Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Robot Loses Control During Sports Day Event In China1
అదుపుతప్పిన రోబో.. భయపడ్డ విద్యార్థులు (వీడియో)

చైనాలోని జిన్‌జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్‌లోని ఒక పాఠశాలలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక రోబో అదుపుతప్పి.. విద్యార్థులను భయబ్రాంతులకు గురించి చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విద్యార్థులను అలరించడానికి ఏర్పాటు చేసిన రోబో అకస్మాత్తుగా కిందపడిపోయింది. ఆ తరువాత అక్కడున్న ప్రదర్శనకారులపై కుంగ్-ఫూ కిక్‌లు విసరడం ప్రారంభించింది. దిక్కుతోచని విధంగా.. అడ్డదిడ్డంగా పరుగులు పెట్టింది. మైదానంలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు.పరిస్థితిని అర్థం చేసుకుని, దానిని కంట్రోల్ చేసే వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రోబోట్‌ను పట్టుకున్నాడు. ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే మైదానంలోని విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.ఇదే మొదటిసారి కాదురోబోలు తడబడటం ఇదే మొదటిసారి కాదు. 2026 మార్చి నెలలో.. చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన.. సిబ్బంది ఆ రోబోను పక్కకు లాగడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ.. అది రింగ్ మధ్యలో తన ప్రోగ్రామ్ ప్రదర్శించింది.Reported on Telegram 🤣The robot went berserk and almost attacked the dancers at a festival in China: the Unitree android malfunctioned severely and started swinging its "iron" in the style of Bruce LeeFortunately, it was quickly shut down — a full-blown "fight" didn't… pic.twitter.com/FH38FFrjZV— Beefeater (@Beefeater_Fella) May 3, 2026రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని 2025 నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్‌లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.కంపెనీలకు సూచనలురోబర్స్ తయారీ లేదా వినియోగం అనేది మంచి చర్య. అయితే వాటికి భావాలు అర్థం చేసుకోవడం, ప్రవర్తించిన విధానం పూర్తిగా తెలిసి ఉండదు. ఇలాంటి సమయంలో రోబోల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి వస్తుంది. కాబట్టి సంస్థలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోబోట్స్ తయారు చేయాలి. అంతే కాకుండా..పూర్తిగా టెస్ట్ చేసిన తరువాత వినియోగానికి ఉపయోగించడం మంచిది. లేకుంటే.. ప్రజలకు ఇబ్బంది, తద్వారా కంపెనీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Good News for Gold Buyers as Prices Fall in Hyderabad, Delhi, and Chennai2
బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం!

పసిడి ప్రియులకు శుభవార్త, ఎందుకంటే గోల్డ్ రేటు గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూనే ఉంది. ఈ రోజు (మంగళవారం) కూడా పసిడి ధరలు ఇదే బాటలో అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock Market Update May 5th 20263
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు!

మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 243.41 పాయింట్ల నష్టంతో 77,025.99 వద్ద, నిఫ్టీ 90.10 పాయింట్ల నష్టంతో 24,029.20 వద్ద ముందుకు సాగుతున్నాయి.ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్, డైనాకాన్స్ సిస్టమ్స్ & సొల్యూషన్స్ లిమిటెడ్, ఎంఎంపీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్ లిమిటెడ్, కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అవ్రో ఇండియా లిమిటెడ్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్‌ప్లోరేషన్ లిమిటెడ్, నాథ్ బయో-జీన్స్ (ఇండియా) లిమిటెడ్, డి నోరా ఇండియా లిమిటెడ్, జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల్లో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Tata Curvv EV Series X Launch4
టాటా కర్వ్‌ ఈవీ కొత్త మోడల్ లాంచ్

టాటా మోటార్స్‌ తన ఎలక్ట్రిక్‌ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ, తన కర్వ్‌ ఈవీలో సరికొత్తగా ‘సిరీస్‌ ఎక్స్‌’ శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్‌ ప్రారంభ ధరను రూ.16.99 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్‌ వద్ద) కంపెనీ నిర్ణయించింది.ఈ సిరీస్‌లో అకంప్లిష్డ్‌ ఎక్స్‌ 55, ఎంపవర్డ్‌ ఎక్స్‌ 55 అనే రెండు వేరియంట్లను పరిచయం చేసింది. వీటిలోని 55 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఏకంగా 502 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. రియల్‌ వరల్డ్‌ కండిషన్స్‌ లో ఈ బ్యాటరీ సుమారు 400 కిలోమీటర్ల వరకు రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.లెవెల్‌-2 ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరా, పానోరామిక్‌ సన్‌రూఫ్, హర్మాన్‌ సినిమాటిక్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు బ్యాటరీపై 15 ఏళ్ల (లైఫ్‌–టైమ్‌) హెచ్‌వీ బ్యాటరీ వారంటీని టాటా మోటార్స్‌ అందిస్తోంది.మిడ్‌-ఎస్‌యూవీ విభాగంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘సిరీస్‌ ఎక్స్‌’ శ్రేణి విడుదల చేసినట్లు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సీసీఓ వివేక్‌ శ్రీవత్స తెలిపారు. ఈ కారు ఐదు ఆకర్షణీయమైన రంగులతో పాటు ఐకానిక్‌ ‘డార్క్‌’ ఎడిషన్‌లోనూ లభించనుంది.

Middle East War Back On Global Markets Feel the Heat5
మళ్లీ మొదలైన యుద్ధం: గ్లోబల్ మార్కెట్‌పై ఎఫెక్ట్!

గత కొన్నిరోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. శాంతి చర్చల తరువాత యుద్దానికి బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు మళ్లీ వార్ మొదలైంది. ఈ యుద్ధం మళ్లీ మొదలవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత క్షిణించే అవకాశం ఉంది. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై కూడా పడింది.యుద్ధం మొదలైతే.. దీని ఎఫెక్ట్ వెంటనే స్టాక్ మార్కెట్ల మీద చూపిస్తుంది. పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పూనుకోరు. అంతే కాకుండా.. తమ పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకోవడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఏవియేషన్, కన్స్యూమర్ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ సమయంలో ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే ఇన్వెస్టర్లు, సురక్షితమైన ఆస్తులవైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో గోల్డ్ రేటు పెరుగుతుంది. అలాగే యూఎస్ డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడటం వల్ల.. ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడతాయి.ఇది కరెన్సీ మార్కెట్లలో కూడా మార్పులకు దారితీస్తుంది. ఉదాహరణకు ఇండియన్ రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దీనివల్ల మళ్లీ ద్రవ్యోల్బణం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఒక ప్రభావం మరో ప్రభావాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తీసుకొస్తుంది.మరో ముఖ్యమైన అంశం ట్రేడ్ అండ్ రవాణా. పశ్చిమాసియాలో ఉన్న సముద్ర మార్గాలు, ముఖ్యంగా హర్ముజ్‌ వంటి ప్రాంతాలు యుద్ధం వల్ల ప్రమాదంలో పడతాయి. ఈ మార్గాలు ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ అంతరాయం కలిగితే, చమురు సరఫరా ఆలస్యం అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి.భారతదేశం వంటి దేశాలపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగిన చమురు ధరలు, కరెన్సీ బలహీనత, ద్రవ్యోల్బణం అన్నీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. తద్వారా ఆర్థిక వృద్ధి గాడి తప్పుతుంది.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక

BJP Victory in Bengal: These Sectors Set to Get a Boost6
బెంగాల్‌లో బీజేపీ విజయం: ఈ రంగాలకు ఊతం!

బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. బీజేపీ ప్రభంజనం సృష్టించింది. చాన్నాళ్ల తరువాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ మార్పు ద్వారా ఆర్ధిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.కేంద్రంలో, రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. దీనికి ఉదాహరణే ఎన్నికల కౌంటింగ్ రోజునే ఇక్కడున్న చాలా కంపెనీల షేర్స్ పెరగడం. దీన్ని బట్టి చూస్తే.. పెట్టుబడిదారులు బెంగాల్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.పశ్చిమ బెంగాల్‌లో ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (మౌలిక సదుపాయాలు), రైల్వేస్ రంగాలు మాత్రమే కాకుండా.. ఎనర్జీ, పవర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తద్వారా.. రాష్ట్రం మరింత పురోగతి దిశగా అడుగులు వేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇకపోతే.. కొన్ని కంపెనీలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కునే అవకాశం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా మమతా బెనర్జీ హయాంలో గుత్తాధిపత్యం చెలాయించిన కంపెనీలు లేదా కాంట్రాక్ట్ సంస్థలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక

Advertisement
Advertisement
Advertisement