ప్రధాన వార్తలు
క్రమంగా పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 142 పాయింట్లు పెరిగి 23,723 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 423 పాయింట్లు ఎగబాకి 76,485 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.59బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.97 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.18 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25 శాతం పెరిగింది.నాస్డాక్ 0.47 శాతం పుంజుకుంది.Today Nifty position 18-03-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
డాలర్ ఆధిపత్యానికి గండి!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ భౌగోళిక రాజకీయాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని కూడా వేగంగా మారుస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధి కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు అమెరికా డాలర్ ఏకఛత్రాధిపత్యానికి సవాలు విసురుతున్నాయి.డీ-డాలరైజేషన్ వేగవంతం?హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచంలోని 20% పైగా చమురు రవాణా జరుగుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్, దానికి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు చమురు వ్యాపారాన్ని డాలర్లకు బదులు చైనా కరెన్సీ ‘యువాన్’లో జరపాలని యోచిస్తున్నాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో 80% పైగా చమురు లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ఇప్పుడు యువాన్ వైపు మొగ్గు చూపడం వల్ల డాలర్కు ఉన్న గ్లోబల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటే సురక్షితమైన కరెన్సీగా డాలర్ను కాకుండా ప్రత్యామ్నాయాల వైపు దేశాలు చూడటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది.భారత రూపాయిపై ప్రభావంప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ కరెన్సీ మార్పుల ప్రభావం భారత రూపాయిపై ద్వంద్వ ప్రభావం చూపే అవకాశం ఉంది.చైనా ఆధిపత్యం పెరగడంఅంతర్జాతీయ చమురు మార్కెట్లో యువాన్ పట్టు సాధిస్తే అది ఆసియాలో చైనా ఆర్థిక శక్తిని మరింత పెంచుతుంది. భారత్కు చైనాతో సరిహద్దు వివాదాలు, వాణిజ్య పోటీ ఉన్న నేపథ్యంలో మన పొరుగు దేశం కరెన్సీ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారడం భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లావేదేవీలు సర్వసాధారణం. ఒకవేళ యువాన్ వాడకం పెరిగితే భారత్ తన చమురు దిగుమతుల కోసం యువాన్ను భారీగా కొనాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో యువాన్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ దానికి సాపేక్షంగా తగ్గే ప్రమాదం ఉంది. దాంతో మన విదేశీ మారక నిల్వలలో డాలర్ల కంటే యువాన్ నిల్వలను ఎక్కువగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అమెరికాతో సంబంధాలపై ప్రభావంభారత్-అమెరికా మధ్య రక్షణ, ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ భారత్ భారీ ఎత్తున యువాన్ వ్యవస్థలోకి వెళ్తే అది అమెరికా ఆగ్రహానికి కారణం కావచ్చు. ఇది ద్వైపాక్షిక సంబంధాలపై, అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దశాబ్దాలుగా మన బ్యాంకింగ్ వ్యవస్థ డాలర్ ఆధారిత లావాదేవీలకు(స్విఫ్ట్) అలవాటు పడి ఉంది. అకస్మాత్తుగా యువాన్ వ్యవస్థలోకి మారాలంటే కొత్త ఆర్థిక మౌలిక సదుపాయాలు, ఒప్పందాలు చేసుకోవాలి. దీనివల్ల లావాదేవీల ఖర్చు పెరిగే అవకాశం ఉంది.భారత్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి?చైనా యువాన్కు బదులుగా భారత్ ‘రూపాయి-రియల్’ (ఇరాన్తో) లేదా ‘రూపాయి-దిర్హామ్’ (యూఏఈతో) వంటి స్థానిక కరెన్సీ ఒప్పందాలు చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలి. ఇది జరిగితే మనకు డాలర్ లేదా యువాన్ రెండింటితోనూ పని లేకుండా సొంత కరెన్సీతోనే వ్యాపారం చేసుకునే వీలుంటుంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి. డాలర్పై ఆధారపడటం తగ్గుతుంది. డాలర్ విలువ పెరిగినప్పుడు మనపై పడే అదనపు భారం తగ్గుతుంది.వ్యూహాత్మక జాగ్రత్త అవసరంహర్మూజ్ జలసంధి మూతబడితే ప్రపంచ చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లు దాటే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో భారత్ తన వ్యూహాత్మక నిల్వలను కాపాడుకుంటూనే చమురు చెల్లింపుల కోసం బహుళ కరెన్సీ విధానాన్ని అనుసరించడం అత్యవసరం. డాలర్ ఆధిపత్యం తగ్గడం భారత్కు ఒక రకంగా అవకాశమే అయినా యుద్ధం తెచ్చే ద్రవ్యోల్బణ సెగను తట్టుకోవడం రూపాయికి అతిపెద్ద సవాలు.ఇదీ చదవండి: ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం!
ఉత్తరాలే కాదు.. ఇక లాభాలూ డెలివరీ!
చిన్న పొదుపులు ఇపుడు పెద్ద పెట్టుబడుల దిశగా అడుగులు వేయనున్నాయి.పెట్టుబడుల్లో కొత్త అధ్యాయానికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై మీ ఇంటి పక్కన ఉండే పోస్టాఫీసు కేవలం ఉత్తరాలు, సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే పరిమితం కాదు. స్టాక్ మార్కెట్ లాభాలను సామాన్యులకు అందించేలా మ్యూచువల్ ఫండ్స్ అమ్మకానికి సిద్ధమవుతోంది. భారత తపాలా శాఖ, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) చేతులు కలపడంతో దేశవ్యాప్తంగా పెట్టుబడుల విప్లవం రాబోతోంది.పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్తో మ్యూచువల్ ఫండ్లు గ్రామీణ ప్రాంతాలతో పాటు, మారు మూల పల్లెలకూ చేరే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన పెంచి, సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిని చేయాలనే సంకల్పంతో పోస్టాఫీసుల ద్వారా ఈ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు యాంఫి సీఈఓ వెంకట్ చలసాని చెప్పారు. పోస్ట్ ఆఫీసుల నెట్వర్క్తో మ్యూచువల్ ఫండ్లు మెట్రోల నుంచి మండలాలు, పల్లెలోకి అడుగుపెడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో మహారాష్ట్రే దేశంలో అగ్రస్థానంలో ఉంది దేశ మొత్తం ఫండ్ ఆస్తుల్లో 40శాతానికి పైగా వాటా ముంబై, పుణె నగరాలదే. దీంతో మహారాష్ట్రలోని ముంబై, పూణె, నాగపూర్, ఔరంగాబాద్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా తపాలాశాఖ మ్యూచువల్ ఫండ్స్ విక్రయానికి తెరతీసింది. అది విజయవంతం కావడంతో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండో దశలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా పదివేల మంది పోస్టల్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎంపిక చేసిన సిబ్బందికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ శిక్షణ ఇస్తుంది. సర్టీఫై అయిన ఉద్యోగులు పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీములను విక్రయిస్తారు. యాంఫి డి్రస్టిబ్యూటర్గా వ్యవహరిస్తుంది. చిన్న పట్టణాలపై ఫోకస్ దేశంలోని మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో 80 శాతం టాప్ 10 నగరాల నుంచే వస్తున్నాయి. 65 శాతం మందికి అవగాహన ఉన్నా, కేవలం 7 శాతం మాత్రమే అంటే 6 కోట్ల మందే పెట్టుబడి పెడుతున్నారు. గ్రామీణప్రాంతాల, పల్లెలదాకా విస్తరిస్తే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని యాంఫి అంచనా వేస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ బడ్జెట్ బూస్ట్ఒక్కో కొత్త ఇన్వెస్టర్కు రూ2,000 ప్రోత్సాహకం 2026 బడ్జెట్లో ప్రతి కొత్త మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కు రూ2,000 ప్రోత్సాహకాన్ని ఆరి్ధక మంత్రి ప్రకటించారు. పోస్టల్ సిబ్బందికి ఈ ప్రోత్సాహకంలో భాగస్వామ్యం కల్పించే విధానాన్ని తపాలాశాఖ రూపొందిస్తోంది. ఇది వారి రెగ్యులర్ కమిషన్కు అదనంగా ఉంటుంది. 2025 ఆగస్టు నుంచి అమల్లోకి వచి్చన ఈ ఒప్పందం 2028 ఆగస్టు వరకు మూడేళ్ల పాటు ఉంటుందని యాంఫి వెల్లడించింది.
సాయి పేరెంటరల్స్ @ రూ. 372–392
హైదరాబాద్: డైవర్సిఫైడ్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల కంపెనీ సాయి పేరెంటరల్స్ పబ్లిక్ ఇష్యూకి తాజాగా రూ. 372–392 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 27న ముగియనుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ కంపెనీ రూ. 285 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 32 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి.కంపెనీ వృద్ధి ప్రయాణంలో ఐపీవో కీలక మైలురాయిగా కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్ కేకే పేర్కొన్నారు. తాము సాధించిన పురోగతిని ఇది ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు. వ్యూహాత్మక ప్రణాళికలను వేగవంతం చేసేందుకు తోడ్పాటునివ్వగలదని పేర్కొన్నారు. తద్వారా తదుపరి విస్తరణ దశకు మద్దతు లభించనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా గ్లోబల్ ఫార్ములేషన్ల బిజినెస్తోపాటు.. ఇంజెక్టబుల్స్, ఓరల్ డోసేజీ ఫార్ములేషన్లలో కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు వివరించారు.
పీఎఫ్సీ డివిడెండ్ రూ. 3.25
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) నాలుగో మధ్యంతర డివిడెండ్ను చెల్లించేందుకు అనుమతించింది. దీంతో వాటాదారులకు షేరుకి రూ. 3.25 చొప్పున లభించనుంది. ఇందుకు ఈ నెల 23 రికార్డ్ డేట్కాగా.. ఏప్రిల్ 16కల్లా చెల్లించనుంది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో రూ. 1,60,000 కోట్ల రుణ సమీకరణ ప్రణాళికకు సైతం బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది.ఈబీఆర్ నిధులకు సంబంధంలేకుండా వీటిని ఒకేసారి లేదా దశలవారీగా వివిధ మూలాల నుంచి సమీకరించనుంది. వీటిలో రూ. లక్ష కోట్లు బాండ్లు, సెక్యూరిటీలు, మధ్యకాలిక ఇన్స్ట్రుమెంట్స్, కాలావధి రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. వివిధ ఇన్స్ట్రుమెంట్స్ జారీతో రూ. 20,000 కోట్ల విదేశీ మారకపు రుణాలు సైతం వీటిలో కలసి ఉన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో పీఎఫ్సీ షేరు బీఎస్ఈలో 3% జంప్చేసి రూ. 418 వద్ద ముగిసింది.
సాయంత్రానికి సగం తగ్గిన గోల్డ్ రేటు!
రోజురోజుకి తగ్గుతున్న గోల్డ్ రేటు ఈ రోజు (మంగళవారం) కొంత పెరిగింది. అయితే 24 గంటలు కూడా గడవకముందే.. పెరిగిన రేటులో సగం తగ్గిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం లేటెస్ట్ ధరల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,45,400 రూపాయల వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల బంగారం ధర సాయంత్రానికి రూ.1,44,900 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.500 తగ్గిందన్నమాట. 24 క్యారెట్ల ధర 1,58,620 రూపాయల నుంచి రూ.1,58,080 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో లేటెస్ట్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 158230 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 145050 రూపాయల వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం ఉన్న ధరల కంటే తక్కువ కావడం గమనార్హం.చెన్నైలో గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ధరలు ఉదయం ఎలా ఉన్నాయో, సాయంత్రానికి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,46,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,59,820 వద్ద ఉంది.
కార్పొరేట్
పీఎఫ్సీ డివిడెండ్ రూ. 3.25
ఉత్తరాలే కాదు.. ఇక లాభాలూ డెలివరీ!
రూ. 216 కోట్లతో ఎగ్జికామ్ ప్లాంటు
ఇన్సూరెన్స్ ప్రీమియంల మోత.. నో లాజిక్!
డిమాండ్కి తగినంత బొగ్గు సరఫరా
శామ్సంగ్తో ఆర్ఐఎల్ డీల్
యూఏఈలో ఉపాధి.. వీసా, విమాన టికెట్ ఉచితం
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష
గిగ్ కార్మికుల ఆదాయంపై యుద్ధ మేఘాలు!
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో క...
మూడు కంపెనీల లిస్టింగ్కు ఓకే
సెకండరీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న న...
బంగారం ధరల్లో భారీ మార్పు.. సాయంత్రానికే కొత్త రేట్లు
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉద...
మార్కెట్ అదుర్స్.. అదరగొట్టిన ఆటో షేర్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగి...
దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు
దేశంలో బ్యాంకులకు టాప్–10 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల...
వాణిజ్య లోటు ఊరట
న్యూఢిల్లీ: దేశం నుంచి గత నెలలో వివిధ వస్తువుల (మె...
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపు షురూ
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభ...
ప్రపంచంలోనే అధికంగా వంటగ్యాస్ ఉత్పత్తి చేసే దేశం
భారతదేశంలో సగటు సామాన్యుడి వంటింటి బడ్జెట్ను తలకి...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వాట్సాప్లో కొత్త ఫీచర్.. పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్
వాట్సాప్ చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది ముఖ్యంగా 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 'పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.గతంలో వాట్సాప్ను పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే ఉపయోగించేవారు. అప్పుడు తల్లిదండ్రులకు వారి చాట్స్ లేదా కాంటాక్ట్స్పై ఎక్కువ నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ద్వారా తల్లిదండ్రులు నేరుగా పిల్లల ఖాతాను పర్యవేక్షించవచ్చు. ఎవరు పిల్లలకు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో చేరాలి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి వంటి విషయాలను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ సెటప్● ముందుగా పిల్లల ఫోన్లో వాట్సాప్ యాప్ను ఇన్స్టాల్ చేయాలి. ● తరువాత యాప్ను ఓపెన్ చేసి భాషను ఎంచుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికపై క్లిక్ చేయాలి.● తరువాత మోర్ ఆప్షన్స్లోకి వెళ్లి.. క్రియేట్ పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ అనే ఎంపికను ఎంచుకోవాలి● పిల్లల ఫోన్ నంబర్ను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.● తరువాత పిల్లల పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీని ద్వారానే వారి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువ అని వాట్సాప్ నిర్ధారిస్తుంది.● ఇవన్నీ పూర్తయిన తరువాత.. పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేయడానికి కంటిన్యూపై క్లిక్ చేయాలి.పిల్లల ఖాతాతో ఎలా లింక్ చేయాలిపిల్లల ఫోన్ స్క్రీన్పై ఒక QR కోడ్ కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఫోన్తో ఆ కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తరువాత వాట్సాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణను నిర్ధారించడానికి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికను చూపిస్తుంది. తరువాత తల్లిదండ్రులు ఒక 6 అంకెల పేరెంట్ పిన్ సెట్ చేసుకోవాలిసెట్ చేయాలి. ఈ పిన్ ద్వారా మాత్రమే పిల్లల ఖాతాకు సంబంధించిన ప్రైవసీ & సేఫ్టీ సెట్టింగ్స్ను మార్చగలుగుతారు. ఈ పిన్ నెంబరును పిల్లలతో షేర్ చేసుకోకూడదు.
ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!
ఇటీవలికాలం వరకు సందేశాలకు, సెర్చ్ ఇంజిన్లకు మాత్రమే పరిమితమైన మీ స్మార్ట్ ఫోన్.. ఏఐ పుణ్యామా అని విభిన్న పనులకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఏఐ మీ నాడిచూసి, గుండె వేగం నుంచి ఆసుపత్రి రిపోర్టుల వరకు అన్నింటినీ విశ్లేషించడానికి సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్బాట్ కోపైలట్ ద్వారా తీసుకువచ్చిన కొత్త హెల్త్ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెజాన్, ఓపెన్ఏఐ చాట్జీపీటీ , ఆంత్రోపిక్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తుండటంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త విప్లవానికి నాంది పలుకుతోందా లేక ఆరోగ్య రికార్డుల గోప్యతకు నీళ్లు వదులుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఏమిటీ మైక్రోసాఫ్ట్ కోపైలట్ హెల్త్ ఫీచర్?మైక్రోసాఫ్ట్ తాజాగా ఆవిష్కరించిన ఈ టూల్ వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను నేరుగా చాట్బాట్తో పంచుకోవడానికి అనుమతిస్తుంది. యాపిల్ వాచ్, ఫిట్బిట్, స్లీప్ ట్రాకర్ వంటి పరికరాల నుంచి సేకరించిన ఫిట్నెస్ డేటాను ఇది విశ్లేషిస్తుంది.వివిధ ఆసుపత్రుల రికార్డులను కలిపి వినియోగదారుడికి ఉన్న ఆరోగ్య సమస్యలపై నిమిషంలో పూర్తి సమచారాన్ని అందిస్తుంది.‘నేను సరిగ్గా నిద్రపోవడం లేదు’ అని మీరు చాట్బాట్తో అంటే చాలు.. మీ పాత మెడికల్ రిపోర్టులను, స్లీప్ ట్రాకర్ డేటాను పరిశీలించి అది మీకు ఉన్న నిద్రలేమి లేదా డయాబెటిస్ వంటి ముప్పులను హెచ్చరిస్తుంది. ప్రస్తుతానికి ఉచితంగా అందుబాటులోకి రానున్న ఈ సేవలకు భవిష్యత్తులో సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.ప్రయోజనాలు..సాధారణంగా ఒక రోగి వివిధ వైద్యులను సంప్రదించినప్పుడు వారి రికార్డులు వేర్వేరు డేటాబేస్ల్లో ఉంటాయి. ఒక జనరల్ ఫిజీషియన్ రోగి గత చరిత్రను అర్థం చేసుకోవడానికి గంటల సమయం పడుతుంది. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డొమినిక్ కింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏఐ సెకన్లలోనే సంక్లిష్టమైన రికార్డులను విశ్లేషిస్తుంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా సామాన్యులకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రాథమిక విశ్లేషణ సాధనంగా ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.నష్టాలు లేవా?టెక్ కంపెనీల చేతికి అత్యంత సున్నితమైన ఆరోగ్య డేటా వెళ్లడంపై సైబర్ భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆరోగ్య రికార్డులన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే అవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారుతాయి’ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ గ్రీన్ హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో రోగి గోప్యతను కాపాడే ‘హిప్పా’ చట్టాలు సాంప్రదాయ ఆసుపత్రులకు వర్తిస్తాయి కానీ, ఈ టెక్ కంపెనీలకు వర్తించవు. దీనివల్ల కంపెనీలు రోగుల డేటాను ప్రకటనల కోసం లేదా తమ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుకునే ప్రమాదం ఉంది. గర్భస్రావాలపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో మహిళల పునరుత్పత్తి ఆరోగ్య రికార్డులను కొన్ని సంస్థలు టెక్ కంపెనీల నుంచి సులభంగా పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఏఐ వైద్యుడికి ప్రత్యామ్నాయమా?మైక్రోసాఫ్ట్ స్వయంగా ఒక గమనికను(Disclaimer) తెలియజేసింది. ఈ చాట్బాట్ కేవలం సమాచార విశ్లేషణకు మాత్రమేనని, ఇది వైద్యుడి స్థానాన్ని భర్తీ చేయదని స్పష్టం చేసింది. వ్యాధులను నిర్ధారించడానికి లేదా చికిత్స చేయడానికి దీన్ని ప్రామాణికంగా తీసుకోకూడదని సూచించింది. అయితే ఏఐ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అనవసరమైన ఆందోళన చెంది ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీసే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే ‘హోడియో’!
సోషల్ మీడియా వేదికలపై విచ్చలవిడిగా సాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలకు (హేట్ స్పీచ్) అడ్డుకట్ట వేసేలా స్పెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను నడిపే టెక్ దిగ్గజాలను జవాబుదారీలుగా చేసే దిశగా స్పెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వేదికలపై ఏ స్థాయిలో ఈ ప్రసంగాలు విస్తరిస్తున్నాయో లెక్కగట్టేందుకు ‘హోడియో’ (Hodio) అనే టెక్నాలజీ టూల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. మాడ్రిడ్లో జరిగిన ఒక ప్రత్యేక ఫోరమ్లో ఆయన మాట్లాడుతూ, టెక్ సంస్థల యజమానుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఏమిటీ ‘హోడియో’?డిజిటల్ ప్లాట్ఫారమ్ల్లో ద్వేషపూరిత కంటెంట్ ఉనికిని, అది వ్యాపిస్తున్న తీరును, దాని ప్రభావ పరిధిని శాస్త్రీయంగా కొలవడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ టూల్ సమగ్ర నివేదికను రూపొందిస్తుంది. ‘స్పానిష్ అబ్జర్వేటరీ ఆఫ్ రేసిజం అండ్ జెనోఫోబియా’ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. ఏ సంస్థ ద్వేషాన్ని ఆపుతోంది, ఏ సంస్థ ప్రేక్షక పాత్ర వహిస్తోంది, ఈ వ్యవహారం ద్వారా ఎవరు వ్యాపారం చేస్తున్నారో ప్రపంచానికి తెలియజేస్తామని సాంచెజ్ స్పష్టం చేశారు.గత దశాబ్ద కాలంలో స్పెయిన్లో ద్వేషపూరిత నేరాలు 41% పెరగడంపై పెడ్రో సాంచెజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటి నుంచి సోషల్ మీడియా సంస్థలు తాము అనుమతించే ప్రతి విద్వేషపూరిత అంశానికి బహిరంగంగా సమాధానం చెప్పుకోవాల్సిందే’ అని తెలిపారు.మస్క్, దురోవ్లతో ఢీ!స్పెయిన్ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే ప్రణాళికను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఎక్స్ (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్లతో వాగ్వివాదానికి దారితీసింది. ఏఐ సృష్టించిన చైల్డ్ పోర్నోగ్రఫీని నిరోధించడంలో విఫలమైనందుకు ఎక్స్, మెటా, టిక్టాక్లపై దర్యాప్తు చేయాలని స్పెయిన్ ఇప్పటికే ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని కోరింది.యూరోపియన్ యూనియన్లో డిజిటల్ సేవల చట్టం (డీఎస్ఏ) ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ స్పెయిన్ సొంతంగా ‘హోడియో’ వంటి సాధనాన్ని తీసుకురావడం గమనార్హం. ఇది కేవలం నియంత్రణ మాత్రమే కాదు, టెక్ కంపెనీల వ్యాపార నమూనాలను సైతం సవాలు చేసే వ్యూహంలా కనిపిస్తోందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!
దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీగా పెరిగిన డేటా వినియోగం భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.జీబీకి రూ.1 పన్ను వేధించినా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వినియోగదారులపై ప్రభావంప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పర్సనల్ ఫైనాన్స్
మహిళలకు ప్యాసివ్ పెట్టుబడుల దన్ను
దేశీయంగా పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కోర్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్లలో విస్తృతంగాఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్లు, గోల్డ్, సిల్వర్లాంటి కమోడిటీ ఇండెక్స్లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్ ఆధారిత ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా..డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్ ఆధారిత ప్యాసివ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్ ఫండ్లలో బాండ్స్లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.సిప్ శ్రేయస్కరం..ఇక సిప్ విధానం ద్వారా ప్యాసివ్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి.
గోల్డ్ లోన్లో.. రిస్కులూ ఉంటాయి!
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నా... ఊగిసలాట ఇంకా పెరుగుతోంది. నెలన్నర కిందట గరిష్ఠ స్థాయిలకు చేరిన ధర... అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 7–8 శాతం వరకూ పతనమైంది. క్రయవిక్రయాలైతే ఈ కదలికలకు అనుగుణంగా చేయొచ్చు. ధర పడుతుంటే కొంత వేచిచూడటం.. తక్కువ స్థాయిల్లో కొనటం వంటివి చేయొచ్చు. మరి రుణాలు తీసుకునేవారి సంగతేంటి? ఎందుకంటే ఆర్థిక అనిశ్చితుల్లో ఎంతో మందికి బంగారమనేది విశ్వసనీయ సాధనం. పెట్టుబడులకే కాకుండా అత్యవసర సాధనంగా, అత్యవసర నిధిగా ఇది ఎన్నో కుటుంబాలను ఆదుకుంటోంది.వాస్తవానికి బంగారంపై రుణం చాలా ఈజీ. గంటలోపే డబ్బుతో ఇంటికెళ్లిపోవచ్చు. బహుశా... అందుకేనేమో!. 2026 మార్చి నాటికి సంఘటిత రంగంలో బంగారం రుణాలు ఏకంగా 15 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ధరలు బాగా పెరగటంతో రుణ మొత్తం కూడా ఎక్కువే దొరుకుతోంది. దీంతో చాలామంది రుణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింతగా పెరుగుతాయని.... దిద్దుబాటుకు గురవుతాయని భిన్న విశ్లేషణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడిపై రుణాలు తీసుకునే వారు అందులోని రిస్్కలనూ తెలుసుకోవాలి. ధరల ఊగిసలాట వల్ల రుణ గ్రహీతలు కొన్ని సవాళ్లనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ... రుణ పరిమితులు.. ⇒ బంగారం విలువలో రుణం ఎంత ఇవ్వాలన్న దానికి ఒక పరిమితి ఉంది. దీన్నే లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి (ఎల్టీవీ)గా చెబుతుంటారు. ⇒ ఎల్టీవీకి సంబంధించి ఆర్బీఐ మూడు రకాల శ్లాబులను తీసుకొచ్చింది. ⇒ బంగారం విలువ 2.5 లక్షల వరకు ఉంటే... అందులో 85 శాతం వరకూ రుణంగా ఇవ్వొచ్చు. ⇒ అదే బంగారం విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే 80 శాతం ఎల్టీవీ అమలవుతుంది. ⇒ కుదువ పెట్టే బంగారం విలువ రూ.5 లక్షలు కంటే మించితే అప్పుడు ఎల్టీవీ 75 శాతం మించకూడదు. అంటే... తక్కువ రుణం తీసుకునేటపుడు మీ బంగారం ధరలో ఎక్కువ మొత్తం మీకు రుణంగా దొరుకుతుంది. రుణం పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.3 లక్షల విలువైన బంగారాన్ని కుదువ పెడితే ప్రతి లక్షకు గరిష్టంగా రూ.75,000 నుంచి రూ.85,000 వరకు రుణంగా పొందవచ్చు. ఉన్నట్టుండి ధరలు పతనమైతే..? ⇒ ఇతర రుణాలకు, బంగారంపై రుణానికీ మధ్య స్పష్టమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. అదే బంగారం ధరలు. ⇒ వ్యక్తిగత రుణం తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తం చెల్లిస్తూ వెళితే సరిపోతుంది. ⇒ బంగారంపై రుణం అలా కాదు. రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు పతనమైతే.. అప్పుడు తనఖాలోని మొత్తం బంగారం విలువ పడిపోతుంది. ఆర్బీఐ విధించిన ఎల్టీవీ పరిమితిని రుణం మించిపోతుంది. అంత మేర రుణ గ్రహీత అదనపు బంగారాన్ని తనఖా పెట్టాల్సిందే. ⇒ లేదంటే ఎల్టీవీలో ఎంత తగ్గిందో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినా సరిపోతుంది. ⇒ ఈ రెండూ చేయలేకపోతే రుణం ఇచి్చన సంస్థ తనఖాలోని బంగారాన్ని వేలం వేస్తుంది. ⇒ రుణ ఈఎంఐలు లేదా వడ్డీ చెల్లించని సందర్భాల్లోనూ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, బంగారాన్ని వేలం వేస్తారు. బంగారం వేలానికి గురైతే.. ఇక ఆ ఆభరణాలను తిరిగి పొందలేరు. దాంతో ఉన్న అనుబంధం ముగిసిపోతుంది. ⇒ ధరలు తగ్గిపోవడం వల్ల విలువ పతనమై.. చెల్లించలేని పరిస్థితుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని వేలంలో తక్కువకు విక్రయించే రిస్్కనూ గమనించాలి. దీనివల్ల మరింత నష్టం ఏర్పడుతుంది. ⇒ వేలం వేయగా వచ్చిన మొత్తం నుంచి బకాయిలను మినహాయించి మిగిలినది రుణ గ్రహీతకు వెనక్కిచ్చేస్తారు. బకాయిల చెల్లింపులు కూడా చాలకపోతే అప్పుడు మిగిలిన మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు చట్టప్రకారం చర్యలు చేపడతారు. ⇒ వేలానికి ముందు రుణ గ్రహీతకు తప్పకుండా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వేలం చివరి నిమిషం వరకు బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. ⇒ కొన్ని సందర్భాల్లో బంగారం విలువ మదింపులో తప్పులకు అవకాశం లేకపోలేదు. గోల్డ్ అప్రైజర్ బంగారం విలువను పొరపాటున అధికంగా నిర్ణయించి, ఆ మేరకు అధిక రుణం మంజూరు చేసినట్లు తర్వాత ఆడిట్లో గుర్తించినట్టయితే.. అదనపు మొత్తాన్ని జమ చేయాలని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ కోరుతుంది. వడ్డీ రేట్లు – చార్జీలు⇒ బంగారంపై రుణ రేట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ. వీటికంటే ప్రైవేటు బ్యాంకుల్లో కొంత అధికంగా ఉంటాయి. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మరింత అధిక రేట్లపై రుణాలు ఇస్తుంటాయి. ⇒ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అయితే 8– 10.5 శాతం మధ్య... ప్రైవేటు బ్యాంకుల్లో 9–18 శాతం మధ్య, ఎన్బీఎఫ్సీల్లో 10.75–27 శాతం మధ్య రుణ రేట్లు ఉన్నాయి. ⇒ ఎన్బీఎఫ్సీలు కొంత అధికంగా వడ్డీ వసూలు చేసినప్పటికీ.. పలు రకాల ఆకర్షణీయ పథకాలతో రుణ గ్రహీతలను ఆకట్టుకుంటాయి. తక్కువ ఎల్టీవీపై తక్కువ రేటు, అధిక రేటుపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంక్లు– ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ పెరిగిపోవడంతో.. రుణ గ్రహీతలకు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ⇒ బంగారం రుణాలపై ప్రాసెసింగ్ చార్జీ, గోల్డ్ అప్రైజర్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలను బ్యాంక్లు వసూలు చేస్తుంటాయి. ⇒ సకాలంలో రుణాన్ని చెల్లించలేని సందర్భాల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇవి 2 శాతం వరకు ఉంటాయి. ముఖ్యంగా పెనాల్టీ చార్జీ పేరుతో అసలు, వడ్డీ మొత్తంపై ప్రతి నెలా 0.5 శాతం చొప్పున కలుపుతూ వెళతారు. ⇒ అరుదుగా తనఖా పెట్టే బంగారం విషయంలో మోసాలకు అవకాశం లేకపోలేదు. తనఖాలోని ఆభరణాలు దుర్వినియోగానికి గురయ్యే రిస్క్ ఉంటుంది. ⇒ బంగారం వేలం వేసే పరిస్థితి ఏర్పడితే అందుకయ్యే ఖర్చలనూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తీసుకుంటాయి. బంగారం విలువ మదింపు ఎలా..?‘లోయర్ ఆఫ్ టూ’ నిబంధన తెలియాలి: రుణం ఇచ్చే సంస్థ ఆ రోజు మార్కెట్ ధరను ఆధారం చేసుకోదు. క్రితం రోజు ముగింపు ధర? గత 30 రోజుల్లో సగటు ధర ఈ రెండింటిలో తక్కువ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ధరలు ఉన్నట్టుండి పెరిగిపోతే వాటి ఆధారంగా రుణం మంజూరు చేయకుండా ఈ సూత్రాన్ని అనుసరిస్తారు. బంగారానికే విలువ: బంగారం ఆభరణాల్లో నికర బంగారం ఎంతన్న దానిపైనే ఎల్టీవీని నిర్ణయిస్తారు.ఆభరణాల్లో రాళ్లు, ఇతరత్రా ఉంటే వాటి బరువును ఉజ్జాయింపుగా మినహాయిస్తారు. ఉదాహరణకు 50 గ్రాముల ఆభరణాలు తీసుకెళ్లినప్పుడు అందులో రాళ్లు, పూసలు వంటివి ఉంటే 5–10 గ్రాముల వరకు బరువు తగ్గిపోతుంది. పైగా బంగారం ఆభరణాల స్వచ్ఛతను కూడా అంచనా వేస్తారు. 24, 22, 18 క్యారట్ లేదా అసలు ప్యూరిటీ ఎంతుందని చూస్తారు. ఆ తర్వాతే బంగారం నికర విలువను ఖరారు చేస్తారు.ఇలా చేస్తే బెటర్..⇒ బంగారంపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని తీసుకోకపోవడమే మంచిది. తనఖా పెట్టే రోజున ఉన్న విలువలో రుణం 60 శాతం మించకుండా చూసుకోవాలి. దీనివల్ల ధరలు కొంత పడిపోయినప్పటికీ నిశ్చింతంగా ఉండొచ్చు. అదనపు బంగారం లేదా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. బంగారం ధరలు పెరగడం వల్ల తనఖా బంగారంపై అధిక రుణ మొత్తాన్ని పొందొచ్చు. కానీ, ధరలు పతనం అవుతున్నప్పుడు అదనంగా సర్దుబాటు చేయాల్సి రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ⇒ దీర్ఘకాలం కోసం కాకుండా స్వల్పకాల అవసరాల కోసమే బంగారంపై రుణాలను పరిశీలించాలి. రుణం తీసుకున్న తర్వాత నుంచి బంగారం ధరలను గమనిస్తూ ఉండాలి. ⇒ బంగారం విలువ మదింపు, వాటి భద్రత విషయంలో రిస్్కలు వద్దనుకుంటే పేరున్న సంస్థల నుంచి రుణం తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ విషయంలో ప్రముఖ బ్యాంక్లు, ప్రముఖ ఎన్బీఎఫ్సీలను పరిశీలించొచ్చు. రుణ కాల వ్యవధులు..⇒ సాధారణంగా 6– 12 నెలల కాలానికి బంగారంపై రుణాలు లభిస్తుంటాయి. కొన్ని బ్యాంక్లు, ముత్తూట్ ఫైనాన్స్ వంటి కొన్ని సంస్థలు అయితే ఏడాదికి మించిన కాలానికీ రుణాలు ఇస్తున్నాయి. ⇒ తక్కువ కాల వ్యవధికి తీసుకున్నప్పటికీ, గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించి, వెంటనే అప్పటి విలువ ప్రకారం మళ్లీ రుణం పొందొచ్చు.
ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?
డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.చిన్న నోట్ల చలామణి ఎంత?ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు.
ఈఎంఐతో ఐఫోన్.. కనిపించని ఆర్థిక నిజాలు!
ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ ఐఫోన్ కొనడం అంటే.. డబ్బున్నవారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బ్యాంకులు & ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫార్మ్లు ఇచ్చే సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వల్ల చాలా మంది ఖరీదైన స్మార్ట్ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ను కూడా నెలకు చిన్న చిన్న చెల్లింపులుగా చెల్లిస్తూ కొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఎలక్ట్రానిక్స్ షాపుల్లోకి వెళ్లినా లేదా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు చూసినా ఖరీదైన ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్లకు చాలా డిమాండ్లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని కొనడానికి సిద్దపడుతున్నారు. ఈఎంఐ సౌకర్యం అనేది మీకు తెలియని ఆర్ధిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నెలవారీ ఖర్చులుఇప్పటికే చాలామంది యువ ఉద్యోగులు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ కోసం మరో ఈఎంఐ తీసుకుంటే వారి నెలవారీ ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.ఒక వ్యక్తి మొత్తం అప్పులు తన ఆదాయంతో పోలిస్తే ఎంత ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మన నెలవారీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకు వెళ్ళకూడదు. 40% దాటితే అది ప్రమాదకరంగా మారుతుంది. 50% కంటే ఎక్కువైతే అది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీయవచ్చు. అంతే కాకుండా.. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా ఈఎంఐలు చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఎక్కువ సంపాదిస్తేరూ.1,34,900 ధర ఉన్న ఒక ఐఫోన్ను 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే.. ప్రతి నెల సుమారు రూ.11,242 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తే ఈ ఈఎంఐ అతని ఆదాయంలో సుమారు 11% మాత్రమే అవుతుంది. అప్పుడు ఇది కొంతవరకు ఆర్థికంగా సౌకర్యంగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది భారంగా మారే అవకాశం ఉంది.చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఈఎంఐ మొత్తం చిన్నదిగా కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈఎంఐ చెల్లిచడానికి పెట్టే డబ్బును.. పెట్టుబడిగా పెట్టితే భవిష్యత్తులో ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలక్రమేణా విలువ కోల్పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. ఈఎంఐ కొనుగోళ్లలో ప్రాసెసింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.వన్ మంత్ రూల్ఆర్థిక నిపుణులు ఒక సాధారణ నియమాన్ని సూచిస్తున్నారు. దాన్ని వన్ మంత్ రూల్ అంటారు. అంటే మనం కొనబోయే ఫోన్ ధర మన నెల జీతాన్ని మించకూడదు. మరొకటి ట్వైస్ ఓవర్ రూల్. అంటే మన వద్ద ఆ ఫోన్ను రెండు సార్లు కొనగలిగేంత లిక్విడ్ క్యాష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఖరీదైన ఫోన్ కొనవచ్చు.మొత్తం మీద ఈఎంఐతో ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మన పొదుపులు, పెట్టుబడులు & భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపకూడదు. అందుకే ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక


