Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Retail inflation rises to 3. 21 Percentage in February as food prices climb1
ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ: నిత్యావసర ధరలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్‌ ద్రవ్యోల్బణం) ఫిబ్రవరిలో 3.21 శాతానికి ఎగిసింది. ఈ ఏడాది జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.74 శాతంగా (సవరించిన) ఉండడం గమనార్హం. ఆర్‌బీఐ లకి్ష్యత స్థాయి (4 శాతం)కి దిగువనే ఉన్నప్పటికీ.. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన తాజా గణాంకాలు ధరల ఒత్తిళ్లను తెలియజేస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో ధరల ఒత్తిళ్లు ఇక ముందూ కొనసాగొచ్చని ఆర్థికవేత్తల అంచనా. 2024 బేస్‌ సంవత్సరంతో, కొత్త సీపీఐ సిరీస్‌ ఆధారంగా విడుదల చేసిన గణాంకాలు ఇవి. ఇంతకుముందు 2012 బేస్‌ సంవత్సరంగా ఉండేది. అలాగే, సీపీఐ పరిధిలో వస్తువులను 299 నుంచి 358కి పెంచారు. ఆహార విభాగం వెయిటేజీ లోగడ ఉన్న 45 శాతం నుంచి 40 శాతానికి దిగొచ్చింది. ⇒ ఆహార వస్తువుల ధరలు జనవరిలో ఉన్న 2.13 శాతం నుంచి ఫిబ్రవరిలో 3.47 శాతానికి పెరిగాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడంలో ఆహార విభాగం ధరలే ప్రధాన పాత్ర పోషించాయి. ⇒ ఫిబ్రవరిలో ధరలు అధికంగా పెరిగిన వాటిల్లో ప్రధానంగా వెండి, బంగారం, వజ్రాలు, ప్లాటినం ఆభరణాలు, కొబ్బరి, టమాటా, క్యాలీఫ్లవర్‌ ఉన్నాయి. ⇒ వెల్లుల్లి, ఉల్లి, ఆలు, కందిపప్పు, లిచీ పండ్ల విభాగంలో ప్రతికూల ద్రవ్యోల్బణం (ధరలు క్షీణించడం) కనిపించింది. ⇒ ఇళ్ల ధరల (నిర్వహణ, మరమ్మతులు) తాలూకూ ద్రవ్యోల్బణం సైతం 3.2 శాతం నుంచి 3.26 శాతానికి చేరింది. ⇒ ప్రాథమిక విద్య ద్రవ్యోల్బణం 3.59 శాతం, ప్రాథమికోన్నత విద్యకు సంబంధించి 4.09 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ⇒ వస్తు రవాణాకు సంబంధించి 7.49 శాతం, ప్రయాణికుల రవాణా సేవలకు సంబంధించి 1.75 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదైంది.చమురు ధరలతో ఇంకా పెరిగే ముప్పుపశ్చిమాసియా సంక్షోభంతో చమురు, గ్యాస్‌ ధరలు పెరిగిపోవడం తెలిసిందే. దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో.. ప్రతీ 10 శాతం పెరుగుదల కారణంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం 0.40–0.60 శాతం మేర అధికమవుతుందని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా.

IHCL Gateway brand reached 50 hotel milestone with signing of property in Hyderabad2
హైదరాబాద్‌లో ఐహెచ్‌సీఎల్‌ గేట్‌వే హోటల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ (ఐహెచ్‌సీఎల్‌) హైదరాబాద్‌లోని సోమాజిగూడలో గేట్‌వే బ్రాండ్‌ కింద హోటల్‌ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఎంట్రప్రెన్యూర్లయిన డి శివరామరాజు, డీవీఎస్‌ సోమరాజుతో జట్టు కట్టింది. దీని ప్రకారం ప్రస్తుతమున్న ప్రాపరీ్టని గేట్‌వే హోటల్‌గా మార్చనున్నారు.ఇందులో 225 గదులు, ఆల్‌–డే డైనింగ్‌ రెస్టారెంట్, స్పెషాలిటీ రెస్టారెంట్‌ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి. దీనితో కలిపి ఐహెచ్‌సీఎల్‌కి తెలంగాణలో మొత్తం 8 హోటళ్లు ఉంటాయి. వీటిలో మూడు అభివృద్ధి దశలో ఉన్నాయి. అలాగే, బ్రాండ్‌ కింద మొత్తం హోటళ్ల సంఖ్య 50కి చేరుతుందని గేట్‌వే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లియా టాటా తెలిపారు.

TVS has launched the new Orbiter V1 in India at a starting price of Rs 499993
టీవీఎస్‌.. ఆర్బిటర్‌ వీ1

చెన్నై: ఆటోమొబైల్‌ దిగ్గజం టీవీఎస్‌ మోటార్స్‌ తమ ఎలక్ట్రిక్‌ వాహనాల పోర్ట్‌ఫోలియోని విస్తరించింది. తాజాగా 1.8 కిలోవాట్‌అవర్‌ బ్యాటరీతో ఆర్బిటర్‌ వీ1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ఆవిష్కరించింది. దీనితో పాటు 3.1 కిలోవాట్‌అవర్‌ బ్యాటరీతో ఆర్బిట ర్‌ వీ2 వేరియంట్‌ కూడా లభిస్తుంది.బ్యాటరీ యాజ్‌ ఏ సరీ్వస్‌ (బీఏఏఎస్‌) విధానంలో ఆర్బిటర్‌ వీ1 ధర రూ. 49,999 (ఢిల్లీ ఎక్స్‌షోరూం). బీఏఏఎస్‌యేతర విధానంలో రేటు రూ. 84,500 (ఢిల్లీ ఎక్స్‌షోరూం). పూర్తి బ్యాటరీ ఖరీదును ముందస్తుగా చెల్లించాల్సిన లేకుండా, తక్కువ రేటుకే వాహనాన్ని సొంతం చేసుకునేందుకు బీఏఏఎస్‌ విధానం ఉపయోగపడుతుందని కంపెనీ ప్రెసిడెంట్‌ (ఇండియా 2డబ్ల్యూ బిజినెస్‌) గౌరవ్‌ గుప్తా తెలిపారు.

LPG Cylinder Price Today Check Latest Rates in India4
వార్ ఎఫెక్ట్: లేటెస్ట్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..

భారతదేశంలో వంట గ్యాస్ (LPG) ధరలు మళ్లీ పెరిగాయి. దీని ప్రభావం సాధారణ వినియోగదారులతో పాటు, హోటళ్లు & రెస్టారెంట్లు వ్యాపారుల మీద కూడా పడింది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంధన మార్కెట్‌లో ఏర్పడిన అస్థిర పరిస్థితుల అని తెలుస్తోంది.ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి.. ప్రపంచంలో ఇంధన రవాణాకు అత్యంత కీలకమైనది. ఈ ప్రాంతంలో ఏర్పడిన సమస్యల వల్ల నౌకాశ్రయ మార్గాలు ప్రభావితమై, ఇంధన సరఫరా ఆలస్యం అవుతోంది.నిజానికి ఇండియా ఎక్కువ మొత్తంలో ఎల్‌పీజీని.. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల పశ్చిమ ఆసియాలో జరిగే రాజకీయ లేదా యుద్ధ పరిస్థితులు భారత్‌లో ఎల్‌పీజీ ధరలపై నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరగడంతో, దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ (గృహ వినియోగం) ధర దేశవ్యాప్తంగా రూ.60 వరకు పెరిగింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా గణనీయంగా పెరిగింది.కొత్త ధరలుఢిల్లీడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 913కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1884.50ముంబైడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 912.50కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,836కోల్‌కతాడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 939.00కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,988.50చెన్నైడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 928.50కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,043.50హైదరాబాద్‌డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 965.00కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,105.50వినియోగదారులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గ్యాస్ సిలిండర్ ధరలు రాష్ట్రాల వారీగా ఉండే స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల కారణంగా కొంత మారే అవకాశం ఉంది. అయితే పెరుగుతున్న ధరలు వినియోదాగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధరలు ఇలా పెరిగితే ఎలా.. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందా? అని భయపడుతున్నారు0

Renault Sees India as Global Hub Plans 4 New Models Locally Developed5
2030 నాటికి రెనాల్ట్ టార్గెట్ ఇదే!

ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్ తన 2030 వృద్ధి వ్యూహంలో భాగంగా.. భారతదేశాన్ని ప్రధాన ప్రపంచ తయారీ & ఎగుమతి కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే EVలు, హైబ్రిడ్‌ల వాహనాలతో సహా స్థానికంగా అభివృద్ధి చేసిన నాలుగు కొత్త మోడళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది.రెనాల్ట్ 2025లో యూరప్ వెలుపల మార్కెట్లలో 6,20,000 వాహనాలను విక్రయించింది, ఇది మునుపటి సంవత్సరం కంటే 11 శాతం ఎక్కువ. ఇప్పుడు దాని ఐదు ప్రపంచ కేంద్రాలను (మొరాకో, టర్కియే, లాటిన్ అమెరికా, దక్షిణ కొరియా, భారతదేశం) మరింత విస్తరించడానికి కావలసిన పెట్టుబడులు పెడుతోంది.భారతదేశం నిస్సాన్ సహా పూర్తి శ్రేణి మోడళ్లను తయారు చేయడం ద్వారా.. స్థానిక & ప్రపంచ మార్కెట్లకు సేవలందించే కీలకమైన ఉత్పత్తి మరియు సరఫరా కేంద్రంగా మారుతుందని రెనాల్ట్ వెల్లడించింది. SUVలకు, ఈవీలకు పెరుగుతున్న బలమైన డిమాండ్ భారతదేశాన్ని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా చేయనుందని పేర్కొంది.2030 నాటికి భారతదేశంలో కంపెనీ ప్రతిపాదించిన నాలుగు కొత్త మోడళ్లు, పూర్తిగా ఎలక్ట్రిక్ & పూర్తి-హైబ్రిడ్ వాహనాలు సహా, భారతీయ వినియోగదారులకు మాత్రమే కాకుండా అనేక ఎగుమతి మార్కెట్లకు కూడా ఉపయోగపడతాయని రెనాల్ట్ కంపెనీ స్పష్టం చేసింది. కాగా కంపెనీ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది.

Netflix Opens Eyeline Studios in Hyderabad6
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్.. ఐలైన్ స్టూడియో ప్రారంభం

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే... మరోవైపు స్కిల్లింగ్, రీ – స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. గురువారం హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్ లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లో నగరం ఓ నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్స్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, ఇక్కడి యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు.పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులను కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.

Advertisement
Advertisement
Advertisement