Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Lenskart Solutions Posts Strong Profit Surge in Q3 FY261
లెన్స్‌కార్ట్‌కు భారీ లాభాలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో కళ్లద్దాల కంపెనీ లెన్స్‌కార్ట్‌ సొల్యూషన్స్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 133 కోట్లకు చేరింది.కొత్త కస్టమర్లు జత కలవడం, మార్జిన్లు మెరుగుపడటం, అంతర్జాతీయ బిజినెస్‌ పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 38 శాతం జంప్‌చేసి రూ. 2,308 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 1,669 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. దేశీ ఆదాయం 40 శాతం, విదేశీ ఆదాయం 33 శాతం చొప్పున ఎగసినట్లు కంపెనీ పేర్కొంది.ఈ కాలంలో పన్నుకు ముందు లాభం(పీబీటీ) రూ. 48 కోట్ల నుంచి మూడు రెట్లు బలపడి రూ. 161 కోట్లకు చేరింది. విదేశీ మార్కెట్ల నుంచి రూ. 33 కోట్ల పీబీటీ ఆర్జించగా.. గత క్యూ3లో ఇది రూ. 42 కోట్ల నష్టంగా నమోదైంది.

Tata Capital Launches Loan Awareness Campaign Sawal Karo Phir Loan Lo2
రుణాలపై టాటా క్యాపిటల్‌ అవగాహన కార్యక్రమాలు

ముంబై: ‘సవాల్‌ కరో, ఫిర్‌ లోన్‌ లో’ పే రిట రుణాలపై అవగాహనను పెంచేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిట ల్‌ వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రుణాల ప్రక్రియ సరళతరంగా మారి లోన్స్‌ మరింత అందుబాటులోకి వచ్చాయని టాటా క్యాపిటల్‌ ఎండీ రాజీవ్‌ సబర్వాల్‌ తెలిపారు.ఈ నేపథ్యంలో పూర్తి సమాచారంతో రుణం విషయంలో హడావిడి పడకుండా, సరై న ప్రశ్నలు వేసుకుని, తమ ఆర్థిక బాధ్య తలను పూర్తిగా అర్థం చేసుకుని ముందడుగు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. దీనితో దేశీయంగా రుణ వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు.

PV dispatches rise 13percent to 4,49616 units in Jan 20263
టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు 

న్యూఢిల్లీ: దేశీయంగా జనవరిలో ప్యాసింజర్‌ వాహనాలు (పీవీ), టూ–వీలర్లు, త్రీ–వీలర్ల టోకు అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. భారతీయ ఆటోమోబైల్స్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ గణాంకాల ప్రకారం పీవీల టోకు అమ్మకాలు 12.6 శాతం వృద్ధితో 4,49,616 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో ఇవి 3,99,386 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం డీలర్లకు ద్విచక్ర వాహనాల డిస్పాచ్‌లు 26.2 శాతం వృద్ధితో 15,26,218 యూనిట్ల నుంచి 19,25,603 యూనిట్లకు పెరిగాయి. మొత్తం త్రీ–వీలర్ల అమ్మకాలు కూడా 30.2 శాతం పెరిగి 58,167 యూనిట్ల నుంచి 75,725 యూనిట్లకు చేరాయి. వివిధ కేటగిరీలన్నీ కలిపి మొత్తం టోకు విక్రయాలు వార్షికంగా 23.5 శాతం వృద్ధితో 24,50,944 యూనిట్లకు చేరాయి. గతేడా ఈ వ్యవధిలో వీటి పరిమాణం 19,83,771 యూనిట్లు. కొత్త సంవత్సరం సానుకూలంగా ప్రారంభమైందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో గత త్రైమాసికంలో నమోదైన అమ్మకాల జోరు తాజాగా జనవరిలో కూడా కొనసాగిందని ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన చర్యలు దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయనుందని, ప్రస్తుత పాలసీలోని సానుకూలాంశాలు కూడా తోడైతే మధ్యకాలికంగా ఆటోపరిశ్రమ వృద్ధికి తోడ్పడతాయని, అలాగే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కూడా లభించగలవని మీనన్‌ చెప్పారు. ఎగుమతులు జోరు మూడు కేటగిరీల్లోనూ ఎగుమతులు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. మొత్తం పీవీల ఎగుమతులు 33.4 శాతం వృద్ధితో 57,585 యూనిట్ల నుంచి 76,822 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల ఎక్స్‌పోర్ట్స్‌ 3,80,528 యూనిట్ల నుంచి 20 శాతం పెరిగి 4,56,435 యూనిట్లకు పెరిగాయి. అదే విధంగా మొత్తం త్రీ–వీలర్ల ఎగుమతులు 54.6 శాతం పెరిగాయి. 23,859 యూనిట్ల నుంచి 36,879 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవ్యాప్తంగా మొత్తం వాహనాల ఎగుమతులు 4,62,500 యూనిట్ల నుంచి 23.5 శాతం వృద్ధి చెంది 5,71,066 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతుల్లో మారుతీ టాప్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలి్చంది. కంపెనీ ఎక్స్‌పోర్ట్స్‌ వార్షిక ప్రాతిపదికన 89 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో 26,781 యూనిట్లుగా ఉండగా తాజాగా 50,716 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్‌ ఎగుమతులు 21 శాతం పెరిగినప్పటికీ మొత్తం ఎగుమతుల మార్కెట్లో వాటా 20 శాతం నుంచి 18 శాతానికి పడిపోవడం గమనార్హం. అటు నిస్సాన్, ఫోక్స్‌వ్యాగన్‌ ఎగుమతులు కూడా 36 శాతం, 78 శాతం క్షీణించినట్లు సియామ్‌ గణాంకాల్లో వెల్లడైంది. భారత్‌ నుంచి మొత్తం పీవీల ఎగుమతుల్లో తమ సంస్థ వాటా 66 శాతంగా ఉన్నట్లు మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాహుల్‌ భారతి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో కంపెనీ దాదాపు 3.6 లక్షల ప్యాసింజర్‌ వాహనాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. ఇవి మొత్తం పీవీల ఎగుమతుల్లో 48 శాతమని రాహుల్‌ చెప్పారు. పరిశ్రమ ఎక్స్‌పోర్ట్స్‌ 7 శాతం పెరగ్గా, తమ ఎగుమతులు 32 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. తమ తొలి బీఈవీ అయిన ఈ–విటారా ఎగుమతులు గతేడాది ఆగస్టు నుంచి ప్రారంభం కావడం ఎక్స్‌పోర్ట్స్‌కి ఊతమిస్తోందని రాహుల్‌ తెలిపారు. ఇప్పటివరకు ప్రధానంగా యూరప్‌లోని 36 దేశాలకు దాదాపు 16,000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించారు. 2030 నాటికి ఎగుమతుల్లో 30 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు హ్యుందాయ్‌ మోటర్స్‌ ఇండియా ఎండీ తరుణ్‌ గర్గ్‌ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో కొత్త అవకాశాలు లభించగలవని తెలిపారు.

Bondada Engineering Partners for Green Data Centers in India4
బ్రయాన్‌స్టన్‌తో బొండాడ ఇంజినీరింగ్‌ ఎంవోయూ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హరిత విద్యుత్‌ ఆధారిత డేటా సెంటర్‌ ప్యాకేజీలను సంయుక్తంగా అభివృద్ధి చేసే దిశగా బొండాడ ఇంజినీరింగ్‌ (బీఈఎల్‌), దుబాయ్‌కి చెందిన బ్రయాన్‌స్టన్‌ రెన్యువబుల్స్‌ ఎఫ్‌జెడ్‌సీవో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌తో పాటు నిర్దిష్ట అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడులో 69.51 ఎండబ్ల్యూపీ సామర్థ్యంతో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులను జనవరిలో విజయవంతంగా వినియోగంలోకి తెచి్చనట్లు కంపెనీ తెలిపింది. పారడైమ్‌ ఐటీ, మహాజెన్‌కో, ఎన్‌ఎల్‌సీ ఇండియా తదితర క్లయింట్ల కోసం ఈ ప్రాజెక్టులను నిర్మించినట్లు వివరించింది.

62percent Young Indians See Gold As Safest Investment5
‘బంగారం బాట’లో యువ భారతం 

న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా... యువ భారతం బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా 18–39 ఏళ్ల మధ్య వయసు కలిగిన 5,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో ‘స్మిట్టెన్‌ పల్స్‌ఏఐ’ ఒక నివేదిక విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది పెట్టుబడుల్లో తొలి ప్రాధాన్యతం బంగారానికి ఇచ్చారు. గతంలో బంగారం కొనాలంటే ఇంటి పెద్దల సలహా తీసుకునేవారు. కానీ ఇప్పుడు 66.7% మంది యువత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయిదు గ్రాముల లోపే పసిడి కొన్నామని 62% మంది వెల్లడించారు. 2 గ్రాముల లోపు కొనుగోలు చేసిన వాళ్లు 27.5% మంది కాగా.. 2–5 గ్రాముల మధ్య కొనుగోలు చేసిన వాళ్లు 34.4% మంది ఉన్నారు. → తమ మొదటి జీతం/సంపాదనతో తొలిసారి 24% మంది పసిడిని కొనుగోలు చేశారు. కేవలం పెట్టుబడిగా పసిడిని కొనుగోలు చేసినట్లు 23.9% మంది వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితి సందర్భాల్లో, బ్యాంకు సేవింగ్స్, మ్యూచువల్‌ ఫండ్స్, ఈక్విటీలతో పోలిస్తే 65.7% మంది బంగారమే అత్యంత సురక్షితమైన సాధనంగా భావిస్తున్నామని తెలిపారు. సుమారు 65.7% మంది స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్ల (ఎంఎఫ్‌) కంటే పసిడినే అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారని సర్వేలో తేలింది. → ఒకవేళ రూ.25,000 నగదు రూపంలో ఉంటే.., పసిడి కొంటామని 61.9% మంది పేర్కొన్నారు. మ్యూచువల్‌ ఫండ్లకు 16.6%, డిపాజిట్లు 13%, షేర్లు 6.6%, క్రిప్టో 1.9% మంది ఆసక్తి చూపారు. రత్నాలు, ఆభరణ ఎగుమతులు డీలా గత నెల(జనవరి)లో రత్నాలు, బంగారు ఆభరణ ఎగుమతులు డీలా పడ్డాయి. 2025 జనవరితో పోలిస్తే 6% క్షీణించి 2,239 మిలి యన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 2025 జనవరిలో ఇవి 2,376 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణ ఎగుమతుల ప్రో త్సాహక సమితి(జీజేఈపీసీ) వివరాలివి. ప్రపంచ వాణిజ్య సవాళ్లు, కీలక మార్కెట్లలో టారిఫ్‌ ఒత్తిళ్లు ప్రభావం చూపాయి. ఈ బాటలో ప్రస్తు త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి 10 నెల ల(ఏప్రిల్‌ 2025–జనవరి 2026)నూ ఇవి నామమాత్ర వెనకడుగు వేశాయి. 0.6% తగ్గి 23,186 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతే డాది(2024–25) ఇదే కాలంలో ఇవి 23,335 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధా నంగా దేశీ ఆభరణ ఎగుమతులకు ప్రధాన మార్కెట్‌గా నిలిచే యూఎస్‌కు షిప్‌మెంట్స్‌ 45% నీరసించడం ప్రభావం చూపింది.

Global technology leaders launch Trusted Tech Alliance6
డిజిటల్‌ పారదర్శకతకు అంతర్జాతీయ కూటమి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయ సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలకు చెందిన 15 ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ‘ట్రస్టెడ్‌ టెక్‌ అలయన్స్‌ (టీటీఏ)’ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. జర్మనీలో జరిగిన మ్యూనిక్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ అలయన్స్‌ను ప్రకటించాయి. డిజిటల్‌ వ్యవస్థకు ఆధారమైన కనెక్టివిటీ, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్లు, సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధ (ఏఐ) తదితర అన్ని విభాగాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఈ విభాగాల్లో పారదర్శకత, భద్రత, గవర్నెన్స్‌కు సంబంధించిన ఉమ్మడి ప్రమాణాలు రూపొందించడమే ప్రధాన ఉద్దేశమని అలయన్స్‌ సంయుక్త ప్రకటనలో పేర్కొంది. అమెజాన్‌ వెబ్‌ సరీ్వసెస్, ఆంథ్రోపిక్, కసావా టెక్నాలజీస్, కోహిర్, ఎరిక్సన్, గూగుల్‌ క్లౌడ్, హాన్‌వా గ్రూప్, జియో ప్లాట్‌ఫామ్స్, మైక్రోసాఫ్ట్, నోకియా, ఎన్‌స్కేల్, ఎన్‌టీటీ, రాపిడస్, సాబ్, సాప్‌ తదితర సంస్థలు ఈ అలయన్స్‌కు స్థాపక సభ్యులుగాఉన్నాయి. డిజిటల్‌ విశ్వసనీయతకు అంతర్జాతీయ కృషిప్రపంచ దేశాల మధ్య భౌగోళిక–రాజకీయ విభజన పెరుగుతున్న నేపథ్యంలో ‘ట్రస్టెడ్‌ టెక్‌ అలయన్స్‌’ను ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్న పరిస్థితుల్లో డిజిటల్‌ విశ్వసనీయతను బలోపేతం చేయడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు జాతీయ భద్రత, ఆర్థిక పోటీ సామర్థ్యాలతో మరింత అనుసంధానం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ సప్లయిదారుల విషయంలో అధిక స్థాయి విశ్వసనీయత అవసరమని ప్రభుత్వాలు కంపెనీలు కోరుకుంటున్నాయని అలయన్స్‌ వెల్లడించింది. టెక్నాలజీ ఏ దేశానికి చెందినదన్న అంశం కంటే, ఉమ్మడి ఆపరేటింగ్‌ ప్రమాణాల ఆధారంగానే నమ్మకాన్ని నిర్మించవచ్చని చూపించేందుకే టీటీఏ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినట్లు పేర్కొంది. అయిదు నిర్దిష్ట సూత్రాలకు అంగీకారం అలయన్స్‌ సభ్య సంస్థలు ఐదు కీలక సూత్రాలకు అంగీకారం తెలిపాయి. (1). పారదర్శక కార్పొరేట్‌ పాలన, నైతిక ప్రవర్తన(2). కార్యకలాపాల్లో స్పష్టత, సురక్షిత డెవలప్‌మెంట్, స్వతంత్ర అసెస్‌మెంట్‌ (3). బలమైన సప్లై చైన్, భద్రతా పర్యవేక్షణ (4). ఓపెన్, సహకారాత్మక, సమగ్ర, స్థిరమైన డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ (5). చట్టపాలనకు, డేటా పరిరక్షణకు గౌరవం. ఈ అయిదు సూత్రాల ప్రకారం టెక్నాలజీ అభివృద్ధి నుంచి వినియోగం వరకు ప్రతి దశలోనూ భద్రత అమలు చేయాల్సి ఉంటుంది.అలయన్స్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ భాగస్వామ్యంఅలయన్స్‌లో భారతీయ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ భాగస్వామ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘డిజిటల్‌ ఇండియా’, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమాలకు అనుగుణంగా కనెక్టివిటీ, క్లౌడ్, సెమీకండక్టర్లు, ఏఐ వంటి కీలక రంగాల్లో గ్లోబల్‌ స్థాయి ఉమ్మడి ప్రమాణాల రూపకల్పనలో భారత్‌ పాత్రను ఇది మరింత బలోపేతం చేయనుంది. టెక్నాలజీ ఏ దేశానికి చెందినదన్న అంశం కంటే, పారదర్శకత–భద్రత ఆధారిత ప్రమాణాలే విశ్వాసానికి పునాది కావాలన్న దృక్పథం భారత్‌కు వ్యూహాత్మకంగా అనుకూలంగా మారనుందని జియో ప్లాట్‌ఫామ్స్‌ సీఈవో కిరణ్‌ థామస్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement