Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Emergency Quota in Train Do Yo Know Who is Eligible and How Indian Railways Approves It1
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా.. వీటిని ఎవరికి ఇస్తారంటే?

రైలు ప్రయాణం చేయాలనుకునేవారికి అతిపెద్ద సమస్య టికెట్ కర్ఫర్మ్‌. పండుగలు, సెలవుల్లో ట్రైన్ టికెట్ కర్ఫర్మ్‌ అవ్వడం అనేది చాలా కష్టం. తత్కాల్ టికెట్లు సైతం కొన్నిసార్లు కష్టమైపోతాయి. అయితే ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా ఒకటి ఉంటుందని బహుశా చాలా మందికి తెలుసుండకపోవచ్చు. దీనిని బుక్ చేసుకోవడానికి ఎవరు అర్హులు?, ఎవరికి కేటాయిస్తారు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా.. అనేది అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక రిజర్వేషన్ విధానం. ఇది సాధారణ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండదు. ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని నిర్దిష్ట వర్గాల వారికి మాత్రమే ఈ కోటా ద్వారా టికెట్లు మంజూరు చేయడం జరుగుతుంది.భారతీయ రైల్వే.. ప్రతిరోజూ అనేక మంది ప్రయాణికుల నుంచి అత్యవసర ప్రయాణ అభ్యర్థనలు స్వీకరిస్తుంది. అలాంటి సందర్భాల్లో.. ముఖ్యమైన వ్యక్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం కొన్ని సీట్లు ముందుగానే కేటాయిస్తుంది. ఈ సీట్లనే ఎమర్జెన్సీ కోటా అంటారు. ఇది ప్రతి రైలులో, ప్రతి క్లాస్‌లో ఉండకపోవచ్చు. కానీ అవసరాన్ని బట్టి కొన్ని రైళ్లు, కొన్ని తరగతుల్లో మాత్రమే పరిమితంగా ఉంటుంది.రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ కోటా ప్రధానంగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ (HOR) హోల్డర్ల కోసం ఏర్పాటు చేశారు. వీరిలో కేంద్ర ప్రభుత్వ మంత్రులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు, పార్లమెంట్ సభ్యులు ఉంటారు. వీరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు, వారి అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ఈ కోటా ఉపయోగిస్తారు.ఉన్నతాధికారులకు మాత్రమే కాకుండా.. రైల్వే శాఖ ఇతర అత్యవసర అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో కుటుంబంలో మరణం, తీవ్రమైన అనారోగ్యం, ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిన పరిస్థితులు మొదలైనవి ఉన్నాయి. అంటే వీరికి కూడా ఎమర్జెన్సీ కోటా కింద సీటు అందిస్తారన్నమాట.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే.. భారతీయ రైల్వేకు ప్రతిరోజూ అనేక స్థాయిల నుంచి అనేక అభ్యర్థనలు వస్తుంటాయి. ఇందులో ఏ అభ్యర్థనకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాధాన్యతను 'వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్' అనే నియమావళి ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే.. పదవి, హోదా, అధికార స్థాయి ఆధారంగా ప్రాధాన్యత క్రమం ఉంటుంది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎమర్జెన్సీ కోటా సీట్లు ముందుగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ హోల్డర్లు & పార్లమెంట్ సభ్యుల స్వంత ప్రయాణానికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అది కూడా వారి హోదా ప్రకారం ఉన్న సీనియారిటీ క్రమాన్ని ఖచ్చితంగా పాటిస్తూ కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్లు ఇతర అభ్యర్థనలను పరిశీలించి.. ప్రయాణికుల అధికారిక హోదా, ప్రయాణ అత్యవసరత వంటి అంశాలను బట్టి కేటాయిస్తారు.ఎమర్జెన్సీ కోటా సెల్స్.. అనేవి జోనల్ & డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో, అలాగే కొన్ని ముఖ్యమైన నాన్ హెడ్‌క్వార్టర్ స్టేషన్లలో ఉంటాయి. ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు, రైల్వే బోర్డు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ కోటా కింద సీట్లు కేవలం రాతపూర్వకంగా వచ్చిన అధికారిక అభ్యర్థనల ఆధారంగానే మంజూరు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు స్పష్టం చేసింది. అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్న, ముఖ్యమైన బాధ్యతలు కలిగిన వ్యక్తుల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక సౌకర్యం.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

Stock Market Closing Update 10th Feb 20262
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్

మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 208.17 పాయింట్ల (0.25 శాతం) లాభంతో 84,273.92 వద్ద, నిఫ్టీ 67.85 పాయింట్ల (0.26 శాతం) లాభంతో 25,935.15 వద్ద ఉన్నాయి.పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్, లుమాక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లక్ష్మి కోట్స్‌పిన్ లిమిటెడ్, క్షితిజ్ పాలీలైన్ లిమిటెడ్, ఏబీఎమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్‌టైల్స్ మిల్స్ లిమిటెడ్, కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, జూబిలెంట్ అగ్రి అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, స్పేస్‌నెట్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Latest Tweet About Silver Price3
వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో తాను 600 సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు.ఇటీవల నేను మరో 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేశాను. ఈ రోజు వెండి స్పాట్ ధర ఒక ఔన్సుకు 82 డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనిస్తే, భవిష్యత్తులో వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందని నా నమ్మకం. ముఖ్యంగా 2026లో వెండి ధర ఒక్క ఔన్సుకు 200 డాలర్లకు చేరుకోవచ్చు, లేదా దానికంటే కూడా ఎక్కువ కావచ్చు అని నేను భావిస్తున్నాను.ఇప్పటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ స్థితి ఆందోళనకరంగా మారుతోంది. అధిక రుణాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల డాలర్ విలువ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ (ఫియట్ కరెన్సీ)పై మాత్రమే ఆధారపడే వారు భవిష్యత్తులో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.Just purchased another 600 US Silver Eagles.Today’s spot is $82 an ounce. Still believe silver will reach $200 an ounce….or more…. in 2026.The US dollar is in trouble.Savers of fiat currency (fake $) biggest losersTake care.— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026ఫియట్ కరెన్సీ విలువ అనేది.. కేవలం ప్రభుత్వ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ వెండి, బంగారం వంటి విలువైన లోహాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవి ద్రవ్యోల్బణం నుంచి సంపదను కాపాడే సాధనాలుగా పని చేస్తాయి. అందుకే కరెన్సీ విలువ తగ్గుతున్న సమయంలో నిజమైన ఆస్తులైన.. వెండి వంటి లోహాల్లో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం అని కియోసాకి పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఆర్థిక అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం డబ్బును దాచుకునేవారి కంటే.. నిజమైన విలువ ఉన్న ఆస్తుల్లో (బంగారం, వెండి మొదలైనవి) పెట్టుబడి పెట్టినవారే లాభపడతారు. ఈ విషయాన్ని గమనించి, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి, అని కియోసాకి ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియోసాకి ఒకేసారి 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేయడంతో.. వెండి రేటు తప్పకుండా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. కాగా.. ఇండియన్ మార్కెట్లో కూడా వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. నేడు (ఫిబ్రవరి 10) కేజీ రేటు రూ.3 లక్షలకు చేరుకుంది. అంటే ఒక గ్రాము 300 రూపాయలన్నమాట. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

How GST strongly taken root perception of a complex challenge4
జీఎస్టీ అంటే భయమేలా?

దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి ఏడేళ్లు దాటినా సామాన్య పన్ను చెల్లింపుదారులు, చిరు వ్యాపారుల్లో దీనిపై నెలకొన్న ఆందోళనలు తగ్గడం లేదు. జీఎస్టీ అంటే కేవలం పన్ను విధానం మాత్రమే కాదు, అది ఒక క్లిష్టమైన సవాల్ అనే భావన బలంగా నాటుకుపోయింది. నిజాయితీగా వ్యాపారం చేసే వారు కూడా నోటీసులు వస్తాయేమోనని భయపడే పరిస్థితి ఎందుకు ఉంది? ప్రభుత్వం నుంచి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇక్కడ చూద్దాం.జీఎస్టీ ఎందుకు భారంగా అనిపిస్తోంది?చాలా మంది వ్యాపారులు జీఎస్టీ వ్యవస్థను తమకు సహకరించే వ్యవస్థగా కాకుండా కేవలం పన్ను వసూలు చేసే యంత్రాంగంగా మాత్రమే చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు..ఆదాయపన్ను రిటర్న్ దాఖలులో చిన్న పొరపాటు జరిగినా లేదా ఆలస్యమైనా ఏటా 18% వడ్డీ భారం పడుతుంది. ఇది చిన్న వ్యాపారుల లాభాలను దెబ్బతీస్తోంది.కొనుగోలుదారు, విక్రేత ఇచ్చే లెక్కల్లో స్వల్ప తేడాలున్నా (జీఎస్టీఆర్‌-2బీ vs 3బీ) సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది.క్షేత్రస్థాయిలో తప్పులు జరిగినప్పుడు సరిదిద్దే మార్గాల కంటే శిక్షించే నిబంధనలే ఎక్కువగా ప్రచారంలో ఉండటం భయానికి కారణం.నోటీసు అంటే భయపడాలా?వ్యాపారులకు జీఎస్టీ నోటీసు అందగానే అదొక క్రిమినల్ కేసులా భావిస్తుంటారు. అధిక శాతం నోటీసులు అధికారులు స్వయంగా పంపేవి కావు. సాఫ్ట్‌వేర్ ద్వారా డేటాలో తేడాలను గుర్తించి జారీ అయ్యే స్క్రూటినీ నోటీసులు ఎక్కువగా ఉంటాయి. నోటీసు అంటే కేవలం వివరణ కోరడం మాత్రమే. సరైన ఆధారాలు చూపిస్తే చాలా వరకు సమస్యలు అక్కడితోనే ముగుస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. జీఎస్టీ ప్రారంభ దశలో (2017-19) జరిగిన చిన్న పొరపాట్లకు వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపులు కూడా ఇచ్చారు.జీఎస్టీ చట్టం కింద విధించే జరిమానాల విషయంలో పన్ను చెల్లింపుదారులు అనవసర ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే చట్టం పొరపాట్లకు, మోసాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా అవగాహన లోపం వల్ల జరిగే సాధారణ తప్పుల విషయంలో శిక్షలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 10 శాతం లేదా రూ.10,000.. వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. ఇది కేవలం పన్ను చెల్లింపుదారుడిని క్రమశిక్షణలో ఉంచడానికి ఉద్దేశించిన చర్య మాత్రమే.అయితే, పన్నును ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టాలని చూసినా లేదా తప్పుడు లెక్కలతో వ్యవస్థను మోసం చేయాలని ప్రయత్నించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 100 శాతం వరకు, అంటే పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించే అధికారం ఉంటుంది. దీనివల్ల నిజాయితీగా ఉండే వ్యాపారులకు రక్షణ కలుగుతుండగా, అక్రమాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అందుతుంది.చాలా మందిలో ఉన్న మరొక ప్రధాన అపోహ ఏమిటంటే.. అధికారులు విధించిన జరిమానాపై అప్పీల్‌కు వెళ్తే అది మరింత పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పన్ను చెల్లింపుదారుడి వద్ద సరైన ఆధారాలు ఉండి, చట్టబద్ధంగా వారి వాదన బలంగా ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ద్వారా ఉపశమనం పొందే హక్కు వారికి ఉంటుంది. కాబట్టి చట్టంపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఇటువంటి అపోహల నుంచి బయటపడవచ్చు.తెర వెనుక ఏం జరుగుతుంది?జీఎస్టీ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డేటా అనలిటిక్స్ ఆధారంగా నడుస్తోంది. ఒక వ్యాపారి నిరంతరం తప్పుడు ఇన్‌పుట్‌ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేస్తున్నా లేదా పదే పదే రిటర్న్‌లు ఎగ్గొడుతున్నా వారిని మాత్రమే వ్యవస్థ హై రిస్క్ కేటగిరీలో ఉంచుతుంది. అధికారుల జోక్యం తగ్గించేందుకు ‘ఫేస్‌లెస్ అసెస్‌మెంట్’(పన్ను చెల్లింపుదారుడు, పన్ను అధికారి ప్రత్యక్షంగా ముఖాముఖి కలవాల్సిన అవసరం లేకుండానే పన్ను మదింపు ప్రక్రియను పూర్తి చేసే ఒక ఆధునిక విధానం) వంటి విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.అవగాహనే రక్షణజీఎస్టీ అనేది చట్టం కంటే దానిపై సమాచార లోపం వల్లే ఎక్కువగా క్లిష్టంగా కనిపిస్తోంది. సకాలంలో రిటర్న్‌లు దాఖలు చేయడం, నోటీసులకు వెంటనే స్పందించడం, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.- దవనం శ్రీకాంత్‌

GenAI frenzy Google CEO Sundar Pichai sent an internal email goes viral5
నాటి విమర్శలకు పిచాయ్‌ సమాధానం

టెక్ ప్రపంచంలో ఎవరైతే ముందుగా కొత్త సాంకేతికతను అందిస్తారో వారే విజేతలని అందరూ భావిస్తారు. 2023 ప్రారంభంలో జనరేటివ్ ఏఐ రంగంలో గూగుల్ ప్రత్యర్థుల కంటే వెనుకబడిందని విమర్శలు వెల్లువెత్తినప్పుడు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తన ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత ఈమెయిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆనాడు ఆయన చెప్పిన మాటలు, నేడు గూగుల్ సాధిస్తున్న రికార్డు స్థాయి విజయాల్లో ప్రతిబింబిస్తున్నాయి.తొందరపాటు వద్దు..ఏఐ రేసులో గూగుల్ వెనుకబడిందన్న వార్తల నేపథ్యంలో సుందర్ పిచాయ్ తన సిబ్బందికి ధైర్యాన్నిస్తూ ఒక సందేశం పంపారు. ‘గూగుల్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండటానికి తొందరపడలేదు. కానీ అత్యుత్తమంగా నిలవడానికి ప్రయత్నించింది’ అని ఆయన గుర్తు చేశారు. జీమెయిల్, క్రోమ్, ఆండ్రాయిడ్ వంటివి మార్కెట్లోకి వచ్చిన తొలి ఉత్పత్తులు కావు, కానీ వినియోగదారుల సమస్యలను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించడం వల్లే అవి ప్రపంచాన్ని శాసించగలిగాయని ఆయన వివరించారు. నాణ్యత, సాంకేతిక బలం, దీర్ఘకాలిక ప్రభావంపైనే దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.జెమిని 3సుందర్‌ నమ్మిన వ్యూహం నేడు సత్ఫలితాలను ఇస్తోంది. గూగుల్ అత్యాధునిక ఏఐ మోడల్ ‘జెమిని’ విడుదలైన తర్వాత కంపెనీ దశ మారిపోయింది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్‌లో ‘ఏఐ ఓవర్‌వ్యూ’ ద్వారా జెమిని అన్నింట్లో పాగా వేసింది. ప్రతి నెలా మిలియన్ల మంది వినియోగదారులు జెమిని యాప్‌ను ఉపయోగిస్తుండగా వ్యాపార సంస్థలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి గూగుల్ ఏఐ సాధనాలను స్వీకరిస్తున్నాయి.రికార్డు ఆదాయంఈ వ్యూహాత్మక మార్పుల ఫలితంగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చరిత్ర సృష్టించింది. ఇటీవల కంపెనీ వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాకుండా ఏఐ కోసం ప్రత్యేక చిప్‌లు, అత్యాధునిక డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా గూగుల్ ఒక పూర్తిస్థాయి ఏఐ ఎకోసిస్టమ్‌ను సిద్ధం చేసింది. ఇది నిర్వహణ ఖర్చులను తగ్గించడమే కాకుండా పనితీరులో ప్రత్యర్థుల కంటే ముందుండడానికి సహాయపడిందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

40 year old software engineer shared a viral post6
‘కంపెనీలకు వ్యాపారమే ముఖ్యం’

కార్పొరేట్ ప్రపంచంలో లాయల్టీ (నమ్మకంగా పని చేయడం) కంటే అడాప్టబిలిటీ (మార్పుకు అనుగుణంగా మారడం) ముఖ్యమని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చెబుతున్నారు. ఒకే సంస్థలో దాదాపు 15 ఏళ్ల పాటు సేవలందించి అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయిన ఓ 40 ఏళ్ల భారతీయ టెక్కీ తన ఆవేదనను, తాను నేర్చుకున్న పాఠాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.‘దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు’ అనే శీర్షికతో రెడ్డిట్‌లో ఓ వ్యక్తి అప్‌లోడ్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. కొవిడ్-19 తర్వాత సదరు కంపెనీ నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నించిందని, అయితే జులైలో నిధులు నిలిచిపోవడంతో పరిస్థితి తలకిందులైందని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా లేఆఫ్ ప్రకటించే కంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయమని మేనేజ్‌మెంట్ డిమాండ్‌ చేయడంతో ఆయన కంపెనీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.‘నేను అక్కడ చాలా సౌకర్యవంతంగా ఉన్నాను. కొత్త సవాళ్లు ఉన్నాయి. చాలా సమర్థంగా పని చేసేవాడిని. అందుకే 15 ఏళ్లలో కేవలం బయట ఒకటి రెండు ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చాను. కానీ ఇప్పుడు వాస్తవం అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మళ్లీ ఉద్యోగ వేటలో భాగంగా 60-70 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్కెట్ పరిస్థితిని విశ్లేషిస్తూ తోటివారి కోసం ఆయన కొన్ని అంశాలు తెలియజేశారు.కంపెనీకి వ్యాపారమే ముఖ్యం. మిమ్మల్ని ఎప్పుడైనా రీప్లేస్‌ చేయవచ్చు.ఒకే చోట ఎక్కువ కాలం ఉండకండి.కంపెనీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆరా తీస్తూ ఉండండి.కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపకండి.మీ మార్కెట్ విలువ తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలకు హాజరవుతుండాలి.మీ విజయాలను, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోండి.ప్రతి 6-12 నెలలకు లింక్డ్‌ఇన్, సీవీ అప్‌డేట్ చేయండి.పరిచయాలను పెంచుకోండి. అవి కష్టకాలంలో ఆదుకుంటాయి.కంపెనీలు రెజెక్ట్‌ చేస్తున్నా పెద్ద రోల్స్ కోసం ప్రయత్నించండి.ఇంటర్వ్యూ తర్వాత లోపాలను అడిగి తెలుసుకోండి.మీ ఉద్యోగం మాత్రమే మీ గుర్తింపు కాదు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉండటం వల్ల మీరు రీప్లేస్‌ కోసం ఉన్న పాత ఫర్నిచర్‌లా మారిపోతారని ఒక యూజర్ స్పందించారు. మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘నేను 11 ఏళ్లలో 11 ఉద్యోగాలు మారాను. ప్రతిసారీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూనే ఉన్నాను. కంపెనీ కుటుంబంలా అనిపించవచ్చు కానీ, మన నిజమైన కుటుంబం ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండటమే మనుగడకు మార్గం’ అని సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

Advertisement
Advertisement
Advertisement