనేకం. తాజా సర్వేల ప్రకారం ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి యావరేజ్‌గా 5–12 సబ్‌స్క్రిప్షన్లు ఉంటున్నాయి. యాప్‌ని బట్టి ప్రతి నెలా సబ్‌స్క్రిప్షన్‌ ఖర్చు అత్యంత తక్కువగా తొంభై తొమ్మిది రూపాయలేగా అనే ధోరణితో లైట్‌గా తీసుకుంటున్నప్పటికీ, మొత్తం సబ్‌స్క్రిప్షన్లన్నీ కలిపితే ఈ ఖర్చు ఏడాదికి 30–40 వేలు దాటిపోతోంది. ఇక పిల్లలు కూడా సబ్ర్‌స్కయిబ్‌ చేస్తున్న కుటుంబాల్లో ఈ ఖర్చు లక్షకు దగ్గర్లోనే ఉంటోంది. అందుకోసమే వీటిని నియంత్రించుకోవటంపై దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతోంది. ఒకటీ రెండూ కాదు... ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌లతో మొదలుపెడితే హాట్‌స్టార్, జీ5, సన్‌ టీవీ, ఎయిర్‌టెల్‌ ప్లే, ఆహా, ఎంఎక్స్‌ ప్లేయర్‌ సహా పదులకొద్దీ ఉన్నాయి. వీటిలో 99 శాతానికి సబ్‌్రస్కిప్షన్‌ తప్పనిసరి. కొన్నింటికి సబ్‌్రస్కిప్షన్‌ తీసుకున్నా కూడా... యాడ్‌లు లేకుండా చూడాలంటే మరింత ఎక్కువ పెట్టి సూపర్‌ సబ్‌్రస్కిప్షన్‌ తీసుకోవాలి. ఇక మ్యూజిక్‌ కోసం స్పాటిఫై, గానా వంటివి... క్లౌడ్‌ స్టోరేజీ కోసం గూగుల్‌ వన్, ఐక్లౌడ్‌ వంటివి... సోషల్‌ మీడియా, ఏఐ కోసం ట్విటర్, చాట్‌ జీపీటీ, గ్రోక్‌ వంటివి... ఇవన్నీ కాకుండా రకరకాల లెరి్నంగ్‌ యాప్‌లు, ఫిట్నెస్‌ యాప్‌లు, యాంటీ–వైరస్‌లు, ఈ–కామర్స్‌ మెంబర్‌íÙప్‌లు చాలా ఉన్నాయి. వీటిలో చాలావరకూ సబ్‌స్క్రిప్షన్లు రూ. 99, రూ. 149, రూ. 299..రూ.499 ఇలా ఉంటున్నాయి. విడివిడిగా యాప్‌లకు సబ్‌్రస్కయిబ్‌ చేస్తాం కనక అదేం పెద్ద మొత్తం కాదనిపిస్తుంది. కానీ ఇదో ఉచ్చులాంటిదని గ్రహించం. చాలా మటుకు సబ్‌్రస్కిప్షన్లను కావల్సినప్పుడు క్యాన్సిల్‌ కూడా చేసుకోవచ్చు కదా అని ముందుగా తీసుకుంటాం. ప్రతి నెలా గుర్తుంచుకుని మరీ కట్టే బాదరబందీ ఎందుకు, ఆటోమేటిక్‌గా రెన్యూ చేసుకునే ఆప్షన్‌ని ఎంచుకోండి అని యాప్‌ సూచించగానే ఓకే కొట్టేస్తాం. ఆటో రెన్యువల్‌ మోడల్‌ పెట్టేస్తాం. కానీ ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోతాం. నెల తిరగ్గానే కొద్ది కొద్ది మొత్తం కట్‌ అయిపోతుంటుంది. ముందుగా మెసేజ్‌లు వస్తాయి గానీ... వంద, రెండొందలే కదా అని పెద్దగా పట్టించుకోం. కానీ అన్ని యాప్‌లూ కలిస్తే ఎంతవుతోంది? నెలకు మొత్తంగా ఎంత కడుతున్నాం? ఏడాదికి ఎంతవుతోంది? అనేది ఆలోచించం. అలా... వేల రూపాయల్ని చెల్లిస్తూనే ఉంటాం. సైకాలజీ ఏమంటుందంటే.. దీని వెనుక సైకాలజీ పాయింట్లు కూడా ఉన్నాయి. ఈఎంఐలను, సబ్‌స్క్రిప్షన్లను మెదడు వేర్వేరు రకాలుగా ప్రాసెస్‌ చేసుకుంటుంది. ప్రతి నెలా ఈఎంఐ కింద కట్టాలంటే అదొక పెద్ద మొత్తంగా కనిపించి, భారంగా అనిపిస్తుంది. కానీ సబ్‌స్క్రిప్షన్‌ అంటే మరీ పెద్ద మొత్తం కాదు కదా.. ఫర్లేదులే అనే అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష టీవీకి ప్రతి నెలా ఈఎంఐ కట్టాలంటే, అబ్బో అంత కట్టాలా .. అని కాస్త భయం వేస్తుంది. కానీ ప్రతి నెలా ఓ సబ్‌్రస్కిప్షన్‌కి రూ. 199 కట్టాలంటే ఫర్లేదులే అనిపిస్తుంది. కానీ అలాంటివి రూ. 199 చొప్పున ఓ పన్నెండు సబ్ర్‌స్కిప్షన్లు ఉన్నాయంటే! నెలకు దాదాపు రూ. 2,400 అవుతుంది. అదే ఏడాదికి చూస్తే సుమారు రూ. 30,000 అవుతుంది. అయినప్పటికీ ఇంత భారీ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఒక్కో సబ్ర్‌స్కిప్షన్‌కి కట్టే మొత్తం తక్కువగా ఉండటం వల్ల, పెద్ద భారం కాదులే అని మెదడు లైట్‌గా తీసుకుంటుందట!. దీన్నుంచి ఎలా బయటపడాలంటే ఎంత పెద్ద పడవైనా, చిన్న రంధ్రం పడితే చాలు. నీరు మెల్లగా చేరి అంత పెద్ద పడవ కూడా మునిగిపోయే ముప్పుంటుంది. అలాగే చిన్న చిన్న మొత్తాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే బడ్జెట్‌ అదుపు తప్పేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని నివారించేందుకు ఏం చేయాలంటే... → వన్‌–్రస్కీన్‌ విధానం: కుటుంబం ఉపయోగిస్తున్న ప్రతి సబ్‌్రస్కిప్షన్‌ వివరాలనూ పేపరు మీద రాయండి. ఒక్కొక్క దాని అవసరాన్ని బట్టి ‘తప్పనిసరి’, ‘ఉపయోగకరం’, ‘వ్యర్ధం’ అనే రేటింగ్‌ ఇచ్చుకోండి. → మూడు నెలల పాటు... అంటే 90 రోజులుగా ఉపయోగించుకుండా నిరుపయోగంగా ఉన్న సర్వీసులను తక్షణం క్యాన్సిల్‌ చేయండి. → అవసరం అనుకుంటే వార్షిక ప్లాన్లకు మారండి. నెలవారీ ప్లాన్లతో పోలిస్తే యాన్యువల్‌ ప్లాన్లు సుమారు 15–40 శాతం వరకు చౌకగా ఉంటాయి. → ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్లను షేర్‌ చేసుకోండి. నెట్‌ఫ్లిక్స్‌ / స్పాటిఫై / గూగుల్‌ వన్‌ ఫ్యామిలీ ప్లాన్లతో 50–80 శాతం వరకు ఆదా అవుతుంది. → కొందరు టెలికామ్‌ ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ సరీ్వస్‌ ప్రొవైడర్లు తమ సర్వీసులతో పాటు ఓటీటీలు కాంబోగా అందిస్తున్నారు. ఇలాంటివి చాలా తక్కువ ధరే ఉంటాయి. సరీ్వసు గనక మంచిదైతే... కాంబోలో ఇస్తున్న ఓటీటీలతో మనకు ఆదా అవుతుందనుకుంటే తీసుకోవచ్చు. చివరిగా చెప్పేదేమిటంటే.. సబ్ర్‌స్కిప్షన్లనేవి పూర్తిగా చెడ్డవేమీ కావు. కాకపోతే వాటి సరీ్వసులు, నాణ్యతకన్నా మన అవసరం ముఖ్యం. పెద్దగా అవసరం లేనపుడు ఎంత మంచి యాప్‌ను సబ్‌స్క్రయిబ్‌ చేస్తే మాత్రం ఏంటి లాభం? అందుకే వాడుకోలేకపోతే ఈ యాప్‌ల వల్ల ఏటా రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు చల్లగా వృధా అయిపోయే ప్రమాదముంది. మధ్య తరగతి వారికి ఈ మొత్తం ఒక నెల, లేదా ఏడాది సిప్‌కి (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌), ఓ రెండు, మూడు గ్రాముల బంగారానికి, ఓ దేశీ విహారయాత్ర ఖర్చులకు సరిసమానం. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకుంటే శ్రేయస్కరం.

Investors may still get the Santa Claus rally2
శాంట క్లాజ్‌ ర్యాలీకి చాన్స్‌!

సుమారు 3 వారాలుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు మద్దతు స్థాయిలనుంచి రికవర్‌ అవుతూ వస్తున్నాయి. తొలుత అమ్మకాలు.. తదుపరి కొనుగోళ్లతో నిఫ్టీ 26,000, సెన్సెక్స్‌ 85,000 పాయింట్లకు అటూఇటుగా కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు మరోసారి సైడ్‌వేస్‌లో కదలనున్నాయా లేక శాంటా ర్యాలీకి దారి ఏర్పడుతుందా చూడవలసి ఉంది! క్రిస్మస్‌ పండుగ సందర్భంగా గురువారం(25న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మరోపక్క యూఎస్‌ సహా.. పలు యూరోపియన్‌ మార్కెట్లకు కొత్త ఏడాది సెలవులు సైతం జత కలవనుండటంతో దేశీయంగానూ ట్రేడింగ్‌ పరిమాణం నీరసించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఆటు పోట్ల మధ్య మార్కెట్లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో కదులుతున్నాయి. దీంతో ఈ వారం కూడా హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నచందాన ట్రేడ్‌కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరోపక్క ఇదే సమయంలో ఈ వారం శాంట క్లాజ్‌ ర్యాలీకి బీజం పడవచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో? పరిశీలించదగ్గ అంశాలు → దేశీయంగా నేడు(22న) నవంబర్‌ నెలకు మౌలిక రంగ పురోగతి వివరాలు వెల్లడికానున్నాయి. 2025 అక్టోబర్‌లో దాదాపు యథాతథంగా 3.3 శాతం వృద్ధి నమోదైంది. 14 నెలల తదుపరి ఎలాంటి పురోగతి నమోదుకాకపోవడం గమనార్హం! యూఎస్‌ టారిఫ్‌లు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. → డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టం 91 స్థాయి నుంచి భారీ రికవరీ సాధించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మారకపు విలువ వారాంతాన 89.67 వద్ద స్థిరపడింది. → దేశీ మార్కెట్లలో పటిష్ట లిక్విడిటీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు పలు ఐపీవోలతో ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతుంటే.. మరోపక్క సెకండరీ మార్కెట్లలో రిటైలర్లతోకలసి దేశీ ఫండ్స్‌ పెట్టుబడులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కొద్ది నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నప్పటికీ మార్కెట్లు నిలదొక్కుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. విదేశీ ఎఫెక్ట్‌ → ఈ వారం(23న) యూఎస్‌ మూడో త్రైమాసిక(జూలై–సెపె్టంబర్‌) జీడీపీ వృద్ధిపై ద్వితీయ అంచనాలు వెలువడనున్నాయి. క్యూ2(ఏప్రిల్‌–జూన్‌)లో యూఎస్‌ జీడీపీ వార్షికంగా 3.8%పుంజుకుంది. 3.3% అంచనాలను అధిగమించింది. → ఇదే రోజు యూఎస్‌ ప్రయివేట్‌ రంగ ఉద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. 24న నిరుద్యోగ గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. → ద్రవ్యోల్బణం, ఉపాధి గణాంకాల ప్రభావంతో యూఎస్‌ ఫెడ్‌ మరోసారి వడ్డీ రేట్ల కోత అమలు కు మొగ్గు చూపవచ్చని అంచనాలు పెరిగాయి.సాంకేతిక అంచనాలు ఇలా గత వారం అంతక్రితం వారంలాగే మార్కెట్లు రెండో సపోర్ట్‌ లెవల్స్‌వద్ద నుంచి రికవరీ సాధించాయి. సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ వారం శాంట ర్యాలీకి తెరతీయవచ్చని అంచనా. నిఫ్టీ 26,060కు ఎగువన నిలదొక్కుకుంటే 26,450 వరకూ బలపడవచ్చు. 25,700 స్థాయిలో పటిష్ట మద్దతు లభిస్తోంది. బలహీనపడి 25,600కు చేరితే మరింత నీరసించవచ్చు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Closing loans early results in a loss, sakshi special story3
అప్పుడే తీర్చేయొద్దు!

ఇపుడు ఫోన్‌ తెరిచి మెసేజ్‌లు, వాట్సాప్‌లు చూసినా... మెయిల్‌ తెరిచినా రుణాలిస్తామంటూ రోజూ ఆఫర్ల కొద్దీ ఆఫర్లు. దీంతో పాటు ఫోన్లు. ఫోన్‌ చేసి మరీ... లోన్‌ కావాలా? అని అడిగే ఏజెన్సీలు కోకొల్లలు. ఇలాంటివేమీ లే కున్నా.. జస్ట్‌ యాప్‌ తెరిచి క్లిక్‌ కొడితే మన ఖాతాలోకి డబ్బులిచ్చేసే రుణ యాప్‌లు కూ డా ఉన్నాయి. అదీ ఫిన్‌టెక్‌ మహిమ. నిజానికి ఈ యాప్‌లన్నీ అప్పులిచ్చేది వాటి సొంత డబ్బేమీ కాదు. అవన్నీ ఏదో ఒక ఫైనాన్స్‌ కంపెనీతోనో, బ్యాంకుతోనో జతకట్టి ఉంటాయి. వాటికన్నా కాస్త ఎక్కువ వడ్డీ వేసుకుని... అత్యంత ఈజీగా మీ ఖాతాలోకి వేసేస్తూ ఉంటాయి. తీర్చటం కాస్త ఆలస్యమయినా, తీర్చకపోయినా వీటి వ్యవహారశైలి కూడా చాలా దుర్మార్గంగా ఉంటుంది. అందుకే రుణం తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తీసుకున్నాం? ఎంత వడ్డీకి తీసుకున్నాం? ప్రాసెసింగ్‌ ఛార్జీలెంత? ప్రీపేమెంట్‌ పెనాల్టీ ఎంత? ఇవన్నీ తప్పనిసరిగా చూడాలి. సరే! ఇవన్నీ చూశాకే రుణం తీసుకున్నారనుకుందాం. ఇల్లు, కారు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాల కొనుగోళ్లు, టూర్లు... ఇలా దేనికైనా రుణం తీసుకుని ఉండొచ్చు. కాకపోతే చాలామంది ఈజీగా వస్తున్నాయి కదా అని ప్రతిదానికీ రుణం తీసేసుకోవటం... ఆ తరువాత దాన్ని భారంగా భావించి త్వరగా వదిలించుకునే మార్గాల కోసం వెతకడం చేస్తుంటారు. దేశంలో ముందస్తు రుణ చెల్లింపులు పెరుగుతుండడం దీన్నే సూచి స్తోంది. 1వ తారీఖు వస్తుందంటే మనసులో ఆందోళన పెరగడం... ‘ఈఎంఐ’ కట్టడంలో ఉన్న నొప్పి... వారితో అలా చేయిస్తుంటా యి. కానీ, అన్ని రుణాలనూ ఇలా ముందు గా తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పనేమీ కా దు. రుణాల్లో మనల్ని పిండేసే వాటితో పాటు కొన్ని మనకు లాభాన్నిచ్చేవి కూడా కొన్ని ఉంటాయి. ఆర్థికంగా గుల్ల చేసే రుణాలను వదిలించుకోవడం, చౌక రుణాలతో నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం ఎలాగో చూద్దాం...రుణాన్ని ముందుగా తీర్చేయడం ఎందుకు? → రుణ భారం నుంచి బయటపడాలన్న ప్రయత్నం వెనుక ఎన్నో కారణాలుంటాయి. → అత్యవసరమో లేక నచి్చన వస్తువును సొంతం చేసుకోవాలన్న బలహీనత వల్లో రుణం తీసుకుని ఉండొచ్చు. నెలవారీ రుణ చెల్లింపులు మొదలయ్యాక భారంగా అనిపించొచ్చు. ఆదాయం నుంచి ఈఎంఐలకు సర్దుబాటు చేయలేక, రుణాన్ని ముగించాలని భావించొచ్చు. → పెట్టుబడులు గడువు తీరి చేతికి రావొచ్చు. లేదా పనిచేస్తున్న కంపెనీ నుంచి బోనస్‌ బ్యాంక్‌లో జమ కావొచ్చు. వీటితో రుణం భారం తగ్గించుకుందామని అనిపించొచ్చు. → నెలవారీ ఆదాయంలో చాలా వరకు రుణ చెల్లింపులకే ఖర్చు చేసేస్తుంటే.. ఇక ఇతర ఖర్చులకు చాలని పరిస్థితులతో ఇంట్లో ఒత్తిళ్లు తట్టుకోలేక.. రుణాన్ని క్లోజ్‌ చేసే ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు. రుణంతో కలసి సాగడమే.. కొన్ని రుణాలను ముందుగా చెల్లించడం కంటే, వాటిని కొనసాగించుకోవడం ద్వారా రుణ గ్రహీత అదనపు ప్రయోజనం పొందొచ్చు. అది ఎప్పుడంటే.. → రుణంపై వడ్డీ రేటు 9–10 శాతం మించకుండా ఉండాలి. సాధారణంగా గృహ రుణం, వాహన రుణం, విద్యా రుణాలు ఇంత తక్కువ రేటుకు వస్తుంటాయి. ప్రాపర్టీ తనఖాపైనా ఇంతే తక్కువ రేటుకు రుణాలు లభిస్తున్నాయి. → రుణాన్ని తీర్చే బదులు, ఆ మొత్తాన్ని పెట్టుబడి పెడితే.. రుణ రేటు కంటే అధిక రాబడి వచ్చేట్టు ఉండాలి. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌పై రాబడులు 10–15 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాలంలో 12–20 శాతం మధ్య ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → అత్యవసరాల కోసం ఉద్దేశించిన నిధిని తీసుకెళ్లి రుణానికి కట్టేయడం వివేకం అనిపించుకోదు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతేనో లేదా వైద్య అత్యవసరం ఏర్పడితేనో నిధుల కోసం మళ్లీ అప్పు చేయాల్సి వస్తుంది. కనుక అత్యవసర నిధిని రుణాల కోసం ఉపయోగించొద్దు. → నెలవారీ రుణ చెల్లింపులు ఆదాయంలో 30% లోపే ఉన్నప్పుడు దాన్ని ముందుగా తీర్చడం కంటే.. మిగులు ఆదాయాన్ని పెట్టుబడులకు మళ్లించుకునే మార్గాలను చూడొచ్చు. → పన్ను ఆదా ప్రయోజనాలున్న రుణాలను వదిలించుకోవడం కంటే కొనసాగించడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఉదాహరణకు గృహ రుణం. పాత పన్ను విధానంలో సెక్షన్‌ 80సీ కింద ఇంటి రుణం కోసం చేసే చెల్లింపుల్లో అసలు రూ.1.50 లక్షల వరకు, సెక్షన్‌ 24 కింద వడ్డీ రూ.2 లక్షలపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంటి రుణంపై 8.3% వడ్డీ రేటు చెల్లిస్తున్నప్పటికీ.. నికరంగా పడే భారం 6.5–7% మించదు. పైగా ముందస్తు చెల్లింపుల ను ఈక్విటీ, బంగారంలోకి పెట్టుబడిగా మళ్లించి మెరుగైన రాబడులూ సొంతం చేసుకోవచ్చు.ఇలాంటపుడు తీర్చేయటమే బెటర్‌...→ నెలవారీ సంపాదనలో ఈఎంఐలు 45 శాతం మించినట్టయితే, ఆయా రుణాలను త్వరగా చెల్లించే మార్గాలను చూడొచ్చు. → పదవీ విరమణకు చేరువవుతుంటే (మరికొన్నేళ్లే ఉంటే)... అప్పుడు వీలైనంత త్వరగా ఆ రుణాల నుంచి బయటకు రావాలి. → రుణాల్లో అధిక వడ్డీ రేటుతో ఉన్న వాటిని త్వరగా వదిలించుకోవాలి. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డులపై 36– 44 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఆ తర్వాత వ్యక్తిగత రుణాలపైనా 15 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ఇలాంటి వాటిని ముందుగా చెల్లించడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదు. → కొన్ని వాహన రుణాలపై వడ్డీ రేటు 12 శాతం వరకు ఉంటుంది. ఇలాంటివీ ముందుగా తీర్చేయొచ్చు. → గృహ, విద్యా రుణం తప్ప మిగిలిన రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. కనుక అధిక రేటుతో ఉంటే త్వరగా బయటకు వచ్చేయడం లాభమే. → కొందరు ఈక్విటీ పెట్టుబడులపై మెరుగైన రాబడి వచి్చనప్పటికీ.. పెట్టుబడి కంటే రుణాన్ని ముగించేందుకే మొగ్గు చూపుతుంటారు. అధిక రాబడి కోసం పెట్టుబడులపై రిస్క్‌ తీసుకోవడం వారికి నచ్చదు. పైగా రుణాన్ని ఎక్కువ కాలం పాటు కొనసాగించేందుకు ఇష్టంలేని వారికి సైతం రుణభారం దింపుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. → ఏది ఏమైనా మెరుగైన రాబడులు ఇస్తున్ను పెట్టుబడులను ముందస్తు రుణ ముగింపునకు వినియోగించడం వివేకం అనిపించుకోదు.ఆదా మామూలుగా లేదుగా..! → రూ.20 లక్షల గృహ రుణాన్ని 15 ఏళ్ల టర్మ్‌తో తీసుకున్నారు. వడ్డీ రేటు 8.3%. → ఇందులో రూ.5 లక్షలను ముందుగా చెల్లించినట్టయితే 15 ఏళ్ల కాలంలో మొత్తం మీద రూ.3.2 లక్షలు వడ్డీ రూపంలో ఆదా అవుతుంది. → రూ.5 లక్షలను ముందస్తు రుణం చెల్లింపులకు వినియోగించకుండా, 12 శాతం రాబడినిచ్చే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఏమవుతుంది? → 15 ఏళ్ల కాలంలో రూ.27.36 లక్షలు సమకూరుతుంది. → ముందస్తు రుణ చెల్లింపులకు బదులు.. ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రూ.24 లక్షలు సమకూర్చుకోవచ్చని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. → పెట్టుబడులపై రాబడి, రుణం రేటు కంటే అధికంగా ఉంటే అలాంటప్పుడు ముందస్తు చెల్లింపులతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. వీటిని గమనించాలి.. అధిక రేటుతో తీసుకున్న రుణాలను ముందుగా తీర్చేయడం లాభమే. కానీ, గడువు కంటే ముందుగానే వాటిని ముగించేందుకు బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు ఉచితంగా అనుమతించకపోవచ్చు. ఫోర్‌క్లోజర్‌ చార్జీలంటూ చాలా సంస్థలు రుణ గ్రహీతల నుంచి వసూలు చేస్తున్నాయి. రుణాన్ని గడువులోపు తీర్చేస్తుంటే.. అప్పటికి మిగిలిన బకాయిపై 2–5 శాతం వరకు ఈ రూపంలో చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తదితర కొన్ని బ్యాంక్‌లు అయితే వ్యక్తిగత రుణాలను ముందుగా తీర్చేస్తుంటే ఎలాంటి చార్జీలు విధించడం లేదు. కనుక ఇలాంటి చార్జీల్లేని చోటే రుణాలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల తర్వాతి కాలంలో వీలైనంత ముందుగానే గుడ్‌బై చెప్పేయొచ్చు.

Growing Demand for FASTag Annual Pass Know The Reasons4
అందుకే.. ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్!

2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.వాహనదారులు ఫాస్టాగ్‌లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్‌ రీచార్జ్‌ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్‌ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్‌ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్‌కే ఆ మొత్తాన్ని రీచార్జ్‌ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా..యాన్యువల్ పాస్‌ ద్వారా ఒకేసారి రూ. 3,000 చెల్లించి సంవత్సరానికి 200 టోల్‌ క్రాసింగ్‌లు లేదా ఒక సంవత్సరం (ఎదైనా ముందే వచ్చే వరకు) ప్రయాణం అనుమతిస్తుంది. కాబట్టి ఒకసారి చెల్లించి ఏడాది ప్రయోజనం పొందవచ్చు.సాధారణంగా ప్రతి టోల్‌కి రూ. 80 నుంచి రూ. 100 వరకు ఖర్చవుతుంది. కానీ యాన్యువల్ పాస్‌తో ఇది చాలా తగ్గుతుంది.యాన్యువల్ పాస్‌కు తీసుకోవడంతో.. రీఛార్జ్ ఎప్పుడు అయిపోతుందో అనే గాబరా అవసరం లేదు. కాబట్టి టోల్ లైన్‌లలో గడువు తీరేవరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. తద్వారా సమయం తగ్గుతుంది.యూజర్-ఫ్రెండ్లీ కొనుగోలు & యాక్టివేషన్ ప్రక్రియ చాలా సులభం.

SEBI Overhauls Mutual Fund Regulations Know The Details Here5
ఇన్వెస్టర్లకు శుభవార్త.. సెబీ కొత్త రూల్స్ వచ్చేశాయ్

భారతదేశంలో చాలామంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో అందరికీ లాభాలు వస్తాయని గానీ.. అందరూ నష్టపోతారని గానీ కచ్చితంగా చెప్పలేము. కాబట్టి కొన్నిసార్లు లాభాలు, మరికొన్ని సార్లు నష్టాలు ఉంటాయి.లాభ, నష్టాలు ఉన్నప్పటికీ.. ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేసేవారి సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో.. సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొన్ని కీలక ప్రకటనలు చేసింది. దేశీయ మ్యూచువల్ ఫండ్‌లు బ్రోకరేజ్‌లకు చెల్లించే రుసుము మాత్రమే కాకుండా.. మ్యూచువల్ ఫండ్ నిబంధనలలో ప్రాథమిక నిర్వహణ ఛార్జీని కూడా తగ్గించింది.SEBI బోర్డు సమావేశం తర్వాత, విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. నగదు లావాదేవీలపై స్టాక్ బ్రోకర్లకు చెల్లింపును 8.59 బేసిస్ పాయింట్ల నుంచి 6 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ గతంలో ఆస్తి నిర్వాహకులు చెల్లించే రుసుముపై 2 బేసిస్ పాయింట్ల రుసుమును ప్రతిపాదించింది.కొత్త రూల్స్➤కంపెనీ నిర్ణయాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న పెద్ద వాటాదారులను మినహాయించి, పబ్లిక్ ఇష్యూలలో ఉన్న వాటాదారులకు లాక్ ఇన్ అవసరాలను రెగ్యులేటర్ చేసింది.➤కొత్త నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ పబ్లిక్‌గా విడుదల కావడానికి ముందు, షేర్లకు లాక్-ఇన్ అవసరాలు స్వయంచాలకంగా అమలు చేయబడతాయి. ఇది లిస్టింగ్ ప్రక్రియలో ఆలస్యాలను పరిష్కరిస్తుందని సెబీ తెలిపింది.➤ఐపీఓకు ముందు షేర్ల లాక్-ఇన్ నిబంధనల సవరణకు సెబీ ఆమోదం తెలపడంతో, అనేక కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన కార్యాచరణ సవాలు ఇప్పుడు పరిష్కారమైందని.. కార్పొరేట్ కంప్లైయన్స్ సంస్థ MMJC అసోసియేట్స్ వ్యవస్థాపక భాగస్వామి మకరంద్ జోషి అన్నారు.➤పెట్టుబడిదారుల ప్రక్రియను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి, జారీ చేసే కంపెనీలు పబ్లిక్ ఆఫర్ పేపర్లలో భాగంగా కీలక సారాంశాన్ని అప్‌లోడ్ చేయాలని కూడా సెబీ స్పష్టం చేసింది.➤మహిళలు, రిటైల్ & సీనియర్ పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహకాలను అందించడానికి.. రుణ ఇష్యూలలో రిటైల్ భాగస్వామ్యాన్ని పెంచడానికి సెబీ చర్యలను ఆమోదించింది.➤రిస్క్ మేనేజ్‌మెంట్ చర్యలకు లోబడి, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అన్‌లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలను రేట్ చేయడానికి అనుమతించబడతాయని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే రెగ్యులేటర్ బోర్డు సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో తెలిపారు. టేకోవర్ కోడ్ నిబంధనలను సవరించడానికి నియంత్రణ సంస్థ కూడా కృషి చేస్తోందని ఆయన అన్నారు.ఖర్చులను తగ్గించి.. మ్యూచువల్స్ ఫండ్స్‌లో పారదర్శకతను పెంచడానికి సెబీ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే ఈ ఏడాది (2025) చాలామంది ఇన్వెస్టర్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. దీంతో ఊహకందని నష్టాలను కూడా చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఇన్వెస్టర్లు నిపుణుల సలహా లేదా బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం.

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Lesson No 106
'ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు'.. కియోసాకి పదో పాఠం

తొమ్మిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 10 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ఎలా ధనవంతులు కావాలి? అనే విషయం గురించి ప్రస్తావించారు.మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు.పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ.. దాన్ని ఎలా సాదించగలను అనే విషయం గురించి ఆలోచించాలి. ఇది మన మెదడును ఆలోచింపజేస్తుంది, పరిష్కారాలు వెతకమంటుంది, కొత్త మార్గాలు, అవకాశాలు చూపిస్తుంది. ఇలా పెద్ద పెద్ద ఆర్థిక సమస్యలను పరిష్కరించడం నేర్చుకుని మరింత ధనవంతులవుతారని వెల్లడించారు.ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. ఆస్తులు తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో.. రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, బంగారం, వెండి అన్నీ అమ్మకానికి వచ్చాయి. ఆ సమయంలో భయపడిన వాళ్లు అమ్మేశారు. సాహసం చేసిన వాళ్లు కొనేశారు. కొన్నవాళ్లే తర్వాత ధనవంతులయ్యారు. ఇప్పుడు ధనవంతులు కావడానికి ఇది మంచి అవకాశం, కానీ మీ మాటలను నియంత్రించగలిగితేనే.. అని కియోసాకి స్పష్టం చేశారు.LESSON #10 How to get richer as the economy crashes:CONTROL YOUR WORDS: In Sunday School I learned: “The word became flesh and dwelt amongst us.”In other words “You become your words.”My rich dad forbid his son and from saying “I can’t afford it.”Rich dad said: “Poor…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 21, 2025

Advertisement
Advertisement
Advertisement