Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Car Launches in India 2026 February From Nissan Tekton To Tata Sierra EV1
వస్తున్నాయ్ కొత్త కార్లు.. ఈ నెలలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే!

సాధారణంగా ఎవరైనా కొత్త కార్లు కొనాలంటే.. జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే ఈసారి జనవరి కంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది.నిస్సాన్ టెక్టెన్‌: నిస్సాన్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఒకటైన టెక్టెన్‌ను ఈ నెల 4న (ఫిబ్రవరి 4) ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగానికి చెందిన ఈ కారు.. అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఒకటి 100 బీహెచ్‌పీ పవర్ అందించే.. 1.0 లీటర్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCTతో లభిస్తుంది. మరొకటి 163 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఎంజీ మెజెస్టర్: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ నెల 12 (ఫిబ్రవరి 12) మెజెస్టర్ కారును ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ కారును మొదటిసారి 2025 ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది. దీని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్లోస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంజిన్‌లో కూడా ఎటువంటి మార్పు లేదు. గ్లోస్టర్ కారులోని అదే 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఫెసిలిటీలు ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎక్స్-3 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో: బీఎండబ్ల్యూ కూడా ఈ నెల 16న.. ఎక్స్-3 విభాగంలో 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో లాంచ్ చేయనుంది. ఇది సాధారణ స్పోర్ట్స్ వేరియంట్ మాదిరిగానే.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే ఈ వేరియంట్‌లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కొనసాగించారు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. 14.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.మారుతి సుజుకి ఈ-విటారా: మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా, ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, విన్‌ఫాస్ట్ వీఎఫ్6 వంటి మొదళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రియల్ వరల్డ్ రేంజ్ అనేది కొంత తగ్గుతుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరోన్: ఫోక్స్‌వ్యాగన్ టైరోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇది 204 బీహెచ్‌పీ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఇందులో 15 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ, హీటింగ్, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.టాటా సియెర్రా ఈవీ: ఇప్పటికే పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న టాటా సియెర్రా.. ఈ నెలలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. దీని డిజైన్.. సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. హారియర్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ కారు.. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది.

Why is Gold Given in Pink Paper Know The Reasons2
బంగారం పింక్ పేపర్‌లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్‌ ఇదే!

సాధారణంగా చాలామంది గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు.. విక్రయదారులు బంగారాన్ని పింక్ కలర్ పేపర్‌లో చుట్టి ఇస్తుంటారు. బహుశా కొందరికి అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు.. ఎందుకు ఈ రంగు కాగితంలోనే చుట్టి ఇస్తున్నారని. మీ సందేహానికి సమాధానమే ఈ కథనం..బంగారాన్ని సాధారణంగా పింక్ కలర్ పేపర్‌లోనే చుట్టి ఇవ్వడం వెనుక స్పష్టమైన శాస్త్రీయ కారణం కన్నా.. సంప్రదాయం, మానసిక ప్రభావం, వ్యాపారానికి సంబంధించిన ఆచారం కలిసి ఉన్నాయనే చెప్పాలి. పసిడి మన భారతీయ సంస్కృతిలో అత్యంత విలువైన లోహం. అది కేవలం ఆభరణంగా మాత్రమే అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఇది సంపదకు, శుభానికి, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. అంతటి విలువైన వస్తువును అందించే సమయంలో.. ఒక ప్రత్యేకత ఉండాలనే భావనతో వ్యాపారులు పింక్ కలర్ పేపర్‌లో చుట్టి ఇస్తూ వస్తున్నారు.రంగుఇతర రంగుల కంటే.. పింక్ కలర్ మృదుత్వం, శుభ్రత, సౌమ్యతను సూచిస్తుంది. చూడగానే హాయిని ఇచ్చే ఈ రంగు.. మనసులో సానుకూల భావనను కలిగిస్తుంది. బంగారం లాంటి మెరిసే లోహాన్ని పింక్ పేపర్‌ మీద పెట్టినప్పుడు అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొనుగోలుదారు కూడా నేను చాలా విలువైన లోహాన్ని కొనుగోలు చేశాననే సంతృప్తిని ఇస్తుంది.సాంప్రదాయంచాలాకాలం నుంచి ఆభరణాల దుకాణాల్లో పింక్ లేదా లైట్ రెడ్ కలర్ పేపర్ ఉపయోగించడం అలవాటుగా మారిపోయింది. ఒక ఆచారం మొదలైందంటే.. అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆలాగే బంగారం విషయంలో పేపర్ రంగు నేటికీ కొనసాగుతోంది. బంగారం అంటే పింక్ పేపర్ అన్న భావన మనకు తెలియకుండానే మనసులో స్థిరపడిపోయింది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!వ్యాపారంఇతర పేపర్‌లతో పిలిస్తే.. పింక్ కలర్ పేపర్ మురికి, మడతలు వంటి వాటిని అంత త్వరగా కనిపించనివ్వదు. అంతే కాకుండా ఇది పెద్దగా ఖరీదైంది కాదు కూడా. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒకే రంగు వాడటం వల్ల దాని గుర్తింపు ప్రత్యేకమవుతుంది. అందుకే దుకాణదారులు కూడా గోల్డ్ అంటే.. పింక్ రంగునే వాడుతుంటారు.మానసిక ప్రభావంప్రజలు ఎప్పుడైనా శుభం జరగాలనే కోరుకుంటారు. పింక్ పేపర్‌లో చుట్టి ఇవ్వడం వల్ల.. అది మరింత శుభంగా భావిస్తారు. పైన చెప్పుకున్నట్లు.. పింక్ రంగు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది కూడా. ఇలా.. మొత్తం మీద గోల్డ్ అంటే పింక్ పేపర్ అని అందరూ పిక్స్ అయిపోయారు.

Money Cant Buy Happiness Elon Musk Tweet Viral3
డబ్బుతో ఆనందం కొనలేము: మస్క్ ట్వీట్

ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఎప్పడూ సంచనల వ్యాఖ్యలు చేసే ఈయన.. ఇప్పుడు ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. "డబ్బుతో ఆనందాన్ని కొనలేము" అని ఒక ఎమోజీ యాడ్ చేశారు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంది.ఎలాన్ మస్క్ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు తన సంపదను దృష్టిలో ఉంచుకుని సరదాగా కూడా వ్యాఖ్యానించారు. అంటే మీరు సంతోషంగా లేరా? అని ఒకరు ప్రశ్నించగా.. మరొకరు, ముందు నాకు 1 బిలియన్ డాలర్లు ఇవ్వండి, నేనూ అనుభవించి చెబుతాను అని అన్నారు. ఇంకొకరు బిలియనీర్‌గా బాధపడటం, బిలియనీర్ కాకుండా బాధపడటం కంటే మెరుగైనదే.. అంటూ వ్యంగ్యంగా స్పందించారు.సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. ఈ చర్చలో ప్రముఖ అమెరికన్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్‌మన్ కూడా పాల్గొనడం మరో ముఖ్యమైన అంశం. మీరు ఇప్పటికే చాలామందికి సహాయం చేశారు. అంతేకాదు.. జీవిత భాగస్వామితో దీర్ఘకాలికమైన, స్థిరమైన సంబంధం కూడా నిజమైన ఆనందానికి కారణమవుతుందని ఆయన వ్యక్తిగత సలహా ఇవ్వడం గమనార్హం.ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతున్న సమయంలో.. ఎలాన్ మస్క్ మరో రికార్డ్ సృష్టించారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 800 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. స్పేస్‌ఎక్స్, xAI వంటి సంస్థల విస్తరణ, వాటి విలువ పెరుగుదల మస్క్ సంపదను ఆ స్థాయికి తీసుకెళ్లాయి.ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ.. డబ్బుతో ఆనందాన్ని కొనలేము అని మస్క్ వ్యాఖ్యానించడం చాలామందిని ఆలోచనల్లోకి నెట్టేసింది. మానవ సంబంధాలు, ఇతరులకు ఉపయోగపడే పనులు అన్నీ నిజమైన సంతోషాన్ని ఇస్తాయని కొందరు మరోసారి గుర్తు చేశారు.Whoever said “money can’t buy happiness” really knew what they were talking about 😔— Elon Musk (@elonmusk) February 5, 2026

iPhone 17 series at discounted prices in Apple Valentines Day sale4
వాలెంటైన్స్ డే ఆఫర్‌.. ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్లు

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యాపిల్ భారత మార్కెట్లో వాలెంటైన్స్ డే సేల్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా లేటెస్ట్‌ ఐఫోన్ 17 సిరీస్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ వాలెంటైన్స్ డే సేల్ ప్రస్తుతం యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.ఈ సేల్‌లో భాగంగా యాపిల్ ఎప్పటిలానే నేరుగా ధరలు తగ్గించకుండా, బ్యాంక్ ఆధారిత ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు, క్రెడిట్ కార్డు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డులపై వర్తిస్తాయి. చెక్‌అవుట్ సమయంలో అర్హత కలిగిన కార్డును ఉపయోగించిన వెంటనే ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దీంతో ఫోన్‌ ధర తగ్గుతుంది. డిస్కౌంట్ తప్ప, మిగతా కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవు. డెలివరీ అంచనాలు, స్టోర్ పికప్ ఆప్షన్లు, చెల్లింపు విధానం యథాతథంగా ఉంటాయి.ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు, ధరఐఫోన్ 17లో 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇది A19 చిప్, 8GB ర్యామ్, 256GB / 512GB స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.ఫోటోగ్రఫీ కోసం ఇందులో 48MP డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ఉండి, 10x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.77,900 ప్రారంభ ధరకు లభిస్తోంది. దీనిపై రూ.5,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.ఐఫోన్ 17 ప్రో స్పెక్స్‌.. ఆఫర్లు ఇలా..ఐఫోన్ 17 ప్రోలో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్‌తో వస్తుంది. ఈ మోడల్‌లో A19 ప్రో చిప్ (6-కోర్ CPU, 6-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్), 12GB ర్యామ్ ఉన్నాయి. అలాగే 48MP కెమెరా అరే, 5x ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లభిస్తుంది. టైటానియం ఫ్రేమ్, USB-C పోర్ట్, అధునాతన AI ఫీచర్లు, అలాగే 33 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.వాలెంటైన్స్ డే సేల్‌లో ఈ ఫోన్ రూ.1,29,900 తగ్గింపు ధరకు లభిస్తుంది. దీనిపై కూడా రూ.5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు, ధరఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్‌తో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ మోడల్ A19 ప్రో చిప్, 12GB ర్యామ్‌తో శక్తివంతమైన పనితీరు, మెరుగైన AI సామర్థ్యాలను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ 48MP కెమెరా సెటప్, LiDAR సెన్సార్, 5x టెలిఫోటో జూమ్, 8K వీడియో సపోర్ట్ ఉన్నాయి.వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.1,44,900 ప్రత్యేక ధరకు లభిస్తుంది. దీనిపైనా రూ.5,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

Retirement Age Hike Back in Focus Amid Pension and Longevity Concerns5
రిటైర్‌మెంట్‌ వయసు పెరగనుందా?

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం 2026లో మరోసారి చర్చకు వచ్చింది. పెరుగుతున్న ఆయుర్దాయం, పెన్షన్ బాధ్యతల భారం నేపథ్యంలో ఈ విషయం విధాన నిర్ణేతలు, ఉద్యోగులు, న్యాయస్థానాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం 58–60 సంవత్సరాల మధ్య ఉన్న పదవీ విరమణ వయస్సును సమీప భవిష్యత్తులో సవరించే అవకాశం ఉందని అనేక రాష్ట్రాలు, రంగాల వారీగా వస్తున్న ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా వర్తించే ఏకరీతి నిర్ణయం ఇప్పటివరకు అధికారికంగా తీసుకోలేదు.సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు!దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలు సంప్రదాయ పదవీ విరమణ నిబంధనలను పునఃపరిశీలించే దిశగా అడుగులు వేస్తున్నాయి. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలా వద్దా అన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. మరోవైపు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ వ్యయాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 64 నుంచి 65 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.కార్మికుల పదవీ విరమణ వయస్సును పొడిగించాలా అనే అంశంపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రామాణిక పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలే అయినప్పటికీ, ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక పని జీవితం, పెరుగుతున్న పెన్షన్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని దానిని 62 లేదా అంతకంటే ఎక్కువకు పెంచాలా అనే దానిపై విధాన, మేధావి వర్గాలు చురుకుగా చర్చిస్తున్నాయి.నిరుద్యోగ సమస్యపదవీ విరమణ వయస్సు పెంపు ప్రభావం కేవలం పెన్షన్ వ్యయాలకే పరిమితం కాదు. ఇది మొత్తం శ్రామిక శక్తి సమీకరణంపైనా ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగులను ఎక్కువకాలం సేవలో కొనసాగించడం ద్వారా కొన్ని రంగాల్లో నైపుణ్యాల కొరతను తగ్గించవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

Gold Silver Price Down When Bitcoin Slides Michael Burry Warns6
బిట్‌కాయిన్ పతనం.. మైఖేల్ బరీ హెచ్చరిక!

బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్ ధర కూడా అమాంతం పడిపోతోంది. ఇది ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళనను కలిగిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ హెజ్ ఫండ్ మేనేజర్ 'మైఖేల్ బరీ' కీలక వ్యాఖ్యలు చేశారు.బిట్‌కాయిన్ పతనం కేవలం క్రిప్టో మార్కెట్‌కే పరిమితం కాదు. ఇది బంగారం, వెండి వంటి సంప్రదాయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. మైఖేల్ బరీ హెచ్చరించారు. బిట్‌కాయిన్‌లో పెద్ద నష్టాలు వస్తే, పెట్టుబడిదారులు నగదు కోసం ఇతర ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.బిట్‌కాయిన్ ఇప్పుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. స్పాట్ బిట్‌కాయిన్ ETFలు, అలాగే కొన్ని పెద్ద కంపెనీలు తమ ట్రెజరీలో బిట్‌కాయిన్‌ను నిల్వ చేసుకోవడం వల్ల, క్రిప్టో మార్కెట్‌లో జరిగే మార్పులు మిగతా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ETFల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తే.. ఆ ఫండ్స్ తమ వద్ద ఉన్న బిట్‌కాయిన్‌ను అమ్మాల్సి వస్తుంది. దీని వల్ల ధరలు మరింత పడిపోతాయని మైఖేల్ బరీ పేర్కొన్నారు.బిట్‌కాయిన్ మరింత పడిపోతే, మైక్రోస్ట్రాటజీ వంటి బిట్‌కాయిన్‌పై భారీగా ఆధారపడిన సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని బరీ హెచ్చరించారు. ముఖ్యంగా బిట్‌కాయిన్ ధర 50,000 డాలర్ల వరకు పడితే.. కొంతమంది దివాలా తీయవచ్చని, అలాగే టోకనైజ్డ్ మెటల్స్ (డిజిటల్ గోల్డ్, సిల్వర్) మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోతారని చెప్పారు. ఇది ఆయన చెప్పినట్లుగా ఒక 'డెత్ స్పైరల్'.. అంటే ఒక సమస్య మరో సమస్యకు దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి.బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. బిట్‌కాయిన్ ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుందనే వాదనను బరీ ఖండించారు. అంతే కాకుండా.. బిట్‌కాయిన్.. S&P 500 స్టాక్ సూచీ మధ్య పెరుగుతున్న సంబంధం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఆయన పేర్కొన్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బరీ చెప్పిందే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. గతంలో కూడా క్రిప్టో మార్కెట్ భారీ పతనాల తర్వాత వేగంగా కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా బంగారం, వెండి ధరలు సాధారణంగా.. వడ్డీ రేట్లు, డాలర్ బలం, నియంత్రణ మార్పులు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. కేవలం క్రిప్టో అమ్మకాల వల్ల బంగారం ధరల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం లేదు.ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!

Advertisement
Advertisement
Advertisement