Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sebi approves 3 IPOs as ESDS Software, BLS Polymers and Dhariwal Buildtech1
లిస్టింగ్‌పై 3 కంపెనీల కన్ను 

ఓవైపు సెకండరీ మార్కెట్లు శాంట క్లాజ్‌ ర్యాలీలోనూ ఆటుపోట్లను చవిచూస్తుంటే మరోవైపు ఈ కేలండర్‌ ఏడాది(2025) అధిక ఇష్యూలు, అత్యధిక నిధుల సమీకరణతో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డుకు తెరతీశాయి. ఈ బాటలో ప్రైమరీ మార్కెట్లు ఏడాది చివరిలోనూ సందడి చేస్తున్నాయి. తాజాగా 3 కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన కేఎస్‌హెచ్‌ ఇంటర్నేషనల్‌ తాజాగా లిస్ట్‌కాగా.. ఈ వారం గుజరాత్‌ కిడ్నీ అండ్‌ సూపర్‌ స్పెషాలిటీసహా.. 4 ఎస్‌ఎంఈ పబ్లిక్‌ ఇష్యూలు ప్రారంభమయ్యాయి. ఈ బాటలో మరిన్ని కంపెనీలు ప్రైమరీ మార్కెట్లలో సందడి చేయనున్నాయి. ఇందుకు సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది. ఈ జాబితాలో ధారివాల్‌ బిల్డ్‌టెక్, ఈఎస్‌డీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్, బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ చేరాయి. ఈ మూడు కంపెనీలు లిస్టింగ్‌కు అనుమతించమంటూ సెబీకి ఈ ఏడాది ఏప్రిల్‌–సెపె్టంబర్‌ మధ్య ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఈ సంస్థలన్నీ ఐపీవో ద్వారా కొత్తగా ఈక్విటీ జారీతో నిధుల సమీకరణను చేపట్టనున్నాయి. ఐపీవో తదుపరి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి. కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ధారివాల్‌ బిల్డ్‌టెక్‌ రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటిలో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 203 కోట్లు నిర్మాణ రంగ పరికరాల కొనుగోలుకి, రూ. 174 కోట్లు ముందస్తు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. జాతీయ, రాష్ట్ర రహదారులు, పీఎంజీఎస్‌వై రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, సొరంగ మార్గాలు నిర్మించే కంపెనీ రైల్వే, నీటిపారుదల, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది. క్లౌడ్‌ ఇన్‌ఫ్రా సేవలు క్లౌడ్, మేనేజ్‌డ్‌ సర్వీసుల సంస్థ ఈఎస్‌డీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటిలో రూ. 481 కోట్లు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలుతోపాటు డేటా సెంటర్ల మౌలికసదుపాయాల ఏర్పాటుకు వెచ్చించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఐఏఏఎస్, ఎస్‌ఏఏఎస్‌ ఆధారిత క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సర్వీసులు, సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్లు అందిస్తోంది. కస్టమ్‌ పాలిమర్‌ కాంపౌండ్స్‌ అవసరాలకుతగిన(కస్టమ్‌) పాలిమర్‌ కాంపౌండ్స్‌ రూపొందించే బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా 1.7 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీక రించిన నిధుల్లో రూ. 70 కోట్లు కొన్ని ప్రొడక్టుల తయారీ సౌకర్యాల విస్తరణకు, రూ. 75 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ టెలికం, విద్యుత్, రైల్వే, చమురు–గ్యాస్‌ తదితర రంగాలకు కస్టమ్‌ పాలిమర్‌ కాంపౌండ్స్‌ అందిస్తోంది. సెబీకి టన్బో ఇంజినీరింగ్‌ ప్రాస్పెక్టస్‌ దాఖలు గ్లోబల్‌ డిఫెన్స్‌ ఎల్రక్టానిక్స్‌ పరికరాల తయారీ ప్రధాన కంపెనీ(ఓఈఎం) టన్బో ఇంజినీరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1,80,85,246 ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. అయితే కొత్తగా ఈక్విటీ జారీ చేయబోదు. 2003లో ఏర్పాటైన కంపెనీ తొలిదశలో యూఎస్‌ రక్షణ శాఖ, సర్నాఫ్‌ కార్పొరేషన్‌తో కలసి పనిచేసింది. ఆపై 2012లో ప్రస్తుత ప్రమోటర్ల ఆధ్వర్యంలో రక్షణ రంగ పరికరాల తయారీపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధానంగా సెన్సింగ్, ప్రాసెసింగ్, కమ్యూనికేషన్, గైడెన్స్‌ సిస్టమ్స్‌ను రూపొందిస్తోంది. విజిబుల్, ఇన్‌ఫ్రారెడ్, మల్టీసెన్సార్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీలతోకూడిన టాక్టికల్, ప్లాట్‌ఫామ్‌ సిస్టమ్స్‌ తయారు చేస్తోంది. ప్రపంచస్థాయిలో రక్షణ రంగ దళాలకు ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. 2025 సెపె్టంబర్‌30కల్లా దాదాపు రూ. 267 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. గత రెండు నెలల్లోనూ రూ. 72 కోట్ల విలువైన ఆర్డర్లను పొందింది.

Bharti Enterprises and Warburg Pincus announce investment in Haier India2
హయర్‌ ఇండియాలో భారతీకి వాటా 

న్యూఢిల్లీ: కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ దిగ్గజం దేశీ యూనిట్‌ హయర్‌ ఇండియాలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యూహాత్మక పెట్టుబడులకు తెరతీస్తోంది. యూఎస్‌ పీఈ దిగ్గజం వార్‌బర్గ్‌ పింకస్‌తో కలసి 49 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. అయితే డీల్‌ విలువను వెల్లడించçప్పటికీ 2 బిలియన్‌ డాలర్లు(రూ. 17,956 కోట్లు) వెచ్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. చైనీస్‌ హయర్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ హయర్‌ ఇండియాలో వార్‌బర్గ్‌తో కలసి వ్యూహాత్మక పెట్టుబడులను చేపట్టనున్నట్లు పేర్కొంది. తద్వారా ఏసీలు, టీవీల తయారీ దిగ్గజంలో సంయుక్తంగా 49 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. హయర్‌ గ్రూప్‌ యాజమాన్యం 49 శాతం వాటాను అట్టిపెట్టుకుంటుందని.. మిగిలిన 2% వాటా సంస్థ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ చేతిలో ఉంటుందని వివరించింది. హయర్‌ ఇండియా వాషింగ్‌ మెషీన్లు, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్స్‌సహా పలు కిచెన్‌ అప్లయెన్సెస్‌ తయారు చేసే సంగతి తెలిసిందే. కంపెనీలో వాటా కొనుగోలుకి సజ్జన్‌ జిందాల్‌ గ్రూప్‌ జేఎస్‌డబ్ల్యూ, ముకేశ్‌ అంబానీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పోటీపడినట్లు తెలుస్తోంది. హయర్‌ ఇండియా విజన్‌.. మేడిన్‌ ఇండియా, మేడ్‌ ఫర్‌ ఇండియాకు తాజా భాగస్వామ్యం దన్నునిస్తుందని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్కొంది. స్థానిక ప్రాధాన్యత, తయారీ సామర్థ్య విస్తరణ, నూతన ప్రొడక్టుల ఆవిష్కరణలు ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. తద్వారా మార్కెట్లో మరింత లోతుగా విస్తరించనున్నట్లు అభిప్రాయపడింది.

Exemption from customs and excise duties for development of SEZs3
సెజ్‌ ఔషధాలకు ట్యాక్స్‌ రిలీఫ్‌

న్యూఢిల్లీ: దేశీయంగా కీలక ఔషధాల లభ్యత పెరిగేలా, ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్‌) తయారు చేసి, దేశీయంగా విక్రయించే ఔషధాలపై కస్టమ్స్‌ సుంకాలను ఎత్తివేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెజ్‌లలో తయారై, దేశీయ మార్కెట్లో అమ్మే ఔషధాలపై 10 శాతం సుంకాలు వర్తిస్తున్నాయి. ఒకవేళ తాజా ప్రతిపాదన ఆచరణ రూపం దాలిస్తే సదరు సుంకాల ప్రస్తావన లేకుండా పలు టీకాలు, కీలక ఔషధాలను దేశీయంగా తక్కువ ధరకే విక్రయించేందుకు వీలవుతుంది. అయితే, ఏకమొత్తంగా అన్ని ఔషధాలకు కాకుండా కొన్ని ఉత్పత్తులకు మాత్రమే మినహాయింపులను వర్తింప చేయొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ మేరకు ప్రతిపాదనను చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా ఎంపిక చేసిన కొన్ని టీకాలు, కొన్ని కీలకమైన ఔషధాలు, ప్రభుత్వం నిర్ణయించే ఉత్పత్తులకు మినహాయింపునివ్వొచ్చని పేర్కొన్నాయి. వైద్య పరికరాలకు కూడా.. దేశీయంగా స్టార్టప్‌ వ్యవస్థని కూడా ప్రోత్సహించే దిశగా కొన్ని మెడికల్‌ డివైజ్‌ల తయారీ సంస్థలు, బయోటెక్‌ సంస్థలకు కూడా ఇదే తరహాలో సుంకాల నుంచి మినహాయింపులనిచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్న ఉత్పత్తులను, దేశీయంగా తయారు చేసేందుకు పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మన ఫార్మా రంగం గణనీయంగా ఎదుగుతోందని, పలు రాష్ట్రాలు ఫార్మా సెజ్‌లను ఏర్పాటు చేస్తున్నాయని వివరించాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రతిపాదనలు తోడ్పడగలవని వివరించాయి. అక్టోబర్‌ 1 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా 100 శాతం సుంకాలను ప్రకటించడంతో దేశీయంగా ఔషధాలను విక్రయించుకునేందుకు సుంకాల నుంచి మినహాయింపునివ్వాలంటూ సెజ్‌ యూనిట్లు కోరుతుండటంతో ప్రభుత్వ తాజా యోచన ప్రాధాన్యం సంతరించుకుంది. సెజ్‌ల నుంచి ఎగుమతవుతున్న ఉత్పత్తుల్లో హైపర్‌టెన్షన్, మధుమేహం, కార్డియోవాసు్కలర్‌ వ్యాధుల్లాంటి వాటి చికిత్స కోసం ఉపయోగించే ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్టబుల్‌ ఔషధాలు ఉంటున్నాయి. వీటికి దేశీ మార్కెట్లో కూడా గణనీయంగా డిమాండ్‌ ఉంటోంది. ప్రస్తుతం దేశీ ఫార్మా మార్కెట్‌ 60 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు అంచనా. భారత్‌కి అంతర్జాతీయంగా జనరిక్‌ ఔషధాల విభాగంలో 20 శాతం వాటా, టీకాల సరఫరాలో 60 శాతం వాటా ఉంది.

Vedanta Chairman Anil Agrawal declared that silver story just beginning4
వెండికి ‘బంగారు’ కాలం

ఈ ఏడాది వెండి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అసాధారణ మైలురాయిని చేరాయి. పెట్టుబడి సాధనంగా, పారిశ్రామిక అవసరాల పరంగా ఈ లోహం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒకవైపు విశ్లేషకులు ధరల దిద్దుబాటు(Correction)పై హెచ్చరిస్తున్నప్పటికీ, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాత్రం వెండి భవిష్యత్తుపై అత్యంత ధీమాతో ఉన్నారు.గతంలో వెండి ఎప్పుడూ బంగారం ధరల గమనాన్నే అనుసరిస్తూ ఉండేది. కానీ 2025లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనిల్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నట్లుగా.. ధరలు తాత్కాలికంగా హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ వెండి మెరుపు కొనసాగుతుంది. వెండి కథ ఇప్పుడే ప్రారంభమైందని అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఏడాదిలో వెండి ధర ఏకంగా 125 శాతం పెరిగింది. బంగారం కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, దాని వృద్ధి 63 శాతం మాత్రమే. అంటే బంగారం కంటే వెండి రెట్టింపు రాబడిని అందించింది. వెండి అటు విలువైన ఆభరణంగానూ, ఇటు కీలకమైన పారిశ్రామిక లోహంగానూ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డిజిటల్ యుగంలో వెండి పాత్ర ఎంతో కీలకంగా మారింది.సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండికి ప్రత్యామ్నాయం లేదు. డేటా సెంటర్ల విస్తరణ, ఎలక్ట్రికల్ వాహనాల విద్యుదీకరణలో దీని డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అత్యాధునిక రక్షణ పరికరాల్లో వెండి కీలక అంశంగా ఉంది. భారతదేశంలో వెండి ఉత్పత్తిదారుగా ఉన్న హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ద్వారా ఈ పెరుగుతున్న పారిశ్రామిక అవసరాన్ని తాము ప్రత్యక్షంగా చూస్తున్నామని అగర్వాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?

Why People Think Term Insurance Is a Waste see details5
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?

ఈరోజుల్లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు.. కానీ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ‘తిరిగి ఎంత వస్తుంది?’ అని లెక్కలు వేస్తారు. అయితే, మీరు లేని లోటును ఏ డబ్బు భర్తీ చేయలేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టే ఏకైక ఆయుధం టర్మ్ ఇన్సూరెన్స్. నెలకు ఓ కుటుంబానికి అయ్యే సినిమా టికెట్ ఖర్చుతో కోటి రూపాయల రక్షణ కవచాన్ని అందించే ఈ పాలసీపై అపోహలు వీడాలి.నేటి ఆధునిక కాలంలో ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది కేవలం పొదుపు, పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఒక అనవసరపు ఖర్చుగా భావిస్తూ ‘ప్రీమియం కడితే తిరిగి రాదు కదా, ఇది డబ్బులు దండగ’ అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే, ఇది ఆర్థికంగా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.ఏది పెట్టుబడి? ఏది రక్షణ?చాలామంది ఇన్సూరెన్స్‌ను కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలాగా చూస్తారు. అందులో..ఎండోమెంట్ పాలసీలు.. వీటిలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ఇందులో ఉండే లైఫ్ కవర్(బీమా మొత్తం) చాలా తక్కువగా ఉంటుంది.టర్మ్ ఇన్సూరెన్స్.. ఇది స్వచ్ఛమైన బీమా. ఇక్కడ మీరు చెల్లించే ప్రీమియం కేవలం మీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మాత్రమే. పాలసీ కాలపరిమితిలో పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు కోటి రూపాయలు) బీమా సొమ్ము అందుతుంది.‘డబ్బులు తిరిగి రావు’ అనేది అపోహ మాత్రమే‘నేను ఆరోగ్యంగా ఉంటే కట్టిన డబ్బులు పోతాయి కదా’ అని బాధపడటం అంటే.. మనం ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఇల్లు కాలిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వేస్ట్ అని అనుకోవడమే. వయసును అనుసరించి నెలకు వెయ్యి రూపాయలలోపు ప్రీమియంతోనే కోటి రూపాయల కవరేజ్ పొందే అవకాశం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్‌లో మాత్రమే ఉంటుంది.ప్రీమియం రిటర్న్‌ రావాలంటే..డబ్బులు వెనక్కి రావాలనుకునే వారి కోసం ఇప్పుడు కంపెనీలు ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో పాలసీ ముగిశాక మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తారు (అయితే దీని ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది).టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం.పిల్లల చదువు, పెళ్లిళ్లు, రోజువారీ ఖర్చులకు ఇది భరోసా ఇస్తుంది.నేటి కాలంలో చాలా మందికి హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి. పాలసీదారునికి ఏమైనా జరిగితే ఆ అప్పుల భారం కుటుంబం మీద పడకుండా, ఇన్సూరెన్స్ డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు.25-30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి ముగిసే వరకు మారదు.ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఒక ఖర్చులా కాకుండా, మీ కుటుంబం కోసం మీరు కట్టే రక్షణ కవచంలా భావించాలి. విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం, మన తదనంతరం కుటుంబం గౌరవంగా బతకడానికి రోజుకు రూ.30-40 కేటాయించడం పెద్ద విషయం కాదు. కాబట్టి, ప్రతి వ్యక్తి తక్షణమే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఇదీ చదవండి: రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం

Assembly passed the Bill raising daily working hours for shop employees6
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం

హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘హరియాణా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (సవరణ) బిల్లు, 2025’కు ఆమోదం లభించింది. 1958 నాటి పాత చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా రోజువారీ పని గంటలను పెంచడంతో పాటు పలు సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.బిల్లులోని ముఖ్యాంశాలుప్రస్తుతమున్న 9 గంటల పని పరిమితిని 10 గంటలకు పెంచారు. ఇందులో విశ్రాంతి సమయం కూడా కలిసి ఉంటుంది. అయితే వారానికి గరిష్టంగా 48 గంటల పని నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.త్రైమాసికానికి ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి ఏకంగా 156 గంటలకు పెంచారు. వ్యాపార గరిష్ట డిమాండ్ సమయాల్లో సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.విరామం లేకుండా చేసే నిరంతర పని సమయాన్ని 5 గంటల నుంచి 6 గంటలకు పెంచారు.20 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న చిన్న సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వ్యాపార సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది.వ్యాపార సౌలభ్యమా? బానిసత్వమా?ఈ బిల్లుపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కార్మిక మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. ‘చిన్న సంస్థలపై భారాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 10 గంటల పని విధానం ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత సుర్జేవాలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రోజుకు 10 గంటలు, దానికి తోడు 2 గంటల ఓవర్ టైమ్ కలిపితే ఒక కార్మికుడు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. ఇలా అయితే ఒక కార్మికుడు తన కుటుంబంతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: మీ స్మార్ట్‌వాచ్‌.. బీమా ప్రీమియం​ డిసైడ్‌ చేస్తుందా?

Advertisement
Advertisement
Advertisement