Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Double Decker Train Journeys in India These Are the Routes You Can Take1
ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!

భారతదేశంలో ట్రైన్ జర్నీ అనేది కేవలం గమ్యస్థానాలను చేరుకోవడానికి మాత్రమే కాకుండా.. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే.. దాదాపు అందరూ కూడా సాధారణ రైళ్లలో ప్రయాణం చేసి ఉంటారు. కానీ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణం చాలా అరుదు. ఈ రకమైన ట్రైన్ జర్నీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విశాలమైన కిటికీల (విండోస్) గుండా బయట ప్రపంచాన్ని చూడటం ఆ థ్రిల్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ కథనంలో మన దేశంలోని డబుల్ డెక్కర్ రైలు మార్గాలు ఏవి? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.ముంబై - అహ్మదాబాద్డబుల్ డెక్కర్ రైలు అనగానే చాలామందికి గుర్తొచ్చేది ముంబై - అహ్మదాబాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్. ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైన, అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. ఇది రెండు ముఖ్యమైన నగరాలను కలుపుతూ వ్యాపారవేత్తలు, తరచూ ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఒకరోజులో జర్నీ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. సౌకర్యవంతమైన చైర్ కార్ సీటింగ్, పెద్ద కిటికీలు ఉండటం వల్ల మీ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది.ఢిల్లీ - జైపూర్ఢిల్లీ-జైపూర్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ దేశ రాజధాని ఢిల్లీని రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌తో కలుపుతుంది. ఈ మార్గంలో ఏడాది పొడవునా పర్యాటకులు, రోజువారీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇందులో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు.చెన్నై - బెంగళూరుచెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ప్రయాణించే రైళ్లలో ఒకటి. ఉద్యోగులు, విద్యార్థులు, వారాంతపు ప్రయాణికులు ఎక్కువగా ఈ రైలును ఉపయోగిస్తారు. పరిమితమైన స్టాప్‌లు, సమర్థవంతమైన షెడ్యూలింగ్ వంటివి ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ రైలుకు అధిక డిమాండ్ ఉండటం వల్ల.. టికెట్లు త్వరగా అమ్ముడవుతాయి.విశాఖపట్నం - విజయవాడవిశాఖపట్నం - విజయవాడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ సర్వీసు సాధారణ ప్రయాణికులకు, ఆఫీసులకు వెళ్లేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. విశాఖ పట్టణం, విజయవాడలకు ప్రయాణించాలనుకునే వారికి ఈ డబుల్ డెక్కర్ మంచి ఎంపిక.హౌరా - ధన్‌బాద్హౌరా-ధన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్.. కోల్‌కతాను జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలతో కలుపుతూ నడుస్తుంది. దీనిని వ్యాపారులు, ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా.. రోజువారీ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.సాధారణ రైళ్లు మాదిరిగా.. డబుల్ డెక్కర్ ట్రైన్స్ అన్ని మార్గాలలో అందుబాటులో ఉండవు. దీనికి కారణం ప్రత్యేకమైన మౌలిక వసతులు. ఉదాహరణకు.. ప్లాట్‌ఫారమ్ ఎత్తు, ట్రాక్ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందువల్ల భారతీయ రైల్వేలు అధిక డిమాండ్ ఉన్న కొన్ని మార్గాలలో మాత్రమే వీటిని ప్రవేశపెట్టాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

Warren Buffett’s Proven Formula for Investing with Little Money2
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!

పెట్టుబడి ప్రపంచంలో 'లెజెండ్'గా పేరొందిన వారెన్ బఫెట్.. కేవలం 11 ఏళ్ల వయస్సులో మూడు షేర్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు రూ. 11 లక్షల కోట్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలిచారు. మరి అతి తక్కువ డబ్బుతో పెట్టుబడి మొదలుపెట్టేవారికి ఆయన ఇచ్చే సలహాలేంటి? సామాన్యులు కూడా బఫెట్ రూట్ లో సంపదను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.చిన్న మొత్తంతోనే శ్రీకారం చుట్టండిచాలామంది తమ దగ్గర లక్షలాది రూపాయలు ఉంటేనే షేర్ మార్కెట్లోకి రావాలని అనుకుంటారు. కానీ బఫెట్ దృష్టిలో ఇది తప్పు. మీ దగ్గర రూ. 500 లేదా రూ. 1000 ఉన్నా సరే, పెట్టుబడిని తక్షణమే ప్రారంభించాలి. "సమయం మీ వైపు ఉంటే, చిన్న మొత్తమే భవిష్యత్తులో కొండంత సంపదగా మారుతుంది" అని ఆయన పదే పదే చెబుతుంటారు.ఇండెక్స్ ఫండ్స్: సామాన్యుల ఆయుధంఏ షేర్ కొనాలి? ఏ కంపెనీ బాగుంటుంది? అన్న అవగాహన లేని వారికి బఫెట్ సూచించే ఉత్తమ మార్గం 'లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్'. కంపెనీలను విశ్లేషించే సమయం, నైపుణ్యం లేని వారికి ఇవి అత్యంత సురక్షితమైనవని ఆయన నమ్ముతారు. అమెరికాలో S&P 500 లాగా, భారత్‌లో నిఫ్టీ 50 (Nifty 50) వంటి ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు.తెలివితేటలే అసలైన పెట్టుబడితెలివితేటలే అసలైన పెట్టుబడి అని వారెన్ బఫెట్ నమ్ముతారు. అందుకే జ్ఞానం కోసం అనే పుస్తకాలు ఆయన తిరగేస్తుంటారు. ఇప్పటికీ రోజుకు కనీసం 500 పేజీలు చదువుతారు. "అన్నింటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ జ్ఞానం మీద పెట్టేదే" అని ఆయన అంటారు. పెట్టుబడులు పెట్టేవారు కంపెనీల వార్షిక నివేదికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవాలి. బెంజమిన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' వంటి పుస్తకాలు చదవాలని ఆయన సూచిస్తుంటారు.కాంపౌండింగ్ మాయాజాలంబఫెట్ సంపదలో 90 శాతం ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది. దీనికి కారణం 'చక్రవడ్డీ' (Compounding). మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టి, దాన్ని ఎంత కాలం కొనసాగిస్తారో, మీ డబ్బు అంత వేగంగా రెట్టింపు అవుతుంది. అందుకే "పెట్టుబడి పెట్టడానికి నిన్నటి కంటే ఈరోజే సరైన సమయం" అని ఆయన చెబుతారు.కేవలం ఎఫ్‌డీ(FD)లు, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకుంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. ధనవంతులు కావాలంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనివార్యమని బఫెట్ సిద్ధాంతం చెబుతోంది. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకుని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఎవరైనా ‘కోటీశ్వరులు’ కావచ్చని బఫెట్ సూత్రం నిరూపిస్తోంది.

Income Tax Guide: What Senior Citizens Need to Know About the Latest Tax Reforms3
ఈ ఆర్థిక సంవత్సరంలో ‘సీనియర్‌ సిటిజన్లు’

కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్‌ ప్రకారం కేవలం సీనియర్‌ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్‌మెంట్‌ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్‌ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది. 80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్‌ చెకప్‌కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది. గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్‌ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్‌ సబి్మట్‌ చేస్తే టీడీఎస్‌ చేయరు. చేయకపోతే టీడీఎస్‌ రివకరీ చేసి గవర్నమెంట్‌ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్‌ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్‌ ఇన్‌కం. ఇప్పుడు దీని లిమిట్‌ రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్‌ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్‌ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు. 75 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే... (ఎ) కేవలం పెన్షన్‌ ఉండాలి (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్‌ రికవరీ అయ్యి గవర్నమెంట్‌ ఖజానాలో జమ అయ్యి ఉండాలి ఈ సదుపాయం కొనసాగుతుంది. ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. ఫైలింగ్‌ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్‌ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రీ ఫిక్స్‌డ్‌ ఫారమ్‌లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి. సీనియర్‌ సిటిజన్ల సేవింగ్స్‌ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్‌ చేయొచ్చు. రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్‌గా రిటర్ను వేయవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్‌ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి.

Tata AIA Launches Term Plan for Students4
విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్‌ ప్లాన్‌

నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్‌ ప్లాన్‌ను టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్‌ ఫోకస్డ్‌ టర్మ్‌ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్‌లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్‌ ఇన్సూర్డ్‌తో ప్లాన్‌ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది.

Pension Reforms FDI Limit Hike and Structural Changes to PFRDA Act5
పింఛను రంగంలో ఎఫ్‌డీఐ పెంపు!

న్యూఢిల్లీ: పింఛను (పెన్షన్‌) రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని నూరు శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చట్టం, 2013కు సవరణలతో కూడిన బిల్లును వచ్చే వర్షాకాలం లేదంటే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం పింఛను రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐకే పరిమితి ఉంది. ప్రభుత్వం ఇటీవలే బీమా రంగంలోనూ ఎఫ్‌డీఐని నూరు శాతానికి అనుమతించడం తెలిసిందే. అంతకుముందు వరకు 74 శాతం వరకు అనుమతించేవారు. తొలుత 2015లో బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతం పెంచుతూ.. బీమా చట్టం, 1938లో కేంద్ర సర్కారు సవరణలు తీసుకురావడం గమనార్హం.ప్రతిపాదిత పెన్షన్‌ చట్టం బిల్లులో ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ను వేరు చేసే సవరణ కూడా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్‌పీఎస్‌ను పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి వేరు చేసి, 15 మంది సభ్యుల బోర్డు నిర్వహణలో ఉంచనున్నట్టు చెప్పాయి. ఈ బోర్డులో మెజారిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి ఉంటారని పేర్కొన్నాయి.

2026 Hyundai Venue Knight Launched at Rs 9 70 Lakh6
హ్యుందాయ్ వెన్యూ నైట్‌: ధర ఎంతంటే?

హ్యుందాయ్ మోటార్ ఇండియా.. 2026 వెన్యూ నైట్‌ను రూ. 9.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. ఇది పూర్తిగా నలుపు రంగులో ఉండటం చేత.. చూడటానికి సాధారణ వెన్యూ కంటే కొంత భిన్నంగా అనిపిస్తుంది.హ్యుందాయ్ వెన్యూ నైట్‌.. నలుపు రంగు ఫ్రంట్ గ్రిల్, రూఫ్ రైల్స్, ఓఆర్వీఎంలు పొందుతుంది. అంతే కాకుండా.. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ నలుపు రంగులోని 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అయితే బ్రేక్ కాలిపర్స్ ఎరుపు రంగులో ఉన్నాయి. ఇది మ్యాట్ బ్లాక్ హ్యుందాయ్ లోగోలు, ప్రత్యేకమైన నైట్ లోగోలు పొందుతుంది.వెన్యూ నైట్ ఇంటీరియర్ కూడా నలుపు రంగులోనే ఉంది. ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా సాధారణ వెన్యూలో మాదిరిగానే ఉంటాయి. రంగులో మాత్రం వ్యత్యాసం కనిపిస్తుంది. ఇందులో డ్రైవింగ్, ఎమర్జెన్సీ & ఈవెంట్, వెకేషన్, ఆన్-డిమాండ్ మరియు ఫోటో క్యాప్చర్ వంటి బహుళ రికార్డింగ్ మోడ్‌లు ఉన్నాయి.2026 హ్యుందాయ్ వెన్యూ, పాత వెర్షన్‌లోని అవే ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. కాబట్టి 1.2-లీటర్ పెట్రోల్, డీసీటీతో జత చేసిన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement