ప్రధాన వార్తలు
డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్కు, అమెరికా న్యాయస్థానాలకు మధ్య జరుగుతున్న ‘గుత్తాధిపత్య’ పోరు కొత్త మలుపు తిరిగింది. తమ సెర్చ్ డేటాను చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వంటి ప్రత్యర్థి సంస్థలతో పంచుకోవాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ గూగుల్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. అప్పీలుపై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ డేటా బదిలీని వాయిదా వేయాలని కంపెనీ కోరింది.తీర్పు నేపథ్యం ఏమిటి?ఆన్లైన్ సెర్చ్ మార్కెట్లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని 2024లో వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి అమిత్ మెహతా చారిత్రాత్మక తీర్పునిచ్చారు. యాపిల్, శామ్సంగ్ వంటి కంపెనీలకు ఏటా 20 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించి, గూగుల్ను ‘డిఫాల్ట్’ సెర్చ్ ఇంజిన్గా ఉంచడం ద్వారా పోటీని అణచివేసిందని కోర్టు నిర్ధారించింది. ఈ ఆధిపత్యాన్ని తగ్గించే క్రమంలో గూగుల్ తన సెర్చ్ డేటాను ప్రత్యర్థులకు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.గూగుల్ వాదన ఏంటి?అప్పీలు పెండింగ్లో ఉండగానే డేటాను పంచుకుంటే కంపెనీకి చెందిన కీలక వాణిజ్య రహస్యాలు ప్రత్యర్థుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రజలు గూగుల్ను బలవంతంగా కాకుండా, మంచి సేవలు అందిస్తుంది కాబట్టే వాడుతున్నారు’ అని గూగుల్ రెగ్యులేటరీ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ లీ-అన్నే ముల్హోలాండ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మార్కెట్లో గట్టి పోటీ ఉందని, కోర్టు నిర్ణయం ఆవిష్కరణల స్థాయిని తక్కువ అంచనా వేసిందని కంపెనీ వాదిస్తోంది.షరతులకు అంగీకారం.. కానీ!గోప్యత, భద్రతా రక్షణలకు సంబంధించిన నిబంధనలను పాటించడానికి సిద్ధమని గూగుల్ తెలిపింది. అయితే డేటా షేరింగ్, సిండికేటెడ్ ఫలితాలు, ప్రకటనల పంపిణీ విషయంలో మాత్రమే స్టే కోరుతోంది.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు
సైలెంట్గా సర్దుకుంటున్న టెక్ బిలియనీర్లు!
దశాబ్దాలుగా గూగుల్ వంటి దిగ్గజ సంస్థలకు కీలకంగా ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఆ సంస్థల సృష్టకర్తలే తమ వ్యాపార సామ్రాజ్యాలను తరలిస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. గూగుల్ స్థాపకులు ల్యారీ పేజ్, సెర్జి బ్రిన్ తమ వ్యక్తిగత పెట్టుబడులు, వ్యాపారాలను కాలిఫోర్నియా నుంచి ఇతర ప్రాంత్రాలకు మారుస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని వెలువరించింది. వీరితో సంబంధం ఉన్న పలు సంస్థలు మూతపడగా, అవి ఇప్పుడు నెవాడా, ఫ్లోరిడా, టెక్సాస్ వంటి తక్కువ పన్నులు ఉన్న రాష్ట్రాల్లో తిరిగి రిజిస్టర్ అవుతున్నాయి.పన్నుల భయం.. బిలియనీర్ల పయనంఈ నిష్క్రమణకు ప్రధాన కారణం కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘వెల్త్ ట్యాక్స్’ (సంపద పన్ను). బిలియన్ డాలర్లకు మించి సంపద ఉన్న నివాసితులపై ఒకేసారి భారీ పన్ను విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు, ఈ పన్ను గత కాలానికి కూడా వర్తించేలా (Retroactive) ఉండవచ్చనే చర్చలు సాగుతుండటం టెక్ కుబేరులను అప్రమత్తం చేసింది.ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాలిఫోర్నియా తీసుకోబోతున్న నిర్ణయంవల్ల భారీగా పెట్టుబడులు తరలిపోతాయని, ఇది ఆవిష్కరణలను దెబ్బతీస్తుందని వెంచర్ క్యాపిటలిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే, కుప్పకూలుతున్న ప్రజా వ్యవస్థలను ఆదుకోవడానికి అత్యధిక సంపద కలిగిన వారు బాధ్యత తీసుకోవాలని సామాజిక వాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వంటి వారు ప్రభుత్వం విధించే పన్నులను స్వీకరిస్తామని చెబుతుండగా, మరికొందరు మాత్రం సైలెంట్గా సర్దుకుంటున్నారు.మారిన కాలం.. మారుతున్న బంధంఒకప్పుడు కంపెనీలు అంటే ఫ్యాక్టరీలు, పోర్టులు, కార్మికులతో ముడిపడి ఉండేవి. కానీ నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సంపదకు సరిహద్దులు లేవు. కేవలం కాగితాలపై సంతకాలతో ప్రపంచంలో ఎక్కడికైనా మేధోసంపత్తిని సులువుగా తరలించవచ్చు. ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలతో ముందుకుసాగుతుంటే టెక్ బిలియనీర్లు మాత్రం అందుకు అనుగుణంగా తమ స్థావరాలను మార్చుకుంటున్న తీరు కొంత ఆందోళన కలిగిస్తుంది.బాధ్యత ఎవరిది?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ ద్వారా సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్న తరుణంలో ఈ సంక్షోభం ఒక్క కాలిఫోర్నియాకే పరిమితం కాదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వీరు వలస వెళ్లిన చోటల్లా ఇలాగే కొత్త పన్ను విధానాలు తీసుకొస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స్థిరమైన ప్రాంతంలో ప్రజా వనరుల ద్వారా ఎదిగి, ఇప్పుడు ఆ వ్యవస్థతో బంధం తెంచుకుంటున్న ఈ డిజిటల్ వలసలు అనేక ప్రశ్నలను మిగుల్చుతున్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు
బ్యాంకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర ఆర్థిక సంస్థల సేవలపై అసంతృప్తిగా ఉన్న వినియోగదారులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. జులై 2026 నుంచి అమలులోకి రానున్న నూతన అంబుడ్స్మన్ పథకం ద్వారా బాధితులకు భారీ స్థాయిలో పరిహారం పొందే అవకాశం కల్పించింది.పరిమితి లేని వివాద పరిష్కారంకొత్తగా తీసుకువచ్చిన ‘రిజర్వ్ బ్యాంక్–ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ (RB-IOS) 2026’ ప్రకారం.. వినియోగదారుల ఫిర్యాదులో ఉన్న వివాదాస్పద మొత్తంపై ఇకపై ఎటువంటి గరిష్ట పరిమితి ఉండదు. అంటే, వివాదంలో ఉన్న మొత్తం ఎంత పెద్దదైనా అంబుడ్స్మన్ దాన్ని విచారించవచ్చు. అయితే, ఫిర్యాదు వల్ల కలిగిన నష్టాలకు (Consequential Loss) సంబంధించి అంబుడ్స్మన్ గరిష్టంగా రూ.30 లక్షల వరకు పరిహారం మంజూరు చేసే అధికారం కలిగి ఉంటుంది. 2021 పథకం ప్రకారం ఇది రూ.20 లక్షలుగా ఉంది.మానసిక వేదనకు అదనపు పరిహారంకేవలం ఆర్థిక నష్టమే కాకుండా, ఫిర్యాదుదారుడు అనుభవించిన మానసిక వేదన, సమయం వృథా, ఖర్చులకుగానూ ప్రత్యేకంగా గరిష్టంగా రూ.3 లక్షల వరకు పరిహారం చెల్లించాలని అంబుడ్స్మన్ ఆదేశించవచ్చు. గతంలో ఇది రూ.1 లక్షగా ఉంది. కొత్త నిర్ణయం వినియోగదారుల పట్ల ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.కీలక మార్పులుఈ సవరించిన పథకం జులై 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, నాన్-బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడర్లు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఆర్బీఐ తన అధికారులను మూడు సంవత్సరాల కాలపరిమితితో అంబుడ్స్మన్ లేదా డిప్యూటీ అంబుడ్స్మన్గా నియమిస్తుంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ (CRPC) ఏర్పాటు చేస్తారు.ఫిర్యాదు చేయడం ఎలా?వినియోగదారులు తమ ఫిర్యాదులను డిజిటల్ లేదా ఫిజికల్ రూపంలో నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా https://www.rbi.org.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసేవారు ఈమెయిల్ ద్వారా లేదా పోస్ట్/నేరుగా సంబంధిత సెంట్రలైజ్డ్ సెంటర్కు పంపవచ్చు. ఈ కొత్త నిబంధనలు ఆర్థిక రంగంలో పారదర్శకతను పెంచుతాయని, సామాన్య వినియోగదారులకు బ్యాంకింగ్ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని కలిగిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు
మారుతున్న ఇష్టాలు.. వసతులకే ప్రాధాన్యం!
ఇంటి కొనుగోలుదారుల ఇష్టాలు మారుతున్నాయి. మొన్నటి వరకు ధరకు ప్రాధాన్యం ఇచ్చిన గృహ కొనుగోలుదారులు ఇప్పుడు వసతులను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇల్లు కొనేటప్పుడు ఆ ప్రాజెక్ట్ వరకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యా, వైద్యం వసతులు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు. అత్యవసరంలో ఎంత సమయంలో ఆస్పత్రికి వెళ్లవచ్చు? ఎంత దగ్గరలో ఆరోగ్య సేవలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. పెరిగిన ఆరోగ్య జాగ్రత్తలలో భాగంగా ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇల్లు విశాలంగా ఉండటమే కాదు, కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి కస్టమర్ల డిమాండ్. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. నివాస ప్రాజెక్ట్లలో ఎక్కువ స్థలం ఖాళీ వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే అలాంటి కమ్యూనిటీలలో ఇంటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనా పాలనా చూసే డే కేర్ సెంటర్లు ఉండాలని కస్టమర్లు భావిస్తున్నారు. భార్యభర్తలిద్దరూ ఆఫీసుకు వెళ్తే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతోంది.వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఇంటి నుంచే పనిచేస్తున్నా.. పిల్లలను చూసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. అందుకే కమ్యూనిటీలలో డే కేర్ సదుపాయాలను ఉండాలని కోరుకుంటున్నారు. వీకెండ్ వసతులు అవసరమే.. ఇంటి నుంచి ఆఫీసు ఎంత దూరంలో ఉందనేది గృహ కొనుగోలుదారులు ప్రధానంగా చూస్తున్నారు. సిటీ ట్రాఫిక్లోనే అధిక సమయం వృథా అవుతోంది కాబట్టి.. దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి.అదే సమయంలో ప్రజారవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటున్నారు. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్లు, రిక్రియేషన్ క్లబ్స్ వంటివి ఎంత దూరంలో ఉన్నాయనేవి సైతం ఇంటి కొనుగోలుదారులు చూస్తున్నారు.
వారం రోజుల్లో ఇంత పెరిగిందా.. బంగారం ధరల్లో భారీ మార్పు!
బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ దాదాపు రూ. 1,50,000 మార్క్ చేరుకోవడానికే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. జనవరి 11వ తేదీ 1,40,460 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు.. నేటికి 1,43,780 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధరల్లో ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,40,460 నుంచి రూ. 1,43,780లకు చేరుకుంది. వారం రోజుల్లో పసిడి ధరలు 3320 రూపాయలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,28,750 రూపాయల నుంచి 1,31,800 రూపాయల వద్దకు చేరింది. అంటే 3050 రూపాయలు పెరిగిందన్నమాట.చెన్నైలో జనవరి 11న 1,39,650 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 17వ తేదీ నాటికి 1,44,870 రూపాయల (రూ.5220 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు రూ. 1,29,000 నుంచి రూ. 1,32,800 (రూ. 3800 పెరిగింది) వద్దకు చేరింది.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 1,40,610 రూపాయల నుంచి వారం రోజుల్లో 1,43,930 రూపాయల (రూ. 3320 పెరిగింది) మార్క్ చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,900 వద్ద నుంచి రూ. 1,31,950 వద్దకు (3050 రూపాయలు పెరిగింది) చేరింది.
భారత్ నుంచి 100 దేశాలకు.. ఈ కారు గురించి తెలుసా?
మారుతి సుజుకి కంపెనీ.. భారతదేశంలో తయారు చేసిన తన విక్టోరిస్ కారు ఎగుమతులను ప్రారంభించింది. 450 వాహనాల మొదటి బ్యాచ్ ఇటీవల ముంద్రా & పిపావావ్ ఓడరేవుల నుంచి రవాణా తరలించింది. అయితే సంస్థ ఈ కారును 'అక్రాస్' పేరుతో గ్లోబల్ మార్కెట్లో విక్రయించనుంది.మారుతి సుజుకి విక్టోరిస్ కారును లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా.. కంపెనీ ఎండీ & సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, ''మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్'' అనే దార్శనికత ద్వారా ఎగుమతి చేస్తున్నాము. 2025లో దేశం నుంచి 3.9 లక్షల వాహనాలను ఎగుమతి చేసి.. వరుసగా ఐదవ సంవత్సరం భారతదేశపు నంబర్ వన్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా అవతరించామని అన్నారు. ఈ ఏడాది ఈ-విటారా ద్వారా ఎగుమతులను ప్రారంభించామని పేర్కొన్నారు.విక్టోరిస్ కారు గురించిమారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి!మైల్డ్-హైబ్రిడ్ టెక్తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.
కార్పొరేట్
సైలెంట్గా సర్దుకుంటున్న టెక్ బిలియనీర్లు!
అంబానీ నెల కరెంట్ బిల్లు.. లగ్జరీ కారే కొనేయొచ్చు!
ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!
‘ఇష్టానుసారంగా పసిడి ధరలు పెంపు’
టెక్ మహీంద్రా లాభం అప్
విప్రోకు కార్మిక చట్టాల సెగ
ఇండిగో బాధితులకు రిఫండ్ పూర్తి
పన్ను మినహాయింపు పిటిషన్ తిరస్కరణ
గంటలోనే రిప్లై ఇస్తారని ఊహించలేదు!
10 ని.డెలివరీకి స్వస్తి.. బిజినెస్పై ప్రభావమెంత?
స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లా...
పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో కద...
భారత వలసదారులపై కోపమెందుకు?
అమెరికా అభివృద్ధిలో భాగస్వాములైన భారతీయ వలసదారులు ...
నిధులు మూరెడు.. పనులు జానెడు!
భారతదేశ గ్రామీణ అభివృద్ధి పథంలో అసలైన సవాలు నిధుల ...
రూ.3,900 కోట్ల మద్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మద్యం సరఫరా చేసే కం...
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్.. నిధుల వినియోగంలో వైఫల్యం
దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
మోటరోలా సిగ్నేచర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త ప్రీమియం హ్యాండ్సెట్ మోటరోలా సిగ్నేచర్ను భారతదేశంలో జనవరి 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి రానుంది. ఇటీవల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2026లో ఈ ఫోన్ను కంపెనీ ఆవిష్కరించింది.ఫ్లిప్కార్ట్లో ఇప్పటికే మోటరోలా సిగ్నేచర్కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ను అప్డేట్ చేశారు. దీని ద్వారా ఫోన్కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లను కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ అత్యాధునిక స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్తో పనిచేస్తుంది.ప్రధాన ఫీచర్లుడిస్ప్లే విషయానికి వస్తే, మోటరోలా సిగ్నేచర్లో 6.8 అంగుళాల సూపర్ HD LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 1,264 x 2,780 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 450 ppi పిక్సెల్ డెన్సిటీతో పాటు గరిష్టంగా 6,200 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, “సౌండ్ బై బోస్” ఆడియో సపోర్ట్ ఈ ఫోన్ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.కెమెరా విభాగంలో, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ LYT-828 సెన్సార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిజైన్ పరంగా, ఇది అల్యూమినియం ఫ్రేమ్తో 6.99 మిమీ మందంతో ఉండగా, బరువు సుమారు 186 గ్రాములు మాత్రమే.పవర్ కోసం ఇందులో 5,200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. సాఫ్ట్వేర్ పరంగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై నడుస్తుంది.ధర ఇదేనా?ధర విషయానికొస్తే, 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వేరియంట్ బాక్స్ ధర రూ.84,999గా లీక్ అయింది. అయితే ఇది బాక్స్ ధర మాత్రమే కావడంతో, వాస్తవ రిటైల్ ధర కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.82,000గా ఉండొచ్చని సమాచారం. అధికారిక ధరలను మోటరోలా లాంచ్ రోజున వెల్లడించనుంది.మోటరోలా సిగ్నేచర్ పాంటోన్ మార్టిని, ఆలివ్, కార్బన్ వంటి ప్రీమియం కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఫ్లాగ్షిప్ ఫీచర్లతో ఈ ఫోన్ హైఎండ్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇవ్వనుంది.
సబ్మెరిన్ కేబుల్స్కు కొత్త విధానం అవసరం
ఆధునిక డిజిటల్ ప్రపంచానికి కీలకంగా ఉన్న సబ్మెరిన్ కేబుల్ నెట్వర్క్ల భద్రత ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ప్రపంచవ్యాప్త సమాచార ప్రవాహంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ కేబుల్ వ్యవస్థల సామర్థ్యం ప్రస్తుతం 6,400 టీబీపీఎస్కు చేరుకుంది. అయితే, ఈ నెట్వర్క్లు కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడం భవిష్యత్తులో ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డైవర్సిటీ బై డిజైన్’(Diversity by Design) విధానం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమే మార్గమని స్పష్టమవుతోంది.భారత డిజిటల్ మౌలిక వసతులుభారతదేశాన్ని అంతర్జాతీయ ఇంటర్నెట్ ప్రపంచంతో అనుసంధానించడంలో 18 సబ్మెరిన్ కేబుల్ వ్యవస్థల్లో ఇప్పటికే కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటికి తోడు మరో నాలుగు కొత్త వ్యవస్థలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ముంబై, చెన్నై, కొచ్చిన్ పట్టణాలు ‘కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు’గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తదుపరి ప్రధాన డిజిటల్ హబ్గా అవతరిస్తోంది. గూగుల్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ గేట్వే కేబుల్స్ కోసం విశాఖను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో అండమాన్-నికోబార్, లక్షద్వీప్ దీవులను ప్రధాన భూభాగంతో కలిపే లోకల్ లూప్ నెట్వర్క్లు సిద్ధమవుతున్నాయి. ఇవి భవిష్యత్తులో అంతర్జాతీయ కనెక్టివిటీకి కేంద్రాలుగా మారనున్నాయి.ఏమిటీ ‘డైవర్సిటీ బై డిజైన్’?ప్రస్తుతం చాలా కేబుల్స్ కొన్ని సముద్ర గర్భంలో నిర్దిష్ట ప్రాంతాల (ఉదాహరణకు సింగపూర్) గుండానే వెళ్తున్నాయి. దీనివల్ల ప్రకృతి విపత్తులు సంభవించినా లేదా ఉద్దేశపూర్వక విధ్వంసం జరిగినా మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనినే ‘చోక్ పాయింట్’ సమస్య అంటారు. దీన్ని నివారించేందుకు ‘డైవర్సిటీ బై డిజైన్’ సూత్రాన్ని నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. దీని ప్రకారం.. కేబుల్స్ అన్నీ ఒకే మార్గంలో కాకుండా వేర్వేరు సముద్ర మార్గాల ద్వారా పంపిణీ చేయాలి. విశాఖపట్నంలో ప్రతిపాదించిన విధంగా ‘ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల’(సీఎల్ఎస్)ను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం లేకుండా ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా సమాన ప్రాతిపదికన తమ కేబుల్స్ను ల్యాండ్ చేసుకోవచ్చు.సింగపూర్కు ప్రత్యామ్నాయంగా భారత్?ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటివరకు 13 సీఎల్ఎస్లతో సింగపూర్ తిరుగులేని హబ్గా ఉంది. అయితే, మితిమీరిన కేంద్రీకరణ కారణంగా భద్రతా పరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి. అందుకే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి డేటా సెంటర్లను నిర్మిస్తూ, సింగపూర్ను దాటుకొని వెళ్లే కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.రాబోయే కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అదనంగా ఐదు లక్షల కిలోమీటర్ల సబ్సీ కేబుల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాలు సమన్వయంతో పనిచేస్తూ కేబుల్ వ్యవస్థల్లో వైవిధ్యాన్ని పెంచడం ద్వారానే ఆర్థిక వ్యవస్థలు, రక్షణ రంగ సమాచార భద్రతను కాపాడుకోగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..
రూ .35 లక్షల జీతం.. వైరల్ అయిన ఉద్యోగ ప్రకటన
బెంగళూరులో కేవలం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థికి ఆఫర్ చేస్తున్న భారీ వేతన ప్యాకేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. SDE-1 (సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్) పోస్టుకు ఈ ఉద్యోగానికి వార్షికంగా రూ.25 లక్షల జీతం, నాలుగు సంవత్సరాల్లో రూ.20 లక్షల విలువైన ఈఎస్ఓపీలు లేదా స్టాక్ బోనస్, అలాగే రోజుకు రూ.600 జొమాటో క్రెడిట్స్ అందిస్తామని పేర్కొన్నారు.ఇదే కాకుండా 10 శాతం పనితీరు బోనస్, రూ.5 లక్షల వరకు రీలొకేషన్, సైనింగ్ ఇన్సెంటివ్లతో మొదటి సంవత్సరంలో మొత్తం వేతనం సుమారు రూ.35 లక్షలకు చేరుతుందని సమాచారం. ఉచిత జిమ్ సభ్యత్వం, ఫోన్, వైఫై బిల్లుల రీయింబర్స్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కోసం రూ.21,000 భత్యం, ప్రతి మూడు సంవత్సరాలకు ఫోన్ అప్గ్రేడ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.ఈ జాబ్ లిస్టింగ్ను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ వినియోగదారు షేర్ చేయగా, వెంటనే వైరల్ అయింది. ఒక వైపు టెక్ రంగంలో తొలగింపులు జరుగుతుండగా, మరో వైపు జూనియర్ స్థాయి ఉద్యోగాలకు ఇంత భారీ ప్యాకేజీలు ఇవ్వడంపై నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందించారు. ఈ ఘటన టెక్ పరిశ్రమలో మారుతున్న నియామక ధోరణులు, వేతన వ్యత్యాసాలపై మరోసారి చర్చకు దారి తీసింది.At one side layoffs are happening and other side companies are offering such high salaries for 1 year experienceAnd the fun part is that same company would be paying lesser to 5-8yrs experience employee already working with them.Salary structure is completely broken in tech. pic.twitter.com/5k5Rivwb3H— EngiNerd. (@mainbhiengineer) January 14, 2026
ఇరాన్ సమీపంలో అమెరికా అత్యాధునిక డ్రోన్ల నిఘా
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎంక్యూ-4సీ ట్రైటాన్జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.సాధారణంగా సైనిక కార్యకలాపాల్లో ‘కాల్ సైన్’ (Call Sign) గోప్యంగా ఉంచుతారు(గాలిలో వందలాది విమానాలు ఎగురుతున్నప్పుడు ట్రాఫిక్ కంట్రోలర్లు లేదా ఇతర సైనిక విమానాలు ఏ విమానంతో కాంటాక్ట్ అవుతున్నాయో స్పష్టంగా తెలియడానికి ఈ కాల్ సైన్లను ఉపయోగిస్తారు). కానీ, ఈసారి ట్రైటాన్ డ్రోన్లు తమ గోప్యతను దాచకుండా బహిరంగంగానే సంచరించడం గమనార్హం. ఇది ఇరాన్కు అమెరికా పంపిస్తున్న పరోక్ష హెచ్చరిక అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇరాన్లో కల్లోలం - ట్రంప్ హెచ్చరికప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం స్వదేశీ నిరసనకారులపై అనుసరిస్తున్న కఠిన వైఖరి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం, నిరసనల అణిచివేతలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. నిరసనకారులకు మద్దతుగా సహాయం అందిస్తామని ట్రంప్ ఇచ్చిన సందేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హింస కొనసాగితే ఇరాన్పై నేరుగా సైనిక చర్యకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి.తిరిగి వస్తున్న యుద్ధనౌకలుగత ఏడాది హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి ‘యూఎస్ఎస్ హ్యారీ ఎస్.ట్రూమాన్’, ఇతర విధ్వంసక నౌకలను గల్ఫ్లో మోహరించారు. అయితే, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీటిని కరేబియన్ ప్రాంతానికి తరలించారు. కానీ, ఇప్పుడు మళ్లీ గల్ఫ్ వైపు మళ్లిస్తున్నారు. యూఎస్ నేవీ అధికారిక సమాచారం ప్రకారం.. గైడెడ్-క్షిపణి యూఎస్ఎస్ రూజ్వెల్ట్ (DDG 80) ఇప్పటికే అరేబియా గల్ఫ్కు చేరుకుంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలో ఈ నౌక తన పెట్రోలింగ్ను ప్రారంభించింది. ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతాలకు సమీపంలో అమెరికా డ్రోన్లు, యుద్ధనౌకలు మోహరించడం చూస్తుంటే గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్ కీలక ఆవిష్కరణ
పర్సనల్ ఫైనాన్స్
ప్రతి ఇంట్లో లక్షాధికారి! ఈ ఎస్బీఐ స్కీమ్ గురించి తెలుసా?
ప్రతి కుటుంబం తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని కోరుకుంటుంది. కానీ పెరుగుతున్న ఖర్చుల వల్ల భవిష్యత్ కోసం పొదుపు, పెట్టుబడులను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టాలంటే అధిక జీతం లేదా ఒకేసారి భారీ పెట్టుబడి అవసరమనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఈ భావనకు భిన్నంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకువచ్చిన ‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం నిలుస్తోంది. నెలకు కేవలం రూ.610 పెట్టుబడితోనే రూ.1 లక్ష కార్పస్ ఎలా నిర్మించవచ్చో ఇప్పుడు చూద్దాం.ఏమిటీ ‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం?ఇది ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. ఇందులో ఖాతాదారులు ఎంచుకున్న కాలపరిమితి పాటు ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. గడువు పూర్తయ్యాక ఒకేసారి మొత్తం (అసలు + వడ్డీ) లభిస్తుంది. క్రమమైన పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్థిక ఒత్తిడి లేకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.ఈ ఆర్డీ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 3 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పొదుపుదారులు తమ ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవచ్చు.రూ.610తో రూ.1 లక్ష ఎలా?ఈ పథకంలోని 10 ఏళ్ల ప్లాన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నెలకు రూ.610 చొప్పున పొదుపు చేస్తే, 10 సంవత్సరాల అనంతరం వడ్డీతో కలిపి సుమారు రూ.1 లక్ష కార్పస్ లభిస్తుంది. అంటే రోజుకు దాదాపు రూ.20 పొదుపు చేస్తే చాలు.. ఆరు అంకెల మొత్తాన్ని సాధించవచ్చు. ఈ కారణంగానే వేతనజీవులు, ఉద్యోగులు, కొత్తగా పొదుపు చేసేవాళ్లు, తక్కువ ఆదాయం కలిగినవారికి ఈ పథకం ఎంతో అనుకూలంగా మారింది.వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే.. ‘హర్ ఘర్ లఖ్పతి’ ఆర్డీ పథకంపై వడ్డీ రేట్లు పెట్టుబడి కాలపరిమితి, పొదుపుదారు కేటగిరీపై ఆధారపడి ఉంటాయి. సాధారణ పౌరులకైతే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 6.55 శాతం, 5–10 సంవత్సరాల కాలానికైతే 6.30% వడ్డీ లభిస్తుంది.అదే సీనియర్ సిటిజన్లు అయితే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 7.05 శాతం, 5–10 సంవత్సరాల కాలానికి 6.80% వడ్డీ అందుకుంటారు. ఈ వడ్డీ రేట్లు ఎస్బీఐ నిర్ణయాల ప్రకారం కాలానుగుణంగా మారవచ్చు అన్నది గమనించాలి.తక్కువ కాలంలో లక్ష్యం చేరాలంటే?త్వరగా రూ.1 లక్ష కార్పస్ కావాలనుకునే వారు ఎక్కువ నెలవారీ చందాతో తక్కువ కాలాన్ని ఎంచుకోవచ్చు. 3 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.2,510, 5 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.1,420 పొదుపు చేయాల్సి ఉంటుంది.రూ.1 లక్ష కన్నా ఎక్కువ కావాలంటే..ఈ పథకం కేవలం రూ.1 లక్ష వరకే కాదు. పొదుపుదారులు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు వంటి అధిక లక్ష్యాలను కూడా ఎంచుకోవచ్చు. లక్ష్యం మొత్తాన్ని బట్టి నెలవారీ చందా ఆధారపడి ఉంటుంది. పిల్లల చదువు, వివాహ ఖర్చులు, అత్యవసర నిధి వంటి మధ్యకాలిక అవసరాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఎవరు అర్హులు?భారతీయ పౌరుడెవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తెరవవచ్చు. తల్లిదండ్రులు పిల్లల పేరుపై కూడా ఆర్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు పైబడిన పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో ఖాతా కలిగి ఉండవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ఇందులో పొదుపు చేయొచ్చు.
పండుగ షాపింగ్.. భారీ డిస్కౌంట్లు కావాలా?
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇటు వీధులన్నీ రంగురంగుల వెలుగులతో, అటు ఆన్లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లతో కళకళలాడుతుంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్.. వంటి ఈ-కామర్స్ సైట్లు ప్రత్యేక ఈవెంట్లతో ఆఫర్లు ప్రకటిస్తాయి. దాంతో వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తాయి. అయితే, ఈ ఆఫర్ల వెల్లువలో పడి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా, తెలివిగా ఎలా షాపింగ్ చేయాలో వివరించే చిట్కాలు చూద్దాం.ముందస్తు ప్రణాళికసేల్ ప్రారంభం కావడానికి ముందే మీకు కావాల్సిన వస్తువులను ‘విష్లిస్ట్’లో చేర్చుకోవడం ఉత్తమం. దీనివల్ల ధర తగ్గినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, ఎంత వరకు ఖర్చు చేయాలనే దానిపై ఒక బడ్జెట్ వేసుకోవడం వల్ల అనవసరమైన కొనుగోళ్లను నివారించవచ్చు.ధరల పరిశీలనఒక సైట్లో తక్కువ ధర కనిపిస్తోందని వెంటనే కొనేయకండి. వేర్వేరు ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల్లో ధరలను పోల్చి చూడండి. ఇందుకోసం ఆన్లైన్లో కొన్ని టూల్స్ లేదా వెబ్సైట్లను ఉపయోగించి, గత కొన్ని నెలల్లో ఆ వస్తువు అత్యల్ప ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ‘భారీ డిస్కౌంట్’ అని చూపించేవి నిజానికి సాధారణ ధరలకంటే తక్కువ ఏమీ ఉండకపోవచ్చు.బ్యాంక్ ఆఫర్లు, క్యాష్బ్యాక్పండుగ సేల్స్ సమయంలో ఈ-కామర్స్ సంస్థలు నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై 10% నుంచి 15% వరకు తగ్గింపును ఇస్తుంటాయి. మీ దగ్గర ఆ బ్యాంక్ కార్డు లేకపోతే, స్నేహితులు లేదా బంధువుల కార్డులను ఉపయోగించి డబ్బు ఆదా చేయవచ్చు. కొన్ని వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనంగా కొంత మొత్తం క్యాష్బ్యాక్ ద్వారా వాలెట్లోకి వస్తుంది.నో-కాస్ట్ ఈఎంఐఖరీదైన వస్తువులు (ల్యాప్టాప్స్, ఫ్రిజ్లు, ఫోన్లు) కొనేటప్పుడు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల వడ్డీ భారం లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. అయితే, దీనిపై ఉండే ప్రాసెసింగ్ ఫీజును గమనించడం మర్చిపోవద్దు.ఎక్స్ఛేంజ్ ఆఫర్లుమీ పాత వస్తువులను మార్పిడి చేయడం ద్వారా కొత్త వస్తువు ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పండుగ సమయాల్లో ఎక్స్ఛేంజ్ వాల్యూపై అదనపు బోనస్ కూడా లభిస్తుంది. వస్తువును ఇచ్చే ముందు అది పని చేసే స్థితిలో ఉందో లేదో సరిచూసుకోండి.సైబర్ భద్రత అత్యంత ముఖ్యంషాపింగ్ హడావిడిలో సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. కేవలం అధికారిక వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారానే షాపింగ్ చేయండి. వాట్సాప్ లేదా ఎస్ఎమ్ఎస్ల్లో వచ్చే ‘భారీ బహుమతులు’, ‘లింక్లపై క్లిక్ చేయండి’ వంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చెల్లింపులు చేసేటప్పుడు సురక్షితమైన గేట్వేలను మాత్రమే వాడండి.ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత
మీ డబ్బు - మీ నిర్ణయం..
సొంత ఇల్లు కొనాలన్నా, మిగిలిన డబ్బును పొదుపు చేయాలన్నా సగటు మనిషికి ఎన్నో సందేహాలు. మార్కెట్లో పెట్టుబడి మార్గాలకు కొదువ లేకపోయినా, ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది? ఎక్కడ రాబడి ఎక్కువగా వస్తుంది? అనేదే అసలు ప్రశ్న. మీ ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసేలా రియల్టీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి కీలక రంగాలపై కొన్ని కీలక ప్రశ్నలకు నిపుణులు ఇచ్చిన స్పష్టమైన వివరణలు ఇక్కడ చూద్దాం.రియల్టీ..ఇల్లు కొనటానికి డౌన్పేమెంట్ ఎంతవరకూ ఉండాలి? సాధారణంగా ఇంటి విలువలో 10–20 శాతాన్ని డౌన్పేమెంట్గా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 80–90 శాతం మొత్తాన్ని బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణంగా అందిస్తుంటాయి. ప్రాపర్టీ విలువ రూ.30 లక్షల లోపు ఉంటే 90 శాతం వరకూ మొత్తాన్ని రుణంగా ఇస్తారు. 10 శాతం డౌన్పేమెంట్ చెల్లించాలి. ప్రాపర్టీ విలువ రూ.30 నుంచి 75 లక్షల వరకూ ఉంటే 80 శాతం వరకూ రుణాన్ని ఇస్తారు. మిగిలిన 20 శాతం డౌన్పేమెంట్గా చెల్లించాలి. రూ.75 లక్షలు దాటిన ఇళ్లకయితే 25 శాతం వరకూ డౌన్పేమెంట్ అవసరం. మిగిలిన 75 శాతాన్నే రుణంగా ఇస్తారు. ఇక 5–8 శా>తం ఉండే స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, ఇంటీరియర్ ఖర్చులు, లీగల్ ఖర్చులు అన్నీ కొనుగోలుదారే భరించాలి. బ్యాంకింగ్..స్వల్ప కాలంపాటు సొమ్ము దాచుకోవటానికి సేవింగ్స్ ఖాతా లేక లిక్విడ్ ఫండ్సా? లిక్విడ్ ఫండ్స్లో సేవింగ్స్ ఖాతా కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. సేవింగ్స్ ఖాతాపై 2–3 శాతం వడ్డీ వస్తే... లిక్విడ్ ఫండ్స్లో 5–6 శాతం వరకూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవటమన్నది సేవింగ్స్ ఖాతాలోనే సాధ్యపడుతుంది. లిక్విడ్ ఫండ్స్లో కనీసం ఒక్కరోజైనా పూర్తిగా ఉంచాలి. ఎక్కువ శాతం ట్యాక్స్ రేటు చెల్లించేవారికి సేవింగ్స్ ఖాతాకన్నా లిక్విడ్ ఫండ్సే బెటర్. పూర్తిస్థాయి భద్రతను కోరుకునేవారికి సేవింగ్స్ ఖాతా నయం. ఇలా దేని ప్రత్యేకతలు దానికున్నాయి. కనీసం నెలరోజుల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలో ఉంచుకుని, అంతకు మించిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. బంగారం బంగారానికి హాల్ మార్కింగ్ తప్పనిసరా? దేశంలో అన్ని నోటిఫైడ్ జిల్లాల్లోనూ హాల్మార్కింగ్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనిప్రకారం బంగారాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (బీఐఎస్) హాల్మార్కింగ్ చేయాలి. అంటే ప్రత బంగారు ఆభరణంపై బీఐఎస్ లోగో, దాని స్వచ్ఛత (24– 22– 18 క్యారెట్లు..), హాల్మార్కింగ్ ఐడెంటిఫికేషన్ నంబర్, సదరు జ్యుయలర్ ఐడెంటిఫికేషన్ నంబర్ వంటివన్నీ ఉండాలి. స్వల్ప నాన్–నోటిఫైడ్ జిల్లాలకు మాత్రం ఈ హాల్మార్కింగ్ నిబంధనలు వర్తించవు. ఇక బ్యాంకులు, ఎంఎంటీసీ విక్రయించే బంగారం కాయిన్లు, బార్లకు అవే హాల్మార్కింగ్ చేస్తాయి. హాల్మార్కింగ్ వల్ల బంగారం స్వచ్ఛత ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్వచ్ఛతకు గ్యారంటీ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్...రిటైరైన వారికి స్టాక్ మార్కెట్లు సురక్షితమేనా? సురక్షితమే. కాకపోతే మిగతా వారితో పోలి్చనపుడు రిటైరీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి అదనపు ఆదాయం ఉండదు. కాబట్టి ఎక్కువ రాబడులకన్నా తమ అసలు భద్రంగా ఉండటం ముఖ్యం. మార్కెట్లలో ఒడదుడుకులు సహజం కనక అవి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలి. అందుకని తమ రిటైర్మెంట్ నిధిలో 15–20 శాతం మాత్రమే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటం మంచిది. నెలవారీ ఖర్చుల కోసం కాకుండా దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డివిడెండ్లు ఇచ్చే షేర్లు, లేదా లార్జ్క్యాప్ షేర్లు లేదా వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్లను ఎంచుకోవాలి. ఎక్కువ డబ్బును ఎఫ్డీలు, ఆర్బీఐ బాండ్లలో పెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్...సిప్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయటం మంచిదా..∙ఒకేసారి పెద్ద మొత్తం పెడితే మంచిదా? సిప్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఇక ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడమనేది కొందరికే. మార్కెట్ టైమింగ్ను చూసుకుని, బాగా రిస్్కను తట్టుకోగలిగే వారికే! సిప్ వల్ల మార్కెట్ టైమింగ్ రిస్కు ఉండదు. క్రమశిక్షణ అలవాటు కావటంతో పాటు రుపీ కాస్ట్ కూడా యావరేజ్ అవుతుంది. కాకపోతే మీ దగ్గర పెద్ద మొత్తం ఉన్నపుడు సిప్ చేయటం మొదలుపెడతే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయ డానికి చాలా సమయం పడుతుంది. అలాకాకుండా ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లు కలిసివస్తే రాబడులు కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మార్కెట్లు బాగా చౌకగా ఉన్నాయని భావించినపుడు, రిసు్కను తట్టుకోగలమని భావించినపుడు మాత్రమే దీనికి సిద్ధపడాలి. ఇన్సూరెన్స్ప్రెగ్నెన్సీ, డెలివరీ ఖర్చులు ఇన్సూరెన్స్లో కవరవుతాయా?మెటరి్నటీ ఖర్చులకు చాలా బీమా కంపెనీలు ఇపుడు కవరేజీ ఇస్తున్నాయి. పాలసీ తీసుకున్నాక కొంత వెయిటింగ్ పీరియడ్ తరవాతే ఇవి వర్తిస్తాయి. నార్మల్ లేదా సి–సక్షన్ డెలివరీ ఖర్చులతో పాటు ప్రీ–పోస్ట్ నాటల్ వ్యయాలు, కొంతకాలం వరకూ పుట్టిన బిడ్డకు అయ్యే ఖర్చు ఇవన్నీ కవర్ అవుతున్నాయి. మెటరి్నటీ కవర్ పాలసీ తీసుకున్న 2–4 ఏళ్ల తరువాతే మొదలవుతుంది. ఈ వెయిటింగ్ పీరియడ్లోపల అయ్యే ఖర్చులకు కవరేజీ ఉండదు. ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప ఐవీఎఫ్, ఐయూఐ వంటి గర్భధారణ ఖర్చులకు బీమా కవరేజీ ఉండదు. అయితే కొన్ని యాజమాన్యాలిచ్చే పాలసీ లు, గ్రూప్ పాలసీల్లో మాత్రం వెయిటింగ్ పీరియడ్ లేకుండానే డెలివరీ కవరేజీ అందిస్తున్నారు.ఇదీ చదవండి: రిటైర్మెంటుతో.. లీవ్ ఎన్క్యాష్మెంట్..?
రిటైర్మెంటుతో.. లీవ్ ఎన్క్యాష్మెంట్..?
ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైర్మెంటు తీసుకున్న ఉద్యోగస్తులు ఆలోచిస్తున్న అంశం.. తమ చేతికొచ్చిన లీవ్ ఎన్ క్యాష్మెంట్ మొత్తంలో మినహాయింపు రూ.3,00,000 పోగా పన్నుకి గురైన మిగతా భాగం గురించే. దీనిపై సమాచారాన్ని ఈ వారం తెలుసుకుందాం.లీవ్ ఎన్క్యాష్మెంట్పై కొన్ని రూల్స్కి లోబడి రూ.3,00,000 వరకు మినహాయింపు ఉండేది. 24–03–2023 నాడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మొత్తాన్ని రూ.25,00,000కు పెంచారు. ఈ డేటు తర్వాత వచ్చిన వాటికి ఇది వర్తిస్తుంది. ఈలోగా ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 01–01–2016 నుంచి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు జీతాలు, లీవ్ ఎన్క్యాష్మెంట్ భారీగా పెరిగాయి. 01–01–2016 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగస్తులు తమ ఆదాయ పన్ను రిటర్నులలో రూ.3,00,000 వరకు మినహాయింపు పొంది, మిగతా మొత్తాల మీద 30 శాతం పన్ను, విద్యా సుంకం 4 శాతం.. వెరసి 31.2 శాతం పన్ను చెల్లించి సరిపెట్టుకున్నారు. ఇది సంతోషాన్ని కలిగించినప్పటికీ కొంత అలజడి మొదలైంది.కొంత మంది ఉద్యోగస్తులు నోటిఫికేషన్ అంశాన్ని లేవదీసి, ఆ మేరకు అదనంగా కట్టిన ట్యాక్స్ రిఫండు కోసం దరఖాస్తు చేశారు. అధికారులు యధావిధిగా అన్నింటినీ తోసిపుచ్చారు. విషయం ట్రిబ్యునల్ వరకు వెళ్లింది. అక్కడ ఉపశమనం లభించింది. వడ్డీతో సహా రిఫండ్ వచ్చింది. ఈ విషయం ఉద్యోగ సంఘాల ద్వారా ఊరు, వాడా చేరింది. ఒకే ప్రశ్న మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది.. మీరూ రిఫండు కోసం క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేయడం తప్పు కాదు. ఎటువంటి రిస్కు కాదు. ఖర్చేమీ కాదు. ఫైల్ చేయండి.ఇదీ చదవండి: అంతులేని ధరల పెంపు ఆగేదెప్పుడో..ఎలా చేయాలి..కాగితాలన్నీ సమకూర్చుకోండి. మీ గత చరిత్ర ఒక పద్ధతిలో పెట్టండి. ఏ సంవత్సరంలో దాఖలు చేశారు, అక్నాలెడ్జ్మెంటు, రిటర్ను కాపీ, అసెస్మెంట్ ఆర్డరు, ట్యాక్స్ చెల్లించిన చలాన్లు, వాటికి సంబంధించిన అన్ని కాగితాలు.కాలదోషం పట్టిన కేసుల్లో రిటర్ను వేయకూడదు. అలా వేయాలంటే డిపార్టుమెంటు నోటీసులు ఇవ్వాలి. ఈ విషయంలో అలాంటివి జరగవు. ఆటోమేటిక్గా వాళ్లు రిఫండు ఇవ్వరు. మీరు రివైజ్ రిటర్ను వేయాలి.రివైజ్ రిటర్ను వేయాలంటే మీకు అనుమతి కావాలి. ఆ అనుమతి కేంద్ర పన్నుల బోర్డు ఇవ్వాలి. బోర్డు అంటే.. మీరు ఢిల్లీ పరుగెత్తనక్కర్లేదు. మీకు సంబంధించిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కం ట్యాక్స్ వారికి దరఖాస్తు చేసుకోవాలి.ఇలా దరఖాస్తు చేయడాన్ని కండోనేషన్ అప్లికేషన్ వేయడం అంటారు. తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్లో వీరి కార్యాలయం ఉంది. ప్రత్యక్షంగా ఫైల్ చేయొచ్చు లేదా ఐటీ పోర్టల్లోనైనా చేయొచ్చు. లాగిన్ తర్వాత సర్వీసెస్ బోర్డుకి వెళ్లాక, కండోనేషన్ రిక్వెస్ట్ కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. క్రియేట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. అందులో అన్ని వివరాలు ఉంటాయి. నింపండి.ఏ వివరాలు ఇవ్వాలంటే.. మీ వివరాలు, కేసు వివరాలు, గతంలో రిటర్న్ వేసిన వివరాలు, నిజాలన్నీ పొందుపరుస్తూ, నా తప్పేమీ లేదు, ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు అని రివైజ్ రిటర్ను వేయడానికి అనుమతి వేడుకోండి.సాధారణంగా అనుమతి ఇస్తారు. రోజూ వెబ్సైట్ వాచ్ చేయండి. అనుమతి రాగానే రివైజ్ రిటర్ను వేయండి.అన్ని కాగితాలు/వివరాలు ఇచ్చి రిటర్ను వేస్తే రిఫండు వచ్చే అవకాశం ఉంది.


