Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Amazon may cut 14000 jobs in its third big round of layoffs1
అమెజాన్‌లో లేఆఫ్‌లు అప్పుడే అయిపోలేదు!

టెక్ దిగ్గజం అమెజాన్‌లో ఉద్యోగాల కోత ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. గడిచిన రెండేళ్లుగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ, వచ్చే మే నెలలోనూ మరో భారీ రౌండ్ లేఆఫ్‌లకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. ఈసారి సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది.జాబ్ ఫోరమ్ 'బ్లైండ్', చైనీస్ టెక్ పోర్టల్ 'లీ ఫెంగ్ నెట్ వర్క్' సమాచారం ప్రకారం.. ఈ విడత తొలగింపులు ప్రధానంగా AWS (అమెజాన్ వెబ్ సర్వీసెస్), రిటైల్ విభాగం, మానవ వనరులు (HR) విభాగాల్లో ఉండనున్నాయి. ముఖ్యంగా L5 నుండి L7 స్థాయి వరకు ఉన్న మిడిల్ మేనేజ్‌మెంట్, వైట్ కాలర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ కోతలు ఉండబోతున్నాయని సమాచారం.అయితే, వేర్‌హౌస్‌, లాజిస్టిక్స్ విభాగాల్లో పనిచేసే కార్మికులకు ప్రస్తుతానికి ఎటువంటి ముప్పు లేదని తెలుస్తోంది. అదే సమయంలో చైనాలోని కొన్ని బృందాలను పూర్తిగా తొలగించే అవకాశం ఉంది.తొలగింపులకు కారణాలివే.. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ గతంలోనే సూచించినట్లుగా, ఈ భారీ మార్పులకు ప్రధాన కారణాలు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడంతో, గతంలో మనుషులు చేసిన పనులను ఇప్పుడు సాంకేతికతతోనే పూర్తి చేస్తున్నారు. "AI వస్తే కొన్ని పనులకు తక్కువ మంది సిబ్బంది సరిపోతారు" అని జాస్సీ గత జూన్ మెమోలోనే స్పష్టం చేశారు.సంస్థలోని బ్యూరోక్రసీని (అధికార యంత్రాంగం) తగ్గించి, నిర్వహణ పొరలను (Management Layers) తొలగించి సంస్థను మరింత వేగవంతంగా మార్చడం.కోవిడ్ సమయంలో అవసరానికి మించి చేసిన నియామకాలను కంపెనీ ఇప్పుడు సరిదిద్దుతోంది.మూడు ఏళ్లలో ఉద్యోగాల కోతలు ఇలా..ఒకవేళ మే నెలలో 14,000 మందిని తొలగిస్తే, గడిచిన ఏడాది కాలంలో ఇది అమెజాన్ చేపట్టిన మూడవ అతిపెద్ద లేఆఫ్ రౌండ్ అవుతుంది. 2025 అక్టోబర్‌లో 14,000 మంది, 2026 జనవరిలో 16,000 మంది ఉద్యోగులను అమెజాన్‌ తొలగించింది. ఇక మే నెలలోనూ 14,000 తొలగిస్తే గత 3 ఏళ్లలో మొత్తం తొలగింపులు 57,000లకు చేరతాయి.

Trump to tariff countries selling weapons to Iran2
దేశాలకు టారిఫ్‌ల షాక్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్‌ల షాక్‌ ఇచ్చారు. ఇరాన్ కు ఆయుధాలను విక్రయించే దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమయ్యే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే సుంకాలు అమలు తెస్తున్నట్లు బుధవారం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు."ఇరాన్ కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు విక్రయించే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే 50 శాతం సుంకం విధిస్తున్నాం. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులులు ఉండవు" అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Indias First Helicopter Postal Service 1988 Communication Record3
38 ఏళ్ల నాటి రికార్డ్.. ఆకాశంలో తపాలా సేవలు

ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి రావడంతో కేవలం సింగిల్ క్లిక్ లో వాట్సాప్ మెసేజెస్ , ఫొటోస్, వీడియోస్ ఎక్కడ నుంచి ఎక్కడికైనా పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు వీడియో కాల్స్ ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకునే అవకాశం ఉంది. దేశ, విదేశాలనుంచి కాకుండా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు సైతం టక్కుమని క్లిక్ చేస్తే ఈ-మెయిల్ వెళ్ళిపోతుంది, సెకన్లలో అవతలి వ్యక్తికి సందేశం చేరుతుంది. కానీ, ఒకప్పుడు మారుమూల దీవులకు ఉత్తరం చేరాలంటే రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఆ నిరీక్షణకు తెరదించుతూ, సరిగ్గా 38 ఏళ్ల క్రితం భారత తపాలా శాఖ ఆకాశ మార్గాన చేపట్టిన ఒక సాహసోపేత ప్రయోగం 'హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్'. కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించిన ఆ విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..హెలికాప్టర్ పోస్టల్ సేవలు.. భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ పోస్టల్ సేవలు 1988, జనవరి 27న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అగాధమైన సముద్రం, దట్టమైన అడవులతో కూడిన అండమాన్ నికోబార్ దీవులను ఈ చారిత్రక ఘట్టానికి వేదికగా ఎంచుకున్నారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్‌లాక్ దీవుల మధ్య సాగిన ఈ మొదటి ప్రయాణం తపాలా వ్యవస్థలో ఒక మైలురాయి. ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి భారత తపాలా శాఖ, పవన్ హాన్స్ లిమిటెడ్‌తో జతకట్టింది.మెయిల్ బస్తాలను చేరవేయడానికి శక్తివంతమైన 'డౌఫిన్' హెలికాప్టర్లను రంగంలోకి దించారు. గతంలో పడవలు లేదా ఇతర మార్గాల ద్వారా ఉత్తరాలు చేరడానికి రెండు మూడు రోజులు పట్టే చోట, హెలికాప్టర్ పుణ్యమా అని గంటల వ్యవధిలోనే సందేశాలు చేరడం ప్రారంభమైంది. ఈ తొలి ప్రయాణాన్ని స్మరిస్తూ విడుదల చేసిన 'ఫస్ట్ డే కవర్లు', ప్రత్యేక స్టాంపులు నేటికీ తపాలా బిళ్ళల సేకరణకర్తలకు నిధి లాంటివి.ఆకాశ మార్గాన తపాలా సేవలు.. ఆకాశ మార్గాన తపాలా సేవలు అందించాలనే ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచంలోనే తొలి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ 1947, అక్టోబర్ 1న అమెరికాలో మొదలైంది. లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్ సహకారంతో 'సికోర్స్కీ ఎస్-51' హెలికాప్టర్ ద్వారా ఈ సేవలు అందించారు. అమెరికా బాటలోనే నడుస్తూ బ్రిటన్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సేవలను ప్రారంభించి ఐరోపాలో రికార్డు సృష్టించింది.సాంకేతికత ఎంత పెరిగినా, ఆనాడు మారుమూల ప్రాంతాల ప్రజలను అనుసంధానించడానికి భారత తపాలా శాఖ చేసిన ఈ 'గగన విహారం' ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. మేఘాలను చీల్చుకుంటూ వచ్చిన ఆ ఉత్తరం వెనుక ఎన్నో కుటుంబాల అనురాగాలు, ఆప్యాయతలు ఉండేవి.. అలాంటివాటిని ఏమాత్రం చెక్కుచెదరకుండా వారికి అందించిన ఘనత భారత తపాలా శాఖకు దక్కుతుంది. -పసుపులేటి వెంకటేశ్వరరావు.

Stock Market at closing April 8 2026 Sensex Nifty edges4
కాసుల వర్షం: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథ స్థితిని కొనసాగించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఐదు రోజుల లాభాల పరంపరను నమోదు చేశాయి.నిఫ్టీ 3.78 శాతం లేదా 873.70 పాయింట్ల లాభంతో 23,997.35 వద్ద, సెన్సెక్స్ 3.95 శాతం లేదా 2,946.32 పెరిగి 77,562.90 వద్ద ముగిశాయి.ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (Market Capitalization) రూ. 16.59 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 446 లక్షల కోట్ల మార్కును చేరుకుంది.శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ గెయినర్లుగా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 4.03 శాతం, 4.39 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా.. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో సహచర రంగాలను అధిగమించాయి. అదే సమయంలో నిఫ్టీ ఐటీ తక్కువ లాభాలతో తక్కువ పనితీరు కనబరిచింది.ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఏప్రిల్ సమీక్షలో బెంచ్మార్క్ పాలసీ రెపో రేటును 5.25 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. పర్యవసానంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డిఎఫ్) రేటు కూడా వరుసగా 5 శాతం, 5.5 శాతం వద్ద మారలేదు.

India Expands PLI Scheme to MMF Technical Textiles Footwear Industry5
టెక్స్‌టైల్స్‌ పీఎల్‌ఐ పరిధిలోకి మరిన్ని విభాగాలు

టెక్స్‌టైల్స్‌ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.10,683 కోట్లతో ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్‌ఐ) పరిధిలోకి మ్యాన్‌ మేడ్‌ వ్రస్తాలు (ఎంఎంఎఫ్‌), ఫ్యాబ్రిక్స్, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌నూ చేర్చనున్నట్టు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. దీనివల్ల పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. అలాగే తాజా పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని, టెక్స్‌టైల్స్‌రంగంలో వృద్ధి వేగం అందుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం, అంతర్జాతీయ టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడం నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఫుట్‌వేర్‌ పరిశ్రమల ప్రతినిధులు తనను కలసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముడి సరకుల లభ్యత, నాణ్యత సమస్యలను పాదరక్షల పరిశ్రమల ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గత 12 ఏళ్లలో దేశంలో కొనుగోలు శక్తికి అనుగుణంగా పాదరక్షల వినియోగం పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. యూఎస్‌లో ఒక్కో వ్యక్తి 7 జతల పాదరక్షలు వినియోగిస్తుంటే, చైనాలో 3.3 జతలుగా ఉందని.. భారత్‌లోనూ 3 జతలకు చేరినట్టు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

India Cuts Airport Fees by 25% for Airlines Iran War6
విమానయాన రంగానికి భారీ ఊరట

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానశ్రయాలలో వసూలు చేసే ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 3 నెలల పాటు 25 శాతం తగ్గిస్తూ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్‌ఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది.రంగంలోకి ఏఈఆర్‌ఏకేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఈఆర్‌ఏ ఈ తాత్కాలిక తగ్గింపును తక్షణమే అమలులోకి తెచ్చింది. రాబోయే మూడు నెలల వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం ఛార్జీల తగ్గింపు వల్ల విమానాశ్రయాలకు కలిగే ఆదాయ లోటును భవిష్యత్తులో చేపట్టే టారిఫ్ సమీక్షల ద్వారా సర్దుబాటు చేస్తామని రెగ్యులేటర్ ఏఈఆర్‌ఏ చేసింది.దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాశ్రయ రుసుములను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ సంస్థలు ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పాకిస్థాన్ గగనతలంపై నిషేధం ఉండటంతో భారత విమానాలు ఇప్పటికే చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధ మేఘాల వల్ల పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల ఇంధన ఖర్చులు, నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. ‘ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలకు ఇంధనం, సిబ్బంది వేతనాల తర్వాత విమానాశ్రయ, ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ఛార్జీలే అధిక ఖర్చులుగా ఉన్నాయి’ అని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తెలిపింది.మరోవైపు, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు విమానయాన రంగ షేర్లకు ఊపునిచ్చాయి. ఇరాన్‌తో అమెరికా రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించిన వార్తలతో బుధవారం ట్రేడింగ్‌లో ఇండిగో షేర్లు లాభపడ్డాయి. యుద్ధం సద్దుమణిగితే ఇంధన ధరలు దిగివస్తాయన్న ఆశతో ఇన్వెస్టర్లు విమానయాన రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement
Advertisement
Advertisement