Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

French prosecutors raided Elon Musk X in Paris check details1
తీవ్ర నేరారోపణలు.. సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ సోదాలు

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఎక్స్ కార్యాలయాలపై ఆ దేశ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధమైన డేటా వెలికితీత, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు ఎక్స్ యాజమాన్యం ధ్రువీకరించింది.దర్యాప్తు నేపథ్యం..ఈ వివాదం 2025 జనవరిలో ప్రారంభమైంది. ఎక్స్ ప్లాట్‌ఫామ్ తన యూజర్లకు సిఫార్సు చేసే అల్గారిథమ్‌ ఆధారిత కంటెంట్‌పై పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తు క్రమంగా ఎక్స్ వివాదాస్పద ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ వరకు విస్తరించింది. అయితే, ఈ చర్యలను ఎక్స్ తీవ్రంగా ఖండించింది. జులై 2025లో స్పందిస్తూ.. ఈ విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమని, తమ అల్గారిథమ్‌ను తారుమారు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.ఎక్స్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలుపిల్లల అశ్లీల చిత్రాలను కలిగి ఉండటం. వాటిని ఇతరులతో పంచుకోవడంలో ప్లాట్‌ఫామ్ ప్రమేయం ఉండటం.అనుమతి లేకుండా మహిళల లైంగికపరమైన డీప్‌ఫేక్‌(రియల్‌ ఇమేజ్‌లను తలపించేలా ఏఐ ద్వారా సృష్టించే చిత్రాలు) చిత్రాలను సృష్టించడం ద్వారా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం.వ్యవస్థీకృత సమూహాల ద్వారా మోసపూరిత పద్ధతుల్లో డేటాను సేకరించడం.ముఖ్యంగా గ్రోక్ చాట్‌బాట్ మహిళల అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై యూరోపియన్ కమిషన్, యూకే రెగ్యులేటర్లు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి.ఎక్స్‌ను ఉపయోగించబోం..విచారణ తీవ్రతరం కావడంతో పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఇకపై ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించబోమని, అధికారిక సమాచారం కోసం లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తామని ప్రకటించింది.గతంలో టెలిగ్రామ్‌పై చర్యలుటెక్ దిగ్గజాలపై ఫ్రాన్స్ కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో కంటెంట్ మోడరేషన్ లోపాలపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్‌ఫామ్ కార్యకలాపాల్లో మార్పులు చేసిన తర్వాతే గత మార్చిలో ఆయనను దేశం విడిచి వెళ్లడానికి అనుమతించారు. ప్రస్తుతం ఎక్స్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం సోషల్ మీడియా నియంత్రణల విషయంలో ఐరోపా దేశాల కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Sam Altman testing Codex app for Mac he felt little useless know the reason2
ఏఐ సృష్టికర్తకే తప్పని అభద్రతా భావం

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఓపెన్‌ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మాన్ తన సొంత ఉత్పత్తిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. యాపిల్ కంప్యూటర్ల (మ్యాక్‌) కోసం ఓపెన్‌ఏఐ కొత్తగా ‘కోడెక్స్’ స్టాండలోన్ యాప్‌ను విడుదల చేసిన తరుణంలో ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఇటీవల కోడెక్స్ టూల్‌ను ఉపయోగించి ఆల్ట్‌మాన్ స్వయంగా ఒక అప్లికేషన్‌ను రూపొందించారు. ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని మార్పుల కోసం ఏఐని సలహాలు అడగగా అది ఇచ్చిన ఐడియాలు ఆయన ఊహించిన దానికంటే అద్భుతంగా ఉన్నాయట. ఈ విషయాన్ని ఎక్స్‌(గతంలో ట్విట్టర్)లో పేర్కొంటూ.. ‘ఏఐ ఇచ్చిన ఐడియాలు చూసిన సమయంలో నేను కొంచెం పనికిరాని వాడినని (Useless) భావించాను. అది నన్ను కొంత విచారానికి గురిచేసింది’ అని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. ఒక ఏఐ సృష్టికర్త తాను చేసిన యాప్‌ ఇచ్చిన సమాధానం చూసి అభద్రతకు లోనవ్వడం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.కోడెక్స్ మాక్ యాప్ఓపెన్‌ఏఐ విడుదల చేసిన ఈ కొత్త మాక్ యాప్ డెవలపర్ల పనితీరును పూర్తిగా మార్చేయనుంది. దీని ప్రత్యేకతలు గమనిస్తే.. ఒకేసారి ఒక చాట్‌బాట్‌తో కాకుండా సమాంతరంగా ఒకటి కంటే ఎక్కువ ఏఐ ఏజెంట్లతో పని చేయవచ్చు. కోడింగ్ కష్టాలను తగ్గించి డెవలపర్లు తమ ఆలోచనలను సులభంగా అమలు చేసేలా ఈ యాప్ రూపొందించినట్లు చెప్పారు. ఈ ఏఐ ఏజెంట్లు కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా వినియోగదారు తరఫున కోడ్ రాయడం, దాన్ని మెరుగుపరచడం, ఇమేజ్ జనరేషన్ వంటి పనులను కూడా చేయగలవు.మార్కెట్‌లో పెరుగుతున్న పోటీగత నెలలో దాదాపు ఒక మిలియన్ మంది డెవలపర్లు కోడెక్స్‌ను ఉపయోగించినట్లు ఓపెన్‌ఏఐ వెల్లడించింది. ఆంత్రోపిక్, కర్సర్ వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో యాపిల్ వినియోగదారుల కోసం ఈ ప్రత్యేక యాప్‌ను తీసుకురావడం వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోంది.వినియోగదారులకు బంపర్ ఆఫర్ప్రస్తుతం కోడెక్స్ సేవలు ఓపెన్‌ఏఐ ప్లస్, ప్రో, ఎంటర్‌ప్రైజ్ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నవారికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కొత్త యాప్ విడుదల సందర్భంగా ఉచిత వినియోగదారులకు కూడా పరిమిత కాలం పాటు కోడెక్స్ యాక్సెస్‌ను కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే ఇప్పటికే ఉన్న పెయిడ్ యూజర్లకు రేట్ లిమిట్స్ రెట్టింపు చేసింది.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

gold and silver rates on 04 February 2026 in Telugu states3
ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 04 February 20264
స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,780 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 85 ఎగబాకి 83,819 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.35బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 67.7 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.84 శాతం తగ్గింది.నాస్‌డాక్‌ 1.43 శాతం నష్టపోయింది.Today Nifty position 04-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Bharat VISTAAR announced Union Budget 2026 AI powered platform5
‘భారత్-విస్తార్‌’తో డిజిటల్ అండ!

భారతీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడివిడిగా ఉన్న వ్యవసాయ పరిశోధనలను, డేటాను ఏకీకృతం చేస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రైతులకు నేరుగా సలహాలు అందించేలా ‘భారత్-విస్తార్‌’ అనే సరికొత్త డిజిటల్ వ్యవస్థను రూపొందించింది. అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్‌) ప్యాకేజీలను ఏఐ సిస్టమ్‌లతో అనుసంధానించడం ద్వారా సాగును మరింత లాభసాటిగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.ఏఐ టూల్‌ ఎందుకు?ప్రస్తుతం మన దేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్‌లు విత్తన అభివృద్ధి నుంచి సప్లై చైన్ వరకు వేర్వేరు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. అయితే ఈ సమాచారం అంతా ఒకే చోట లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు అందడం లేదు. భారత్-విస్తార్‌ ద్వారా ఈ వనరులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తారు. అగ్రిటెక్ స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు ఉత్పత్తి చేసే భారీ డేటాను ఏఐ విశ్లేషించి రైతులకు అర్థమయ్యేలా వివరిస్తుంది.రైతులకు చేకూరే ప్రయోజనాలుదీని ద్వారా సాధారణ సమాచారం కంటే నిర్దిష్టమైన, ధ్రువీకరించిన శాస్త్రీయ సలహాలు రైతులకు అందనున్నాయి.ఐకార్‌ శాస్త్రీయ పరిశోధనలను నేరుగా డిజిటల్ రికార్డులతో అనుసంధానించడం ద్వారా పొలంలోని పరిస్థితిని బట్టి సలహాలు అందుతాయి.సంక్లిష్టమైన శాస్త్రీయ డేటాను రైతులకు వారి స్థానిక భాషల్లోనే సులువుగా అర్థమయ్యేలా ఈ ఏఐ టూల్‌ సర్వీసులు అందిస్తుంది.కరువు, వరదలు లేదా తెగుళ్ల దాడుల గురించి అగ్రిస్టాక్ ద్వారా ముందస్తుగా హెచ్చరికలు అందుతాయి.ఇది కేవలం సమాచారానికే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాల అమలు, రుణాలు అందజేయడం, బీమా సేవలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యంఈ వ్యవస్థ కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదు. యూనిఫైడ్ ఫార్మర్ సర్వీస్ ఇంటర్ ఫేస్ (యూఎఫ్‌ఎస్‌ఐ), ఏపీఐల ద్వారా ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం కావచ్చు. దీనివల్ల మార్కెట్ కనెక్షన్లు మెరుగుపడటమే కాకుండా రైతులకు మరిన్ని వినూత్నమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.డేటా భద్రతకు ప్రాధాన్యంరైతుల డేటా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. డేటాపై పూర్తి హక్కు రైతుకే ఉంటుంది. ఐటీ చట్టం, ఆధార్ చట్టం ప్రకారం ఈ సమాచారం భద్రంగా ఉంటుంది. ఏదైనా ప్రైవేట్ సంస్థ రైతు డేటాను యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా ఆ రైతు నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు

Indian stock markets rallies Experts opinion on momentum nifty sensex6
మార్కెట్‌లో ర్యాలీ.. ఇప్పుడేం చేయాలంటే..

భారత స్టాక్ మార్కెట్లు ఫిబ్రవరి 3, 2026 నాటి ట్రేడింగ్ సెషన్‌లో భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్కరోజులోనే సుమారు రూ.12.5 లక్షల కోట్లకు పైగా పెరగడం విశేషం. ఈ భారీ ర్యాలీకి దారితీసిన కారణాలు, రాబోయే రోజుల్లో మదుపర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.సెన్సెక్స్, నిఫ్టీ భారీ జంప్మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,072.67 పాయింట్లు (2.54%) పెరిగి 83,739.13 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 629.75 పాయింట్లు (2.51%) లాభంతో 25,718.15 వద్ద ముగిసింది.మార్కెట్ ర్యాలీకి కారణాలుభారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ప్రకటించిన ట్రేడ్ డీల్ ఈ భారీ ర్యాలీకి కీలకంగా నిలిచింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో గతంలో విధించిన 25% అదనపు పెనాల్టీ సుంకాలను అమెరికా పూర్తిగా ఎత్తివేసింది. అలాగే భారత ఉత్పత్తులపై ప్రాథమిక సుంకాలను 25% నుంచి 18%కి తగ్గించడం ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్ వంటి ఎగుమతి రంగాలకు పెద్ద ఊరటనిచ్చింది.ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావం.. భారత్-అమెరికా డీల్ వార్తలతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. జపాన్ నిక్కీ (Nikkei 225) 2.44%, దక్షిణ కొరియా కోస్పి (Kospi) 5% వరకు పెరగడం భారత మార్కెట్లకు సానుకూల సంకేతాలను ఇచ్చింది.బడ్జెట్ అనంతరం స్పష్టత.. కేంద్ర బడ్జెట్ 2026లో ఎఫ్‌అండ్‌ఓపై ఎస్‌టీటీ పెంపు వంటి అంశాల వల్ల ఏర్పడిన అనిశ్చితిని ఈ వాణిజ్య ఒప్పందం వార్తలు మరుగునపడేశాయి. పెట్టుబడిదారులు తిరిగి దేశీయ మార్కెట్లపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.లాభాల స్వీకరణకు అవకాశం ఉందా?మార్కెట్లు భారీగా పెరిగినప్పుడు సహజంగానే మదుపర్లు గరిష్ఠ స్థాయిల వద్ద లాభాలను స్వీకరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్వల్పకాలంలో మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనవ్వొచ్చు. ఫిబ్రవరి 3 నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ మార్కెట్‌ ప్రారంభంలో వెళ్లిన గరిష్ఠాల నుంచి కొంత మేర తగ్గడం దీనికి సంకేతంగా చూడవచ్చు.ఇన్వెస్టర్లు పాటించాల్సిన జాగ్రత్తలుమార్కెట్ గరిష్ఠాల వద్ద ఉన్నప్పుడు గుడ్డిగా పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. నిపుణుల సూచనల ప్రకారం కింది జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక్కసారిగా పెట్టుబడి పెట్టవద్దు.. మార్కెట్ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో కాకుండా క్రమానుగతంగా పెట్టుబడులను కొనసాగించడం మంచిది.నాణ్యమైన షేర్లకే ప్రాధాన్యత.. అమెరికా సుంకాల తగ్గింపు వల్ల లాభపడే ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్, కెమికల్ రంగాల్లోని నాణ్యమైన కంపెనీలను ఎంచుకోండి.స్టాప్ లాస్ తప్పనిసరి.. స్వల్పకాలిక ట్రేడర్లు మార్కెట్ అస్థిరతను దృష్టిలో ఉంచుకుని కచ్చితమైన స్టాప్ లాస్ పాటించడం అవసరం.పోర్ట్‌ఫోలియో రీ-బ్యాలెన్సింగ్.. ఇప్పటికే మంచి లాభాల్లో ఉన్న షేర్లలో కొంత మేర లాభాలను స్వీకరించి నగదును సిద్ధంగా ఉంచుకోవడం వల్ల మార్కెట్ తగ్గితే తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు

Advertisement
Advertisement
Advertisement