Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AI will be India next Y2K moment, no threat to jobs Says Piyush Goyal1
ఏఐతో మరిన్ని అవకాశాలు 

ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయనే భయపడనక్కర్లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ చెప్పారు. దీనితో ఉద్యోగ విధుల స్వభావం మాత్రమే మారుతుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. దేశీయంగా ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం గురించి తనకెలాంటి ’ఆందోళన’ లేదని ఆయన చెప్పారు. 2000లో వై2కే సమస్య తలెత్తినప్పుడు భారత్‌కి ఎలాగైతే మంచి అవకాశాలు లభించాయో, అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని మంత్రి తెలిపారు. 60 లక్షల ఉద్యోగాలు, 315 బిలియన్‌ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరింత మెరుగ్గా మారడానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీని వినియోగించే కొద్దీ మానవ నైపుణ్యాలు, ప్రతిభావంతుల అవసరం మరింతగా పెరుగుతుందని, తద్వారా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. ఏఐతో లాభాలు, ఎగుమతులు పెరుగుతాయని, 23 లక్షలకు పైగా సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథ్స్‌ గ్రాడ్యుయేట్స్‌ వీటిని అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఇటీవల కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోవలోనే ప్రపంచంతో భారత్‌ మరింతగా అనుసంధానమయ్యేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.

Sebi introduces life cycle funds2
కొత్తగా లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ 

న్యూఢిల్లీ: సొల్యూషన్స్‌ ఓరియెంటెడ్‌ ఫండ్స్‌ విభాగాన్ని సెబీ నిలిపివేసింది. కొత్తగా లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ను ప్రవేశపెట్టింది. పేరుకు తగ్గట్టు పెట్టుబడుల విధానం ఉండేలా చూడడం, పథకాల పేరుతో అత్యధిక రాబడుల హామీలను నిరోధించడం తదితర లక్ష్యాలతో సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వర్గీకరణ విషయంలో కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల పథకాలను ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, లైఫ్‌ సైకిల్, ఇతర పథకాలు (ఫండ్‌ ఆఫ్‌ ఫండ్, ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు) పేరుతో మొత్తం ఐదు విభాగాలుగా వర్గీకరించింది. ‘‘ఇన్వెస్టర్లు సులభంగా అర్థం చేసుకునేందుకు, ఒక విభాగంలో అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల మధ్య పథకాల్లో ఏకరూపత కోసం, పేరుకు తగినట్టుగా పథకాలు ఉండేందుకు, పథకం రాబడులను సూచించే విధంగా పథకాలకు పేర్లు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నట్టు సెబీ ప్రకటించింది. సొల్యూషన్‌ ఫండ్స్‌ సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ ఫండ్స్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్టు సెబీ ప్రకటించింది. ఈ పథకాలకు సంబంధించి కొత్త చందాలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ విభాగంలో ఉన్న పథకాలను, ఇదే మాదిరి పెట్టుబడులు, రిస్క్‌ ప్రొఫైల్‌ కలిగిన పథకాల్లో అనుమతి అనంతరం విలీనం చేయాలని పేర్కొంది. విదేశీ సెక్యూరిటీలను ఇకపై ఎంత మాత్రం ప్రత్యేకమైన అసెట్‌ క్లాస్‌గా పరిగణించరు. లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ కొత్తగా ఓపెన్‌ ఎండెడ్‌ లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ విభాగాన్ని సెబీ ప్రవేశపెట్టింది. ముందుగా నిర్ణయించిన కాల వ్యవధిపై.. ఈక్విటీ, డెట్, ఇన్విట్, ఈటీసీడీ, బంగారం/వెండి ఈటీఎఫ్‌ల వారీ లక్ష్యం ఆధారిత పథకాలను ఆఫర్‌ చేయొచ్చు. కాల వ్యవధి ముగియడానికి ముందు నుంచి క్రమంగా ఈక్విటీ పెట్టుబడులను తగ్గించుకుంటూ, డెట్‌కు పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. → ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు తమ నిర్వహణ ఆస్తుల్లో 95 శాతం మేర సంబంధిత సూచీలోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. → అలాగే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌) అన్నవి వాటి అంతర్లీన ఫండ్‌లోనే 95 శాతం ఇన్వెస్ట్‌ చేయాలి. → ఐదేళ్లలోపు గడువు ముగిసే ఫండ్స్‌లో డెట్‌ పెట్టుబడులు అన్నవి ఏఏ లేదా అంతకంటే మెరుగైన రేటింగ్‌ సాధనాల్లోనే ఉండాలి. → ఇకపై మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ విభాగాల వారీగా పోర్ట్‌ఫోలియో ఓవర్‌ల్యాప్‌ ఎంత స్థాయిలో ఉందన్నది వెల్లడించాలి. అంటే వివిధ పథకాలు ఒకే కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటే, అది ఎంత మేరో తెలియజేయాలి. ఇలా ఈక్విటీ–ఈక్విటీ.. డెట్‌–డెట్‌ పథకాల మధ్య పోర్ట్‌ఫోలియో ఓవర్‌ల్యాప్‌ వివరాలను వెల్లడించాలి. → దేశీ, విదేశీ, హైబ్రిడ్, డెట్, ఈక్విటీ, కమోడిటీ, థీమ్యాటిక్‌ విభాగాల్లో పేర్లకు సంబంధించి ప్రామాణిక విధానాన్ని, పరిమితులను తీసుకొచ్చింది. ప్రస్తుత పథకాలకు ఈ నిబంధనలను అమలు చేయడానికి సెబీ ఆరు నెలల సమయం ఇచి్చంది. → యాక్టివ్‌ ఫండ్స్‌ నిబంధనల మేరకు తమ ప్రాధాన్య కేటాయింపులు పోను, మిగిలిన మొత్తం నుంచి 35 శాతాన్ని బంగారం, వెండి ఈటీఎఫ్‌లు, ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లకు కేటాయించుకోవచ్చు. సులభతరం.. రిటైల్‌ ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవడంలో సంక్లిష్టతను తొలగించి, సులభతరానికి కొత్త నిబంధనలు వీలు కలి్పస్తాయని చాయిస్‌ వెల్త్‌ సీఈవో నికుంజ్‌ సరాఫ్‌ పేర్కొన్నారు.

India IPO Market Faces Slowdown 20263
ఐపీఓ రివర్స్‌ గేర్‌!

గత రెండు మూడేళ్లుగా రికార్డుల హోరుతో దలాల్‌ స్ట్రీట్‌లో దుమ్మురేపిన ఐపీఓ మార్కెట్‌.. కొత్త ఏడాదిలో కళతప్పుతోంది. ఈ ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీల షేర్లలో చాలా వరకు ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయి ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. అంతేకాదు, అరంగేట్రంలో తుస్సుమనిపిస్తుండటంతో లిస్టింగ్‌ లాభాల కోసం ప్రైమరీ మార్కెట్‌ వెంటపడే మదుపరులకు నిరాశ తప్పడం లేదు.ఏదైనా కంపెనీ ఐపీఓకు వస్తోందంటే మార్కెట్లో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలెత్తేది. బంపర్‌ లిస్టింగ్‌లతో ఇన్వెస్టర్లకు లాభాల పంటే. మరిప్పుడో.. లాభాల సంగతి అటుంచితే.. ఎరక్కపోయి ఇరుక్కుపోయాం అంటూ ఇన్వెస్టర్లు గగ్గోలు పెట్టే పరిస్థితి. 2026లో ఇప్పటిదాకా ప్రధాన ఎక్సే్చంజీల తో పాటు ఎస్‌ఎంఈ ప్లా ట్‌ఫామ్‌లో 32 కంపెనీ లు నిధుల సమీకరణ చేపట్టాయి. ఇందులో 11 కంపెనీలు నష్టా లతో అరంగేట్రం చేశాయి. 21 కంపెనీలు లాభాలతో లిస్టయినప్పటికీ.. చివరికి తొలిరోజున లాస్‌లోనే ముగిశాయి. అన్నింటికంటే అందోళనకరమైన అంశం ఏంటంటే.. 60% (19) కంపెనీల షేర్లు ఇప్పుడు ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోవడం రివర్స్‌ ట్రెండ్‌కు అద్దం పడుతోంది.గతేడాది ఘనం... ఈ ఏడాది ఇప్పటిదాకా ప్రీమియంతో లిస్టయిన 21 కంపెనీల్లో కేవలం 8 కంపెనీల షేర్లు మాత్రమే రెండంకెల్లో లాభాలు అందించాయి. గతేడాది ఇదే కాలంలో 18 స్టాక్స్‌ రెండంకెల వృద్ధితో అరంగేట్రం చేశాయి. మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్‌ను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో సగటు లిస్టింగ్‌ లాభం 8% కావడం దీనికి నిదర్శనం. కాగా, ఎస్‌ఎంఈ విభాగంలో లిస్టయిన అన్ని రంగాల్లోనూ ఈ ఏడాది ప్రతికూల పనితీరు కనబడుతోంది. అన్నింటికంటే తీవ్రంగా యజూర్‌ ఫైబర్స్‌ షేరు ఐపీఓ ధరతో పోలిస్తే 70 శాతం దిగువన ట్రేడవుతోంది. అరిటాస్‌ వినైల్, నర్మదేష్‌ బ్రాస్‌ ఇండస్ట్రీస్, విక్టరీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్, ఆర్మర్‌ సెక్యూరిటీ, కనిష్క్‌ అల్యూమినియం షేర్లు ఇష్యూ ధరతో పోలిస్తే 42%–66% కిందికి జారడం ఎస్‌ఎంఈ కౌంటర్లో కరెక్షన్‌ తీవ్రతను సూచిస్తోంది. ప్రధాన ఇష్యూలు అంతంతే.. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ప్రధాన ఎక్సే్చంజీల్లో (మెయిన్‌ బోర్డ్‌) ఐపీఓల జోరు కూడా తగ్గింది. కేవలం 5 కంపెనీలు మాత్రమే లిస్టింగ్‌ బాట పట్టాయి. ఇందులో కేవలం రెండు కంపెనీలు.. భారత్‌ కోకింగ్‌ కోల్‌ (44.6% లాభం), అమాగీ మీడియా ల్యాబ్స్‌ (6.9%) మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇష్యూ ధరతో పోలిస్తే ఫ్రాక్టల్‌ ఎనలిటిక్స్‌ 10.1%, ఆయ్‌ ఫైనాన్స్‌ 1% షాడోఫ్యాక్స్‌ టెక్నాలజీస్‌ 4.3% నష్టాల్లో ఉన్నాయి. కాగా, 2025 తొలి రెండు నెలల్లో 50 లిస్టింగ్‌లు నమోదు కాగా, ఈ ఏడాది 32 ఇష్యూలు మార్కెట్లను తాకాయి. పబ్లిక్‌ ఆఫర్ల పరంగా 2025లో రికార్డుల మోత మోగింది. ఏకంగా 373 ఐపీఓలు వరుసకట్టాయి. ఇందులో 270 ఎస్‌ఎంఈ ఇష్యూలు కాగా, 103 మెయిన్‌ బోర్డ్‌ లిస్టింగ్‌లు ఉన్నాయి. అయితే, 2024లో అత్యధికంగా సగటు లిస్టింగ్‌ లాభాలు 49% నమోదయ్యాయి. 2025లో ఇది 10.6 శాతంగా ఉంది.మెరుపులు రెండే.. మొత్తం 32 లిస్టెడ్‌ కంపెనీల్లో 13 స్టాక్స్‌ మాత్రమే ఇష్యూ ధరపైన కదలాడుతున్నాయి. ఇందులో గ్రోవర్‌ జ్యుయెల్స్‌ ఐపీఓ ఇన్వెస్టర్లకు 95 శాతం లాభాలను పంచింది. కేఆర్‌ఎం ఆయుర్వేద, అక్రిషన్‌ న్యూట్రేవేద, భారత్‌ కోకింగ్‌ కోల్‌ వరుసగా 52%, 49%, 45% చొప్పున దూసుకెళ్లాయి. భారత్‌ కోకింగ్‌ కోల్‌ (97.5%), ఈ టూ ఈ ట్రాన్స్‌పోర్టేషన్‌ (90%).. లిస్టింగ్‌లో జిగేల్‌మన్నవి ఈ రెండే. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో లిస్టింగ్‌లను చూస్తే, ఆరు కంపెనీల షేర్లు 90% పైగా ప్రీమియంతో బంపర్‌ లాభాలందించడం విశేషం.– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Common Driving Mistakes That Damage Your Car Braking System4
అందుకే.. బ్రేకింగ్ సిస్టం డ్యామేజ్ అవుతుంది!

ఒక కారులో సేఫ్టీ అంటే.. అందులోనే సేఫ్టీ ఫీచర్స్ మాత్రమే కాదు. బ్రేకింగ్ సిస్టం చాలా అవసరం. ఎయిర్ కండిషనింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు & పవర్ విండోస్ వంటి వాటిలో సమస్య తలెత్తితే పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ బ్రేకింగ్ సిస్టం దెబ్బతింటే మాత్రం అది వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తలపెడుతుంది.బ్రేక్స్ అనేవి వాహనాన్ని ఆపడానికి మాత్రమే కాకుండా.. దానిని కంట్రోల్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి వేడి, ఒత్తిడి మధ్య పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే సరైన డ్రైవింగ్ & నిర్వహణ, బ్రేకింగ్ సిస్టమ్ పనితీరును మెరుగుపరచవచ్చు. బ్రేకింగ్ సిస్టం తొందరగా డ్యామేజ్ కావడానికి కారణాలు ఏమిటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.➤హార్డ్ బ్రేకింగ్: అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ప్యాడ్లు, డిస్కులు తొందరగా నశిస్తాయి.➤ఓవర్ స్పీడ్ డ్రైవింగ్: ఎక్కువ స్పీడ్‌లో కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల బ్రేక్స్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.➤ఓవర్‌లోడింగ్: వాహనంపై అధిక బరువు వేయడం బ్రేక్ భాగాలపై అదనపు ఒత్తిడి పెడుతుంది.➤క్వాలిటీ లేని బ్రేక్ ప్యాడ్లు: నాసిరకం లేదా డుప్లికేట్ భాగాలు త్వరగా దెబ్బతింటాయి.➤బ్రేక్ ఫ్లూయిడ్ సమస్యలు: ఫ్లూయిడ్ తక్కువగా ఉండటం, లీక్ అవడం వల్ల కూడా బ్రేకింగ్ పనితీరు తగ్గుతుంది.➤కాలిపర్ స్టికింగ్: బ్రేక్ కాలిపర్ సరిగా రిలీజ్ కాకపోతే ప్యాడ్లు ఎప్పుడూ డిస్క్‌ను తాకుతూ ఉంటాయి, దీంతో వేగంగా వేర్ అవుతుంది.➤డిస్క్/డ్రమ్ వంకర పడటం: అధిక వేడి లేదా నీటిలో నడపడం వల్ల డిస్కులు వంకరపడే అవకాశం ఉంది.➤మలినాలు చేరడం: బ్రేక్ భాగాల మధ్య మలినాలు చేరితే ఘర్షణ పెరిగి తొందరగా పాడవుతాయి.➤సర్వీసింగ్: సమయానికి చెక్ చేసి సర్వీస్ చేయకపోవడం, ప్యాడ్లు మార్చకపోవడం వల్ల ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి.➤డ్రైవింగ్ అలవాట్లు: గేర్ తగ్గించకుండా బ్రేక్‌లపై మాత్రమే ఆధారపడటం, హాఫ్-క్లచ్ డ్రైవింగ్ వంటి అలవాట్లు బ్రేక్‌ల జీవితం తగ్గిస్తాయి.

Mindspace REIT to Invest Rs 350 Crore in Hyderabad Luxury Hotel5
హైదరాబాద్‌లో రూ.350 కోట్లతో లగ్జరీ హోటల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ హైదరాబాద్‌లో దాదాపు రూ. 350 కోట్లతో లగ్జరీ హోటల్‌ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. దీన్ని చాలెట్‌ హోటల్స్‌కి ప్రీ–లీజుకి ఇచ్చినట్లు తెలిపింది. 5.3 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాజెక్టులో 330 గదులు ఉంటాయి. 2027–28 నాలుగో త్రైమాసికంలో ఇది పూర్తయ్యే అవకాశం ఉందని మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ తెలిపింది.ఇరు సంస్థల మధ్య ఒప్పందం ప్రకారం మైండ్‌స్పేస్‌ రీట్‌కి చెందిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ సంస్థ సదరు ప్రాపరీ్టని స్థూలంగా నిర్మించి ఇస్తుంది. ఇంటీరియర్స్, హోటల్‌ నిర్వహణ మొదలైన పనులను చాలెట్‌ చేపడుతుంది. ప్రస్తుతం చాలెట్‌కి మొత్తం మీద 3,300 గదుల పోర్ట్‌ఫోలియో ఉంది. మైండ్‌స్పేస్‌ రీట్‌కి హైదరాబాద్‌తో పాటు ముంబై, పుణె చెన్నైలలో ఆఫీస్‌ అసెట్స్, బిజినెస్‌ పార్క్‌లు ఉన్నాయి.

Honda Activa Achieves 5 Million Unit Sales In Maharashtra6
యాక్టివాకు ఫుల్ డిమాండ్.. ఒక్క రాష్ట్రంలోనే 50 లక్షల సేల్స్!

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా కంపెనీకి చెందిన యాక్టివాకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా మంచి అమ్మకాలు పొందిన ఈ టూవీలర్.. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే 50 లక్షల సేల్స్ సాధించింది.హోండా యాక్టివా స్కూటర్ 25 సంవత్సరాల్లో 50 లక్షల (ఒక్క మహారాష్ట్రలో మాత్రమే) అమ్మకాలను సాధించింది. కంపెనీ ప్రకారం.. పూణే, ముంబై, థానే, నాగ్‌పూర్ & నవీ ముంబై వంటి ప్రధాన నగరాల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ స్కూటర్‌కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.హోండా యాక్టివామార్కెట్లో హోండా యాక్టివా రెండు మోడల్స్‌లో లభిస్తోంది. ఒకటి యాక్టివా 6జీ (110సీసీ), యాక్టివా 125 (125సీసీ). యాక్టివా 6జీ ధర సుమారు రూ.81,000 నుంచి రూ. 95,500 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. యాక్టివా 125 ధరలు రూ.91000 నుంచి రూ.96000 (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది.యాక్టివా 6జీ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ ద్వారా 7.8 పీఎస్ పవర్, 8.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. యాక్టివా 125 మోడల్ 123.92 సీసీ ఇంజిన్ ద్వారా 9.5 పీఎస్ పవర్, 11.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Advertisement
Advertisement
Advertisement