Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India well positioned to emerge as global leader in pharma1
ఫార్మా వృద్ధికి పరిశోధనలు కీలకం

న్యూఢిల్లీ: బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్‌పై మరింతగా దృష్టి పెడుతూ అంతర్జాతీయంగా ఫార్మా రంగానికి సారథ్యం వహించేలా భారత్‌ పటిష్టమైన స్థితిలో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఇందుకోసం పరిశోధనలు–అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలను బలోపేతం చేయడం, పెట్టుబడులు పెరగడం మొదలైన అంశాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఫార్మా 2026 కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు చెప్పారు. నాయకత్వ సామర్థ్యాలు, అందుబాటు ధరలో జనరిక్‌ ఔషధాలతో అనేక సంవత్సరాలుగా ప్రపంచానికి ఫార్మసీగా భారత్‌ గుర్తింపు పొందిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం గ్లోబల్‌ ఫార్మా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్‌పై ఫోకస్‌ పెరుగుతోందన్నారు. దీనికి అనువుగా భారత్‌ తనను తాను మల్చుకోవడంతో పాటు సారథ్యం కూడా వహించేందుకు స్థితిలో ఉందని నడ్డా వివరించారు. దేశీ ఫార్మా పరిశ్రమను గ్లోబల్‌ లీడరుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అయిదేళ్ల వ్యవధి కోసం రూ. 10,000 కోట్లతో బయోఫార్మా శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించినట్లు చెప్పారు. బల్క్‌ డ్రగ్‌ పార్కుల అభివృద్ధి, బల్క్‌ డ్రగ్స్‌ స్కీము, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ)లాంటి కార్యక్రమాలతో దేశీయంగా తయారీ కార్యకలాపాలకు ఊతమిస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ని (సీడీఎస్‌సీవో) పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్లు, 1,500 మంది నిపుణులతో సైంటిఫిక్‌ సమీక్ష కోసం బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ తెలిపారు.

Pirojsha Godrej to be new chairperson of Godrej Industries2
గోద్రెజ్‌ చైర్మన్‌గా పిరోజ్‌షా

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ నాయకత్వ మార్పిడికి సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత చైర్‌పర్శన్, బంధువు నాదిర్‌ నుంచి ఈ ఏడాది ఆగస్ట్‌లో పిరోజ్‌షా గోద్రెజ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. తదుపరి నాదిర్‌ గోద్రెజ్‌ కంపెనీ గౌరవ చైర్మన్‌గా సేవలు అందించనున్నట్లు గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ పేర్కొంది. తరాలవారీ నాయకత్వ మార్పిడి ప్రణాళిక ప్రకారం ఇతర ఎంపికలు సైతం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇది ఇటు అధికారం, అటు బాధ్యతల సమయమని పిరోజ్‌షా పేర్కొన్నారు. తరతరాలుగా నిర్మించుకున్న గ్రూప్‌ వారసత్వ సంపదతోపాటు విలువలను నిలుపుకుంటూనే ముందుకు సాగవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. 2026 ఆగస్ట్‌లో నాదిర్‌ వయసు 75ఏళ్లకు చేరనుండటంతో పదవీ విరమణ చేయనున్నారు. ఫలితంగా గ్రూప్‌లోని గోద్రెజ్‌ ఇండస్ట్రీస్, ఆగ్రోవెట్, కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌సహా గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ బోర్డుల నుంచి తప్పుకోనున్నారు. సోమవారం(13) నుంచి ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ కంపెనీ చైర్మన్, నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాధ్యతలకు టాటా చెప్పారు. కొత్త తరంతో.. తదుపరి తరం నాయకత్వంలో గోద్రెజ్‌ గ్రూప్‌ మరింత పటిష్ట వృద్ధిని అందుకోనున్నట్లు ఈ సందర్భంగా నాదిర్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గోద్రెజ్‌ గ్రూప్‌నకు పలు దశాబ్దాలుగా నాదిర్‌ సేవలు అందిస్తున్న విషయం విదితమే. నాదిర్‌ సోదరుడు ఆది, పరమేశ్వర్‌ గోద్రెజ్‌ కుమారుడు పిరోజ్‌షా గోద్రెజ్‌ ఆగస్ట్‌ 14 నుంచి గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌కు చైర్‌పర్శన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ చైర్మన్‌గా నాదిర్‌ కుమారుడు బుర్జీస్‌ గోద్రెజ్‌ ఆగస్ట్‌ 14న బాధ్యతలు స్వీకరించడంతోపాటు.. గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా చేరనున్నారు. ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ ఎండీ పదవి నుంచి వెనువెంటనే తప్పుకుని బోర్డులో నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఆస్టెక్‌ లైఫ్‌ చైర్‌పర్శన్‌గా గోద్రెజ్‌ కెమికల్స్‌ సీఈవో విశాల్‌ శర్మ వెనువెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆస్టెక్‌ లైఫ్‌ ప్రస్తుత సీవోవో ఆరిజిత్‌ ముఖర్జీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.

Electric Motorcycle Demand and Growth Says Vahan Data3
ఎలక్ట్రిక్‌ బైక్‌.. రయ్‌ రయ్‌!

న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్స్‌పై డిమాండ్‌ పెరుగుతోంది. వాహన్‌ డేటా ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో 17,173 వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 13,430 యూనిట్లతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాత, కొత్త సంస్థలు మార్కెట్లోకి ఆకర్షణీయమైన కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంలో పోటీపడుతుండటంతో కస్టమర్లలో వీటిపై ఆసక్తి పెరుగుతోంది. ఒబెన్‌ ఎలక్ట్రిక్, రివోల్ట్‌ మోటార్స్, అ్రల్టావయోలెట్‌ ఆటోమోటివ్, మ్యాటర్‌ మోటార్‌లాంటి సంస్థలు ముఖ్యంగా పనితీరు, టెక్నాలజీ, విశిష్టమైన రైడింగ్‌ అనుభూతిపై దృష్టి పెడుతూ వినూత్నమైన మోడల్స్‌ని అందిస్తున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కూడా ఫ్లయింగ్‌ ఫ్లీతో రంగంలోకి దిగింది. సంప్రదాయ ఇంజిన్ల మోటార్‌సైకిల్స్‌నే ఇష్టపడే రైడర్లు క్రమంగా ఎలక్ట్రిక్‌ ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నారని మ్యాటర్‌ మోటార్‌ వ్యవస్థాపకుడు మోహల్‌ లాల్‌భాయ్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనానికి మళ్లడాన్ని, పనితీరు విషయంలో రాజీపడటంలాగా కాకుండా అప్‌గ్రేడ్‌ కావడంగా పరిగణిస్తున్నారని వివరించారు. నిర్వహణ ఖర్చు తక్కువ.. వాహన కొనుగోలు, నిర్వహణ వ్యయాలు మొదలైన వాటికి సంబంధించిన టోటల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఓనర్‌íÙప్‌ (టీసీవో) అనేది సాధారణ మోటార్‌సైకిల్స్, ఈ–బైక్స్‌కి దాదాపు సరిసమాన స్థాయికి చేరుతోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. రన్నింగ్‌ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటమనేది ఈ–మోటార్‌సైకిల్స్‌కి ఆదరణ పెరగడానికి తోడ్పడుతోందని వివరించాయి. రోజుకు 30–50 కి.మీ. రైడ్‌ చేసే వారు, పెట్టిన పెట్టుబడి 18–24 నెలల్లో తిరిగి వచ్చేయగలదని పేర్కొన్నాయి. పనితీరు, ఆదాకి సంబంధించి రెండింటి మధ్య ఏదో ఒక దాని విషయంలో రాజీపడాల్సిన అవసరం ఉండటం లేదని తెలిపాయి. అయితే, డిమాండ్‌–సరఫరా మధ్య అంతరాలు, నాణ్యతను కూడా పాటిస్తూ భారీగా ఉత్పత్తి చేయడం, ముడి వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు, పటిష్టమైన నెట్‌వర్క్‌ని నిర్మించుకోవడంలాంటివి పరిశ్రమకు సవాళ్లుగా ఉంటున్నాయని లాల్‌భాయ్‌ తెలిపారు. తయారీ సామర్థ్యాలు, చార్జింగ్‌ సదుపాయాలు మెరుగుపడటంలాంటి అంశాలతో ఎలక్ట్రిక్‌ టూ–వీలర్ల సెగ్మెంట్‌ స్థిరంగా వృద్ధి చెందుతోందని ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ ఎండీ అనురాగ్‌ సింగ్‌ తెలిపారు. ఊహించిన దానికంటే వృద్ధి నెమ్మదిగానే ఉన్నా మరింత స్పష్టతతో పురోగమిస్తోందన్నారు. అయితే, మరో ఐదేళ్ల పాటు సంప్రదాయ ఇంజిన్‌ ద్విచక్ర వాహనాలకు ఆదరణ ఉంటుందని చెప్పారు.ఓలా కొత్త స్కూటర్‌ ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌320 కి.మీ రేంజ్‌ ధర రూ.1,29,999 ముంబై: ఓలా ఎలక్ట్రిక్‌ కొత్తగా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ 5.2 కేడబ్ల్యూహెచ్‌ అనే కొత్త స్కూటర్‌ ను విడుదల చేసింది. దీని ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. ఇందులో కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్‌ సెల్‌ టెక్నాలజీని వినియోగించింది. ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఇందులో 11 కేడబ్ల్యూ మిడ్‌–డ్రైవ్‌ మోటార్, ఇంటిగ్రేటెడ్‌ మోటార్‌ కంట్రోల్‌ యూనిట్‌ (ఎంసీయూ) ఉన్నాయి. దీని గరిష్టం వేగం 125 కి.మీ. ఇందులో బ్రేక్‌–బై–వైర్‌ టెక్నాలజీతో పాటు ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌లు ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగంలో మెరుగైన కంట్రోల్, భద్రతను అందిస్తాయి. ప్రీమియం మోడల్స్‌లో మాత్రమే ఉన్న అడ్వాన్స్‌ టెక్నాలజీని ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఓలా ప్రతినిధి చెప్పారు.

Ola S1 X Plus 5 2 kWh With 4680 Bharat Cells Launched At Rs 1 30 Lakh4
ఓలా కొత్త స్కూటర్ లాంచ్.. 320 కిమీ రేంజ్!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో పనిచేసే S1 X+ 5.2 kWhను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన కొత్త టూవీలర్ ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). అయితే ఈ ధర 2026 ఏప్రిల్ 15 తరువాత పెరగనుంది. 4680 భారత్ సెల్ ప్రత్యేకత ఏమిటంటే, ఓలా తన సొంత సెల్ టెక్నాలజీని సామాన్య ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తోంది.తమ సొంత సెల్ టెక్నాలజీతో.. ఎక్కువ రేంజ్ అందించే ఈవీ స్కూటర్లను మార్కెట్‌కు అందుబాటులోకి తీసుకురావచ్చని సంస్థ చెబుతోంది. ఓలా ఎస్1 ఎక్స్+ ఇంటిగ్రేటెడ్ ఎంసీయూతో కూడిన 11 కిలోవాట్ల మిడ్-డ్రైవ్ మోటార్‌తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. ఇందులో బ్రేక్-బై-వైర్, ఫ్రంట్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. 5.2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ ఒకే ఛార్జ్‌పై 320 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది.Big launch! S1 X+ 5.2 kWh powered by our 4680 Bharat Cell. 320 km range for just ₹1,29,999 - offer ends 15th April!Taking 4680 cells to the mass market and resetting range expectations for every Indian. While others push overpriced low-range scooters, only Ola can do this!… pic.twitter.com/EEwZObETBn— Bhavish Aggarwal (@bhash) April 13, 2026

Gold Falls as Strong Dollar Gains Amid US Iran Tensions5
వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!

పెరుగుదల దిశగా అడుగులు వేసిన గోల్డ్ రేటు ఈ రోజు (సోమవారం) తగ్గుదల వైపు పయనించింది. దీంతో బంగారం ధర కొంతమేర తగ్గింది. దీనికి కారణం యూఎస్ డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు అని తెలుస్తోంది. అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడం కూడా బంగారం ధరలు పెరుగుదలకు మరో కారణం అయింది.శాంతి చర్చలు విఫలమైన తర్వాత, ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా - ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఈ సంఘటనల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్లు దాటాయి.చమురు ధరలు పెరగడం అంటే రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం. దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్, వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇష్టపడవు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులు తగ్గుతాయి. అందువల్ల బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉంది.2026 ప్రారంభంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే కియోసాకి వంటి విశ్లేషకులు గోల్డ్ రేటు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడి పెడితే ధనవంతులవుతారని చెబుతున్నారు.

RBI rejects Ujjivan Universal Bank application Loan Portfolio Imbalance6
ఉజ్జీవన్ బ్యాంక్ దరఖాస్తు తిరస్కరించిన ఆర్‌బీఐ

మైక్రోఫైనాన్స్ రంగం నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్‌ వైపు అడుగులు వేస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం బ్యాంక్ సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది. రుణాల పంపిణీలో మరింత వైవిధ్యం అవసరమని పేర్కొంటూ కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.ఆర్‌బీఐ అభ్యంతరం ఏమిటి?స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఉజ్జీవన్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, బ్యాంక్ లోన్ పోర్ట్‌ఫోలియోపై ఆర్‌బీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉజ్జీవన్ రుణాలు ఎక్కువగా ఒకే రకమైన విభాగాలకు (ప్రధానంగా అన్ సెక్యూర్డ్ మైక్రో లోన్స్) పరిమితమై ఉన్నాయి. రుణాలను వైవిధ్యపరచడానికి బ్యాంక్ ఇటీవల చేసిన ప్రయత్నాలను ఆర్‌బీఐ గుర్తించినప్పటికీ ఒక యూనివర్సల్ బ్యాంక్‌కు ఉండాల్సిన సమతుల్య లోన్‌ బుక్‌ ఇంకా సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో రుణాల పంపిణీని మరింత విస్తృతం చేసిన తర్వాతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌బీఐ సలహా ఇచ్చింది.యూనివర్సల్ బ్యాంక్ హోదా ఎందుకు ముఖ్యం?స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాయి నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే బ్యాంకుకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అందులో.. చిన్న రుణాలు, తక్కువ సేవలందించే విభాగాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలను అందించవచ్చు. ప్రాధాన్యత రంగ రుణ నిబంధనల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడంతో పాటు తక్కువ వడ్డీ రేటుకే నిధులను సేకరించడానికి దోహదపడుతుంది.ఇదీ చదవండి: ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకా దళాలు

Advertisement
Advertisement
Advertisement