Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 23rd February 2026 in Telugu states1
బంగారం, వెండి ధరలు.. మళ్లీ కొత్త మార్క్‌లు

దేశంలో బంగారం, వెండి ధరలు వరుస పెరుగుదలతో కొనుగోలుదారులకు షాకులిస్తున్నాయి. పసిడి ధరలు (Today Gold Rate) ఐదో రోజు కొత్త మార్క్‌లను తాకాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు కూడా మళ్లీ భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Black Money Big Risks Why Cash Deals Hurt You2
నగదు వ్యవహారాలు వద్దే వద్దు ..!

నగదు వ్యవహారాలు ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. వ్యవస్థలో నగదు చెలామణి ఈ జనవరిలో రూ. 40 లక్షల కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఇది వార్షికంగా 11.1% చొప్పున పెరుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల ఒక చరిత్రను సృష్టిస్తోంది. మరోవైపు డిజిటల్‌ వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా యూపీఐ వాడే వారి సంఖ్య 400 మిలియన్లు. దానిని మరో 600 మిలియన్లకు పెంచి ‘ఒక బిలియన్‌’కి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎంలు ‘స్కాన్‌అండ్‌పే’ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తు ‘డిజిటల్‌ ప్రపంచమే’. అయినా మనిషి మారడం లేదు. నగదు వదలట్లేదు. రాజకీయ ఎన్నికల్లో నగదు పంపిణీ గురించి వింటాం. సినిమా ఇండస్ట్రీలో అది పరిపాటి. రియల్‌ ఎస్టేట్‌లో అలవాటు. లంచావతరాలకు దురలవాటు. ఎందుకో ఈ పొరపాటు చేసిన తర్వాత, దొరికిపోయిన తర్వాత గ్రహపాటు అని సరిపెట్టుకోవడం సాధారణమైంది. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సక్రమమైన మార్గంలోనే సంపాదిస్తూ చౌక రోజుల్లో ఇళ్లు, ఫ్లాటు కొన్నారు. కాలం కలిసొచ్చింది. వాటిని అమ్మినప్పుడు భారీ లాభాలు వచ్చాయి.అయితే మార్కెట్‌ ధరని మించిన ప్రతిఫలాన్ని నగదులో తీసుకున్నారు. సక్రమమైన(వైట్‌) వ్యవహారాన్ని ఆదాయపన్ను వారికి డిక్లేర్‌ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇంట్లో కొండచిలువగా నగదు నిలువ ఉంది. ఏం చేయాలి? ఇదొక పెద్ద ప్రశ్న..! ఇంతటితో ఆగిపోయిందా? లేదు. జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు స్నేహితుడికి వైద్యం నిమిత్తం రూ.6 లక్షలు నగుదు రూపంలో ఇచ్చింది. ఆ స్నేహితుడు తన భార్య ఆనారోగ్యం కోసం ఖర్చు పెట్టినా భార్య చనిపోయింది. తరువాత ఇన్సూరెన్సు డబ్బు బ్యాంకు ద్వారా వచ్చాయి. ‘చేతిలో నగదు లేదు. తను తిరిగి చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తం చెక్కు ద్వారా ఇస్తాను’ అంటున్నాడు. ఇప్పుడు ఆ జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు ఆ మొత్తాన్ని ఎలా చూపించాలన్నది ప్రశ్న.మంచికి పోతే చెడు ఎదురురొచ్చింది..? తండ్రి బతికున్నప్పుడు జాగాలో సగం రాయించుకున్నాడు పెద్ద కొడుకు. పెద్దలు ఇద్దరూ కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మిగిలిన సగం జాగా పెద్దవాడికే అమ్మేశారు. కానీ పెద్దవాడు వ్యాపారంలో బాగా సంపాదించడం వలన తన దగ్గర ఉన్న నగదు కుటుంబ సభ్యులకిచ్చి వ్యవహారం నడిపించాడు. డబ్బు మీద వ్యామోహం వలన అందరూ నగదు వైపే మొగ్గు చూపించారు. ఒక్కొక్కరి చేతిలో పదేసి లక్షల మూట చేరింది. అటు పెద్దకొడుకు తన ‘బ్లాక్‌మనీ’ని వదిలించుకొని మిగతా అందరికి నగదు పంచి ఇచ్చాడు.నగదు నాగుపాములా తయారైంది.! అన్నదమ్ములు ఐక్యంగా ఉన్న కుటుంబంలో అన్న పురోహితుడు, తమ్ముడు క్యాటరింగ్‌ చేసేవారు. ఇద్దరికి దశ తిరిగింది. బాగా డబ్బులు నగదు రూపంలో వచ్చాయి. భార్యామణుల సలహామేరకు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారు. కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారాయి. టీడీయస్‌.. ఇన్‌కమ్‌టాక్స్‌.. పన్ను ఎగవేత ఉద్దేశంతో ఇన్‌కమ్‌ రిటర్నులు వేయడం లేదు. ఇప్పుడేం చేయాలనేది ఎడతెగని ప్రశ్న..?తను ఒక చిన్న ఇంట్లో ఉంటూ తన పది ప్లాట్లు కేవలం నగదుకే అద్దెకిచ్చి, అద్దె వసూలు చేస్తూ జీవితం కులాసాగా గడుపుతున్నాడు గోవిందం. పొరపాటున ఒక కిరాయిదారునికి ఇచ్చిన రశీదు కొంప ముంచింది. ఒకటి నగదు రశీదు. రెండవది పన్ను ఎగవేత. వీటి విషయం ఏమిటంటే.. నగదు వ్యవహారాలను చేయకండి. అసలు ప్రోత్సహించకండి. నల్లధనం (బ్లాక్‌ మనీ) వైపు వెళ్లొద్దు. నగదులో అప్పు ఇవ్వడం తప్పు. పుచ్చుకోవడం మరీ తప్పు. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకు ద్వారా చెల్లిస్తే అది ఆదాయంగా మారి పన్నుకి గురి అవుతుంది. నగదు తీసుకోవడం తప్పని చెప్పాం కదా..! పోనీ దానిని అకౌంటు చేస్తే కనీసం మీ నిజాయితీ తెలుస్తుంది. గణనీయంగా పెరిగిన నగదు వ్యవహారాలను కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా కనుక్కొవచ్చు. డిపార్ట్‌మెంట్‌ వారి వద్ద ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్‌ విభాగాలున్నాయి. మీరు సంపాదించిన ‘ధనం’ మీ దగ్గర ఉన్నా, వారి దగ్గర ‘ఇంధనం’ లాంటి సమాచారం ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే అవకాశం ఇవ్వకండి. సౌకర్యం కోసం నగదుని ఆశ్రయించకండి. అన్ని విధాల బ్యాంకు దారి సక్రమమైన రహదారి.

Toyota Recalls Over 900 Land Cruisers In India3
900 పైగా ల్యాండ్ క్రూయిజర్లు రీకాల్‌..

టొయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ సంస్థ తన ప్రముఖ లగ్జరీ ఎస్‌యూవీ టొయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ 300 (Toyota Land Cruiser 300)కు సంబంధించి 969 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 4 నుంచి 2025 సెప్టెంబర్ 30 మధ్య తయారైన వాహనాలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.ట్రాన్స్‌మిషన్ సాఫ్ట్‌వేర్ లోపమే కారణంకంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ట్రాన్స్‌మిషన్ పనితీరును నియంత్రించే ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సంభావ్య లోపం గుర్తించారు. ట్రాన్స్‌మిషన్‌లో గేర్ మార్పులను నిర్వహించేందుకు లీనియర్ సోలెనాయిడ్లు ఉపయోగిస్తారు. కొన్ని నిర్దిష్ట డ్రైవింగ్ పరిస్థితుల్లో ఈ సోలెనాయిడ్ సరిగా పనిచేయకపోతే, సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్, ఇంజిన్ ఈసీయూ మధ్య కమ్యూనికేషన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది.ఈ లోపం సరిచేయకపోతే కొన్ని గేర్లలో ట్రాన్స్‌మిషన్ ఓవర్-రివింగ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది ట్రాన్స్‌మిషన్‌కు నష్టం కలిగించడమే కాకుండా, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు పవర్ లాస్ సమస్యను కూడా కలిగించవచ్చు. ట్రాన్స్‌మిషన్ హౌసింగ్ దెబ్బతింటే ఫ్లూయిడ్ లీకేజ్ సంభవించి, చివరికి ట్రాన్స్‌మిషన్ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉందని సంస్థ స్పష్టం చేసింది. అయితే భారత్‌లో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది.లెక్సస్ ఎల్‌ఎక్స్‌లోనూ ఇదే యూనిట్గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ను లెక్సస్‌ ఎల్‌ఎక్స్‌ మోడల్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆ మోడల్‌కు సంబంధించి కూడా ఇలాంటి సమస్యల పరిష్కారానికి రీకాల్ జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.రీకాల్‌లో భాగమైన అన్ని వాహన యజమానులను టొయోటా డీలర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా సంప్రదిస్తారు. అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా సరిదిద్దే చర్యలు ఉచితంగా చేపడతామని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు తమకు ఏవైనా సందేహాలు ఉంటే సమీప డీలర్‌ను లేదా కస్టమర్ అసిస్టెన్స్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది.భారత్‌లో టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.15 కోట్లు. ఇందులో 3.3-లీటర్ వి6 టర్బో డీజిల్ ఇంజిన్‌తో కూడిన 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 304 బీహెచ్‌పీ పవర్‌, 700 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

stock market updates on 23 February 20264
లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ(Nifty) 174 పాయింట్లు పెరిగి 25,746 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 582 పాయింట్లు పుంజుకొని 83,381 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.47బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 71.1 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.08 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.69 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.9 శాతం పుంజుకుంది.Today Nifty position 23-02-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Micro Daily SIPs Gateway for First Time Investors5
డైలీ సిప్‌తో పెట్టుబడులు మరింత సులభతరం

మొదటిసారి ఇన్వెస్ట్‌ చేస్తున్నవారికి, చిన్న మొత్తాలతో పెట్టుబడుల ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే వారికి మైక్రో, డైలీ సిప్‌లు అనువైన సాధనాలుగా ఉంటున్నాయని షేర్‌.మార్కెట్‌ (ఫోన్‌పే వెల్త్‌) ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోడక్ట్స్‌ హెడ్‌ నీలేష్‌ డి నాయక్‌ తెలిపారు. రోజువారీ ప్రాతిపదికన నగదు రూపంలో ఆదాయాలు ఉండేవారికి, స్వయం ఉపాధి పొందే వారికి ఇవి సరిగ్గా సరిపోతాయని చెప్పారు. క్రమంగా వారు పెట్టుబడుల పరిమాణాన్ని పెంచుకుంటూ దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్‌మెంట్‌ వైపు మళ్లేందుకు తోడ్పడుతున్నాయని వివరించారు.ఈక్విటీ ఫండ్స్‌లో సిప్‌లనేవి దీర్ఘకాలిక పెట్టుబడులనే విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలని నాయక్‌ సూచించారు. మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు, మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి గురించి ఆందోళన చెందరాదన్నారు. తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లను కూడబెట్టుకునే అవకాశంగా దీన్ని పరిగణించాలని సూచించారు. స్వల్పకాలిక హెచ్చుతగ్గులపై స్పందించడం కంటే, సిప్‌లను కొనసాగించడం శ్రేయస్కరమన్నారు. వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్టింగ్, ట్రేడింగ్‌ విభాగాల్లో స్టాక్స్, ఈటీఎఫ్‌లు, ఐపీవోలు, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్, అధునాతన ఫీచర్లు, ఇంటెలిజెంట్‌ టూల్స్‌ మొదలైనవి అందిస్తున్నామని నాయక్‌ చెప్పారు. మైక్రో సిప్‌ల ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టే యూజర్లకు యాప్‌లోని కంటెంట్‌తో పాటు సోషల్‌ మీడియా సహా పలు టచ్‌పాయింట్ల మాధ్యమాల ద్వారా అవగాహన కలి్పస్తున్నామని ఆయన తెలిపారు. మార్కెట్లపై నమ్మకాన్ని, పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇవి ఇన్వెస్టర్లకు తోడ్పడుతున్నాయన్నారు.ఏఐ దన్నుడిజిటల్‌ వినియోగం పెరిగే కొద్దీ వెల్త్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు పెట్టుబడులు, ట్రేడింగ్‌ని అన్ని వర్గాల ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చాయని నాయక్‌ చెప్పారు. పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో కృత్రిమ మేధ, డేటా కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. కస్టమర్ల అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడంలో తమకు, సజావుగా మార్కెట్‌ యాక్సెస్‌ లభించేలా ఇన్వెస్టర్లకు ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఏఐపై మరింతగా ఇన్వెస్ట్‌ చేస్తున్నామని నాయక్‌ తెలిపారు. ప్రత్యేకంగా సరళమైన, ఇంటరాక్టివ్‌ యాప్‌ని కూడా తాము రూపొందించినట్లు చెప్పారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్‌కు రెడీనా?

Retirement Isnt 60 Its Freedom Whenever You Choose check details6
రిటైర్మెంట్‌కు రెడీనా?

రిటైర్మెంట్‌ అంటే... 60 ఏళ్లకు కదా! అనుకుంటారంతా. ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచించటమెందుకని రోజులు గడిపేస్తూ ఉంటారు. దాదాపు 70 శాతం మంది వేతన జీవులది ఇదే పరిస్థితి. కాకపోతే ఆ మిగిలిన 30 శాతం మందీ మరోరకంగా ఆలోచిస్తుంటారు. వారి దృష్టిలో రిటైర్మెంట్‌ అంటే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పటం కాదు. తప్పనిసరి పనికి స్వస్తి చెప్పి... నచ్చిన పని చేయగలిగే స్వేచ్ఛను సంపాదించుకోవటం. ఆ స్వేచ్ఛను ఎంత త్వరగా సంపాదించుకోగలిగితే... అంత త్వరగా తప్పనిసరి పనికి గుడ్‌బై కొట్టేయటం. చాలామందికి 60 ఏళ్లు దాటినా కూడా ఈ తరహా స్వేచ్ఛ సాధ్యం కాదు. కొందరు మాత్రం 40లు, 50లలోనే సాధ్యం చేసుకోగలుగుతున్నారు. ఎలా? దీనికి ఏం చేయాలి? ఇదే ఈ వెల్త్‌ స్టోరీ...క్యాంపస్‌లోనో, కాలేజీ నుంచి బయటకు వచ్చాకో మంచి జాబ్‌ కొడితే సెటిలైపోయినట్లేనని భావిస్తారు చాలామంది. ఆదాయాన్ని బట్టి ఖరీదైన ఫోన్లు, కారు, ప్రీమియం హౌస్‌... ఇలా ఖర్చు చేసుకుంటూ వెళుతుంటారు. భవిష్యత్‌ ఆదాయాన్ని కూడా ఈఎంఐల రూపంలో ఇప్పుడే ఖర్చు చేసేస్తుంటారు. వారికప్పుడు రిటైర్మెంట్‌ గుర్తుకే రాదు. కొందరికి గుర్తుకు వచ్చినా ప్రాధాన్యంగా తీసుకోరు. 40 ఏళ్లు దాటాక మెల్లగా ఆలోచించటం మొదలుపెడతారు. అక్కడి నుంచి మరో 15–20 ఏళ్లే ఉండడంతో, ఇక తప్పదులే అనుకుని ఆదాయంలో కొంత పక్కన పెట్టడం ఆరంభిస్తారు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలో ఈ వాయిదానే పెద్ద ప్రతికూలమన్నది చాలా మంది తెలుసుకోరు. 20–30ల నుంచి పెట్టుబడి ఆరంభిస్తేనే అది పెద్ద నిధిగా మారుతుంది. వాస్తవానికి రిటైర్మెంట్‌ ప్రణాళిక ఫెయిలవటానికి ప్రధాన కారణం పెట్టుబడిని ఆలస్యంగా మొదలు పెట్టడమే. త్వరగా మొదలు పెడితే చక్ర వడ్డీ ఫలితంగా (కాంపౌండింగ్‌) అది పెద్ద మొత్తమవుతుందన్నది గుర్తించకపోవటమే.అవగాహన లేమి..ప్రైవేటు రంగంతోపాటు, అసంఘటిత రంగంలోని వారికి సామాజిక భద్రత తక్కువే. ఉద్యోగుల భవిష్యనిధి లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రాబడి 7–8 శాతమే. ఇందులో 6 శాతం ద్రవ్యోల్బణం తీసివేస్తే మిగిలేది ఎంత? కొంత మంది బీమా పాలసీల్లో (ఎండోమెంట్, యులిప్‌) ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఎండోమెంట్‌ ప్లాన్లలో దీర్ఘకాల రాబడి 4–5 శాతం మించదు. యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్లలోనూ (యులిప్‌) రాబడి 8–9 శాతమే. తమకున్న ప్రాపర్టీ ఆదుకుంటుందిలే? అన్నది కూడా అవగాహన లేమే. ఒక్క చిన్న వివాదంతో ప్రాపర్టీ ఏళ్ల కొద్దీ అపరిష్కృతంగా ఉండిపోగలదు.వృద్థాప్యంలో తమ అవసరాలను చూసుకోవడానికి పిల్లలు ఉన్నారుగా? ఇలాంటి ఆలోచనలు.. 60 తర్వాత 20–30 ఏళ్ల ప్రశాంత జీవనానికి సోపానాలు కానే కావు.అత్యాధునిక వైద్య విధానాలతో ఆయుర్దాయం (జీవనకాలం) పెరుగుతోంది. వైద్య వ్యయాలు కూడా ఏటేటా రెండంకెల స్థాయిలో పెరుగుతుండడం చూస్తున్నాం. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలకు పెద్ద మొత్తమే ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే రూ.లక్షల పొదుపు కరిగిపోవచ్చు. ఇక మనలో కొంత మంది అయితే విశ్రాంత జీవన నిధిని పిల్లల విద్యావసరాలకు ఖర్చు పెట్టేస్తుంటారు. ఇది చేయరాని తప్పు. ఆలస్యం అమృతం విషం..25 ఏళ్లకు, 30 ఏళ్లకు, 40 ఏళ్లకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవచ్చు. కానీ సంపద సమకూర్చుకోవడంలో ఎంతో తేడా వస్తుంది. నెలకు రూ.15,000 చొప్పున 25 ఏళ్ల నుంచి మొదలు పెట్టి 60వ ఏట వరకు 10 శాతం వార్షిక రాబడి (సగటు) వచ్చే ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. 35 ఏళ్లలో రూ.5.14 కోట్లు (రూ.514 లక్షలు) సమకూరుతుంది. ఇందులో అసలు పెట్టుబడి రూ.60 లక్షలే.ఐదేళ్లు ఆలస్యంగా 30వ ఏట నుంచి మొదలు పెట్టి 60 వరకు 30 ఏళ్ల పాటు ఇంతే మేర పొదుపు చేస్తే సమకూరేది రూ.3.12 కోట్లు. ఐదేళ్లు ఆలస్యం చేయడం వల్ల రూ.2 కోట్ల నిధిని కోల్పోయినట్టు అవుతుంది. ఇంకో పదేళ్లు ఆలస్యంగా 40 ఏళ్లలో మొదలు పెడితే.. 20 ఏళ్లలో ఇదే రూ.15,000తో సమకూరేది కోటీ ఎనిమిది లక్షల రూపాయలు. ఎంత కావాలి..?ఒక వ్యక్తికి నేడు నెలవారీ రూ.50,000 ఖర్చు అవుతుంటే.. 25 ఏళ్ల తర్వాత అదే మాదిరి జీవన అవసరాలకు నెలకు రూ.2 లక్షలు అవసరమవుతుంది. ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా వేసిన అంచనా ఇది. నెలకు రూ.2 లక్షల ఆదాయం రూ.4–5 కోట్ల నిధిపైనే సాధ్యం. మరి రూ.5 కోట్ల నిధిని సమకూర్చుకోవడం మధ్య తరగతి వారికి ఐదు, పదేళ్లలో సాధ్యమేనా..? కనీసం ఇంత అవసరం..ఆర్జన ఆరంభించిన మొదటి నెల నుంచే 20–25 శాతాన్ని రిటైర్మెంట్‌ ఫండ్‌ కోసం ఇన్వెస్ట్‌ చేయడం మొదలుపెట్టాలి. ఈక్విటీ ఫండ్స్‌లో ప్రతినెలా సిస్టమ్యాటిక్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఏటా ఆదాయ వృద్ధికి సమానంగా రిటైర్మెంట్‌ ఫండ్‌ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాలి. ప్రతి నెలా ఇంటి అద్దె, గ్రోసరీ, యుటిలిటీ (బ్రాడ్‌బ్యాండ్, మొబైల్, విద్యుత్‌) కేటాయింపులు ఎలా తప్పనిసరో.. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్‌ నిధి కోసం నిర్ణీత మొత్తాన్ని పక్కన పెట్టుకోవడం కూడా అంత అవసరం. లేదంటే ఒక లక్ష్యం కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది.రిటైర్మెంట్‌ నాటికి సమకూర్చుకున్న నిధిని మూడు భాగాలు చేసుకోవాలిస్వల్పకాల అవసరాలు, ఆరోగ్య అత్యవసరాల్లో వెంటనే తీసుకునేందుకు వీలుగా (రెండేళ్ల అవసరాలకు సరిపడా) ఒక భాగం ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం లిక్విడిటీ (వెంటనే నగదుగా మార్చుకునే) ఎక్కువగా ఉండే లిక్విడ్‌ ఫండ్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్, మనీ మార్కెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.3–10 ఏళ్ల అవసరాల కోసం ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్, హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. ఇక పదేళ్లకు మించిన అవసరాల కోసం మరో భాగం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పెట్టుబడుల విషయంలో కొంత రిస్క్‌ తీసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌)లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాల నిధి ద్రవ్యోల్బణాన్ని మించి ఎక్కువగా కాంపౌండ్‌ అవుతుంది.వాస్తవాలు ఇవీ..రిటైర్మెంట్‌ కోసం తాము మరింత ముందు నుంచే ఎందుకు ఇన్వెస్ట్‌ చేయలేదు? అని 50 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం మంది ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నట్టు ఒక సర్వేలో వెల్లడైంది.రిటైర్మెంట్‌ ప్రణాళిక కలిగిన వారు 2025 నాటికి 37 శాతమే. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ విషయంలో ప్రణాళికలేమితో ఉన్నట్టు తెలుస్తోంది.తమ పొదుపు నిధి రిటైర్మెంట్‌ తర్వాత పట్టుమని పదేళ్లు అయినా చాలుతుందో, లేదోనని 63 శాతం మంది ఆందోళన చెందుతున్నారు.పట్టణాల్లో సగం మంది రిటైర్మెంట్‌ కోసం ముందు నుంచే పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. కానీ, 40 శాతం మంది విశ్రాంత జీవనం కోసం అసలు పెట్టుబడే మొదలు పెట్టలేదు.ప్రణాళిక మొదలు పెట్టిన వారిలోనూ కేవలం 37 శాతమే సమకూర్చుకోవాల్సిన నిధిలో పావు శాతం లక్ష్యానికి చేరారు. రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేస్తున్న వారిలో జీవిత బీమానూ పరిగణనలోకి తీసుకుంటున్నవారు 95 శాతంగా ఉన్నారు.అత్యంత ముఖ్యమైన నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) పథకం గురించి 64 శాతం మందికి తెలిసినా.. అందులో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు 16–25 శాతం మించిలేరు.ఇక రిటైర్మెంట్‌ కోసం పక్కన పెడుతున్న వారిలో కూడా జీవించినంత కాలం ఆ నిధి సరిపోతుందన్న నమ్మకంతో ఉన్నవారు 19 శాతం మందే.ఈ ఫలితాలు విశ్రాంత జీవన అవసరాలకు చాలా ముందుగా సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ

Advertisement
Advertisement
Advertisement