Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Rich Dad Poor Dad Robert Kiyosaki Featuring in Money Disrupted documentary1
అతిపెద్ద ఆర్థిక మార్పు ఎదుర్కొంటున్నాం: కియోసాకి

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఫెడరల్ రిజర్వ్ విధానాలు, ద్రవ్యోల్బణం, బిట్‌కాయిన్ భవిష్యత్తు వంటి అంశాలపై లోతైన విశ్లేషణతో రూపొందిన డాక్యుమెంటరీ ‘మనీ డిస్‌రప్టెడ్‌’ (Money Disrupted) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ డాక్యుమెంటరీని ఫ్రూషన్ ప్రొడక్షన్స్ తరఫున క్రిస్టఫర్ డాడ్జ్ నిర్మించారు. ప్రముఖ ఇన్వెస్టర్‌, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) ఈ డాక్యుమెంటరీని తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రోత్సహించడంతో ఇది మరింత ప్రచారం పొందింది. దీంట్లో ఆయన మాట్లాడినదానికి సంబంధించి చిన్న వీడియో క్లిప్‌ను జోడిస్తూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో కియోసాకి పోస్ట్‌ చేశారు.చరిత్రలో అతిపెద్ద ఆర్థిక మార్పును ప్రపంచం ఎదుర్కొంటోందని వీడియోలో చెప్పుకొచ్చిన రాబర్ట్‌ కియోసాకి.. దీన్ని తాను ముందే ఊహించానన్నారు. అందుకే ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ పుస్తకాన్ని రచించానన్నారు. ఆ తర్వాత తన జీవితమే మారిపోయి​ందన్నారు. ఇంకా ఆయన ఏమేమి మాట్లాడారన్నది పూర్తి డాక్యుమెంటరీ విడుదలయ్యాక తెలుస్తుంది. ఫెడరల్ రిజర్వ్ నుంచి బిట్‌కాయిన్ వరకూ...డాక్యుమెంటరీలో ముఖ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ (Federal Reserve) స్థాపన తర్వాతి ఆర్థిక పరిణామాలు, 1971లో గోల్డ్ స్టాండర్డ్ ముగింపు, పెరుగుతున్న జాతీయ అప్పులు, ద్రవ్యోల్బణ ప్రభావాలను విశ్లేషించారు.నిపుణుల అభిప్రాయాలతో పాటు, సంప్రదాయ ఫియాట్ కరెన్సీ వ్యవస్థపై విమర్శాత్మక దృష్టికోణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్లాక్‌చెయిన్ సాంకేతికత, బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాలుగా మారవచ్చని చిత్ర బృందం సూచిస్తోంది.ప్రముఖుల అభిప్రాయాలుఈ డాక్యుమెంటరీలో మాజీ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాన్‌ పాల్‌, ఆర్థిక విశ్లేషకులు లినెట్ జాంగ్, ఆండి షెక్ట్‌మన్ తదితరులు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ద్రవ్య విధానాలపై వీరి విమర్శలు, “సౌండ్ మనీ” అవసరంపై వారి వాదనలు ఈ డాక్యుమెంటరీకి వైవిధ్యాన్ని తీసుకురానున్నాయి.Check out the full documentary Money Disrupted by Christopher Dodge of Fruition Productions - here is a short clip https://t.co/uojn89SCoS— Robert Kiyosaki (@theRealKiyosaki) February 23, 2026

PM Narendra Modi Israeli PM Netanyahu Check Out RE Goan Classic 350 At Jerusalem Tech Exhibition2
ఇద్దరు ప్రధానులతో ఇండియన్ బైక్

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ఇజ్రాయెల్‌లో అత్యాధునిక ఆవిష్కరణలను హైలైట్ చేసే ఒక టెక్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఇది మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, భారత్–ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా నిదర్శనం.ఈ టెక్ ప్రదర్శనలో.. వ్యవసాయ సాంకేతికత, నీటి నిర్వహణ, వాతావరణ మార్పుల పరిష్కారాలు, బయోటెక్నాలజీ, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, శక్తి వనరులు & అంతరిక్ష వ్యవస్థలు వంటి అనేక కీలక రంగాల్లో ముందంజలో ఉన్న కంపెనీలు, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి. ప్రపంచ సమస్యలకు సుస్థిర పరిష్కారాలను కనుగొనే దిశగా ఇరు దేశాలు చేస్తున్న సంయుక్త కృషిని ఈ ప్రదర్శన ప్రతిబింబించింది.ఇండియా-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జి ప్రయత్నాలకు టెక్ ఎగ్జిబిషన్‌ ఒక నిదర్శనం. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం & ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల నాయకులు కలిసి పని చేయడానికి మార్గదర్శం అవుతుంది.వేదిక కల్పించబడుతోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం.ఈ ప్రదర్శన సందర్భంలో.. మోదీ చాలామంది పరిశోధకులు, కంపెనీల సీఈఓలు & స్టార్టప్ వ్యవస్థాపకులతో నేరుగా మాట్లాడి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగాల గురించి చర్చించారు. ఇజ్రాయెల్ ప్రపంచంలో ప్రముఖ ఆవిష్కరణ కేంద్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం మరోసారి స్పష్టమైందిరాయల్ ఎన్‌ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350ఈ కార్యక్రమంలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350' మోటార్ సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బైక్‌ను మోదీ & నెతన్యాహు కలిసి పరిశీలించడం ఒక ముఖ్యమైన సందర్భంగా మారింది. ఇది భారత తయారీ శక్తిని & అంతర్జాతీయ మార్కెట్‌లో భారత ఉత్పత్తుల ప్రాధాన్యతను సూచించింది. ఇజ్రాయెల్‌లో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు మంచి ఆదరణ ఉంది.రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350లో 349 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 20.2 బిహెచ్‌పీ పవర్ 27 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5గేర్‌ల గేర్‌బాక్స్‌తో వస్తుంది. 2026 మోడల్‌లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి సరికొత్త సౌకర్యాలు చేర్చబడ్డాయి. అదనంగా, యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!డిజైన్ పరంగా ఈ బైక్ చాలా ప్రత్యేకంగా ఉంది. బాబర్ శైలి ఆకృతి, ఫ్లోటింగ్ సీటు, ఎత్తైన హ్యాండిల్‌బార్, తెల్లటి సైడ్‌వాల్ టైర్లు వంటివి కలిగి ఉండటం వల్ల గోవన్ క్లాసిక్ 350 చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ బైక్ ప్రపంచవ్యాప్తంగా రైడర్ల మనసును గెలుచుకుంటోంది. View this post on Instagram A post shared by NDTV (@ndtv)

Stock Market Closing Update 26th Feb 20263
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్

గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 45.52 పాయింట్ల నష్టంతో 82,230.55 వద్ద, నిఫ్టీ 14.05 పాయింట్ల లాభంతో 25,496.55 వద్ద నిలిచాయి.ఎక్స్‌టిగ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ లిమిటెడ్, తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్, సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా లిమిటెడ్, రినైసాన్స్ గ్లోబల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్, జిందాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్, ట్రాన్స్‌వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, వీఎల్ ఈ గవర్నెన్స్ & ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Tenant House Owner Relationship Must Be Disclosed in New Income Tax Forms4
ఐటీ కొత్త రూల్‌: ఇంటి ఓనర్‌తో సంబంధం చెప్పాలి

ఆదాయపన్ను ముసాయిదా పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకునే వారు ఇకపై ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుండడం గమనార్హం. దీంతో ముసాయిదా పత్రాలు, నిబంధనలపై భాగస్వాములకు ఆదాయపన్ను శాఖ పంపిణీ చేసింది. వేతన జీవులు హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌ను చేసుకునే విషయంలో యాజమాన్యానికి ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఇకపై ఫారమ్‌ 124లో ప్రాపర్టీ యజమానితో ఉన్న సంబంధాన్ని (అసెసీ/పన్ను చెల్లింపుదారు/దాఖలుదారు) వెల్లడించాల్సి ఉంటుంది. కల్పిత, పెంచి చూపించే అద్దె మొత్తాలకు ఈ నిబంధన చెక్‌ పెడుతుందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ఆదాయంపై పన్ను జమ క్లెయిమ్‌లకు సంబంధించి ఆడిటర్లు, కంపెనీలపై బాధ్యతను పెంచడం కూడా కొత్త పత్రాల్లో భాగంగా ఉంది. భారత్‌కు వెలుపల ఏదైనా ప్రాంతానికి సంబంధించిన ఆదాయంపై ఫారీన్‌ ట్యాక్స్‌ విత్‌హోల్డింగ్‌ సర్టిఫికెట్లను అకౌంటెంట్లు స్వతంత్రంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపుల రుజువులు, కరెన్సీ మారకం లావాదేవీలు, పన్ను అర్హత నిబంధనలను, పన్ను చెల్లింపుదారు నివాస హోదాలను సైతం ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

SEBI Whole Time Director Amarjeet Singh Warns Against AI Driven Misinformation 5
ఏఐ మార్కెటింగ్‌ గిమ్మిక్స్‌తో జాగ్రత్త!

ఏఐ వినియోగించడం ద్వారా అనూహ్య లాభాలు పేరిట తెరతీసే మార్కెటింగ్‌ గిమ్మిక్స్‌పట్ల జాగ్రత్త వహించవలసిందిగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అమర్‌జీత్‌ సింగ్‌ తాజాగా పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు స్టాక్‌ మార్కెట్లపట్ల ప్రజలలో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏఐ వినియోగం ద్వారా అత్యుత్తమ రిటర్నులు ఆర్జించవచ్చంటూ మార్కెట్‌ పార్టిసిపెంట్లు కొంతమంది అతిచేయడాన్ని ఈ సందర్భంగా సింగ్‌ ప్రస్తావించారు. స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ, ఐఐఎంకే సంయుక్తంగా నిర్వహించిన ఈవెంట్‌లో సింగ్‌ పలు విషయాలను పేర్కొన్నారు.ఏఐ వినియోగించడం ద్వారా సాధించిన అంశాలను కంపెనీలు అర్ధవంత విధానంలో తెలియజేయవలసి ఉంటుందని సూచించారు. అతిగా ఆర్జించినట్లు లేదా కొన్ని రకాల క్లెయిముల ప్రకటనలు ఇన్వెస్టర్లను మార్కెట్లపట్ల తప్పుదోవపట్టించడంతోపాటు.. విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశమున్నట్లు హెచ్చరించారు. నిజానికి విద్య, పరిశోధన, సమాచారం తదితరాలకు ఏఐ శక్తివంతమైన టూల్‌ అని పేర్కొన్నారు. అయితే ఏఐతో తప్పుడు సమాచార వ్యాప్తికీ వీలున్నదని, వీటిపట్ల అప్రమత్తత అవసరమని తెలియజేశారు.

Festive celebration Diwali Laxmi Brand announced winner Lexus RX 3506
‘లక్ష్మి’ వినియోగదారుడికి లెక్సస్ కారు గిఫ్ట్‌

అమెరికాలోని దక్షిణాసియా కమ్యునిటీకి ఎఫ్‌ఎంసీజీ విభాగంలో సర్వీసులందిస్తున్న హెచ్‌ఓఎస్‌ గ్లోబల్ ఫుడ్స్ తమ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ ‘లక్ష్మి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రాబ్ మోర్, విన్ మోర్’ దీపావళి ఆఫర్‌ విజేతను ప్రకటించింది. ఈ ఆఫర్‌ను గతేడాది దీపావళికి ప్రవేశపెట్టారు. తాజాగా విజేతను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో న్యూజెర్సీకి చెందిన ప్రవాస భారతీయుడు ఉదయకుమార్ బాలతాండాయుధం విజేతగా నిలిచారు. ఇందులో భాగంగా లెక్సస్ ఆర్‌ఎక్స్‌ 350 కారు(సుమారు రూ.80 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. యూఎస్‌లోని బ్రిడ్జ్‌వాటర్‌ ప్రాంతంలో ఉన్న లెక్సస్ షోరూమ్‌లో జరిగిన కార్యక్రమంలో ‘లక్ష్మి’ బ్రాండ్ ప్రతినిధుల సమక్షంలో ఉదయకుమార్ కుటుంబానికి కారు తాళాలను అందజేశారు.ఈ సందర్భంగా హెచ్‌ఓఎస్‌ గ్లోబల్ ఫుడ్స్ సీఈఓ నీల్ సోనీ మాట్లాడుతూ.. ‘చాలా కుటుంబాల్లో తమ సంప్రదాయాలు, రుచుల పట్ల మాకున్న అంకితభావానికి ఈ బహుమతి నిదర్శనం. ప్రామాణిక ఆహారం, రుచి ద్వారా కుటుంబ సంస్కృతిని సజీవంగా ఉంచాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. కంపెనీ సీఓఓ అమ్రపాలి సోనీ మాట్లాడుతూ ‘గత 50 ఏళ్లుగా లక్ష్మి బ్రాండ్ ప్రవాస భారతీయుల ఇళ్లలో భాగమైంది. సొంత ప్రాంతాలకు దూరంగా ఉన్నవారికి స్వదేశీ రుచులను అందిస్తున్నందుకు గర్విస్తున్నాం’ అని తెలిపారు.కారు తాళాలు అందుకున్న అనంతరం విజేత ఉదయకుమార్ తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘మేము గెలిచామంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏళ్ల తరబడి మా ఇంట్లో లక్ష్మి ఉత్పత్తులు వాడుతున్నాం’ అని ఉద్వేగానికి లోనయ్యారు. అమెరికాలో దక్షిణాసియా కమ్యూనిటీకి నాణ్యమైన, స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను అందించడంలో ‘లక్ష్మి’ ప్రముఖంగా నిలుస్తోందని అధికారులు చెప్పారు.ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం..

Advertisement
Advertisement
Advertisement