Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Dr. Reddys Q3 net declines 14 percent to Rs 1210 crore1
డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 1,210 కోట్లు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ నికర లాభం రూ. 1,210 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో నమోదైన రూ. 1,413 కోట్లతో పోలిస్తే 14 శాతం తగ్గింది. ఆదాయం రూ. 8,357 కోట్ల నుంచి రూ. 8,727 కోట్లకు చేరింది. కీలకమైన అమెరికా మార్కెట్లో లెనాలిడోమైడ్‌ విక్రయాలు నెమ్మదించడం, నిర్దిష్ట ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం, కొత్త లేబర్‌ కోడ్‌ల అమలుకు సంబంధించి వన్‌–టైమ్‌ ప్రొవిజన్‌ చేయాల్సి రావడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు బుధవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ తెలిపింది. బ్రాండెడ్‌ వ్యాపారాలు మెరుగ్గా రాణించడం, ఫారెక్స్‌పరమైన సానుకూల ప్రయోజనాల వల్ల ఆ లోటు భర్తీ అయినట్లు కంపెనీ కో–చైర్మన్‌ జి.వి. ప్రసాద్‌ తెలిపారు. ప్రధాన వ్యాపార వృద్ధి, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం మొదలైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, వ్యాపార భాగస్వాములకు దీర్ఘకాలికంగా మరింత విలువను చేకూర్చడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. మరిన్ని ముఖ్యాంశాలు.. → గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం నుంచి ఆదాయం 7 శాతం పెరిగి సుమారు రూ. 7,375 కోట్ల నుంచి రూ. 7,911 కోట్లకు పెరిగింది. కీలకమైన ఉత్తర అమెరికాలో ఆదాయం రూ. 3,383 కోట్ల నుంచి రూ. 2,964 కోట్లకు తగ్గింది. యూరప్‌ విక్రయాలు 1,209 కోట్ల నుంచి 20 శాతం వృద్ధి చెంది రూ. 1,447 కోట్లకు పెరిగాయి. ఇక భారత మార్కెట్లో అమ్మకాలు 19 శాతం వృద్ధితో రూ. 1,346 కోట్ల నుంచి రూ. 1,603 కోట్లకు చేరాయి. వర్ధమాన మార్కెట్లలో ఆదాయం సుమారు రూ. 1,436 కోట్ల నుంచి రూ. 1,896 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో 6, యూరప్‌లో 10, భారత్‌లో రెండు, వర్ధమాన మార్కెట్లలో 30 కొత్త ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో కొత్త బ్రాండ్‌లను ఆవిష్కరించడం, ధరల పెరుగుదల, అధిక అమ్మకాలు మొదలైన అంశాలు మెరుగైన ఫలితాలకు దోహదపడ్డాయి. → ఫార్మా సరీ్వసెస్, యాక్టివ్‌ ఇంగ్రీడియెంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం రూ. 822 కోట్ల నుంచి 2% క్షీణించి రూ. 802 కోట్లకు తగ్గింది. బీఎస్‌ఈలో కంపెనీ షేరు సుమారు ఒక్క శాతం క్షీణించి రూ. 1,155.50 వద్ద క్లోజయ్యింది.

Gomini Launches India First Managed Cow Care Service2
బిట్‌ కౌయిన్‌...

అంతా డిజిటల్‌మయంగా మారుతున్న నేపథ్యంలో పాడి వ్యాపారం కూడా డిజిటల్‌ బాట పడుతోంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే మనం ఆవుల్ని డిజిటల్‌గా కొనుక్కుని, మెయింటెనెన్స్‌ బాదరబందీ లేకుండా, రాబడిని అందుకునే విధంగా గోమిని అనే ఓ స్టార్టప్‌ సంస్థ వినూత్న వ్యాపారాన్ని తెరపైకి తెచ్చింది. బిహార్‌కి చెందిన ఈ స్టార్టప్‌ని అర్జున్‌ శర్మ అనే ఔత్సాహిక వ్యాపారవేత్త ప్రారంభించారు. మేలుజాతి దేశీ ఆవుల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మోడర్న్‌ టెక్నాలజీతో ఒక్కో ఆవుకి ఎన్‌ఎఫ్‌టీ (నాన్‌–ఫంజిబుల్‌ టోకెన్‌)ని సృష్టించి, వాటిని విక్రయిస్తున్నారు. దీనితో అమెరికా, కెనడా, లండన్‌ ఎక్కుణ్నుంచైనా సరే ఇన్వెస్టర్లు ఎన్‌ఎఫ్‌టీలను కొనుక్కోవడం ద్వారా సదరు ఆవులను సొంతం చేసుకోవచ్చు. ఇలా అమ్మిన ఆవుల పోషణ భారాన్ని ఇన్వెస్టర్ల తరఫున ఇక్కడే గోమిని చూసుకుంటుంది. అంతేకాదు వారికి పెట్టుబడి మీద రాబడి కింద ప్రతి నెలా డివిడెండ్‌ మాదిరి రెండు కిలోల స్వచ్ఛమైన నెయ్యిని కూడా పంపిస్తుంది. అది కూడా వారు కొనుక్కున్న ఆవు ఇచ్చిన పాల నుంచి తీసినదే అయి ఉంటుంది. రూ. 15 లక్షల వరకు రాబడి ..ప్రయోజనాలు ఇక్కడితో ఆగిపోవు. సదరు ఆవు సంతతి పెరిగే కొద్దీ మరింత ఆదాయాన్ని కూడా ఇన్వెస్టరు పొందవచ్చు. పాలు, పిడకలు, అగరొత్తులు ఇత రత్రా ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 25% రాబడిని అందుకోవచ్చు. మొత్తం మీద కాస్తంత ఇన్వెస్ట్‌ చేస్తే ఓ ఆవును, దాని జీవితకాలంలో రూ. 15 లక్షలకు పైగా రాబడులు అందుకోవచ్చని శర్మ వివరించారు. సరే, దీనికి ఎన్‌ఎఫ్‌టీలాంటి సంక్లిష్టమైన టెక్నాలజీ హంగులు ఎందుకంటే, కొనుగోలు, ఆ తర్వాత జరిగే ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం అంటారు అర్జున్‌ శర్మ. ఈ విధానంలో సిసలైన యజమానిని ధ్రువీకరించే డిజిటల్‌ సరి్టఫికెట్‌ జారీ చేస్తారని తెలిపారు. ఇందులో ఆవు జాతి, వయస్సు, విశిష్ట గుర్తింపు, లొకేషన్, ఆరోగ్యం వివరాలు, రెవెన్యూ షేరింగ్‌ ఒప్పందం వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. ప్రస్తుతం బిహార్‌లో కంపెనీకి మూడు క్లస్టర్లు ఉన్నాయి. గో సేవను కేవలం చా రిటీకి పరిమితం చేయకుండా రాబడినిచ్చే లాభ సాటి పెట్టుబడి మార్గంగా మార్చడం వల్ల గో సంరక్షణ వైపు మరింత మంది ఇన్వెస్టర్లను మళ్లించవచ్చనేది అర్జున్‌ శర్మ ఆలోచన. తద్వారా అంతరించిపోతున్న మేలిమిజాతి దేశీ ఆవులను సంరక్షించవచ్చని ఆయన తెలిపారు. ఈ వినూత్న ప్రయత్నానికి నాబార్డ్‌ కూడా తోడ్పాటు అందిస్తోంది. రైతుకు కూడా ప్రయోజనం .. కేవలం ఇన్వెస్టర్ల కోణంలోనే కాకుండా రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు శర్మ తెలిపారు. ఫార్మ్‌లను నిర్వహించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి లభిస్తుందని వివరించారు. తద్వారా ఇటు గోమాతకి అటు మహిళల ఉపాధికి కూడా తోడ్పాటు అందించినట్లవుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం వివిధ రకాల ప్లాన్లు కూడా ప్రవేశపెట్టారు. రూ. 3,97,000 నుంచి కొనుగోలు చేయొచ్చు లేదా ముందుగా రూ. 30,000 బుకింగ్‌ కింద కట్టి ప్రతి నెలా ఈఎంఐ కింద ఓ 24 నెలలు రూ. 17,500 కట్టేలా కూడా ప్లాన్లను గోమిని అందిస్తోంది. కేవలం నెయ్యితో సరిపెట్టకుండా ఆవు పేడను కూడా మానిటైజ్‌ చేసే పనిలో ఉన్నారు అర్జున్‌ శర్మ. ఒక్క కేజీ పొడి ఆవు పేడతో అగరొత్తుల్లో ఉపయోగించే 1.4 కేజీ పొడిని తయారు చేయొచ్చని, దీనికి మరింత ఎక్కువ విలువ లభిస్తుందని ఆయన చెప్పారు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Ford recalls around 119,000 vehicles over fire risk: NHTSA3
ల‌క్ష‌కు పైగా ఫోర్డ్‌ వాహనాల రీకాల్‌.. ఎందుకంటే?

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ (Ford Motor) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజిన్ బ్లాక్ హీటర్లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల యూఎస్‌ వ్యాప్తంగా దాదాపు 1,19,000 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ఫోర్డ్ ప్రకటించింది. ఈ రికాల్‌లో 2013 నుంచి 2024 మధ్యలో తాయారైన ఫోర్డ్ ఫోకస్‌, ఫోర్డ్ ఎస్కేప్‌,లింకన్ ఎంకేసీ, ఫోర్డ్ ఎక్స్‌ఫ్లోరర్ మోడల్స్ ఉన్నాయి.సమస్య ఏంటంటే?చలికాలంలో ఇంజిన్ త్వరగా వేడెక్కడానికి బ్లాక్ హీటర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ హీటర్ల వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అమెరికా రహదారి భద్రతా సంస్థ((NHTSA) ఫోర్డ్ మెటార్‌ను హెచ్చరించింది. ఇంజిన్ బ్లాక్ హీటర్‌లో పగుళ్లు రావడం వల్ల కూలెంట్ ఆయిల్‌ లీక్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. ఒక‌వేళ అదే జ‌రిగితే.. హీటర్‌ను పవర్ సాకెట్‌కు కనెక్ట్ చేసినప్పుడు లీక్ అయిన అయిల్ కార‌ణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగేందుకు ఎక్క‌వ‌గా అస్కారం ఉంది.ఇప్ప‌టివ‌ర‌కు ఈ లోపం వ‌ల్ల 12 కార్లలో మంటలు వచ్చినట్లు ఫిర్యాదులు అందాయని, అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఫోర్డ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రిపేర్ పూర్తయ్యే వరకు కస్టమర్లు తమ వాహనాలను పవర్ సాకెట్లకు ప్లగ్ ఇన్ చేయవద్దని ఫోర్డ్ కోరింది.

Nita Ambani attends NABs 75th anniversary4
అంధుల జీవితాల్లో వెలుగులు.. రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన నీతా అంబానీ

నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (NAB) ఇండియా 75వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంధులకు అండగా నిలిచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున రాబోయే ఐదేళ్లలో రూ.5 కోట్ల విరాళాన్ని అందజేస్తామని నీతా అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్, నాబ్‌ సంయుక్త కృషితో ఇప్పటివరకు 22,000 మందికి పైగా అంధులకు చూపు తెప్పించారు.

Gold Rates Jump Thousands in by Evening 21st january in Telugu States5
సాయంత్రానికే మరింత షాక్‌.. మారిపోయిన పసిడి ధరలు

బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో పసిడి ధరలు ఎగుస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రానికే మరింత పెరిగాయి.హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.4600 పెరిగి రూ. 1,41,900 లకు చేరుకోగా సాయంత్రానికి మొత్తంగా రూ.6250 ఎగిసి రూ.1,43,550లకు చేరింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.5020 ఎగిసి రూ. 1,54,800 లను తాకగా సాయంత్రానికి మొత్తంగా రూ.6820 పెరిగి రూ.1,56,600లకు చేరుకుంది.అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

All Eyes on Davos as Trump Delivers High Stakes Speech6
దావోస్‌: గ్రీన్‌లాండ్‌ మాక్కావాలి..

గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యూరోపియన్ మిత్రదేశాల నుంచి కొంత వ్యతిరేక స్పందన (pushback) వ్యక్తమవుతుండగా, ఆయన ఈ రోజు దావోస్‌కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) కాంగ్రెస్ హాల్‌లోని ‘జోన్ సిలో’ వద్ద వందలాది మంది ప్రతినిధులు క్యూకట్టారు. ట్రంప్ ప్రసంగంపై అంతర్జాతీయంగా భారీ ఆసక్తి నెలకొంది.అధ్యక్ష పదవికి ఏడాది.. ట్రంప్ ప్రశంసలుఅధ్యక్ష పదవిలో ఏడాది పూర్తి అయిన సందర్భంగా దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వేదికపై ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పాలనలో సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు.“నిన్న నా ప్రమాణ స్వీకారానికి ఏడాది పూర్తైంది. ఈ రోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి ఉధృతంగా ఉంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గతంలో తెరిచి ఉన్న ప్రమాదకరమైన సరిహద్దులు ఇప్పుడు మూసివేయబడ్డాయి. అమెరికా తన చరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపు దశలో ఉంది” అని ట్రంప్ అన్నారు.యూరప్ సరైన దిశలో లేదుడబ్ల్యూఈఎఫ్ వేదికపై మాట్లాడిన ట్రంప్, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు “గుర్తించలేనంతగా మారిపోయాయి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో “వాదనకు తావు లేదని” పేర్కొన్నారు.“నేను ఐరోపాను ప్రేమిస్తున్నాను. ఐరోపా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం అది సరైన దిశలో ముందుకు సాగడం లేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు.అలాగే, ప్రపంచంలోని సుమారు 40 శాతం దేశాలతో అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. వివిధ దేశాలపై విధించిన సుంకాల వల్ల అమెరికాలో భారీ వాణిజ్య లోటులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.గ్రీన్‌లాండ్‌ కావాల్సిందే..అమెరికా, రష్యా, చైనాల మధ్య కీలకమైన వ్యూహాత్మక ప్రదేశంలో గ్రీన్‌లాండ్ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాకు ఈ ద్వీప భూభాగం దాని ఖనిజాల కోసం కాదని, "వ్యూహాత్మక జాతీయ, అంతర్జాతీయ భద్రత" కోసం అవసరమని అమెరికా అధ్యక్షుడు అన్నారు. డెన్మార్క్‌కు కృతజ్ఞత లేదని ట్రంప్‌ ఆక్షేపించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత "గ్రీన్‌లాండ్ ను తిరిగి ఇవ్వడం" అమెరికా "మూర్ఖత్వం" అని అన్నారు. "మేము డెన్మార్క్ కోసం గ్రీన్‌లాండ్‌లో స్థావరాలను ఏర్పాటు చేశాం. డెన్మార్క్ కోసం పోరాడాము. గ్రీన్‌లాండ్‌ను రక్షించాం. శత్రువులు అడుగు పెట్టకుండా నిరోధించాము. యుద్ధం తర్వాత మేము గ్రీన్లాండ్ ను తిరిగి డెన్మార్క్ కు ఇచ్చాము. అలా చేయడం మా తెలివి తక్కువతనం' అన్నారు. మరోవైపు గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయండం వల్ల నాటోకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. నాటోనే అమెరికాను "చాలా అన్యాయంగా" చూస్తోందని ట్రంప్ విమర్శించారు.

Advertisement
Advertisement
Advertisement