ప్రధాన వార్తలు
ఫారమ్ 15 G/H బదులుగా ఫారమ్ 121
కొత్త చట్టం, కొత్త రూల్స్తో ఫారాల నంబర్లు మారడం సహజం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 G/Hలు రెండింటికి బదులుగా ఒకే ఫారమ్ తెచ్చారు. దాని నెంబరు 121గా ఉంది. కొత్త ఫారమ్ ఎందుకు దాఖలు చేయాలి? విషయం పాతదే. మీకు బాగా తెలిసిందే. మీరు సంపాదించిన బ్యాంకు డిపాజిట్లు మీద వడ్డీని ఇతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఇది పన్నుకు గురి అవుతుంది. ఒక ఏడాది ఇటువంటి ఆదాయం రూ.50 వేలు, ఏడాది దాటితే ఈ పరిమితి సీనియర్ సిటిజన్లకు అయితే రూ.1,00,000. బ్యాంకు వాళ్లు దాని మీద టీ.డీ.యస్ రివకరీ చేస్తారు. అందుకని ముందుగా లెక్కలు వేసుకోండి. మీ నికర టాక్స్ బుక్ ఆదాయం 2026–27లో రూ.12,00,000 దాటకపోతే మీకు పన్ను భారం ఏర్పడదు. మీకు ఏర్పడ్డ ఆదాయంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ కూడా ఉండి, మొత్తం ఆదాయం రూ.12,00,000 దాటకపోతే పన్ను భారమే ఉండదు కాబట్టి టీడీఎస్కి గురి కావడం అనవసరం. అందుకని ఈ నెలలోనే 121 ఫారమ్ సబ్మిట్ చేయండి. మీరు బ్యాంకుకి సబ్మిట్ చేయకపోతే బ్యాంకు వారు టీడీఎస్ కట్ చేస్తారు. అందుకని 121 వేయండి.పాత ఫారమ్లు ఇక ఉండవా..? 1.4.2026 నుంచి పాత ఫారమ్లు 15 G/H ఉండవు. రద్దు అయ్యాయి అని అనవచ్చు. గతేడాది వరకు 60 ఏళ్లు దాటిన వారికి ఒక ఫారమ్, దాటని వారికి వేరొక ఫారమ్ అమల్లో ఉండేవి. ఇక నుంచి ఒకే ఫారమ్. దాని నెంబరే 121. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా 121 దాఖలు చేయాలి. టీడీఎస్ ఏ పరిస్థితుల్లో చేస్తారు.. ఫారమ్ 121 దాఖలు చేసినా, చేయకపోయినా డిపాజిట్ హోల్డర్లకి పాన్ లేకపోతే టీడీఎస్ 20% చొప్పున చేస్తారు. పాన్ ఉండి పనిచేయకపోయినా.. ఆధార్తో అనుసంధానం కాకపోయినా 20 % రివకరీ చేస్తారు. బ్యాంకు వడ్డీ రూ.50,000 దాటి, గత రెండు అస్సెస్మెంట్ సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్ను వేయకపోతే టీడీఎస్ 20 శాతం కట్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం ఉంటే .. ఫారమ్ 121 కేవలం పన్ను భారం లేని వారికి మాత్రమే. 87 అ కింద రిబేటు సౌకర్యం/సదుపాయం పొందడానికి క్యాపిటల్ గెయిన్స్ మీద కాకుండా ఏర్పడ్డ ఇతర అన్ని ఆదాయాలకు మాత్రమే. మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఆదాయం ఉంటే ఫారమ్ 121 వేయకూడదు. కింది ఉదాహరణ అర్థం చేసుకోండి .. 2026–27లో మీ ఆదాయం రూ.12,00,000 లోపల ఉంది. ఈ సందర్భంలో పన్ను భారం ఉండదు. రూ.2,00,000 బ్యాంకు వడ్డీ ఇందులో కలిసి ఉండదనుకొండి. 121 ఇచ్చారు. బ్యాంకు వాళ్లు టీడీఎస్ చేయరు. కానీ సంవత్సరాంతంలో మీకొక క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది అనుకోండి. పన్ను భారం ఏర్పడుతుంది. మినహాయింపులు పొందవచ్చు. మినహాయింపులు వద్దనుకుంటే... 87 అ బెనిఫిట్ రద్దు అవుతుంది. అంటే రేట్ల ప్రకారం రూ.12,00,000 మీద క్యాపిటల్ గెయిన్స్ మీద చెల్లించాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఫారమ్ 121 ఇవ్వడం తప్పు అవుతుంది. ఆ తప్పు నుంచి బయట పడాలంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాల్సిందే. అప్పుడు ఫారమ్ 121 ఇవ్వడం సముచితము. రెండు విభిన్న ఆలోచనలు .. ఏ ఆదాయం ఎంత ఉన్నా.. ఫారమ్ 121 ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకు వాళ్లు టీడీఎస్ రికవరీ చేస్తారు. సంవత్సరం చివరన ఆదాయం లెక్కించడం, పన్ను చెల్లించడం.. ఒక వర్గం వాదన ఇది. కాగా మరో వర్గం ఆలోచన ఏమిటంటే ఏ ఆదాయం ఎంత ఉన్నా ఫారమ్ 121 ఇవ్వడం... పన్ను కోత టీడీఎస్ లేకుండా బయటపడటం.. కానీ సంవత్సరాంతంలో ఆదాయం లెక్కించి పన్ను కట్టడం, లేదా రిఫండ్ తెచ్చుకోవడం .. ఇలా కూడా చేయొచ్చు. మీరు ముందుగానే లెక్కలన్నీ వేసి నిర్ణయం తీసుకోండి. ఫారమ్ 121 గురించి సాంకేతిక సమాచారం .. ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్ అ లో అంకెలు మనం నింపాలి. ఫారమ్ ఆ బ్యాంకు వాళ్లు నింపుతారు. అంశాలన్నీ మీకు తెలిసినవే. మొత్తం సంవత్సర ఆదాయం ఎంతో చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్ల ఆదాయపు రిటర్నులు వివరాల ఇవ్వాలి. 121 దాఖలు చేయగానే బ్యాంకు అధికార్లు 26 క్యారెక్టర్లతో అంకెలు/అక్షరాలు కలిపిన నెంబరు ఇస్తారు. ఇందులో బ్యాంకు పేరు, టాన్ నంబరు, ఆర్థిక సంవత్సరం మొదలైనవి ఉంటాయి. ఈ నంబరుతో డిపార్ట్మెంట్ వారు మీ వివరాలన్నింటినీ ట్రాక్ చేస్తారు. దీని వలన దురి్వనియోగం/అనుచితయోగం తగ్గుతుంది. ఈ ఫారమ్లో వివరాలు ఇతర ఫారాలతో లింక్ చేయడం వలన అన్నీ ఫారాల్లోని అంశాలు అప్డేట్ అవుతాయి. తగిన జాగ్రత్త వహించండి.
పసిడి ప్రియులకు ఊరట.. బంగారం తగ్గుముఖం
పసిడి ప్రియులకు ఊరట కలిగింది. దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజుల తర్వాత పసిడి ధరలు (Today Gold Rate) నేడు కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
స్టాక్మార్కెట్ అలర్ట్: నాలుగు రోజులే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు, ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక. ఈ వారం సెలవుల కారణంగా ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 19 మధ్య ట్రేడింగ్ కేవలం నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి, వారాంతపు సెలవుల సందర్భంగా మూడు రోజులు మార్కెట్లకు సెలవు ఉంటుంది.మార్కెట్ సెలవుల వివరాలుఏప్రిల్ 14 (మంగళవారం) అంబేడ్కర్ జయంతి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) పూర్తిగా మూసిఉంటాయి. అలాగే వారాంతపు సెలవులైన ఏప్రిల్ 18 (శనివారం), ఏప్రిల్ 19 (ఆదివారం) మార్కెట్లు యధావిధిగా పనిచేయవు. మంగళవారం విరామం తర్వాత, ఏప్రిల్ 15 (బుధవారం) ఉదయం నుండి ట్రేడింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.ఈ విభాగాల మూసివేతఅంబేడ్కర్ జయంతి నాడు కేవలం ఈక్విటీ మార్కెట్ మాత్రమే కాకుండా.. డెరివేటివ్స్, కరెన్సీ, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O), ఫారెక్స్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్లలో కూడా క్రయవిక్రయాలు నిలిచిపోతాయి. అలాగే సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్లకు కూడా సెటిల్మెంట్ హాలిడే కావడంతో లావాదేవీల క్లియరెన్స్లో జాప్యం ఉండవచ్చు.కమోడిటీ మార్కెట్మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ట్రేడింగ్ చేసే వారికి కొంత ఊరట లభించనుంది. ఇక్కడ మార్కెట్ పూర్తిగా మూసిఉండదు. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:45 వరకు ట్రేడింగ్ ఉండదు. ఈ సమయంలో బంగారం, వెండి, ముడిచమురు వంటి లోహాల వ్యాపారం నిలిచిపోతుంది. సాయంత్రం 5:30 గంటల నుండి ట్రేడింగ్ యధావిధిగా కొనసాగుతుంది.
కోటక్, యాక్సిస్.. న్యూఫండ్ ఆఫర్స్
కోటక్ మహీంద్రా ఏఎంసీ తాజాగా మల్టీ అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ని ఆవిష్కరించింది. ఇందులో ఏప్రిల్ 22 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000గా ఉంటుంది. ఈక్విటీ, డెట్, కమోడిటీ ఆధారిత స్కీముల యూనిట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిసు్కకు తగ్గట్లుగా మరింత మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్ లక్ష్యంగా ఉంటుంది. ఒకే ఫండ్ ద్వారా డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ ఎండీ నీలేశ్ షా తెలిపారు. యాక్సిస్ డిఫెన్స్ ఫండ్యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ డిఫెన్స్ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)ను ప్రారంభించింది. ఈ నెల 24 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రక్షణ రంగానికి కేంద్రం ఎంతో ప్రా ధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దేశీయంగానే అత్యాధునిక ఆయుధాల అభివృద్ధి, తయారీ దిశగా పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.మారిన ప్రపంచ క్రమంలో రక్షణ రంగానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తోంది. 2013–14 నుంచి చూస్తే రెండున్నర రెట్లు పెరిగి 2025–26 నాటికి రూ.6.8 ల క్షల కోట్లకు కేటాయింపులు పెరిగాయి. దీంతో రక్షణ రంగంలోని కంపెనీలు దీర్ఘ కాలానికి మెరుగైన అవకాశాలు కల్పిస్తుండడంతో ప్రత్యేకంగా డిఫెన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ను ప్రారంభించింది.
సక్సెస్కు ‘సప్త’పది! ‘కొత్త’గా ఇన్వెస్ట్ చేద్దాం..
నిన్న మొన్నటిదాకా పెట్టుబడులు పోటెత్తాయి. దీంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. ఆ పరిస్థితుల నుంచి ఇపుడు మార్కెట్లు ఆటుపోట్ల దశవైపు మళ్లాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. గత కొన్నాళ్లుగా ఈక్విటీలు పటిష్టంగా ర్యాలీలు చేస్తుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపటం వారికి మంచి లాభాలనే ఇచ్చింది. కానీ 2027 ఆర్థిక సంవత్సరం కాస్త విభిన్నంగా ఉండబోతోంది. అంతర్జాతీయంగా వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. ద్రవ్యోల్బణం దిగి వస్తున్నా, అంత తేలిగ్గా లొంగడం లేదు. వడ్డీ రేట్లు కూడా మరీ దూకుడుగా ఏమీ తగ్గడం లేదు. భారతీయ ఇన్వెస్టర్లకు దేశీయంగా పటిష్టమైన వృద్ధి వల్ల అవకాశాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ, విధానాలను కాస్త మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది, రాబడులపై ఆశలతో గుడ్డిగా పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులను స్మార్ట్గా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం ఉపయోగపడే ఏడు వ్యూహాల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ... ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక లక్ష్యాల మదింపు చాలా మంది ఇన్వెస్టర్లు ఒక్కసారి లక్ష్యాలను నిర్దేశించుకున్నారంటే చాలు మళ్లీ వాటిలో మార్పులు, చేర్పులు చేసుకోరు. అయితే, కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు, ఆదాయ స్థాయిలు, వ్యక్తిగత బాధ్యతలు మారుతుంటాయి. కాబట్టి మీరు పెడుతున్న పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పునఃసమీక్షించుకునేందుకు ఈ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఒక చక్కని అవకాశంగా మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యానికి 2–3 ఏళ్లే ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఒడిదుడుకులపరంగా అనవసర రిసు్కలు ఎదురుకావచ్చు. అదే రిటైర్మెంట్ లేదా సంపదను పెంచుకోవడంలాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టి ఉంటే ఈక్విటీల్లో అధిక పెట్టుబడులను కొనసాగించవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆటో పైలట్ మోడ్లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడం కాకుండా లక్ష్యానికి ఉన్న వ్యవధికి తగ్గట్లుగా కేటాయింపులు మార్చాల్సి ఉంటుంది.అసెట్ అలోకేషన్ని సరి చేసుకోవడం ఇపుడు అన్నింటికన్నా పెద్ద రిస్కు మార్కెట్ ఒడిదుడుకులు కాదు.. కేవలం ఒకే పెట్టుబడి సాధనంలో, అందులోనూ, ఈక్విటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడమే రిస్కీ వ్యవహారం. చాలా మటుకు పోర్ట్ఫోలియోలు అనుకోకుండానే ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లలో ఒకే రకమైన రిటర్నులు రాకపోవచ్చు. కాబట్టి, అసెట్ అలొకేషన్పై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈక్విటీ, డెట్, పసిడితో సమతూకమైన పోర్ట్ఫోలియో ఉంటే షాక్లేవైనా ఎదురైనా తట్టుకుంటూ సంపదను పెంచుకునేందుకు వీలవుతుంది. ఉదాహరణకు... ఈక్విటీలు పతనమైనప్పుడు, డెట్ సాధనాలు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇక గ్లోబల్ అనిశి్చతికి పసిడి హెడ్జింగ్ సాధనంగా పని చేస్తుంది. వార్షికంగా రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల పోర్ట్ఫోలియోకి మీరు నిర్దేశించుకున్న స్థాయికి మించి రిస్కులు ఎదురవకుండా చూసుకోవచ్చు.డైవర్సిఫికేషన్ ప్రధానం పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించడమంటే బోలెడన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉండాలనే అపోహ ఒకటి ఇన్వెస్టర్లలో ఉంది. వాస్తవానికి సదరు ఫండ్స్ అన్నీ కూడా ఒకే రకమైన రంగాలు లేదా మార్కెట్ క్యాప్లకు చెందినవైతే, అప్పుడు కూడా మొత్తం పోర్ట్ఫోలియోలో ఒకే తరహా పెట్టుబడులున్నట్లే అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో సిసలైన డైవర్సిఫికేషన్ అంటే వివిధ అసెట్ క్లాస్లు, భౌగోళిక ప్రాంతాలు, పెట్టుబడి వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించడం. ఈక్విటీల విషయానికొస్తే, స్థిరత్వం కోసం లార్జ్ క్యాప్స్లో, అడాప్టబిలిటీ కోసం ఫ్లెక్సి క్యాప్స్లో, సమతూకం కోసం డెట్, పసిడిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ మరింతగా ఉంటుంది.ఒడిదుడుకులు.. వ్యూహాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటుపోట్లు ప్రత్యేకంగా కనిపించనున్నాయి. ఇన్వెస్టర్లు వీటిని రిస్కులుగా అనుకోకుండా, అవకాశాలుగా మార్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) చక్కగా పని చేస్తాయి. దీనివల్ల కాలక్రమేణా కొనుగోలు రేటు సగటు స్థాయికి వస్తుంది. అయితే, మార్కెట్లు కరెక్షన్లకు లోనైనప్పుడు సిప్లతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులను కూడా జోడిస్తే స్మార్ట్ విధానంగా ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లు అర్థవంతంగా తగ్గితే, అదనంగా పెట్టుబడులను కొద్ది కొద్దిగా పెట్టడం వల్ల దీర్ఘకాలిక రాబడులు మెరుగుపడతాయి. మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పుడు భావోద్వేగాలతో కాకుండా క్రమశిక్షణతో వ్యవహరించడం ముఖ్యం.లిక్విడిటీ పటిష్టం చేసుకోవాలి అనిశ్చితిలో రాబడులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో లిక్విడిటీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా చాలా మటుకు డబ్బును మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళికలో కనీసం ఆరు నెలలకు సరిపడే ఎమర్జెన్సీ నిధి కూడా ఉంటుంది. అనూహ్య పరిస్థితులు ఏవైనా తలెత్తితే దీర్ఘకాలిక పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఇది తోడ్పడుతుంది. లిక్విడిటీ ఉంటే ప్రధాన పోర్ట్ఫోలియోని డిస్టర్బ్ చేయకుండా మార్కెట్లో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుంది.పోర్ట్ఫోలియోలో డెట్ సాధనాలకూ చోటివ్వండి ఈక్విటీ మార్కెట్లు బాగున్నప్పుడు డెట్ పెట్టుబడులను పెద్దగా పట్టించుకోరు. కానీ రాబడులు ఒక మోస్తరు స్థాయికి పరిమితమై, వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్న దశలో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. డెట్ సాధనాల వల్ల అంచనాలకు అనుగుణమైన రాబడులు వస్తాయి. పోర్ట్ఫోలియోలో ఆటుపోట్లు తగ్గుతాయి. మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న దశలో పోర్ట్ఫోలియోకి కాస్త స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడిని సంరక్షించుకోవడం చాలా కీలకంగా ఉండే స్వల్పకాలిక, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి 2026–27లో అత్యంత నాణ్యమైన డెట్ సాధనాలకు సమతూకంగా కేటాయిస్తే, భారీ రాబడులు లేకపోయినా, రిసు్కకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను అందుకునేందుకు వీలవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం సాధారణంగా సరైన ఫండ్ని ఎంపిక చేసుకుంటే చాలు మంచి రాబడులు వస్తాయనే దృష్టితో చాలా మంది ‘అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్ని వెతికి పట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. నిజానికి, నిలకడ, క్రమశిక్షణ, అసెట్స్కి సరైన అలొకేషన్ చేయడమే దీర్ఘకాలికంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవలి కాలంలో పనితీరు బాగుండటం లేదంటూ మాటిమాటికీ ఫండ్స్ని అటూ ఇటూ మార్చడం వల్ల అసలుకే మోసం వస్తుంది. దీనివల్ల భారీ వేల్యుయేషన్స్కి కొనుక్కుని, తాత్కాలికంగా పడగానే, ని్రష్కమించినట్లవుతుంది. అలా గాకుండా మెరుగ్గా నిర్వహిస్తున్న కొద్ది ఫండ్స్ని ఎంచుకుని, పెట్టుబడులను కొనసాగిస్తూ, మధ్యమధ్యలో వాటిని సమీక్షించుకుంటూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ తాత్కాలిక భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల గాకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం వల్లే మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరంలో దూకుడుగా, అస్తవ్యస్తంగా పెట్టుబడులను పెడితే ఫలితాలు దక్కేలా లేవు. ఎవరైతే సమతూకం, నిలకడ, రిస్క్ మేనేజ్మెంట్పై ప్రధానంగా ఫోకస్ చేస్తారో వారికే ప్రయోజనాలు లభిస్తాయి. మార్కెట్ కదలికలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నం చేయడం కాకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే విధంగా పోర్ట్ఫోలియోని తీర్చిదిద్దుకోవడం స్మార్ట్ వ్యూహంగా ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సరిచేసుకుంటూ, సరైన అసెట్ అలొకేషన్ని పాటిస్తూ, సమర్ధవంతంగా డైవర్సిఫై చేస్తూ, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లు ఒకవైపు దీర్ఘకాలికంగా సంపదను పెంచుకుంటూనే మరోవైపు అనిశ్చితి నుంచి బైటపడొచ్చు. చివరగా చెప్పేదేమిటంటే, గొప్ప ఫలితాలు సాధించాలంటే ఏదైనా అసాధారణమైనది చేయడం కాదు.. నిలకడగా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలు.
మార్కెట్కు మళ్లీ ‘పశ్చిమాసియా’ సెగ?
ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశి్చమాసియా మళ్లీ భగ్గుమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి డీల్ కుదరకుండానే ఇరు పక్షాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్పై దీని ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దాడులు మొదలై హార్మూజ్ జలసంధిలో తిరిగి ఇరాన్ అడ్డంకులు సృష్టిస్తే.. క్రూడ్ ధరలు దూసుకెళ్లడంతో పాటు దీని సెగ మార్కెట్కు గట్టిగానే తగలవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం (14న) మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్పశ్చిమాసియాలో చోటుచేసుకునే కీలక పరిణామాలకు తోడు క్రూడ్ ధరల కదలికలు మార్కెట్ ట్రెండ్ను నిర్దేశించనున్నాయి. ఇరాన్–అమెరికా మధ్య సీజ్ఫైర్... శాంతి ఒప్పందంపై ఆశలతో గతవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు రివ్వుమన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రూడ్ 100 డాలర్ల కిందికి జారడంతో సూచీలకు బూస్ట్ లభించింది. అణు కార్యకలాపాలకు స్వస్తి చెప్పేందుకు ఇరాన్ ససేమిరా అనడంతో చర్చలు విఫలయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించగా.. యూఎస్ అలవికాని డిమాండ్లే డీల్ కుదరకపోవడానికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ పేర్కొనడం విశేషం.చర్చలు విఫలమైన నేపథ్యంలో సమీపకాలానికి మార్కెట్ ముఖచిత్రం మళ్లీ మారిపోయే అవకాశం ఉందని లివ్లాంగ్ వెల్త్ రీసెర్చ్ ఎనలిస్ట్ హరిప్రసాద్ కె అభిప్రాయపడ్డారు. ’నిఫ్టీ శరవేగంగా తిరిగి 24,000 స్థాయిని అధిగమించిన నేపథ్యంలో సూచీకి ఈ వారం చాలా కీలకంగా మారనుంది. అయితే, ఇరాన్–అమెరికా శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో మళ్లీ మార్కెట్లలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. సోమవారం సూచీలు భారీ గ్యాప్డౌన్తో మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తాజా సీజ్ఫైర్ ర్యాలీలో ఆర్జించిన లాభాలు చాలా వరకు ఆవిరయ్యే ప్రమాదం నెలకొంది’ అని ఆయన పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం డేటా.. ఈ వారంలో విడుదలయ్యే ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా మార్కెట్పై ప్రభావం చూపనున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.. మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ఏప్రిల్ 13న, టోకు ధరల ద్రవ్యోల్బణం 14న వస్తుంది. ఆహార ధరల మంటతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి ఎగబాకగా.. టోకు ద్రవ్యోల్బణం 11 నెలల గరిష్ట స్థాయి అయిన 2.13 శాతానికి చేరింది. రానున్న కాలంలో ఆర్బీఐ పాలసీ నిర్ణయంలో ద్రవ్యోల్బణం గణాంకాలు కీలక పాత్ర పోషించనున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఈ డేటాపై మరింత ఫోకస్ చేయనున్నారు.ఫలితాలపై దృష్టి... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025–26, క్యూ4) ఫలితాల సీజన్ను గతవారంలో టీసీఎస్ బోణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల ఫలితాలు వెలువడనున్నాయి. క్యూ4తో పాటు విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా మార్కెట్కు దిక్సూచిగా నిలుస్తాయని మిశ్రా పేర్కొన్నారు.సాంకేతికంగా చూస్తే... ఇరాన్–అమెరికా చర్చలు విఫలం కావడంతో మార్కెట్ గ్యాప్డౌన్తో మొదలైతే 23,700 వద్ద తొలి మద్దతు లభించచ్చని.. ఆ స్థాయిని కోల్పోతే 23,500 మద్దతు కీలకమని మార్కెట్నిపుణులు చెబుతున్నారు. ఇక సూచీ గనుక పెరిగితే 24,100 వద్ద తొలి నిరోధం, ఆపై 24,300 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉందనేది వారి విశ్లేషణ.గత వారమిలా...ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పుంజుకోవడం, రూపాయి బలోపేతం, క్రూడ్ ధరలు శాంతించడం వంటి పరిణామాలతో దేశీ మార్కెట్లు కూడా భారీగా కోలుకున్నాయి. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4,231 పాయింట్లు (5.77%) దూసుకెళ్లగా.. ఎస్ఎస్ఈ నిఫ్టీ 1,338 పాయింట్లు (5.88%) ఎగబాకింది.విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల బాట... దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల తొలి 10 రోజుల్లో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.48,213 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం దీనికి నిదర్శనం. ఫిబ్రవరిలో రూ.22,615 కోట్ల నికర పెట్టుబడుల అనంతరం, మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.17 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్పీఐలు అమ్మేసిన సంగతి తెలిసిందే. దీంతో 2026లో ఇప్పటిదాకా మొత్తం రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను వారు ఉపసంహరించుకున్నారు.పశ్చిమాసియా సంక్షోభం తర్వాత మార్కెట్ భారీ పతనానికి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలే కీలకంగా నిలిచాయి. ‘పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ధరలు భగ్గుమనడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం రిస్కులు తీవ్రమయ్యాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు స్థూల ఆర్థిక ప్రతికూలతలు ఎఫ్పీఐల భారీ అమ్మకాలకు పురిగొల్పుతున్నాయి’ అని మార్నింగ్ స్టార్ రీసెర్చ్ ఇండియాకు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు.
కార్పొరేట్
TCSలో కలకలం.. రంగంలోకి పోలీసులు
టీసీఎస్లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?
వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్
దివాలా తీసిన జేఏఎల్ కొనుగోలు.. అదానీకే ‘జై’!
మన ఆయిల్, గ్యాస్.. ఎంత ఖర్చయినా తెచ్చుకుందాం
క్విక్–కామర్స్లో భారత్ హవా!
''ఒరాకిల్ ఉద్యోగం పోయింది.. మేకలు పెంచాలనుకుంటున్నా''
తొలగించిన కంపెనీ.. మళ్లీ పిలిచింది: చివరికి అవమానమే!
IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు!
ఓపెన్ ఏఐ నిపుణులను తన్నుకుపోయిన మెటా!
బంగారం ధరల్లో భారీ మార్పు: అంతలోనే ఇంతలా..
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వారాం...
బంగారం ఈరోజు కొంటే.. ఇదే రేటు!
దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాటపట్టాయి. వరుసగా రెం...
బంగారం ధరల్లో మార్పు.. అమాంతం తగ్గిన రేటు!
శుక్రవారం ఉదయం.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగి...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
వజ్రాల మెరుపు వెనుక అసలు కథ
వజ్రాల వ్యాపారులు, వినియోగదారులు నిన్న(ఏప్రిల్ 8, ...
40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ?
ప్రపంచ ఇంధన మార్కెట్లో పెను మార్పులు సంభవిస్తున్న...
యుద్ధ విరమణతో భారత్కు దక్కేదేమిటి?
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలి...
సహజ వాయువు కోటా 95 శాతానికి పెంపు
దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచే ఎరువుల ప...
ఆటోమొబైల్
టెక్నాలజీ
టెక్ స్టార్టప్ల్లోకి పెట్టుబడులు తగ్గాయ్..
న్యూఢిల్లీ: దేశీ టెక్నాలజీ అంకుర సంస్థల నిధుల సమీకరణ గత ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 14.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 18 శాతం క్షీణించింది. అయితే, 2023–24లో సమీకరించిన 9.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే పెరిగింది. మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ’ట్రాక్షన్’ ఇండియా టెక్ వార్షిక ఫండింగ్ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా నిధులను దక్కించుకున్న స్టార్టప్లపరంగా అంతర్జాతీయంగా అమెరికా, బ్రిటన్, చైనా తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిల్చింది. జర్మనీ, ఫ్రాన్స్కన్నా ముందుంది. తాజా గణాంకాల ప్రకారం సీడ్ స్థాయి స్టార్టప్లలో పెట్టుబడులు 1.5 బిలియన్ డాలర్ల నుంచి 15 శాతం క్షీణించి 1.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. వ్యాపారాలను విస్తరించే ప్రణాళికల్లో ఉన్న ఎర్లీ స్టేజ్ అంకురాల్లోకి ఫండింగ్ 3.6 బిలియన్ డాలర్ల నుంచి 33 శాతం ఎగిసి 4.8 డాలర్లకు పెరిగింది. లేట్ స్టేజ్ స్టార్టప్లకు నిధులు 9.2 బిలియన్ డాలర్ల నుంచి 38 శాతం క్షీణించి 5.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. నివేదికలో మరిన్ని వివరాలు.. 2025–26లో 100 మిలియన్ డాలర్ల పైబడిన ఫండింగ్ లావాదేవీలు 13 నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 23గా, 2023–24లో 13గా నమోదయ్యాయి. నిధులను ఆకర్షించడంలో ఫిన్టెక్, రిటైల్ టాప్ రంగాలుగా నిల్చాయి. ప్రధానంగా ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఫిన్టెక్ కంపెనీలకు భారీ స్థాయిలో నిధులను లభించాయి. నెక్స్ట్రాలోకి 710 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు, నెయిసాలోకి 600 మిలియన్ డాలర్లు, ఐనాక్స్ క్లీన్ ఎనర్జీలోకి 344 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లోకి దాదాపు అంతక్రితం ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే 3.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఫిన్టెక్ సంస్థలు 14 శాతం అధికంగా 2.4 బిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. రిటైల్ స్టార్టప్లలోకి పెట్టుబడులు 32 శాతం క్షీణించి 3.5 బిలియన్ డాలర్ల నుంచి 2.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఐపీవోలపరంగా టెక్ సంస్థల ఇష్యూలు 52 శాతం పెరిగి 47కి చేరాయి. లెన్స్కార్ట్, గ్రో, మీషోలాంటి బడా ఐపీవోలు వీటిలో ఉన్నాయి. 2024–25లో 4 అంకురాలు యూనికార్న్ హోదా (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్) దక్కించుకోగా, 2025–26లో ఇది 50 శాతం పెరిగి 6 స్టార్టప్లకు చేరింది.
స్టార్లింక్కు భద్రతా అడ్డంకులు క్లియర్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని శాటిలైట్ బ్రాడ్బాండ్ కంపెనీ స్టార్లింక్ భారత్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత భద్రతా సంస్థలు విధించిన అన్ని నిబంధనలను స్టార్లింక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్రమంలో వచ్చే వారమే డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) సమావేశమై ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.కీలక భద్రతా అనుమతులు పూర్తిభారత టెలికాం నిబంధనల ప్రకారం కఠినమైన భద్రతా పరీక్షలను స్టార్లింక్ ఎదుర్కొంది. ముఖ్యంగా అక్టోబర్ 2025లో ముంబైలో ప్రారంభించిన ఎక్విప్మెంట్ టెస్టింగ్ (పరికరాల పరీక్ష) ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. శాటిలైట్ కమ్యూనికేషన్ల ద్వారా దేశ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ లభించిందని కంపెనీ తెలిపింది. వచ్చే వారం డీసీసీ ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుంది. అక్కడ క్లియరెన్స్ రాగానే భారత్లో స్టార్లింక్ సేవలు అధికారికంగా ప్రారంభమవుతాయి.వేగవంతమైన పరిణామాలుఏప్రిల్ 1న స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్, వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయిన తర్వాత ఈ ప్రక్రియ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ చర్చల ఫలితంగానే పెండింగ్లో ఉన్న సాంకేతిక, భద్రతాపరమైన అంశాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.టెలికాం దిగ్గజాల మధ్య పోటీస్టార్లింక్ రాకతో భారత శాటిలైట్ బ్రాడ్బాండ్ రంగంలో పోటీ తీవ్రతరం కానుంది. ఇప్పటికే ఈ రంగంలో పాగా వేయాలని చూస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన జియో స్పేస్ఫైబర్, సునీల్ భారతీ మిట్టల్ మద్దతు ఉన్న యూటెల్శాట్ వన్వెబ్ సంస్థలకు స్టార్లింక్ గట్టి పోటీ ఇవ్వనుంది. మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ డేటాను అందించడంలో ఈ పోటీ సామాన్యులకు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.స్పెక్ట్రమ్ ధరపై ఇంకా సందిగ్ధతభద్రతా పరమైన అనుమతులు లభించినప్పటికీ స్పెక్ట్రమ్ ధరల విషయంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఏడాదికి 4 శాతం స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీని ట్రాయ్ సిఫార్సు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మాత్రం 5 శాతం ఛార్జీ వసూలు చేయాలని మొగ్గు చూపుతోంది. అంతేకాకుండా, వినియోగదారుల టెర్మినల్స్పై సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. తద్వారా పూర్తిగా మార్కెట్ ఆధారిత ధరలే అమలయ్యే అవకాశం ఉంది.వ్యూహాత్మక భాగస్వామ్యాలుసేవలు ప్రారంభించక ముందే స్టార్లింక్ తన నెట్వర్క్ పంపిణీ కోసం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలతో పంపిణీ ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. ఎయిర్టెల్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవల విస్తరణపై దృష్టి పెట్టగా, జియో తన నెట్వర్క్లో శాటిలైట్ బ్రాడ్బాండ్ను అంతర్భాగం చేయనుంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా కూడా ఏఎస్టీ స్పేస్మొబైల్తో జతకట్టి ఈ పోటీలో నిలిచేందుకు సిద్ధమైంది.ఇదీ చదవండి: రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!
రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!
భారత వాయుసేన(ఐఏఎఫ్)లో సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో కొనుగోలు చేయనున్న 114 రఫేల్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ) ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిబంధనను చేర్చబోతోంది. ఈ యుద్ధ విమానాల్లో భారతీయ క్షిపణులు, ఆయుధ వ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు వీలుగా ‘ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్’ (ఐసీడీ)ను ఒప్పందంలో అంతర్భాగం చేయాలని భారత్ నిర్ణయించుకుంది.ఏమిటీ ఐసీడీ? దీని ప్రాముఖ్యత ఏంటి?సాధారణంగా ఏ దేశమైనా ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పుడు ఆ విమానాల తయారీ సంస్థలు తమ సొంత క్షిపణులను మాత్రమే వాడుకునేలా సాఫ్ట్వేర్ కట్టడి చేస్తాయి. అయితే, రాబోయే 114 రాఫెల్ విమానాల విషయంలో భారత్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. తుది ఒప్పందంలో ఐసీడీలో మార్పులు చేయడంతో భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణులు రఫేల్ వ్యవస్థతో అనుసంధానం కావడానికి మార్గం సుగమం అవుతుంది.దీనివల్ల భవిష్యత్తులో మనం ఫ్రాన్స్ నుంచి ఖరీదైన క్షిపణులను కొనాల్సిన అవసరం లేకుండా దేశీయ టెక్నాలజీతో గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను, ఇతర స్వదేశీ బాంబులను ఈ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు.మేక్ ఇన్ ఇండియాకు ఊతంఫిబ్రవరి 12న డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఈ భారీ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. వచ్చే నెలలో డసో ఏవియేషన్ సంస్థకు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ (ఆర్ఎఫ్పీ) జారీ కానుంది. మొత్తం 114 విమానాలలో 18 విమానాలు నేరుగా ఫ్రాన్స్ నుంచి సిద్ధంగా వస్తాయి. మిగిలిన 96 విమానాలు 25 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లోనే తయారవుతాయి. ఇది దేశీయ రక్షణ రంగ తయారీలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.సోర్స్ కోడ్ వివాదంపై స్పష్టతసోర్స్ కోడ్ బదిలీ విషయంలో వస్తున్న అపోహలను రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కొట్టిపారేశారు. ఏవియానిక్స్, రాడార్, ఫ్లైట్ కంట్రోల్ వంటి కీలక విధులను నియంత్రించే సోర్స్ కోడ్ను పంచుకోకపోవడం అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక ప్రామాణిక పద్ధతి. భారత్కు అత్యంత సన్నిహిత దేశాలైన రష్యా (Su-30 MKI విషయంలో), అమెరికా కూడా తమ సోర్స్ కోడ్లను ఎవరికీ పంచుకోవు. అయినప్పటికీ, ఐసీడీ ద్వారా సాఫ్ట్వేర్ అనుసంధానత లభిస్తుంది కాబట్టి, సోర్స్ కోడ్ లేకపోయినా మన ఆయుధాలను వాడుకోవడానికి ఎటువంటి ఆటంకం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ?
టీసీఎస్ బోణీ బాగుంది! ఇక ఏప్రిల్ 1 నుంచే వేతనాల పెంపు
ఐటీ పరిశ్రమలో ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆకర్షణీయమైన ఫలితాలతో క్యూ4 సీజన్కి బోణీ కొట్టింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 12.22 శాతం వృద్ధితో రూ. 13,718 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఇది రూ. 10,657 కోట్లుగా ఉండగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ4లో రూ. 12,224 కోట్లుగా నమోదైంది.ఆదాయం రూ. 64,479 కోట్ల నుంచి సుమారు 10 శాతం వృద్ధితో రూ. 70,698 కోట్లకు ఎగిసింది. 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ లాభం 1.35 శాతం వృద్ధితో రూ. 48,553 కోట్ల నుంచి రూ. 49,210 కోట్లకు చేరింది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 2.67 లక్షల కోట్లుగా నమోదైంది. ఒక్కో షేరుకు రూ. 31 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. దీనితో పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 39,571 కోట్ల మేర డివిడెండ్ ఇచ్చినట్లవుతుంది.ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు..క్యూ4లో నిర్వహణ మార్జిన్ 24.2 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగింది. వార్షికంగా 2.3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండేలా క్యూ4లో ఏఐ ఆదాయాలు నమోదయ్యాయి. నాలుగో త్రైమాసికంలో 12 బిలియన్ డాలర్ల విలువ చేసే కొత్త డీల్స్ కుదిరాయి.కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఏఐ నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణిని గతేడాది తరహాలోనే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కంపెనీ కొనసాగించనుంది.ఉద్యోగులు పెరిగారు.. వరుసగా రెండు త్రైమాసికాల పాటు క్షీణించిన ఉద్యోగుల సంఖ్య క్యూ4లో మళ్లీ పెరిగింది. నికరంగా 2,356 మంది చేరడంతో మార్చి ఆఖరు నాటికి మొత్తం సంఖ్య 5,84,519కి చేరింది. ఉద్యోగాల కోత చేపట్టడం వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 23,460 మేర తగ్గింది.వేతనాల పెంపు ఏప్రిల్ 1 నుంచే..ఏప్రిల్ 1 నుంచి తిరిగి వేతనాల పెంపును అమలు చేసే విధానానికి మళ్లినట్లు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ తెలిపారు. గతేడాది ఇంక్రిమెంటు లభించని సీనియర్ సిబ్బంది ఈసారి అందుకోనున్నారు. టాప్ పర్ఫార్మర్లకు రెండంకెల స్థాయిలో పెంపు ఉంటుంది.టెక్నాలజీపై పెట్టుబడులకు ఆసక్తిసీక్వెన్షియల్గా వరుసగా మూడో క్వార్టర్లో వృద్ధిని సాధించాం. స్థూల ఆర్థిక పరిస్థితుల రీత్యా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, టెక్నాలజీపై కస్టమర్లు పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మాకు ఇది సానుకూలాంశంగా ఉంటుంది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈవో, ఎండీ
పర్సనల్ ఫైనాన్స్
ఊడిన ఉద్యోగికి ఎంత కష్టం!!
ప్రైవేటు రంగంలో పెరుగుతున్న లేఆఫ్స్ కేవలం ఉద్యోగ భద్రతనే కాకుండా, మధ్యతరగతి ఆర్థిక మూలాలను, ముఖ్యంగా ఈఎంఐ (EMI) చెల్లింపుల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈఎంఐలు అంటే సాధారణ వ్యావహారికంలో సులభ వాయిదాలుగా వ్యవహిరిస్తారు. కానీ ఉద్యోగం కోల్పోయిన వారికి ఇప్పుడవే భూతంగా భయపెడుతున్నాయి. ఈ పరిస్థితిపై తాజా నివేదికలు, విశ్లేషణలతో ప్రత్యేక కథనం..ఐటీ లేఆఫ్స్.. ఈఎంఐ సంక్షోభంగత దశాబ్ద కాలంగా భారత ఐటీ రంగం స్థిరమైన ఆదాయానికి, విలాసవంతమైన జీవనశైలికి చిరునామాగా నిలిచింది. అయితే, 2025-26 కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ కొలువులు ఊడుతున్నాయి. ఇది నేరుగా బ్యాంకింగ్, రుణ చెల్లింపుల రంగంపై ప్రభావం చూపుతోంది.పెరుగుతున్న గృహ రుణాల ఆందోళనఐటీ నిపుణులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాల్లో భారీ ధరలకు ఇళ్లను కొనుగోలు చేశారు. మెట్రో నగరాల్లో సగటు ఐటీ ఉద్యోగి హోమ్ లోన్ ఈఎంఐ రూ.80,000 నుండి రూ.1.2 లక్షల మధ్య ఉంటోంది. ఇటీవల ఒక సర్వే ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వారిలో 60% మందికి కేవలం 6 నుండి 8 నెలల వరకు మాత్రమే ఈఎంఐలు చెల్లించగల అత్యవసర నిధి (Emergency Fund) ఉంది. ఆ తర్వాత డిఫాల్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.భారమైన బకాయిలుఆర్బీఐ (RBI) తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (2026) ప్రకారం, భారతదేశ గృహ రుణాలు జీడీపీలో 41% దాటాయి. ఇందులో అధిక భాగం వినియోగ అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలే. ఐటీ నిపుణులు తమ జీవనశైలిని కొనసాగించేందుకు తీసుకున్న అన్సెక్యూర్డ్ లోన్స్ ఇప్పుడు భారంగా మారాయి. ఆదాయం ఆగిపోవడంతో, ఈ రుణాల రికవరీ బ్యాంకులకి సవాలుగా మారుతోంది.మారిన సిబిల్ నిబంధనలతో తక్షణ ప్రభావంఏప్రిల్ 2026 నుండి ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకులు ఇప్పుడు ప్రతి వారం రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్కు పంపాలి (గతంలో ఇది 15-30 రోజులకు ఒకసారి ఉండేది). దీంతో ఒక్క ఈఎంఐ మిస్ అయినా, కేవలం 7 రోజుల్లోనే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. దీనివల్ల ఉద్యోగం కోల్పోయిన వారు ఇతర రుణాల కోసం ప్రయత్నించడం లేదా రీఫైనాన్సింగ్ చేసుకోవడం కష్టతరమవుతోంది.తాజా నివేదికల ముఖ్యాంశాలు బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (NPA) చారిత్రాత్మక కనిష్టంలో (2.15%) ఉన్నప్పటికీ, పర్సనల్ లోన్ విభాగంలో ఒత్తిడి పెరుగుతోంది. గృహ రుణాలు జీడీపీలో 41% కి చేరాయి. ఇది ఆందోళనకర స్థాయి. ఐటీ హబ్లలో నివసించే వారిలో పొదుపు శాతం 15% తగ్గింది. ఐటీ ఉద్యోగుల నుండి రుణ కాలపరిమితి పెంచాలని కోరుతూ వచ్చే దరఖాస్తులు 25% పెరిగాయి.ఉద్యోగం కోల్పోతే ఏం చేయాలి?లేఆఫ్స్ జరిగినప్పుడు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా బ్యాంకులకు ముఖం చాటేయడం అతిపెద్ద తప్పు. రుణదాతలతో సంప్రదింపులు జరిపి మోరటోరియం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ కోరడం ఉత్తమ మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.అన్నిటా లేఆఫ్లు పెరుగుతున్న తరుణంలో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఉద్యోగులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. కనీసం 12 నెలల ఈఎంఐలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ నిధిని ముందే సిద్ధం చేసుకోవాలి. మొదట హోమ్ లోన్ వంటి సెక్యూర్డ్ లోన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఆస్తి జప్తు అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గినప్పుడు వెంటనే విలాసవంతమైన ఖర్చులను నిలిపివేయాలి.ఐటీ రంగంలో లేఆఫ్స్ అనేవి కేవలం ఒక రంగ సమస్య కాదు, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని, రుణ చెల్లింపుల చక్రాన్ని ప్రభావితం చేస్తోంది. క్రెడిట్ స్కోర్ పట్ల బ్యాంకులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఐటీ ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
ఆన్లైన్ పేమెంట్ అలర్ట్.. గంట తర్వాతే చెల్లింపులు!
డిజిటల్ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఆర్బీఐ కీలక చర్యలు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. డిజిటల్ లావాదేవీ రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే ఒక గంట తర్వాతే దాన్ని అమలు చేసే విధానం (ల్యాగ్) ఉండాలని ప్రతిపాదన తెచ్చింది.వద్దనుకుంటే గంటలోపు విజయవంతం కాకముందే దాన్ని రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సైబర్ నేరస్థులు డెబిట్ చేసుకునేట్టు అయితే ఆ లావాదేవీల సమాచారం కస్టమర్లకు ముందే తెలుస్తుంది. అలాగే, మ్యూల్ ఖాతాలకు చెక్ పెట్టేందుకు ఒక ఖాతాలోకి వచ్చే మొత్తం జమలపై పరిమితులను ప్రతిపాదించింది. మెరుగైన శ్రద్ధ లేని ఖాతాలకు వార్షిక క్రెడిట్లను సుమారు రూ .25 లక్షలకు పరిమితం చేయాలని సూచించింది.ఒకే క్లిక్తో అన్ని డిజిటల్ చెల్లింపులను నిలిపివేసే (కిల్ స్విచ్) విధానాన్ని పేర్కొంది. ఇక 70 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులను మోసపుచ్చి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఖాతా నుంచి మళ్లించకుండా, ఆయా లావాదేవీలకు విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా అదనపు ధ్రువీకరణను తీసుకువచ్చే ప్రతిపాదనను చేసింది. రూ .50,000 లకు మించిన లావాదేవీల విషయంలో వినియోగదారులకు నిధులను బదిలీ చేయడానికి ముందు నామినేటెడ్ వ్యక్తి నుండి అనుమతి అవసరం.
విదేశీ చెల్లింపులపై కస్టమర్లకు వెంటనే సమాచారం
ముంబై: విదేశాల నుంచి భారత్లోని ఖాతాలకు వచ్చే సీమాంతర చెల్లింపులపై (జమలు) ఖాతాదారులకు వెంటనే సమాచారం (నోటిఫికేషన్) ఇవ్వాలని బ్యాంక్లకు ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా తమ ప్రక్రియలను క్రమబద్దీకరించుకోవాలని సూచించింది. ఖాతాలో జమ అయిన వెంటనే కస్టమర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది.ఫారెక్స్ మార్కెట్ పనిచేయని వేళ్లలో వచ్చే చెల్లింపుల విషయాన్ని మరుసటి రోజు తెలియజేయాలని కోరింది. బ్యాంకులు తమ విదేశీ ఖాతాల లావాదేవీలను గరిష్టంగా ఒక గంటలోపే పరిశీలించి సరిచూడాలని ఆదేశించింది. ఫారీన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ పనివేళ్లలో వచ్చే చెల్లింపులను మాత్రం అదే రోజు జమ చేయాలని పేర్కొంది. ఇందుకు వీలుగా వ్యవస్థలను సరిచేసుకోవాలని సూచించింది.2025 అక్టోబర్ 29న జారీ చేసిన ముసాయిదా నిబంధనలపై భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ నిబంధనలను ఆర్బీఐ జారీ చేసింది. ఇవి ఆరు నెలల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం సీమాంతర చెల్లింపులకు సంబంధించి సమాచారం అందించిన వెంటనే, ఆ మొత్తాన్ని తక్షణమే సంబంధిత లబ్దిదారు ఖాతాలో జమ చేయనప్పటికీ, కస్టమర్లకు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్తో కూడిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.మంత్లీ ఇన్కమ్మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లుబ్యాంకు ఎఫ్డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..కాలపరిమితివడ్డీ రేటు (%)ఏడాది టైమ్ డిపాజిట్6.9రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.55 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి.


