Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India Refurbished Phone Market Up says Counterpoint1
ఐఫోన్‌ అయితే వాడినా ఓకే

దేశీయంగా కొత్త డివైజ్‌ల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో సెకండ్‌హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ నెలకొంది. దీంతో రీఫర్బిష్డ్ ఫోన్ల మార్కెట్‌ గణనీయంగా విస్తరిస్తోంది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం 2025లో 7–8 శాతం మేర వృద్ధి చెందిన సెకండరీ మార్కెట్‌ ఈ ఏడాది కూడా అదే జోరు కనబర్చవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడుతుండటం, ఆన్‌లైన్‌–ఆఫ్‌లైన్‌ మాధ్యమాల ద్వారా నేరుగా కస్టమర్లకు మరింత అందుబాటు స్థాయిలో లభిస్తుండటంలాంటి అంశాలు రీఫర్బిష్డ్‌ ఫోన్ల విక్రయాలు పెరిగేందుకు దోహదపడగలవని పేర్కొన్నారు. కొత్త వ్యూహాలు.. థర్డ్‌ పార్టీలు రీఫర్బిష్‌ చేసి, అమ్మే డివైజ్‌లలో నాణ్యత సరిగ్గా లేకపోవడం, రిటర్నులు ఎక్కువగా వస్తుండటంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి దిగ్గజాలు గతేడాది ఈ విభాగం నుంచి తప్పుకున్నప్పుడు కొంతకాలం అమ్మకాలు నెమ్మదించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సదరు ప్లాట్‌ఫాంలపై ఆధారపడిన విక్రేతల వ్యాపారం తాత్కాలికంగా దెబ్బతిందని వివరించాయి. దీనితో నేరుగా వినియోగదారులను చేరుకునే వ్యూహాలకు క్యాషిఫై, కంట్రోల్‌జెడ్‌లాంటి సంస్థలు పదును పెట్టాయి. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలను, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ నెట్‌వర్క్‌లను విస్తరించాయి. ప్రభావం ఇంకా తెలియడం లేదు.. చాలామటుకు బ్రాండ్స్‌ దగ్గర 60–90 రోజుల వరకు సరిపడేంత నిల్వలు ఉండటం వల్ల రేట్ల పెంపు ప్రభావం పూర్తి స్థాయిలో ఇంకా తెలియడం లేదు. కొత్త డివైజ్‌ల రేట్లు 15–20 శాతం పెరిగాయంటే చాలు, కోవిడ్‌ కాలంలోలాగా రీఫర్బిష్డ్ ఫోన్లకు డిమాండ్‌ భారీగా పెరుగుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అప్పట్లో సరఫరాపరమైన సవాళ్ల వల్ల కొత్త ఫోన్లకు కొరత ఏర్పడి, కొనుగోలుదార్లు సెకండ్‌హ్యాండ్‌ డివైజ్‌ల వైపు మళ్లాల్సి వచి్చంది. ప్రస్తుతం కూడా మెమరీ, చిప్‌ల వ్యయాలు పెరిగి కొత్త డివైజ్‌ల రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయని క్యాషిఫై వర్గాలు వివరించాయి. ఎంట్రీ లెవెల్‌ షాక్‌.. అత్యధిక మార్కెట్‌ వాటా ఉండే ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో రేట్ల పెంపు షాక్‌ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రూ. 10,000గా ఉన్న హ్యాండ్‌సెట్స్‌ రేటు వచ్చే ఆరు నెలల్లో దాదాపు 50 శాతం పెరిగి రూ. 15,000కు చేరొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇదే అతి పెద్ద సెగ్మెంట్‌ కావడంతో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని, దీనితో కస్టమర్లు రీఫర్బిష్డ్ డివైజ్‌ల వైపు డిమాండ్‌ మళ్లొచ్చని ఆశిస్తున్నట్లు వివరించాయి. అయితే, రేట్లు పెరగడమనేది మరో ప్రతికూల పరిణామానికి కూడా దారి తీయొచ్చని భావిస్తున్నారు. యూజర్లు తమ పాత డివైజ్‌లను మరింత కాలం అట్టే పెట్టుకునేందుకు ప్రాధాన్యతనివ్వొచ్చని, ఫలితంగా మార్కెట్లో సరఫరా తగ్గొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా అమ్ముడయ్యే ఫోన్లలో దాదాపు 50 శాతం డివైజ్‌లు రీఫర్బిష్డ్ లేదా ఎక్సే్చంజ్‌ మార్కెట్లోకి రావడానికి అనువైనవిగానే ఉంటున్నాయి. కానీ ఇందులో సగం మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయి. మిగతా వాటిని యూజర్లు నిరుపయోగంగా డ్రాలలో పడేయడమో లేక తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇవ్వడమో చేస్తున్నారు. ఈ–వ్యర్థాలు, పాత డివైజ్‌ల విక్రయ విలువ గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంటోంది. ఐఫోన్లే కావాలి.. రీఫర్బిష్‌ చేసిన యాపిల్‌ ఐఫోన్లకు భారీగా డిమాండ్‌ నెలకొంది. వాటి లభ్యత కూడా పెరుగుతోంది. దీనితో 2019లో సుమారు 2 శాతంగా ఉన్న ఐఫోన్ల మార్కెట్‌ వాటా ఇప్పుడు 9 శాతానికి చేరుకుంది. రీఫర్బిష్డ్ సంస్థల మొత్తం అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 60 శాతంగా ఉంటోందని పరిశ్రమ అంచనా. లేటెస్ట్‌ డివైజ్‌ల ప్రారంభ ధర ఎక్కువగా ఉండటంతో, యాపిల్‌ డివైజ్‌లను మొదటిసారిగా వాడే వారు, వేరే బ్రాండ్స్‌ బదులుగా దాదాపు అదే రేటుకో అంతకన్నా కాస్త తక్కువ రేటుకో లభించే పాత ఐఫోన్లనే తీసుకోవడంవైపు మొగ్గుచూపుతున్నారు. యాపిల్‌లో ఎంట్రీ లెవెల్‌ మోడల్‌ లేకపోవడంతో ఈ ధోరణి కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్‌లో ఏడాది, రెండేళ్ల పాత ఫోన్లతో పోలిస్తే నాలుగైదేళ్లు పాతబడ్డ యాపిల్‌ ఫోన్లకు కూడా డిమాండ్‌ బాగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. – సాక్షి బిజినెస్‌ డెస్క్‌

Hero Splendor Plus Gets Price Hike2
హీరో స్ప్లెండర్ కొత్త ధరలు

మూడు దశాబ్దాలకు పైగా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో స్ప్లెండర్ బైక్ ధరలు పెరిగాయి. కొత్త ఏడాది ఇతర కంపెనీల బాటలోనే హీరోమోటోకార్ప్ అడుగులు వేస్తూ.. ధరలను కేవలం రూ. 250 మాత్రమే పెంచింది. పెరుగుతున్న విడిభాగాల ధరలు, ఇతరత్రా కారణాల వల్ల ధరను పెంచడం జరిగిందని సంస్థ పేర్కొంది.హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా తన స్థానాన్ని నిలుపుకుంది. ఇందులోని 100 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ 7.09 bhp & 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 4-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.కంపెనీ ఈ బైక్ ధరలను పెంచింది. కానీ డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ముందు భాగంలో అదే టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.ఇదీ చదవండి: టాటా సియెర్రా కారు కొన్న మంత్రిధరల పెరుగుదల తరువాత హీరో స్ప్లెండర్ డ్రమ్ వేరియంట్ ధర రూ. 73,902 నుంచి రూ. 74,152 వద్దకు చేరింది. ఐ3ఎస్ వేరియంట్ రూ. 75,055 నుంచి రూ. 75,305 వద్దకు, ఎక్స్‌టెక్‌ ధర రూ. 77,428 నుంచి రూ. 77,678 వద్దకు, ఎక్స్‌టెక్‌ 2.0 (డ్రమ్) వేరియంట్ ధర రూ. 79,964 నుంచి రూ. 80,214 వద్దకు, ఎక్స్‌టెక్‌ 2.0 (డిస్క్) వేరియంట్ ధర రూ. 80,471 నుంచి రూ. 80,721 వద్దకు చేరింది.

Kerala Transport Minister Takes Delivery Of State First Tata Sierra3
టాటా సియెర్రా కారు కొన్న మంత్రి

టాటా సియెర్రా ఎస్‌యూవీ డెలివరీలు జనవరి 15 నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. NATRAX పరీక్షా కేంద్రంలో తన సామర్థ్యాలను ప్రదర్శించిన అనంతరం ఈ ఎస్‌యూవీ కేరళకు చేరుకుంది. రాష్ట్ర రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ కేరళలో తొలి యూనిట్‌ను స్వీకరించిన మొదటి గ్రహీతగా నిలిచారు.కేరళ రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ రాష్ట్రంలోని ప్రముఖ టాటా డీలర్‌షిప్‌లలో ఒకటైన శ్రీ గోకులం మోటార్స్ నుంచి సియెర్రా కారును డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉన్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్‌టీరియర్‌, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో వస్తోంది.ఈ కొత్త తరం టాటా సియెర్రాలో సరికొత్త 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఇచ్చారు. ఇది 158 బీహెచ్‌పీ శక్తి, 255 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ ఏటీ గేర్‌బాక్స​తో మాత్రమే వస్తుంది. ఇక సియెర్రా 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్‌ 105 బీహెచ్‌పీ శక్తి, 145 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అలాగే డీజిల్ 1.5-లీటర్ ఇంజన్‌ 116 బీహెచ్‌పీ శక్తి, 260 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీసీటీతో లభిస్తుంది. View this post on Instagram A post shared by Sree Gokulam Motors & Services (@gokulammotors)

Gold Price Hike Again in India Know The Latest Details4
మారిపోయిన గోల్డ్ రేటు.. లేటెస్ట్ ధరలు ఇలా!

భారతదేశంలో బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ఉదయం ఒక రేటు, సాయంత్రానికి ఇంకో రేటు ఉంది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర ఎంతలా దూసుకెల్తూ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.ఈ రోజు (జనవరి 19) ఉదయం 1,33,550 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు.. సాయంత్రానికి రూ. 1,34,050 వద్దకు (రూ. 500 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు 1,45,690 రూపాయల నుంచి రూ. 1,46,240 వద్దకు (550 రూపాయలు పెరిగింది) చేరింది.ఢిల్లీలో కూడా ధరలు తారుమారయ్యాయి. ఉదయం 1,33,700 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి రేటు.. ఇప్పటికి రూ. 1,34,200 వద్ద (రూ. 500పెరిగింది) నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు 1,45,840 రూపాయల నుంచి రూ. 1,46,390 వద్దకు (550 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల రేటు 1,34,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 146730 వద్ద ఉంది. వెండి రేటు ఏకంగా రూ.3 లక్షలు (1000 గ్రాములు) దాటేసింది.ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!

How Much Interest Can Be Earned by Keeping Money in Swiss Banks5
వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్‌లో డబ్బు!

చాలామంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు మొదలైన సంపన్నులు.. వారి అపార సంపదను (డబ్బు) స్విస్ బ్యాంకులో దాచుకుంటారని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఇక్కడ డబ్బు దాచుకుంటారు సరే.. ఈ డబ్బుకు వడ్డీ వస్తుందా?, వస్తే ఎంత వస్తుంది? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వడ్డీ వస్తుందా?స్విస్ బ్యాంక్ అనేది.. గోప్యత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఇక్కడ ఎవరైనా డబ్బు దాచుకుంటే, సాధారణ బ్యాంకుల మాదిరిగా చెప్పుకోదగ్గ వడ్డీ అయితే రాదు. చాలా తక్కువ మొత్తంలో వడ్డీ వస్తుంది. ఇతర బ్యాంకుల్లో మాదిరిగానే.. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్‌లపై వడ్డీ లభిస్తుంది.నిజానికి.. పెద్ద మొత్తంలో డబ్బు స్విస్ బ్యాంక్‌లో ఉంచితే వడ్డీ రావడం కంటే, బ్యాంక్ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కాబట్టి స్విస్ బ్యాంకులో ఖాతాలు తెరవడం ప్రధానంగా.. వడ్డీ కోసం కాకుండా డబ్బు భద్రత & స్థిరత్వం కోసం చేస్తారు.స్విస్ బ్యాంక్‌లో ఖాతా సులభమేనా?స్విస్ బ్యాంక్‌లో ఖాతా తెరవడం అంత సులభం కాదు. కనీస డిపాజిట్‌గా కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అదనంగా, ఖాతా నిర్వహణకు సంవత్సరానికి భారీ ఫీజులు కూడా వసూలు చేస్తారు. ఈ కారణాల వల్ల సాధారణ మధ్యతరగతి వ్యక్తులకు స్విస్ బ్యాంక్ ఖాతాలు సాధ్యపడవు.కీలకమైన మార్పులు!ఇక తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఒకప్పుడు స్విస్ బ్యాంక్ అంటేనే పూర్తి గోప్యతకు ప్రతీకగా భావించేవారు. స్విస్ బ్యాంక్‌లో డబ్బు ఉంటే ఎవరికీ తెలియదు అనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉండేది. ముఖ్యంగా పన్ను ఎగవేత, అక్రమ సంపద వంటి విషయాల్లో స్విస్ బ్యాంకుల పేరు తరచూ వినిపించేది. కానీ కాలం మారడంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కూడా భారీ మార్పులు వచ్చాయి. దాంతో స్విస్ బ్యాంకుల గోప్యత విధానంలో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.ఇప్పుడు స్విస్ బ్యాంకులు ఖాతాదారుల వివరాలను ఇతర దేశాలతో పంచుకుంటున్నాయి. అయితే ఇది యథేచ్ఛగా కాదు, కొన్ని నియమాలు & అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే జరుగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం అంతర్జాతీయ ఒత్తిడి. ప్రపంచ దేశాలు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో OECD (ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో CRS (కమాండ్ రిపోర్టింగ్ స్టాండర్డ్) అనే విధానం అమల్లోకి వచ్చింది.ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!

Benami Properties its Dealings Are Banned in India6
బినామీ ఆస్తులకు చెక్‌

బినామీ ఆస్తులు... దాని వ్యవహారాలను భారతదేశంలో నిషేధించారు. ఇందుకు సంబంధించి 1988లో చట్టమే వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన, బలమైన చట్టం.ఆస్తి అంటే: బినామీ వ్యవహారాలన్నీ ఆస్తి చుట్టూ తిరుగుతాయి. అందుకని ‘ఆస్తి’ అనే పదాన్ని బాగా నిర్వచించారు. చట్టంలో ఈ నిర్వచనం కష్టమయితే చాలా తెలివిగా, పరిధి ఎక్కువగా ఉండేలా వివరణ ఇచ్చారు. ఈ క్రిందివన్నీ ‘ఆస్తి’ అని పెద్ద జాబితా చెబుతారు. ఈ నిర్వచనం చదివితే మీకు భగవద్గీత స్ఫురణకు రాకతప్పదు.(1) ఏ రకమయినా.. స్థిరమైన, అస్థిరమైన, కంటికి కనిపించేవి... కనపడవని... భౌతికమైనవి... నిరాకారమైనవి. (2) హక్కు, ఆసక్తి, దస్తావేజుల్లో పేరు, ప్రస్తావన(3) రూపాంతరం చెందగలిగే ఆస్తి(4) పై పేర్కొన్న 1,2,3 ఆస్తుల ద్వారా వచ్చిన వసూళ్లు ..రియల్‌ ఎస్టేట్, భూములు, ఇళ్లు, పొలాలు, స్థిరాస్తులు, షేర్లు, వేతనాలు, ఫిక్సిడ్‌ డిపాజిట్లు, బ్యాంకు డిపాజిట్లు, నగదు బ్యాంకు లాకర్లు, ప్రయివేటు లాకర్లు మొదలైనవి.బినామీ వ్యవహారం ఏమిటంటే..➤ఒక వ్యవహారం–ఒప్పందం.. ఒక ఆస్తికి కాగితాల ప్రకారం ఓనర్‌ (యజమాని) ఓనమాలు రాని ఓబయ్య అయితే.., ఆ వ్యవహారానికి మదుపు పెట్టినది చదువుకున్న చలమయ్య. ఇందులో చలమయ్య గారికి ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది.➤లేని వ్యక్తి పేరు మీద, డమ్మీ వ్యక్తి పేరు మీద జరిగే వ్యవహారం... కర్త, కర్మ, క్రియ... ఒకరైతే.. అబద్దపు పేరుతో దస్తావేజులు తయారవుతాయి.➤ఒక వ్యక్తి/సంస్థకి తెలియకుండా/చెప్పకుండా/ ఎరుకలో లేకుండా జరిగిన వ్యవహారం. విచారణలో నాకు తెలియదు, నేను కాదని, నాకు హక్కు లేదని ధ్రువీకరించిన కేసులు.➤కొన్ని వ్యవహారాల్లో మనిషి కల్పితం (చందమామ బేతాళ కథల్లోలాగా).గాభరా పడొద్దు.. వీటికీ మినహాయింపులున్నాయి. హిందూ ఉమ్మడి కుటుంబంలో కర్త కాని, సభ్యులు కాని వారి పేరు మీద ఆస్తి ఉంచుకోవచ్చు. కానీ సోర్స్‌ మాత్రం కుటుంబం నుంచే రావాలి. ప్రయోజనం ఉమ్మడి కుటుంబానికే చెందాలి. ట్రస్టుల్లో, భాగస్వామ్యంలో, కంపెనీల్లో, డిపాజిటరీలాగా, ఏజెంటులాగా, విశ్వాసపాత్రుడి హోదాలో వ్యవహారాలు.. కుటుంబంలో భార్యభర్తల పేరు మీద, పిల్లల పేరు మీద జరిగే వ్యవహారాలు మొదలైన వాటికి సోర్స్‌ కుటుంబ సభ్యుల నుంచే రావాలి. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, గత తరంగానీ, భవిష్యత్తు తరంగానీ, జాయింట్‌ ఓనర్స్‌... డాక్యుమెంట్‌ ప్రకారం ఉండి.. సోర్స్‌ వారిలో ఎవరి దగ్గర్నుంచైనా ఉండాలి. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే ‘సోర్స్‌’ అంటే ‘కెపాసిటీ‘ ఉండాలి. నిజమైన వ్యవహారం అయి ఉండాలి. డమ్మీలుండకూడదు. మరి కొన్ని ఉదాహరణలు గమనించండి..➤‘అ’ అనే అన్నగారు ఒక ఇల్లు కొన్నారు. తానే డబ్బు ఇచ్చారు. కానీ ‘ఆ’ అనే వదిన గారి పేరు మీద రిజిస్టేషన్‌ జరిగింది. ‘అ’ ఆ ఇంట్లోనే ఉంటారు. ఈ కేసులో ‘ఆ’ బినామీదారు. ‘అ’ ప్రయోజనం పొందిన వ్యక్తి.➤ఇక మరో కేసు. ఇది వింటే ‘మత్తు’ వదిలిపోతుంది. 'పీ’ అనే వ్యక్తికి లిక్కర్‌ లైసెన్సు ఉంది. తన ఉద్యోగి ‘ఖ’ పేరు మీద అన్ని చెల్లింపులు. కానీ రాబడి అంతా 'పీ’దే. ఇదొక బినామీ వ్యవహారం.బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కల్పిత పేర్లతో, లేనివారి పేరు మీద, మరణించిన వారి పేరుతో మీద పెడతారు. ఇదీ బినామీయే. ఉద్యోగస్తుల పేరు మీద బ్యాంకు లాకర్లు తెరిచి అందులో నగదు, బంగారం పెట్టడం, అలాగే బంధువుల పేరు మీద వ్యవహారాలు చేయడం.. ఇటువంటి వ్యవహారాల్లో బేతాళ కథల్లోని కల్పిత వ్యక్తి ... బినామీదారు. తన గుట్టు చెప్పకుండా ప్రయోజనం పొందే వ్యక్తి, ప్రయోజనం పొందిన వ్యక్తిని ఈ పేరుతో వ్యవహరిస్తారు.ఈ వ్యవహారాలు/ఆస్తులు, ఇందులోని సూత్రధారులు అందరూ శిక్షార్హులే! ‘‘బినామీ వ్యవహారాలకు దూరంగా ఉండండి’’ అని డిపార్టుమెంటు వారు జారీ చేసిన కరపత్రాలు చదవండి. బినామీ అంటే సునామీ లాంటిది.ట్యాక్సేషన్‌ నిపుణులు: కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి & కె.వి.ఎన్‌ లావణ్య

Advertisement
Advertisement
Advertisement