Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

stock market updates on 23 April 20261
నష్టాల్లో కదలాడుతున్న మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు తగ్గి 24,241 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 546 పాయింట్లు నష్టపోయి 77,974 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.69బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 103.44 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.05 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 1.64 శాతం పుంజుకుంది.Today Nifty position 23-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Gen Z Redefines Office Culture Respect Now Earned by Clarity Not Titles2
కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం

టెక్నాలజీలో వేగంగా మార్పులొస్తున్నాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఆఫీసుల్లో కొత్తగా చేరే ఉద్యోగుల తీరు విభిన్నంగా ఉంది. గతంలో బాస్ ఏదైనా చెబితే చాలా వరకు ఎదురు చెప్పకుండా దాన్ని పాటించేవారు. కానీ ఇప్పుడు యువత ముఖ్యంగా జెన్ జీ తీరు మారింది. ఇది పని పట్ల వారికున్న కొత్త ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. వారిలోని మార్పును నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారో చూద్దాం.హోదాను చూసి కాదు..ఒకప్పుడు ఆఫీసులో ఎవరైనా పెద్ద పోస్టులో ఉంటే వారు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు సీన్ మారింది. కార్యాలయాల్లో ఇంటర్నల్‌ మీటింగ్స్ జరిగినప్పుడు ‘ఈ పని ఎందుకు చేయాలి?’ అని యువ ఉద్యోగులు అడుగుతున్నారు. కేవలం మేనేజర్ అని గౌరవం ఇవ్వడం కాకుండా తనకు విషయం తెలిసి స్పష్టంగా సమస్యను, పరిష్కారాన్ని వివరిస్తేనే నిజమైన గౌరవం దక్కుతోంది. అంటే, అధికారం అనేది ఇప్పుడు కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టి వస్తోంది.పనిలో క్లారిటీ ఉండాల్సిందే!‘నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల కంపెనీకి లేదా నాకు వచ్చే లాభం ఏంటి?’ అని జెన్‌జీ యువత ఆలోచిస్తున్నారు. పని గురించి సరిగ్గా వివరించకపోతే ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఇది తిరుగుబాటు కాదు, అర్థం లేని పని చేయలేక వస్తున్న విసుగు అని గమనించాలి. మనం చేసే పనికి ఒక అర్థం, ఒక లక్ష్యం ఉందని తెలిస్తేనే నేటి ఉద్యోగులు ఉత్సాహంగా పని చేస్తున్నారు.అప్పటికప్పుడు ప్రోత్సాహం కావాలి!పాత కాలంలో ఏ ఏడాదికో ఒకసారి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పటి డిజిటల్ కాలంలో అంత ఓపిక ఎవరికీ లేదు. ‘నేను చేస్తున్న పని బాగుందా? లేదా?’ అని ఉద్యోగులు అప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బాస్ ఏమీ చెప్పకుండా గమ్మున ఉంటే.. అది తమకు ఇష్టం లేదనో లేదా తనను పట్టించుకోవడం లేదనో ఉద్యోగి ఫీలవుతున్నారు. చిన్న మెచ్చుకోలు అయినా సరే అది పనిని రెట్టింపు వేగంతో చేయిస్తుంది.జీతం కోసం మాత్రమే కాదు!నేటి తరం పనిని కేవలం నెల నెలా వచ్చే జీతం కోసం చేయడం లేదు. వారు చేసే పనిలో ఒక తృప్తిని వెతుక్కుంటున్నారు. ‘నేను చేస్తున్న పని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నేను ఎదగడానికి ఇది పనికొస్తుందా?’ అనేదే వారి మెయిన్ పాయింట్. అందుకే ఇప్పుడు ఆఫీసుల్లో కంట్రోల్ చేయడం కంటే ఉద్యోగులతో కలిసి ప్రయాణించడం ముఖ్యం. బాస్‌లు ఆదేశాలు ఇచ్చే వారిగా కాకుండా దారి చూపే వారిగా మారినప్పుడే ఏ కంపెనీ అయినా సక్సెస్ అవుతుంది.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Google Agentic Era Sundar Pichai Reveals New Code Now AI Generated3
75 శాతం కోడింగ్ ఏఐతోనే!

టెక్నాలజీ ప్రపంచంలో ఏజెంటిక్ యుగం మొదలైందని, గూగుల్‌లో జరుగుతున్న భారీ మార్పులే దీనికి నిదర్శనమని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ 26 వార్షిక సదస్సు సందర్భంగా ఆయన రాసిన ‘ది కీవర్డ్’ బ్లాగ్ పోస్ట్‌లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం గూగుల్‌లో రాసే కొత్త కోడ్‌లో 75 శాతం ఏఐ ద్వారానే రూపొందుతోందని స్పష్టం చేశారు.ఏజెంటిక్ యుగంలోకి..గత ఏడాది ఇదే సమయానికి ఏఐ ద్వారా తయారయ్యే కోడ్ 50 శాతం ఉండగా ఇప్పుడు అది 75 శాతానికి చేరుకోవడం గమనార్హం. కేవలం కోడ్ రాయడమే కాకుండా మన ఇంజినీర్లు దాన్ని సమీక్షించి ఆమోదిస్తున్నారని పిచాయ్ పేర్కొన్నారు. ‘మేము ఇప్పుడు రియలిస్టిక్‌ ఏజెంటిక్ వర్క్ ఫ్లోలకు మారుతున్నాం. మా ఇంజినీర్లు ఇప్పుడు పూర్తి స్వయంప్రతిపత్తి డిజిటల్ టాస్క్ ఫోర్స్‌లను నిర్వహిస్తున్నారు. ఊహించని పనులను సుసాధ్యం చేస్తున్నారు’ అని చెప్పారు.వేల సంఖ్యలో ఏజెంట్ల నిర్వహణగతంలో ‘మనం ఒక ఏఐ ఏజెంట్‌ను నిర్మించగలమా?’ అనే చర్చ ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి ‘వేల సంఖ్యలో ఉన్న ఏజెంట్లను ఎలా నిర్వహించాలి?’ అనే స్థాయికి చేరుకుందని పిచాయ్ తెలిపారు. దీనికోసం గూగుల్ జెమిని ఎంటర్‌ప్రైజ్ ఏజెంట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిందని చెప్పారు.ఆరు రెట్లు వేగంగా పనులుగూగుల్ తన సొంత ఎకోసిస్టమ్‌లో ఏఐని వినియోగించడం వల్ల వచ్చిన మార్పులను ఆయన ఉదాహరణలతో వివరించారు.గతంలో ఇంజినీర్లు మాత్రమే చేసిన పని కంటే ఇప్పుడు ఏజెంట్లు, ఇంజినీర్లు కలిసి చేయడం వల్ల కోడ్ మైగ్రేషన్ ప్రక్రియ 6 రెట్లు వేగంగా పూర్తయింది.మాక్‌ఓఎస్‌ (macOS)లోని జెమిని యాప్‌ను గూగుల్ సొంత ‘ఏజెంట్-ఫస్ట్’ ప్లాట్‌ఫామ్ ‘యాంటీ గ్రావిటీ’ని ఉపయోగించి తయారు చేసినట్లు చెప్పారు. ఇందులో అటానమస్‌ ఏఐ ఏజెంట్లు మానవ జోక్యం లేకుండానే బ్రౌజర్‌లో అప్లికేషన్లను ప్లాన్ చేయడం, కోడ్ రాయడం, పరీక్షించడం వంటి పనులు పూర్తి చేస్తున్నాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్‌లో గూగుల్ ప్రవేశపెట్టిన ఈ నూతన ఆవిష్కరణలు టెక్ ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతాయని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

India Notifies Online Gaming Law; Ban On Money Games, Boost Esports Social Play4
ఆన్‌లైన్‌ గేమింగ్‌ కొత్త నిబంధనలు

ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రోత్సాహక, నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి వీలుగా చట్టపరమైన ప్రక్రియలు, కొత్త నిబంధనలను కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ నోటిఫై చేసింది. ఈ నిబంధనలు ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ ఏర్పాటుకు కూడా వీలు కల్పిస్తాయి. ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ను నిషేధిస్తూ.. ఈస్పోర్ట్స్, ఆన్‌లైన్‌ సోషల్‌ గేమింగ్‌ను ప్రోత్సహించడం ఈ చట్టం ఉద్దేశం. చట్ట ప్రకారం ఇప్పటికే నిషేధించిన రియల్‌ మనీ గేమ్స్‌ కాకుండా చాలా వరకు ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ తెలిపారు.కేవలం నిర్ధిష్ట కేసుల్లోనే పర్యవేక్షణ ఉంటుందన్నారు. చట్టం కింద ఈస్పోర్ట్స్‌ తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘‘వీలున్నంత వరకు నియంత్రణలను సులభతరంగా ఉంచాలన్నదే మా ఉద్దేశం. మనీ గేమ్స్‌ కాని చాలా వరకు గేమ్స్‌ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ఆన్‌లైన్‌ మనీ గేమ్‌ లేదా ఆన్‌లైన్‌ సోషల్‌ గేమ్‌ లేదా ఈస్పోర్ట్స్‌లో ఏదన్నది నిర్ధారించుకోవాలంటూ ఎవరినీ బలవంతం చేయడం లేదు’’అని కృష్ణన్‌ పేర్కొన్నారు. కొత్త నిబంధనల్లో యూజర్ల భద్రతా సదుపాయాలను సైతం నిర్వచించినట్టు చెప్పారు.ఇదీ చదవండి: టిమ్ కుక్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు

India D2C growth powered by Tier 2, 3 cities with 66 percent in FY 20265
డీ2సీ బ్రాండ్లకు చిన్న నగరాల్లో ఆదరణ 

న్యూఢిల్లీ: డైరెక్ట్‌ టు కన్జ్యూమర్‌ బ్రాండ్లు (డీ2సీ) మెట్రో నగరాలను దాటి, ద్వితీయ (టైర్‌–2), తృతీయ శ్రేణి (టైర్‌–3) నగరాల్లో కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. ప్రముఖ ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ యూనికామర్స్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డీ2సీ బ్రాండ్లకు వచి్చన కొత్త ఆర్డర్లలో 66 శాతం వాటా ఈ చిన్న పట్టణాల నుంచే ఉండడం విశేషం. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో వస్తున్న మార్పులను ఇది ప్రతిఫలిస్తోంది. 2025–26లో డీ2సీ బ్రాండ్లకు నికరంగా పెరిగిన గ్రాస్‌ మర్చండైజ్‌ వ్యాల్యూ (జీఎంవీ/ స్థూల ఉత్పత్తుల విక్రయ విలువ)లో 60 శాతం చిన్న నగరాల నుంచే ఉంది. మెట్రో నగరాలకు వెలుపల డీ2సీ బ్రాండ్లకు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. సంప్రదాయ బ్రాండ్ల మాదిరి డీలర్లు, హోల్‌సేలర్లు, రిటైల్‌ సంస్థల ప్రమేయం లేకుండా.. ఈ–కామర్స్, క్విక్‌ కామర్స్, సొంత ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించే ఉత్పత్తులను డీ2సీ బ్రాండ్లుగా చెబుతారు. చిన్న నగరాలే ఆశాకిరణం.. డీ2సీ రంగం గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు చూపించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో (2024–25) పోలి్చతే ఆర్డర్ల పరంగా 33 శాతం, విక్రయాల విలువలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం 10–12 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.1.11 లక్షల కోట్లు) ఉన్న భారత డీ2సీ మార్కెట్, 2030 నాటికి 60 బిలియన్‌ డాలర్లకు (రూ.5.58 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా వేసింది. అంటే ఏకంగా నాలుగు రెట్లు పెరగనుంది. డెలివరీ వ్యవస్థలో మెరుగుదల వల్ల ఆర్డర్లు వెనక్కి రావడం 39 శాతం నుంచి 21 శాతానికి తగ్గనున్నట్టు పేర్కొంది. టెక్నాలజీతో చేరువ.. ఆర్డర్ల నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ), చాట్‌ ఆధారిత సేవల వాడకం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. వ్యక్తిగతీకరించిన షాపింగ్‌ అనుభవం వల్ల బ్రాండ్ల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఆన్‌లైన్‌ వ్యాపారం ఇకపై కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాబోదని, మారుమూల ప్రాంతాలు వృద్ధి చోదకాలుగా నిలుస్తాయని విశ్లేషించింది. సుమారు 40 కోట్ల ఆర్డర్ల డేటాను విశ్లేషించి యూనికామర్స్‌ ఈ నివేదికను రూపొందించింది.

Radisson Hotel Group plans to 65,000 to 80,000 jobs in India by 20306
భారత్‌లో 500 హోటల్స్‌ లక్ష్యం

న్యూఢిల్లీ: భారత్‌లో 2030 నాటికి ప్రాపర్టీల సంఖ్యను 500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాడిసన్‌ హోటల్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎలీ యూనిస్‌ తెలిపారు. దీనితో 60,000–80,000 వరకు ఉద్యోగావకాశాలు లభించగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా రిక్రూట్‌ చేసుకోవడం కోసం ఉద్యోగార్థులకి శిక్షణ కలి్పంచేందుకు టూరిజం, హాస్పిటాలిటీ స్కిల్‌ కౌన్సిల్, స్థానిక వర్సిటీలు, ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాడిసన్‌కి 200 పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రథమ నుంచి నాలుగో శ్రేణి నగరాలవ్యాప్తంగా కొత్త హోటల్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు యూనిస్‌ చెప్పారు. వీటిల్లో 15 శాతం ఫైవ్‌ స్టార్‌వి, 45–50 శాతం అప్‌స్కేల్, త్రీ–స్టార్, ఫోర్‌–స్టార్‌ హోటల్స్‌ ఉంటాయని వివరించారు. కొత్తగా చేపట్టే వాటిల్లో 55 శాతం ప్రాజెక్టులు ప్రథమ శ్రేణి, 25 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉంటాయని యూనిస్‌ వివరించారు. 10 శాతం రిసార్టుల్లో, ఇంకో 10 శాతం ఆధ్యాతి్మక కేంద్రాల్లో ఉంటాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ప్రస్తుతం భారత్‌లో వ్యాపారం యథావిధిగానే నడుస్తోందని యూనిస్‌ వివరించారు. దుబాయ్, సౌదీ అరేబియాలాంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. తమకు అంతర్జాతీయంగా టాప్‌ 3 కీలక మార్కెట్లలో భారత్‌ కూడా ఒకటని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement