ప్రధాన వార్తలు
ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న టెక్ దిగ్గజం ఒరాకిల్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన భారీ నిధులను సమీకరించుకోవడానికి కంపెనీ దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.నిధుల కొరతఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీబీ కోవెన్ పరిశోధన నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 156 బిలియన్ డాలర్ల(సుమారు రూ.14 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్థాయిలో అప్పులు ఇవ్వడానికి అమెరికాలోని ప్రముఖ బ్యాంకులు వెనకడుగు వేస్తుండటం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. ఈ వ్యవహారంపై ఈక్విటీ, రుణ పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో నిధుల కోసం కంపెనీ తన సొంత వనరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.తొలగింపుల ద్వారా ఎంతంటే..ఒరాకిల్ తన కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తగ్గించాలని భావిస్తోంది. ఈ భారీ లేఆఫ్స్ ద్వారా కంపెనీకి సుమారు 8 బిలియన్ల డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని టీవీ కోవెన్ అంచనా వేసింది. ఒకవేళ ఇదే జరిగితే ఒరాకిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద లేఆఫ్ అవుతుంది. గతంలో 2025 చివరలో కంపెనీ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 10,000 మందిని తొలగించింది. ఇటీవల అమెజాన్ కూడా తన ఏఐ వ్యూహంలో భాగంగా 16,000 మందిని తొలగించిన సంగతి తెలిసిందే.వ్యూహాత్మక మార్పులునిధుల సమీకరణ కోసం ఒరాకిల్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 2022లో 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్కేర్ సాఫ్ట్వేర్ యూనిట్ ‘సెర్నర్’ను విక్రయించే ఆలోచనలో కంపెనీ ఉంది. ‘బ్రింగ్ యువర్ ఓన్ చిప్’ అనే కొత్త విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని ప్రకారం కస్టమర్లే తమ సొంత హార్డ్వేర్ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఒరాకిల్పై మూలధన భారం తగ్గుతుంది. మౌలిక సదుపాయాల నిర్మాణంలో నేరుగా పెట్టుబడి పెట్టాలని క్లయింట్లను ఒరాకిల్ కోరుతోంది.భారీ లక్ష్యాలుక్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని పెంచడానికి 2026 నాటికి 45 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు నిధులు సేకరించాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐ కోసం డేటా సెంటర్లను నిర్మించే బాధ్యతను కూడా ఒరాకిల్ గతంలో చేపట్టింది. అయితే ప్రస్తుత ఫైనాన్సింగ్ ఇబ్బందులు ఈ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
ఎస్టీటీ పెంపు.. ఇన్వెస్టర్ల జేబుకు చిల్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చే నిర్ణయం వెలువడింది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న స్పెక్యులేషన్ను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎస్టీటీ అంటే ఏమిటి? ఎందుకు పెంచారు?స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లను లేదా డెరివేటివ్స్ను కొనుగోలు చేసినా, విక్రయించినా ప్రభుత్వం వసూలు చేసే పన్నును ఎస్టీటీ అంటారు. ఇటీవలి కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎటువంటి అవగాహన లేకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తూ భారీగా నష్టపోతున్నట్లు సెబీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రిస్క్ను నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ విభాగంలోని ఫ్యూచర్స్ లావాదేవీలపై పన్ను రేటును సవరించారు. గతంలో 0.02 శాతంగా ఉన్న ఈ పన్నును ఇప్పుడు 0.05 శాతానికి పెంచారు. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. అదేవిధంగా, ట్రేడింగ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆప్షన్స్ విభాగంలో కూడా పన్ను భారం పెరగనుంది. గతంలో ఆప్షన్స్ విక్రయాలపై 0.1 శాతంగా ఉన్న ఎస్టీటీ రేటును ప్రభుత్వం 0.15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు వల్ల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్ల లావాదేవీల ఖర్చు గణనీయంగా పెరగనుంది.ఉదాహరణకు..ఒక రిటైల్ ట్రేడర్ రూ.10 లక్షల విలువైన నిఫ్టీ ఆప్షన్స్ను విక్రయించాడనుకుందాం. 0.1 శాతం చొప్పున పాత పన్ను విధానంలో అతను రూ.1,000 ఎస్టీటీ చెల్లించేవాడు. 0.15 శాతంతో కొత్త పన్ను విధానంలో ఇప్పుడు అదే లావాదేవీపై రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, కేవలం ఒక లావాదేవీపైనే 50% అదనపు పన్ను భారం పడుతోంది. ఇది చిన్న మొత్తాలతో ట్రేడింగ్ చేసేవారి లాభాలను గణనీయంగా తగ్గిస్తుంది.ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుమారుతున్న పన్ను నిబంధనల దృష్ట్యా రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి శైలిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అతిగా ట్రేడింగ్ చేయకూడదు.. పన్నులు పెరిగినప్పుడు ప్రతి ట్రేడ్కు అయ్యే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి లాభం తక్కువగా ఉండి పన్నులు ఎక్కువగా ఉండే చిన్న ట్రేడ్లను నివారించండి.డెరివేటివ్స్ నుంచి డెలివరీ వైపు.. కేవలం లాభం కోసం చేసే ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ కంటే మంచి కంపెనీల షేర్లను కొని దీర్ఘకాలం ఉంచుకునే (Delivery Trading) పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల పన్ను భారం తగ్గుతుంది.ట్రేడ్ చేసేటప్పుడు కేవలం బ్రోకరేజ్ మాత్రమే కాకుండా పెరిగిన ఎస్టీటీ, జీఎస్టీ, స్టాంప్ డ్యూటీలను పరిగణనలోకి తీసుకోవాలి. పన్నులన్నీ పోగా లాభం మిగులుతుందో లేదో ముందే అంచనా వేసుకోవాలి.మ్యూచువల్ ఫండ్స్/ ఈటీఎఫ్.. నేరుగా ట్రేడింగ్ చేసి నష్టపోయే కంటే నిపుణుల ద్వారా నిర్వహించబడే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం సురక్షితం.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
సెలవు అడిగితే.. పెళ్లి ఎమర్జెన్సీ కాదన్న బాస్
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో.. చాలా సందర్భాలలో తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వర్క్ కంటే పెళ్లి ముఖ్యం కాదని తమ బాస్ చెప్పినట్లు ఉద్యోగి వెల్లడించారు.నేను పనిచేస్తున్న కంపెనీలో.. నా నిశ్చితార్థం & వివాహం గురించి రెండు నెలల ముందే మేనేజర్లకు సమాచారం ఇచ్చాను. అయితే వాళ్లు దానిని సీరియస్గా తీసుకోలేదని.. పైగా పెళ్లి ఎమర్జెన్సీ కాదని చెప్పినట్లు ఉద్యోగి రెడ్దిట్ పోస్టు ద్వారా వివరించారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఉద్యోగం కంటే వ్యక్తిగత జీవితం ముఖ్యమని, అవసరమైతే కొంతకాలం ఉద్యోగం మానేయమని ఒకరు వెల్లడించగా.. చాలా కంపెనీలు ఇలాగే ఉన్నాయని, ఉద్యోగుల అవసరాలను సైతం గుర్తించడం లేదని మరొకరు వెల్లడించారు. జీవితంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమని ఇంకొకరు అన్నారు.కొన్ని సంస్థలు ఇప్పటికి కూడా పనికి ఇచ్చిన ప్రాధాన్యత.. ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ఈ విషయంపై గతంలో చాలా వార్తలు వెల్లడయ్యాయి. ''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా'' అంటూ గతంలో లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు.
తమిళనాడు సంస్కృతి పరిరక్షణకు..
డీఎంకే ఏలుబడిలో ఉన్న తమిళనాడుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా అరుదైన ఖనిజాల రవాణా కారిడార్ను నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీంతోపాటు చెన్నై మీదుగా పయనించే హైస్పీడ్ రైలు లింక్లను అభివృద్ధిచేయనున్నారు. పశ్చిమ కనుమల మార్గంలో పొధుగైమలై కొండ ప్రాంతంలో హైకింగ్, ట్రెక్కింగ్, మౌంటేన్ బైకింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు.పులికాట్ సరస్సుకు విచ్చేసే విదేశీ పక్షుల కోలాహలం, ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించేందుకు బర్డ్ వాచింగ్ పాయింట్లను నిర్మించనున్నారు. త్వరలో తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాల నిధులను భారీగా కేటాయించడం విశేషం. ఇనుప రాతి యుగం నాటి ప్రఖ్యాత ఆదిచనల్లూర్ ప్రాంతంలో పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ లభించిన పురాతన రాళ్లు, ఆనాటి నాగరికత వైభవాన్ని చాటే వస్తువులతో ఆర్కియాలాజికల్ సైట్ను అభివృద్ధిచేయనున్నారు.నాటి సంస్కృతికి కళ్లకు కట్టేలా అభివృద్ధి చేస్తామని ఆమె వెల్లడించారు. నడకదారిలో మొత్తం పురాతత్వ ప్రాంతాన్ని కలియతిరిగేలా వాక్వేలను నిర్మించనున్నారు. అక్కడి ప్రాచీన వస్తు వుల విశిష్టతను కథల రూపంలో చెప్పే లా, నాటి సాంకేతికతలను విడమర్చి విశదీకరించేలా గైడ్లను అందుబాటు లోకి తేనున్నారు. పాడైన ప్రాచీన వస్తు వులకు మరమ్మతులు, సంరక్షణ కోసం కన్జర్వేటివ్ ల్యాబ్ను ఏర్పాటు చేయ నున్నారు.పురాతత్వ ప్రాంతానికి విచ్చేసే పర్యా టకులు, విదేశీ సందర్శకుల్లో ఆ ప్రాంతంపై మరింత అవగాహన పెంచేలా ఎగ్జిబిషన్ల వంటివి ఏర్పా టుచేయనున్నారు. ‘అత్యంత అరుదైన మూలకాల కోసం ఖనిజాల తవ్వకం కోసం తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్ను ఏర్పాటుచేయబోతున్నాం. ఖనిజాల శుద్ధి, పరిశోధన, తయారీని మరింతగా ప్రోత్సహిస్తాం’ అని మంత్రి నిర్మల అన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
NHAI కొత్త రూల్.. ఫాస్ట్ట్యాగ్ యూజర్లకు గుడ్న్యూస్!
ఫాస్ట్ట్యాగ్ విధానంలో.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కీలకమైన సంస్కరణను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే FASTag యాక్టివేషన్ సమయంలో వాహన వివరాలను ధృవీకరించే పూర్తి బాధ్యతను బ్యాంకులకే అప్పగించింది.ఇంతకు ముందు.. వాహన యజమానులు అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించి ఫాస్ట్ట్యాగ్ పొందిన తరువాత కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉండేది. దీని వల్ల యాక్టివేషన్ ఆలస్యం కావడం, టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవడం, రిఫండ్స్ నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి.కొత్త విధానంతో.. ఫాస్ట్ట్యాగ్ జారీ తరువాత ప్రత్యేకంగా కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకులే మొదటిసారి వాహన పత్రాలను సరిగా పరిశీలించి ధృవీకరిస్తాయి. ఫలితంగా FASTag జారీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇది లక్షలాది మంది వాహన వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుంది.కేవైసీ సడలింపు కేవలం కొత్తగా జారీ అయ్యే ఫాస్ట్ట్యాగ్లకు మాత్రమే కాకుండా.. ఇప్పటికే జారీ చేసినవాటికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇకపై కేవైసీ తప్పనిసరి కాదు. అయితే.. ఫాస్ట్ట్యాగ్ వినియోగానికి సంబంధించిన మోసాలు జరిగినట్లు అనుమానం తలెత్తితే, కేవైసీ చేసుకోవాల్సిన ఉంటుంది.
15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మొత్తం 15 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో బడ్జెట్ రోజున సెన్సెక్స్ ఎనిమిది సార్లు నష్టాలు మూటగట్టుకుంది. ఏడు పర్యాయాలు లాభాలు ఆర్జించింది. ఇందులో 2019, 2024 సాధారణ ఎన్నికలకు ముందు రెండుసార్లు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.బడ్జెస్ట్ రోజు సెన్సెక్స్ ఇలా..➤2014 జూలై 10 - 72 పాయింట్ల లాభం: 25,373 వద్ద ముగింపు➤2015 ఫిబ్రవరి 28 - 141 పాయింట్ల లాభం: 29,362 వద్ద ముగింపు➤2016 ఫిబ్రవరి 29 - 152 పాయింట్ల నష్టం: 23,002 వద్ద ముగింపు➤2017 ఫిబ్రవరి 1 - 486 పాయింట్ల లాభం: 28,142 వద్ద ముగింపు➤2018 ఫిబ్రవరి 1 - 58 పాయింట్ల నష్టం: 35,907 వద్ద ముగింపు➤2019 ఫిబ్రవరి 1 - 213 పాయింట్ల లాభం: 36,469 వద్ద ముగింపు➤2019 జూలై 5 - 58 పాయింట్ల నష్టం: 39,513 వద్ద ముగింపు➤2020 ఫిబ్రవరి 1 - 395 పాయింట్ల నష్టం: 39,736 వద్ద ముగింపు➤2021 ఫిబ్రవరి 1 - 2,315 పాయింట్ల లాభం: 48,601 వద్ద ముగింపు➤2022 ఫిబ్రవరి 1 - 848 పాయింట్ల లాభం: 58,863 వద్ద ముగింపు➤2023 ఫిబ్రవరి 1 - 158 పాయింట్ల లాభం: 59,708 వద్ద ముగింపు➤2024 ఫిబ్రవరి 1 - 107 పాయింట్ల నష్టం: 71,645 వద్ద ముగింపు➤2024 జూలై 23 - 73 పాయింట్ల నష్టం: 80,429 వద్ద ముగింపు➤2025 ఫిబ్రవరి 1 - 5 పాయింట్ల నష్టం: 77,506 వద్ద ముగింపు➤2026 ఫిబ్రవరి 1 - 1,843 పాయింట్ల నష్టం: 80,723 వద్ద ముగింపు
కార్పొరేట్
సెలవు అడిగితే.. పెళ్లి ఎమర్జెన్సీ కాదన్న బాస్
ఇక ఇండియన్ ఐటీ పరిశ్రమదే కీలక పాత్ర
ఈవీలపై గుడ్ న్యూస్.. తగ్గనున్న ధరలు
జియో-బీపీ యాక్టివ్ టెక్నాలజీ పెట్రోల్
ఓవర్టైమ్ వర్క్.. మొబైల్ ఫోన్ చూస్తుండగా..
ఫిబ్రవరిలో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్..
ఎన్బీఎఫ్సీ బంగారం రుణాలు పెరుగుదల
యూఏసీతో ఫ్లెమింగో ఏరోస్పేస్ జట్టు
రష్యా నుంచి మళ్లీ చమురు దిగుమతి
వింగ్స్ ఇండియా 2026లో విమానాల కొనుగోలు ఒప్పందం
బడ్జెట్ దెబ్బ.. కుప్పకూలిన మార్కెట్లు
బడ్జెట్ 2026 దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలా...
హ్యాట్రిక్ క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. వరుసగ...
Budget 2026 : NRIలకు గుడ్న్యూస్, మార్కెట్లకు ఊతం, డైరెక్ట్ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ...
సండే స్టాక్ మార్కెట్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
సాధారణంగా ఆదివారం రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు. అ...
కూ.. చుక్చుక్! ష్.. గప్చుప్
కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార...
ఆ మందులు ఇక అంత ఖరీదు ఉండవ్..
కేంద్ర బడ్జెట్ 2026–27లో క్యాన్సర్ రోగులకు కీలక ఉ...
పారిశ్రామిక విప్లవానికి బడ్జెట్ బాటలు
కేంద్ర బడ్జెట్ 2026-27లో భారత ప్రభుత్వం దేశీయ ఉత్ప...
నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలోని కీలక ప్రకటనలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్...
ఆటోమొబైల్
టెక్నాలజీ
రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం!
భారతదేశంలోకి ప్రముఖ టెలికాం కంపెనీ 'ఎయిర్టెల్'.. ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా.. తన 36 కోట్ల వినియోగదారులకు ప్రముఖ డిజైన్ ప్లాట్ఫామ్ అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం (Adobe Express Premium)ను ఉచితంగా అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం అనేది కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే కాకుండా.. బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సుమారు రూ.4,000 విలువైన ఈ ప్రీమియం ప్యాకేజీని ఎయిర్టెల్ యూజర్లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.. ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.అడోబ్ ఎక్స్ప్రెస్ అనేది.. అడోబ్ రూపొందించిన ఒక సులభమైన, వేగవంతమైన క్రియేట్ ఎనీథింగ్ యాప్. డిజైన్ అనుభవం లేకపోయినా, ఎవరికైనా ప్రొఫెషనల్ స్థాయి పోస్టర్లు, సోషల్ మీడియా కంటెంట్, వీడియోలు, ఆహ్వాన పత్రికలు, మార్కెటింగ్ మెటీరియల్ రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో ఉన్న AI ఆధారిత ఫీచర్లు పనిని మరింత వేగంగా, ఆకర్షణీయంగా చేస్తాయి. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ట్లో లాగిన్ అయి ఈ సర్వీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.అడోబ్ ఎక్స్ప్రెస్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కాకుండా.. హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వినియోగదారులు తమ మాతృభాషలోనే డిజైన్ చేయగలుగుతారు. పండుగ శుభాకాంక్షలు, పెళ్లి ఆహ్వానాలు, వాట్సాప్ స్టేటస్లు, స్థానిక దుకాణాల ప్రమోషన్లు అన్నీ సులభంగా రూపొందించవచ్చు.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనాఅడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం ద్వారా.. కంటెంట్ క్రియేటర్లు & ఇన్ఫ్లూయెన్సర్లు.. రీల్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, వైరల్ కంటెంట్ సులభంగా తయారు చేయవచ్చు. సాధారణ వినియోగదారులు పండుగ శుభాకాంక్షలు, వ్యక్తిగత ఆహ్వానాలు పంపుకోవచ్చు. విద్యార్థులు ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు, పోర్ట్ఫోలియోలు రూపొందించవచ్చు. చిన్న వ్యాపారులు లోగోలు, పోస్టర్లు, సోషల్ మీడియా ప్రకటనలు నిమిషాల్లో రూపొందించవచ్చు.You x Us x @adobeexpress - collab of the year!Casually unlocking the quick & easy design app worth ₹4000 for all of you.#EveryoneCanDesign #MadeWithAdobeExpress #AirtelXAdobe pic.twitter.com/JmCHG4tvgE— airtel India (@airtelindia) January 29, 2026
సోషల్ మీడియాలో కొత్త సెన్సేషన్ ‘అప్స్క్రోల్డ్’ అసలేంటిది?
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తున్న యాప్ అప్స్క్రోల్డ్ (UpScrolled) ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్,టిక్టాక్లాంటి యాప్లకు ప్రత్యామ్నాయంగా దూసుకుపోతోంది. అసలేంటీ అప్స్క్రోల్డ్, ఎందుకు పాపులర్ అవుతోంది? తెలుసుకుందాం.ఎటాంటి సెన్సార్షిప్ లేదా దూకుడు అల్గారిథమ్లు లేని సురక్షితమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ప్రకటించుకుంటోంది యాజమాన్యం. యూజర్ డేటాను థర్డ్ పార్టీలకు అమ్మబోమని హామీ ఇస్తోంది. దీంతో యాక్టివిస్టులు, రాజకీయవేత్తలు సహా పలువురు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. టాప్లో దూకుడు, ఏకంగా సర్వర్లు క్రాష్ఆపిల్(iOS) యాండ్రాయిడ్ యాప్ స్టోర్లో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన యాప్గా ఇది నిలిచింది. జనవరి 2026 నాటికి, అమెరికాలో ఈ యాప్ ఆపిల్ యాప్ స్టోర్లో టాప్-10 లోకి చేరింది. టిక్టాక్ , మెటా (ఫేస్బుక్/ఇన్స్టాగ్రామ్) లపై అసంతృప్తిగా ఉన్న యాక్టివిస్టులు, క్రియేటర్లు ఈ ప్లాట్ఫారమ్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సార్షిప్లేని కంటెంట్ కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. పారదర్శకత ,న్యాయమైన కంటెంట్ను అందించే ప్లాట్పాం ప్రత్యామ్నాయాలన కోసం చూస్తున్నారు.ఆపిల్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో టిక్టాక్ను దాటేసింది. అంతేకాదు డౌన్లోడ్ల తాకిడికి జనవరి 26 న ప్లాట్ఫామ్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. టిక్టాక్ ప్లాట్ఫామ్ యాజమాన్య మార్పు తర్వాత సెన్సార్షిప్ ఆరోపణల మధ్య టిక్టాక్ను వదిలివేసి అప్స్క్రోల్డ్కు మారిపోతున్నారు.అప్స్క్రోల్డ్ ఎక్కడిది?ఆస్ట్రేలియాకు చెందిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్. దీనిని పాలస్తీనా-ఆస్ట్రేలియన్ డెవలపర్ ఇస్సాం హిజాజీ (Issam Hijazi) 2025,జూన్లో ప్రారంభించారు. ఇటీవల అమెరికాలో టిక్టాక్ యాజమాన్య మార్పుల నేపథ్యంలో, చాలామంది యూజర్లు ఈ యాప్ వైపు మళ్లుతున్నారు. దీని ‘‘ఎబౌట్" పేజీ ప్రకారం, పక్షపాతం, షాడోబ్యానింగ్ లేదా "అన్యాయమైన" అల్గారిథమ్ల ప్రమాదం లేకుండా యూజర్లందరూ తమ అభిప్రాయాలను పంచుకోవడానికి అనుమతించడమే అప్స్క్రోల్డ్ లక్ష్యం.కంపెనీ తమ మార్గదర్శకాలనుఉల్లంఘించే కంటెంట్ను మాత్రమే పరిమితం చేస్తుందట. అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ద్వేషపూరిత ప్రసంగం, బెదిరింపు, వేధింపులు, అశ్లీలం, లైసెన్స్ లేని కాపీరైట్ కంటెంట్ లేదా "హాని కలిగించడానికి ఉద్దేశించినది". UpScrolled కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడూ నిషేధించదని అని కూడా చెపుతోంది. ప్లాట్ఫారమ్ ఉంచి వీడియోలను లేదా మీ ఖాతాను తొలగిస్తే, ఎందుకు తొలగించిందో కూడా వివరిస్తుంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో పోలిస్తే దీని ప్రధానమైన తేడా దాని అల్గోరిథం. Discover Feedని ఉపయోగించవచ్చు డిస్కవర్ ఫీడ్, ఫాలోయింగ్ పీడ్ అని రెండు రకాలుగా యాప్ ఫీడ్లను విభజిస్తుంది. Following Feed అంటే మనం ఫాలో అయ్యే వ్యక్తుల పోస్ట్లు మాత్రమే వరుసగా కనిపిస్తాయి. Discover Feed అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న కంటెంట్ను చూడవచ్చు.ఇదీ చదవండి: కాబోయే సుప్రీం మొజ్తబా ఖమేనీ..దిమ్మదిరిగే వ్యాపార సామ్రాజ్యండిస్కవర్ ఫీడ్ అనేది వివిధ రకాల కంటెంట్ల మిశ్రమం, కానీ ప్రస్తుత ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణకు సంబంధించిన కంటెంట్తో నిండిపోతోంది. వాస్తవానికి, ప్రధాన స్రవంతి సోషల్ మీడియా యాప్లు ఈ రకమైన పోస్ట్లను సెన్సార్ చేస్తున్నాయనే ఆరోపణలకు ప్రతిస్పందనగా, చాలా మంది వినియోగదారులు ఈ ప్లాట్ఫామ్ను పాలస్తీనాకు మద్దతు ఇచ్చే కంటెంట్ కోసం దీన్ని ఒక వేదికగా ఎంచుకుంటున్నారు. దీంతోపాటు క్రీడలు, వార్తలు, గేమ్లు, సినిమాలు, సంగీతం, టెక్నాలజీ , ట్రావెల్ వంటి అనేక విభిన్న రకాల కంటెంట్లను అందిస్తామని వెల్లడించింది. టిక్టాక్, ఇన్స్టాలా కాకుండా, Discover Feed కొన్ని దూకుడు, వ్యక్తిగతీకరించిన అల్గారిథమ్ను ఉపయోగించదు. దీనికి బదులుగా, ఇది లైక్లు, కామెంట్స్, షేర్స్ మీదధారపడి ఉంటుంది.ముఖ్యమైన ఫీచర్లుప్రస్తుతం ఆండ్రాయిడ్ (Google Play Store, ఐఫోన్ (App Store) రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇందులో ఫోటోలు, చిన్న వీడియోలు (Short-form videos) , టెక్స్ట్ పోస్ట్లను షేర్ చేయవచ్చు. స్నేహితులతో నేరుగా చాట్ చేసే సదుపాయం కూడా ఉంది. ప్రధాన సోషల్ మీడియా సంస్థలు కొన్ని రకాల కంటెంట్ను (ముఖ్యంగా రాజకీయ అంశాలను) సెన్సార్ చేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో, "సెన్సార్షిప్ లేని ప్లాట్ఫారమ్"గా తనను తాను ప్రకటించుకుంది.షాడో బ్యానింగ్ (Shadowbanning) అంటే యూజర్ల పోస్ట్లను రహస్యంగా అణచివేయడం ఉండదు. ఇతర యాప్లలాగా యూజర్లను అడిక్ట్ చేసే క్లిష్టమైన అల్గారిథమ్స్ కాకుండా, సాధారణమైన క్రోనలాజికల్ (సమయానుకూల) ఫీడ్ను ఇది అందిస్తుంది.అయితే ఇది తన సేవా నిబంధనలను దూకుడుగా కొత్త ట్రాకింగ్తో అప్డేట్ చేస్తోందని, కొన్ని కంటెంట్ రకాలను బ్లాక్ చేస్తోందని, కొత్త పోస్ట్లను "షాడోబ్యాన్" చేస్తోందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!
వివో కొత్త స్మార్ట్ఫోన్.. రెండు వేరియంట్లు
మొబైల్ తయారీ సంస్థ వివో తన ప్రీమియం సెగ్మెంట్లో జైస్ పార్టనర్షిప్తో ‘వివో ఎక్స్200టీ’ స్మార్ట్ మొబైల్ను లోకి విడుదల చేసింది. స్పెసిఫికేషన్ల చూస్తే.., 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్డీ రిఫ్రెష్ రేటు, హెచ్డీఆర్ 10+ సపోర్ట్ ఉంది 3.73 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ను అమర్చారు. ఈ ఫోన్లో వెనక వైపు 50 ఎంపీ సామర్థ్యం కలిగిన 3, ముందువైపు 32 ఎంపీ కెమెరా లున్నాయి. 6,200ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. 40డబ్ల్యూ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.59,999గా, 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ.69,999గా ఉన్నాయి. ఈ మొబైల్కు ఐదేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, 7ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ హామీ ఇస్తోంది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో కొనుగోళ్లపై రూ.5వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఫోన్ ఎక్సే్ఛంజీ బోనస్ రూ.5 వేలు లభిస్తుంది. ప్రస్తుతం ప్రీబుకింగ్స్ మొదలయ్యాయి.ఇదీ చదవండి: ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్
హాయ్ ఫ్రెండ్స్... ఇన్స్టా ఇకపై ఫ్రీ కాకపోవచ్చు!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి తన ప్లాట్ఫాంలలో కొత్త చెల్లింపు సబ్స్క్రిప్షన్లను ప్రవేశపెట్టేందుకు మెటా సిద్ధమవుతోంది. యాప్ల ప్రాథమిక వెర్షన్లు ఉచితంగానే కొనసాగుతాయి. అయితే ఉత్పాదకత, సృజనాత్మకత, ఆధునిక ఏఐ (AI) టూల్స్తో వచ్చే అదనపు ఫీచర్ల కోసం ప్రీమియం ప్లాన్లను పరీక్షించనున్నట్లు మెటా టెక్క్రంచ్కు ధ్రువీకరించింది.మెటా ప్రకారం.. ప్రతి యాప్కు దాని ప్రత్యేక ప్రయోజనాలకు అనుగుణంగా వేర్వేరు సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఉంటాయి. ఒకే స్థిరమైన ప్లాన్కు బదులుగా, వివిధ ఫీచర్ బండిల్స్ను ప్రయోగాత్మకంగా అందించి, వినియోగదారులకు ఏవి ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకోవాలని కంపెనీ భావిస్తోంది.ఈ సబ్స్క్రిప్షన్లలో ప్రధానంగా ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి. మెటా ఇటీవల సుమారు 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ‘మానస్’ ఏఐ ఏజెంట్ను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని యోచిస్తోంది. మానస్ను మెటా యాప్లలోనే భాగంగా చేర్చడమే కాకుండా, వ్యాపారాల కోసం ప్రత్యేక సబ్స్క్రిప్షన్గా కూడా అందించనుంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో మానస్ ఏఐ షార్ట్కట్ను జోడించే పనిలో మెటా ఉంది.అలాగే, అధునాతన ఏఐ ఫీచర్లకు ఛార్జీలు వసూలు చేయాలని కూడా మెటా భావిస్తోంది. ఉదాహరణకు, ‘వైబ్స్’ అనే ఏఐ ఆధారిత షార్ట్-ఫార్మ్ వీడియో టూల్. దీంట్లో ఏఐని ఉపయోగించి వీడియోలను సృష్టించడం, రీమిక్స్ చేయడం వంటివి చేయొచ్చు. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న ఈ ఫీచర్ను ఫ్రీమియం మోడల్కు మార్చే యోచనలో మెటా ఉంది.ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు అపరిమిత ఆడియన్స్ లిస్టులు సృష్టించే అవకాశం, ఎవరు తిరిగి ఫాలో చేయడం లేదో తెలుసుకునే ఫీచర్, స్టోరీలను అనామకంగా వీక్షించే సౌకర్యం (పోస్టర్కు తెలియకుండా) వంటి అదనపు ఫీచర్లు అందుబాటులోకి రావొచ్చు.కాగా ఈ కొత్త సబ్స్క్రిప్షన్లు, మెటా వెరిఫైడ్ వేరువేరు. మెటా వెరిఫైడ్ ప్రధానంగా క్రియేటర్లు, బిజినెస్ అకౌంట్ల కోసం రూపొందించినది. ఇందులో వెరిఫైడ్ బ్యాడ్జ్, డైరెక్ట్ సపోర్ట్, ఇంపర్సనేషన్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. రాబోయే కొత్త సబ్స్క్రిప్షన్లు మాత్రం సాధారణ రోజువారీ యాజర్ల కోసం తీసుకొస్తున్నవి.
పర్సనల్ ఫైనాన్స్
నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
సొంత ఇల్లు కొనాలన్నా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా సామాన్యుడికి ఎన్నో లెక్కలు.. మరెన్నో సందేహాలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భద్రంగా ఉంటుంది? ఎక్కడ పెడితే లాభసాటిగా ఉంటుంది? అన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, బంగారం నుంచి ఇన్సూరెన్స్ వరకు పెట్టుబడిదారుల మదిలో మెదిలే కీలక ప్రశ్నలకు ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక సమాధానాలు మీకోసం..రియల్టీ..నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం మేలా... లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలా?రెండింట్లోనూ దేనికుండే లాభాలు, దేనికి ఉండే ఇబ్బందులు దానికున్నాయి. ఎందుకంటే నిర్మాణం పూర్తయి తక్షణం వెళ్లగల ఇంటిని కొనుక్కోవటం సురక్షితం. వెంటనే వెళ్లిపోవచ్చు. వేచి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇళ్ల ధర సహ జంగానే ఎక్కువ ఉంటుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఇల్లయితే ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పటికి పూర్తవుతుంది... ఎప్పుడు డెలివరీ ఇస్తారు అనే విషయాలకు గ్యారంటీ ఉండదు. ఇవన్నీ బిల్డరు పూర్వ చరిత్రను చూసి ముందుకు వెళ్లాల్సిన విషయాలే. కాకపోతే ఎంత పేరున్న బిల్డరయినా ఒకోసారి ఇబ్బందులో పడొచ్చు. దానివల్ల మనకు ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యం కావచ్చు. అందుకని మీ అవసరం, వేచిచూసే సామర్థ్యాన్ని బట్టి దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. బ్యాంకింగ్..ఎఫ్డీ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటును బట్టి బ్యాంకును ఎంచుకోవాలా? లేక సర్వీసును చూశా?మీరు ఎంత మొత్తాన్ని ఎఫ్డీ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అది తక్కువ మొత్తమే అనుకోండి. వడ్డీ రేటు చూసి ఎఫ్డీ చెయ్యండి. అలాకాకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకున్నానుకోండి. అపుడు బ్యాంకు అందిస్తున్న సేవలు, డిజిటల్ సౌకర్యాలు, ఆ బ్యాంకు ఎంత సురక్షితమైనది... అనే అంశాలన్నీ చూడాలి. 0.1 లేదా 0.25 వడ్డీ శాతం కన్నా మన సొమ్ము భద్రంగా ఉండటం ముఖ్యం కదా!. అందుకే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనే అంశాన్ని బట్టి బ్యాంకును ఎంచుకోండి. మీరు చేసే ఎఫ్డీ గనక రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. అది ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ మొత్తానికి డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద బీమా ఉంటుంది. కాబట్టి సురక్షితం. బంగారం సావరిన్ గోల్డ్ బాండ్స్ సురక్షితమేనా? అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా?సావరిన్ గోల్డ్ బాండ్లు పూర్తిగా సురక్షితం. వాటికి ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చెయ్యటాన్ని కేంద్రం నిలిపేసింది. గతంలో జారీ చేసినపుడు కొన్నవాటికి మాత్రం మెచ్యూరిటీ అయిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇవి మరికొన్ని సంవత్సరాలు జరుగుతాయి కూడా. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినవారికి బంగారం ధర ఎంత పెరిగితే అంత చెల్లించటంతో పాటు ఏటా 2.5 శాతం మొత్తాన్ని అదనంగా కూడా చెల్లిస్తారు. భౌతికంగా బంగారం కొనటం కన్నా ఇదే ఎక్కువ లాభం కదా!. కాకపోతే ఇందులో ఉండే రిస్కల్లా ఒకటే. బంగారం ధర తగ్గితే చెల్లించేటపుడు తగ్గిన ధరే చెల్లిస్తారు. ఏడేళ్ల పాటు కాలపరిమితి ఉండటంతో పాటు ఐదేళ్ల లాకిన్ కూడా ఉంది.స్టాక్ మార్కెట్...1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కనక ఆదివారమైనా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని ప్రకటించారు. బడ్జెట్కు, స్టాక్ మార్కెట్కు సంబంధమేంటి?బడ్జెట్ ప్రవేశపెట్టిననాడు సెలవు దినమైతే ఆ రోజున స్టాక్ మార్కెట్ ప్రత్యేకంగా పనిచేయటమన్నది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మొదలైన సంప్రదాయం. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 శనివారం వచి్చంది. ఆ రోజునా స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఇపుడు ఆదివారం కూడా పనిచేస్తాయని ప్రకటించారు. వాస్తవానికి బడ్జెట్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇపుడు బడ్జెట్ సమయంలో మార్కెట్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది లైవ్లో దేశ ప్రజలకు తెలుస్తుందని, తమ నిర్ణయాలకు మార్కెట్ ఆమోదం ఉందో లేదో కూడా తెలిసిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.మ్యూచువల్ ఫండ్స్...సాధారణ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం సురక్షితమేనా?షేర్లలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్ చాలా సురక్షితం. అలాగని వాటిలో రిస్కు ఉండదని కాదు. అవి ఏ బాండ్లు కొంటున్నాయనేదాన్ని బట్టి అవెంత సురక్షితమో చెప్పొచ్చు. సాధారణంగా డెట్ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోను, ట్రెజరీ బిల్స్లోను, కార్పొరేట్ బాండ్లలోను, మనీమార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు తక్కువ. తక్కువైనా... స్థిరమైన రాబడులుంటాయి. అయితే ఈ ఫండ్లు కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సదరు కంపెనీ క్రెడిట్ రేటింగ్ తగ్గితే అది కొంతమేర రిస్కే. ఇక వడ్డీరేట్లు పెరిగినపుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఫండ్లు తమ బాండ్లను అమ్మటానికి ప్రయత్నించినా ఎవరూ కొనకపోవచ్చు. ఈ రిస్క్లు దృష్టిలో పెట్టుకోవాలి.ఇన్సూరెన్స్ఆయుష్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలోకి వస్తాయా?మన దేశంలో ఇపుడు చాలా పాలసీలు ఆయుష్ ట్రీట్మెంట్కు కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని షరతులుంటున్నాయి. ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వంటి చికిత్సలన్నీ ఆయుష్ పరిధిలోకి వస్తా యి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేక ప్రభు త్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనో, ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ ఉన్న ఆయుష్ ఆసుపత్రిలోనో తీసుకున్న చికిత్సకే కవరేజీ ఇస్తున్నారు. ఔట్పేషెంట్ చికిత్సలకు కాకుండా... ఆసుపత్రిలో చేరిన చికిత్స లకే ఇది వర్తిస్తుంది. గుర్తింపు లేని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నేరుగా మందులు కొనుక్కున్నా, వెల్నెస్ థెరపీ, స్పా, రిజువనేషన్ చికిత్సలకు ఇది వర్తించదు. పైపెచ్చు చాలా పాలసీలు కవరేజీ మొత్తాన్ని ఏడాదికి రూ.25వేల నుంచి రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..
విశ్రాంత జీవనంలోనూ ‘ఫండించొచ్చు!
స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటేనే కాస్త టెన్షన్. ఎందుకంటే ఇక్కడ రాబడుల వెనకాల రిస్కూ ఉంటుంది. వయసులో ఉన్నవారికైతే ఓకే. మార్కెట్లు పడినా కొన్నాళ్లు వేచిచూస్తే మళ్లీ సర్దుకుంటాయి. మరి రిటైరీల మాటేంటి? నెలవారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సిన సీనియర్ సిటిజన్లు ఈ టెన్షన్లతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించటం సాధ్యమా? అలాగని ఎఫ్డీలపైనే ఆధారపడితే అంతకంతకూ వడ్డీ రేట్లు తగ్గుతూ పోతున్నాయి. పైపెచ్చు జీవన వ్యయాలు, వైద్యం ఖర్చుల్లాంటివి పెరిగిపోతున్నాయి. మరి విశ్రాంత జీవనం గౌరవప్రదంగా, ఆర్థికంగా స్వేచ్ఛతో సాగించాలంటే దారేంటి? ద్రవ్యోల్బణాన్ని మించి కాకపోయినా బ్యాంకు ఎఫ్డీలకన్నా మెరుగైన రాబడి అందించే సాధనాలు ఏమున్నాయి? మ్యుచువల్ ఫండ్స్ వైపు మళ్లొచ్చా? అసలు సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా అనే ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు దొర కవు. కాకపోతే ఆచి తూచి, సరైన వ్యూహంతో ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లకూ ఫండ్స్ ప్రయోజనకరంగానే ఉంటాయనేది నిపుణుల మాట. దాన్ని వివరించే ప్రయత్నమే ఈ వెల్త్ స్టోరీ....ప్రాధాన్యాలు మారుతాయి.. వయస్సు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మారుతాయి. యువ ఇన్వెస్టర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలు, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. వారికి రాబడికన్నా తమ పెట్టుబడిని కాపాడుకోవటం ముఖ్యం. క్రమం తప్పకుండా, కచ్చితంగా కొంత మొత్తం ఆదాయంగా చేతికి అందటం అంతకన్నా ముఖ్యం. అది కూడా పెరిగే ధరలను తట్టుకునే భరోసానివ్వాలి. ఆరోగ్యం పరంగానో లేక మరొకటో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే చేతిలో నగదు ఉండాలి. ఇలా ఒకటా, రెండా.. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో విషయాలు చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు తోడుగా ఉంటూ, ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయకరంగానూ ఉంటాయి. సౌకర్యవంతంగా జీవించాలంటే... ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో, అద్దెను మినహాయించి తక్కువలో తక్కువగా, ఓ మధ్యతరగతి సీనియర్ సిటిజన్ కుటుంబ ఖర్చులు ఇలా ఉంటున్నాయి... → కరెంటు, ఇంటి మెయింటెనెన్సు మొదలైనవి: రూ. 8,000–10,000 → నిత్యావసరాలు : రూ. 10,000–12,000 → వైద్యం, ఔషధాల ఖర్చులు: రూ. 5,000–7,000 → ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ఖర్చులు: రూ. 5,000–6,000 → ఇలా, ఒక మోస్తరు సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకు సింపుల్గా రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అవసరమవుతోంది. → మరికాస్త సౌకర్యవంతంగా ఉండాలంటే (ట్రావెల్, హాబీలు, పని మనుషులు) ఖర్చులు నెలకు రూ. 45,000–60,000 వరకు పెరుగుతాయి.ఇంత ఆదాయం రావాలంటే ఎంత దాచిపెట్టాలి? రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చుల కోసం నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అందుకోవాలంటే, అందుకు ఏ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి? వార్షికంగా ఎంత మొత్తం రాబడిని ఆశించవచ్చు అనేది మరో ప్రశ్న. సీనియర్ సిటిజన్లకు, పెట్టుబడి భారీగా వృద్ధి చెందడం కన్నా, రాబడిపరమైన భద్రత అవసరం కాబట్టి తక్కువలో తక్కువగా ఏటా 6–7 శాతం రాబడిని ఆశించవచ్చు. దాన్ని బట్టి, పెద్దగా రిస్కులు ఉండని, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రాతిపదికన చూస్తే..సీనియర్ సిటిజన్లకు పెట్టుబడి ఆప్షన్లు.. → బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములు – స్థిరత్వం కోసం ఇవి పెట్టుబడులకు భద్రతనిచ్చేలా, రాబడులు అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది. కాకపోతే పెరిగే ధరలకు తగ్గ స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. కాబట్టి పోర్ట్ఫోలియోలో వీటికి 30–40 శాతం పెట్టుబడిని కేటాయించవచ్చు. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో వివిధ కేటగిరీలున్నా.. సీనియర్ సిటిజన్లకు ఈ కిందివి అనువైనవిగా ఉంటాయి. → సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్స్ → స్వల్పకాలిక ఫండ్స్ → కార్పొరేట్ బాండ్ ఫండ్స్ వీటిని ఎందుకు పరిశీలించవచ్చంటే, ఇవి ఎఫ్డీలతో పోలిస్తే పన్నుల అనంతరం మరింత మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు కింద మార్చుకునే (లిక్విడిటీ) వీలుంటుంది. విత్డ్రాయల్ సులభతరంగా ఉంటుంది. వీటికి 30–35 శాతం కేటాయించవచ్చు. → ఎస్డబ్ల్యూపీ (సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్) – పొదుపు మొత్తం నుంచి నెలవారీ జీతం ఎస్డబ్ల్యూపీ అనేది మ్యుచువల్ ఫండ్స్ నుంచి ప్రతి నెలా ఇంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పెన్షనో లేదా శాలరీగానో అనుకోవచ్చు. వడ్డీ ఆదాయంతో పోలిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎంత విత్డ్రా చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. డెట్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్తో కలిపి ఉపయోగించుకోవచ్చు. → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ – పరిమిత స్థాయిలోనే, కాకపోతే కీలకం సీనియర్ సిటిజన్స్ అయినంత మాత్రాన షేర్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. పెట్టుబడుల్లో 10–20 శాతానికి మించకుండా ఈక్విటీలకు కేటాయించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి పొదుపు మొత్తాలను కాపాడుకోవడానికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. శాంపిల్ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో (రూ. 1 కోటి నిధి) → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు + ఎస్సీఎస్ఎస్: రూ. 35 లక్షలు → డెట్/కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: రూ. 35 లక్షలు → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ / ఇండెక్స్ ఫండ్స్: రూ. 15 లక్షలు → ఎమర్జెన్సీ నగదు – సేవింగ్స్: రూ. 15 లక్షలు పోర్ట్ఫోలియోను ఇలా తీర్చిదిద్దుకుంటే ఒక మోస్తరు స్థిరత్వంతో ప్రతి నెలా సుమారు రూ.45,000 నుంచి రూ. 55,000 వరకు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ గుర్తుంచుకోతగిన కీలకమైన అయిదు సూత్రాలు .. → భారీ రాబడుల హామీలతో ఊరించే స్కీములకు దూరంగా ఉండాలి → వడ్డీపై మాత్రమే ఆధారపడకుండా ఎస్డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలి→ చేతిలో ఉన్న మొత్తం నిధిని ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయొద్దు.→ నామినేషన్లు, వీలునామా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోవాలి → తగినంత స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి.
రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?
ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.లాకర్లోని వస్తువులకు బీమా ఉంటుందా?లాకర్లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.ప్రత్యేక ఆభరణాల బీమా అవసరంవిలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.క్లెయిమ్ సులభంగా రావాలంటే..ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం.
లైఫ్ ఇన్సూరెన్స్.. ఎందుకు తీసుకోవాలంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రజల జీవన విధానం కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగాలవైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారికి పదవీ విరమణ తర్వాత జీవితం.. సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం. వయసు పెరిగేకొద్దీ.. వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మనం ఈ కథనంలో పదవీ విరమణ ప్రణాళికలో జీవిత బీమా ఎందుకు ముఖ్యమో చూసేద్దాం.పదవీ విరమణ తర్వాత ఆదాయంఉద్యోగం చేస్తున్న వ్యక్తి పదవీ విరమణ చేస్తే జీతం ఆగిపోతుంది. అలాంటి సమయంలో.. ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం అవసరం. కొన్ని జీవిత బీమా పథకాలు పదవీ విరమణ తర్వాత నెలవారీ లేదా వార్షిక ఆదాయం అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీలు, ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లు వంటి అనేక ప్రణాళికలు ఒకేసారి మొత్తం ఇవ్వడం కాకుండా.. నిరంతర ఆదాయం అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడుతుంది.వైద్య ఖర్చులువయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గుతుంది. ఖర్చుల గురించి ఆందోళన లేకుండా మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది.అప్పులు తీర్చేందుకుకొన్ని సందర్భాల్లో హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్లు పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి అప్పులు వృద్ధాప్యంలో తప్పకుండా భారం అవుతాయి. జీవిత బీమా పాలసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన అప్పులను తీర్చేయవచ్చు. దీంతో అప్పుల ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.ఖర్చుల నుంచి రక్షణకాలక్రమంలో ఖర్చులు పెరగవచ్చు. దీనికోసం డబ్బు దాచుకుంటే సరిపోదు. డబ్బును పెంచుకునే మార్గాలు ఉండేలా చూడాలి. దీనికోసం ULIPల వంటి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పథకాలు. పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వృద్ధి పొందుతాయి.తక్షణ నగదు లభ్యతభూములు, ఇళ్లు వంటి స్థిర ఆస్తులను అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. కానీ జీవిత బీమా నుంచి వచ్చే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. అంతే కాకుండా.. ఈ మొత్తంపై ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబానికి అవసరమైన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..



