Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

stock market updates on 19 February 20261
నిలకడగా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 2 పాయింట్లు తగ్గి 25,819 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 41 దిగజారి 83,696 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.69బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 70.6 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.56 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.78 శాతం పుంజుకుంది.Today Nifty position 19-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Chirag Paswan emphasized India moved from food deficient nation to surplus nation2
ఆహారోత్పత్తిలో లోటు నుంచి మిగులుకు

భారత్‌ ఆహార లోటు నుంచి మిగులు స్థానానికి పురోగమించిందని.. ఆహార భద్రతా సవాళ్లను ఎదుర్కొనే దేశాలకు అవసరమైతే సాయం చేసే స్థితిలో ఉందని కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. అమిటీ వర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని ధీమాగా చెప్పారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందంటూ. వికసిత్‌ భారత్‌ సాకారాన్ని వారు ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు.ఈ శతాబ్దంలో మొదటి 25 ఏళ్లు ముగిశాయని, వచ్చే 25 ఏళ్లు ఎంతో కీలకమని.. యువత భుజాలపై ఎంతో బాధ్యత ఉందన్నారు. దేశ యువత త్వరలో కీలక నాయకత్వ స్థానాలను అధిరిహోస్తుందని, ఈ సందర్భంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనుందని చెప్పారు. సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని వదులుకోవడం, లేదంటే అవకాశాలుగా మలుచుకోవడం అనే రెండు ఎంపికలే ఉంటాయన్నారు. అంతర్జాతీయ సవాళ్లకు భారత్‌ సిద్ధమైందని, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడమే కాకుండా, టెక్నాలజీలో అంతర్జాతీయ దిగ్గజంగా అవతరిస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్‌ పవర్‌!

Piyush Goyal dismissed investor concerns about India IT sector3
ఐటీపై ఇన్వెస్టర్ల ఆందోళన అర్థరహితం

ఐటీ కంపెనీల భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్న ఆందోళన ‘అర్ధరహిత’మైనదిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథ మరింతగా విస్తరించడంలో పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. సైబర్‌ సెక్యూరిటీ, డేటా స్క్రబ్బింగ్‌లాంటివి ఇందుకు ఉదాహరణలని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు.ఆంథ్రోపిక్‌లాంటి కంపెనీలు వినూత్న ఏఐ ప్లాట్‌ఫాంలను ప్రవేశపెడుతుండటంతో ఐటీ కంపెనీల షేర్లు గత కొద్ది రోజులుగా క్షీణించిన నేపథ్యంలో గోయల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొన్నాళ్లుగా వివిధ దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌లాంటి కూటములతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు, అమెరికాను కూడా కలిపితే తొమ్మిది డీల్స్‌ అవుతాయని గోయల్‌ చెప్పారు.అమెరికాతో ఒప్పందంలో రైతులు, చిన్న సంస్థల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు ఉన్నాయన్నారు.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్‌ పవర్‌!

Nirmala Sitharaman meeting Norwegian CEOs investors4
భారత్‌ పెట్టుబడులకు విశ్వసనీయ గమ్యస్థానం

వాణిజ్యం, పారిశ్రామిక సహకారం, దీర్ఘకాల పెట్టుబడులకు భారత్‌ స్థిరమైన, నమ్మకమైన వాతావరణం కలి్పస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ), ఐరోపా, యూకే, యూఎస్‌తో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను ప్రస్తావించారు. నార్వే పర్యటనలో భాగంగా మంత్రి సీతారామన్‌ ప్రముఖ కంపెనీల సీఈవోలు, ఇన్వెస్టర్లతో ఓస్లోలో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు, వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థపై ఈ సందర్భంగా సానుకూల చర్చలు జరిగినట్టు మంత్రి చెప్పారు.పౌరులు, కంపెనీలకు నిబంధనల అమలు భారాన్ని తగ్గించే దిశగా 2026–27 బడ్జెట్‌లో సంస్కరణలపై దృష్టి పెట్టినట్టు గుర్తు చేశారు. విధానాల్లో స్పష్టత, స్థూల ఆర్థిక వాతావరణం, ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను ఈ సందర్భంగా అక్కడి సీఈవోలు, ఇన్వెస్టర్లు అభినందించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్‌ప్లాట్‌ఫామ్‌పై చేసిన పోస్ట్‌లో పేర్కొంది. భారత్‌లో సంస్కరణలు, వృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇన్వెస్టర్లకు నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) సీఈవో తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సీతారామన్‌ నార్వే ప్రధాని జోనాస్‌ గార్‌స్టోర్‌తోనూ భేటీ అయ్యారు. భారత ప్రధాని మోదీ నార్వే పర్యటన (ఈ ఏడాది చివర్లో) కోసం వేచి చూస్తున్నామని.. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య సహకారం మరింత విస్తృతమవుతుందన్న ఆశాభావాన్ని జోనాస్‌ వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్‌ పవర్‌!

Piyush Goyal emphasized intent to diversify coal imports5
అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు

అమెరికా నుంచి నాణ్యమైన కోకింగ్‌ కోల్‌ దిగుమతి పట్ల ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. చమురు, బొగ్గు కొనుగోలును భారత్‌ మరిన్ని దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్నట్టు చెప్పారు. వీటి కోసం రెండు మూడు భౌగోళిక ప్రాంతాలపైనే ఆధారపడి ఉన్నట్టు, దీని కారణంగా ధరల్లో అస్థిరతలు ఉంటున్నట్టు పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధికి అవసరమైన వస్తువులు కొన్నింటిని అమెరికా అందించగలదన్నారు.ఏఐ అప్లికేషన్లకు గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు (జీపీయూలు), డేటా సెంటర్ల ఎక్విప్‌మెంట్, అత్యధిక పనితీరుతో కూడిన కంప్యూటింగ్‌ అవసరాన్ని ప్రస్తావించారు. అమెరికా పోటీ పడలేని ఉత్పత్తులను భారత్‌ తయారు చేయగలదని, పెట్టుబడులు, టెక్నాలజీ వనరుల పరంగా అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గోయల్‌ మాట్లాడారు.వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 100 బిలియన్‌ డాలర్ల విమానాలకు ఇప్పటికే డిమాండ్‌ ఉందని.. స్థానిక సామర్థ్యాలను మరింత పెంచాల్సి ఉందని చెప్పారు. ఇటీవలే భారత్‌–అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక ఒప్పందానికి అంగీకారం కుదరడం తెలిసిందే. దీని కింద వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్‌ డాలర్ల వస్తువులను భారత్‌ కొనుగోలు చేయనుంది. వచ్చే వారంలో భారత బృందం అమెరికా పర్యటనకు వెళ్లనుంది. ఒప్పందానికి సంబంధించి తుది పత్రాలను ఖరారు చేయనుంది. దీనిపై మార్చిలో ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. అమెరికాతో ఒప్పందం వల్ల భారత సంస్థలకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నట్టు మంత్రి గోయల్‌ చెప్పారు. ముఖ్యంగా కారి్మక ఆధారిత రంగాలు, టెక్నాలజీ సేవలకు డిమాండ్‌ ఉంటుందన్నారు.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్‌ పవర్‌!

Nissan Gravite 7-Seater MPV Launched6
నిస్సాన్‌ ఎంపీవీ గ్రావైట్‌

ఉదయ్‌పూర్‌: జపాన్‌ ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌ తమ సెవెన్‌ సీటర్‌ ఎంపీవీ గ్రావైట్‌ని మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.49 లక్షల వరకు (ఎక్స్‌–షోరూం) ఉంటుంది. ప్రస్తుతం మ్యాగ్నైట్‌ పేరిట భారత్‌లో ఒకే ఉత్పత్తిని విక్రయిస్తున్న నిస్సాన్‌కి ఇది రెండో మోడల్‌. ఈ ఏడాది టెక్టాన్‌ ఎస్‌యూవీతో పాటు విశాలమైన సెవెన్‌ సీటర్‌ సీ సెగ్మెంట్‌ ఎస్‌యూవీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ సౌరభ్‌ వత్స తెలిపారు. మొత్తం మీద ఏడాది వ్యవధిలో మూడు వాహనాలను తీసుకొచి్చనట్లవుతుందని వివరించారు. రూ. 6 లక్షల నుంచి దాదాపు రూ. 20 లక్షల వరకు ధర శ్రేణిలో వాహనాలతో పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసుకుంటామన్నారు. ప్రస్తుతం 160 డీలర్‌íÙప్‌లు ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటి సంఖ్యను 250కి పెంచుకోనున్నట్లు వత్స వివరించారు. అలాగే, ఎగుమతులపైనా దృష్టి పెడుతున్నామని, 2026–27 ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష యూనిట్ల ఎక్స్‌పోర్ట్స్‌ మార్కును అధిగమిస్తామని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement