Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

How Much Interest Can Be Earned by Keeping Money in Swiss Banks1
వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్‌లో డబ్బు!

చాలామంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు మొదలైన సంపన్నులు.. వారి అపార సంపదను (డబ్బు) స్విస్ బ్యాంకులో దాచుకుంటారని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఇక్కడ డబ్బు దాచుకుంటారు సరే.. ఈ డబ్బుకు వడ్డీ వస్తుందా?, వస్తే ఎంత వస్తుంది? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వడ్డీ వస్తుందా?స్విస్ బ్యాంక్ అనేది.. గోప్యత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఇక్కడ ఎవరైనా డబ్బు దాచుకుంటే, సాధారణ బ్యాంకుల మాదిరిగా చెప్పుకోదగ్గ వడ్డీ అయితే రాదు. చాలా తక్కువ మొత్తంలో వడ్డీ వస్తుంది. ఇతర బ్యాంకుల్లో మాదిరిగానే.. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్‌లపై వడ్డీ లభిస్తుంది.నిజానికి.. పెద్ద మొత్తంలో డబ్బు స్విస్ బ్యాంక్‌లో ఉంచితే వడ్డీ రావడం కంటే, బ్యాంక్ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కాబట్టి స్విస్ బ్యాంకులో ఖాతాలు తెరవడం ప్రధానంగా.. వడ్డీ కోసం కాకుండా డబ్బు భద్రత & స్థిరత్వం కోసం చేస్తారు.స్విస్ బ్యాంక్‌లో ఖాతా సులభమేనా?స్విస్ బ్యాంక్‌లో ఖాతా తెరవడం అంత సులభం కాదు. కనీస డిపాజిట్‌గా కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అదనంగా, ఖాతా నిర్వహణకు సంవత్సరానికి భారీ ఫీజులు కూడా వసూలు చేస్తారు. ఈ కారణాల వల్ల సాధారణ మధ్యతరగతి వ్యక్తులకు స్విస్ బ్యాంక్ ఖాతాలు సాధ్యపడవు.కీలకమైన మార్పులు!ఇక తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఒకప్పుడు స్విస్ బ్యాంక్ అంటేనే పూర్తి గోప్యతకు ప్రతీకగా భావించేవారు. స్విస్ బ్యాంక్‌లో డబ్బు ఉంటే ఎవరికీ తెలియదు అనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉండేది. ముఖ్యంగా పన్ను ఎగవేత, అక్రమ సంపద వంటి విషయాల్లో స్విస్ బ్యాంకుల పేరు తరచూ వినిపించేది. కానీ కాలం మారడంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కూడా భారీ మార్పులు వచ్చాయి. దాంతో స్విస్ బ్యాంకుల గోప్యత విధానంలో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.ఇప్పుడు స్విస్ బ్యాంకులు ఖాతాదారుల వివరాలను ఇతర దేశాలతో పంచుకుంటున్నాయి. అయితే ఇది యథేచ్ఛగా కాదు, కొన్ని నియమాలు & అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే జరుగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం అంతర్జాతీయ ఒత్తిడి. ప్రపంచ దేశాలు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో OECD (ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో CRS (కమాండ్ రిపోర్టింగ్ స్టాండర్డ్) అనే విధానం అమల్లోకి వచ్చింది.ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!

Benami Properties its Dealings Are Banned in India2
బినామీ ఆస్తులకు చెక్‌

బినామీ ఆస్తులు... దాని వ్యవహారాలను భారతదేశంలో నిషేధించారు. ఇందుకు సంబంధించి 1988లో చట్టమే వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన, బలమైన చట్టం.ఆస్తి అంటే: బినామీ వ్యవహారాలన్నీ ఆస్తి చుట్టూ తిరుగుతాయి. అందుకని ‘ఆస్తి’ అనే పదాన్ని బాగా నిర్వచించారు. చట్టంలో ఈ నిర్వచనం కష్టమయితే చాలా తెలివిగా, పరిధి ఎక్కువగా ఉండేలా వివరణ ఇచ్చారు. ఈ క్రిందివన్నీ ‘ఆస్తి’ అని పెద్ద జాబితా చెబుతారు. ఈ నిర్వచనం చదివితే మీకు భగవద్గీత స్ఫురణకు రాకతప్పదు.(1) ఏ రకమయినా.. స్థిరమైన, అస్థిరమైన, కంటికి కనిపించేవి... కనపడవని... భౌతికమైనవి... నిరాకారమైనవి. (2) హక్కు, ఆసక్తి, దస్తావేజుల్లో పేరు, ప్రస్తావన(3) రూపాంతరం చెందగలిగే ఆస్తి(4) పై పేర్కొన్న 1,2,3 ఆస్తుల ద్వారా వచ్చిన వసూళ్లు ..రియల్‌ ఎస్టేట్, భూములు, ఇళ్లు, పొలాలు, స్థిరాస్తులు, షేర్లు, వేతనాలు, ఫిక్సిడ్‌ డిపాజిట్లు, బ్యాంకు డిపాజిట్లు, నగదు బ్యాంకు లాకర్లు, ప్రయివేటు లాకర్లు మొదలైనవి.బినామీ వ్యవహారం ఏమిటంటే..➤ఒక వ్యవహారం–ఒప్పందం.. ఒక ఆస్తికి కాగితాల ప్రకారం ఓనర్‌ (యజమాని) ఓనమాలు రాని ఓబయ్య అయితే.., ఆ వ్యవహారానికి మదుపు పెట్టినది చదువుకున్న చలమయ్య. ఇందులో చలమయ్య గారికి ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది.➤లేని వ్యక్తి పేరు మీద, డమ్మీ వ్యక్తి పేరు మీద జరిగే వ్యవహారం... కర్త, కర్మ, క్రియ... ఒకరైతే.. అబద్దపు పేరుతో దస్తావేజులు తయారవుతాయి.➤ఒక వ్యక్తి/సంస్థకి తెలియకుండా/చెప్పకుండా/ ఎరుకలో లేకుండా జరిగిన వ్యవహారం. విచారణలో నాకు తెలియదు, నేను కాదని, నాకు హక్కు లేదని ధ్రువీకరించిన కేసులు.➤కొన్ని వ్యవహారాల్లో మనిషి కల్పితం (చందమామ బేతాళ కథల్లోలాగా).గాభరా పడొద్దు.. వీటికీ మినహాయింపులున్నాయి. హిందూ ఉమ్మడి కుటుంబంలో కర్త కాని, సభ్యులు కాని వారి పేరు మీద ఆస్తి ఉంచుకోవచ్చు. కానీ సోర్స్‌ మాత్రం కుటుంబం నుంచే రావాలి. ప్రయోజనం ఉమ్మడి కుటుంబానికే చెందాలి. ట్రస్టుల్లో, భాగస్వామ్యంలో, కంపెనీల్లో, డిపాజిటరీలాగా, ఏజెంటులాగా, విశ్వాసపాత్రుడి హోదాలో వ్యవహారాలు.. కుటుంబంలో భార్యభర్తల పేరు మీద, పిల్లల పేరు మీద జరిగే వ్యవహారాలు మొదలైన వాటికి సోర్స్‌ కుటుంబ సభ్యుల నుంచే రావాలి. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, గత తరంగానీ, భవిష్యత్తు తరంగానీ, జాయింట్‌ ఓనర్స్‌... డాక్యుమెంట్‌ ప్రకారం ఉండి.. సోర్స్‌ వారిలో ఎవరి దగ్గర్నుంచైనా ఉండాలి. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే ‘సోర్స్‌’ అంటే ‘కెపాసిటీ‘ ఉండాలి. నిజమైన వ్యవహారం అయి ఉండాలి. డమ్మీలుండకూడదు. మరి కొన్ని ఉదాహరణలు గమనించండి..➤‘అ’ అనే అన్నగారు ఒక ఇల్లు కొన్నారు. తానే డబ్బు ఇచ్చారు. కానీ ‘ఆ’ అనే వదిన గారి పేరు మీద రిజిస్టేషన్‌ జరిగింది. ‘అ’ ఆ ఇంట్లోనే ఉంటారు. ఈ కేసులో ‘ఆ’ బినామీదారు. ‘అ’ ప్రయోజనం పొందిన వ్యక్తి.➤ఇక మరో కేసు. ఇది వింటే ‘మత్తు’ వదిలిపోతుంది. 'పీ’ అనే వ్యక్తికి లిక్కర్‌ లైసెన్సు ఉంది. తన ఉద్యోగి ‘ఖ’ పేరు మీద అన్ని చెల్లింపులు. కానీ రాబడి అంతా 'పీ’దే. ఇదొక బినామీ వ్యవహారం.బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కల్పిత పేర్లతో, లేనివారి పేరు మీద, మరణించిన వారి పేరుతో మీద పెడతారు. ఇదీ బినామీయే. ఉద్యోగస్తుల పేరు మీద బ్యాంకు లాకర్లు తెరిచి అందులో నగదు, బంగారం పెట్టడం, అలాగే బంధువుల పేరు మీద వ్యవహారాలు చేయడం.. ఇటువంటి వ్యవహారాల్లో బేతాళ కథల్లోని కల్పిత వ్యక్తి ... బినామీదారు. తన గుట్టు చెప్పకుండా ప్రయోజనం పొందే వ్యక్తి, ప్రయోజనం పొందిన వ్యక్తిని ఈ పేరుతో వ్యవహరిస్తారు.ఈ వ్యవహారాలు/ఆస్తులు, ఇందులోని సూత్రధారులు అందరూ శిక్షార్హులే! ‘‘బినామీ వ్యవహారాలకు దూరంగా ఉండండి’’ అని డిపార్టుమెంటు వారు జారీ చేసిన కరపత్రాలు చదవండి. బినామీ అంటే సునామీ లాంటిది.

Stock Market Closing Update 19th January 20263
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 324.17 పాయింట్ల నష్టంతో 83,246.18 వద్ద, నిఫ్టీ 108.85 పాయింట్ల నష్టంతో 25,585.50 వద్ద నిలిచాయి.భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఏఎండీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిందాల్ సా లిమిటెడ్, బజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్, శ్రీ రామ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ (ఇండియా) లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, డిలిజెంట్ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Silver Prices Crosses Rs 3 Lakh Per KG Mark4
సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!

బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరువలో ఉండగా.. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ. 3 లక్షలు దాటేసింది.పెట్టుబడిదారుల డిమాండ్, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల కేజీ వెండి రూ.3 లక్షల రికార్డును అధిగమించాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఔన్సు ధర ఏకంగా 94.35 డాలర్లు పెరిగింది. ఇటీవలి సెషన్లలో బంగారం కంటే వెండికి డిమాండ్ పెరుగుతోందని.. దీనికి డాలర్ విలువ తగ్గడం కూడా సహాయపడిందని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజు (జనవరి 19) హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో కేజీ వెండి రేటు 8000 రూపాయలు పెరిగి, రూ. 3.18 లక్షలకు చేరింది. ముంబైలో కేజీ సిల్వర్ రేటు రూ. 10వేలు పెరిగినప్పటికీ రూ. 3.05 లక్షల వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా ఇదే రేటు వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఊహించనంతగా పెరుగుతున్న బంగారం.. కారణమెవరు?వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?వెండిని కేవలం ఆభరణాలు, కాయిన్స్ రూపంలో మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో.. ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుదలవైపు పరుగులు పెడతాయి.

Why Residential electricity Rates Rose Sharply in USA5
విద్యుత్తు బిల్లులో అసమానతలు

అమెరికాలో గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు గుదిబండగా మారుతున్నాయి. గత ఐదేళ్లలో విద్యుత్ ధరలు ఆకాశాన్ని తాకగా ఈ భారం పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నప్పటికీ, వాటి ఖర్చును కూడా సామాన్య పౌరులే మోయాల్సి వస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఫిబ్రవరి 2020తో పోలిస్తే అమెరికా వ్యాప్తంగా విద్యుత్ ధరలు సగటున 40 శాతం పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా వాషింగ్టన్‌లో జులై 2020 నుంచి జులై 2025 మధ్య విద్యుత్ ఖర్చులు ఏకంగా 93 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) డేటా ప్రకారం 2022-2024 మధ్య..నివాస వినియోగదారుల విద్యుత్తు బిల్లులు 10 శాతం పెరిగాయి.వాణిజ్య వినియోగదారులపై 3 శాతం మాత్రమే పెరిగాయి.పారిశ్రామిక వినియోగదారులపై ధరలు 2 శాతం తగ్గాయి.డేటా సెంటర్లుచిన్నపాటి నగరాలకు సరిపోయే విద్యుత్తును వినియోగించే డేటా సెంటర్లు గ్రిడ్‌లోకి వస్తున్నా వాటికి తక్కువ ధరలకే విద్యుత్ అందుతోంది. ఈఐఏ గణాంకాల ప్రకారం, 2024 చివరి నాటికి నివాస వినియోగదారులకు యూనిట్ (కిలోవాట్-గంట) ధర 16 సెంట్లు ఉండగా వాణిజ్య వినియోగదారులకు అది 13 సెంట్లు మాత్రమే ఉంది.ఈ వ్యత్యాసానికి కారణాలునివాస ప్రాంతాలకు విద్యుత్ చేరవేయడానికి స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఖర్చు పెరిగింది. ఇవి తుఫానులు, అడవి మంటల వల్ల దెబ్బతింటే ఆ మరమ్మతు ఖర్చులు వినియోగదారులపైనే పడుతున్నాయి.డేటా సెంటర్లు నేరుగా హై-వోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ లైన్లకు అనుసంధానమవుతాయి. తద్వారా పంపిణీ ఖర్చుల నుంచి తప్పుకుంటున్నాయి.పెద్ద కంపెనీలకు ఉన్న లాబీయింగ్ బలం సామాన్య ప్రజలకు ఉండదు. యుటిలిటీ రెగ్యులేటర్ల వద్ద కంపెనీలు తమకు అనుకూలమైన ధరలను సాధించుకోగలుగుతున్నాయి.గ్రిడ్ అప్‌గ్రేడ్ భారం ఎవరిది?ఇటీవల యూఎస్‌లో పీజేఎం అనే గ్రిడ్ ఆపరేటర్ 5 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్రాన్స్‌మిషన్ లైన్ల అప్‌గ్రేడ్ ప్రాజెక్టును చేపట్టింది. డేటా సెంటర్ల వల్లేఈ అప్‌గ్రేడ్ అవసరం ఏర్పడినప్పటికీ వర్జీనియా, మేరీల్యాండ్ వంటి ప్రాంతాల్లో ఈ భారాన్ని నివాస వినియోగదారుల బిల్లుల్లో చేర్చడం వివాదాస్పదమైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం, అనేక యుటిలిటీ సంస్థలు మెటా వంటి దిగ్గజ కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. టెక్సాస్‌లో ఎల్ పాసో ఎలక్ట్రిక్ సంస్థ మెటా డేటా సెంటర్ కోసం ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆ విషయాన్ని ప్రజల దృష్టికి రాకుండా దాచేందుకు ప్రయత్నించడం గమనార్హం.మార్పు దిశగా..ఈ అసమానతలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ లా స్కూల్ ఎక్స్‌పర్ట్‌ అరి పెస్కో మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రెగ్యులేటర్లపై ఉందన్నారు. ఇప్పటికే వర్జీనియా రాష్ట్రం డేటా సెంటర్ల కోసం ప్రత్యేక వినియోగదారుల క్లాస్‌ను ఏర్పాటు చేసి గ్రిడ్ అప్‌గ్రేడ్ల కోసం వారి నుంచే ఎక్కువ వసూలు చేసేలా నిబంధనలు మార్చింది. విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. పెరుగుతున్న విద్యుత్ ధరలు అమెరికాలో ఒక ప్రధాన రాజకీయ, ఆర్థిక అంశంగా మారాయి. దీన్ని సరిదిద్దకపోతే ఓటర్ల ఆగ్రహం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం

Why SLMs Matter for India Budget 2026 support is crucial6
డిజిటల్ భారత్ ముంగిట కొత్త విప్లవం

ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ ప్రభంజనం కొనసాగుతున్న వేళ, భారతదేశం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఏఐ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. కేవలం అగ్రరాజ్యాల నమూనాలను అనుకరించకుండా మన దేశ అవసరాలకు తగ్గట్టుగా ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’(SLM) అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో ఈ స్వదేశీ ఏఐ నమూనాల పట్ల కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.ఎల్‌ఎల్‌ఎం Vs ఎస్‌ఎల్‌ఎం.. భారత్‌కు ఏది ముఖ్యం?గత కొన్ని ఏళ్లుగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ పారామీటర్లతో కూడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను అభివృద్ధి చేశాయి. ఇవి శక్తివంతమైనవి అయినప్పటికీ వీటి నిర్వహణకు భారీ ఖర్చు, అపారమైన కంప్యూటింగ్ శక్తి అవసరం. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రతి పౌరుడికి ఏఐ సేవలు అందాలంటే ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ (SLMs)’ సరైన వ్యూహమని నిపుణులు భావిస్తున్నారు.ఇవి అతి తక్కువ కంప్యూటింగ్ శక్తితో పని చేస్తాయి. ప్రాంతీయ భాషలు, మాండలికాలపై ప్రత్యేక శిక్షణ పొందుతాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు ప్రత్యేకంగా వీటిని రూపొందించవచ్చు.భాషా వైవిధ్యానికి ఏఐ అండదేశంలో వందల సంఖ్యలో భాషలు, మాండలికాలు ఉన్నాయి. గ్లోబల్ ఏఐ మోడల్స్ స్థానికంగా ఉన్న అన్ని భాషల్లో ప్రావీణ్యం సాధించాలంటే కష్టం. ఈ లోటును పూడ్చడానికి ‘సర్వం 1’ (Sarvam 1) వంటి మోడల్స్ ఇప్పటికే పునాది వేశాయి. ఇది 10 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే 2 బిలియన్ పారామీటర్ మోడల్. ప్రభుత్వం చేపట్టిన ‘భారత్ జెన్’ (BharatGen) వంటి కార్యక్రమాలు స్వదేశీ ఏఐ అభివృద్ధిలో వేగం పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని స్థాయుల్లోని వారి అవసరాలకు అనుగుణంగా ఏఐ నమూనాలను నిర్మించడం కీలకం.బడ్జెట్ 2026లో ఆశించేవి..2026 బడ్జెట్‌లో ఇండియా ఏఐ మిషన్ (IndiaAI Mission) విస్తరణకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనున్నారు.1. క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా స్టార్టప్‌లకు, చిన్న సంస్థలకు ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాలను తక్కువ ధరకే అందుబాటులోకి తేవడం.2. వ్యవసాయం, గ్రామీణ పాలన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ప్రాంతీయ లాంగ్వేజ్‌ డేటా సేకరణకు ప్రత్యేక నిధులు.3. ఏఐ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులను తయారు చేయడానికి విద్యా సంస్థలకు ప్రోత్సాహకాలు.దేశంలో 85.5 శాతం కుటుంబాల వద్ద స్మార్ట్‌ఫోన్లు, 86.3 శాతం ఇంటర్నెట్ సదుపాయం ఉన్న తరుణంలో స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ విప్లవం ఉత్పాదకతను పెంచడమే కాకుండా సామాన్యుడికి డిజిటల్ సేవలను చేరువ చేస్తుంది. స్వదేశీ ఏఐ ద్వారా భారతదేశం గ్లోబల్ ఏఐ పవర్‌హౌస్‌గా ఎదగడమే కాకుండా, తన సాంస్కృతిక, భాషా వారసత్వాన్ని సాంకేతికతతో అనుసంధానించనుంది.ఇదీ చదవండి: ట్రంప్‌ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు

Advertisement
Advertisement
Advertisement