Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

PSBs are on track to post record combined profits exceeding 2 lakh cr1
రికార్డు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు

భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) అద్భుతమైన ఆర్థిక ప్రగతితో పటిష్టంగా ఉన్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటుతుందని ఆయన అంచనా వేశారు.ఆర్థిక బలం - వృద్ధి గణాంకాలుతాజాగా ఓ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బ్యాంకింగ్ రంగ వృద్ధిని విశ్లేషించారు. ‘ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతంగా నమోదైంది. డిపాజిట్ల వృద్ధి కూడా 10 శాతం వద్ద ఆశాజనకంగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు ఉన్న లాభం, 2023-24లో రూ.1.41 లక్షల కోట్లకు, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే దాదాపు రూ. 1 లక్షల కోట్లు లాభాన్ని బ్యాంకులు ఆర్జించాయి’ అన్నారు.‘ఆర్‌బీఐ పటిష్టమైన పర్యవేక్షణలో మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా సురక్షితంగా ఉంది. అంతర్జాతీయ అంశాలు మన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందడం లేదు’ అని నాగరాజు పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

Speed is Important For The Car to Give More Mileage2
కారు మైలేజ్‌ కోసం.. ముఖ్యం ఈ వేగం!

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఎంత మైలేజ్ ఇచ్చే కారును కొనుగోలు చేసినప్పటికీ.. కొన్ని రోజుల తరువాత తగ్గిపోతుంటుంది. మైలేజ్ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నపటికీ.. ఒక నిర్దిష్టమైన వేగం, డ్రైవింగ్ విధానం ఫాలో అయితే బెస్ట్ మైలేజ్ లభిస్తుంది.సాధారణంగా కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే స్థిరమైన వేగంలో డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కారును 50 నుంచి 80 కిమీ వేగంతో నడిపితే ఇంధనం కొంత పొదుపు అవుతుంది, తద్వారా కొంత ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ఇంజిన్ మీద ఎక్కువ ప్రభావం చూపించదు. కాబట్టి ఇంధన వృథా తగ్గుతుంది.కారును 100 కిమీ వేగంతో డ్రైవ్ చేస్తే.. ఎయిర్ డ్రాగ్ ఎక్కువ అవుతుంది. దీంతో ఇంజిన్ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. తద్వారా.. మైలేజ్ కొంత ఎక్కువ లభిస్తుంది. అయితే చాలా నెమ్మదిగా లేదా తక్కువ గేర్‌లో కారును నడపడం కూడా మంచిది కాదు. అలా చేస్తే ఇంజిన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది.స్థిరమైన వేగం మైలేజ్‌కు చాలా ముఖ్యం. తరచూ స్పీడ్ పెంచడం, తగ్గించడం వంటివి ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. కాబట్టి ఒకే స్పీడ్‌ను కొనసాగిస్తూ డ్రైవ్ చేయడం మంచిది. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో 60-70 కిలోమీటర్ల వేగం చాలా కార్లకు ఉత్తమ మైలేజ్ ఇస్తుంది.ఎక్కువ మైలేజ్ కోసం కేవలం వేగాన్ని మాత్రమే కాకుండా.. టైర్లలో కూడా ఉండాల్సిన మోతాదులో గాలి ఉండేలా చూసుకోవాలి. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బరువు వేయకపోవడం ఉత్తమం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఇంజిన్ ఆన్‌లో ఉంచకూడదు.

Post Office RD Scheme Deposit RS 5000 Monthly and Get RS 8 Lakh in 10 Years3
నెలకు రూ. 5వేలుతో.. రూ. 8లక్షలు చేతికి!

ఎంత డబ్బు సంపాదించే వారికైనా పొదుపు చేయడం తప్పనిసరి. ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా.. దుబారా ఖర్చు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పెట్టుబడికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో కొంత రిస్క్ కూడా ఉంటుంది. అయితే రిస్క్ లేకుండా.. ప్రభుత్వ హామీతో సురక్షితమైన లాభం ఆశించేవారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఓ మంచి ఎంపిక అవుతుంది.నెలకు రూ.5000 చొప్పున పోస్టాఫీస్ రికరింగ్ ఖాతాలో జమ చేస్తూ.. ఐదేళ్లు ఇన్వెస్ట్ చేయలి. ఇలా చేసుకుంటూ పోతే.. మీ పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ప్రభుత్వం దీనికి 6.7 శాతం వార్షిక వడ్డీ ఇస్తుంది. ఐదేళ్ల కాలం మీరు చేసిన డబ్బుకు మొత్తం రూ. 3,56,830 లభిస్తుంది.దీనిని మీరు పదేళ్లు పొడిగించుకుంటే.. మొత్తం పెట్టుబడి రూ. 6,00,000 (5000 x 120 నెలలు). దీనికి 6.7 శాతం వడ్డీ అనుకుంటే రూ. 2,54,272 వస్తుంది. వడ్డీ, అసలు కలిపితే మొత్తం రూ. 8,54,272 అవుతుంది.నిజానికి ఒక సాధారణ వ్యక్తికి లేదా ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి ఈ పోస్టాఫీస్ రికరింగ్ స్కీమ్ బెస్ట్ అనే చెప్పాలి. పిల్లల చదువుకు, పెళ్లి వంటి అవసరాలకు ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా

Union Minister rejected claims India conceded ground in the trade deal4
‘అమెరికాకు భారత్‌ తలొగ్గలేదు’

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. 18 శాతం సుంకానికి అంగీకరించడం ద్వారా భారత్ అమెరికాకు తలొగ్గిందన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. చైనా ఎగుమతులు 35 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత ఎగుమతులకు లభించే 18 శాతం సుంకం దేశానికి పెద్ద ఊరటనిస్తుందని విశ్లేషించారు. ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోయల్ కొన్ని అంశాలను వెల్లడించారు.బలమైన ఆర్థిక శక్తిగా భారత్ప్రస్తుతం భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చల్లో పాల్గొంటోందని గోయల్ అన్నారు. ‘2047 నాటికి భారత్ 30-35 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. భవిష్యత్తులో మనం అందించే భారీ మార్కెట్‌ అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో దేశానికి అతిపెద్ద బలం’ అని ఆయన అభివర్ణించారు.అమెరికా నుంచి కొనుగోళ్లువచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడంపై భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘భారతదేశం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఈ లక్ష్యం చాలా తక్కువ. మొత్తం రెండు ట్రిలియన్ డాలర్ల దిగుమతి డిమాండ్‌లో అమెరికా వాటా కొంత భాగమే. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కొంటున్న 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను, పోటీతత్వాన్ని బట్టి అమెరికా సరఫరాదారుల నుంచి తీసుకునే అవకాశం ఉంది. విమానయాన రంగం, ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్‌ వంటి వాటికి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది’ అన్నారు.వ్యూహాత్మక చర్చలువాణిజ్య చర్చలంటే కేవలం అంకెలు కాదని, అవి దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని గోయల్ పేర్కొన్నారు. ‘మేము వివిధ దేశాలతో ఇప్పటివరకు కుదుర్చుకున్న తొమ్మిది ఒప్పందాల్లో ఎక్కడా జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదు. చర్చల్లో ప్రశాంతత ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం’ అని ఆయన వెల్లడించారు.భారత్-ఈయూ ఒప్పందంపై మాట్లాడుతూ, ప్రధాని మోదీకి ప్రపంచ దేశాధినేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కూటమిలోని 27 దేశాల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ప్రధాని మార్గదర్శకత్వంలో హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సహకారంతో గ్లోబల్ ట్రేడ్ మార్కెట్‌లో భారత్ కీలకంగా మారుతుందని గోయల్ అన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

Reliance Jio Affordable 5G Recharge Plans in 20265
జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా..

భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త 5జీ రీఛార్జ్ ప్లాన్‌లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.రూ.198 రీఛార్జ్ ప్లాన్ఇది రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటివి పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే.రూ.349 రీఛార్జ్ ప్లాన్ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు. జియో హాట్‌స్టార్, జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌లతో పాటు.. మూడు నెలలు జొమాటో గోల్డ్ కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే!

Farmer unions outfits across India have strongly condemned India US trade6
భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

భారత్‌-యూఎస్‌ మధ్య ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై దేశంలోని కొన్ని రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం), దాని రాజకీయేతర విభాగం, ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్‌) సహా పలు సంఘాలు ఈ ఒప్పందాన్ని భారత వ్యవసాయ రంగాన్ని అమెరికన్ బహుళజాతి సంస్థలకు అప్పగించే చర్యగా అభివర్ణించాయి. దీనికి నిరసనగా వచ్చే వారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.ప్రధానాంశాలు.. ఆరోపణలుఇటీవల విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రైతు నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ఒప్పందంలోని నిబంధనలు భారతీయ రైతులకు గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‍ప్రకటనలోని అంశాలు కింది విధంగా ఉన్నాయి.మధ్యంతర ఒప్పందం ప్రకారం, అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని పారిశ్రామిక వస్తువులు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తొలగించడం లేదా భారీగా తగ్గించాల్సి ఉంటుంది.భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్త్రాలు, తోలు, ప్లాస్టిక్, యంత్రాలు వంటి వస్తువులపై అమెరికా 18 శాతం పరస్పర సుంకాన్ని వర్తింపజేయనుంది. ఇది భారతీయ ఎగుమతిదారులపై భారం మోపుతుంది.కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపిస్తూ.. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎస్‌కేఎం డిమాండ్ చేసింది.ఫిబ్రవరి 12న నిరసనరైతు సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయని ప్రకటనలో తెలిపారు. అదే రోజు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సాధారణ సమ్మెకు ఎస్‌కేఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.వ్యవసాయంపై ప్రభావంఏఐకేఎస్ నేత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అమెరికా నుంచి సోయాబీన్ నూనె, ఎర్ర జొన్న, పశువుల దాణా వంటివి భారత్‌లోకి వెల్లువలా వస్తాయి. దీనివల్ల స్థానిక మార్కెట్ దెబ్బతింటుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు ఈ ఒప్పందం వల్ల మరింత సంక్షోభంలోకి వెళ్తారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ వాదనమరోవైపు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసం, ధాన్యాలు, పండ్లు (నారింజ, స్ట్రాబెర్రీ వంటివి) వంటి సున్నితమైన రంగాల్లో భారత్ ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా చర్చలు సాగుతున్నాయని, ఎక్కడా లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక

Advertisement
Advertisement
Advertisement