Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Maruti Suzuki plans 1 lakh EV charging stations across India by 20301
లక్ష చార్జింగ్‌ పాయింట్లు.. మారుతీ ఫోకస్‌

ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) విభాగంలో అగ్రస్థానంపై కన్నేసిన ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ చార్జింగ్‌ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా డీలర్‌ పార్ట్‌నర్లు, చార్జింగ్‌ పాయింట్‌ ఆపరేటర్లతో కలిసి 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయనుంది.ఈ–విటారా కారుకి 5 స్టార్‌ భారత్‌ ఎన్‌క్యాప్‌ సేఫ్టీ రేటింగ్‌ లభించిన సందర్భంగా కంపెనీ ఎండీ హిసాషి తకెయుచి ఈ విషయాలు తెలిపారు. ఇప్పటికే 1,100 పైగా నగరాల్లోని తమ సేల్స్, సర్వీస్‌ టచ్‌పాయింట్స్‌వ్యాప్తంగా 2,000 పైగా ఎక్స్‌క్లూజివ్‌ చార్జింగ్‌ పాయింట్ల నెట్‌వర్క్‌ను నెలకొల్పినట్లు చెప్పారు.యాప్‌ తయారీ, దేశవ్యాప్తంగా డీలర్‌ నెట్‌వర్క్‌లో చార్జింగ్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 250 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు వివరించారు. తమ ’ఈ ఫర్‌ మి’ యాప్‌ ద్వారా చార్జింగ్‌ పాయింట్ల వివరాలను పొందవచ్చన్నారు. చార్జింగ్‌ నెట్‌వర్క్‌ దన్నుతో 2026లో ఈ–విటారా అమ్మకాలను ప్రారంభించనున్నట్లు వివరించారు.

RBI may Cut Repo Rate By 25 bps In December2
ఆర్‌బీఐ వడ్డీ రేటును తగ్గిస్తుందా?

ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని రేటింగ్‌ సంస్థ కేర్‌ఎడ్జ్‌ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడంతోపాటు, జీడీపీ వృద్ధి బలంగా కొనసాగుతుండడం రేట్ల కోతకు అనుకూలించొచ్చని పేర్కొంది. ఈ నెల 5న ఆర్‌బీఐ ఎంపీసీ తన నిర్ణయాలను ప్రకటించనుండడం తెలిసిందే. ద్రవ్యోల్బణం దశా బ్ద కనిష్ట స్థాయి అయిన 0.3 శాతానికి అక్టోబర్‌లో తగ్గినట్టు కేర్‌ ఎడ్జ్‌ గుర్తు చేసింది.ఆర్‌బీఐ లక్ష్యం అయిన 4 శాతానికి ఇది ఎంతో దిగువన ఉందని, దీంతో పాలసీ రేట్ల తగ్గింపునకు వెసులుబాటు ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతంగా ఉంది. ‘‘బ్రెంట్‌ ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు ఉండడం రబీ సాగుకు అనుకూలం. చైనాలో తయా రీ అధికంగా ఉండడంతో ధరలు పెరిగే ఒత్తిళ్లు లేవు. ద్రవ్యోల్బణం ఇక్కడి నుంచి గణనీయంగా పెరగకుండా ఇవి సాయపడతాయి’’అని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ద్వితీయార్ధంలో వృద్ధి నెమ్మదించొచ్చు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) సెప్టెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.2 శాతానికి విస్తరించగా.. ద్వితీయ ఆరు నెలల్లో (క్యూ3, క్యూ4) వృద్ధి రేటు 7 శాతానికి నెమ్మదించొచ్చని కేర్‌ ఎడ్జ్‌ అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌లు అమల్లోకి రావడానికి ముందుగా చేసిన అధిక ఎగుమతులు, పండుగల అనంతరం వినియోగం తగ్గడం వంటివి వృద్ధి రేటును నెమ్మదింపజేస్తాయని పేర్కొంది.కాకపోతే పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం వచ్చే 12 నెలల్లో 3.7 శాతంలోపు ఉండొచ్చని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య చర్చలు దీర్ఘకాలం పాటు కొనసాగుతుండడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. విదేశీ మారకం నిల్వలు బలంగానే కొనసాగుతున్నట్టు, నవంబర్‌ మధ్య నాటికి 27 బిలియన్‌ డాలర్లు పెరిగి 693 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు తెలిపింది.

Agrochemical industry set for recovery CRISIL3
ఆగ్రో కెమికల్స్‌కు డిమాండ్‌

ఆగ్రో కెమికల్స్‌కు (వ్యవసాయ సంబంధిత రసాయనాలు) డిమాండ్‌ అంతర్జాతీయంగా కోలుకుంటుండడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఆదాయం 6–7 శాతం పెరగొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అంతర్జాతీయంగా సాగుకు సంబంధించి నెలకొన్న సానుకూల సెంటిమెంట్‌తో ఎగుమతుల ఆదాయం 8–9 శాతం పెరుగుతుందని పేర్కొంది. అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడం, ఉత్పత్తులు వెనక్కి రావడం, సాగు సన్నద్ధత వంటి అంశాలు దేశీయ డిమాండ్‌కు సమస్యలుగా ఉన్నట్టు తెలిపింది.‘‘రెండు సంవత్సరాల స్థిరీకరణ తర్వాత ఆగ్రో కెమికల్స్‌ రంగంలో ఆదాయం 2025–26లో 6–7 శాతం పెరగొచ్చు. ఇది కూడా ధరల పెంపు ద్వారా కాకుండా అధిక అమ్మకాల రూపంలో రానుంది’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేతి తెలిపారు. ఇన్వెంటరీలు (స్టాక్‌ నిల్వలు) కూడా సాధారణ స్థాయికి చేరడం ఆదాయం వృద్ధికి అనుకూలిస్తుందని చెప్పారు.ఇక ఆగ్రోకెమికల్స్‌ పరిశ్రమ తన దీర్ఘకాల వృద్ధి అయిన 8–10 శాతానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది. అయితే, ఎగుమతులు స్థిరంగా కొనసాగడం, దేశీ డిమాండ్‌ పుంజుకోవడంపై ఈ వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. పరిశ్రమ ఆదాయంలో దేశీ, విదేశీ మార్కెట్లో చెరో సగం వాటా కలిగి ఉన్నట్టు తెలిపింది. ముడి సరుకుల ధరలు స్థిరంగా ఉండడం, అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో నిర్వహణ మార్జిన్లు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక శ్రేణి పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది.రుణ భారం నియంత్రణలోనే.. తక్కువ మూలధన వ్యయాలు, స్థిరమన మూలధన నిధులతో ఆగ్రో కెమికల్‌ కంపెనీల రుణభారం నియంత్రణల్లోనే ఉంటుందని, దీంతో రుణ పరపతిని మెరుగ్గా కొనసాగొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది. లాక్‌డౌన్‌ అనంతరం పేరుకున్న నిల్వలు తగ్గిపోవడంతో దేశీయంగా ఆగ్రోకెమికల్స్‌ ధరలు స్థిరపడినట్టు తెలిపింది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆగ్రో కెమికల్‌Šస్‌పై కిలోకి 5 డాలర్ల ప్రయోజనం ఒనగూరుతోందని, గతేడాది స్థాయిలోనే ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇదే కొనసాగొచ్చని అంచనా అంచనా వ్యక్తం చేసింది. నిల్వలు తగ్గడం, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో సరఫరాలు స్థిరపడతాయని పేర్కొంది.‘‘ఆగ్రో కెమికల్స్‌ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 12.5–13 శాతంగా ఉండొచ్చు. అయినప్పటికీ కరోనా ముందున్న 15 శాతం కంటే తక్కువే. 2024లో ప్రతికూలతల అనంతరం ఈ స్థిరత్వం నెలకొంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు ఇందుకు అనుకూలిస్తున్నాయి. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఏటా రూ.5,500 కోట్ల పెట్టుబుడులు పెడుతుండడం, కొత్త ఉత్పత్తుల రిజి్రస్టేషన్లు, క్రమశిక్షణతో కూడిన మూలధన నిధుల నిర్వహణ వంటివి.. రుణ అవసరాలను తక్కువకు పరిమితం చేస్తాయి’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ఉపాధ్యాయ వివరించారు.అయినప్పటికీ ఈ రంగం పనితీరుపై వాతావరణ మార్పులు, నియంత్రణలను కఠినతరం చేయడం, రూపాయి మారకం విలువల ప్రభావాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.

India bankruptcy regime gains global boost4
భారత దివాలా చట్టం భేష్‌ 

న్యూఢిల్లీ: భారత్‌ దివాలా పరిష్కార చట్టానికి (ఐబీసీ) ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ కితాబిచి్చంది. అధికారిక ర్యాంకింగ్‌ మదింపును సవరించింది. దివాలా పరిష్కార కార్యాచరణ రుణదాతలకు స్నేహపూర్వకంగా ఉండడాన్ని గుర్తించింది. భారత్‌లో దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) రుణ క్రమశిక్షణను బలోపేతం చేసిందని, పరిష్కార ప్రక్రియను రుణదాతలకు అనుకూలంగా మార్చిందని ఎస్‌అండ్‌పీ తన నివేదికలో పేర్కొంది. గతంలో దివాలా పరిష్కార విధానాలకు భిన్నంగా ఐబీసీ కింద సంక్షోభంలోని కంపెనీల ప్రమోటర్లు తమ వ్యాపారాలపై నియంత్రణ కోల్పోతున్నట్టు వివరించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత దివాలా పరిష్కార చట్టానికి అధికారిక ర్యాంకింగ్‌ మదింపును గ్రూప్‌–సి నుంచి గ్రూప్‌–బికి మారుస్తున్నట్టు ప్రకటించింది. రుణదాతలకు స్నేహపూర్వకంగా ఉన్న దివాలా పరిష్కార ప్రక్రియను బలహీనం నుంచి మధ్యస్థానికి మెరుగుపరిచిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిపింది. ఐబీసీ కింద రుణదాతల ఆధ్వర్యంలో విజయవంతమైన పరిష్కారాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది. రుణాల వసూళ్లు, రికవరీ రేటు మెరుగుపడ్డాయని.. సగటు రుణ వసూలు గత చట్టం కింద ఉన్న 15–20 శాతం నుంచి ఐబీసీ కింద 30 శాతానికి పెరిగినట్టు తెలిపింది. గతంలో ఒక్కో కేసు పరిష్కారానికి ఆరు నుంచి ఎనిమిదేళ్ల సమయం తీసుకోగా, ఐబీసీ కింద రెండేళ్లకు తగ్గినట్టు ఎస్‌అండ్‌పీ పేర్కొంది. అధికార ర్యాంకింగ్‌ మదింపు అన్నది.. ఒక దేశ దివాలా చట్టం కింద రుణదాతలకు ఉన్న భద్రతను సూచిస్తుంటుంది.

White collar hiring picks up pace in November 20255
నవంబర్‌లో హైరింగ్‌ జోరు 

ముంబై: దేశీయంగా నవంబర్‌లో వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు (మేనేజర్, అకౌంటెంట్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ మొదలైనవి) సంబంధించిన నియామకాలు పుంజుకున్నాయి. వార్షికంగా 23 శాతం పెరిగాయి. నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం ముఖ్యంగా విద్య, రియల్‌ ఎస్టేట్, ఆతిథ్య, పర్యాటక, బీమా లాంటి ఐటీయేతర రంగాల్లో హైరింగ్‌ గణనీయంగా నమోదైంది. నౌకరీడాట్‌కామ్‌లో కొత్త జాబ్‌ లిస్టింగ్స్, రిక్రూటర్ల సెర్చ్‌లను విశ్లేíÙంచిన మీదట దేశీయంగా జాబ్‌ మార్కెట్‌ ధోరణులపై ఈ రిపోర్ట్‌ రూపొందింది. దీన్ని బట్టి చూస్తే గత నెల ఐటీ రంగంలో హైరింగ్‌ పెద్దగా పెరగలేదు. విద్య (44 శాతం), రియల్‌ ఎస్టేట్‌ (40 శాతం), ఆతిథ్య/పర్యాటకం (40 శాతం), బీమా (36 శాతం) రంగాల్లో అత్యధికంగా రిక్రూట్‌మెంట్‌ నమోదైంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. → యూనికార్న్‌లలో (1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ గల సంస్థలు) నియామకాలు 35 శాతం పెరిగాయి. అలాగే అధిక విలువ చేసే ప్యాకేజీలుండే (వార్షికంగా రూ. 20 లక్షలు) ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ 38 శాతం పెరిగింది. ఈ–కామర్స్‌ సంస్థల్లో 27 శాతం, ఐటీ యూనికార్న్‌లలో 16 శాతం వృద్ధి నమోదైంది. → ప్రాంతీయంగా చూస్తే చెన్నై (49 శాతం), హైదరాబాద్‌ (41 శాతం), ఢిల్లీ/ఎన్‌సీఆర్‌ (41 శాతం)లో అత్యధికంగా హైరింగ్‌ నమోదైంది. 13–16 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ల రిక్రూట్‌మెంట్‌ యూనికార్న్‌లలో 50 శాతం ఎగిసింది. → దేశవ్యాప్తంగా ఎంట్రీ–స్థాయి హైరింగ్‌ 30 శాతం పెరిగింది. మెట్రోయేతర నగరాలు దీనికి సారథ్యం వహించాయి. అహ్మదాబాద్‌ (41 శాతం) అగ్రస్థానంలో ఉండగా కోయంబత్తూర్‌ (32 శాతం), జైపూర్‌ (31 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగళూరులాంటి కీలక మెట్రో హబ్‌లు వరుసగా 29 శాతం, 26 శాతం వృద్ధి కనపర్చాయి. → గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో హైరింగ్‌ 18 శాతం పెరిగింది. ముఖ్యంగా డేటా సైంటిస్టులు (49 శాతం), సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌లు (45 శాతం), ఫుల్‌ స్టాక్‌ డెవలపర్లు (36 శాతం), డేటా ఇంజినీర్లకు (33 శాతం) డిమాండ్‌ నెలకొంది. స్ట్రాటెజీ, మేనేజ్‌మెంట్‌ కన్సలి్టంగ్‌ జీసీసీల్లో హైరింగ్‌ 50 శాతం, ఐటీ రంగ జీసీసీల్లో 9 శాతం మేర నియామకాలు పెరిగాయి. → చిన్న వ్యాపారాలు సైతం డిజిటల్‌ నిపుణులను నియమించుకునే ధోరణి పెరుగుతోంది.

RBI three days MPC review begins 3 Dec 20256
మొదలైన ఆర్‌బీఐ ఎంపీసీ 

ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చన్న అంచనాల మధ్య కొనసాగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం కనిష్టాలకు చేరి, జీడీపీ వృద్ధి బలపడడం, రూపా యి మారకం విలువ ఆల్‌టైమ్‌ కనిష్టాలకు పతనమైన సమయంలో జరుగుతున్న ఎంపీసీ భేటీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. కొందరు విశ్లేషకులు పావు శాతం రేటు కోతను అంచనా వేస్తుంటే, యథాతథ స్థితినే కొనసాగించొచ్చని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ ఎంపీసీ తన నిర్ణయాలను శుక్రవారం (5న) ఉదయం వెల్లడించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్‌బీఐ రెపో రేటును 1% తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే. ‘‘డిసెంబర్‌లో రెపో రేటు 0.25% తగ్గింపు ఉంటుందని అంచనా వేస్తున్నాం. వృద్ధి బలంగా ఉంది. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యో ల్బణం గణనీయంగా తగ్గింది. దీంతో రేట్ల కోతకు అదనపు వెసులుబాటు లభించింది’’అని క్రిసిల్‌ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకృతి జోషి తెలిపారు. వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సైతం గత నెలలో సంకేతం ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement