Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Rural Boom Fuels Record Auto Sales in India Says FADA1
అమ్మకాల్లో రికార్డ్‌.. ఒక్క నెలలో 26 లక్షల వాహనాలు!

భారత ఆటోమొబైల్‌ రంగం 2026-27 ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. దేశీయంగా వాహన రిటైల్‌ విక్రయాలు ఈ ఏప్రిల్‌లో ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించాయి. గత నెలలో మొత్తం 26,11,317 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది (2025) ఇదే నెలలో నమోదైన 23,12,221 యూనిట్లతో పోలిస్తే ఇది 12.94 శాతం వృద్ధి అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఫాడా) మంగళవారం వెల్లడించింది. జీఎస్టీ 2.0 అమలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, రబీ పంటల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నగదు లభ్యత, వివాహాల సీజన్‌ వంటి అంశాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని ఫాడా వివరించింది.రికార్డుల జోరుతో ఆటో రంగం బోణీ: ఫాడా ఉపాధ్యక్షుడుభారత ఆటో రిటైల్‌ రంగం 2026–27 ఆర్థిక సంవత్సరాన్ని బలంగా ప్రారంభించిందని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్‌ తెలిపారు. 2026 ఏప్రిల్‌లో మునుపెన్నడూ లేని విధంగా 26,11,317 యూనిట్ల విక్రయాలతో దాదాపు 13 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషమన్నారు. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కావని, భారత వినియోగ మార్కెట్‌లో వస్తున్న కీలక మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత కొన్నాళ్లుగా మెట్రో నగరాలకే పరిమితమైన వాహనాల జోరు ఇప్పుడు పల్లెలకు పాకింది. పట్టణ ప్రాంతాల్లో 7.11 శాతం వృద్ధి నమోదైతే, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 20.40 శాతం వృద్ధి కనిపించడం విశేషం. ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, చిన్న కార్ల విభాగంలో మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ‘వ్యక్తిగత మొబిలిటీ’ విభాగం పుంజుకుంది. వినియోగదారులు కేవలం పెట్రోల్, డీజిల్‌పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. విక్రయాల్లో సీఎన్‌జీ (సీఎన్‌జీ) వాటా 22.62% ఉండగా, ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వాటా 5.77 శాతానికి మెరుగుపడటం సానుకూల పరిణామం’’ అని వెల్లడించారు.అప్రమత్తతతో కూడిన ఆశావాదం: ఫాడా అంచనాలురాబోయే మూడు నెలల్లో వాహన విక్రయాల వృద్ధిపై సగానికి పైగా (50.90 శాతం) డీలర్లు ధీమాతో ఉన్నారని ఫాడా తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నగదు లభ్యత, ఖరీఫ్‌ సీజన్‌ సానుకూలతలు ద్విచక్ర వాహన విభాగానికి ఊతమిస్తాయని అంచనా వేసింది. మే నెలలో వివాహాల సీజన్‌ కారణంగా ప్యాసింజర్‌ వాహనాల బుకింగ్‌లు బలంగా ఉంటాయని, జూన్‌–జూలై నెలల్లో విక్రయాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని పేర్కొంది. అయితే, తీవ్రమైన వడగాల్పులు, పశి్చమ ఆసియా ఉద్రిక్తతల వల్ల పెరిగే ఇంధన ధరలు మరియు వాణిజ్య వాహనాల విభాగంలో నగదు లభ్యత (లిక్విడిటీ) వంటి సవాళ్లను నిశితంగా గమనించాల్సి ఉంటుందని ఫాడా స్పష్టం చేసింది.

Stock Market Closing Update May 6th 20262
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 940.73 పాయింట్లు లేదా 1.22 శాతం లాభంతో 77,958.52 వద్ద, నిఫ్టీ 298.15 పాయింట్లు లేదా 1.24 శాతం లాభంతో 24,330.95 వద్ద నిలిచాయి.రేమండ్ రియల్టీ లిమిటెడ్, మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్, హెచ్‌బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, బీఎన్ ఆగ్రోకెమ్ లిమిటెడ్, రేమండ్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. షిల్చార్ టెక్నాలజీస్ లిమిటెడ్, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్, మనాక్సియా కోటెడ్ మెటల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Baby Boomer Retirement Crisis Ahead Robert Kiyosaki Issues Stark Warning3
అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

ఆర్ధిక విషయాలకు సంబంధించిన విషయాలను, పెట్టుబడులకు సంబంధించిన సమాచారం గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki), తాజాగా బేబీ బూమర్స్ గురించి చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''1974లోనే నేను బేబీ బూమర్ల (1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారిని బేబీ బూమర్స్ అంటారు) పదవీ విరమణ విపత్తు రాబోతోందని ఊహించాను. 2026 చివరి నాటికి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. చాలామంది నిరాశ్రయులవుతారు'' అని కియోసాకి హెచ్చరించారు.ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కాస్త కఠినంగా మారుతున్నాయి. చాలా మంది వృద్ధులు ఉద్యోగాలు కోల్పోయి, సరిపడా పొదుపులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఇది సమాజానికి పెద్ద సవాలు. అందుకే ముందుగానే ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యమని కియోసాకి చెబుతున్నారు.మన మెదడు మనకు ఉన్న గొప్ప ఆస్తి. సరైన జ్ఞానం, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడైనా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. సంపదను సృష్టించడం అంత కష్టం కాదు, సరైన మార్గం తెలుసుకుంటే సరిపోతుంది.ఇదీ చదవండి: ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు: కియోసాకి హెచ్చరికకొంతమంది నిపుణులు.. భవిష్యత్తు కోసం బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, అలాగే డిజిటల్ ఆస్తులు అయిన బిట్‌కాయిన్, ఎథీరియం లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా, అవగాహనతో ముందుకు వెళ్లడం అవసరం అని రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. మొత్తం మీద.. రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించాలంటే ముందుగానే ప్రణాళిక అవసరం అని ఆయన పేర్కొన్నారు.BOMERS RETIREMENT DISASTER:In 1974 I saw the coming of the Baby Boomer Retirement Disaster. In 2026 millions of Boomers will be out of work in trouble financially….many homeless.I wrote two books for the Boomers and their families who wanted to prepare for this time in…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 6, 2026

AI Disruption Hits Tech Jobs Freshworks Lays Off 500 Employees Restructuring4
500 మందిని తొలగించిన టెక్‌ కంపెనీ

సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న ప్రకంపనలు మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ బిజినెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘ఫ్రెష్‌వర్క్స్’ తాజాగా తన ఉద్యోగుల్లో 11 శాతం మందిని, అంటే దాదాపు 500 మందిని తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్న తరుణంలో తాజా నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.ఎందుకు ఈ నిర్ణయం?ఏఐ రంగంలో చోటుచేసుకుంటున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకునే క్రమంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనిపై ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డెన్నిస్ వుడ్‌సైడ్ స్పష్టతనిచ్చారు. ‘మా కోడింగ్ ప్రక్రియలో ఇప్పటికే సగానికి పైగా ఏఐ ద్వారానే జరుగుతోంది. ఆటోమేషన్ వల్ల సాంకేతిక విభాగాల్లోని సాధారణ పనులు గణనీయంగా తగ్గాయి. ఈ మార్పులను సమర్థవంతంగా నిర్వహించడానికి లేఆఫ్స్‌ అవసరం ఏర్పడింది’ అని ఆయన వివరించారు.పునర్నిర్మాణ వ్యూహంఈ తొలగింపుల వల్ల కంపెనీపై సుమారు 8 మిలియన్ డాలర్ల భారం పడనుందని అంచనా. అయితే, ఈ పొదుపు ద్వారా వచ్చిన నిధులను కంపెనీ తన ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ అయిన ‘ఫ్రెష్‌సర్వీస్’ వంటి వ్యాపార విభాగాల్లో తిరిగి పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Bengaluru Rains Trigger 1200 Auto Fare for 15 Km Outrage Floods Social Media5
వర్షం పడితే చాలు దోపిడీ

దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గందరగోళంబెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sanya Singh (@sanya.unfiltered)సోషల్ మీడియాలో..ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Coding Why Physics Could Be Key Skill for AI Generation NVIDIA CEO Jensen Huang6
కోడింగ్‌ ఒక్కటే సరిపోదు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో విద్యార్థులు, యువ నిపుణులు ఏయే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో చర్చకు దారితీశాయి. ఒకవేళ తాను ఇప్పుడు విద్యార్థిని అయితే కోడింగ్‌తో పాటు భౌతిక శాస్త్రానికి (ఫిజిక్స్‌) అత్యధిక ప్రాధాన్యతనిస్తానని ఆయన స్పష్టం చేశారు.కోడింగ్ మాత్రమే సరిపోదుసాంకేతిక రంగంలో దశాబ్దాలుగా కోడింగ్‌ను అత్యంత కీలకమైన నైపుణ్యంగా పరిగణిస్తున్నారు. అయితే, ఏఐ వ్యవస్థలు కేవలం డిజిటల్ డేటాను ప్రాసెస్ చేసే స్థాయి నుంచి భౌతిక ప్రపంచంతో నేరుగా కార్యకలాపాలు సాగించే స్థాయికి చేరుకుంటున్నాయని హువాంగ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను బహుశా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడిని’ అని పేర్కొన్న హువాంగ్, ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలిపే ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం కోడింగ్ చేయడం కంటే ముఖ్యమని ఉద్ఘాటించారు. తదుపరి తరం ఆవిష్కరణలు కేవలం సాఫ్ట్‌వేర్ నైపుణ్యాల మీద కాకుండా భౌతిక శాస్త్రం, గణితంపై ఉన్న లోతైన అవగాహన మీద ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఎందుకు ఈ మార్పు?ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ‘ఫిజికల్ ఏఐ’ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏఐ వ్యవస్థలు ఇప్పుడు రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి రియల్‌ వరల్డ్‌ అప్లికేషన్లలో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హువాంగ్ చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో డెవలపర్లు, ఇంజినీర్లకు ఫిజిక్స్‌ విషయాలపై అవగాహన తప్పనిసరి. కోడింగ్ అనేది ఒక పనిని చేయించడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, కానీ యంత్రాలు సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయాలంటే అవి పనిచేసే భౌతిక ప్రపంచంపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Advertisement
Advertisement
Advertisement