Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Maruti Victoris Crosses 50000 Sales Milestone In 4 Months1
మారుతి కారు.. అమ్మకాలు జోరు!

మారుతి సుజుకి.. మార్కెట్లో విక్టోరిస్ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఈ మోడల్ కేవలం నాలుగు నెలల కాలంలో 50,000 సేల్స్ సాధించగలిగింది. జనవరి 2026లో దీని అమ్మకాలు 15240 యూనిట్లు. నవంబర్ & డిసెంబర్‌లలో అమ్మకాలు వరుసగా 12,300 & 6,210 యూనిట్లు.మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.

Apple iPhone Air Price Down By Rs 24000 Know The Full Details Here2
బంపరాఫర్.. ఐఫోన్‌పై రూ.24000 తగ్గింపు!

గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఎంతోమంది యాపిల్ ప్రియులను ఆకట్టుకున్న 'ఐఫోన్ ఎయిర్' మోడల్ మీద అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 24వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.మార్కెట్లో రూ.1,19,900లకు లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్.. అమెజాన్ ఇండియాలో రూ.99 వేలకు (రూ.20900 తగ్గింపు) కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు ఐఫోన్ ఎయిర్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ కింద (క్రెడిట్ కార్డుపై) రూ.4,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే మొత్తం రూ. 24900 తగ్గింపు పొందవచ్చన్నమాట.ఐఫోన్ ఎయిర్ మొబైల్.. స్కై బ్లూ, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ & లైట్ గోల్డ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఇది 6.5 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా యాపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో కూడిన యాపిల్ A19 ప్రో చిప్‌సెట్‌ పొందుతుంది.ఇదీ చదవండి: 15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!ఐఫోన్ ఎయిర్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో బేస్ వేరియంట్ 12GB RAM & 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందుతుంది.కెమెరా సెటప్ విషయానికి వస్తే.. సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన సింగిల్ రియర్ 48 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ రియర్ షూటర్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం, ఫోన్‌లో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. హ్యాండ్‌సెట్ 3149mAh బ్యాటరీ & 20W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది.

Stock Market Closing Update 3rd February 20263
భారత్ - యూఎస్ డీల్: భారీ లాభల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మంగళవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపులో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,072.67 పాయింట్ల (2.54 శాతం) లాభంతో 83,739.13 వద్ద, నిఫ్టీ 639.15 పాయింట్ల (2.55 శాతం) లాభంతో 25,727.55 వద్ద నిలిచాయి.పారామౌంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఫేజ్ త్రీ లిమిటెడ్, అవలోన్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ లిమిటెడ్, TECIL కెమికల్స్ & హైడ్రో పవర్ లిమిటెడ్, కామత్ హోటల్స్ (ఇండియా) లిమిటెడ్, MPS లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.అందులో భారీ లాభాల్లో..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడానికి ప్రధాన కారణం. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్‌లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

98 42 Percent Of Rs 2000 Notes Returned to Banking System Says RBI4
ఇంకా వెనక్కి రాని రూ.2000 నోట్లు!

పెద్దనోట్ల రద్దు జరిగి చాన్నాళ్లవుతోంది. అయితే ఇప్పటికి 98.42 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే నాటికి.. రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 జనవరి 31 నాటికి రూ.5,609 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది. అంటే.. ఇంకా 1.58 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది.తొలుత 2023 అక్టోబర్‌ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికీ తమ వద్ద రూ.2,000 నోట్లు ఉంటే, ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుల్లో దేనికి అయినా స్పీడ్‌పోస్ట్‌ ద్వారా పంపుకోవచ్చు. పంపించే వారు దరఖాస్తుతోపాటు కేవైసీ డాక్యుమెంట్లు, బ్యాంక్‌ ఖాతా వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అంత విలువ మేర బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది.

Maruti Suzuki signaled possible car price hike5
త్వరలో కార్ల ధరల పెంపు..?

ఆటో మొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ త్వరలో కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. వాహన ధరల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు తర్వాత మార్కెట్‌లో నెలకొన్న బలమైన డిమాండ్, పెరుగుతున్న ముడి సరుకుల వ్యయాల దృష్ట్యా ధరల పెంపు అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు.‘కమోడిటీల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విలువైన లోహాల (ప్రెషస్‌ మెటల్స్‌) ధరల పెరుగుదల అసాధారణంగా ఉంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాము. రాబోయే రోజుల్లో వాహనాల ధరల పెంపుపై సమీక్ష చేయనున్నాం’ అన్నారు. ధరల పెంపుపై తర్వలో నిర్ణయంమార్కెట్‌ లీడర్‌గా ఉండటం వల్ల, ఖర్చు పెరుగుదల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు కస్టమర్ల మీద భారం పడకుండా ప్రయత్నిస్తాం. కొంత వరకు మేం ఖర్చులను భరించగలం. కానీ, పెద్ద మొత్తంలో భరించలేని పరిస్థితి నెలకొంది. క‍చ్చితంగా కొనుగోలుదారుల మీదకి బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే, త్వరలో ధరల పెరుగుదల గురించి కీలక నిర్ణయం వెలువరిస్తాం’’అని బెనర్జీ అన్నారు. ప్రైజ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌అటు ఉత్పత్తి పరిమితుల కారణంగా ఆలస్యంగా డెలివరీలు తీసుకుంటున్న కస్టమర్ల కోసం మారుతి సుజుకి జనవరిలో ప్రైజ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ ను ప్రవేశపెట్టింది. ‘‘ఫోర్‌ వీలర్‌ విభాగానికి వస్తున్న మొదటిసారి కస్టమర్లను మేం గమనిస్తున్నాం. వారిని అప్‌గ్రేడ్‌ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అందువల్ల, మేము ప్రైజ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ ను తీసుకొచ్చాం. అందుకే, ధరల పెరుగుదల అనేది వారికి ఉండదు’’ అని బెనర్జీ చెప్పుకొచ్చారు.పెండింగ్‌లో 1.75 లక్షల ఆర్డర్లుజనవరిలో 2.78 లక్షల బుకింగ్‌లు వచ్చాయి. అయితే పరిమితమైన ఉత్పత్తి సామర్థ్యం కారణంగా కంపెనీకి ప్రస్తుతం 1.75 లక్షల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే రోజుకు 9,000–10,000 ఆర్డర్లు వస్తున్నయన్నారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తోందన్నారు. గతేడాది జీఎస్‌టీ 2.0 సంస్కరణలతో ఎంట్రీ లెవల్‌ మోడళ్లలో ధరలను తగ్గించింది. సెప్టెంబర్‌ 2025లో ఎస్‌–ప్రెస్సో ధరలను రూ. 1.29 లక్షల వరకు, ఆల్టో కే10 ధరలను రూ. 1.07 లక్షల వరకు, సెలెరియో ధరలను రూ. 94,100, వ్యాగన్‌ ఆర్‌ ధరలను రూ. 79,600 వరకు తగ్గించింది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు

Agriculture rural sectors find themselves sidelined in policy announcements6
వ్యవసాయం, గ్రామీణ రంగాలకు మొండిచేయి!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. అయితే, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలిచే మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఈసారి రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం. ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు జీడీపీలో కేవలం 11.5% - 12.5% వద్దే స్థిరంగా ఉండటంతో (2004-2008లో ఇది 16% గా ఉండేది), ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి పెట్టుబడులను పెంచాలని నిర్ణయించింది.అంకెలు పెరిగినా.. ఆందోళనలు?వ్యవసాయ శాఖకు కేటాయింపులు రూ.1.23 లక్షల కోట్లు నుంచి రూ. 1.30 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో ప్రధానంగా.. పీఎం కిసాన్, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనకు ఎక్కువ కేటాయింపులు చేశారు. అయితే ఆర్థిక మంత్రి ప్రసంగంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య సంపద, వాల్‌నట్స్ వంటి అనుబంధ రంగాలపై దృష్టి సారించినప్పటికీ ప్రధాన పంటల రంగం, ఉద్యానవన రంగాల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.దేశంలో విమానాశ్రయాలు, రహదారులు ప్రపంచ స్థాయికి చేరుకున్నా ఢిల్లీలోని ఆజాద్ పూర్ వంటి ప్రధాన వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధునీకరణకు బడ్జెట్ నుంచి ప్రత్యక్ష మద్దతు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరిశోధన నిధుల్లో కోతవాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు, అధిక ఉత్పాదకత కోసం పరిశోధనలు అవసరమైన తరుణంలో వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డీఏఆర్‌ఈ) నిధులు రూ.10280 కోట్ల నుంచి రూ.9967 కోట్లకు తగ్గాయి. ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడ్’లో నిధులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందనేది స్పష్టత లేదు. మరోవైపు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) నిధులను రూ.1500 కోట్ల నుంచి రూ.2500 కోట్లుకు పెంచడం సానుకూల పరిణామం.ఇదీ చదవండి: పౌరుల గోప్యతను హరించకూడదు: సుప్రీంకోర్టు ఆగ్రహం

Advertisement
Advertisement
Advertisement