Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Big Relief for Train Passengers new Ticket Booking System Coming Soon1
రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు.. త్వరలోనే!

దేశంలో రైలు టికెట్ బుకింగ్ వ్యవస్థ త్వరలో మరింత వేగవంతం, సులభతరం కానుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎదురయ్యే ఆలస్యం, సర్వర్ సమస్యలు, లావాదేవీ వైఫల్యాలకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ భారీ అప్‌గ్రేడ్ పనులు చేపట్టింది.జూన్ నాటికి కొత్త వ్యవస్థ సిద్ధం!అధికారుల ప్రకారం.. అప్‌గ్రేడ్ చేసిన ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిమిషానికి సుమారు 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యవస్థ, అప్‌గ్రేడ్ తర్వాత నిమిషానికి 1.5 లక్షల బుకింగ్స్‌ను నిర్వహించగలదు. దీంతో పీక్ టైమ్‌లో కూడా సాఫీగా టికెట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది.ఎంక్వైరీ సేవల్లోనూ వేగంటికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా, రైలు వివరాలు, సీట్ల లభ్యత తెలుసుకునే ఎంక్వైరీ సేవలు కూడా మరింత వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల విచారణలను నిర్వహిస్తున్న వ్యవస్థ, అప్‌గ్రేడ్ తర్వాత ఇంకా అధిక సామర్థ్యంతో పని చేయనుంది.సాంకేతిక సమస్యలకు చెక్ప్రస్తుతం వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సర్వర్ క్రాష్‌లు, స్లో స్పీడ్, పేమెంట్ ఫెయిల్యూర్స్. కొత్త వ్యవస్థతో ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా రద్దీ సమయాల్లో కన్ఫర్మ్ టికెట్ పొందడం సులభమవుతుంది.కొత్త ఫీచర్లుఅప్‌గ్రేడ్ వ్యవస్థలో పలు కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వివిధ తేదీలలో టికెట్ ధరలను ముందుగానే తెలుసుకునే ఫేర్ క్యాలెండర్, ప్రయాణికుడు స్వయంగా సీటు ఎంపిక చేసుకునే ఆప్షన్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావచ్చు. అలాగే బహుభాషా సౌకర్యం కూడా కల్పించనున్నారు.ఆన్‌లైన్ బుకింగ్‌కు పెరుగుతున్న ఆదరణప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్ ద్వారా బుక్ అవుతుండగా, కేవలం 11 శాతం మాత్రమే కౌంటర్లలో కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మార్పులతో ఆన్లైన్ బుకింగ్ మరింత నమ్మదగినదిగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనుంది. మొత్తంగా, ఈ అప్‌గ్రేడ్‌తో రైలు ప్రయాణికుల టికెట్ బుకింగ్ అనుభవం పూర్తిగా మారిపోనుంది.

New Air Travel Rules Aim to Cut Costs and Boost Comfort2
విమాన ప్రయాణం.. ఇక కొత్త నిబంధనలు

దేశంలో విమాన ప్రయాణాన్ని మరింత పారదర్శకంగా, సరసమైనదిగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చే దిశగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. యాడ్-ఆన్ ఛార్జీల భారం తగ్గించి, మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఉచితంగా సీట్ల కేటాయింపుకొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్ల కేటాయింపును ఉచితంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులు తమకు నచ్చిన సీటును ఎంచుకోవడానికి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తగ్గనుంది.ఒకే పీఎన్ఆర్‌ ఉంటే పక్కపక్కనే సీట్లుఒకే పీఎన్ఆర్‌పై టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా దంపతులకు విమానయాన సంస్థలు సాధ్యమైనంత వరకు పక్కపక్కనే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో విడివిడిగా సీట్లు రావడం, అదనపు చార్జీలు చెల్లించడం వంటి ఇబ్బందులు తగ్గనున్నాయి.క్రీడా సామగ్రి, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాపై విమానయాన సంస్థలు పారదర్శక విధానాలు పాటించాలి. భద్రతా నిబంధనలతో పాటు ప్రయాణికులకు అనుకూలంగా వీటి నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశించింది.రద్దులు, ఆలస్యాలపై కఠిన నియంత్రణవిమానాల ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎయిర్‌లైన్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, విమానాశ్రయ కౌంటర్లలో ప్రయాణికుల హక్కులను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు.విమానాశ్రయాల్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్‌లు’ ఏర్పాటు చేసి సరసమైన ధరల్లో ఆహారం అందించనున్నారు. ‘ఫ్లైబ్రరీ’ ద్వారా ఉచితంగా పుస్తకాలు చదుకునే అవకాశం కల్పించనున్నారు. అదనంగా ఉచిత వై-ఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

Dell Quietly Cuts 11,000 Jobs it is part of disciplined cost management3
డెల్‌ కంపెనీ సైలెంట్‌గా ఇంత పని చేసిందా!!

ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్‌ టెక్నాలజీస్‌ (Dell Technologies) సైలెంట్‌గా భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను సుమారు 11,000 తగ్గించి, మొత్తం సిబ్బందిని 108,000 నుండి 97,000కు తీసుకువచ్చింది. ఈ వివరాలు తాజాగా విడుదల చేసిన వార్షిక 10-K ఫైలింగ్‌లో వెల్లడయ్యాయి.కంపెనీ ఈ తొలగింపులపై పెద్దగా బహిరంగ ప్రకటన చేయకపోయినా, ఉద్యోగ విరమణ (severance) ఖర్చుల రూపంలో సుమారు 569 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇది కంపెనీ అమలు చేస్తున్న “క్రమశిక్షణా వ్యయ నిర్వహణ” వ్యూహంలో భాగమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు 693 మిలియన్ డాలర్లు ఉండగా, ఈసారి తగ్గడం గమనార్హం.ఒకేసారి పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించడం కాకుండా, దశలవారీగా సిబ్బందిని తగ్గించుకున్నట్లు కంపెనీ ఫైలింగ్ సూచిస్తోంది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం, కార్యకలాపాలను ఆధునీకరించడం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), ఎంటర్‌ప్రైజ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.డెల్ ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కొత్త విషయమేమీ కాదు. 2023లో సుమారు 1.33 లక్షల మంది ఉన్న డెల్‌ వర్క్‌ఫోర్స్‌, 2024లో 1.20 లక్షలకు, 2025లో 1.08 లక్షలకు పడిపోయింది. తాజా కోతలతో మూడు సంవత్సరాల్లో దాదాపు 27 శాతం వర్క్‌ఫోర్స్‌ తగ్గిపోయినట్లైంది.ఇక టెక్ రంగంలో మొత్తం పరిస్థితి కూడా ఇదే దిశగా సాగుతోంది. లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ డేటా ప్రకారం, 2026లో ఇప్పటివరకు 66 టెక్ కంపెనీలు కలిపి 39,000కు పైగా ఉద్యోగాలను తగ్గించాయి. మెటా ప్లాట్‌ఫామ్స్‌, అట్లాసిన్‌, బ్లాక్‌ వంటి సంస్థలు కూడా ఏఐ ఆధారిత మార్పుల దిశగా ఉద్యోగ కోతలు చేపడుతున్నాయి.

BHAVYA Scheme gets Cabinet nod Govt approves plug and play industrial parks plan4
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త పథకానికి ఆమోదం

ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా భారత్ ఔద్యోగిక్‌ వికాస్ యోజన (భవ్య) పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 33,600 కోట్ల రూపాయల ఖర్చుతో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు.వంద నుంచి వెయ్యి ఎకరాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవ్య ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరగనుంది. అలాగే యూపీలో బారాబంకి నుంచి బహరాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 6969 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.ఇక పత్తి గిట్టుబాటు ధరల నిధికి 1718 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్లో ఎంఎస్పీ కోసం సీసీఐకి కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Stock Market Closing Update March 18 Sensex surges 630 pts5
ఐటీ, రియల్టీ స్టాక్స్ అండతో భారీ లాభాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, రియల్టీ స్టాక్స్ మద్దతు ఇవ్వడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రోజు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 196.65 పాయింట్ల లాభంతో 23,777.80 వద్ద, సెన్సెక్స్ 0.83 శాతం లేదా 633.29 పాయింట్లు పెరిగి 76,704.13 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.94 శాతం, 1.70 శాతం పెరిగాయి.రంగాల వారీగా నిఫ్టీ ఐటీ టాప్ గెయినర్ గా నిలిచింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. రంగాల సూచీలలో నిఫ్టీ మెటల్, ఎఫ్‌ఎంసిజి అత్యధికంగా క్షీణించాయి.

Rich Dad Poor Dad Robert Kiyosaki Warns Massive Crash Predicts Gold Silver Bitcoin6
ఆ బుడగ పేలిందా!! 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తుచేసుకోండి..

అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి నడుస్తున్న నేపథ్యంలో, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే చరిత్రలోనే అతిపెద్ద ఆస్తుల బుడగ (బబుల్ బస్ట్) పగిలిపోతుందని, దాని తర్వాత బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఈథేరియం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన పేర్కొన్నారు.కియోసాకి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన తాజా సందేశంలో, "బబుల్ పగిలే 'పిన్' ఏదైనా ఈవెంట్ త్వరలోనే జరగనుంది. అది ఏ సంఘటన అయినా.. ఇప్పుడే బిట్‌కాయిన్, బంగారం, వెండి, ఈథేరియం ఎక్కువగా సేకరించాలి" అని సూచించారు. క్రాష్ తర్వాత ఒక సంవత్సరంలో బంగారం ఒక ఔన్స్‌కు 35,000 డాలర్లు, వెండి 200 డాలర్లు, బిట్‌కాయిన్ ఒక్కో కాయిన్ 750,000 డాలర్లు, ఈథేరియం 95,000 డాలర్లకు చేరుతాయని ఆయన ధీమాగా అంచనా వేశారు."మీ లాభం అమ్మేటప్పుడు కాదు.. కొనేటప్పుడే వస్తుంది" అనే తన 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కొనుగోలు చేసి భవిష్యత్తులో ధనవంతులు కావాలని, లేకపోతే చాలామంది పేదలవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర సుమారు 74,000–75,000 డాలర్ల మధ్య ఉండగా, ఈథేరియం 2,300–2,400 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది.

Advertisement
Advertisement
Advertisement