ప్రధాన వార్తలు
శివ్ నాడార్.. జాబితాలో అంబానీ కంటే ముందు: రూ.2708 కోట్లు..
భారతదేశంలోని బిలియనీర్లు డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. దానం చేయడంలో కూడా ముందున్నారు. హురున్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. 2025లో దేశంలోని ధనవంతులు రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ విరాళాలు గత ఏడాదికంటే 85 శాతం ఎక్కువ కావడం గమనార్హం.హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ & కుటుంబం.. ఏడాదిలో రూ. 2,708 కోట్ల విరాళాలు ఇచ్చి, నాల్గవసారి భారతదేశ అత్యంత ఉదారవాది అనే బిరుదును నిలుపుకున్నారు. నాడార్ రోజుకు రూ. 7.4 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్య, కళలు, సంస్కృతి వంటిని ప్రోత్సహించే శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా డబ్బును ఖర్చు చేశారు.జాబితాలోని ఈ ఏడాది.. టాప్ 10 దాతలు సమిష్టిగా రూ. 5,834 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది గత సంవత్సరం కంటే 26 శాతం ఎక్కువ, అంటే మొత్తం విరాళాలలో 56 శాతం అన్నమాట. జాబితాలో రెండో స్థానంలో ముకేశ్ అంబానీ & ఫ్యామిలీ ఉంది.కుటుంబం & విరాళాలు➤శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2708 కోట్లు➤ముకేశ్ అంబానీ & ఫ్యామిలీ: రూ. 626 కోట్లు➤బజాజ్ ఫ్యామిలీ: రూ. 446 కోట్లు➤కుమార్ మంగళం బిర్లా & కుటుంబం: రూ. 440 కోట్లు➤గౌతమ్ అదానీ & ఫ్యామిలీ: రూ. 386 కోట్లు➤నందన్ నీలేకని: రూ. 365 కోట్లు➤హిందుజా ఫ్యామిలీ: రూ. 298 కోట్లు➤రోహిణి నీలేకని: రూ. 204 కోట్లు➤సుధీర్ & సమీర్ మెహతా: రూ. 189 కోట్లు➤సైరస్ & ఆడారు పూనావాలా: రూ. 173 కోట్లుThe Top 10 philanthropists in the EdelGive Hurun India Philanthropy List 2025 donated INR 5,834 Cr — up 26% YoY, forming 56% of India’s total giving.Shiv Nadar & family lead with INR 2,708 Cr, followed by Mukesh Ambani & family, Bajaj family, Kumar Mangalam Birla & family. pic.twitter.com/kS2ZVxlCW4— HURUN INDIA (@HurunReportInd) November 6, 2025
టీసీఎస్ షాకింగ్ శాలరీ.. నెలకు రూ.422 పెరిగితే..
ఒక టీసీఎస్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాలుగేళ్లకు పైగా పనిచేసిన తనకు ఈ సంవత్సరం నెలకు కేవలం రూ.422 ఇంక్రిమెంట్ మాత్రమే వచ్చిందని అతను పేర్కొన్నారు. “టీసీఎస్ నాకు 4 సంవత్సరాల తర్వాత రూ.422 పెంపు ఇచ్చింది..” అంటూ రెడ్డిట్లో పోస్ట్ చేశారు.2021లో కంపెనీలో చేరినట్లు పేర్కొన్న రెడిటర్ .. “ఇది నా చెడు నిర్ణయాల ఫలితం” అని పేర్కొంటూ, తాను సపోర్ట్ ప్రాజెక్ట్లో పనిచేశానని, అక్కడ “జీరో లెర్నింగ్, జీరో గ్రోత్, అంతులేని అరుపులు, మైక్రోమేనేజ్మెంట్” ఉండేదని రాసుకొచ్చారు. తన పెంపు ఆరు నెలల ఆలస్యంగా వచ్చిందని, ఈ పరిస్థితుల్లో టీసీఎస్ వంటి సంస్థలు “పల్లీలు కొనుక్కునే చెల్లింపులు” ఇస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన “మీ విలువ తెలుసుకోండి” అని టీసీఎస్ ఉద్యోగులు, ఫ్రెషర్లకు సూచించారు.వైరల్గా మారిన ఈ పోస్ట్పై నెటిజన్లు విస్తృతంగా స్పందించారు. ‘ఇంక్రిమెంట్ దారుణంగా ఇవ్వడంతో నేను 7 సంవత్సరాల తర్వాత టీసీఎస్ వీడాను’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ సంవత్సరం తనకు జీరో హైక్ వచ్చిందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “ఐటీని విడిచిపెట్టడం ఉత్తమ మార్” అంటూ మరొకరు కామెంట్ చేశారు.ఇక టీసీఎస్ కూడా ఈ ఘటనపై స్పందించింది. “వ్యక్తిగత కేసులపై మేం వ్యాఖ్యానించం. కానీ ఆ పోస్ట్లో పేర్కొన్నవి అవాస్తవాలు” అని టీసీఎస్ ప్రతినిధి పేర్కొన్నారు. “సెప్టెంబర్ 1 నుంచి మా ఉద్యోగుల 80% మందికి వేతన సవరణలు అమలయ్యాయి. సగటు ఇంక్రిమెంట్ 4.5% నుంచి 7% మధ్య ఉంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల పెంపు ఇచ్చాం” అని తెలిపారు
విశ్వవిజేతలకు టాటా మోటార్స్ అదిరిపోయే గిఫ్ట్!
ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన ఇండియా ఉమెన్స్ టీమ్.. ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. ఈ తరుణంలో టాటా మోటార్స్ వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జట్టులోని సభ్యులకు ఒక్కొక్కరికి.. ఒక్కో సియెర్రా కారును గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.టాటా మోటార్స్.. తన సియెర్రా కారును నవంబర్ 25న దేశీయ విఫణిలో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఇది 5 డోర్స్ మోడల్. కాబట్టి కుటుంబ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పనోరమిక్ సన్రూఫ్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్లైట్స్, సొగసైన డోర్ హ్యాండిల్స్ పొందుతుంది.టాటా సియెర్రా.. మూడు స్క్రీన్ లేఅవుట్తో కూడిన డ్యాష్బోర్డ్ పొందుతుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఇన్ఫోటైన్మెంట్ కోసం సెంట్రల్ టచ్స్క్రీన్, ముందు ప్రయాణీకుడి కోసం అదనపు స్క్రీన్ వంటివి ఉన్నాయి. సరికొత్త స్టీరింగ్ వీల్ కూడా పొందుతుంది. ఈ కారు పసుపు, ఎరుపు రంగుల్లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: హీరో ఎలక్ట్రిక్ కారు: నానో కంటే చిన్నగా!టాటా సియెర్రా యొక్క పవర్ట్రెయిన్ గురించి.. కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభించనుంది. అయితే ప్రస్తుతం హారియర్ & సఫారీ మోడళ్లలోని 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలే.. సియెర్రాలో కూడా ఉంటాయని సమాచారం. ట్రాన్స్మిషన్ ఎంపికలలో మాన్యువల్ & ఆటోమేటిక్ ఉండనున్నాయి.
హీరో ఎలక్ట్రిక్ కారు: నానో కంటే చిన్నగా!
ఇప్పటి వరకు టూ వీలర్స్ లాంచ్ చేసిన హీరోమోటోకార్ప్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఫోర్ వీలర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. NEX 3ను EICMA 2025 వేదికపై ఆవిష్కరించింది. ఇది చూడటానికి.. పరిమాణం పరంగా నానో కారు మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఇది ఎలక్ట్రిక్ కారు కావడంతో.. కొంత భిన్నంగా, చిన్నదిగా ఉంటుంది.హీరో మోటోకార్ప్ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ కేవలం.. ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే అనుమతిస్తుంది. అంటే డ్రైవర్, పిలియన్ మాదిరిగా అన్నమాట. నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రయాణానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: 42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!హీరో మోటోకార్ప్.. EICMA 2025 వేదికపై NEX 3తో పాటు.. VIDA విభాగం రెండు కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఆవిష్కరించారు. అంత కాకుండా.. హీరో బ్రాండ్ యూరోపియన్ మార్కెట్లోకి అధికారిక ప్రవేశాన్ని సూచించే అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన VIDA VX2 ను కూడా విడుదల చేశారు. అదనంగా.. కంపెనీ VIDA DIRT.E సిరీస్ను ఆవిష్కరించింది. వీటిలో 4 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం DIRT.E K3 & అధిక పనితీరు గల DIRT.E MX7 రేసింగ్ కాన్సెప్ట్ ఉన్నాయి.
‘బాండ్’ బంగారం.. మూడు రెట్లు లాభం!
బంగారంపై పెట్టుబడులంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ లోహం రూపంలో పసిడిని కొనడం కొందరికి ఇష్టం ఉండదు. అలాంటివారి కోసం పెట్టుబడి అవకాశంగా ప్రభుత్వం తీసుకొచ్చినదే సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకం (SGB). అలా సావరిన్ గోల్డ్ బాండ్స్ 2017–18 సిరీస్ VIలో పెట్టుబడిపెట్టినవారికి ఇప్పుడు మూడు రెట్లకు పైగా లాభం వస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రాముకు రూ.12,066 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. అంటే 8 సంవత్సరాల కాలంలో 317 శాతం లాభం అన్నమాట.2017 నవంబర్లో గ్రాముకు రూ.2,945 వద్ద జారీ చేసిన బాండ్లు ఇప్పుడు రూ. 9,171 లాభాన్ని ఇచ్చాయి. దీనికి ఆర్నెళ్లకోసారి చెల్లించే 2.5% వార్షిక వడ్డీ అదనం. 2025 అక్టోబర్ 31, నవంబర్ 3, 4 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం సగటు ముగింపు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా రిడంప్షన్ ధరను నిర్ణయించారు.ఏమిటీ సావరిన్ గోల్డ్ బాండ్స్?బంగారం దిగుమతులను తగ్గించడంతోపాటు.. పసిడిపై పెట్టుబడులను డిజిటల్వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు మాత్రం తగ్గలేదు.ఎస్జీబీలకు (Sovereign Gold Bonds) ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ఎస్జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. దీంతో సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపేసింది.కాగా సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 2017–18 సిరీస్ IVలో పెట్టుబడిపెట్టినవారు గత అక్టోబర్లో తుది రిడంప్షన్ను అందుకున్నారు. ఆ సిరీస్ బాండ్లకు ఆర్బీఐ గ్రాముకు రూ.12,704 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. 2017–18 సిరీస్ IV మదుపరులు 8 ఏళ్ల కాలంలో 325 శాతం రాబడిని పొందారు.
39 టన్నుల బంగారం: అందుకే డిమాండ్!
భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. నేడు (నవంబర్ 06) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.21 లక్షల వద్ద ఉంది. రేటు పెరగడానికి ప్రధాన కారణం.. పండుగ సీజన్ మాత్రమే కాదు. వివిధ దేశాల బ్యాంకులు ఎక్కువ మొత్తంలో పసిడి కొనుగోలు చేయడం కూడా.. అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది.2025 సెప్టెంబర్ నెలలో కేంద్ర బ్యాంకులు గరిష్టంగా 39 టన్నుల (39,000 కేజీలు) బంగారం కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఈ ఏడాది మొత్తంలో గోల్డ్ కొనుగోళ్లు సెప్టెంబర్లో జరిగినట్లు సమాచారం. కాగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం 634 టన్నులు కావడం గమనార్హం.సెప్టెంబర్ 2025లో.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ 15 టన్నుల గోల్డ్ కొనుగోలు చేయగా.. బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా 6 టన్నులు కొనుగోలు చేసింది. రష్యా బ్యాంక్ 3 టన్నులు, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజికిస్థాన్ 8 టన్నుల బంగారం కొనేసింది. టర్కీ బ్యాంక్ మాత్రం 2 టన్నుల పసిడి కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడంతో.. పసిడికి డిమాండ్ అమాంతం పెరిగిందని గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.ఇదీ చదవండి: ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!తగ్గుతున్న గోల్డ్ రేటు - కారణాలుసెంట్రల్ బ్యాంకుల విషయాన్ని పక్కనపెడితే.. పెట్టుబడిదారులు కూడా బంగారం సురక్షితమైన పెట్టుబడి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ ధరలను పెంచేసింది. అయితే ప్రస్తుతం గోల్డ్ రేటు కొంత తగ్గుముఖం పట్టింది. దీనికి కారణం.. అమెరికా డాలర్ బలపడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం, రాజకీయ పరిస్థితులు అని తెలుస్తోంది.
కార్పొరేట్
శివ్ నాడార్.. జాబితాలో అంబానీ కంటే ముందు: రూ.2708 కోట్లు..
అమెరికా టెక్ కంపెనీలపై నిషేధం విధిస్తే..
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు..
జాక్పాట్.. కూరగాయల వ్యాపారికి రూ.11 కోట్ల లాటరీ
కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
ఈ నెల 26 నుంచి పౌల్ట్రీ ఎక్స్పో
గ్రోక్తో పేటీఎం జట్టు
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ ఆదాయం రూ. 188 కోట్లు
ఆర్బీఎల్ బ్యాంక్ ఓపెన్ ఆఫర్ @ రూ. 280
జీసీసీ లీడర్.. హైదరాబాద్!
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
మాటిమాటికీ.. బ్రేక్డౌన్లేంటి..
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో పదే పదే సా...
ఎస్బీఐ భళా
మొత్తం బిజినెస్ రూ. 100 లక్షల కోట్లను తాకింది. ఆస...
సెన్సెక్స్ 519 పాయింట్లు మైనస్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు,...
300 బిలియన్ డాలర్లకు బయో ఎకానమీ
బయో ఎకానమీ 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు (రూ.2...
అక్టోబర్లో రాణించిన తయారీ రంగం
వస్తు, సేవల పన్నులో (జీఎస్టీ) తీసుకొచ్చిన సంస్కరణ...
యూపీఐ కొత్త రికార్డు!
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)...
పెళ్లిళ్ల సీజన్: రూ.6.5 లక్షల కోట్ల బిజినెస్!
భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. నవంబర్ 1 ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
దొంగలించి ‘ట్రేడ్-ఇన్’ ద్వారా కొత్త ఫోన్!
దొంగిలించబడిన ఐఫోన్ల వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నంలో టెక్ దిగ్గజం యాపిల్ సహకరించడం లేదని యూకే మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ (Met Police) తీవ్రంగా ఆరోపించింది. దొంగిలించబడిన ఫోన్లకు క్రెడిట్ పొందేందుకు నేరస్థులు యాపిల్ ట్రేడ్-ఇన్ (Trade-in) ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.యూకే పార్లమెంటు సభ్యులకు (MPs) మెట్ పోలీస్ సమర్పించిన నివేదికలో.. యాపిల్ సంస్థకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR)కు అవకాశం ఉందని తెలిపారు. ట్రేడ్-ఇన్ పరికరాల నెట్వర్క్ స్థితిని తనిఖీ చేయడానికి మాత్రమే యాపిల్ ప్రతిరోజూ దీన్ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో ఫోన్ల దొంగతనానికి సంబంధించిన అంశాలను తనిఖీ చేయడం లేదని చెప్పారు. అంటే ఎవరైనా ఐఫోన్లు దొంగతనం చేసి ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా క్రెడిట్లు పొంది తిరిగి కొత్త ఫోన్ను పొందవచ్చు. లేదా యాపిల్ గిఫ్ట్ కార్డులు పొందవచ్చు. యాపిల్ సరైన తనిఖీలు చేయకుండా దొంగిలించబడిన పరికరాలు మళ్లీ చలామణిలోకి రావడానికి సమర్థవంతంగా అనుమతిస్తుందని పోలీసులు చెబుతున్నారు.నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR) అనేది దొంగిలించబడిన పరికరాలను గుర్తించడానికి, తిరిగి వాటిని బాధ్యులకు ఇవ్వడానికి చట్ట పరంగా అధికారులు ఉపయోగించే డేటాబేస్. యాపిల్ తన ట్రేడ్-ఇన్ పథకంలో ఈ రిజిస్టర్ను ఉపయోగించడం లేదని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.క్రెడిట్ పాయింట్లువినియోగదారులు తమ పాత ఐఫోన్ను మార్చుకున్నప్పుడు కొత్త ఐఫోన్ కొనుగోలుకు ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్లో ఉదాహరణకు సుమారు 670 యూరోల వరకు క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. సరైన దొంగతనం తనిఖీలు లేకుండా దొంగిలించబడిన ఐఫోన్లను ఈ వ్యవస్థలోకి అంగీకరించి తిరిగి విక్రయించడం లేదా పునరుద్ధరిరిస్తున్నట్లు(Refurbished) పోలీసులు చెబుతున్నారు.పెరిగిన దొంగతనాలుమెట్ పోలీస్ అందించిన సమాచారం ప్రకారం 2024లోనే లండన్లో 80,000 కంటే ఎక్కువ ఫోన్లు దొంగిలించబడ్డాయి. ఇది 2023లో నమోదైన 64,000 దొంగతనాల కంటే పెరిగింది. దొంగిలించబడిన ఈ ఫోన్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలంటే 50 మిలియన్ యూరోలు ఖర్చవుతుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఫోన్లలో 75% పైగా విదేశాలకు తరలివెళ్తున్నాయని, అక్కడ వాటిని విడదీసి విడిభాగాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.యాపిల్ ప్రతిస్పందనమెట్ పోలీస్ విమర్శలను యాపిల్ ఖండించింది. దొంగిలించబడిన డివైజ్ల కోసం కంపెనీ Stolen Device Protection వంటి చర్యలు తీసుకుంటుందని హైలైట్ చేసింది. ఫోన్ యజమాని ధ్రువీకరణ లేకుండా నేరస్థులు డివైజ్లోని డేటాను తొలగించడం లేదా తిరిగి విక్రయించకుండా నిరోధించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: భవిష్యత్తు బంగారు లోహం!
లక్షల్లో వేతనాలు.. ఉంటే చాలు ఈ స్కిల్!
నేడు కృత్రిమ మేథ (ఏఐ) వాయు వేగంతో విస్తరిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక సరికొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ప్రతి ఒక్క పనికి ఏఐ చాట్బాట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి చాలా తేలిగ్గా, తక్కువ వ్యయంతో అధిక సమర్థతతో పనిచేస్తున్నాయి. నలుగురు చేయాల్సిన పని ఒక్కరితోనే పూర్తవుతోంది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్క వృత్తిలో సమర్థత పెంపులో ఏఐ నైపుణ్యం అత్యంత ఆవశ్యకంగా మారుతోంది. ఏఐ వృత్తి పరంగా, వ్యక్తిగతంగా పని విధానాలను సమూలంగా మార్చివేస్తోంది. పని ప్రదేశాన్నే కాదు జీవన విధానాలనే మార్చివేస్తున్న కృత్రిమ మేథ నైపుణ్యం.. తాజా సర్వేల్లో టాప్ స్కిల్గా నిలుస్తోంది.ఏఐ స్కిల్ ఉన్న నిపుణుల కోసం కంపెనీలు అన్వేషణ సాగిస్తున్నాయి. కృత్రిమ మేథపై పట్టున్న వారికి లక్షల్లో వేతనాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడటంలేదు. అందుకే ఇప్పుడు కెరీర్ పరంగా ఏఐ కీలక నైపుణ్యంగా మారింది.మరింత విస్తరణ దిశగామైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఓపెన్ ఏఐ వంటి పెద్ద టెక్ కంపెనీలు డేటా కేంద్రాలు, ఏఐ మౌలిక వసతులపై బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఏఐ రంగం మరింతగా విస్తరిస్తుందనేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇంతటి భారీ స్థాయిలో ఏఐపై పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు.. వీటి నిర్వహణకు అవసరమైన మానవ వనరుల నియామకాలు అదే స్థాయిలో చేపట్టనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో కృత్రిమ మేథ కీలకమైన నైపుణ్యంగా మారనుంది. తాజా నివేదిక అంచనాలుద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్–2025’ ప్రకారం.. అన్ని రంగాలను డిజిటల్ టెక్నాలజీ కమ్మేయనుంది. 2030 నాటికల్లా తమ వ్యాపారాలు పూర్తిగా డిజిటల్గా మారతాయని భావిస్తున్నట్లు 60 శాతం మంది పేర్కొనడం విశేషం. అత్యాధునిక సాంకేతికత ముఖ్యంగా ఏఐ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ 86 శాతం, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ 58 శాతం, ఎనర్జీ జనరేషన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 41 శాతం డిజిటల్ మార్పులకు కారణం కానున్నాయి. డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో ఏఐ, బిగ్డేటా, నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలకు భారీ డిమాండ్ ఏర్పడనుందని ఈ నివేదిక అంచనావేసింది.డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో.. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్లు, బిగ్ డేటా స్పెషలిస్ట్లు, ఫిన్టెక్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డవలపర్స్, అటానమస్ అండ్ ఈవీ స్పెషలిస్ట్లు తదితర ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంటుందని తాజా పేర్కొంది. మరోవైపు క్లరికల్, సెక్రటేరియల్ ఉద్యోగాలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా క్యాషియర్స్, టికెట్ క్లర్క్స్, డేటా ఎంట్రీ క్లర్క్స్, బ్యాంక్ టెల్లార్ కొలువుల్లో కోతపడనుంది.అత్యంత వేగంగా డిమాండ్ పెరుగుతున్న నైపుణ్యాల్లో ఏఐ అండ్ బిగ్ డేటా టాప్లో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ లిటరసీ నిలిచాయి. ఈ మూడు టెక్ నైపుణ్యాలతోపాటు 2025–2030 మధ్యకాలంలో సృజనాత్మక ఆలోచన (క్రియేటివ్ థింకింగ్) ఒత్తిళ్లను తట్టుకొనే సామర్థ్యం (రెజిలియెన్స్), సరళత్వం-చురుకుదనం (ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎజిలిటీ), కుతూహలం (క్యూరియాసిటీ), జీవితాంతం నేర్చుకోవాలి అనే అభిలాష ఉన్న వారికి కంపెనీలు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.నిపుణుల కొరతఏఐ నిపుణుడిగా మారాలంటే.. ఐఐటీల్లో చదవాలి, టాప్ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు ఉండాలి అనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.ఓ వైపు ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుంటే.. మరోవైపు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిపుణులు అందుబాటులో లేరని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో మానవ వనరుల నైపుణ్యాలు, కంపెనీల అవసరాల మధ్య తీవ్ర అంతరం నెలకొంది. ఏఐ నిపుణుల కొరత తీర్చేందుకు పెద్ద ఎత్తున అప్స్కిల్లింగ్ చేపట్టాలని సూచిస్తున్నారు.ఏఐ రంగంలో ప్రవేశించాలనుకునే వారు వ్యక్తిగతంగా స్వీయ అసెస్మెంట్ చేసుకోవాలి. జాబ్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా తమలో నైపుణ్యాలు లేకుంటే వాటిని మెరుగుపరచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. మొదట యూట్యూబ్ తదితర ఆన్లైన్ మార్గాల ద్వారా ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత బేసిక్ ఆన్లైన్ షార్ట్టర్మ్ కోర్సుల ద్వారా ప్రాథమిక అంశాలు నేర్చుకోవచ్చు. స్వయం, ఎన్పీటీఈఎల్ తదితర మార్గాల ద్వారా ఐఐటీలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ అందిస్తున్న ఉచిత కోర్సుల ద్వారా ఏఐపై పట్టు పెంచుకొని జాబ్ మార్కెట్లో అవకాశాల కోసం అన్వేషించొచ్చు!!ఇదీ చదవండి: డిజిటల్ యుగంలో.. ఏఐ హవా!
భారత యూజర్లకు ఓపెన్ఏఐ బంపర్ ఆఫర్
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) ‘చాట్జీపీటీ గో’(ChatGPT Go) సబ్స్క్రిప్షన్ను భారతీయులకు ఏడాదిపాటు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు ఈ ప్లాన్ను మరో ఏడాదిపాటు డిఫాల్ట్గా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వారం చివరి నుంచి ఈ ఆఫర్ను అమలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ పొడిగింపునకు సంబంధించి వినియోగదారుల తరఫున ఎటువంటి చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది. వారి బిల్లింగ్ తేదీని 12 నెలలకు వాయిదా వేస్తూ చాట్జీపీటీ గో అన్ని సర్వీసులు అందిస్తామని హామీ ఇచ్చింది.భారత్పై ఓపెన్ఏఐ దృష్టిచాట్జీపీటీ గో (ChatGPT Go)ను భారతదేశంలోని వినియోగదారులకు ఏడాదిపాటు ఉచితంగా అందించనున్నట్లు ఓపెన్ఏఐ ఇటీవల ప్రకటించింది. నవంబర్ 4 నుంచి పరిమిత కాలం పాటు నిర్వహించే ప్రమోషనల్ క్యాంపెయిన్లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ను పొందవచ్చని తెలిపింది. భారత్లో తొలిసారిగా నవంబర్ 4న బెంగళూరులో డెవ్డే ఎక్స్ఛేంజ్ (DevDay Exchange-బైకర్ ప్రోగ్రామ్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగానే ఈ ఉచిత ఆఫర్ను కంపెనీ ప్రకటించింది.క్వెరీలు, ఇమేజ్ జనరేషన్ పరిమితులు తక్కువగా ఉండే ఈ చాట్జీపీటీ గో ప్లాన్ను భారతీయ వినియోగదారుల కోసం అందుబాటు చార్జీలతో అందించాలనే లక్ష్యంతో ఓపెన్ఏఐ ఈ ఏడాది ఆగస్టులో దీన్ని ఆవిష్కరించింది.చాట్జీపీటీ వర్సెస్ చాట్జీపీటీ గోఅంశంచాట్జీపీటీ ఫ్రీచాట్జీపీటీ గోధరఉచితంనెలకు రూ.399 (ప్రస్తుతానికి ఏడాది ఉచితం)ప్రధాన మోడల్GPT-3.5, పరిమిత GPT-5 యాక్సెస్మెరుగైన/ విస్తరించిన GPT-5 యాక్సెస్మెసేజ్ పరిమితులుచాలా పరిమితం, పీక్ అవర్స్లో వేగం తగ్గుతుందిఫ్రీ ప్లాన్ కంటే 10 రెట్లు ఎక్కువ మెసేజ్ పరిమితులుఇమేజ్ జనరేషన్పరిమితంగా ఉంటుందిఫ్రీ ప్లాన్ కంటే 10 రెట్లు ఎక్కువ ఇమేజ్ జనరేషన్ఫైల్ అప్లోడ్చాలా పరిమితం (ఎంచుకున్న ఫైల్స్)మరింత ఎక్కువ ఫైల్స్ అప్లోడ్ చేయవచ్చు.డేటా విశ్లేషణప్రాథమిక, పరిమిత యాక్సెస్అడ్వాన్స్డ్ డేటా విశ్లేషణకు మెరుగైన యాక్సెస్కస్టమ్ జీపీటీలుయాక్సెస్ లేదుకస్టమ్ జీపీటీలు, ప్రాజెక్ట్లు, టాస్క్లకు యాక్సెస్లక్షిత వినియోగదారులుసాధారణ, అప్పుడప్పుడు ఉపయోగించే వినియోగదారులువిద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, మెరుగైన యాక్సెస్ కోరుకునే సాధారణ వినియోగదారులు చాట్జీపీటీ గో వర్సెస్ మైక్రోసాఫ్ట్ కోపైలట్అంశంచాట్జీపీటీ గోమైక్రోసాఫ్ట్ కోపైలట్ప్రధాన ఏకీకరణస్టాండలోన్ చాట్బాట్, అన్ని ప్లాట్పామ్లకు వర్తిస్తుంది (API ద్వారా విస్తృత ఏకీకరణ)మైక్రోసాఫ్ట్ 365 (Word, Excel, Outlook, Teams, GitHub) అప్లికేషన్లలో ఏకీకృతం చేశారు.ప్రధాన లక్ష్యంసాధారణ సంభాషణ, సృజనాత్మకత, కోడింగ్, చిన్న వ్యాపార ఉత్పాదకతమైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్ (Ecosystem) లోని ఎంటర్ప్రైజ్ ప్రొడక్షన్, పనుల ఆటోమేషన్డేటా సోర్స్ఓపెన్ఏఐ శిక్షణ డేటాసెట్లు + వెబ్ సెర్చ్ఓపెన్ఏఐ మోడల్స్ + బింగ్ సెర్చ్ + వినియోగదారుల సంస్థాగత డేటా (M365 ఫైల్స్)భద్రతయూజర్ డేటాను ఏఐ శిక్షణకు ఉపయోగించకుండా నిలిపివేయవచ్చు (గో, ప్లస్ ప్లాన్లలో)ఎంటర్ప్రైజ్ ప్లాన్లలో స్ట్రక్చరల్ భద్రతాకస్టమ్ టూల్స్కస్టమ్ జీపీటీలను రూపొందించే సామర్థ్యం (గో లో పరిమిత యాక్సెస్)MS 365 యాప్లలో నిర్దిష్ట పనులు చేయగల సామర్థ్యం
అంబానీ ఇంట్లో కనిపించని ఏసీ: యాంటిలియాలో ఎందుకిలా?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన అంబానీ గురించి, వారు నివసించే భవనం యాంటిలియా గురించి చాలా విషయాలు తెలిసుంటాయి. కానీ సుమారు రూ. 15,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ నివాసంలో ఒక్క ఔట్ డోర్ ఏసీ కూడా లేకపోవడం గమనార్హం. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంతకీ అంతపెద్ద భవనంలో ఔట్ డోర్ ఏసీ లేకపోవడానికి కారణం ఏమిటి? దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ముంబై నగరంలో నిర్మించిన.. ముకేశ్ & నీతా అంబానీల కలల సౌధం సుమారు 27 అంతస్తులలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఇళ్లలో ఒకటి కూడా. దీనిని లగ్జరీ, లేటెస్ట్ వాస్తుశిల్పానికి, భారతీయ సంప్రదాయానికి నెలవుగా నిర్మించుకున్నారు. ఈ లగ్జరీ భవనంలో.. 49 బెడ్ రూములు, ఐస్ క్రీం పార్లర్, గ్రాండ్ బాంకెట్ హాల్, ఒక స్నో రూమ్, ఒక ప్రైవేట్ థియేటర్, తొమ్మిది లిఫ్టులు, మూడు హెలిప్యాడ్లు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి కావలసిన ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి.ప్రత్యేకమైన టెక్నాలజీఇక ఔట్ డోర్ ఏసీ ఎందుకు లేదు? అనే విషయానికి వస్తే.. సాధారణ ఏసీ ఉపయోగించడం వల్ల, భవనం అందం తగ్గిపోతుందని.. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించినట్లు సమాచారం. ఇది భవనంలో పువ్వులు, ఇంటీరియర్, పాలరాతిని కాపాడుతుంది. యాంటిలియాలో ఎవరు అడుగుపెట్టినా.. ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ఏసీ అనేది వ్యక్తిగత సౌకర్యం కోసం కాకుండా.. భవంతి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. కాబట్టి ఇక్కడ ఔట్ డోర్ ఏసీ కనిపించదు.యాంటాలియా చల్లగాముంబై నగరం వేడిగా ఉన్నప్పటికీ.. యాంటాలియా మాత్రం చల్లగానే ఉంటుంది. ఒకసారి నటి శ్రేయా ధన్వంతరి ఫ్యాషన్ షూట్ కోసం కొన్నాళ్లు యాంటాలియాలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒకరోజు, తనకు బాగా చలిగా అనిపించిందని, ఏసీ తగ్గించమంటే.. అక్కడి సిబ్బంది.. ఆ భవనం నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఏసీని తగ్గించకూడదని ఆమెకు వివరించినట్లు.. ఆమె తన అనుభవాన్ని వెల్లడించారు.ఇదీ చదవండి: అలాంటి ప్రాజెక్టులు ఆపేయండి: మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్
పర్సనల్ ఫైనాన్స్
జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?
డబ్బు సంపాదించడం ఒక కళ. ధనవంతులు అయ్యేందుకు చాలా మార్గాలు అనుసరించి లక్ష్యం చేరినా, దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎంతో కష్టపడి సంపాదించిన ధనం దేనికి ఖర్చు చేస్తున్నారో సరైన అవగాహన లేకుండానే చాలా మంది నష్టపోతున్నారు. ఇది కేవలం తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే కాదు, అపార సంపద ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛకు పునాదులు వేసుకోవడానికి బదులు, దారిద్ర్యం వైపు నడిపించే ప్రమాదకరమైన అలవాట్లు, ఆర్థిక నిర్ణయాలు ఏమిటో తెలుసుకోవడం అత్యవసరం.అదుపులేని వినియోగం‘నాకు ఇప్పుడే ఆ వస్తువు అవసరం లేదు, కానీ కొనాలి’ అనే భావన పేదరికానికి మొదటి మెట్టు. క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలపై వస్తువులను కొనుగోలు చేయడం, వాటిపై భారీ వడ్డీ చెల్లించడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. తరచుగా కొత్త మోడల్ ఫోన్లు, కార్లు లేదా ఫ్యాషన్ వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేయడం వంటి విధానాల ద్వారా డబ్బు కరిగిపోతుంది. కొనుగోలు చేసిన వస్తువుల విలువ కాలక్రమేణా తగ్గిపోతుంది. ఇతరులను అనుకరించడానికి లేదా సమాజంలో గొప్పగా కనిపించడానికి స్థోమతకు మించిన ఖర్చులు చేయకూడదు.ఆర్థిక అవగాహన లేకపోవడండబ్బు సంపాదించడం గురించి తెలుసుకోవడమే కాదు, అది ఎలా పనిచేస్తుందో తెలియకపోవడం అతిపెద్ద లోపం. డబ్బును బ్యాంకులో ఉంచడం సురక్షితమని భావించి చాలా మంది దాని విలువ ద్రవ్యోల్బణం కారణంగా క్రమంగా తగ్గిపోతోందని గ్రహించడం లేదు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ముఖ్యం. కానీ ఆ పొదుపును తెలివిగా పెట్టుబడి పెట్టకపోతే ఆర్థిక లక్ష్యాలు నెరవేరవు. పన్నుల విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనవసరంగా ఎక్కువ పన్నులు చెల్లించడం లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.అత్యవసర నిధి..ఊహించని సంఘటనలకు (ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం, ప్రమాదాలు) సిద్ధంగా లేకపోవడం వల్ల పేదరికం అంచుల్లోకి వెళుతారు. అత్యవసర సమయాల్లో డబ్బు లేకపోతే అధిక వడ్డీకి అప్పులు చేయక తప్పదు. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. కనీసం ఆరు నెలల జీవన వ్యయాలకు సరిపడా డబ్బును పక్కన పెట్టుకోవాలి. ఏ చిన్న విపత్తు వచ్చినా తీవ్ర సంక్షోభం నుంచి కపాడుకోవడానికి ఇది తోడ్పడుతుంది.ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడటంఒకే ఉద్యోగం లేదా ఒకే వ్యాపారంపై పూర్తిగా ఆధారపడటం ఆర్థిక ప్రమాదానికి సంకేతం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఉద్యోగం పోతుందో చెప్పలేం. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లేకపోతే కుటుంబ పోషణ కష్టమవుతుంది. అదనపు ఆదాయ వనరుల ద్వారా సంపదను వేగంగా పెంచుకునే అవకాశం ఉంది. అన్ని గుడ్లను ఒకే బుట్టలో ఉంచడం మంచిది కాదనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక..రేపటి గురించే కాకుండా 20-30 సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వల్ల కూడా చాలామంది పేదరికంలోకి వెళ్తున్నారు. యువతలో రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు. దానికోసం పొదుపు/పెట్టుబడి పెట్టడం లేదు. దాంతో వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది. ఇల్లు కొనడం, పిల్లల విద్య వంటి స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే పరిస్థితులు తారుమారవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లభించే చక్రవడ్డీ శక్తిని గుర్తించాలి.ఇదీ చదవండి: దొంగలించి ‘ట్రేడ్-ఇన్’ ద్వారా కొత్త ఫోన్!
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా: ఏఐతో వాత!
నాకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఒకటే ఉంది. అందులో జీతమే పడుతుందని కొందరు.. పెన్షన్ తప్ప ఇంకేమీ వేయనని ఇంకొందరు.. మార్చి నెలాఖరుకల్లా చాలా తక్కువ.. అంటే మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంటుందని మరికొందరు చెప్తుంటారు. అక్షరాలా ఇదే నిజమైతే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు వ్యవహారాల మీద ఎలాంటి నిఘా ఉండదు. కేవలం ఫిక్సిడ్ డిపాజిట్ల మీదే దృష్టి ఉంటుందని కొందరి పిడివాదన.డిపార్టుమెంటు వారికి అవేమీ పట్టవు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా అన్ని బ్యాంకులు, అన్ని బ్రాంచీలు ప్రతి సంవత్సరం విధిగా, మీకు సంబంధించిన అన్ని సేవింగ్స్ ఖాతాల వ్యవహారాలను కొన్ని నిబంధనలకు లోబడి డిపార్టుమెంటుకు చేరవేస్తాయి. ఆ చేరవేత, ఆ తర్వాత ఏరివేత.. మెదడుకి మేత.. కృత్రిమ మేథస్సుతో వాత.. వెరసి మీకు నోటీసుల మోత! అసాధారణమైన నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్ వారి దృష్టిలో పడతాయి. వివిధ సంస్థలు, ఏజెన్సీలు ప్రతి సంవత్సరం ‘‘నిర్దేశిత ఆర్థిక వ్యవహారాల’’ను ఒక రిటర్ను ద్వారా తెలియజేస్తాయి.పది లక్షలు దాటిన నగదు డిపాజిట్లుఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి కాని, దఫదఫాలుగా కానీ వెరసి నగదు డిపాజిట్లు రూ. 10,00,000 దాటితే మీ ఖాతా వ్యవహారాలు.. సేవింగ్స్ ఖాతాలో పడినట్లు కాదు.. డిపార్టుమెంటు వారి చేతిలో పడ్డట్లే.విత్డ్రాయల్స్కొందరు తమ ఖాతాల నుంచి పెద్ద మొత్తాలు విత్డ్రా చేస్తారు. వ్యాపారం నిమిత్తం, పెళ్లి ఖర్చుల నిమిత్తం.. ఇలా చేయడం చట్టపరంగా తప్పు కాకపోవచ్చు. అసమంజసంగా అనిపిస్తే ఆరా తీస్తారు. ‘సోర్స్’ గురించి కూపీ లాగుతారు.క్రెడిట్ కార్డులపై భారీ చెల్లింపులుఅకౌంటు ద్వారా పెద్ద పెద్ద మొత్తాలు క్రెడిట్ కార్డుల చెల్లింపులకు వెళ్తుంటాయి. వీటి మీద నిఘా, విచారణ ఉంటాయి.రూ. 30,00,000 దాటిన క్రయ విక్రయాలు..ఇలాంటి క్రయవిక్రయాలను సబ్రిజిస్టార్ వాళ్లు ప్రతి సంవత్సరం రిపోర్ట్ చేస్తారు. వెంటనే బ్యాంకు అకౌంట్లను చెక్ చేస్తారు. సాధారణ పద్దులు/రొటీన్ పద్దులు ఉండే అకౌంట్లలో పెద్ద పెద్ద పద్దులుంటే, వారి అయస్కాంతంలాగా వారి దృష్టికి అతుక్కుపోతాయి.విదేశీయానం.. విదేశీ మారకం..విదేశీయనం నిమిత్తం, విదేశీ చదువు కోసం, విదేశాల్లో కార్డుల చెల్లింపులు... ఇలా వ్యవహారం ఏదైనా కానీ రూ. 10,00,000 దాటితో పట్టుకుంటారు. దీనికి ఉపయోగించిన విదేశీ మారకం, చట్టబద్ధమైనదేనా లేక హవాలానా అనేది ఆరా తీస్తారు.నిద్రాణ ఖాతాల్లో నిద్ర లేకుండా చేసే వ్యవహారాలుకొన్ని సంవత్సరాలపాటు ఎటువంటి లావాదేవీలు ఉండని ఖాతాలను నిద్రాణ లేదా ని్రష్కియ ఖాతాలని అంటారు. వాటిలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద వ్యవహారాలేమైనా జరిగాయంటే.. అధికారుల కళ్లల్లో పడతాయి. ఇలాంటి వ్యవహారాలు అధికారుల దృష్టిని ఆకట్టుకుంటే.. వారు వెంటనే పట్టుకుంటారు.డిక్లేర్ చేయని వ్యవహారాలు చనిపోయిన మావగారు, పెళ్లప్పుడు ఇచ్చిన స్థలాన్నో, ఇళ్లనో ఇప్పుడు అమ్మేసి, వచి్చన ఆ పెద్ద మొత్తాన్ని అకౌంటులో వేసి, ఆయన ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తే అది మౌనరాగం కాదు. గానాబజానా అయిపోతుంది. ఖజానాకి చిల్లులు పడతాయి. పొంతన లేని డివిడెండ్లు.. వడ్డీ.. కొన్న షేర్లు భారీగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్లు కొండంత ఉన్నా డివిడెండ్లు, వడ్డీల రూపంలో ఆదాయం ఆవగింజంత కనిపిస్తోందంటే ..తస్మాత్ జాగ్రత్త.ఎన్నో అకౌంట్లు .. కానీ ఒక్కదాన్నే..కొందరికి ఎన్నో అకౌంట్లు ఉంటాయి. తప్పు లేదు. కానీ వారు ఇన్కంట్యాక్స్ రిటర్నుల్లో ‘ఏకో నారాయణ’ అన్నట్లు ఒక దాన్ని మాత్రమే డిక్లేర్ చేస్తారు. డిపార్టుమెటు వారి దగ్గర మీ పది అకౌంట్ల వివరాలు పదిలంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.వేరే వ్యక్తుల సహాయార్థం.. ఏదో, సహాయమని, బంధువులు, స్నేహితుల పెద్ద పెద్ద వ్యవహారాలను మీ అకౌంట్లలో నడిపించకండి. వివరణ మీరు ఇవ్వాల్సి వస్తుంది.. ఇవ్వగలరా? అప్పులను తిరిగి చెల్లించేటప్పుడే ఆశగా ఎక్కువ వడ్డీ చూపించి, పెద్ద మొత్తాన్ని మీ అకౌంట్లో వేసి, ‘నా పేరు చెప్పకు గురూ’ అని అంటారు.. కానీ, వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేంటి అనే అటలాగా, వీళ్ల వ్యవహారాలేంటి.. వాళ్ల వ్యవహారాలేంటి అని ఆరా తీస్తూ, దొంగ లావాదేవీలు లేదా డిక్లేర్ చేయని లావాదేవీలను డిపార్టుమెంటు వారు కళ్లు మూసుకుని సైతం పట్టేస్తారనే విషయాన్ని అర్థం చేసుకుని మనం కళ్లు తెరుచుకుని ఉండాలి.
‘నెల జీతాల ఉద్యోగాలు ఉండవ్..’
దేశంలో నెల జీతాల ఉద్యోగాలు ఉండబోవంటూ ఓ ఆర్థిక నిపుణుడు చేసిన హెచ్చరిక కలవరపెడుతోంది. భారతదేశ వైట్ కాలర్ జాబ్ యంత్రం ఆగిపోయే దశకు వచ్చిందని మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరిస్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే “భారతదేశంలో స్థిరమైన జీతం పొందే ఉపాధి యుగం ముగుస్తోంది”ఇటీవలి పాడ్కాస్ట్లో మాట్లాడిన ముఖర్జియా.. “ఉపాధి వృద్ధి ప్రధానంగా ఆగిపోయింది. ఈ పరిస్థితి కనిపించడమే కాదు.. కోలుకోలేనిదిగా ఉంది” అన్నారు. గత ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాల పెరుగుదల తక్కువగా ఉండటమే కాక, భవిష్యత్తులో కూడా వాటి పునరుజ్జీవనం “దాదాపు అసంభవం” అని ఆయన అభిప్రాయపడ్డారు.కారణం ఆటోమేషన్..ఈ పరిణామానికి ప్రధాన కారణాలు ఆటోమేషన్, కార్పొరేట్ సామర్థ్యం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు, ఇప్పుడు ఉద్యోగులను పెంచుకోకుండానే తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నాయి. “ఈ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం చాలా తక్కువ. ఆటోమేషన్ వల్ల ఉద్యోగుల సంఖ్యను పెంచకుండానే ఎదగడం సాధ్యమవుతోంది” అని సౌరభ్ ముఖర్జియా అన్నారుగ్రాడ్యుయేట్ల వెల్లువ.. అవకాశాల కొరతప్రతి సంవత్సరం సుమారు 80 లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్లు భారత శ్రామికశక్తిలోకి ప్రవేశిస్తున్నారు. కానీ వీరికి తగిన అవకాశాలు ఉండటం లేదు. “అధికారిక కార్పొరేట్ నిర్మాణం లేకుండా ఈ కొత్త తరం యువతకు జీవనోపాధి కల్పించడం ఎలా అన్నదే దేశం ఎదుర్కొనే సవాలు” అని ఆయన చెప్పారు. రానున్న సంవత్సరాల్లో దేశంలో పని విధానం పూర్తిగా మారిపోతుందని సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు.గిగ్ ఎకానమీ వైపు ప్రయాణంసాంప్రదాయ వేతన ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతాయనేది సౌరభ్ ముఖర్జియా అంచనా. “డ్రైవర్లు, కోడర్లు, పాడ్కాస్టర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు అందరూ స్వయం ఉపాధి వైపు వెళ్తున్నారు,” అని ఆయన చెప్పారు. “మనం గిగ్ ఉద్యోగాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. జీతం ఆధారిత ఉపాధి యుగం చరిత్రలో కలిసిపోతోంది” అన్నారు.గిగ్ ఎకానమీ భారత్కు కలిసివస్తుందని ముఖర్జియా ఆశాజనకంగా కూడా ఉన్నారు. 29 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న యువ జనాభా, ప్రపంచంలోనే చౌకైన మొబైల్ బ్రాడ్బ్యాండ్, అలాగే ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ వ్యవస్థలు.. ఇవన్నీ భారత్ను “గిగ్ ఎకానమీ” యుగంలో బలంగా నిలబెడతాయని ఆయన నమ్మకం.“సాంప్రదాయ వైట్ కాలర్ ఉద్యోగాలు సవాలుగా మారతాయి. మన జీవితంలో ఎక్కువ భాగం గిగ్ కార్మికులుగా గడపాల్సిన భవిష్యత్తు కోసం మనమూ, మన పిల్లలూ సిద్ధం కావాలి” అని ఆయన స్పష్టం చేశారు.
పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?
నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జయ్దేవ్ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. రాబడితోపాటు పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ప్రతీ పెట్టుబడి ఆప్షన్లో ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో రాబడులు ఇస్తాయని కచ్చితంగా చెప్పలేం. రాబడులు ఇవ్వొచ్చు. నష్టాలూ ఇవ్వొచ్చు. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. పెట్టుబడి అవసరమైన సమయంలో మార్కెట్లు దిద్దుబాటును చూస్తే రాబడిని నష్టపోవాల్సి రావచ్చు.స్వల్పకాలం కోసం అయితే అస్థితరల రిస్క్ను అధిగమించేందుకు డెట్ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఐదేళ్లు, అంతకుమించిన కాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల అస్థిరతల ప్రభావాన్ని అధిగమించొచ్చు. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, రాబడుల అంచనాల ఆధారంగా డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. నేను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో రూ.4 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. మూడేళ్లు అయింది. ఇప్పుడు నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? – శ్యామ్ ముఖర్జీసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. 8.2 శాతం వార్షిక రాబడిని మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షిస్తుంటుంది. అయినప్పటికీ డిపాజిట్ చేసే రోజు ఉన్న రేటు ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లకు ముందుగానే వైదొలగాలంటే అందుకు ఫారమ్–2 సమర్పించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన కాలవ్యవధి ఆధారంగా కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటి వరకు మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు.ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద మినహాయించి, మిగిలినది చెల్లిస్తారు. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మీరు మూడేళ్ల తర్వాత డిపాజిట్ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు. కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్సీఎస్ఎస్ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించిన కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా ఎలాంటి పెనాల్టీ పడదు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలా?


