Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Quick Heal Antifraud App in Freemium Model1
మోసాల నివారణకు.. యాంటీఫ్రాడ్‌ యాప్‌

సీమాంతర సైబర్‌ ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ తాజాగా మోసాల నివారణ సొల్యూషన్‌ యాంటీఫ్రాడ్‌డాట్‌ఏఐ ఫ్రీమియం వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఫోన్‌లో కనిపించే హానికరమైన యాప్‌లతో పాటు కనిపించకుండా దాక్కునే యాప్‌లను కూడా గుర్తించడం దీని ప్రత్యేకత.ఫిషింగ్, స్పైవేర్, ఆర్థిక మోసాలపరమైన దాడుల కోసం ఉపయోగించే ఈ హిడెన్‌ యాప్‌లు యూజరుకు తెలియకుండా పని చేస్తాయి. ఇలాంటి యాప్‌ల గురించి యాంటీఫ్రాడ్‌డాట్‌ఏఐ యూజర్లను అలర్టు చేసి, తగు చర్యలు తీసుకునేందుకు సహాయపడుతుంది.స్కామ్‌ ప్రొటెక్షన్, రిస్క్‌ ప్రొఫైల్‌ అసెస్‌మెంట్, కాల్‌ ఫార్వార్డింగ్‌.. బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ అలర్ట్, ఫ్రాడ్‌ ప్రొటెక్ట్‌ బడ్డీ మొదలైన ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీన్ని ప్రాథమికంగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, మరింత భద్రత కోరుకునే వారు సబ్‌్రస్కిప్షన్‌ ద్వారా ప్రీమియం వెర్షన్‌ తీసుకోవచ్చని సంస్థ సీఈవో విశాల్‌ సాల్వి తెలిపారు.

Nitin Gadkari Wife Grows Organic Onions Their Nagpur Farm2
గడ్కరీ సతీమణి పండించిన ఉల్లి: ఒక్కొక్కటి కేజీ బరువు! అదెలాగంటే?

నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిగా విధులు నిర్వహిస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. పెట్రోల్ & డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వెహికల్స్ వినియోగించాలని చెబుతూ.. హైడ్రోజన్ కారులో పార్లమెంటుకు వెళ్లి, పర్యావరణంపై ఆయనకున్న మక్కువను చూపించారు. భర్త బాటలోనే నడుస్తూ.. గడ్కరీ సతీమణి ఆర్గానిక్ పద్దతిలో, మల్చింగ్ పేపర్ టెక్నాలజీతో ఉల్లిని పండించారు.ఉల్లిని అందరూ పండిస్తారు.. అందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ వీరు పండించిన ఉల్లి ఒక్కొక్కటి సుమారు 800 గ్రాముల నుంచి 1000 గ్రాములు లేదా ఒక కేజీ బరువు ఉన్నాయి. ఈ విషయాన్ని గడ్కరీ తన ఎక్స్ ఖాతలో పేర్కొన్నారు. ''నా భార్య కాంచన్, నాగ్‌పూర్‌లోని ధపేవాడలోని మా భక్తి ఫామ్‌లో, మల్చింగ్ పేపర్ టెక్నిక్ ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేసి, ఒక కిలో వరకు బరువున్న సేంద్రీయ ఉల్లిపాయలను విజయవంతంగా ఉత్పత్తి చేశారు'' అని ట్వీట్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పొలం దున్నడం.. ఉల్లి విత్తనాలను నాటు వేయడం వంటివన్నీ చూడవచ్చు. మొత్తానికి ఇక్కడ పండిన ఉల్లి సాధారణ ఉల్లికంటే.. చాలా పెద్దవిగా ఉన్నాయి. ఒక రకంగా వీటిని బాహుబలి ఉల్లి అని కూడా చెప్పొచ్చు.మల్చింగ్ పేపర్ టెక్నాలజీమల్చింగ్ పేపర్ టెక్నాలజీలో.. మట్టి బెడ్ మీద ఒక ప్లాస్టిక్ షీట్ కప్పుతారు. దీనిపైన చిన్న రంధ్రాలు చేసి.. ఉల్లినారు నాటుతారు. ఈ విధంగా వ్యవసాయం చేయడం వల్ల నీటి వృధా తగ్గుతుంది. కలుపు మొక్కలను నివారించవచ్చు. ఈ ఉల్లిని పండించడానికి కాంచన్ గడ్కరీ సేంద్రీయ పద్ధతులనే ఉపయోగించారు. అంతే కాకుండా.. ఉల్లి విత్తనాలను ప్రత్యేకంగా నెదర్లాండ్స్ నుంచి తెప్పించి ప్రయోగం చేశారు.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరికనాణ్యమైన విత్తనాలు ఉపయోగించి.. సహజ సిద్దమైన పద్దతులతో వ్యవసాయం చేస్తే తప్పకుండా మంచి దిగుబడి ఉంటుందని గడ్కరీ దంపతులు చెబుతున్నారు. అంతే కాకుండా.. స్థానిక రైతులకు ఈ పద్దతిపై అవగాహన కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంచన్ గడ్కరీ పేర్కొన్నారు.नागपुर के धापेवाड़ा स्थित हमारे भक्ति फार्म में मेरी पत्नी, श्रीमती कांचन ने एक अनूठा प्रयोग करते हुए, मल्चिंग पेपर तकनीक का इस्तेमाल कर एक किलो तक वज़न वाले ऑर्गेनिक प्याज़ का सफल उत्पादन किया है।#OrganicFarming #OrganicOnion #Nagpur pic.twitter.com/nTjU11anHR— Nitin Gadkari (@nitin_gadkari) May 29, 2025

Electricity Demand Expected to Grow Next Five Years ICRA Report3
విద్యుత్‌కు భారీ డిమాండ్‌: వచ్చే ఐదేళ్లలో..

విద్యుత్‌ డిమాండ్‌ ఏటా 6 శాతం నుంచి 6.5 శాతం చొప్పున (కాంపౌండెడ్‌గా) వచ్చే ఐదేళ్ల పాటు పెరుగుతుందని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం విస్తరణతోపాటు గ్రీన్‌ హైడ్రోజన్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, డేటా సెంటర్ల విస్తరణ విద్యుత్‌ అవసరాలను అధికం చేస్తుందని పేర్కొంది.2025–26 ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలో 44 గిగావాట్లుగా ఉంటుందని అంచనా వేసింది. 2024-25లో ఆల్‌టైమ్‌ గరిష్ట ఉత్పత్తి 34 గిగావాట్లుగా ఉంది. వచ్చే ఐదేళ్లలో అదనంగా ఏర్పడే డిమాండ్‌లో ఈ మూడు రంగాల నుంచే 20-25 శాతం వాటా ఉంటుందని ఇక్రా కార్పొరేట్‌ రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెండ్‌ విక్రమ్‌ తెలిపారు.రూఫ్‌టాప్‌ సోలార్‌ వినియోగం పెరుగుతుండడం, ఆఫ్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుల నేపథ్యంలో గ్రిడ్‌ సామర్థ్య డిమాండ్‌ కొంత వరకు తగ్గొచ్చన్నారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ ఇన్‌స్టలేషన్లను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజన పథకాన్ని ప్రస్తావించారు. 2026 మార్చి నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 520 గిగావాట్లకు చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్‌ తన నివేదికలో పేర్కొంది.2025–2026లో థర్మల్‌ విభాగం నుంచి 9-10 గిగావాట్ల కొత్త సామర్థ్యం అందుబాటులోకి రానుండగా.. మిగిలినదంతా పునరుత్పాదక విద్యుత్‌ వనరుల రూపంలో ఉంటుందని తెలిపింది. రానున్న సంవత్సరాల్లో కొత్త సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్‌ (ఆర్‌ఈ) కీలక పాత్ర పోషించనుందని పేర్కొంది. థర్మల్‌ విద్యుత్‌ విభాగం పట్ల స్థిరమైన అవుట్‌లుక్‌తో ఉన్నట్టు ఇక్రా తెలిపింది.

LPG Cylinder Price Cut Rs 244
మరోసారి తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు

దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.24 తగ్గించాయి. కొత్త ధరలు రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు (జూన్ 1) నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయి.వాణిజ్య ఎల్‌పీజీ ధరలు తగ్గడం వరుసగా ఇది మూడోసారి. మే ప్రారంభంలో కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.14.50 తగ్గించాయి. అంతకు ముందు ఏప్రిల్ 1న సిలిండర్‌ ధర రూ.41 తగ్గింది. కాగా ఇప్పుడు రూ.24 తగ్గింది. కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు తగ్గినా.. గృహాల్లో ఉపయోగించే ఎల్‌పీజీ ధరలలో ఎలాంటి మార్పు లేదు.19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు•ఢిల్లీ: రూ. 1723.50•కోల్‌కతా: రూ. 1826•ముంబై: రూ. 1674.50•చెన్నై: రూ. 1881ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

Hiring to Slow Down in The Second Half Teamlease Data5
'ఇకపై ఉద్యోగాల పరిస్థితి ఇది': సర్వేలో కీలక విషయాలు

న్యూఢిల్లీ: ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు నెలకొని, ఖర్చులు విషయంలో కంపెనీలు ఆచి తూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నియామకాలు నెమ్మదించనున్నాయి. రిక్రూట్‌మెంట్‌ కార్యకలాపాల వృద్ధి (ఎన్‌ఈసీ) 2.8 శాతానికి పరిమితం కానుంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-మార్చి త్రైమాసికంలో ఇది 7.1 శాతంగా నమోదైంది. నియామకాల తీరుతెన్నులపై టీమ్‌లీజ్‌ సర్వీసెస్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదిక ప్రకారం 47 శాతం సంస్థలు సిబ్బందిని పెంచుకుంటామని, 28 శాతం సంస్థలు స్థిరంగా కొనసాగిస్తామని, 25 శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల నుంచి 23 పరిశ్రమలకు చెందిన 1,263 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు➤డిమాండ్‌ను బట్టి ఉద్యోగులను తీసుకునే ఫ్లెక్సి స్టాఫింగ్‌ విధానానికి 69 శాతం సంస్థలు మొగ్గు చూపాయి. దీర్ఘకాలిక వ్యయాల భారం లేకుండా, సత్వరం కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ విధానంలో వీలుంటోంది.➤హైరింగ్‌ వ్యూహాల్లో గిగ్‌ ఎకానమీకి (స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్స్‌ వర్కింగ్‌) ప్రాధాన్యం లభిస్తోంది. 64 శాతం కంపెనీలు గిగ్‌ విధానాల ద్వారా సేల్స్, కస్టమర్‌ సరీ్వస్‌ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.➤ద్రవ్యోల్బణం, ఎగుమతులు మందగించడం, జీడీపీ నెమ్మదించడం తదితర అంశాల కారణంగా వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు 58 శాతం కంపెనీలు తెలిపాయి. దీంతో ఉద్యోగుల సంఖ్యను ఏదో పేరుకి మాత్రమే పెంచుకోవడం కాకుండా, నిర్దిష్ట నైపుణ్యాలున్న వారినే తీసుకోవడంపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక➤76 శాతం కంపెనీలు డిజిటల్‌ లిటరసీకి, 68 శాతం కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్‌కి, 63 శాతం సంస్థలు కమ్యూనికేషన్‌లాంటి కీలక నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపాయి.➤ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్‌కి డిమాండ్‌ పెరుగుతుండటంతో ఆటోమోటివ్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, అనుబంధ మౌలిక సదుపాయాల రంగాలు, ఈ–కామర్స్, టెక్‌ స్టార్టప్‌లు వృద్ధి చెందనున్నాయి.

WhatsApp Will Stop Working on These iPhones and Android Phones6
ఈ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు!

ఒకటో తేదీ వచ్చిందంటే.. దాదాపు చాలా రూల్స్ మారిపోతాయి. క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి గ్యాస్ ధరల వరకు.. చాలా మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఈ రోజు (జూన్ 1) నుంచి కొన్ని ఐఫోన్‌లు & ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ చర్య 2025 మే 1వ తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొంచెం ఆలస్యం కావడంతో.. వినియోగదారులు తమ ఫోన్‌లను మార్చుకోవడానికి సమయం దొరికింది.వాట్సప్‌కు సపోర్ట్ చేయని మొబైల్స్..➤ఐఫోన్ 5ఎస్➤ఐఫోన్ 6➤ఐఫోన్ 6 ప్లస్➤ఐఫోన్ 6ఎస్➤ఐఫోన్ 6s ప్లస్➤ఐఫోన్ ఎస్ఈ (ఫస్ట్ జనరేషన్)➤శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4➤శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3➤సోనీ జెడ్‌పీరియా జెడ్1➤ఎల్‌జీ జీ2➤హువావే అసెండ్ పీ6➤మోటో జీ (ఫస్ట్ జనరేషన్)➤మోటరోలా రేజర్ హెచ్‌డీ➤మోటో ఈ 2014జాబితాలోని అన్ని ఫోన్‌లు చాలా పాత వెర్షన్‌లు. అయితే కొన్ని ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్డేట్ సాధ్యమైతే.. వాట్సప్‌ పనిచేసే అవకాశం ఉంది.ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం.. భద్రతా ప్రమాణాలే అని తెలుస్తోంది. యాపిల్ ఇకపై పాత iOS వెర్షన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించదు. కాబట్టి ఈ పరికరాల్లో భద్రత లోపిస్తుంది. భద్రతా లోపం సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరికగత కొన్ని నెలలుగా, వాట్సాప్ వినియోగదారుల గోప్యతను బలోపేతం చేయడం.. వ్యక్తిగత డేటాను రక్షించడం లక్ష్యంగా అనేక అప్డేట్స్ చేస్తూనే ఉంది. చాట్‌లు, సమూహ సంభాషణల నుంచి ఇతరులు టెక్స్ట్, ఫోటోలు లేదా వీడియోలను కాపీ చేయకుండా నిరోధిచడమే లక్ష్యంగా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకొస్తోంది. అంతే కాకుండా.. వాట్సాప్ చాట్ లాక్ వంటి మెరుగైన ఫీచర్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు పాస్‌వర్డ్, వేలిముద్ర లేదా ఫేస్ ఐడితో వ్యక్తిగత చాట్‌లను సురక్షితంగా ఉంచడానికి అనుమతిస్తుంది.

బిజినెస్ పోల్

Advertisement
Advertisement
Advertisement
 

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 111000.00 0.00 0.00
Gold 22K 10gm 89350.00 0.00 0.00
Gold 24k 10 gm 97480.00 0.00 0.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken (1 Kg skin less) 226.00 1.00
Eggs 72.00 12.00

Stock Action