ప్రధాన వార్తలు
దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రభుత్వ పథకాలు
ఆర్థిక అనిశ్చితులు, మార్కెట్ హెచ్చుతగ్గులు, జీవితంలో ఎదురయ్యే దీర్ఘకాలిక లక్ష్యాల (రిటైర్మెంట్, పిల్లల విద్య, వివాహం వంటివి) మధ్య సాధారణ ప్రజలు తమ డబ్బును సురక్షితంగా పెంపుచేసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరమైన రాబడినేచ్చే పథకాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ పథకాలు పూర్తిగా ప్రభుత్వ హామీతో ఎలాంటి రిస్క్ లేకుండా 7-8% వరకు వడ్డీ రేట్లు అందిస్తాయి. అందులో కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.ఈ పథకాల వడ్డీ రేట్లు 2025లో క్వార్టర్లవారీగా సమీక్షిస్తున్నప్పటికీ, ఆర్బీఐ విధానాల మార్పులకు అనుగుణంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. పీపీఎఫ్, ఎస్ఎస్వై వంటివి దీర్ఘకాలిక భద్రతకు ఉపయోగపడగా, ఎన్పీఎస్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్తో ఎక్కువ లాభాలు ఇస్తుంది. గత దశాబ్దంలో ఈ పథకాలు ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రజలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించాయి.పథకంలక్ష్యంవడ్డీ రేటు (ఏటా)వ్యవధిప్రయోజనాలుపబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, రిటైర్మెంట్7.1%15 సంవత్సరాలుపూర్తి పన్నుమినహాయింపు, రిస్క్ ఫ్రీ, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకం.నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)రిటైర్మెంట్ పెన్షన్10-12% (మార్కెట్-లింక్డ్)60 సంవత్సరాల వయసు వరకుఈక్విటీ/ డెట్ మిక్స్, 80C + అదనపు రూ.50,000 మినహాయింపు. యువతకు ఉపయోగకరం.సుకన్యా సమృద్ధి యోజన (SSY)ఆడపిల్లల విద్య/వివాహం8.2%21 సంవత్సరాలుపూర్తి పన్నుమినహాయింపు, మహిళా సాధికారతకు ప్రోత్సాహం.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)వృద్ధులకు ఆదాయం8.2% (క్వార్టర్లీ)5 సంవత్సరాలు60+ వయసు, 80C మినహాయింపుకిసాన్ వికాస్ పత్రా (KVP)మధ్యస్థ/దీర్ఘకాలిక పెట్టుబడి7.5%9 సంవత్సరాలు 5 నెలలు (డబుల్ అవుతుంది)గ్రామీణ ప్రజలకు ఉపయోగంనేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)మధ్యస్థ పెట్టుబడి7.7%5 సంవత్సరాలు80C మినహాయింపుఅటల్ పెన్షన్ యోజన (APY)అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ రిటైర్మెంట్రూ1,000-5,000/నెల పెన్షన్60 సంవత్సరాల వయసు18-40 సంవత్సరాల వారు దరఖాస్తు చేయాలి. గ్యారంటీడ్ పెన్షన్. ప్రస్తుతం వాటిలో పెట్టుబడి పెట్టే మార్గాలుఆధార్, పాన్కార్డ్, బ్యాంక్ అకౌంట్తో కేవైసీ పూర్తి చేస్తే చాలు పోస్ట్ ఆఫీస్, బ్యాంకుల డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా వీటిలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం అవుతుంది.పోస్ట్ ఆఫీస్ మార్గం (ఆఫ్లైన్/ఆన్లైన్)ఆఫ్లైన్: సమీప పోస్ట్ ఆఫీస్కు వెళ్లి సంబంధిత ఫామ్ (ఉదా., పీపీఎఫ్కు Form-1, ఎస్ఎస్వైకు Form-4) సమర్పించాలి.ఆన్లైన్: పోస్ట్ ఆఫీస్ ఐపీపీబీ యాప్ లేదా వెబ్సైట్ (indiapost.gov.in) ద్వారా కూడా ఆన్లైన్లో వీటిని ప్రారంభించవచ్చు.బ్యాంకింగ్ మార్గంఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో యాకౌంట్ తెరిచి నెట్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్/ ఎన్ఎస్సీ వంటి వాటిలో పెట్టుబడి చేయవచ్చు.ఇదీ చదవండి: వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’
వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘వైబ్ కోడింగ్’పై టెక్ దిగ్గజాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేచురల్ లాంగ్వేజీలో ఆదేశాలు ఇస్తూ ఏఐ ద్వారా కోడ్ను రాయించుకునే ఈ విధానంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుకూలంగా స్పందిస్తుంటే, టెక్ టైకూన్ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అంతగా దీన్ని సపోర్ట్ చేయడం లేదు. అందుకు వారు చెబుతున్న కారణాలు విభిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?వైబ్ కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (Software Development)లో కొత్తగా వాడుకలోకి వచ్చిన ఒక విధానం. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వ్యక్తులు కూడా తమ ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధారణ, రోజువారీ భాషలో(Natural Language Prompts) ఏఐ ఆధారిత టూల్స్కు (ఉదాహరణకు, Google's AI Studio, OpenAI Codex) కమాండ్ ఇస్తారు. ఏఐ ఆ ఆదేశాలను అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఫంక్షనల్ కోడ్ను జనరేట్ చేస్తుంది. కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా యాప్లు, వెబ్సైట్లు లేదా ప్రోటోటైప్లను సులభంగా తయారు చేయవచ్చు.సుందర్ పిచాయ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైబ్ కోడింగ్ను సానుకూలంగా చూస్తున్నారు. టెక్నికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు కూడా తమ ఆలోచనలను ప్రోటోటైప్లుగా మార్చవచ్చని చెబుతున్నారు. గతంలో ప్రాజెక్ట్లకు సంబంధించిన ఆలోచన గురించి మాటల్లో వివరించేవారు. ఇప్పుడు, వైబ్ కోడింగ్ ద్వారా ఆ ఆలోచనకు కోడెడ్ వెర్షన్ లేదా ప్రోటోటైప్ను జనరేట్ చేసే వీలుందన్నారు.శ్రీధర్ వెంబు..జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వైబ్ కోడింగ్ పట్ల అంతగా సానుకూలంగా లేరు. ఏఐ జనరేట్ చేసే కోడ్ మనకు అద్భుతంగా అనిపించినప్పటికీ, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందనే క్లిష్టమైన, లోతైన అవగాహన అవసరమన్నారు. ఏఐ సాధారణంగా రీయూజబుల్ కోడ్ను రాయడంలో సహాయపడుతుందన్నారు. కానీ, కోర్ లాజిక్, కొత్త సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు ఏఐకి ఉండవని చెప్పారు. ఇవి మానవ సృజనాత్మకత, అనుభవంపై ఆధారపడి ఉంటాయని వెంబు నమ్ముతున్నారు. కోడింగ్ అనేది ఓ మ్యాజిక్ అన్నారు. వైరుధ్యంలో ఏకాభిప్రాయంఈ రెండు దృక్పథాల మధ్య పిచాయ్ కూడా ఓ పోడ్కాస్ట్లో వైబ్ కోడింగ్ పరిమితులను అంగీకరించారు. కొన్ని రకాల లార్జ్, సెక్యూరిటీ సిస్టమ్స్కు వైబ్ కోడింగ్ సరిపోదన్నారు. అందుకు అనుభవం కలిగిన ఇంజినీర్లు అవసరమని చెప్పారు.
ఎగసి అలసిన పసిడి.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
భారత్లోని విమానాశ్రయాలపై సైబర్ దాడి
భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలపై సైబర్ దాడులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఇది దేశ విమానయాన మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలను పెంచుతూ, డిజిటల్ భద్రతా లోపాలను మరోసారి హైలైట్ చేసింది.ఏడు విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు రాజ్యసభలో ఇచ్చిన వివరణ ప్రకారం.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, అమృత్సర్, హైదరాబాద్ వంటి ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) స్పూఫింగ్ జరిగినట్లు చెప్పారు. దాంతో జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్) ప్రభావితం అయినట్లు తెలిపారు. ఈ దాడుల కారణంగా నావిగేషన్ వ్యవస్థల్లో సాంకేతిక అవరోధాలు తలెత్తినప్పటికీ, విమాన కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్పార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏమిటి?తప్పుడు సిగ్నల్స్ను ప్రసారం చేసి విమానాల నావిగేషన్ వ్యవస్థలను ప్రభావితం చేసే ఒక సైబర్ దాడి. ఇది వాస్తవ స్థానం, ఎత్తు వంటి ముఖ్య సమాచారాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది భద్రతా ప్రమాదాలకు దారితీయవచ్చు. 2023 నవంబర్లో డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) జీఎన్ఎస్ఎస్ వ్యవస్థ ప్రభావితం చెందడంపై అడ్వైజరీ జారీ చేసినప్పటికీ, ఈ తరహా ఘటనలు 2025లో కూడా కొనసాగినట్లు తెలుస్తుంది. అయితే దాడుల మూలాలను గుర్తించేందుకు ప్రభుత్వం వైర్లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ (WMO) సహాయంతో పరిశోధన ప్రారంభించింది. ప్రభావిత విమానాశ్రయాలు ప్రస్తుతం హై అలర్ట్లో ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలు నిరంతర భద్రతా ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.ఈ సందర్భంగా మంత్రి నాయుడు మాట్లాడుతూ..‘ఈ దాడుల వల్ల విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదు. అయినా ఆకస్మిక చర్యలు, మెరుగైన సైబర్ ప్రతిచర్యలు అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: వద్దు పొమ్మన్నారు.. ఇప్పుడు తానే కింగ్ మేకర్
Stock Market Updates: గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 27 పాయింట్లు తగ్గి 26,146కు చేరింది. సెన్సెక్స్(Sensex) 146 పాయింట్లు నష్టపోయి 85,488 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 02-12-2025(time: 9:33 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
భారత వృద్ధి రేటు అంచనాలు పెంపు.. ఎంతంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో భారత వృద్ధి రేటు అంచనాను ఏడు శాతానికి పెంచుతున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. అంతకుముందు 6.5% వృద్ధిని అంచనా వేసింది. 2025–26 ప్రథమార్ధంలో దేశీయ వృద్ధి రేటు అంచనాలకు మించి 8% వృద్ధి సాధించిన నేపథ్యంలో వృద్ధి అవుట్లుక్ను అప్గ్రేడ్ చేసింది. భారత వాస్తవ జీడీపీ వృద్ధి రెండో త్రైమాసికంలో 8.2 శాతంగా నమోదై, అంచనాలను మించిందని క్రిసిల్ ఆర్థికవేత్త ధర్మకృతి జోషి తెలిపారు.ద్రవ్యోల్బణం దిగిరావడంతో నామినల్ జీడీపీ లేదా ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి మోస్తారు స్థాయిలో 8.7%గా నమోదైంది. అమెరికా సుంకాల విధింపు ప్రభావంతో 2025–26 ద్వితీయార్ధంలో వృద్ధి 6.1 శాతానికి పరిమితం కావొచ్చని జోషి అంచనా వేశారు. ‘‘ప్రైవేటు వినియోగం వాస్తవ జీడీపీ వృద్ధికి ప్రధాన ఇంధనంగా నిలిచింది. సప్లై దృష్టి కోణంలో తయారీ, సేవల రంగాల్లో వృద్ధి గణనీయంగా పెరిగింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గడంతో స్వచ్ఛంద వినియోగ వ్యయం ఊపందుకుంది. మూడో క్వార్టర్లో ఈ అనుకూల పరిస్థితులు కలిసొస్తాయి. ప్రభుత్వ పెట్టుబడుల్లో స్థిరత్వం కొనసాగే వీలుంది. ప్రైవేటు పెట్టుబడులు ఆలస్యమైనప్పట్టకీ.., క్రమంగా పెరగొచ్చు’’ అని జోషి అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: తయారీపై ‘టారిఫ్ల’ ప్రభావం
కార్పొరేట్
భారత్లోని విమానాశ్రయాలపై సైబర్ దాడి
ఎల్ఐసీ స్టాక్స్ కొనుగోళ్లపై సలహాలివ్వం
ట్రైన్ ఆలస్యమైందా?: ఇలా చేస్తే డబ్బు మొత్తం రీఫండ్..
వద్దు పొమ్మన్నారు.. ఇప్పుడు తానే కింగ్ మేకర్
విమానాల్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్.. అసలు సమస్యేంటి?
వంట గ్యాస్ ధరల తగ్గింపు
యాప్లా.. మార్కెటింగ్ యంత్రాలా?
ఉద్యోగాలు మట్టి కొట్టుకుపోతాయి!.. మస్క్ ఇంటర్వ్యూ
గృహ రుణానికి ముందే గుడ్బై
మీ కార్డు సంపాదిస్తోందా?
ఆల్టైమ్ గరిష్ఠాలను చేరిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
డిసెంబర్లో స్టాక్ మార్కెట్ హాలిడేస్
2025 దాదాపు ముగిసింది. రేపటి (సోమవారం) నుంచి చివరి...
ఎఫ్ఎస్టీసీలో అదానీ గ్రూప్నకు వాటాలు
డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా పైలట్లకు...
చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, అమెరికన్ వ్యాపార...
వృద్ధి గుడ్.. మరి వడ్డీ రేట్లో?
మార్కెట్లు ఆల్టైమ్ రికార్డులకు అత్యంత చేరువలో ఉన...
సెమీకండక్టర్ ల్యాబ్ కోసం రూ.4,500 కోట్లు
దేశంలోని ప్రభుత్వ రంగ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప...
భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తే...
ఊహించిన దాని కంటే మెరుగైన వృద్ధి
భారత ఆర్థిక వ్యవస్థ 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్ర...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ అరుదైన ఘనత
ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (IITMIC) భారతీయ డీప్టెక్ వ్యవస్థాపక రంగంలో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కేవలం 12 సంవత్సరాల్లో 500 డీప్టెక్ స్టార్టప్లను ఇంక్యుబేట్ చేసిన ఏకైక అకడమిక్ ఇంక్యుబేటర్గా ఐఐటీఎంఐసీ రికార్డు సృష్టించింది. ఇంక్యుబేట్ చేసిన ఈ స్టార్టప్ల సమష్టి విలువ (వాల్యుయేషన్) రూ.53,000 కోట్లు దాటడం దేశ డీప్టెక్ ఎకోసిస్టమ్ బలోపేతాన్ని సూచిస్తోంది. 2012-13లో అకడమిక్ ఇంక్యుబేటర్లు అరుదుగా ఉన్న సమయంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఐటీఎంఐసీ ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ, యునిఫోర్, అగ్నికుల్ కాస్మోస్, మెడిబడ్డీ, మైండ్గ్రోవ్.. వంటి అనేక స్టార్టప్లకు పుట్టినిల్లు అయింది.స్టార్టప్ కంపెనీల పరంగా ఇంక్యుబేషన్ అంటే.. కొత్తగా ప్రారంభమైన లేదా ప్రాథమిక దశలో ఉన్న కంపెనీ (స్టార్టప్కు) విజయవంతంగా ఎదగడానికి, స్వతంత్రంగా పనిచేయడానికి అవసరమైన మద్దతు, వనరులు, సర్వీసులను అందించే ప్రక్రియ. సాధారణంగా దీన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రత్యేక ఇంక్యుబేటర్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇంక్యుబేషన్ అనేది ప్రారంభ సంవత్సరాల్లో స్టార్టప్కు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సహాయపడే ఒక సమగ్ర మద్దతు వ్యవస్థ.ఈ సందర్భంగా ఐఐటీఎంఐసీ సీఈవో తమస్వతి ఘోష్ మాట్లాడుతూ..‘మేము 500 డీప్టెక్ స్టార్టప్లను ఇంక్యుబేట్ చేశాం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ స్టార్టప్ల్లో దాదాపు 60 శాతం మంది ఐఐటీ బయటినుంచి వచ్చిన వారున్నారు. ఇది ఐఐటీఎంఐసీని నిజమైన జాతీయ స్థాయి డీప్టెక్ కేంద్రంగా మార్చింది’ అని తెలిపారు.ఐఐటీఎంఐసీ పోర్ట్ఫోలియో వివరాలు..ఇంక్యుబేటెడ్ కంపెనీలు సుమారు 700 పైగా పేటెంట్లను దాఖలు చేశాయి.105 కంటే ఎక్కువ స్టార్టప్లు ప్రీ-సిరీస్/సిరీస్ A+ రౌండ్ల్లో విజయవంతంగా నిధులను సేకరించాయి.దాదాపు 40 శాతం స్టార్టప్లు ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు కలిసి రూ.4,000 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.ఏథర్ ఎనర్జీ ఐపీఓ సమయంలో ఐఐటీఎంఐసీ నుంచి తాత్కాలికంగా నిష్క్రమించడం ద్వారా భారీగా రిటర్న్ను అందించింది.రాబోయే 4-5 ఏళ్లలో మరో 10-15 కంపెనీలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉందని ఘోష్ అంచనా వేశారు.కీలక రంగాలపై దృష్టిఐఐటీఎంఐసీ పోర్ట్ఫోలియో వైవిధ్యభరితంగా ఉంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, రోబోటిక్స్, స్పేస్ టెక్, బయోటెక్, మొబిలిటీ, ఐఓటీ, క్లీన్ ఎనర్జీ వంటి కీలక డీప్టెక్ రంగాల్లో విస్తరించింది. ఇది దేశం వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా ఉంది. నాణ్యతతో కూడిన స్టార్టప్ల సంఖ్యను పెంచేందుకు, ప్రీ-ఇంక్యుబేషన్ దశలోనే బలమైన మద్దతు అందించే ‘నిర్మాణ్’ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 120కి పైగా ప్రీ-వెంచర్ టీమ్లను ప్రోత్సహిస్తోంది. అదనంగా, స్టార్టప్ స్నేహపూర్వక విధానంలో భాగంగా గతంలో 5 శాతం తీసుకున్న ఈక్విటీని ఐఐటీఎంఐసీ ఇప్పుడు 3 శాతానికి తగ్గించింది. పూర్వవిద్యార్థుల విరాళాలు, కార్పొరేట్ సీఎస్ఆర్ నిధులు దీనికి ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్నాయి.ఇదీ చదవండి: యాప్స్.. మార్కెటింగ్ యంత్రాలా?
రూ.200 కంటే తక్కువ రీఛార్జ్: డైలీ 2జీబీ డేటా..
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా కంపెనీలు అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 28 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Get more value every day with the #BSNL ₹199 Plan!Enjoy 2GB/day, unlimited calls & 100 SMS/day for 28 days - powered by Bharat's trusted network.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNLPlans #PrepaidPlans #BSNL #ConnectingBharat#BestPrepaidPlan #BSNLRecharge pic.twitter.com/mxRECIwJcU— BSNL India (@BSNLCorporate) November 30, 2025రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’: ధర ఎంతంటే?
లండన్ ఆధారిత టెక్ కంపెనీ నథింగ్ కొత్తగా తమ ఫోన్ (3ఎ) లైట్ స్మార్ట్ఫోన్ని భారత్లో ప్రవేశపెట్టింది. దీని వాస్తవ ధర రూ. 20,999 కాగా బ్యాంక్ డిస్కౌంట్లు పోగా రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త నథింగ్ ఫోన్ డిసెంబర్ 5 నుంచి ఫ్లిప్కార్ట్, విజయ్, సేల్స్, క్రోమా, ఇతరత్రా రిటైల్ ఔట్లెట్స్లో లభిస్తుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది.నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’లో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా, ట్రూలెన్స్ ఇంజిన్ 4.0, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.5పై పనిచేస్తుంది. 3 ఏళ్లవరకు మేజర్ అప్డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ పొందవచ్చు.
చలికి చెక్ పెట్టె దుప్పటి.. వెచ్చని పాదాల కోసం సాక్స్!
చలి గాలులు వీచినా, మీకు మాత్రం హాయిగా హీట్ థెరపీ టచ్ ఇచ్చే గాడ్జెట్లు వచ్చేశాయి. ఈ స్మార్ట్ గాడ్జెట్లు మీ శరీరానికి వెచ్చగా హత్తుకుంటూ కంఫర్ట్, కేర్, రిలాక్సేషన్ అన్నీ కలిపి చలికాలాన్ని ఒక హాయికాలంగా మార్చేస్తాయి.చలికి చెక్ ఈ దుప్పటి!చలి వణికిస్తోందా? ఇక ఆ ఫీలింగ్కు ‘టాపిష్ ఎలక్ట్రిక్ దుప్పటి’తో ఫుల్స్టాప్ పెట్టొచ్చు! ఈ దుప్పటి కోరల్ ఫ్లీస్ మెటీరియల్తో తయారై, చర్మానికి మృదువుగా తాకుతూ తక్షణమే వెచ్చదనాన్ని ఇస్తుంది. రివర్సిబుల్ డిజైన్తో రెండు వైపులా ఉపయోగించుకోవచ్చు. అందం కూడా, సౌకర్యం కూడా! ఇన్బిల్ట్ థర్మల్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల చలి ఎంత పెరిగినా, వేడి సమతుల్యంగా ఉంటుంది. షాక్ప్రూఫ్ సిస్టమ్ ఉండటంతో దీనిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ దుప్పటిని మంచంపై పరచి, పైన హీటింగ్ డివైజ్ పెట్టి ఉపయోగించాలి. మడిచి పెట్టకూడదు. ఉపయోగించడానికి ముందు పవర్ ఆఫ్ చేయడం తప్పనిసరి. దీని రిమోట్కి ఐదు సంవత్సరాల వారంటీ ఉండటం విశేషం. ధర కేవలం రూ. 995.వెచ్చని పాదాలు!చలికాలమైనా, వేసవికాలమైనా ఇక కాళ్లకు ఎప్పుడూ సరైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. థర్మామెడ్ స్మార్ట్ సాక్స్ మీ పాదాలను హాయిగా, ఆరోగ్యవంతంగా ఉంచే మంచి స్నేహితులు! ఇవి ప్రత్యేక థర్మో రెగ్యులేషన్ ఫాబ్రిక్తో తయారవడం వలన, వేడి చలి రెండింటినీ సమతుల్యం చేస్తాయి. చెమట పట్టినా ఆరిపోతాయి, వాతావరణం చలిగా ఉంటే వెచ్చదనాన్ని ఇస్తాయి. పాదాలను ఎప్పుడూ పొడిగా, సువాసనగా ఉంచుతాయి. ఫంగస్, బ్యాక్టీరియా తదితర ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచే యాంటీ మైక్రోబియల్ టెక్నాలజీతో ఈ సాక్స్ మరింత హైజినిక్గా ఉంటాయి. కాళ్ల వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడే సున్నితమైన కంప్రెషన్ డిజైన్ వీటి ప్రత్యేకత. లోపల మృదువైన కుషన్ ఉండటంతో రోజంతా ధరించినా ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఉంటుంది. ధర రూ. 850 మాత్రమే!స్మార్ట్ బాటిల్!బాటిల్ని క్లీన్ చేయడానికి ఇకపై పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు! ఎందుకంటే, ఈ ‘లార్క్ స్మార్ట్ వాటర్ బాటిల్’ ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా సెల్ఫ్–క్లీన్ అవుతుంది. దీని లోపలే ఉండే శుద్ధి వ్యవస్థ బాటిల్ నీటిని కేవలం 60 సెకన్లలో శుభ్రం చేస్తుంది. యూవీ సీ ఎల్ఈడీ టెక్నాలజీతో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను నిర్వీర్యం చేస్తుంది. దీంతో, ఎటువంటి కెమికల్స్ లేకుండా, నీరు ఎప్పుడూ తాజాగా, సురక్షితంగా ఉంటుంది. డబుల్ వాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేషన్తో చల్లని నీటిని 24 గంటలు, వేడి పానీయాన్ని 12 గంటలు నిల్వ ఉంచుతుంది. యూఎస్బీ చార్జింగ్తో నెల రోజుల వరకు బ్యాటరీ పవర్ ఉంటుంది. ధర రూ. 21,649.
పర్సనల్ ఫైనాన్స్
Income Tax: నోటీసులా... నోటీసులే..!
రోజూ ఇన్కంట్యాక్స్ వారి వెబ్సైట్లోకి వెళ్లి మీ పర్సనల్ అకౌంటులో లాగిన్ అయ్యి మీ వివరాలు చూసుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఆడిటర్ నుంచి మీ లాగిన్ వివరాలు తీసుకోండి. ప్రతిసారి ఆడిటర్స్ దగ్గరకు పరిగెత్తకుండా మీరే లాగిన్ అవ్వొచ్చు.నోటీసు/సమాచారంఇన్కమ్ ట్యాక్స్ సైట్లో లాగిన్ అయ్యి ... డాష్ బోర్డులోని పెండింగ్ యాక్షన్స్లో ఈ–ప్రొసీడింగ్స్ని క్లిక్ చేయండి. అందులో నోటీసులు ఉంటాయి. ఆ నోటీసుని చూడండి. దీనిని VIEW అంటారు. దానిలో నోటీసులు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు నోటీసులో ఏముందో అర్థమవుతుంది.నోటీసులెన్నో రకాలు, మరెన్నో అంశాలుడిఫెక్టివ్ నోటీసు అంటారు. బదులుగా సకాలంలో దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.అలా సర్దుబాటు చేస్తే సరిపోతుంది.143 (1) ప్రకారం ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. ఆదాయంలో కానీ పన్ను భారం లెక్కింపులో కానీ వ్యత్యాసాలుంటే తెలియజేస్తారు. ఆదా యం ‘కాలమ్’ మీరు వేసింది. అధికారి అస్సె స్ చేసింది పక్కపక్కనే ఉంటాయి. ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూసుకొండి. హెచ్చుతగ్గులుంటాయి. మినహాయింపులుంటాయి.కూడికల్లో లేదా తీసివేతల్లో పొరపాట్లు రావచ్చు.పన్ను చెల్లింపుల విషయంలో రికార్డులు అప్డేట్ కాకపోవడం వల్ల తేడాలుంటాయి.అలాంటి సందర్భాల్లో ట్యాక్స్ చెల్లించమంటారు.ఆ సర్దుబాటు ఆర్డర్లు ఉంటాయి.మీరు వాటితో ఏకీభవిస్తేనే పన్ను కట్టండి. ఒప్పుకోకపోతే అంటే అంగీకరించకపోతే డాక్యుమెంట్లు పొందుపరుస్తూ జవాబు ఇవ్వండి.స్క్రూటినీకి ఎంపిక అయితే ఏయే సమాచారం ఇవ్వాలో అడుగుతారు. ఇవ్వండి.ముందుగా AGREE/ NOT AGREE చెప్పండిఅనవసరంగా వాయిదాలు అడగొద్దు. అవసరం అని తెలిస్తేనే టైం అడగండిఅంతా ఫేస్లెస్ ... మీ మీద ఎటువంటి ఒత్తిళ్లు ఉండవు.అధికారులు ఎంతో ఓపికగా మీ రిప్లై చదువుతారు.సాధారణంగా తప్పులేం జరగవుఅవసరం అయితే నిబంధనల మేరకు మీరు అప్పీల్కు వెళ్లవచ్చు.
మీ కార్డు సంపాదిస్తోందా?
చాలామందికి క్రెడిట్ కార్డంటే భయం. ప్రమాదాన్ని జేబులో పెట్టుకున్నట్లే భావిస్తారు. కానీ కొంచెం తెలివిగా... క్రమశిక్షణతో వాడితే క్రెడిట్ కార్డుతో లాభమే ఎక్కువ. పైసా వడ్డీ చెల్లించక్కర్లేదు. పైపెచ్చు కాస్త సంపాదించుకోవచ్చు కూడా. వీటన్నిటికీ తోడు హోటళ్లు, సినిమా టికెట్లు, ప్రయాణ టికెట్లపై ఎప్పటికప్పుడు ఆఫర్లూ వస్తాయి. ఎయిర్పోర్ట్ లాంజ్లలో ఉచిత సదుపాయాలు... ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు నో–కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే... రూపాయి వడ్డీలేకుండా వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం... ఇలా చాలా లాభాలుంటాయి. కాకపోతే ఒక్కటే షరతు. ఏ క్రెడిట్ కార్డుపై ఎంత కొన్నా... బిల్లు గడువు తేదీ ముగిసేలోగా పూర్తిగా చెల్లించెయ్యాలి. అలాకాకుండా ఈ సారి మినిమం బిల్లు చెల్లిస్తే సరిపోతుందిలే అనుకున్నారో...! మీ పని అయిపోయినట్లే!!.సరైన ఆదాయం లేకపోవటమో... అప్పులంటే భయమో... లేదా సమాచారం లేకపోవటమో... ఏదైనా కావచ్చు. మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం చాలా తక్కువ. మన జనాభాలో వీటిని వాడుతున్నవారు ఐదారు శాతానికి మించి లేరు. అమెరికా లాంటి దేశాల్లో ఏకంగా 80 శాతం మందికిపైగా కనీసం ఒక్క క్రెడిట్ కార్డయినా వాడతారు. అందుకే ఈ క్రెడిట్ కార్డుల వ్యాపార విస్తరణకు దేశంలో విపరీతమైన అవకాశాలున్నాయి కాబట్టే... కంపెనీలు రకరకాల ఆఫర్లిస్తూ మరింతమందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇదీ.. అసలైన లాభం ప్రతి క్రెడిట్ కార్డుకూ ఓ లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు రాఘవకు యాక్సిస్ బ్యాంకు కార్డుంది. దాని లిమిట్ రూ.6 లక్షలు. అంటే రూ.6 లక్షల వరకూ తను వాడుకోవచ్చన్న మాట. మరి ఆ కార్డు జేబులో పెట్టుకుంటే... తన జేబులో రూ.6 లక్షలున్నట్లే కదా? ఆసుపత్రి వంటి ఎంత ఎమర్జెన్సీ వచి్చనా... డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా దీన్ని వాడొచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీల కోసం డబ్బును సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుకోవాల్సిన పనిలేదు కూడా. ఇక ప్రతి కార్డుకూ బిల్లింగ్ తేదీ... చెల్లించడానికి గడువు తేదీ ఉంటాయి. ప్రతి బిల్లింగ్ తేదీకి 30 రోజుల సైకిల్... చెల్లించడానికి మరో 15 రోజుల గడువు ఉంటాయి. అంటే మొత్తంగా 45 రోజుల వ్యవధన్న మాట. బిల్లింగ్ తేదీ అయిన వెంటనే భారీ మొత్తాన్ని వాడినా అది తదుపరి బిల్లులోనే వస్తుంది. గడువు తేదీ కూడా ఉంటుంది కనక దాదాపు 40 రోజులు వడ్డీ లేకుండా అప్పు దొరికినట్లన్న మాట. దాన్ని గడువులోపు చెల్లించేస్తే వాడిన మొత్తంపై పైసా వడ్డీ కూడా ఉండదు.ఇదీ.. ప్రమాదానికి సంకేతం మీరు కార్డుపై ఆ నెల అవసరం కొద్దీ రూ.2 లక్షలు వాడారనుకుందాం. తదుపరి నెల బిల్లులో వాడుకున్న మొత్తాన్ని చూపించటంతో పాటు... ఒకవేళ మీరు దాన్ని చెల్లించలేకపోతే వాడినదాంట్లో 5 శాతాన్ని చెల్లించవచ్చని (మినిమం బిల్) పేర్కొంటారు. అంటే రూ.10వేలు చెల్లిస్తే చాలు. అది ఈజీ కూడా. కానీ మిగిలిన మొత్తంపై 36 శాతానికిపైగా వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మరో నెల గడిస్తే మరో 3 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు కనీస బిల్లు కూడా చెల్లించకపోతే ఆపరాధ రుసుములు భారీగా ఉంటాయి. మీ లిమిట్ను దాటి వాడినా భారీ చార్జీలు చెల్లించాలి. వీటివల్ల ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయిపోతాయి. ప్రతినెలా కనీస బిల్లు కట్టుకుంటూ పోతే ఆ రుణం ఎప్పటికీ తీరదని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డుతో అతిపెద్ద ప్రమాదం ఇదే.కో–బ్రాండెడ్ కార్డులు కూడా... చాలా బ్యాంకులు రకరకాల సంస్థలతో జతకట్టి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు గతంలో సిటీబ్యాంకు ఐఓసీతో జతకట్టి సిటీ–ఐఓసీ కార్డును ఆఫర్ చేసింది. సిటీ క్రెడిట్ కార్డుల వ్యాపారాన్ని కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంకు కూడా దాన్ని కొనసాగిస్తోంది. ఐఓసీ బంకులో పెట్రోలు లేదా డీజిల్ పోయించుకుంటే 2 శాతం వరకూ క్యాష్బ్యాక్ వస్తుందన్న మాట. ఆ పాయింట్లను నేరుగా బిల్లు రూపంలో చెల్లించేయొచ్చు కూడా.రోజువారీ వినియోగానికి ఇవి బెస్ట్.. → ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్: ఆన్లైన్ కొనుగోళ్లపై ఫ్లాట్ 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. → యాక్సిస్ బ్యాంక్ ఏస్: కొనుగోళ్లపై 2–5 మధ్య క్యాష్ బ్యాక్. గూగుల్ పేతో లింక్ చేసుకోవచ్చు. → హెచ్డీఎఫ్సీ రిగాలియా: ప్రయాణాలు, రెస్టారెంట్లలో చెల్లింపులపై రివార్డులు.ఇలా చేయొద్దు... → కార్డుపై చేసే చెల్లింపుల్లో కొన్నింటిని ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, ప్రతి నెలా ఇదే ధోరణి అనుసరిస్తే ఈఎంఐలు చెల్లించడం కష్టం. → ఆఫర్లు ఉన్నాయని చెప్పి, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేయడం స్మార్ట్ కానే కాదు. → వార్షిక ఫీజుపైనా దృష్టి సారించాలి. కొన్ని ఫ్రీగా ఇచ్చినా... కొన్ని సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఇదీ క్యాష్బ్యాక్ పవర్.. → ఒక నెలలో కార్డుతో ఆన్లైన్లో రూ.30,000 ఖర్చు చేశారు. → 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ కింద రూ.1,500 వెనక్కి వస్తుంది. → ఇలా ఒక ఏడాదిలో రూ.18,000 ఆదా చేసుకోవచ్చు. → ఈ మొత్తంతో కుటుంబానికి కావాల్సిన ఆరోగ్య బీమాను సొంతం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్లో ఏటా రూ.18,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేసుకుంటే, 12 శాతం రాబడి ఆధారంగా రూ.3.53 లక్షలు సమకూరుతుంది. స్మార్ట్ అంటే ఇలా.. → క్రెడిట్కార్డు బిల్లును ప్రతి నెలా గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. → కార్డుతో ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయనే చేయొద్దు → గడువు తేదీకి చెల్లింపులు జరిగేలా ఆటో డెబిట్ సదుపాయం యాక్టివేట్ చేసుకోవాలి. → లిమిట్ ఉంది కదా అని చెప్పి నియంత్రణ లేకుండా వాడకూడదు. → క్రెడిట్ కార్డులు రెండుకు మించకుండా చూసుకోండి.
డిసెంబర్ డెడ్లైన్లు.. కొత్త మార్పులు
డిసెంబర్ నెలలో పలు బ్యాంకింగ్, పెన్షన్, ఆదాయపు పన్ను సంబంధించిన కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఎస్బీఐ ఎంక్యాష్ సేవ నిలిపివేత నుంచి, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ, పాన్–ఆధార్ లింకింగ్, ఐటీఆర్ గడువులు, ఎన్పీఎస్ నుంచి యూపీఎస్కు మారడానికి ఆప్షన్ గడువు.. ఇలా అనేక అంశాలు గమనించాల్సివి ఉన్నాయి.నవంబర్తో ముగిసే కీలక గడువులుఎస్బీఐ ఎంక్యాష్ సేవ నిలిపివేతస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 30 తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ, యోనో లైట్లో ఎంక్యాష్ (mCASH) సేవలను నిలిపివేస్తోంది. దీని తర్వాత లబ్ధిదారును నమోదు చేయకుండా డబ్బు పంపడం లేదా లింక్ ద్వారా నిధులు స్వీకరించడం సాధ్యం కాదు. బదులుగా వినియోగదారులు యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి సురక్షిత చెల్లింపు మార్గాలను ఉపయోగించాలని ఎస్బీఐ సూచించింది.లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు చివరి తేదీప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను నవంబర్ 30లోపు తప్పనిసరిగా సమర్పించాలి. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఇంటి వద్ద సేవల ద్వారా, బ్యాంకులు/పోస్టాఫీసుల ద్వారా, డిజిటల్ యాప్ ద్వారా కూడా సమర్పించవచ్చు. గడువు దాటితే పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.ఎన్పీఎస్ నుండి యూపీఎస్కు మార్పు..ఎన్పీఎస్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కి మారడానికి నవంబర్ 30 చివరి అవకాశం ఉంది. దరఖాస్తులు సీఆర్ఏ వ్యవస్థ ద్వారా లేదా నోడల్ కార్యాలయాలకు భౌతికంగా అందించాలి.డిసెంబర్లో కీలక ఆదాయపు పన్ను గడువులుపన్ను ఆడిట్ కేసుల ఐటీఆర్పన్ను ఆడిట్కి అర్హులైన మదింపుదారుల కోసం ఐటీఆర్ దాఖలు గడువును సీబీడీటీ డిసెంబర్ 10 వరకు పొడిగించింది. అసలు గడువు అక్టోబర్ 31తోనే ముగిసింది.ఆలస్యంగా ఐటీఆర్ దాఖలుఅసలు గడువులో ఐటీఆర్ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 139(4) కింద డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ తేదీ తర్వాత దాఖలు చెయ్యడం అసాధ్యం. జరిమానా, వడ్డీ, రిఫండ్ నష్టం వంటి పరిణామాలు ఎదురవచ్చు.పాన్–ఆధార్ లింకింగ్2024 అక్టోబర్ 1 లోపు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ఆధారంగా పాన్ పొందిన వ్యక్తులు తమ పాన్ ఇనాక్టివ్ కాకుండా ఉండాలంటే డిసెంబర్ 31 లోపు ఆధార్–పాన్ లింకింగ్ పూర్తి చేయాలి.
ధనికులయ్యే ‘తొలి కిటుకు’ చెప్పేసిన కియోసాకి..
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే ప్రముఖ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక కఠినమైన హెచ్చరికను జారీ చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రపంచ ఆస్తి బుడగ పేలడం ప్రారంభించిందని, అత్యంత ప్రభావవంతమైన "క్యారీ ట్రేడ్"కు జపాన్ ముగింపు పలుకుతోందని హెచ్చరించారు.ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor) రచయిత.. జపాన్ "క్యారీ ట్రేడ్" అంటే అతి-తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చే దీర్ఘకాల పద్ధతి గురించి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విటర్)లో వరుస పోస్టులలో వ్యాఖ్యానించారు. ఈ విధానం ద్వారా ప్రపంచ రియల్ ఎస్టేట్, ఈక్విటీలు, బాండ్లు, కమాడిటీలు, ప్రైవేట్ వ్యాపారాలలోకి ప్రవహించిన మూలధనం ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలను పెంచడానికి సహాయపడిందని పేర్కొన్నారు.కియోసాకి (Robert Kiyosaki ) ప్రకారం.. ఈ అనూహ్య తిరోగమనం ఇప్పుడు యు.ఎస్. థాంక్స్ గివింగ్ సమయంలో "చరిత్రలో అతిపెద్ద క్రాష్"ను ప్రేరేపిస్తోంది. మార్కెట్లు కుదుపునకు లోనవుతున్నప్పుడు ఆ సంక్షోభానికి చిక్కకుండా ధనవంతులు కావడానికి ఏం చేయాలో తాను 10 వ్యూహాలను చెబుతానన్న కియోసాకి తన తొలి కిటుకును బయట పెట్టేశారు.తొలి వ్యూహం ఇదే.. కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి ప్రపంచ ఇంధన డిమాండ్ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.కోట్లాది మంది ఉద్యోగాలు పోయి, ఆస్తులు పోగొట్టుకుని బికారులయ్యే ఈ తరుణంలో ‘నేను ధనవంతున్ని కావాలని ప్లాన్ చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిన ఆయన ఉద్యోగ మార్కెట్పైనే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆధారపడి ఉంటుందన్న తన ‘రిచ్ డాడ్’ పాఠాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయినా మీరు మాత్రం ధనికులు కావచ్చని తనను అనుసరించేవారికి కియోసాకి సూచించారు. తన నుంచి మరిన్ని సూచనలు రాబోతున్నాయన్న ఆయన ఇవి కేవలం తన సూచనలు మాత్రమేనని, సిఫార్సులు కాదని స్పష్టం చేశారు.30 YEAR BUBBLE BURSTINGJapan ends “CARRY TRADE” ending.For 30 years Japan has loaned billions to investors in global markets, and money flowed into real estate, stocks, bonds, commodities & businesses. The Japanese “carry trade” blew the assets of the world….into the…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 29, 2025


