Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

PFC Declares Rs 3. 25 Interim Dividend for FY26: Record Date 23 March1
పీఎఫ్‌సీ డివిడెండ్‌ రూ. 3.25

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) నాలుగో మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించేందుకు అనుమతించింది. దీంతో వాటాదారులకు షేరుకి రూ. 3.25 చొప్పున లభించనుంది. ఇందుకు ఈ నెల 23 రికార్డ్‌ డేట్‌కాగా.. ఏప్రిల్‌ 16కల్లా చెల్లించనుంది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో రూ. 1,60,000 కోట్ల రుణ సమీకరణ ప్రణాళికకు సైతం బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది.ఈబీఆర్‌ నిధులకు సంబంధంలేకుండా వీటిని ఒకేసారి లేదా దశలవారీగా వివిధ మూలాల నుంచి సమీకరించనుంది. వీటిలో రూ. లక్ష కోట్లు బాండ్లు, సెక్యూరిటీలు, మధ్యకాలిక ఇన్‌స్ట్రుమెంట్స్, కాలావధి రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. వివిధ ఇన్‌స్ట్రుమెంట్స్‌ జారీతో రూ. 20,000 కోట్ల విదేశీ మారకపు రుణాలు సైతం వీటిలో కలసి ఉన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో పీఎఫ్‌సీ షేరు బీఎస్‌ఈలో 3% జంప్‌చేసి రూ. 418 వద్ద ముగిసింది.

Latest Gold and Silver Price in India2
సాయంత్రానికి సగం తగ్గిన గోల్డ్ రేటు!

రోజురోజుకి తగ్గుతున్న గోల్డ్ రేటు ఈ రోజు (మంగళవారం) కొంత పెరిగింది. అయితే 24 గంటలు కూడా గడవకముందే.. పెరిగిన రేటులో సగం తగ్గిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం లేటెస్ట్ ధరల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,45,400 రూపాయల వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల బంగారం ధర సాయంత్రానికి రూ.1,44,900 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.500 తగ్గిందన్నమాట. 24 క్యారెట్ల ధర 1,58,620 రూపాయల నుంచి రూ.1,58,080 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో లేటెస్ట్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 158230 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 145050 రూపాయల వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం ఉన్న ధరల కంటే తక్కువ కావడం గమనార్హం.చెన్నైలో గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ధరలు ఉదయం ఎలా ఉన్నాయో, సాయంత్రానికి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,46,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,59,820 వద్ద ఉంది.

BYD Sealion 7 Anniversary Edition Launched In India3
బీవైడీ సీలియన్ కొత్త ఎడిషన్: ధర, వివరాలు

బీవైడీ కంపెనీ భారతదేశంలో తన సీలియన్ 7 కారును లాంచ్ చేసి ఏడాది కాలం అయింది. ఈ సందర్భంగా సంస్థ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీనికోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.70000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని బీవైడీ వెల్లడించింది.బీవైడీ సీలియన్ 7 యానివర్సరీ ఎడిషన్‌ ప్రీమియం, పెర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు, కాగా ప్రీమియం వెర్షన్ అదే వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుంది. రెండు వేరియంట్లు 82.56 kWh బ్యాటరీ ప్యాక్‌ పొందినప్పటికీ.. NEDC ప్రమాణాల ప్రకారం, పెర్ఫార్మెన్స్ మోడల్ డ్రైవింగ్ రేంజ్ 542 కిలోమీటర్లు కాగా.. ప్రీమియం వేరియంట్ 567 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.బీవైడీ సీలియన్ 7 యానివర్సరీ ఎడిషన్‌ ప్రీమియం, పెర్ఫామెన్స్ ధరలు వరుసగా.. రూ. 49.40 లక్షలు, రూ. 54.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ముందు బుక్ చేసుకున్న 1100 మందికి ఇన్‌స్టాలేషన్‌తో పాటు 11 kW హోమ్ ఛార్జర్‌ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తారు. అంతేకాకుండా, ఈ ప్యాకేజీలో రెండు సంవత్సరాల ఉచిత సర్వీస్ మరియు మెయింటెనెన్స్ కూడా లభిస్తాయి.

EPF Pension of Rs 1000 Deemed Inadequate Panel Urges Increase4
EPF కనీస పెన్షన్ పెంపు.. పార్లమెంటు కమిటీ కీలక సిఫార్సులు

ఈపీఎఫ్ చందాదారులు రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్‌కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 (EPS, 1995) కింద.. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్స్‌టైల్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అందుతున్న మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని, దాన్ని రూ.7,500కు పెంచాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది.కనీస పెన్షన్‌పై ఇప్పటికే పెన్షనర్ల నుంచి పలు విజ్ఞాపనలు వచ్చినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కనీస మొత్తం ఏమాత్రం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995ని పునః సమీక్షించి పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కేటాయింపులు చేయాలని సూచించింది.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!

Conduct Thorough Verification Before Purchasing House Sites or Plot Says Hydraa5
ప్లాట్ కొనేముందు ఇలా చేయండి: హైడ్రా హెచ్చరిక

రాజధానిలో ప్లాట్, ఇంటి స్థలం కొనేముందు పూర్తిగా విచారించి, అన్నీ సరిగా ఉంటేనే ముందుకెళ్లాలని హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఏమైనా ఉందా? అనుమతి పొందిన లే అవుట్ అయినా.. ఇంటి నంబరు, బై నంబర్లతో అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొంది.ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు చేసింది. కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 48 ఫిర్యాదులు వచ్చాయి.అమీన్‌పూర్‌ చెరువులో తమ లేఔట్‌ మునిగిపోయిందని సెక్రటేరియట్‌ ఎంప్లాయీస్‌ హౌసింగ్‌ సొసైటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వాపోయారు.కాప్రా జీఆర్‌ రెడ్డి నగర్‌ హెచ్‌ఎండీఏ లే ఔట్‌లో మొత్తం నాలుగు పార్కులు ఉన్నాయి. ఒక పార్కులో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రార్థన స్థలాలు వస్తున్నాయని నివాసితులు ఫిర్యాదు చేశారు. బాలానగర్‌ శోభనా కాలనీలోని అక్షయ ఎన్‌క్లేవ్‌ పేరిట 7.12 ఎకరాల్లో 69 ప్లాట్లతో 1983లో లేఔట్‌ వేశారు. ఇందులో రెండు స్థలాలను పార్కుల కోసం కేటాయించారు. 1700 గజాల పార్కును కబ్జా చేసేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200 గజాలు ఆక్రమించి షెడ్డు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే హైడ్రా స్పందించి చర్యలు తీసుకోవాలని, పార్కును కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Biggest Bubble Bust Rich Dad Poor Dad Author Robert Kiyosaki6
కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పెట్టుబడికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో ట్వీట్ చేసారు. చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' ఉందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' (ఒక ఆస్తి విలువ.. అసలు విలువ కంటే చాలా ఎక్కువగా పెరగడం) జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు, అని కియోసాకి పేర్కొన్నారు. ''అది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అన్నదే ప్రశ్న'' అని అన్నారు.బబుల్ బస్ట్ సంఘటన జరిగినప్పుడు.. ఒక ఏడాది తరువాత గోల్డ్ ధర ఔన్సుకు 35,000 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బిట్‌కాయిన్ ధర 7,50,000 డాలర్లకు, ఇథీరియం ధర 95,000 డాలర్లకు చేరుకుంటుంటుందని కియోసాకి వెల్లడించారు.ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులు (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, ఇథీరియం) మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి అలోచించి ఇన్వెస్ట్ చేయండి. ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయమా? అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.BIGGEST BUBBLE BUSTI do not know what pin, what event will pop the biggest bubbles in histor. What ever the event, the pin is near.It’s not IF. It’s WHEN.When the bubbles go bust I predict gold will hit $35,000 an ounce one year after the gold bubble goes pop..I predict…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 16, 2026

Advertisement
Advertisement
Advertisement