ప్రధాన వార్తలు
రెండు లక్షలమంది కొన్న కారు ఇది
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. 2025వ సంవత్సరాన్ని సరికొత్త రికార్డుతో ముగించింది. కంపెనీకి చెందిన క్రెటా 2,00,000 యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. భారతదేశంలో దాని విభాగంలో.. అత్యంత పోటీ ఉన్నప్పటికీ మంచి అమ్మకాలను సాధించగలిగింది.2025లో హ్యుందాయ్ రోజుకు 550 క్రెటా కార్లను విక్రయించింది. అంటే.. మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద హ్యుందాయ్ క్రెటా గత ఐదు సంవత్సరాలుగా (2020–2025) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది. మిడ్-సైజ్ SUV విభాగంలో 34 శాతానికి పైగా కమాండింగ్ మార్కెట్ వాటాతో, దాని పోటీదారుల కంటే అమ్మకాల్లో చాలా ముందుంది.క్రెటా రెండు లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను పొందిన సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ డిజిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా ప్రయాణం అసాధారణమైనది. 2 లక్షల యూనిట్లకు పైగా వార్షిక అమ్మకాలను సాధించడం అనేది చాలా గొప్ప విషయం అని అన్నారు.
సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లు!
ప్రపంచ టెక్నాలజీ రంగానికి కేంద్రంగా నిలిచిన సిలికాన్ వ్యాలీ.. దశాబ్దాలుగా ప్రముఖ వ్యాపారవేత్తలు & ఆవిష్కర్తలకు నిలయంగా ఉంది. అయితే తాజాగా వెలువడిన కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం.. ఇద్దరు ప్రముఖ టెక్ బిలియనీర్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం అంతర్జాతీయంగా.. చర్చనీయాంశంగా మారింది.సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లలో ఒకరు పేపాల్ కో-ఫౌండర్ పీటర్ థీల్, మరొకరు గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్.పీటర్ థీల్, లారీ పేజ్ ఇరువురూ.. సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టడానికి కారణం క్యాలిఫోర్నియా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ''బిలియనీర్ ట్యాక్స్'' అని తెలుస్తోంది. ఈ పన్ను ప్రకారం.. ఒక బిలియన్ డాలర్లకు మించిన ఆస్తి కలిగిన వ్యక్తులపై అదనపు సంపద పన్ను విధించాలనే యోచన ఉంది.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేందుకు ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నప్పటికీ.. సంపన్నులు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్ను వల్ల తమపై భారీ ఆర్థిక భారం పడుతుందని, పెట్టుబడులు & వ్యాపార స్వేచ్ఛకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ఈ కారణంగానే పీటర్ థీల్, లారీ పేజ్ వంటి బిలియనీర్లు సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.బిలియనీర్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గం.. క్యాలిఫోర్నియా నుంచి ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్లిపోవడమే. ఈ పరిణామం సిలికాన్ వ్యాలీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవేళా ఈ బిలియనీర్లు నిజంగా నగరాన్ని విడిచిపెడితే, ఇతర టెక్ వ్యాపారవేత్తలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఫలితంగా క్యాలిఫోర్నియా రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గడమే కాకుండా, సిలికాన్ వ్యాలీకి ఉన్న ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం కొంత మేర తగ్గే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.యూకే వీడిన లక్ష్మీ మిట్టల్ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల కారణంగా దేశం వీడిన బిలియనీర్ల జాబితాలో ప్రముఖ్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ కూడా ఉన్నారు. యూకే ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయం వల్ల.. ఆయన దేశం విదిచిపెట్టి దుబాయ్ చేరుకున్నారు. 2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇదీ చదవండి: లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. కుటుంబం లోన్ చెల్లించాలా?
2026లో స్టాక్ మార్కెట్ హాలిడేస్: ఫుల్ లిస్ట్ ఇదే..
2025 డిసెంబర్ 31న స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇక రేపటి నుంచి (2026 జనవరి 1) కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ తరుణంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వచ్చే సంవత్సరం మార్కెట్ సెలవుల జాబితాను విడుదల చేసింది.➤26 జనవరి (సోమవారం): గణతంత్ర దినోత్సవం➤3 మార్చి (మంగళవారం): హోలీ➤26 మార్చి (గురువారం): రామనవమి➤31 మార్చి (మంగళవారం): మహావీర్ జయంతి➤3 ఏప్రిల్ (శుక్రవారం): గుడ్ ఫ్రైడే➤14 ఏప్రిల్ (మంగళవారం): అంబేద్కర్ జయంతి➤1 మే (శుక్రవారం): మహారాష్ట్ర దినోత్సవం➤28 మే (గురువారం): బక్రీద్➤26 జూన్ (శుక్రవారం): మొహర్రం➤14 సెప్టెంబర్ (సోమవారం): గణేష్ చతుర్థి➤2 అక్టోబర్ (శుక్రవారం): మహాత్మా గాంధీ జయంతి➤20 అక్టోబర్ (మంగళవారం): దసరా➤10 నవంబర్ (మంగళవారం): దీపావళి-బలిప్రతిపాద➤24 నవంబర్ (మంగళవారం): గురునానక్ జయంతి➤25 డిసెంబర్ (శుక్రవారం): క్రిస్మస్2026 NSE సెలవుల జాబితా ప్రకారం.. భారత స్టాక్ మార్కెట్ 15 రోజులు మూసివేయబడుతుంది. ఇవి కాకుండా శని, ఆదివారాలు మార్కెట్ సెలవు.శని & ఆదివారాల్లో వచ్చే పండుగ సెలవులు➤15 ఫిబ్రవరి (ఆదివారం): మహాశివరాత్రి➤21 మార్చి (శనివారం): రంజాన్➤15 ఆగస్టు (శనివారం): స్వాతంత్య్ర దినోత్సవం➤8 నవంబర్ (ఆదివారం): దీపావళి
గురువాయూరప్పన్కు ఖరీదైన బైక్
కొంతమంది భక్తులు.. తాము నమ్మిన దేవునికి ధనం సమర్పించుకుంటారు. ఇంకొందరు వాహనాలు సమర్పించుకుంటూ ఉంటారు. దేవుడు ఎవరైనా.. ఎవరి నమ్మకం వారిది. ఇటీవల 'గురువాయూరప్పన్'కు (దేవాలయానికి) టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 (TVS Apache RTX 300) బైక్ అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి.గురువాయూరప్పన్ దేవాలయానికి.. టీవీఎస్ మోటార్ కంపెనీ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ TVS Apache RTX 300 బైకును, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ.. దేవస్వం చైర్మన్ డాక్టర్ వీకే విజయన్కు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్వం పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300టీవీఎస్ అపాచీ ఆర్టిఎక్స్ 300ను.. కంపెనీ రూ.1.99 లక్షల ప్రారంభ ధరలతో మార్కెట్లో విక్రయిస్తుంది. ఇది బేస్, టాప్, బీటీఓ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటాయి.ఇదీ చదవండి: 2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలుఅపాచీ ఆర్టిఎక్స్ 300 బైక్.. 299 సీసీ ఇంజిన్తో 9,000rpm వద్ద 36hp పవర్ & 7,000rpm వద్ద 28.5Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది Apache RR 310 తర్వాత తయారీదారు యొక్క రెండవ అత్యంత శక్తివంతమైన బైక్గా నిలిచింది. ఇది ఆఫ్ రోడర్గా మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ టూరర్గా కూడా ఉపయోగపడుతుంది.
గిగ్ వర్కర్ల సమ్మె: స్విగ్గీ, జొమాటో ప్రోత్సాహకాలు?
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో.., కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయాలు కలగకుండా ఉండేదుకు చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే.. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లైన స్విగ్గీ & జొమాటోలు పీక్ అవర్స్.. సంవత్సరాంతపు రోజులలో డెలివరీ కార్మికులకు అధిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాయి.జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 25, డిసెంబర్ 31 తేదీలలో డెలివరీ వర్కర్ యూనియన్లు సమ్మెలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాల ప్రకటన వెలువడింది. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య రద్దీ సమయాల్లో జొమాటో డెలివరీ భాగస్వాములకు ఒక్కో ఆర్డర్కు రూ.120–150 చెల్లింపులను ఆఫర్ చేసినట్లు కార్మికులు.. ఈ విషయం తెలిసిన వ్యక్తులకు పంపిన సందేశాలు చెబుతున్నాయి.తాజా ప్రోత్సాహకాల ప్రకారం.. డెలివరీ ఏజెంట్లు సగటున 3000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా.. క్యాన్సిలేషన్లు లేదా ఆర్డర్ తీసుకోకపోయిన సందర్భాల్లో సాధారణంగా విధించే పెనాల్టీలను కూడా అమలు చేయబోమని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిద్వారా.. ఎక్కువ మంది డెలివరీ ఏజెంట్లు పనికి రావాలని సంస్థలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా, స్విగ్గీ కూడా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 12 గంటల మధ్య రూ. 2,000 వరకు పీక్-అవర్ ఆదాయాన్ని ప్రకటిస్తోంది.ఇదీ చదవండి: కేంద్రం కీలక ప్రకటన.. వొడాఫోన్ ఐడియాకు బిగ్ రిలీఫ్!ఇకపోతే.. డిసెంబర్ 25న సమ్మె చేపట్టిన గిగ్ వర్కర్లు.. మరోమారు ఈరోజు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. మెరుగైన చెల్లింపులు, మెరుగైన పని పరిస్థితులను మాత్రమే కాకుండా.. 10 నిమిషాల డెలివరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (IFAT) పేర్కొన్నాయి.
కేంద్రం కీలక ప్రకటన.. వొడాఫోన్ ఐడియాకు బిగ్ రిలీఫ్!
రుణభారంతో సతమతమవుతున్న 'వొడాఫోన్ ఐడియా'కు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిలు రూ. 87,695 కోట్లను ఫ్రీజ్ చేసింది. అంతే కాకుండా.. 2032 ఆర్థిక సంవత్సరం నుంచి 2041 ఆర్థిక సంవత్సరం వరకు.. 10 సంవత్సరాల కాలంలో వారి తిరిగి చెల్లించేలా వెసులుబాటు కల్పించింది.ఏజీఆర్ సంబంధిత అంశాలు.. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ మద్దతు కోసం వేచిచూస్తున్న వొడాఫోన్ ఐడియాకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించింది.వోడాఫోన్ ఐడియాలో.. ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి బకాయిల చెల్లింపును క్రమబద్ధీకరించడానికి వీలు కల్పించడమే కాకుండా.. కంపెనీకి చెందిన 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది.
కార్పొరేట్
సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లు!
గిగ్ వర్కర్ల సమ్మె: స్విగ్గీ, జొమాటో ప్రోత్సాహకాలు?
కేంద్రం కీలక ప్రకటన.. వొడాఫోన్ ఐడియాకు బిగ్ రిలీఫ్!
‘గజ్’ క్రెడిట్ కార్డు గురించి తెలుసా?
గ్రెగ్ అబెల్ చేతికి బెర్క్షైర్ హాత్వే పగ్గాలు
10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా?
వెండి మెరుపులు
దేశం వీడుతున్న సంపన్నులు.. కారణాలు ఇవే!
ఆరోగ్య బీమాలో సరికొత్త ట్రెండ్స్
బీమాకు జీఎస్టీ సంస్కరణల జోష్
'బంగారం'లాంటి ఛాన్స్.. పసిడి ధరల్లో భారీ మార్పు!
బంగారం ధరలు వరుస పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడిం...
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం.. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ ...
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు! ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ...
బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్బీఎఫ్సీల నుంచి సవాళ్లు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ రం...
విజిలెన్స్ వ్యవహారాలను వెంటనే వెల్లడించాలి
ప్రభుత్వరంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు హోల్టైమ్ ...
తగ్గుతున్న ఏటీఎంలు
ముంబై: డిజిటల్ చెల్లింపుల నేపథ్యంలో ఆటోమేటెడ్ టె...
భూగర్భంలో విలువైన సంపద.. భారత్లో ఎక్కడుందంటే?
ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ధురంధర్ పాటకు రోబో డ్యాన్స్
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త హ్యుమానాయిడ్ రోబోలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోబోట్స్ ఎన్నెన్నో అద్భుతాలు చేశాయి. ఇప్పుడు తాజాగా ఒక రోబో డ్యాన్స్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐఐటీ బాంబేలో టెక్ఫెస్ట్ 2025లో.. ఒక హ్యూమనాయిడ్ రోబోట్ డ్యాన్స్ వేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీనిని బిద్యుత్ ఇన్నోవేషన్ (Bidyut Innovation) అభివృద్ధి చేసింది. ధురంధర్ సినిమాలోని పాటకు.. అద్భుతంగా డ్యాన్స్ వేసిన ఈ రోబోట్ ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.టెక్ఫెస్ట్.. ఆసియాలో అతిపెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్గా ప్రసిద్ధి చెందింది. ఇందులో అనేక కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెడతారు. హ్యుమానాయిడ్ రోబోట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇవన్నీ.. బ్యాలెన్స్ కంట్రోల్, మోషన్ ప్లానింగ్, రియల్-టైమ్ రెస్పాన్సిబిలిటీ వంటివి పొందుతాయి. View this post on Instagram A post shared by IIT NIT IIIT (@iit__nit__iiit)
సోషల్ మీడియా వినియోగం.. ఇండియన్ ఆర్మీ కొత్త రూల్స్!
భారత సైన్యం.. తమ సిబ్బందికి సోషల్ మీడియా వినియోగంపై ఉన్న నిబంధనలను పాక్షికంగా సవరించింది. గతంలో ఉన్న కఠినమైన నిషేధాలను సడలిస్తూ, ఎంపిక చేసిన కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో నిష్క్రియాత్మక భాగస్వామ్యాన్ని(Passive Participation) అనుమతిస్తూ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (డీజీఎంఐ) రూపొందించిన ఈ నూతన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.ఏమిటీ నిష్క్రియాత్మక భాగస్వామ్యం?కొత్త విధానం ప్రకారం.. సైనిక సిబ్బంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్ఫామ్లను సమాచారం తెలుసుకోవడానికి లేదా కంటెంట్ను చూడటానికి మాత్రమే ఉపయోగించవచ్చు. అయితే.. ఈ ప్లాట్ఫామ్లలో ఎటువంటి యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండకూడదు. అంటే..➤పోస్ట్లు పెట్టడం, ఫొటోలు అప్లోడ్ చేయడం చేయకూడదు.➤ఇతరుల పోస్టులపై వ్యాఖ్యానించడం (Commenting) నిషేధం.➤లైక్ చేయడం, షేర్ చేయడం లేదా పోస్టులకు రియాక్ట్ అవ్వడం వంటివి చేయకూడదు.➤డైరెక్ట్ మెసేజ్లు పంపడంపై కూడా నిషేధం కొనసాగుతుంది.ఇన్స్టాగ్రామ్కు అధికారిక అనుమతిఈ అప్డేట్లో భాగంగా ఇన్స్టాగ్రామ్ను అధికారికంగా.. ‘పరిమిత వినియోగ’ సోషల్ మీడియా జాబితాలో చేర్చారు. కేవలం నిఘా, సమాచార సేకరణ ప్రయోజనాల కోసం మాత్రమే దీన్ని వాడాలని, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి వీల్లేదని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లువాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్కైప్ యాప్లను సాధారణ స్థాయి సమాచార మార్పిడికి ఉపయోగించవచ్చు. అయితే, గ్రహీత ఎవరో కచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే కమ్యూనికేట్ చేయాలి. దీనికి పూర్తి బాధ్యత సదరు సిబ్బందిదే. లింక్డ్ఇన్ వృత్తిపరమైన అవసరాల కోసం, అంటే రెజ్యూమ్లు అప్లోడ్ చేయడం లేదా ఉద్యోగ సమాచారం కోరడం వంటి పనులకు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. యూట్యూబ్, కోరా(YouTube, Quora) వీటిని కేవలం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మాత్రమే వాడాలి.కఠినమైన హెచ్చరికలుసౌలభ్యాలను కల్పిస్తూనే సైన్యం కొన్ని అంశాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. క్రాక్డ్ సాఫ్ట్వేర్లు, ఉచిత మూవీ పోర్టల్స్, టొరెంట్, వెబ్ ప్రాక్సీలు, వీపీఎన్ సర్వీలకు వాడకూడదు. చాట్ రూమ్లు, ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్ల జోలికి వెళ్లవద్దని సూచించింది. క్లౌడ్ ఆధారిత డేటా సేవల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.2020లో 89 యాప్లపై నిషేధంజులై 2020లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ భద్రతా ముప్పుల నేపథ్యంలో.. భారత సైన్యం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా 89 యాప్లను తక్షణమే తొలగించాలని తన సిబ్బందిని ఆదేశించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 చైనా యాప్లు కూడా ఉన్నాయి. తాజా సవరణలు సైనిక భద్రతను కాపాడుతూనే మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా సిబ్బందికి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.
6 నెలల్లో రూ. 660 కోట్లు కాపాడింది..
ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాంలో 1,000కి పైగా బ్యాంకులు, థర్డ్ పార్టీ యాప్లు, పేమెంట్ టెక్నాలజీ సంస్థలు చేరినట్లు టెలికం శాఖ (డాట్) వెల్లడించింది. అవి అమలు చేస్తున్న ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లతో (ఎఫ్ఆర్ఐ) బ్యాంకింగ్ వ్యవస్థలో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ. 660 కోట్ల ఆర్థిక నష్టాలను నివారించడం సాధ్యపడిందని పేర్కొంది.ఎఫ్ఆర్ఐ అమలుపై అవగాహన పెంచేందుకు సంబంధిత వర్గాల కోసం ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకు 16 సెషన్లను నిర్వహించినట్లు డాట్ తెలిపింది. దేశీయంగా సైబర్నేరాల తీరుతెన్నులు నాటకీయంగా మారిపోయాయని పేర్కొంది. మోసగాళ్లు చట్టబద్ధమైన టెలికం మార్గాల కళ్లు గప్పి, డిజిటల్ అరెస్ట్ స్కామ్ల్లాంటి అధునాతన నేరాలకు పాల్పడుతున్నారని వివరించింది.ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సంచార్ సాథీ ప్లాట్ఫాం ద్వారా ప్రజల భాగస్వామ్యం కూడా పెరగడం తోడ్పడుతోందని డాట్ తెలిపింది. ఈ పోర్టల్, మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.
గాలిలో తేలుతూ.. మెరుపుతీగలా వెళ్లే ట్రైన్!
ఎప్పటికప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్న చైనా.. మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కి.మీ వేగవంతమయ్యే మాగ్లెవ్ (Maglev) రైలు ఈ రికార్డ్ సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. చాలామంది ట్రైన్ రాకకోసం వేచి చూస్తున్నారు. అంతేలోనే మెరుపుతీగలా ట్రైన్ వెళ్లిపోయింది. అక్కడున్నవారంతా.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. చూడటానికి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యంలా కనిపిస్తుంది.అత్యంత వేగవంతమైన సూపర్కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ రైలును విజయవంతంగా టెస్ట్ చేశారు. 700 కిమీ వేగంతో వెళ్లినప్పటికీ.. రైలును సురక్షితంగా స్టాప్ చేశారు. ఈ టెస్ట్ చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించారు.🇨🇳China leads the future!🇨🇳🚄China set a global record by accelerating a ton-scale test maglev to 700 kilometers per hour in just two seconds.Dedicated to maglev research for 10 years, the Chinese technicians have overcome core technical challenges. pic.twitter.com/F1Mv8dUZvc— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) December 25, 2025మాగ్లెవ్ ట్రైన్స్.. సాధారణ పట్టాలపై నడవవు. బదులుగా ఇందులోని సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలు రైలును ఎత్తి, పట్టాలను తాకకుండానే ముందుకు నెట్టివేస్తాయి. దీనివల్ల వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని భవిష్యత్తులో వాక్యూమ్ సీల్డ్ ట్యూబ్ల ద్వారా ప్రయాణించేలా చేయనున్నారు.ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చైనా యూనివర్సిటీ బృదం పదేళ్లుగా కృషి చేస్తున్నారు. 2025 జనవరిలో టెస్ట్ చేసినప్పుడు ఇది గంటకు 648 కి.మీ. గరిష్ట వేగాన్ని చేరుకుంది. ఇప్పుడు తాజాగా జరిపిన టెస్టులో 700 కిమీ వరకు వేగవంతం అయింది. అదే యూనివర్సిటీ.. మూడు దశాబ్దాల క్రితం దేశంలో మొట్టమొదటి మనుషులతో కూడిన సింగిల్-బోగీ మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసింది.🚄🇯🇵 Le train japonais Maglev L0 ne se contente pas d’être rapide : il redéfinit littéralement la notion de vitesse dans le transport moderne.Grâce à la lévitation magnétique, il flotte au-dessus de son rail, éliminant toute friction et lui permettant d’atteindre plus de 600… pic.twitter.com/hnV4VnZ3Ro— Le Contemplateur (@LeContempIateur) December 4, 2025
పర్సనల్ ఫైనాన్స్
2026లో సంపద సృష్టించే ‘టాప్-4’ థీమ్స్ ఇవే!
2025లో భారత స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 2026వ సంవత్సరం ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారబోతోందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి, కార్పొరేట్ లాభాలు పుంజుకోనుండటం మార్కెట్కు కొత్త ఊపిరి పోయనున్నాయని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా నిఫ్టీ-50 ఇండెక్స్ 2026 చివరి నాటికి 28,000 పాయింట్ల మైలురాయిని చేరుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా.. కృత్రిమ మేధ(AI), గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించి పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలికంగా భారీ లాభాలు అందనున్నాయని చెబుతున్నాయి. మరి 2026లో మదుపరుల అదృష్టాన్ని మార్చబోతున్న ఆ కీలక రంగాలు ఏమిటో చూద్దాం.కృత్రిమ మేధభారతదేశం ప్రస్తుతం ఏఐ విప్లవంలో ఒక కీలక దశలో ఉంది. ఇది కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఉత్పాదకతను పెంచే ప్రధాన సాధనంగా మారుతోంది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు సుమారు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం కేటాయించాయి. 2026 ఫిబ్రవరి 19-20 తేదీల్లో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ఈ రంగానికి దిశానిర్దేశం చేయనుంది. భారత ప్రభుత్వ లక్ష్యం ప్రకారం, స్వదేశీ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పాదకతను పెంచే ‘చిన్న మోడల్స్’(Small Language Models) అభివృద్ధిపై దృష్టి సారించింది.ఈవీ చార్జింగ్ సదుపాయాలుఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్నా, వాటికి అవసరమైన చార్జింగ్ సౌకర్యాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 45 శాతం మంది ఈవీ వినియోగదారులు పబ్లిక్ చార్జింగ్ పాయింట్లపై ఆధారపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ అంతరాన్ని పూడ్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఈ మేరకు సర్వీసులు అందిస్తున్న కంపెనీలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.ఆఫీస్ వర్క్స్పేస్భారతదేశం ఇప్పుడు కేవలం బ్యాక్ ఆఫీస్ హబ్గా కాదు.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ సెంటర్లను భారత్లో ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల అత్యాధునిక సౌకర్యాలు గల 50-100 సీటర్ ఆఫీసులకు, మీటింగ్ రూమ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.లగ్జరీ, ప్రీమియం వస్తువులుపెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ వల్ల లగ్జరీ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, ఖరీదైన వాచీలు, ప్రీమియం కార్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో బలమైన వృద్ధి కనిపిస్తోంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే..
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. రోజువారీ ఆర్థిక కార్య కలాపాల దగ్గర నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు అన్నింటికీ ఇదే ‘ఆధారం’. ఇంత కీలకమైన ఆధార్కు సంబంధించిన పలు ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత అంటే కొత్త ఏడాది 2026లో నూతన నిబంధనలు అమలు కాబోతున్నాయి.ఆధార్ కార్డు కొత్త డిజైన్ప్రస్తుతం పెరిగిన డిజిటల్ మోసాలు, డేటా దుర్వినియోగం సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ ఇప్పటికే 2025 డిసెంబర్ 1 నుంచే ఆధార్ కొత్త డిజైన్ను ప్రకటించింది. ఈ కొత్త కార్డులో మీ ఫోటో, సురక్షిత క్యూర్ కోడ్ మాత్రమే ఉంటుంది. మీ పేరు, ఆధార్ నంబర్ ఉండవు. మొత్తం కార్డుల డిజైన్ను 2026 జూన్ 14 లోపు అప్డేట్ చేయనుంది యూఐడీఏఐ.ఫోటోకాపీల వాడకంపై ఆంక్షలుకొత్త యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. గుర్తింపు కోసం ఇక ఆధార్ కార్డు భౌతిక కాపీలను (జిరాక్స్) ఇవ్వాల్సిన పని లేదు. గుర్తింపు ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆఫ్లైన్ ఆధార్ ఎక్స్ఎంఎల్, మాస్క్డ్ ఆధార్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డిజిటల్ ధ్రువీకరణను ప్రాథమిక ఎంపికగా చేస్తున్నారు. ఫేస్ అథెంటికేషన్ను చట్టపరమైన గుర్తింపుగా చేయనున్నారు.ఆధార్-పాన్ లింక్ గడువుఆధార్-పాన్ లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ తేదీ నాటికి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే, అది 2026 జనవరి 1 నుండి ఇనాక్టివ్గా మారుతుంది. దీంతో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్, ఇతర ఆర్థిక లావాదేవీలు కష్టమవుతాయి.10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డుల అప్డేట్ తప్పనిసరిమీడియా నివేదికల ప్రకారం.. 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులు అంటే పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని వాటిని ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ చేయించకపోతే ఇప్పుడు చేయించడం తప్పనిసరి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని అప్ డేట్ చేయడం వల్ల మీ ఆధార్ యాక్టివ్ గా ఉండటమే కాకుండా ధ్రువీకరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
పర్సనల్ లోన్ తీసుకుని ఏంచేశారు వీళ్లు..?
ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో పర్సనల్ లోన్స్కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో పర్సనల్ లోన్స్ తీసుకున్న యువతరంలో 27 శాతం రుణాలు ‘ట్రావెల్’ కోసం తీసుకోబడ్డాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక చరిత్రలో ఇదే మొదటిసారి.‘భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కనిపించిన భారీ మార్పు ఇది. యువతరం పర్సనల్ లోన్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం...వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, ఇల్లు కొనడం...మొదలైనవి కాదు. ఒకే ఒక కారణం... ప్రయాణం’ అని చెప్పారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, రచయిత సార్థక్ అహుజ.ఈ మార్పుకు కారణం ఏమిటి?‘ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటడంతో సొంత ఇల్లు అనే కల యువతరంలో చాలామందికి కలగానే మిగిలిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా తక్షణం సంతృప్తిని ఇచ్చే విషయాలకు యువతరం ప్రాధాన్యత ఇస్తోంది. ట్రావెల్, లగ్జరీ వస్తువులు కొనుగోలు... మొదలైనవి అందులో ఉన్నాయి’ ఫిన్టెక్ ఇన్నోవేషన్తో అప్పుల కోసం పడే ఇబ్బందులు యువతరానికి తగ్గాయి. జీరో–కాస్ట్ ఇఎంఐలు, బై నౌ పే ల్యాటర్ (బిఎన్పీఎల్) స్కీమ్లు యువతరానికి స్పీడ్గా చేరువవుతున్నాయి.వాళ్ళు అలా... మనం ఇలా...చైనా యువతరం విషయానికి వస్తే...కోవిడ్ తరువాత ‘రివెంజ్ స్పెండింగ్’ నుంచి ‘రివెంజ్ సేవింగ్’కు మళ్లింది. ఎంతో కొంత అయినా సరే బంగారం మదుపు చేయడంపై మోజు పెరిగింది. బంగారాన్ని మదుపు చేయడం అనేది సరికొత్త స్టేటస్ సింబల్గా మారింది. ‘రేపు నేను సంపాదిస్తాను కాబట్టి ఈరోజు అప్పు చేయాలని మన యువతరం ఆలోచిస్తుంది. రేపు నా ఉద్యోగం ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజే ΄పొదుపు చేస్తాను అని చైనీస్ యువతరం అనుకుంటుంది’ అంటున్నారు అహుజ.ఇదీ చదవండి: బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?
బ్రాంచ్ లేని బ్యాంక్ అకౌంట్లు..
దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్లెస్, బ్రాంచ్లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.అంతేకాకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.


