Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

FDA moving toward stricter rules on gluten labeling in packaged foods1
ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల్లో ‘గ్లూటెన్’ గుర్తింపు

ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల తయారీలో పారదర్శకత పెంచే దిశగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) కీలక అడుగు వేసింది. గ్లూటెన్‌తో సీలియాక్ వ్యాధి(గ్లూటెన్ తీసుకున్నప్పుడు శరీరంలోని రోగనిరోధక శక్తి పొరపాటున చిన్న పేగులపై దాడి చేస్తుంది) వస్తున్నందున కోట్లాది మంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకుంది. గ్లూటెన్ కలిగిన ధాన్యాల లేబెలింగ్, ‘క్రాస్-కాంటాక్ట్’(ఇతర ధాన్యాలతో కలయిక ) నివారణపై సమగ్ర సమాచారాన్ని కోరుతూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.లేబెలింగ్‌లో పారదర్శకతే లక్ష్యంప్రస్తుతం అనేక ఆహార ఉత్పత్తుల్లో గోధుమలతో పాటు రై (rye), బార్లీ (barley) వంటి ధాన్యాలను ఉపయోగిస్తున్నారు. అయితే, వీటిని ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల సీలియాక్ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు ఎఫ్‌డీఏ కొ​న్ని అంశాలపై దృష్టి సారించింది. రై, బార్లీ కలిగిన ఉత్పత్తుల లేబెలింగ్ విధానాన్ని తీసుకురావాలని తెలిపింది. ఓట్స్ సహజంగా గ్లూటెన్ రహితమైనప్పటికీ ఇతర ధాన్యాలతో కలయిక(క్రాస్‌ కాంటాక్ట్‌) వల్ల వాటిలో గ్లూటెన్ చేరే అవకాశం ఉంది. దీనిపై స్పష్టమైన డేటాను సేకరిస్తోంది. ఈ ధాన్యాల వల్ల కలుగుతున్న ప్రతికూల ఆరోగ్య పరిస్థితులు, అలర్జీల తీవ్రతను అంచనా వేయనుంది.ఈ సందర్భంగా ఎఫ్‌డీఏ కమిషనర్ మార్టీ మకరీ మాట్లాడుతూ ‘సీలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారు తాము తినే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా సందర్భాల్లో కచ్చితమైన సమాచారం లేక వారు ఆహారం తీసుకునే విషయంలో కేవలం అంచనాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.డేటా లోపాలపై దృష్టిఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) నివేదికలు, కొంతమంది ప్రజల నుంచి అందిన పిటిషన్లను సమీక్షించిన ఎఫ్‌డీఏ ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాలో కొన్ని అంశాలను గుర్తించింది. ఆహార పదార్థాల్లో రై లేదా బార్లీ ఉన్నప్పటికీ వాటి వివరాలు వెల్లడించట్లేదు. దీనివల్ల ‘ఇమ్యూనోగ్లోబులిన్-E’ (IgE) ఆధారిత ఆహార అలర్జీల తీవ్రత పెరుగుతోంది. క్రాస్-కాంటాక్ట్ వల్ల ఓట్స్‌లో గ్లూటెన్ పరిమాణం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోబోయే కఠిన నియంత్రణ చర్యలకు ఈ సమాచార సేకరణ పునాదిగా మారుతుందని, తద్వారా వినియోగదారులకు మరింత సురక్షితమైన ఆహారం లభింస్తుందని సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: ఇకపై సిల్వర్‌ రీసైక్లింగ్‌

Key Highlights of MMTC-PAMP Silver Recycling Initiative2
ఇకపై సిల్వర్‌ రీసైక్లింగ్‌

ఎంఎంటీసీ–పీఏఎంపీ వెండి రీసైక్లింగ్‌ (పునర్‌వినియోగానికి అనుకూలంగా మార్చే) వ్యాపారంలోకి అడుగుపెట్టే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌ సరఫరాపరంగా తీవ్ర కొరతకు దారితీసే పరిస్థితులు ఉన్నందున వచ్చే మూడు నెలల్లో తన స్టోర్లలో ప్రయోగాత్మకంగా వెండి రీసైక్లింగ్‌ను మొదలుపెట్టనున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సమిత్‌ గుహ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సరఫరా పెరిగే పరిస్థితుల్లేవని, ఈ క్రమంలో రీసైక్లింగ్‌ వ్యాపారం అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే డిమాండ్‌ ఇక ముందూ కొనసాగితే అప్పుడు శుద్ధి చేసిన వెండి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. భారతీయుల వద్ద 25,000 టన్నుల బంగారం, ఇంతకు పది రెట్లు వెండి ఉన్నందున రీసైక్లింగ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఎంఎంటీసీ–పీఏఎంపీ బంగారం రీసైక్లింగ్‌కు 20 స్టోర్లను నిర్వహిస్తోందని, వీటిని వెండి రీసైక్లింగ్‌కు వీలుగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందన్నారు.వచ్చే ఐదేళ్లలో స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్టు తెలిపారు. రీసైక్లింగ్‌కు అదనంగా.. దక్షిణ, తూర్పు భారత్‌లో మింటింగ్‌ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నట్టు సమిత్‌ గుహ చెప్పారు. మింటింగ్‌ సామర్థ్యాన్ని 2.4 మిలియన్‌ కాయిన్ల నుంచి 3.6 మిలియన్ల కాయిన్లకు పెంచుకోనున్నట్టు ప్రకటించారు. తన పోర్టల్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర ప్లాట్‌ఫామ్‌లపై బంగారం, వెండి కాయిన్ల విక్రయాలను పెంచుకోనున్నట్టు తెలిపారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

Renault Duster makes a comeback in India3
రెనో డస్టర్‌ రీఎంట్రీ

న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్‌ రంగంలోని ఎస్‌యూవీ విభాగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘రెనో డస్టర్‌’ మళ్లీ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచి్చంది. వేగంగా విస్తరిస్తున్న మిడ్‌–సైజ్‌ ఎస్‌యూవీ విభాగం దేశీయ కస్టమర్ల ఆసక్తిని తెలియజేస్తోంది. అలాంటి అత్యంత పోటీ ఉన్న విభాగంలోకి డస్టర్‌తో మళ్లీ అడుగుపెట్టడం ద్వారా రెనో తన పోటీ సంస్థలకు గట్టి సవాలు విసిరేందుకు సిద్ధమైంది. పెట్రోల్‌ ఇంజిన్‌తో వచి్చన 2026 డస్టర్‌ ఎస్‌యూవీ మోడల్, ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కస్టమర్లు రూ.21,000 చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఏడేళ్ల లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా సియెర్రా, హ్యుందాయ్‌ క్రెటా, మారుతీ గ్రాండ్‌ విటారా, కియా సెల్టాస్‌ వంటి కార్లతో ఇది పోటీ పడనుంది. లాంచింగ్‌ సందర్భంగా రెనో గ్రూప్‌ సీఈవో ఫాబ్రిస్‌ కాంబోలివ్‌ మాట్లాడుతూ ... ‘‘2022లో ఉత్పత్తి నిలిపివేసిన డస్టర్‌ను తిరిగి భారతీయ మార్కెట్లోకి తీసుకురావడం సంతోషంగా ఉంది. తద్వారా వృద్ధిపరంగా కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నాము. యూరప్‌ వెలుపల రెనోకు భారత్‌ కీలక మార్కెట్‌. చెన్నై తయారీ ప్లాంట్‌ను పూర్తిగా సొంతం చేసుకోవడం రెనోకు వ్యూహాత్మక బలాన్ని చేకూర్చింది’’ అన్నారు.

12 more companies to enter the IPO street, sebi green signal4
లిస్టింగ్‌కు 12 కంపెనీలు రెడీ

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రా.మార్కెట్‌ మాతృ సంస్థ హెల్లా ఇన్‌ఫ్రా మార్కెట్, పర్పుల్‌ స్టయిల్‌ ల్యాబ్స్‌ సహా 12 కంపెనీల ప్రతిపాదిత ఐపీవోలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ జాబితాలో జై జగదంబ లిమిటెడ్, యూకేబీ ఎల్రక్టానిక్స్, సీఎంఆర్‌ గ్రీన్‌ టెక్నాలజీస్, ట్రాన్స్‌లైన్‌ టెక్నాలజీస్, మెడిక్యాప్‌ హెల్త్‌కేర్, ఓస్వాల్‌ కేబుల్స్, బీవీజీ ఇండియా, సాయి పేరెంటరల్స్, కామ్టెల్‌ నెట్‌వర్క్స్, సిఫీ ఇని్ఫనిట్‌ స్పేసెస్‌ ఉన్నాయి. గతేడాది జూన్‌–అక్టోబర్‌ మధ్య ఈ 12 కంపెనీలు తమ ముసాయిదా ఐపీవో పత్రాలను సెబీకి దాఖలు చేశాయి. వివరాలు.. → నిర్మాణ రంగ మెటీరియల్స్‌ సరఫరా కంపెనీ ఇన్‌ఫ్రా.మార్కెట్‌ ప్రతిపాదిత ఐపీవో ద్వారా రూ. 4,500 కోట్ల నుంచి రూ. 5,550 కోట్ల వరకు సమీకరించనుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. కాన్ఫిడెన్షియల్‌ ప్రీ–ఫైలింగ్‌ విధానంలో కంపెనీ దరఖాస్తు చేసింది. షేర్ల జారీ, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ఇష్యూ ఉండనుంది. కంపెనీలో టైగర్‌ గ్లోబల్‌ పెట్టుబడులు పెట్టింది. ళీ సిఫీ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ సిఫీ ఇని్ఫనిట్‌ స్పేసెస్‌ ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 2,500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 1,200 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నారు. ళీ లగ్జరీ ఫ్యాషన్‌ ప్లాట్‌ఫాం పెర్నియాస్‌ పాప్‌ అప్‌ షాప్‌ మాతృ సంస్థ పర్పుల్‌ స్టయిల్‌ ల్యాబ్స్‌ తాజా షేర్ల జారీతో పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 660 కోట్లు సమీకరించనుంది. → వీడియో సరై్వలెన్స్, బయోమెట్రిక్‌ సొల్యూషన్స్‌ సంస్థ ట్రాన్స్‌లైన్‌ టెక్నాలజీస్‌ తలపెట్టిన పబ్లిక్‌ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు, ఒక షేర్‌హోల్డరు 1.62 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ళీ ఎల్రక్టానిక్స్‌ తయారీ సరీ్వసులందించే నోయిడా సంస్థ యూకేబీ ఎల్రక్టానిక్స్‌ తమ పబ్లిక్‌ ఇష్యూ కింద రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనుంది. → నాన్‌–ఫెర్రస్‌ మెటల్‌ రీసైక్లింగ్‌ సేవల సంస్థ సీఎంఆర్‌ గ్రీన్‌ టెక్నాలజీస్‌ ప్రతిపాదిత ఐపీవో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో ఉండనుంది. 4.28 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. → ఓస్వాల్‌ కేబుల్స్‌ తాజా షేర్ల జారీ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించనుంది. అలాగే 2.22 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయించనుంది. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు, రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించుకోనుంది. ళీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సేవల సంస్థ బీవీజీ ఇండియా ప్రతిపాదిత ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్లకు పైగా విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రస్తుత షేర్‌హోల్డర్లు 2.85 కోట్ల వరకు షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో విక్రయించనున్నారు. → కామ్‌టెల్‌ నెట్‌వర్క్స్‌ ఐపీవో ద్వారా రూ. 900 కోట్లు సమీకరించనుంది. షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఓఎఫ్‌ఎస్‌ రూపంలో రూ. 750 కోట్లు సమకూర్చుకోనుంది. ఫ్రెష్‌ ఇష్యూ నిధులను ప్రధానంగా రుణాల చెల్లింపునకు ఉపయోగించుకోనుంది. కంపెనీ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ చేయనున్నారు.

Many expectations on Finance Minister Nirmala Sitharaman budget 20265
సంస్కరణల బాటా...సుంకాల మోతా..?

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన తొమ్మిదవ బడ్జెట్‌ను (2026–27 ఆర్థిక సంవత్సరం) వచ్చే నెల (ఫిబ్రవరి) 1న పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. గతేడాది జీఎస్‌టీలో శ్లాబులను క్రమబద్ధీకరించడం ద్వారా వినియోగానికి ఊతమిచి్చనట్టుగానే.. కస్టమ్స్‌ సుంకాల్లోనూ ఇదే మాదిరి సంస్కరణ ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగి, వాణిజ్య అనిశి్చతులు నెలకొన్న తరుణంలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలను ప్రకటించొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. జీడీపీలో రుణ నిష్పత్తిని తగ్గించే మార్గ సూచీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ద్రవ్యలోటు నిర్వహణకు పరిమితం కాకుండా, రుణ భారాన్ని తగ్గించుకోవడంపై కేంద్ర సర్కారు ఇటీవలి కాలంలో దృష్టి సారించడం తెలిసిందే. ముఖ్య అంచనాలు.. → ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుంది. పాత, కొత్త ఆదాయపన్ను విధానాల్లో స్టాండర్డ్‌ డిడక్షన్‌ అమల్లో ఉంది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షలకు మించని ఆదాయంపై పన్ను మినహాయింపును గత బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు కొత్త పన్ను విధానంలోకి మరింత మందిని తీసుకొచ్చే విధంగా ప్రోత్సాహానికి స్టాండర్డ్‌ డిడక్షన్‌ను పెంచాలన్న డిమాండ్‌ ఉంది. → టీడీఎస్‌ శ్లాబులను తగ్గించొచ్చన్న అంచనా ఉంది. కస్టమ్స్‌ వివాదాల రూపంలో చిక్కుకుపోయిన రూ.1.53 లక్షల కోట్ల విడుదలకు వీలుగా క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించొచ్చు. అలాగే, నిబంధనల అమలును సులభతరం చేయాలని పరిశ్రమ డిమాండ్‌ చేస్తోంది. → రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించొచ్చు. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో రక్షణ రంగానికి ఈ విడత మరిన్ని కేటాయింపులు చేయొచ్చు. → వీబీజీ రామ్‌జీ పథకం కింద వ్యయాలను కేంద్రం, రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిలో పంచుకోవచ్చు. → 2026 జనవరి 1 నుంచి 8వ పే కమిషన్‌ అమలుకు వీలుగా కేటాయింపులు చేయొచ్చు. → 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాలకు పన్నుల పంపిణీ. → టారిఫ్‌ల కారణంగా ప్రభావితమవుతున్న రత్నాభరణాలు, వస్త్రాలు, లెదర్‌ పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ప్రకటించొచ్చు. → లిథియం, కోబాల్ట్‌ తదితర అరుదైన ఖనిజాల అన్వేషణకు నిధుల మద్దతును ప్రకటించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.

India EU trade deal finalised says commerce secy6
భారత్‌-ఈయూ వాణిజ్య ఒప్పందం ఖరారు

భారత్‌-ఈయూ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. భారత్‌–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సాగిన చర్చలు విజయవంతంగా ముగిశాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని జనవరి 27న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇది “సమతుల్యమైనదీ, ముందుచూపుతో కూడినదీ” అని పేర్కొన్న ఆయన, ఈయూతో భారతదేశ ఆర్థిక ఏకీకరణను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ఈ ఒప్పందం వచ్చే ఏడాది ఏదో ఒక సమయంలో అమల్లోకి వచ్చే అవకాశముందని అగర్వాల్ తెలిపారు. ఒప్పంద పాఠ్యానికి సంబంధించిన చట్టపరమైన పరిశీలన (లీగల్ స్క్రబ్బింగ్)కు సుమారు 5–6 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత అధికారికంగా సంతకాలు జరుగుతాయని చెప్పారు. “చర్చలు పూర్తయ్యాయి. ఒప్పందం ఖరారైంది. ఇది రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది” అని ఆయన అన్నారు.కాగా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సోమవారం జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Advertisement
Advertisement
Advertisement