Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Meta Layoffs 200 Jobs Cut Amid 135Billion USD AI Push1
మెటాలో ఆగని కొలువుల కోత.. ఈసారి ఎందరంటే..

సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి పెద్దపీట వేస్తూ కంపెనీలో భారీ పునర్నిర్మాణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కాలిఫోర్నియాలో సుమారు 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ మేరకు కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌(ఈడీడీ)కు మెటా అధికారిక నివేదికలను సమర్పించింది.కాలిఫోర్నియా విభాగంలో జరుగుతున్న ఈ మార్పుల వల్ల బర్లింగేమ్, సన్నీవేల్ కార్యాలయాల్లోని సిబ్బంది ప్రభావితం కానున్నారు. బర్లింగేమ్‌లో 124 ఉద్యోగాల తొలగింపు, సన్నీవేల్ 74 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ చెప్పింది. ఈ నిర్ణయం మే నెలాఖరు నుంచి అమలులోకి రానుంది. ఈ లేఆఫ్స్ శాశ్వత ప్రాతిపదికన ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.ఈ ఏడాది ప్రారంభం నుంచి మెటాలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. జనవరి 2026లో మెటావర్స్ ప్రాజెక్ట్ రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో దాదాపు 1,500 మందిని తొలగించారు. మార్చి 2026లో రిక్రూట్‌మెంట్, సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో సుమారు 700 మందిపై వేటు పడింది. తాజాగా కాలిఫోర్నియా రీజియన్‌లో మరో 200 మందికి ఉద్వాసన పలికారు.ఏఐ పెట్టుబడులే ప్రధాన కారణంఈ ఏడాది ఏఐ మౌలిక సదుపాయాల (డేటా సెంటర్లు, సర్వర్లు) కోసం మెటా దాదాపు 115 బిలియన్‌ డాలర్ల నుంచి 135 బిలియన్‌ డాలర్ల మధ్య మూలధన వ్యయాన్ని అంచనా వేసింది. సాధారణ పనుల కోసం మానవ వనరుల కంటే ఏఐ సాధనాలపైనే కంపెనీ ఎక్కువగా ఆధారపడుతోంది. ఒకవైపు తొలగింపులు జరుగుతున్నప్పటికీ హై-లెవల్ టెక్నికల్ ఏఐ ఉద్యోగాల కోసం కంపెనీ కొత్త నియామకాలను చేపడుతోంది.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా?

France Announces Flash Fuel Loans to Support Businesses Amid Rising Fuel Prices2
పెరిగిన పెట్రో ధరలు.. ఆ దేశంలో కొత్త తరహా లోన్లు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అతలాకుతలమవుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..ఫ్రాన్స్‌లో 'ఫ్లాష్ ఫ్యూయల్ లోన్లు'పెరుగుతున్న ఇంధన భారంతో సతమతమవుతున్న వ్యాపారుల కోసం ‘ఫ్లాష్ ఫ్యూయల్ లోన్లు’ (Flash Fuel Loans) పేరుతో ఒక అత్యవసర రుణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఫ్రాన్స్ శుక్రవారం ప్రకటించింది.లోన్ల ముఖ్య విశేషాలురుణ పరిమితి: అర్హత కలిగిన సంస్థలు 50,000 యూరోల (సుమారు రూ. 53.64 లక్షలు) వరకు రుణం పొందవచ్చు.ప్రధాన లబ్ధిదారులు: రవాణా, వ్యవసాయం, మత్స్య పరిశ్రమలకు చెందిన చిన్న, మధ్య తరహా సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది.వడ్డీ రేటు: మూడేళ్ల కాలపరిమితి గల ఈ రుణాలపై 3.8 శాతం వడ్డీ వసూలు చేస్తారు.త్వరితగతిన నిధులు: పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 'బీపీఐఫ్రాన్స్' (Bpifrance) ద్వారా డిజిటల్ పద్ధతిలో కేవలం ఏడు రోజుల్లోనే రుణ ప్రక్రియ పూర్తి చేసి నిధులు మంజూరు చేస్తారు.ప్రధాని హామీ అమలుఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను అరికడతామని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను గత వారం ఇచ్చిన హామీని ఈ పథకం ద్వారా నెరవేర్చారు. యుద్ధ ప్రభావం వల్ల సామాన్యులపై, వ్యాపారాలపై పడుతున్న భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.రిఫైనరీల తీరుపై విచారణకు డిమాండ్మరోవైపు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుని యూరప్‌లోని రిఫైనరీలు ఇంధన ధరలను అడ్డగోలుగా పెంచుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ "దుర్వినియోగం"పై విచారణ జరపాలని కోరుతూ ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి రోలాండ్ లెస్క్యూర్ యూరోపియన్ కమిషన్‌కు లేఖ రాశారు.యుద్ధం పేరుతో కంపెనీలు అక్రమంగా లాభాలు గడిస్తున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఇంధన సంక్షోభం నుంచి దేశీయ పరిశ్రమలను కాపాడుకునేందుకు ఫ్రాన్స్ తీసుకున్న ఈ చర్యలు ప్రస్తుతం ఐరోపాలో చర్చనీయాంశంగా మారాయి.

Why Tech Giants Send Layoff Emails at 6 AM The Hidden Corporate Strategy3
వేకువజామునే ఈమెయిల్స్‌.. ఎందుకంటే..

నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం అనేది ఏ సమయానికి ఊడుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా దిగ్గజ టెక్ కంపెనీలైన ఒరాకిల్, గూగుల్, మెటా వంటి సంస్థల్లో ఇటీవలి కాలంలో జరిగిన తొలగింపుల సరళిని గమనిస్తే ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన డిజిటల్ ప్యాటర్న్ కనిపిస్తోంది. ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్‌ ఈమెయిల్స్‌ తెల్లవారుజామున 6 గంటలకే పంపిస్తున్నాయి. అందుకు కొన్ని కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ఆఫీసు వేళలు ప్రారంభం కాకముందే, అంటే ఉద్యోగులు ఇంకా నిద్రలో నుంచి మంచం దిగకముందే లేదా అప్పుడప్పుడే నిద్రలేస్తున్న సమయంలో ఈ-మెయిల్స్ పంపడం వెనుక కంపెనీలకు ఒక బలమైన వ్యూహం ఉంది.ఉదయాన్నే ఉద్యోగి ఇంకా ఆఫీసుకి రాకముందే సమాచారం ఇవ్వడం వల్ల ఆఫీసు ఫ్లోర్‌లో అకస్మాత్తుగా గందరగోళం తలెత్తకుండా నిరోధించవచ్చు.వర్కింగ్‌డే మధ్యలో తొలగింపు ప్రస్తావనలు వస్తే స్లాక్ ఛానెళ్లు లేదా టీమ్ కాల్స్‌లో ఒకరికొకరు సందేశాలు పంపుకుంటూ తక్షణమే ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే పంపడం ద్వారా ఈ కమ్యూనికేషన్ చైన్‌ను కంపెనీలు కట్ చేస్తున్నాయి.సాంకేతిక అనుసంధానం కట్‌కంపెనీల్లో ఉద్యోగం తొలగించిన వారికి సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, ఇంటర్నల్ టూల్స్, అధికారిక ఈమెయిల్ ఖాతాల నుంచి యాక్సెస్‌ను రద్దు చేసేందుకు యాజమాన్యాలకు ఉదయం వీలు దొరుకుతుంది. ఈమెయిల్ పంపిన నిమిషాల్లోనే ఆయా సిస్టమ్స్‌ను షట్-డౌన్ చేయడానికి కంపెనీలకు తెల్లవారుజాము సమయం ఒక ‘సేఫ్ విండో’లా పనిచేస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ స్టేట్‌మెంట్లను సిద్ధం చేయడం, మిగిలిన టీమ్ మెంబర్లకు గైడ్ లైన్స్ ఇవ్వడం వంటి పనులకు మేనేజ్‌మెంట్‌కు కొంత సమయం దొరుకుతుంది.మాయమవుతున్న మానవీయ కోణంకంపెనీల దృష్టిలో ఇది కేవలం రిస్క్ మేనేజ్‌మెంట్ మాత్రమే కావచ్చు. కానీ ఒక ఉద్యోగి కోణం నుంచి చూస్తే ఇది అత్యంత కఠినమైన చర్య. ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేనప్పుడు తన కెరీర్ ముగిసిందని తెలుసుకోవడం మానసికంగా కుంగదీస్తుంది. కొన్ని సంస్థల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రక్రియ సజావుగా సాగాలనే ఆరాటంలో కంపెనీలు మానవ సంబంధాలను మరుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా?

Emirates NBD to Acquire RBL Bank4
విదేశీ చేతుల్లోకి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ను దుబాయ్‌ దిగ్గజం ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ బ్యాంక్‌ సొంతం చేసుకోనుంది. ఆర్‌బీఎల్‌లో 74 శాతం వాటా కొనుగోలు ప్రతిపాదనకు తాజాగా ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆర్‌బీఎల్‌ విదేశీ బ్యాంకుగా అవతరించనుంది.ఏప్రిల్‌ 1 నుంచి ఏడాదిలోగా ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. యూఏఈలో రెండో పెద్ద బ్యాంకుగా నిలుస్తున్న ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ 2025 అక్టోబర్‌లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో 60 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తిని ప్రకటించింది. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచ్చించనుంది.కాగా.. ఆర్‌బీఐ అనుమతి కారణంగా మెజారిటీ వాటా కొనుగోలు చేయడంతోపాటు.. ఆర్‌బీఎల్‌ చెల్లించిన మూలధనంలో ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ కనీసం 51 శాతం వాటాను కొనసాగించవలసి ఉంటుంది. తద్వారా విదేశీ బ్యాంక్‌ అనుబంధ సంస్థగా ఆర్‌బీఎల్‌ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఏడాదిలోగా ఆర్‌బీఎల్‌ బ్రాంచీలను ఎమిరేట్స్‌ ఎన్‌బీడీలో విలీనం చేయవలసి ఉంటుంది.

Gold and Silver rates on 4th April 2026 in Telugu States5
పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేటి బంగారం ధరలు ఇలా..

దేశంలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. క్రితం రోజున మోస్తరుగా పెరిగిన బంగారం ధరలు (Today Gold Rate) నేడు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు (Today Silver Rate) ​కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Iran Oil Tanker Diverts From India to China Amid Payment Dispute6
దారి మళ్లిన ఇరాన్ చమురు నౌక..

ఇరాన్ నుంచి భారత్‌ రావాల్సిన ముడి చమురు నౌక తన దారి మార్చుకుంది. గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు రావాల్సిన ‘పింగ్ షున్’ అనే నౌక గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు ప్రయాణిస్తోంది. చెల్లింపు నిబంధనల విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.ఏమిటీ వివాదం?ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్ నుంచి సుమారు 6,00,000 బ్యారెళ్ల ముడి చమురుతో బయలుదేరిన ఈ నౌక భారత్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో అమ్మకందారులు క్రెడిట్ నిబంధనలను కఠినతరం చేయడంతో చిక్కుముడి పడింది. సాధారణంగా ఇరాన్ చమురు వ్యాపారంలో 30 నుంచి 60 రోజుల క్రెడిట్ గడువు ఉంటుంది. ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విక్రేతలు తక్షణమే లేదా స్వల్పకాలిక వ్యవధిలోనే నగదు చెల్లించాలని పట్టుబడుతున్నారు. భారత్ ఈ కఠిన నిబంధనలకు అంగీకరించకపోవడంతో సదరు నౌక తన దిశను మార్చుకుని చైనా వైపు మళ్లిందని అంతర్జాతీయ డేటా విశ్లేషణ సంస్థ ‘కెప్లర్‌’ వెల్లడించింది.అమెరికా ఊరట నిచ్చినా తప్పని తిప్పలుపశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, చమురు ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా మార్చి 20 లోపు లోడ్ అయిన ఇరాన్ నౌకలపై అమెరికా ప్రభుత్వం 30 రోజుల పాటు తాత్కాలికంగా ఆంక్షలను సడలించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుని తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకోవాలని భారత్ భావించింది. కానీ, వాణిజ్య పరమైన చెల్లింపుల సమస్యలు ఇప్పుడు అడ్డంకిగా మారాయి. ‘చెల్లింపు సమస్యలు పరిష్కారమైతే ఈ కార్గో తిరిగి భారత రిఫైనరీలకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం లాజిస్టిక్స్ కంటే వాణిజ్య నిబంధనలే ఇరాన్ చమురు సరఫరాను శాసిస్తున్నాయి’ అని కెప్లర్‌ లీడ్ రీసెర్చ్ అనలిస్ట్ సుమిత్ రితోలియా తెలిపారు.తగ్గుతున్న రాయితీలుమరోవైపు, రష్యా, ఇరాన్ చమురుపై ఇన్నాళ్లూ లభించిన భారీ డిస్కౌంట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం, కొనుగోలుదారులు ఎక్కువ కావడంతో ఈ నౌకలపై డిస్కౌంట్లు తగ్గి కొన్ని సందర్భాల్లో ప్రీమియం ధరలు కూడా వసూలు చేస్తున్నట్లు ‘వొర్టెక్సా’ నివేదిక పేర్కొంది. రష్యా చమురుపై ఆంక్షల సడలింపు తర్వాత భారత దిగుమతులు పుంజుకున్నప్పటికీ, ఇరాన్ విషయంలో మాత్రం చెల్లింపుల చిక్కులు వీడటం లేదు. చైనా వంటి దేశాలు భారీగా దిగుమతులు చేసుకుంటున్న తరుణంలో భారత్ తన ఇంధన భద్రత కోసం ఇరాన్‌తో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా?

Advertisement
Advertisement
Advertisement