ప్రధాన వార్తలు

అత్యంత ఖరీదైన క్రూయిజ్.. ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాలి!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూయిజ్ ప్రయాణానికి ప్రకటన విడుదలైంది. రీజెంట్ సెవెన్ సీస్ అనే సంస్థ "వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్" పేరుతో 140 రోజుల క్రూయిజ్ ప్రయాణాన్ని ప్రకటించింది. మియామి నుండి న్యూయార్క్ వరకు వెళ్లే ఈ సెవెన్ సీస్ స్ల్పెండర్ క్రూయిజ్ 6 ఖండాలు, 40 దేశాలు, 71 ఓడరేవులను కవర్ చేస్తుంది. ఈ విలాస సాగర యాత్ర 2027 జనవరి 11న ప్రారంభం కానుంది.టికెట్ ధరలు ఇలా.."వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్" క్రూయిజ్ ఎక్కడం సామాన్యుల తరం కాదు. ఎందుకంటే అంతలా ఉన్నాయి టికెట్ ధరలు. ఎంట్రీ లెవల్ వరండా సూట్ల ఛార్జీలే ఒక్కొక్కరికి సుమారు రూ .80 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇక టాప్-ఎండ్ రీజెంట్ సూట్ కావాలంటే దాదాపు రూ .7.3 కోట్లు అవుతుంది. వాణిజ్య క్రూయిజ్ మార్కెట్లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం.ఏమిటి ప్రత్యేకతలు?సముద్ర ఉపరితలంపై అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు అందించడంలో రీజెంట్ సూట్లకు సుదీర్ఘ ఖ్యాతి ఉంది. ప్రతి పోర్ట్ లోనూ ప్రైవేట్ కారు, డ్రైవర్, ఇన్-సూట్ స్పా, క్యూరేటెడ్ ఫైన్ ఆర్ట్, 4,000 చదరపు అడుగుల ప్రైవేట్ స్పేస్ వంటి అల్ట్రా-ఎక్స్ క్లూజివ్ వసతులను అతిథులకు కల్పిస్తుంది.రీజెంట్ 2026లో సెవెన్ సీస్ ప్రెస్టీజ్ లో ఇంకా పెద్ద స్కైవ్యూ రీజెంట్ సూట్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. దీని ధర ఒక్క రోజుకి సుమారు రూ .20-22 లక్షలు. ఇది అత్యంత ఖరీదైన సూట్ రేటుగా రికార్డుకెక్కింది.ఆరు ఖండాలలో ప్రయాణం2027 "వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్" క్రూయిజ్ అతిథులు లాస్ ఏంజిల్స్, సిడ్నీ, సింగపూర్, మాలిబు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో రాత్రి బస చేసి ఆరు ఖండాల గుండా 35,668 నాటికల్ మైళ్ళు (66,057 కిమీ) ప్రయాణిస్తారు.మార్గం వెంట 486 కాంప్లిమెంటరీ షోర్ విహారయాత్రలు, మూడు ప్రత్యేకమైన తీరప్రాంత గాలా ఈవెంట్ లు, ఇంటర్కాంటినెంటల్ బిజినెస్ లేదా ఫస్ట్-క్లాస్ విమానాలు, లగ్జరీ హోటల్ బసలు, లగేజ్ సర్వీస్, ప్రీమియం బేవరేజీలు, స్పెషాలిటీ డైనింగ్, వాలెట్ లాండ్రీ, వై-ఫై, 24 గంటల ఇన్-సూట్ డైనింగ్ వంటివెన్నో ఈ విలాస ప్రయాణంలో ఉన్నాయి.ఈ క్రూయిజ్కు భారత్లో నాలుగు స్టాప్ లు ఉన్నాయి. ముంబై, మంగళూరు, కొచ్చి, గోవాలో ఈ క్రూయిజ్ను యాత్రికులు ఎక్కొచ్చు.

బ్యాంక్, ఐటీ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరుతుందన్న ఆశాభావంతో భారత ఈక్విటీ సూచీలు సానుకూలంగా కదిలాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 313.02 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 82,693.71 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 91.15 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 25,330.25 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్), కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. దీనికి విరుద్ధంగా, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్ వెనుకబడి ఉన్నాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.08 శాతం, స్మాల్ క్యాప్ 0.68 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.61 శాతం, నిఫ్టీ ఐటీ 0.65 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ 0.5 శాతం నష్టపోయింది.

స్టార్హెల్త్ నుంచి తప్పుకొన్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీ
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ నుంచి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ మాడిసన్ ఇండియా క్యాపిటల్ నిష్క్రమించింది. కంపెనీలో తనకున్న మొత్తం 1.15 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా సుమారు రూ. 299 కోట్లకు విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ డేటా ప్రకారం అనుబంధ సంస్థ ఎంఐవో స్టార్ ద్వారా మాడిసన్ ఇండియా 67.72 లక్షల షేర్లను సగటున రూ.441.01 రేటుకు విక్రయించింది.ప్రేమ్జీ ఇన్వెస్ట్లో భాగమైన పీఐ ఆపర్చూనిటీస్ ఏఐఎఫ్ 45.35 లక్షల షేర్లను (0.77 శాతం వాటా) రూ. 200 కోట్లకు కొనుగోలు చేసింది. 2024 మే నెలలో మాడిసన్ ఇండియా క్యాపిటల్ సహా మూడు సంస్థలు స్టార్ హెల్త్లో సుమారు 7.06 శాతం వాటాను రూ. 2,210 కోట్లకు విక్రయించాయి.కాగా నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కు అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్పీఐ) ఇటీవల హెచ్చరిక జారీ చేసింది. స్టార్ హెల్త్ నుంచి ఆస్పత్రులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ప్రస్తావించింది. ఏహెచ్పీఐలో 1,500 ప్రైవేటు ఆస్పత్రులు సభ్యులుగా ఉన్నాయి.

డిస్కార్డ్ వంటి మరెన్నో యాప్స్..
నేపాల్లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జెన్జీ యువతకు కమ్యునికేషన్ సాధనంగా ‘డిస్కార్డ్’ యాప్ ఎంతో తోడ్పడినట్లు తెలుస్తుంది. యువతను కట్టడి చేసేందుకు, అల్లర్లను అదుపు చేసేందుకు నేపాల్ గత ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించడంతో గేమింగ్ యాప్లో ఇంటర్నల్ కమ్యునికేషన్ టూల్గా వాడే డిస్కార్డ్ ఎంతో ఉపయోగపడినట్లు కొందరు చెబుతున్నారు.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యవస్థాపకులు జాసన్ సిట్రాన్, స్టాన్ విస్నేవిస్క్ 2015లో డిస్కార్డ్ను ఆవిష్కరించారు. ఇది వాయిస్, వీడియో, చాట్ ప్లాట్ఫామ్. గేమింగ్ సాధనాల్లో గేమర్లు ఇంటర్నల్ కమ్యునికేషన్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇటీవల నేపాల్ జెన్జీ యువత రాజకీయ మార్పును డిమాండ్ చేస్తూ వీధుల్లోకి పెద్దమొత్తంగా ర్యాలీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలున్న సమయంలో ఇంతలా యువత ఒకేసారి అసంతృప్తితో కూడబలుక్కొని వీధుల్లోకి రావడం ఎలా సాధ్యమైందనే దానిపై చర్చ సాగింది. అందుకు గేమింగ్ టూల్స్లో ఉన్న డిస్కార్డ్ యాప్ ద్వారా యువత పరస్పరం కమ్యునికేట్ అయి ఇలా మూకుమ్మడిగా దాడికి దిగినట్లు తెలుస్తుంది.ఇదిలాఉండగా, భారతదేశంలో 2025లో డౌన్లోడ్ల పరంగా డిస్కార్డ్ నాలుగో అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఇది మొత్తం ఇన్స్టాల్స్లో 6 శాతం వాటాను కలిగి ఉంది. ఇండియాలో ఈ ఒక్క ఏడాదే 5 మిలియన్ల డౌన్లోడ్లు నమోదు అయ్యాయి. 2024 కంటే 2 శాతం పెరిగింది. ఇలాంటి మరిన్ని యాప్స్ గురించి యువత సెర్చ్ చేస్తోంది. వాటిలో కొన్నింటి వివరాలు కింద చూద్దాం.యాప్ముఖ్య లక్షణాలుఎవరి కోసం అంటే..గిల్డెడ్వాయిస్, వీడియో, బాట్గేమింగ్ కమ్యూనిటీలుటీమ్ స్పీక్అల్ట్రా-లో లేటెన్సీ వాయిస్, మిలిటరీ-గ్రేడ్ ఎన్ క్రిప్షన్ఈస్పోర్ట్స్, ఎఫ్పీఎస్ పోటీ దారులకు..మంబుల్ఓపెన్ సోర్స్, ఎన్ క్రిప్టెడ్ వాయిస్ చాట్గోప్యంగా ఉండాలనుకునే గేమర్లుటాక్స్పీర్-టు-పీర్ మెసేజింగ్గేమింగ్ సమూహాలు ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే

దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్?
దీపావళి పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు బంపర్ ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు కరవు భత్యం (డీఏ) పెంచాలని చూస్తుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తీసుకునే ఈ రెండు నిర్ణయాల వల్ల ఉద్యోగుల వేతనాలు పెరుగనున్నాయి.8వ పే కమిషన్8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి దీపావళి లోపు నిబంధనలు ఖరారు చేస్తారని కొందరు విశ్వసిస్తున్నారు. ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 15-18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి 8 నెలల్లోనే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.నిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(కొత్త బేసిక్పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.డీఏ పెంపుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2025 నుంచి కరవు భత్యం (డీఏ) 3 శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఈమేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 58 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, దీపావళి ముందు అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ సర్వీస్ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!?

‘100 ఏళ్ల స్వాతంత్ర్య భారతానికి మోదీ సేవ చేస్తూనే ఉండాలి’
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులతోపాటు దేశంలోని వ్యాపార ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. స్వాతంత్ర్య భారతానికి 100 ఏళ్లు వచ్చే వరకు నరేంద్రమోదీ దేశానికి సేవ చేస్తూనే ఉండాలని అందులో తెలిపారు.‘ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని 145 కోట్ల మందికి ఇదో పండగ రోజు. భారతదేశంలోని మొత్తం వ్యాపార సమాజం తరఫున, రిలయన్స్, అంబానీ కుటుంబం తరఫున, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం అమృత్ కాల్లో మోదీ అమృత్ మహోత్సవ్ రావడం యాదృచ్ఛికం కాదు. స్వతంత్ర భారతదేశానికి 100 ఏళ్లు నిండిన నాటికి కూడా మోదీ భారతదేశానికి సేవ చేస్తూనే ఉండాలనేది కోరిక’ అని చెప్పారు.#WATCH | "It is my deepest wish that Modi ji should continue to serve India when independent India turns 100...", says Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani, on PM Modi's 75th birthdayHe says, "Today is a festive day for 1.45 billion… pic.twitter.com/u2NJSTMV3R— ANI (@ANI) September 17, 2025
కార్పొరేట్

అత్యంత ఖరీదైన క్రూయిజ్.. ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాలి!

స్టార్హెల్త్ నుంచి తప్పుకొన్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీ

‘100 ఏళ్ల స్వాతంత్ర్య భారతానికి మోదీ సేవ చేస్తూనే ఉండాలి’

కస్టమర్ సర్వీస్ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!?

కాగ్నిజెంట్ సమాచారాన్ని ఇన్ఫోసిస్ దుర్వినియోగం?

ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ ఇన్స్టిట్యూట్ల్లో ఐఎస్బీకి చోటు

ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ చిప్లపై పరిశోధన

తయారీలో సంస్కరణలు రావాలి

నథింగ్లో ‘జెరోధా’ కామత్ పెట్టుబడులు

సరికొత్త శిఖరాలకు పసిడి

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టా...

బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...

82,000 మార్కు చేరిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...

7 ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లు ఊగిసలాడుతున్నప్ప...

జీఎస్టీ తగ్గింపుతో 140 కోట్ల మందికి ప్రయోజనం
కొత్త జీఎస్టీ సవరణల్లో భాగంగా 350కు పైగా వస్తువుల ...

సెస్ల లక్ష్యం నీరుగారుతోందా?
కేంద్రం సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబుల...

వారం రోజులుగా ఖాళీగా ఉంటున్న ట్రక్కు డ్రైవర్లు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ నిర్...

తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ?
అమెరికా సుంకాలు భారత వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న ...
ఆటోమొబైల్
టెక్నాలజీ

‘టీసీఎస్లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ చుట్టూ రోజుకో వివాదం రేగుతోంది. భారీగా లేఆఫ్ల ప్రకటనతోపాటు ఆ సంస్థలో బలవంతంగా రాజీనామాలు, ఉద్యోగ విరమణలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మరో ఉద్యోగి తనను రాజీనామా చేయాలని బలవంతం చేశారని ఆరోపిస్తున్నారు.ఈ మేరకు ప్రొఫెషనల్ సామాజిక ప్లాట్ఫామ్ రెడిట్లో షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. 3,000 కు పైగా అప్ ఓట్లు, వందలాది కామెంట్లు వచ్చాయి. ఇది దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థలలో ఒకటైన టీసీఎస్లో విషపూరిత పద్ధతులపై విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది.తనను టీసీఎస్లో జూనియర్ టెక్ ఉద్యోగిగా చెప్పుకొన్న రెడిటర్ అదే తన మొదటి ఉద్యోగంగా పేర్కొన్నారు. మూడు రోజుల ముందు మీటింగ్ హాల్కు పిలిచి అక్కడ తనను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని హెచ్ఆర్ ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. అయితే తాను రాజీనామా చేయడానికి నిరాకరించానని, అందుకు తనను టర్మినేట్ చేసి వ్యతిరేక రివ్వూలు ఇస్తానని బెదిరించారని, అయినప్పటికీ తాను రాజీనామా చేయను.. మీకు నచ్చినట్లు చేసుకోండని చెప్పానని రాసుకొచ్చారు.అంతేకాక సంస్థలో పని వాతావరణం గురించి కూడా పలు ఆరోపణలు చేశారు. జీతం చాలా తక్కువే అయినా దాని వర్క్ కల్చర్, ఉద్యోగ భద్రత కారణంగా తాను టీసీఎస్ లో చేరానని, కానీ దానికి ఇప్పుడు చింతిస్తున్నానని వాపోయారు. ‘రతన్ టాటా తరువాత, ఈ కంపెనీ గందరగోళానికి గురైంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు!

కళ్లజోడుకు గుడ్బై?: సర్జరీ లేకుండా.. రెండేళ్లు!
వయసు పెరిగే కొద్దీ.. దాదాపు అందరికీ ప్రెస్బయోపియా (కంటిచూపు లోపం) వస్తుంది. అప్పుడు చదవడం లేదా ఫోన్ను ఉపయోగించడం వంటి క్లోజప్ విషయాలపై దృష్టి పెట్టడం కొంత కష్టతరమవుతుంది. దీనికోసం రీడింగ్ గ్లాసెస్పై ఆధారపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరిశోధకులు ప్రత్యేక కంటి చుక్కలను తయారు చేశారు. ఇది కొంతకాలం పాటు గ్లాసెస్ను వదిలించుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిరెండు సంవత్సరాల పాటు జరిగిన ఒక అధ్యయనంలో.. కంటి చుక్కలను తయారు చేశారు. వీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల, కళ్లజోడుతో పనిలేకుండానే చిన్న అక్షరాలను చదివే సామర్థ్యం మెరుగుపడిందని తేలింది. అధ్యయనంలో.. చాలా మంది వ్యక్తులు చుక్కలను ఉపయోగించిన తర్వాత ప్రామాణిక కంటి చార్టులో (జేగర్ చార్ట్) రెండు లేదా అంతకంటే ఎక్కువ అదనపు పంక్తులను చదవగలిగారు. ఈ చుక్కలను ఉపయోగించడం వల్ల.. రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిని పొందవచ్చని చెబుతున్నారు.ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్స్ (ESCRS)లో ప్రచురించారు. కంటి చూపు పెరగడానికి ఉపయోగించే.. చుక్కల మందులో పైలోకార్పైన్ (కన్ను దగ్గరగా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది), డైక్లోఫెనాక్ (కొంతమందికి కలిగే చికాకును నివారించడంలో సహాయపడుతుంది) ఉపయోగించినట్లు వెల్లడించారు.రోజుకు రెండుసార్లుసాధారణంగా ప్రజలు.. రోజుకు రెండుసార్లు చుక్కలను ఉపయోగిస్తారు. అవసరమైతే మూడవ మోతాదును కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రెస్బయోపియా (Presbyopia) ప్రభావాన్ని బట్టి.. రోజుకు ఎన్నిసార్లు ఉపయోగించాలనేది నిర్దారించడం జరుగుతుంది. ప్రెస్బయోపియా తీవ్రత తక్కువగా ఉంటే తక్కువసార్లు, ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ కోసం ఎక్కువసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికకంటి చూపు మందగించడం వల్ల.. కొంతమంది ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ వద్దనుకుని, సరళమైన పద్దతిలో సమస్య పరిష్కరించుకోవడానికి ఈ చుక్కల మందు ఉపయోగపడుతుంది. అయితే ప్రెస్బయోపియా ప్రభావం తగ్గించడానికి ఉపయోగించే చుక్కల మందు వల్ల.. స్వల్ప చికాకు లేదా తేలికపాటి తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలను నిర్మూలించడానికి మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

జియో చౌక ప్లాన్.. ఎక్కువ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందించాలని కొన్ని రోజుల క్రితం ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. దీని తర్వాత జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ తో రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది.ఇందులో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వ్యాలిడిటీని పొందుతారు. డేటాను ఉపయోగించని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది. మరొకటి 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్లు రెండూ ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించే, డేటా అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి.84 రోజుల ప్లాన్జియో కొత్త రూ.448 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో యూజర్లకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇది కాకుండా, వినియోగదారులకు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్ కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.365 రోజుల ప్లాన్జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో, వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నెట్ వర్క్ లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత నేషనల్ రోమింగ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది.

ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయో చెప్పలేం. అయితే ఆ ఏఐ సాధనానికి శిక్షణ ఇచ్చేవాళ్ల ఉద్యోగాలే పోవడం బాధాకరం. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ఏఐ (xAI).. తన డేటా అనోటేషన్ బృందం నుండి సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది. వీరంతా సంస్థ జనరేటివ్ ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్’కు శిక్షణ ఇచ్చే సిబ్బంది కావడం గమనార్హం.ఇదీ కారణం నివేదిక ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులకు కారణం సంస్థ దృష్టి మారడం. ఎక్స్ఏఐ సాధారణ ఏఐ ట్యూటర్లను అభివృద్ధి చేయడంపై దృష్టిని తగ్గించి స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై వనరులను కేంద్రీకరిస్తుందంటూ సిబ్బందికి పంపిన ఈమెయిల్ లో కంపెనీ తెలిపింది. "మా హ్యూమన్ డేటా ప్రయత్నాలను క్షుణ్ణంగా సమీక్షించిన తరువాత, మా స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్ల విస్తరణ, ప్రాధాన్యతను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే సమయంలో సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోలపై మా దృష్టిని తగ్గించాం. "ఫోకస్ లో ఈ మార్పులో భాగంగా, మాకు ఇకపై చాలా సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోగులు అవసరం లేదు.. ఎక్స్ఏఐతో మీ ఉద్యోగం ముగుస్తుంది" అని పేర్కొంది.ఉద్యోగులకు సిస్టమ్ యాక్సెస్ రద్దు చేస్తామని చెప్పిన కంపెనీ వారి ఒప్పందాలు ముగిసే వరకు లేదా నవంబర్ 30 వరకు జీతాలు చెల్లింపు కొనసాగుతుందని వివరించింది. వీడియో గేమ్స్, వెబ్ డిజైన్, డేటా సైన్స్, మెడిసిన్, స్టెమ్ వంటి రంగాలలో స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై పెట్టుబడులను పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకుఅనుగుణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను పెంచుకోనున్నట్లు ఇటీవలే ఎక్స్ఏఐ ప్రకటించింది.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు
పర్సనల్ ఫైనాన్స్

60 తర్వాత.. ఆచితూచి..!
మనలో చాలా మంది పదవీ విరమణ ప్రణాళిక గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడో వృద్ధాప్యంలో పలకరించే రిటైర్మెంట్ గురించి యవ్వనంలో ఉన్నప్పుడు చర్చించడం వారికి నచ్చదు! మధ్య వయసు వచ్చే వరకు అభిరుచులు, ఆకాంక్షలు, కోరికల చుట్టూ సాగిపోతుంటారు. దీంతో రిటైర్మెంట్కు ప్రాధాన్యం పక్కకు వెళ్లిపోతుంది. తీరా రిటైర్మెంట్ పలకరించిన తర్వాత, అప్పటి వరకు తాము వెనకేసింది అవసరాలకు ఎంత మాత్రం సరిపోదని తెలుసుకుని ఆందోళన చెందాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఒక్కసారి ఆస్పత్రిపాలైతే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. లిక్విడిటీ తగినంత లేని సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. క్లిష్ట సమయాల్లో రోజువారీ ఖర్చులకు సైతం కటకట ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన రాబడి లేని సాధనాలను నమ్ముకోవడం వల్ల రిటైర్మెంట్ ఫండ్ దీర్ఘకాలం పాటు అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందుకే పదవీ విరమణ తర్వాత.. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వేసే ప్రతి అడుగు ఆర్థికంగా ఆచితూచి ఉండాలి. ఉద్యోగంలో మాదిరే పదవీ విరమణ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ప్రణాళిక ఉండాలి. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటి వరకు సమకూర్చుకున్న ఫండ్ (పొదుపు నిధి)ను వివిధ సాధనాల్లో పెట్టుబడి పెట్టి.. ప్రతి నెలా నిర్ణిత మొత్తాన్ని ఉపసంహరించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ‘‘పెట్టుబడి నుంచి మొదటి ఏడాది 3–4 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. రెండో ఏడాది నుంచి ద్రవ్యోల్బణం సూచీ స్థాయిలో ఉపసంహరణకు పరిమితం కావాలి’’ అని నెర్డిబర్డ్ వెల్త్ అడ్వైజరీ ప్రిన్సిపల్ ఆఫీసర్ శిల్పా భాస్కర్ గోలే సూచించారు. ఉపసంహరణలో చిన్న తేడా వచ్చినా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం పాటు కాపాడుకోలేరు. ఉదాహరణకు రూ.2 కోట్ల నిధి ఉందనుకోండి. ఏటా 8 శాతం వృద్ధి చెందుతూ, ప్రతి నెలా రూ.లక్ష ఉపసంహరించుకుంటే తమవద్దనున్న నిధి 6 శాతం ద్రవ్యల్బోణం అంచనా ఆధారంగా 21 ఏళ్ల అవసరాలకు సరిపోతుంది. అలా కాకుండా ప్రతి నెలా రూ.1.5 లక్షల చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే అదే నిధి 13 ఏళ్ల అవసరాలనే తీర్చగలదు. ఎంత ఉపసంహరించుకోవాలన్న స్పష్టత కొరవడితే, తొలినాళ్లలో అధికంగా ఖర్చు చేయొచ్చు. ఖర్చులకు అనుగుణంగా ఉపసంహరణలు కొనసాగితే, తర్వాతి సంవత్సరాలకు పెద్దగా మిగిలి ఉండదని 5నాన్స్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా హెచ్చరించారు. పేరుకే రిటైర్మెంట్. కానీ, నేడు చాలా మంది ఆ తర్వాత కూడా ఏదో ఒక పని చేస్తున్నారు. అలాంటి మార్గాలను గుర్తించాలి. దీనివల్ల రిటైర్మెంట్ ఫండ్ నుంచి తక్కువ ఉపసంహరణకు పరిమితం కావొచ్చు. ఫలితంగా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.ఈక్విటీ పెట్టుబడులపై అప్రమత్తత... పదవీ విరమణ తర్వాత ఈక్విటీ పెట్టుబడులకు పూర్తిగా దూరం కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్ సెక్యూరిటీల రాబడిపై ద్రవ్యోల్బణం క్షీణత ప్రభావాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. పదవీ విరమణ తర్వాత పెట్టుబడుల్లో వృద్ధి భాగం లేకపోతే, పొదుపు నిధి విలువ వేగంగా తగ్గిపోతుంది. కనుక 70 ఏళ్లు దాటిన వారు సైతం తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతాన్ని అధిక నాణ్యతతో కూడిన డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని దినేష్ రోహిరా సూచించారు. దీనివల్ల పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందుతుంది. అదే సమయంలో ఈక్విటీలపై ఎక్కువగా ఆధారపడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రిటైర్మెంట్ ఆరంభంలో ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే.. సరిగ్గా అప్పుడే ఈక్విటీల్లో బేర్ దశ (పతనకాలం) ఆరంభమై కొన్నేళ్ల పాటు కొనసాగితే.. అవసరాల కోసం ఈలోపు చేసే ఉపసంహరణలతో పెట్టుబడి విలువ గణనీయంగా పడిపోతుంది. కనుక 5–7 ఏళ్ల అవసరాలకు సరిపడా మొత్తాన్ని సురక్షిత డెట్ సాధనాల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల అంతకాలం పాటు ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉంటే ఆ మొత్తం మెరుగ్గా వృద్ధి చెందేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.యాన్యుటీ ప్లాన్లు యాన్యుటీ ప్లాన్లు.. హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. కానీ, రిటైర్మెంట్ నిధి మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఒక్కసారి యాన్యూటీ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత చివరి వరకు ఒకే విధమైన రాబడికి లాక్ అయినట్టే. వ్యయాలు, వైద్య అత్యవసరాలు లేదా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రాబడి పెరగదు. యాన్యుటీలకు పన్ను ప్రయోజనాలు కూడా లేవు. కనుక కొంత వరకు యాన్యుటీకి కేటాయించుకుని, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, డెట్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవాలి. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.వైద్యపరంగా సన్నద్ధత.. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు సర్వ సాధారణం. వైద్యపరమైన ద్రవ్యోల్బణం 12–14%గా ఉంటోంది. కనుక ఈ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఇది లేకపోతే పొదుపు నిధిపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్థిక కోణం నుంచి చూస్తే ఇది పెద్ద తప్పిదం అవుతుంది. రిటైర్మెంట్ ఫండ్ అన్నది జీవితాంతం అవసరాలను తీర్చడం కోసం. వైద్యం కోసం దాన్ని వాడటం మొదలు పెడితే తక్కువ కాలంలోనే ఖాళీ అయిపోతుంది. కనుక రిటైర్మెంట్ తర్వాత ప్రీమియం భారమైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ను కొనసాగించాలి. ప్రీమియం భారమనిపిస్తే రూ.5 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. ఉద్యోగ సమయంలో కంపెనీ గ్రూప్ హెల్త్ పాలసీ ఉందని, వ్యక్తిగత హెల్త్ పాలసీ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను చాలా మంది తీసుకోరు. ఉద్యోగ విరమణ తర్వాత తీసుకుంటే అప్పుడు భారీ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కనుక గ్రూప్ హెల్త్ ప్లాన్పై ఆధారపడకుండా వ్యక్తిగతంగా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి.ఎస్టేట్ ప్లానింగ్ 60 తర్వాత తప్పకుండా పట్టించుకోవాల్సిన అంశం ఎస్టేట్ ప్లానింగ్. స్థిర, చరాస్తులు, ఆర్థిక ఆస్తులను ఎలా నిర్వహించాలి? ఎలా పంపిణీ చేయాలన్నది ఇది నిర్దేశిస్తుంది. కేవలం ధనవంతుల కోసమే ఇదని భావిస్తుంటారు. కానీ, ఆస్తులున్న ప్రతి కుటుంబానికి అవసరమే. కనీసం వీలునామా రూపంలో అయినా ఎవరికి ఏ మేరకు పంపిణీ చేయాలో సూచించాలి. తద్వారా భవిష్యత్తులో వారసుల మధ్య వివాదాలు లేకుండా జాగ్రత్తపడొచ్చు. ఇక్కడ వీలునామా అన్నది తమ మరణానంతరం తమ వారసులకు ఏవేవి, ఎలా చెందాలో సూచించే పత్రం. అదే ఎస్టేట్ ప్లానింగ్ అయితే జీవించి ఉన్న సమయంలోనూ ఆయా ఆస్తుల రక్షణ, వాటిని తమ అభీష్టం మేరకు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం కారణంగా కుటుంబ యజమాని అశక్తుడిగా మారిన సందర్భంలో అప్పటికే ఎస్టేట్ ప్లానింగ్ ఉంటే, అందులో పేర్కొన్న విధంగా ఆస్తుల నిర్వహణను కుటుంబ సభ్యులు లేదా ట్రస్టీలు చూసుకుంటారు. ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా ఉన్నప్పటికీ.. పెట్టుబడులకు నామినీని నమోదు చేయడం కూడా అవసరమే. దీనివల్ల వీటి క్లెయిమ్ సులభతరం అవుతుంది. పన్ను ప్రయోజనం ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) పన్ను పరంగా మెరుగైన సాధనాలు కావు. వీటి రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. తమకు వర్తించే శ్లాబు రేటు ప్రకారమే ఎఫ్డీ రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. గతంలో మాదిరి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో స్వల్పకాల/దీర్ఘకాల పెట్టుబడుల ప్రయోజనాలు ఇప్పుడు లేవు. ఎప్పుడు విక్రయించినా ఎఫ్డీల మాదిరే ఆదాయం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సిందే. వీటికి బదులు పన్ను ఆదా కోసం అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిలో రాబడికి ఈక్విటీ పెట్టుబడులకు మాదిరే స్వల్ప, దీర్ఘకాల మూలధన పన్ను నిబంధనలు అమలవుతాయి. రిస్క్ దాదాపు ఉండదు. లిక్విడ్ ఆస్తులకు చోటు ఉండాలి కొంత మంది రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం ప్రాపర్టీని (ఇల్లు/ఫ్లాట్) సమకూర్చుకుంటుంటారు. స్థిరాస్తి రూపంలో ఉండడం వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్య ఎదురుకావొచ్చు. అవసరమైనప్పుడు ప్రాపర్టీని వెంటనే నగదుగా మార్చుకోవడం సాధ్యపడదు. ఇక నిర్వహణ వ్యయాలు, పన్నులు, న్యాయ వివాదాల రిస్్కలు ఎలానూ ఉంటాయ్. రిటైర్మెంట్ కోసమని ప్రాపర్టీలను సమకూర్చుకున్నప్పటికీ.. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయానికి ప్రణాళిక ఉండాలి. ఇందుకు ప్రాపర్టీని విక్రయించడం లేదంటే రివర్స్ మార్ట్గేజ్కు వెళ్లడం మంచి ఆప్షన్ అవుతుంది. రివర్స్ మార్ట్గేజ్లో ప్రాపర్టీని బ్యాంక్ తనఖా పెట్టుకుని, నెలవారీ కోరుకున్నంత ఆదాయాన్ని నిర్ణిత కాలం పాటు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించనక్కర్లేదు. అదే ఇంట్లో నివాసం ఉండొచ్చు. మీ తదనంతరం వారసులు అప్పటి వరకు ఉన్న బకాయిని చెల్లించి అదే ఇంటిని స్వా«దీనం చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ వేలం వేసి, బకాయి పోను మిగిలినది వారసులకు చెల్లిస్తుంది. ఇంటి కోసం రుణం తీసుకుని మనం ఎలా అయితే నిర్ణిత కాలం పాటు ఈఎంఐ చెల్లిస్తామో.. రివర్స్ మార్ట్గేజ్లో బ్యాంక్ అలా మనకు చెల్లిస్తుంది. ఏకమొత్తంలో చెల్లింపులకూ కొన్ని బ్యాంక్లు అవకాశం కల్పిస్తున్నాయి. రుణ భారం రిటైర్మెంట్ నాటికి ఎలాంటి రుణం మిగిలి ఉండకూడదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, గృహ రుణాలు ఏవైనా సరే గుడ్బై చెప్పేయాలి. లేదంటే రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన పొదుపు నిధిని రుణ చెల్లింపుల కోసం వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్

ఐటీఆర్ ఫైలింగ్ ఆలస్యమైతే.. ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు సమీపించింది. ట్యాక్స్ పేయర్స్ 2025 సెప్టెంబర్ 15 లోపల ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ గడువును ఇప్పటికే 2025 జులై 31 నుంచి పొడిగించారు. ఇప్పుడు మళ్లీ పొడిగిస్తారా?, లేదా? అనేదానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. గడువు తీరిన తరువాత కూడా ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.గడువు తీరని తరువాత.. డిసెంబర్ 31, 2025 వరకు రూ. 5000 వరకు ఆలస్య రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి జరిమానా గరిష్టంగా రూ. 1000 ఉంటుంది.ఇక్కడ ఫైన్ ఒక్కటే సమస్య కాదు. కొన్నిసార్లు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ప్రాసిక్యూషన్ కూడా ఉండవచ్చు. గత సంవత్సరం.. ఢిల్లీలోని ఒక మహిళ తన ఐటీఆర్ దాఖలు చేయనందుకు ఆమెకు జైలు శిక్ష విధించారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే.. గడువు లోపలే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం ఉత్తమం.ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం & ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు➤ఐటీఆర్ ఫైల్ ఆలస్యమైతే జరిమానాలు చెల్లించడం మాత్రమే కాకుండా.. 234ఏ, 234బీ, 234సీ సెకన్ల కింద పన్ను బకాయి రకాన్ని బట్టి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకుంటే.. ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు.➤ఐటీఆర్ ఫైలింగ్లో ఆలస్యం కారణంగా.. ప్రాసెసింగ్ ఆలస్యం కావొచ్చు. దీంతోపాటు రీఫండ్ కూడా ఆలస్యంగా వస్తుంది.➤ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల.. మీ రిటర్న్స్ను ఇన్కమ్ ట్యాక్ డిపార్ట్మెంట్ మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కూడా ఉంది.➤ఆలస్యంగా అయినా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్సయితే.. ఐటీ శాఖ నేరుగా నోటీసులు పంపించే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడకపోవడానికి కారణాన్ని గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు!
పెరుగుతున్న జీవన వ్యయాలు, మార్కెట్ అస్థిరతలు, ఆర్థిక అనిశ్చితి వల్ల పర్సనల్ ఫైనాన్స్ అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మీరు ఓ సంస్థలో ఉద్యోగిగా ఉన్నా, ఫ్రీలాన్సర్గా చేస్తున్నా, చిన్న వ్యాపారం సాగిస్తున్నా, గృహిణిగా ఉన్నా.. ఆర్థిక స్వాతంత్ర్యం ఎంతో ముఖ్యం. ఎలాంటి వారైనా దీర్ఘకాలంలో స్థిరంగా డబ్బు సంపాదించేలా కొన్ని మార్గాలను పరిశీలిద్దాం. అయితే కింది అంశాలను పరిశీలించిన తర్వాత క్రమశిక్షణతో వీటిని పాటించడం చాలాముఖ్యమని గమనించాలి.ఆదాయం.. ఖర్చుల ట్రాకింగ్..నెలకు కొందరు పెద్దమొత్తంలో సంపాదిస్తారు. ఇంకొందరు కాస్త తక్కువగానే ఆర్జిస్తారు. ఎంత ఆదాయం సమకూరుతున్నా ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. అందుకు బడ్జెట్ పాటించాలి. బ్యాంకు ఖాతాలో నుంచి వెళ్లే, అందులోకి వచ్చే ప్రతి రూపాయిని ట్రాక్ చేయాలి. అందుకు స్ప్రెడ్ షీట్లు, బడ్జెట్ యాప్లు వంటివి ఉన్నాయి. లేదా సాధారణ నోట్ బుక్లోనూ రికార్డు చేయవచ్చు. ఇందులో మీ ఖర్చులను స్పష్టమైన కేటగిరీలుగా విభజించాలి.నిత్యావసరాలు (అద్దె, కిరాణా సామాగ్రి, యుటిలిటీలు)డిసిక్రీషనరీ స్పెండింగ్ (షాపింగ్, డైనింగ్)పొదుపు, పెట్టుబడులుప్రతి కేటగిరీలో ఖర్చు పరిమితులను కేటాయించుకోవాలి.ఉదాహరణకు..కిరాణా సామాగ్రి: రూ.8,000ఎంటర్ టైన్మెంట్: రూ.3,000పొదుపు: రూ.5,000డిస్క్రీషనరీ స్పెండింగ్ను పరిమితం చేయడం వల్ల దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడానికి మరింత అవకాశం లభిస్తుంది.ఎమర్జెన్సీ ఫండ్జీవితం అనూహ్యమైనది. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఉద్యోగ నష్టం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి ఖర్చులు.. వంటి వాటితో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.ఎంత సరిపోతుంది?కనీసం 6 నెలల విలువైన నిత్యావసర ఖర్చులు.. ఇంటి అద్దె, ఆహారం, యుటిలిటీలు, ఈఎంఐలను చెల్లించేలా కార్పస్ను క్రియేట్ చేయాలి. ఈ నిధిని అధిక వడ్డీ పొదుపు ఖాతా, స్వల్పకాలిక స్థిర డిపాజిట్ లేదా మనీ మార్కెట్ ఫండ్ వంటి లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.ఇది ఎందుకు ముఖ్యం?దీర్ఘకాలం లక్ష్యంతో చేసే పొదుపుపై ప్రభావం పడకుండా ఆపద సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ రక్షిస్తుంది. ఆర్థికంగా భారం కాకుండా, అధిక వడ్డీ రుణాలు తీసుకోకుండా భరోసా కల్పిస్తుంది.ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి?సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (ఎస్ఐపీ) నెలవారీ చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి. అవి రెండు ముఖ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాంపౌండింగ్.. మీ రాబడులపై మరింత ఆదాయాన్ని పెంచుతాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. కొత్తగా పెట్టుబడి ప్రారంభించాలనుకుంటే వైవిధ్యభరితమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్లతో మొదలు పెట్టవచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే, ఈక్విటీ విలువ తగ్గుతుంటే బంగారం హెడ్జింగ్గా పని చేస్తుంది.అప్పుల నిర్వహణఅప్పు చేయడం తప్పు. తప్పని పరిస్థితుల్లో చేసిన అప్పును వెంటనే తీర్చేయాలి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు తరచుగా 30% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. తిరిగి చెల్లించే క్రమంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు బిల్లుల్లో "కనీస చెల్లింపు" ఉచ్చులో పడకూడదు. దీంతో తర్వాతి బిల్లు సైకిల్లో అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బకాయిలను పే చేయాలి.ఇదీ చదవండి: తొమ్మిది ఎన్బీఎఫ్సీల లైసెన్స్లు సరెండర్

ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువు పొడిగింపుపై డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ (కటక్), పీపీ చౌదరి (పాలీ) కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు రాసి గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీఆర్ దాఖలుకు గడువు సెప్టెంబర్ 15న ముగియనుంది.పొడిగింపు కోరడానికి కారణాలుఐటీఆర్-5, ఆడిట్ సంబంధిత ఫారాలతో సహా ఐటీఆర్ ఫారాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. జూలై, ఆగస్టు నెలల్లో ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి వచ్చాయి.ఐటీఆర్ పోర్టల్లో ధ్రువీకరణ లోపాలు, అప్లోడ్ నెమ్మదించడం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్లో అసమతుల్యత వంటి సాంకేతిక లోపాలు.ఒడిశాలో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయానికి అంతరాయం కలిగించాయి. దీంతో సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం కష్టతరం చేసింది.మరోవైపు పండుగ సీజన్ పరిమితులు.గణేష్ పూజ, దుర్గా పూజ, దసరా వంటి ప్రధాన సెలవుదినాలు సిబ్బంది లభ్యతను పరిమితం చేశాయి.ఐసీఏఐ కొత్త ఫార్మాట్ల కారణంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల తయారీకి అదనపు సమయం అవసరమవుతోంది.ఏకకాలంలో ఏకకాలంలో జీఎస్టీ ఫైలింగ్స్, ఐటీఆర్ ఫైలింగ్ పన్ను నిపుణుల పనిభారాన్ని పెంచుతోంది.ప్రతిపాదిత పొడిగింపులుఐటీఆర్ (నాన్-ఆడిట్) దాఖలుకు గడువు సెప్టెంబర్ 15 వరకు ఉండగా సెప్టెంబర్ 30 వరకు పొడింగించాలని కోరుతున్నారు. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ (TAR) గడువు సెప్టెంబర్ 30 ఉండగా అక్టోబర్ 31 వరకు, టీఏఆర్ తో ఐటీఆర్ ఫైలింగ్కు అక్టోబర్ 31 చివరి తేదీ కాగా నవంబర్ 30 పొడిగించాలని విజ్ఙప్తి చేస్తున్నారు. ఇక ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు గడువును కూడా డిసెంబర్ 31 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అభ్యర్థనలు వచ్చాయి.విస్తృత మద్దతు కర్ణాటక స్టేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ (KSCAA), అడ్వకేట్స్ టాక్స్ బార్ అసోసియేషన్ (ATBA), ఐసీఏఐకి సంబంధించిన సెంట్రల్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (CIRC) వంటి పన్ను నిపుణుల సంఘాలు కూడా గడువు పొడిగింపును కోరుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తున్న నేపథ్యంలో, లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు, నిపుణులు అధికారిక నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.