Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

New Year New Rules Everything You Need to Know About the 2025 Tax Act1
నూతన సంవత్సరంలో కొత్త మార్పులతో ముందుకు..

కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు.. ఇంచుమించుగా కొత్త తెలుగు సంవత్సరమైన పరాభవ కూడా మొదలు.. కొత్త ఆదాయపు చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త నియమాలు.. కొత్త దేవుడొచ్చాడు. దేవుడు మారాడు కానీ మన బాధ్యతలు మారలేదు. కర్తవ్యం యథాతథం. పూజా యథాతథమే. సకాలంలో కర్తవ్యం పూర్తి చేస్తే అనుగ్రహం, శాంతి కలుగుతాయి. లేదంటే ఆగ్రహం, అశాంతి.ఆదాయ పన్ను చట్టం 2025లో సాంకేతికంగా చూస్తే సెక్షన్లు, చాప్టర్లు తగ్గాయి. అక్షరమాల పోయి, అంకెల మాల అయ్యింది. చాలా విషయాల్లో హేతుబద్ధీకరణ జరిగింది. మాటిమాటికీ బ్రాకెట్లు వాడేవారు. ఇప్పుడవి లేవు. క్లాజులు, సబ్‌క్లాజులు తగ్గాయి. వివరణలు తగ్గాయి. సులభంగా, అర్థమయ్యేలా ఉంది. కొత్త చట్టం, నియమాలు అమలయ్యే వేళ, మార్పుల గురించి తెలుసుకుందాం. ఇక నుంచి ఆర్థిక సంవత్సరాన్ని ఆదాయపు సంవత్సరం, పన్ను సంవత్సరం అంటారు. మొన్నటి వరకు రెండు పదాలు.. అంటే ఒకటి ఆదాయపు సంవత్సరం, రెండోది మదింపు సంవత్సరంగా ఉండేవి. ఇప్పుడు ఒకే పదం.. ఒకే సంవత్సరం. ప్రస్తుతం మనం 2026–27 పన్ను సంవత్సరంలో ఉన్నాం.జీతం రూపంలోని ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక్కొక్క అంశం దగ్గర ఒక్కొక్క నిర్వచనం. ‘జీతం’ అంటే ఏమిటనేది ఉండేది. ఇప్పుడు ఏ అంశమైనా ఒకే నిర్వచనం. దీని వల్ల ఎటువంటి తికమక ఉండదు. తప్పుడు లెక్కలకు ఆస్కారం లేదు.మనం ఫైల్‌ చేసిన ఐటీఆర్‌ తప్ప మిగతా అన్నింటి నంబర్లు మారిపోయాయి. దశాబ్దాల చరిత్ర గల ఫారం 16 మారిపోతోంది. కొత్త నంబరు 130. ఈ మార్పుకంటే అందులోని అంశాల్లో మార్పులు మరింత ముఖ్యమైనవి. ఇన్నాళ్లు, కేవలం ఆదాయం, పన్ను భారం, టీడీఎస్‌ వివరాలకే పరిమితం అయింది. ఇప్పుడు ఫోకస్‌ మారింది. కొత్త చట్టంలోని నియమాల ప్రకారం ‘పన్ను సంవత్సరం’ అని ప్రస్తావిస్తారు. ఉద్యోగి వివరాలను అటు యజమాని తెలియజేస్తారు. పన్ను భారమే కాకుండా ఏ రేటు ప్రకారం ఎంతెంత అనేది చెప్పాలి. అంతే కాకుండా ఈ సమాచారం టీడీఎస్‌ రిపోర్టింగ్లోని అంశాలకు సరిపోలి ఉండాలి. అప్డేటెడ్‌ సిస్టంతో ఇంటిగ్రేట్‌ చేస్తున్నారు. ఫారం 130లోని అంశాలు యజమాని బాధ్యత అయినప్పటికీ, మీరు 130లోని ప్రతి అంశాన్ని చెక్‌ చేసుకోండి.అలాగే 26ఏఎస్‌/ఏఐఎస్‌కి స్వస్తి పలికారు. కొత్త నంబరు 168. పేరులో చిన్న మార్పు..నంబరులో మార్పు. 26ఏఎస్‌ కేవలం టీడీఎస్, టీసీఎస్, ట్యాక్స్‌ చెల్లింపుల వరకే పరిమితం. కానీ 168లో ఫోకస్‌ అంతా విశ్వమయం. అన్ని ఆర్థిక వ్యవహారాల సమాచారం, ట్రాకింగ్‌ ఉంటుంది. ట్యాక్స్‌ పద్దులకే 26ఏఎస్‌ పరిమితం కాగా, ఫారం 168లో పన్ను పద్దులతో పాటు షేర్లు, డిపాజిట్లు, ఇన్వెస్ట్‌మెంట్స్, ఖర్చులు మొదలైనవి కూడా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సినదేమిటంటే ఫారం 130 అనేది యజమాని బాధ్యత. ఫారం 168 డిపార్టుమెంటు వారి బాధ్యత. కానీ ఈ రెండింటి వల్ల ప్రభావితం అయ్యేది మీరు. మీ ప్రమేయం లేకపోయినా ఇవి మిమ్మల్ని శాసిస్తాయి. జాగ్రత్తగా పరిశీలించండి.మరో ఫారం 16ఏ కాస్తా ఫారం 131గా అవతారం ఎత్తుతోంది. జీతం కాని ఆదాయాలన్నింటి మీద టీడీఎస్‌లు ఇందులో ఉంటాయి. ఫారం 131 కూడా కొత్త చట్టానికి, కొత్త రూల్స్‌కి అనుసంధానంగా ఉంటుంది. మీరు చెక్‌ చేసుకోండి.ఉద్యోగస్తులకు శుభవార్త. విద్య అలవెన్స్, హాస్టల్‌ అలవెన్స్, గిఫ్ట్‌ ఓచర్‌ లిమిట్, భోజన కూపన్‌ అలవెన్స్‌ మొదలైన వాటి మీద పరిమితిని గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో సమంజసంగా, సమయోచితంగా ఆచరణాత్మకమైన విధంగా ఈ పరిమితులు పెంచారు.ఇక హెచ్‌ఆర్‌ఏ విషయంలో గతంలో 50 శాతం పరిమితిని కేవలం నాలుగు ప్రధాన నగరాలకే పరిమితం చేసేవారు. ఇప్పుడు మరికొన్ని నగరాలకు విస్తరింపచేశారు. అందులో హైదరాబాద్‌ ఉంది.పాన్‌ నంబరుని కంపల్సరీగా తెలియజేసే పరిమితులను పెంచారు. ఇన్‌కం ట్యాక్స్‌తో సంబంధం లేకపోయినా, రిజర్వ్‌ బ్యాంకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్‌లైన్‌ చెల్లింపుల విషయంలో కూడా మార్పులు వచ్చాయి. వివరాలు రాబోయే రోజుల్లో మరింతగా తెలుసుకుందాం.

Warren Buffett Rift With Bill Gates Epstein Scandal Over Gates Foundation2
గేట్స్ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ విరాళాల నిలిపివేత?

దాతృత్వానికి చిరునామాగా నిలిచే ప్రపంచ కుబేరుల మధ్య దశాబ్దాల స్నేహం ఇప్పుడు సంక్షోభంలో పడింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ మధ్య ఉన్న అనుబంధం జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వివాదంతో బీటలు వారుతోంది. ఈ క్రమంలోనే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు తాను ఇస్తున్న భారీ విరాళాలను బఫెట్ నిలిపివేసే అవకాశం ఉందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.ఎప్‌స్టీన్‌ వ్యవహారంపై బఫెట్ మౌనం?ఇటీవల ఓ మీడియా కార్యక్రమంలో బఫెట్ మాట్లాడుతూ.. ఈ వివాదం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తాను బిల్ గేట్స్‌తో మాట్లాడలేదని కుండబద్దలు కొట్టారు. వారిద్దరూ కలిసి గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూనే ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కొనసాగించడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ వివాదంలో భాగంగా దశాబ్దాల నాటి ఫౌండేషన్ కార్యకలాపాలపై విచారణ ఎదుర్కోవాల్సి రావడం, విరాళాలకు సంబంధించి ప్రమాణం చేసి సాక్ష్యాలు చెప్పాల్సిన పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని బఫెట్ స్పష్టం చేశారు. ఫౌండేషన్‌లో తన పాత్ర కేవలం నిధులు సమకూర్చడానికే పరిమితమని ఆయన గుర్తు చేశారు.విరాళాల కొనసాగింపుపై సందిగ్ధతగేట్స్ ఫౌండేషన్‌కు ఆర్థిక సహాయం కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు బఫెట్ నేరుగా సమాధానం చెప్పలేదు. ‘వేచి చూద్దాం ఏం జరుగుతుందో’ అని వ్యాఖ్యానిస్తూ ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేశారు. తాజా పరిణామాల ద్వారా తనకు తెలియని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అంగీకరించడం గమనార్హం. అయితే, ఎప్‌స్టీన్‌ ఆరోపణల్లో బిల్‌గేట్స్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని తాను నమ్మడం లేదని బఫెట్ పేర్కొన్నారు.యాపిల్ వాటాల తగ్గింపుపై వ్యాఖ్యలుఇదే ఇంటర్వ్యూలో బఫెట్ తమ సంస్థ బెర్క్‌షైర్ హాత్వేకి సంబంధించిన కీలక వ్యాపార నిర్ణయాలను పంచుకున్నారు. యాపిల్ ఇంక్‌లో తమకున్న భారీ వాటాను ఇప్పటికే తగ్గించామని బఫెట్ అంగీకరించారు. డిసెంబర్ నాటికి ఈ హోల్డింగ్స్ గరిష్ట స్థాయిల నుంచి 75 శాతం మేర తగ్గడం విశేషం. బెర్క్‌షైర్ హాత్వే సీఈవో పదవి నుంచి తప్పుకున్నప్పటికీ బఫెట్ ఇంకా చైర్మన్‌గా చురుగ్గా పని చేస్తున్నారు. రోజువారీ పెట్టుబడి నిర్ణయాల్లో పాల్గొంటున్నప్పటికీ తుది నిర్ణయాలను మాత్రం కొత్త సీఈఓ గ్రెగ్ అబెల్ తీసుకుంటారని వెల్లడించారు.ఇదీ చదవండి: ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు!

Bank holidays this week SBI, HDFC and others closed on these days3
ఈ వారం బ్యాంకులకు వెళ్లొచ్చా?

సామాన్యుడి దైనందిన జీవితంలో బ్యాంకింగ్ సేవలు అంతర్భాగమయ్యాయి. నగదు విత్‌డ్రాయల్స్ నుంచి లోన్ అప్లికేషన్ల వరకు ఏదో ఒక పనిపై మనం బ్యాంకులను సందర్శిస్తుంటాం. అయితే, బ్యాంకుకు వెళ్లే ముందు ఆ రోజు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 12 మధ్య బ్యాంకుల పనిదినాల వివరాలు ఇలా ఉన్నాయి..ఈ వారం ప్రత్యేక సెలవులు లేవుఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఈ వారంలో (ఏప్రిల్ 6 - ఏప్రిల్ 12) దేశవ్యాప్తంగా ఎలాంటి జాతీయ లేదా ప్రాంతీయ పండుగ సెలవులు లేవు. బ్యాంకులు తమ సాధారణ పనివేళల్లోనే సేవలందిస్తాయి. అయితే, వారాంతపు సెలవుల కారణంగా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని గమనించాలి. ఏప్రిల్ 11న రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. సాధారణంగా బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.ఆన్‌లైన్ సేవలు అందుబాటులో..బ్యాంకులకు భౌతికంగా సెలవు ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) సేవలతోపాటు నెట్ బ్యాంకింగ్/మొబైల్ యాప్స్ ద్వారా నగదు బదిలీ (NEFT, RTGS, IMPS) చేసుకోవచ్చు. ఇక ఏటీఎం (ATM) కేంద్రాలు 24 గంటలూ తెరిచి ఉంటాయి.

Gold and Silver rates on 6th April 2026 in Telugu States4
బంగారంపై తీపి కబురు.. రెండు రోజులే గ్యాప్‌..

దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. వరుసగా రెండో రోజులు స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నాలుగు రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

West Asia Conflict Flights Why Indian Tourists Must Rethink Travel Insurance5
ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. మార్చి నెలలో ఏకంగా 5,500కు పైగా విమానాలు రద్దు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏప్రిల్‌ నెల అంటే భారతీయులకు సెలవుల కాలం. పిల్లలకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో చాలామంది విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం 2025లోనే సుమారు 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్లారు. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ప్రయాణం చేసేవారు కేవలం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోతుందని భావిస్తే పొరపాటే. యుద్ధ సమయంలో ఇన్సూరెన్స్‌ కంపెనీల నిబంధనలు పూర్తిగా మారిపోతాయి.సాధారణ సమయాల్లో ఇన్సూరెన్స్‌ కవరేజీ ఇలా..సాధారణంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రధానంగా ఐదు అంశాలను కవర్ చేస్తుంది.సామాను కోల్పోవడం: 300 డాలర్ల నుంచి 1,000 డాలర్ల వరకు కవరేజీ.పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం: 200 నుంచి 300 డాలర్ల వరకు.వైద్య ఖర్చులు: 2,50,000 నుంచి 5,00,000 డాలర్లు వరకు (కనీసం 24 గంటల హాస్పిటలైజేషన్ అవసరం).ప్రమాదాలు: 20,000 నుంచి 30,000 డాలర్ల వరకు.ట్రిప్ క్యాన్సిలేషన్: అనారోగ్యం, వాతావరణం లేదా సాంకేతిక కారణాల వల్ల విమానం రద్దయితే సుమారు 1,000 డాలర్ల వరకు కవరేజీ ఉంటుంది.యుద్ధం వస్తే.. మీ పాలసీ పనిచేయదు!ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఒకవేళ మీ విమానం రద్దు కావడానికి లేదా మీకు గాయాలు కావడానికి యుద్ధం ప్రత్యక్ష కారణమైతే (ఉదాహరణకు: ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు, రన్‌వేల మూసివేత, బాంబు దాడులు) ఇన్సూరెన్స్ కంపెనీలు పైసా కూడా చెల్లించవు. మెజారిటీ ఇన్సూరెన్స్ పాలసీల్లో ‘వార్ ఎక్స్‌క్లూజన్’ క్లాజ్ ఉంటుంది.వైద్య సాయం: యుద్ధం వల్ల కలిగే గాయాలకు (పేలుళ్ల వల్ల వచ్చే శిథిలాలు తగలడం వంటివి) ఇన్సూరెన్స్ వర్తించదు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాల సాయం లేదా సొంత ఖర్చులపైనే ఆధారపడాలి.హోటల్ ఖర్చులు: విమానాలు రద్దయి యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకుపోతే హోటల్ ఖర్చులను ప్రయాణికులే భరించాలి లేదా ఎయిర్‌లైన్స్ ఇచ్చే వెసులుబాటును వాడుకోవాలి.సురక్షితంగా ప్రయాణించడం ఎలా?ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియా మీదుగా కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణించడం ఉత్తమం. ప్రస్తుతం క్షేమంగా ఉన్న మార్గాలు.. జపాన్, చైనా, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఆస్ట్రేలియా. అమెరికా పశ్చిమ తీరానికి వెళ్లేవారు హాంకాంగ్ మీదుగా వెళ్లడం సురక్షితం. అలాగే యూరప్‌ వెళ్లే కొన్ని విమానాలు పశ్చిమాసియాను తప్పించుకుంటూ మ్యూనిచ్ వంటి నగరాల మీదుగా నడుస్తున్నాయి.ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉండొచ్చు?టాటా ఏఐజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, డిజిట్ వంటి కంపెనీలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. షెంజెన్ దేశాలకు వెళ్లే నలుగురు సభ్యులున్న కుటుంబానికి (ఇద్దరు పిల్లలతో కలిపి) రూ.6,500 నుంచి రూ.10,000 వరకు వసూలు చేస్తున్నాయి. అమెరికా ట్రిప్ కోసం రూ.10,000 నుంచి రూ.24,000 వరకు ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే, విదేశీ ప్రయాణానికి వెళ్లేముందు మీ పాలసీలోని నిబంధనలు, మినహాయింపులు, షరతులు క్షుణ్ణంగా చదవాలి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎయిర్‌లైన్స్ ఇచ్చే రీఫండ్, రీషెడ్యూల్ ఆప్షన్లపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా?

Stock market updates on 06 April 20266
ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 22,707 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 89 పాయింట్లు దిగజారి 73,226 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.15బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 109.84 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.11 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.18 శాతం పుంజుకుంది.Today Nifty position 06-04-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement