Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Piyush Goyal told India–US trade deal fully protects agriculture1
వ్యవసాయ, పాడి పరిశ్రమలకు పూర్తి రక్షణ: కేంద్ర మంత్రి

భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో స్పష్టతనిచ్చారు. దేశంలోని అత్యంత సున్నితమైన రంగాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమల ప్రయోజనాలను ఈ ఒప్పందంలో పూర్తిగా కాపాడినట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ప్రతిపక్షాల ఆందోళనల మధ్య వాయిదా పడిన ఈ ప్రకటనను ఆయన తర్వాత ఉభయ సభల్లో చదివి వినిపించారు.ఒప్పందంలోని ప్రధానాంశాలు..ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందని గోయల్ తెలిపారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు..అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది ఇతర పోటీ దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాల కంటే తక్కువ కావడం గమనార్హం.రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై గతంలో విధించిన 25 శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా పూర్తిగా తొలగించింది.భారత దిగుమతులపై ఉన్న 25 శాతం పరస్పర సుంకాన్ని కూడా 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది.కీలక రంగాలకు ఊతంఆగస్టు 2025 నుంచి అమలులో ఉన్న 50 శాతం అధిక సుంకాల కారణంగా వస్త్రాలు, తోలు వస్తువులు, సముద్ర ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా తగ్గింపులతో ఈ రంగాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో తిరిగి పోటీతత్వం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధన భద్రతపై వస్తున్న సందేహాలకు మంత్రి సమాధానమిస్తూ, 140 కోట్లు భారతీయుల ఇంధన అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా చమురు, ఇంధన వనరులను వివిధ మార్గాల ద్వారా సేకరించడం భారత వ్యూహంలో భాగమని చెప్పారు.ఇంధనం, విమానయానం, డేటా సెంటర్లు, అణుశక్తి వంటి రంగాల్లో అమెరికా అగ్రగామిగా ఉందని, ఈ రంగాల్లో వాణిజ్య సహకారం పెంచుకోవడం ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ప్రస్తుతం సాంకేతిక ప్రక్రియలు, పత్రాల తయారీ తుది దశలో ఉందని, అవి పూర్తయిన వెంటనే ఒప్పందం పూర్తి వివరాలను తెలియజేస్తామని గోయల్ చెప్పారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

Honda launched two new limited editions in India for 20262
హోండా టూవీలర్‌ స్పెషల్‌ ఎడిషన్లు

హోండా మోటార్‌సైకిల్‌–స్కూటర్‌ ఇండియా తన పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా ‘షైన్‌ 125 లిమిటెడ్‌’, ‘డియో 125 ఎక్స్‌–ఎడిషన్‌’లను మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా పాపులర్‌ బ్రాండ్‌ ‘షైన్‌’ దేశ వ్యాప్తంగా మంచి ప్రజాదారణ పొందింది. మారుతున్న ట్రెండ్స్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు తాజాగా హోండా షైన్‌ ‘125 లిమిటెడ్‌ ఎడిషన్‌’ను విడుదల చేసింది. మినిమలిస్ట్‌ థీమ్‌తో పెర్ల్‌ సైరెన్‌ బ్లూ కలరులో అందుబాటులో ఉండే ఈ ఎడిషన్, పైరైట్‌ బ్రౌన్‌ ఆలాయ్‌ వీల్స్‌తో వస్తుంది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ ఇంజిన్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. ధర ఢిల్లీ ఎక్స్‌ షోరూం వద్ద రూ.86,211గా ఉంది. హోండా డియో 125 ఎక్స్‌–ఎడిషన్‌యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఆధునిక స్కూటర్‌. ప్యానెల్లపై ప్రత్యేక గ్రాఫిక్స్‌తో ఈ ఎడిషన్‌ సైబర్‌ డ్రిఫ్ట్‌ థీమ్‌ ప్రేరణతో తీర్చిదిద్దారు. నగర ప్రయాణాలకు సరైన మైలేజ్, స్మూత్‌ డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఇంజిన్‌లో ‘ఇండ్లింగ్‌ స్టాప్‌ సిస్టమ్‌’ ఉండటం వల్ల ట్రాఫిక్‌లో నిలిచినప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతూ ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ధర విషయానికొస్తే..., ఢిల్లీ ఎక్స్‌ షోరూం వద్ద రూ.87,733గా ఉంది. ఇప్పటికే ఈ స్పెషల్‌ ఎడిషన్‌ బుకింగ్‌లు మొదలయ్యాయి. కస్టమర్లు ఈ మోడళ్లను కంపెనీ ఆన్‌లైన్‌లో కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా, ఆఫ్‌లైన్‌లో దగ్గర్లోని డీలర్‌షిప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి రెండో వారం నుంచి డెలివరీ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

India attracting global attention due to stable leadership, robust growth3
ఒక్కటి కాదు.. వస్తున్నాయ్‌ 100 రిలయన్స్‌లు

ముంబై: దేశాభివృద్ధికి శాంతి భద్రతలు, స్థిరమైన నాయకత్వం కీలకమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చెప్పారు. భారత్‌ నిలకడగా రెండంకెల స్థాయి వృద్ధిని సాధించడం సాధ్యమేనని స్పష్టం చేశారు. జియోబ్లాక్‌రాక్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. పటిష్టమైన ఆర్థిక ప్రగతికి 15–20 ఏళ్ల పాటు శాంతి భద్రతలు, సామాజిక సామరస్యత అవసరమని తెలిపారు. సమాచారం, వినియోగం, వాణిజ్యంలాంటి అంశాల్లో పరివర్తనకు భారత్‌ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 100 కంపెనీలు కొత్తగా రిలయన్స్‌ స్థాయికి ఎదిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంబానీ చెప్పారు. ఏఐ గురించి ఆందోళన వద్దు: ఏఐ గురించి భయపడనక్కర్లేదని, పారిశ్రామిక విప్లవంతో కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడినా, మానవాళి ముందుకే సాగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. దేశీయంగా ప్రతి గ్రామంలోనూ 5జీ నెట్‌వర్క్‌ ఉందని, మిగతా ఏ దేశంతో పోలి్చనా మెరుగ్గా, చౌకగా 5జీ సేవలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. మార్కెట్‌తోనే సంపద సాధ్యం: ల్యారీ ఫింక్‌: రాబోయే రోజుల్లో పది సంవత్సరాలకు పైగా భారత్‌ ఏటా 8–10 శాతం వృద్ధి చెందుతుందని, ఇది భారత్‌ శకం అని గ్లోబల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ దిగ్గజం బ్లాక్‌రాక్‌ చైర్మన్‌ ల్యారీ ఫింక్‌ చెప్పారు. భారతీయులు డబ్బంతా బ్యాంక్‌ డిపాజిట్లలోనే ఉంచకుండా క్యాపిటల్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక ప్రయోజనం పొందవచ్చని ఆయన తెలిపారు. ఇందుకు అమెరికానే నిదర్శనమని ఫింక్‌ చెప్పారు. వచ్చే అయిదేళ్లలో దేశీయంగా మ్యుచువల్‌ ఫండ్స్‌ ఏయూఎం ప్రస్తుత రూ. 80 లక్షల కోట్ల నుంచి రెట్టింపు స్థాయికి పెరుగుతుందని జియో ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ చైర్మన్‌ కేవీ కామత్‌ చెప్పారు. టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బ్యాంకులు తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందన్నారు.

Apple plans new retail store in Hyderabad4
హైదరాబాద్‌లో యాపిల్‌ స్టోర్‌ 

న్యూఢిల్లీ: అమెరికన్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తమ రిటైల్‌ స్టోర్స్‌ని విస్తరిస్తోంది. హైదరాబాద్‌లోనూ కొత్త స్టోర్‌ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం స్టోర్‌ లీడర్, సీనియర్‌ మేనేజర్‌ మొదలైన ఉద్యోగాలను తమ కెరియర్‌ పోర్టల్‌లో పోస్ట్‌ చేసింది. సాధారణంగా స్టోర్‌ని ప్రారంభించడానికి యాపిల్‌ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్‌మెంట్‌ చేపడుతుందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్‌ స్టోర్‌ 2027 తొలి నాళ్లలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2020లో భారత్‌లో ఆన్‌లైన్‌ స్టోర్‌ని ప్రారంభించిన యాపిల్‌ ఆ తర్వాత ముంబై, ఢిల్లీలో ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ని ఏర్పాటు చేసింది.

Indian recruiters using AI to identify overlooked talent5
నియామకాలను శాసిస్తున్న ఏఐ!

ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) నియామకాల ప్రక్రియను మరింత సమర్థవంతం, సులభతరం చేస్తోంది. సరైన నైపుణ్యాలతో కూడిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం రిక్రూటర్లకు (నియామకాలు చేపట్టేవారు) సవాలు కాగా.. వీరు ఏఐ సాయాన్ని తీసుకుంటున్నారు. తమకు కావాల్సిన సరైన అర్హతలు, నైపుణ్యాలు దాగి ఉన్న అభ్యర్థులను గుర్తించేందుకు ఏఐ సాయపడుతున్నట్టు రిక్రూటర్లు లింక్డ్‌ఇన్‌ సర్వేలో భాగంగా తెలిపారు. ఒత్తిళ్ల మధ్య ఏఐని పరిష్కారంగా వారు భావిస్తున్నారు. 2025 నవంబర్‌ 13 నుంచి 28 మధ్య 19,113 మంది అభిప్రాయాలను, నవంబర్‌ 10 నుంచి 27 మధ్య 6,554 అంతర్జాతీయ హెచ్‌ఆర్‌ నిపుణులను లింక్డ్‌ఇన్‌ సర్వే చేసి వివరాలు విడుదల చేసింది. → గతంలో తాము గుర్తించలేని నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల నియామకానికి ఏఐ సాయపడుతున్నట్టు 71 శాతం మంది చెప్పారు. → అభ్యర్థుల నైపుణ్యాలను మరింత లోతుగా విశ్లేíÙంచేందుకు ఏఐ ఉకపరిస్తున్నట్టు 80 మంది పేర్కొన్నారు. → నియామకాలను ఏఐ వేగవంతం చేసిందని 76 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. → నియామకాలు కరోనా ముందునాటితో పోలి్చతే 40 శాతం పెరిగినా.. అర్హులైన అభ్యర్థులను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్టు 74 శాతం మంది రిక్రూటర్లు తెలిపారు. → ఏఐ ఆధారిత దరఖాస్తులు పెరిగినట్టు 53 శాతం మంది తెలిపారు. → కావాల్సిన నైపుణ్యాల్లో లోటు ఉంటున్నట్టు 47 శాతం రిక్రూటర్లు పేర్కొన్నారు. → తప్పుదోవ పట్టించే, తక్కువ నాణ్యత కలిగిన వాటి నుంచి నిజమైన దరఖాస్తులను వడబోయడంలో ఏఐ సాయపడుతున్నట్టు 48 శాతం మంది చెప్పారు. → 2026లోనూ ఇంటర్వ్యూల ముందస్తు స్క్రీనింగ్‌కు, వేగవంతమైన నియామకాలకు, మెరుగైన అభ్యర్థుల ఎంపికకు ఏఐని ఉపయోగించనున్నట్టు మెజారిటీ రిక్రూటర్లు తెలిపారు.

Government signs MoU to launch Bharat Container Shipping Line6
భారత్‌ కంటెయినర్‌ షిప్పింగ్‌ లైన్‌ ఏర్పాటుకు వీలుగా ఒప్పందం 

ముంబై: అంతర్జాతీయంగా షిప్పింగ్‌కు డిమాండ్‌ పెరుగుతున్న క్రమంలో.. దేశంలో సమగ్ర కంటెయినర్‌ ఎకోసిస్టమ్‌ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భారత్‌ కంటెయినర్‌ షిప్పింగ్‌ లైన్‌ (బీసీఎస్‌ఎల్‌) ఏర్పాటుకు వీలు కలి్పంచే ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది. ఈ పథకం స్ఫూర్తికి అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడే కంటెయినర్‌ తయారీ వ్యవస్థను దేశీయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించడం గమనార్హం. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ అథారిటీ (జేఎన్‌పీఏ), వీవో చిదంబరనార్‌ పోర్ట్‌ అథారిటీ, చెన్నై పోర్ట్‌ అథారిటీ, సాగరమాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.

Advertisement
Advertisement
Advertisement