Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

akshaya tritiya 2026 gold price hike buying trends Then vs Now1
పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు..

ఆశలు అక్షయం కావాలని కోరుకుంటూ భారతీయులు జరుపుకునే పవిత్ర పండుగ అక్షయ తృతీయ. ఈ ప్రత్యేక సందర్భంలో పసిడి కొనుగోలు చేయడం అనవాయితీ. ఈ ఏడాది కూడా పసిడి కొనుగోళ్లకు జనం సిద్ధమవుతున్నప్పటికీ, ఆకాశాన్నంటుతున్న ధరలు సామాన్యుడి అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధరల్లో వచ్చిన భారీ మార్పు ఇప్పుడు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.ధరల వ్యత్యాసం2025 అక్షయ తృతీయ నాటి ధరలతో పోలిస్తే, ఈ ఏడాది (2026) బులియన్ మార్కెట్‌లో పెను మార్పులు సంభవించాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.96,000 నుండి రూ.97,000 మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధరకు కేవలం 6 నుండి 6.5 గ్రాములు మాత్రమే వస్తోంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే కొనుగోలుదారుల శక్తి 30-40% వరకు క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు.దేశంలో ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం (24 క్యారెట్స్) ధర రూ.1,52,840 లుగా (ఏప్రిల్‌ 11 నాటికి) ఉంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,40,100 లుగా ఉంది.ఎందుకీ పరుగు?బంగారం ధరలు ఇలా అదుపు లేకుండా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు 'సురక్షిత ఆస్తి'గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భౌతిక బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, ఇటిఎఫ్ (ETF)లపై ఆసక్తి పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పైపైకి వెళ్తున్నాయి.మారిన వినియోగదారుల తీరుధరలు భారమైనా సెంటిమెంట్‌ను వదులుకోని భారతీయులు, తమ కొనుగోలు పద్ధతులను మార్చుకుంటున్నారు. భారీ ఆభరణాల కంటే తక్కువ బరువుతో ఆకర్షణీయంగా కనిపించే డిజైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాషన్ కంటే పెట్టుబడి దృక్పథంతో బంగారు నాణేలను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా నగదు ఖర్చు చేసే కంటే, ఇంట్లో ఉన్న పాత ఆభరణాలను ఇచ్చి కొత్తవి తీసుకునే 'ఎక్స్ఛేంజ్ స్కీంల' వైపు జనం మొగ్గు చూపుతున్నారు.వ్యాపారుల వ్యూహాలుకస్టమర్లను ఆకర్షించడానికి జ్యువెలరీ షాపులు కూడా రాయితీలను ప్రకటిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపులు, ముందస్తు బుకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. స్టోర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గకపోయినప్పటికీ, ఒక్కొక్కరు కొనే బంగారం పరిమాణం తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

India LPG Consumption Hits 21 Month Low as Petrol Diesel Sales Record Highs2
21 నెలల కనిష్ఠానికి ఎల్‌పీజీ వినియోగం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును అతలాకుతలం చేస్తున్న వేళ, భారత ఇంధన రంగంలో విరుద్ధమైన ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవైపు యుద్ధ భయాలతో రవాణా ఇంధనాలైన పెట్రోల్, డీజిల్‌కు విపరీతమైన గిరాకీ పెరగ్గా, మరోవైపు వంట గ్యాస్ వినియోగం గత 21 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) విడుదల చేసిన తాత్కాలిక గణాంకాలు ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించాయి.ఎల్‌పీజీ వినియోగంలో భారీ క్షీణతమార్చి 2026లో దేశీయ ఎల్‌పీజీ వినియోగం గణనీయంగా తగ్గింది. గత నెలతో పోలిస్తే 16 శాతం, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం క్షీణత నమోదైంది. మార్చిలో మొత్తం వినియోగం 2.38 మిలియన్ టన్నుల వద్ద నిలిచింది. జూన్ 2024 తర్వాత ఎల్‌పీజీ వినియోగంలో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే తొలిసారి.దిగుమతులపై హార్మూజ్‌ ప్రభావంభారతదేశం తన ఎల్‌పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సుమారు 90 శాతం దిగుమతులు వ్యూహాత్మకమైన హార్మూజ్‌ జలసంధి గుండానే సాగుతుంటాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ సంక్షోభం ఈ జలసంధి ద్వారా రవాణాను ప్రభావితం చేయడంతో ఫిబ్రవరిలో 2 మిలియన్‌ టన్నులుగా ఉన్న దిగుమతులు మార్చి నాటికి 1.1 మిలియన్‌ టన్నులకు పడిపోయాయి.పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్సరఫరాలో అంతరాయాలు కలగవచ్చనే భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్తగా ఇంధన కేంద్రాలకు క్యూ కట్టడం వల్ల రవాణా ఇంధనాల వినియోగం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.ఇంధనంమర్చి నెల వినియోగంవృద్ధి (నెలవారీ)వృద్ధి (వార్షిక)డీజిల్8.73 MT (రికార్డు)14%8%పెట్రోల్3.78 MT (రికార్డు)12%8% వార్షిక ధోరణి ఆశాజనకంమార్చి నెలలో ఎల్‌పీజీ వినియోగంలో క్షీణత కనిపించినప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం వినియోగం మాత్రం ఆశాజనకంగానే ఉంది. గతేడాది కంటే 6 శాతం వృద్ధి చెంది 33.21 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత నమోదైన అత్యధిక వార్షిక వృద్ధి కావడం విశేషం.ప్రభుత్వ భరోసా - ప్రత్యామ్నాయ మార్గాలుప్రస్తుత అస్థిరతపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. దేశీయ ఎల్‌పీజీ వినియోగంలో 90 శాతంపైగా ఉన్న గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎల్‌పీజీపై భారాన్ని తగ్గించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్లను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. మార్చిలోనే 3 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వగా ఏప్రిల్ చివరి నాటికి మరో 6 నుంచి 7 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్‌ గిఫ్ట్!

Inside Anant Ambani's Rs 640 crore Dubai villa with private3
రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్‌!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ తాజాగా తన పుట్టినరోజును జరుపుకొన్నారు. బాలీవుడ్ అగ్ర తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటంతో సోషల్ మీడియా సందడి నెలకొంది. ఈ ప్రత్యేక సందర్భంలో, రాధికా మర్చంట్‌తో వివాహానికి ముందు తండ్రి ముఖేష్ అంబానీ కానుకగా ఇచ్చిన దుబాయ్‌లోని అద్భుతమైన విల్లా విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.పామ్ జుమేరాలో బిలియనీర్ ప్యాలెస్దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పామ్ జుమేరా ద్వీపంలో ఉన్న ఈ విల్లా విలువ దాదాపు రూ. 640 కోట్లు. సముద్రపు అంచున, ప్రకృతి ఒడిలో నిర్మితమైన ఈ నివాసం విలాసానికి మారుపేరులా నిలుస్తుంది.విల్లాలోని అద్భుతమైన ఫీచర్లుదాదాపు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి విస్తరించి ఉంది.ఇందులో మొత్తం 10 రాజభవనాల్లాంటి బెడ్‌రూమ్‌లు ఉన్నాయి.ఈ విల్లాకు అనుబంధంగా 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ ఉండటం విశేషం.ఇటాలియన్ మార్బుల్స్‌తో మెరిసిపోయే ఫ్లోరింగ్, గోడలపై అరుదైన కళాఖండాలు ఈ ఇంటికి రాయల్ లుక్‌ను ఇస్తాయి.తెల్లటి రంగు ఇంటీరియర్స్ ఎడారి వేడిలోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి.విల్లాలో అధునాతన స్పా, టెర్రస్ గార్డెన్, ఇండోర్-అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.ప్రముఖుల నిలయం.. పామ్ జుమేరాదుబాయ్‌లోని ఈ ప్రాంతం కేవలం అంబానీలకే కాదు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (జన్నత్ విల్లా), అమితాబ్ బచ్చన్ వంటి సెలబ్రిటీల నివాసాలకు కూడా నిలయం. సముద్రపు అలల మధ్య, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ 'డెజర్ట్ మాన్షన్' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటిగా నిలుస్తోంది.

Meta Snatches OpenAI Stargate Experts in Billion Dollar AI Race4
ఓపెన్ ఏఐ నిపుణులను తన్నుకుపోయిన మెటా!

కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరు కొత్త మలుపు తిరుగుతోంది. చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐకు గట్టి షాక్ ఇస్తూ ఆ సంస్థలోని అత్యంత కీలకమైన నిపుణులను మెటా ప్లాట్‌ఫారమ్స్‌ తన గూటికి చేర్చుకుంటోంది. సూపర్ కంప్యూటింగ్, భారీ డేటా సెంటర్ల నిర్మాణంలో ఆరితేరిన కొందరు అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగులు ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ టీమ్‌లో చేరడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.మెటా గూటికి స్టార్‌గేట్ వ్యూహకర్తలుఓపెన్ ఏఐ మౌలిక సదుపాయాల విభాగంలో కీలకంగా నిలిచిన పీటర్ హోషెల్, షమీజ్ హేమానీ, అనుజ్ సహారాన్ ఇప్పుడు మెటాలో చేరారు. వీరు ఓపెన్ ఏఐ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘స్టార్‌గేట్’ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన వారు. ఈ ప్రాజెక్ట్‌ను వందల బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ సామర్థ్యాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టారు. ఇప్పుడు ఈ నిపుణులు మెటా సొంత సూపర్ కంప్యూటింగ్ ప్రయత్నాలకు, ముఖ్యంగా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విస్తరణకు కీలకంగా మారనున్నారు.జుకర్‌బర్గ్ భారీ స్కెచ్: రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడి!ఏఐ రేసులో వెనుకబడకూడదనే పట్టుదలతో ఉన్న మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం ఈ ఏడాదిలోనే సుమారు 135 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.11.25 లక్షల కోట్లు) మూలధన వ్యయాన్ని మెటా అంచనా వేస్తోంది. దీర్ఘకాలికంగా వందల బిలియన్ డాలర్లను ఏఐ హార్డ్‌వేర్, చిప్స్, డేటా సెంటర్ల కోసం వెచ్చించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ భారీ సామ్రాజ్యాన్ని నడిపించడానికి ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన నిపుణులు దిక్సూచిగా మారనున్నారు.రక్షణలో ఓపెన్ ఏఐ..మరోవైపు, ఓపెన్ ఏఐ తన దూకుడుకు కాస్త బ్రేకులు వేసినట్లు కనిపిస్తోంది. కంపెనీ తన మౌలికసదుపాయాల వ్యూహాలను పునసమీక్షిస్తోంది. బ్రిటన్‌లో చేపట్టాలనుకున్న ‘స్టార్‌గేట్’ ప్రాజెక్టును కంపెనీ తాత్కాలికంగా పక్కన పెట్టింది. త్వరలో పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్న ఓపెన్ ఏఐ అపరిమితమైన ఖర్చులను నియంత్రించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త సైట్లను లీజుకు తీసుకోవడాన్ని కూడా వాయిదా వేసింది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్‌ గిఫ్ట్!

Petrol two Wheelers Cant Be Registered In Delhi From 20285
పెట్రోల్‌ బండ్లు బ్యాన్‌.. రిజిస్ట్రేషన్లు బంద్‌!

దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు 'ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030' ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం.. రానున్న రెండేళ్లలో పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయిలో నిషేధం విధించి, నగరాన్ని ఈవీ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.కీలక గడువులు ఇవే..పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించేందుకు ప్రభుత్వం స్పష్టమైన టైమ్ లైన్లను ప్రకటించింది. జనవరి 1, 2027 నుండి ఢిల్లీలో కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల (ఆటోలు) రిజిస్ట్రేషన్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. పెట్రోల్/సీఎన్‌జీ ఆటోల రిజిస్ట్రేషన్ నిలిచిపోనుంది.ఏప్రిల్ 1, 2028 నుండి పెట్రోల్ ద్విచక్ర వాహనాలపై (బైకులు, స్కూటర్లు) పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అప్పటి నుండి కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లను మాత్రమే అనుమతిస్తారు.ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే.. డెలివరీ యాప్‌లు, అగ్రిగేటర్ల పరిధిలోని వాహనాలకు జనవరి 1, 2027 నుంచే కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఉన్న BS-6 వాహనాలను డిసెంబర్ 31, 2026 వరకు మాత్రమే అనుమతించి, ఆపై పూర్తిగా ఈవీలను తప్పనిసరి చేయనున్నారు.వ్యక్తిగత వాహనాలే కాకుండా, ప్రభుత్వ, విద్యాసంస్థల వాహనాలపై కూడా ఈ ప్రభావం ఉండనుంది. 2030 నాటికి 30 శాతం పాఠశాల బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ఏటా నిర్దిష్ట కోటాను పెంచుకుంటూ పోతారు.ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన్నీ 100% ఎలక్ట్రిక్ మాత్రమే అయి ఉండాలి. అలాగే అద్దెకు తీసుకునే వాహనాలను కూడా తక్షణమే ఈవీలుగా మార్చాలని నిర్ణయించారు.ఢిల్లీకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సులు కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ లేదా హైడ్రోజన్ ఇంధన సాంకేతికతకు మారాల్సి ఉంటుంది.ప్రజాభిప్రాయ సేకరణఈ మార్పులు ఆకస్మికంగా కాకుండా, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా దశలవారీగా అమలు చేస్తాం. మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ పాయింట్ల విస్తరణపై ప్రభుత్వం భారీగా దృష్టి సారించిందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.ప్రస్తుతం ఈ ముసాయిదాను పౌరులు, నిపుణుల సలహాల కోసం పబ్లిక్ డొమైన్‌లో ఉంచారు. రాబోయే 30 రోజుల్లో వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీనిపై తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. శీతాకాలంలో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేసే కాలుష్య కోరల నుండి విముక్తి పొందేందుకు ఈ ఈవీ పాలసీ కీలకం కానుంది.

Air India Chairman Warns Employees Amid Record Losses Operational Challenges6
ఎయిరిండియా ఉద్యోగులకు ఛైర్మన్ హెచ్చరిక

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, రాబోయే కాలం మరింత సవాలుతో కూడుకున్నదని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. రికార్డు స్థాయి నష్టాలు, నిరంతర కార్యాచరణ వైఫల్యాల నేపథ్యంలో సంస్థను గాడిలో పెట్టేందుకు ఉద్యోగులందరూ అంకితభావంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల గురుగ్రామ్‌లోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్గత సమావేశంలో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్థ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేస్తూనే ప్రస్తుత ఇబ్బందులను చంద్రశేఖరన్ హైలైట్‌ చేశారు.ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..‘గతంలో ఎయిరిండియా సిబ్బంది కంపెనీ క్లిష్ట సమయాల్లో ఎంతో పట్టుదల చూపారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. సంస్థ ఆశయాలకు అనుగుణంగా బలమైన పునాది వేసినప్పటికీ, విమానయాన రంగంలో వస్తున్న మార్పులు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం మన నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెట్టాలి. పనితీరు అమలు, ఖర్చుల నియంత్రణలో రాజీ పడకూడదు’ అని సూచించారు.ఎయిరిండియాకు సవాళ్లు..టాటా గ్రూప్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎయిరిండియాను పునరుద్ధరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ పలు అంశాలు సంస్థను వేధిస్తున్నాయి. ఈ ఏడాది కంపెనీ తన అతిపెద్ద వార్షిక నష్టాన్ని నివేదించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) క్యాంప్‌బెల్ విల్సన్ కంపెనీ నుంచి నిష్క్రమిస్తుండడం మరో ఎదురుదెబ్బ. విస్తారాతో విలీనం తర్వాత ఏకీకరణ ప్రక్రియకు అవుతున్న భారీ ఖర్చులు, కొత్త విమానాల కొనుగోలు వ్యయం సంస్థపై భారాన్ని పెంచాయి.బాహ్య కారణాల ప్రభావంఅంతర్జాతీయ పరిణామాలు కూడా ఎయిరిండియా లాభదాయకతను దెబ్బతీస్తున్నాయి. పెరుగుతున్న విమాన ఇంధన ధరలు నిర్వహణ వ్యయాన్ని పెంచాయి. పాకిస్థాన్‌ గగనతలంపై ఆంక్షలు, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా విమానాలను ఇతర మార్గాల్లో మళ్లించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా కీలకమైన అమెరికా, యూరప్‌ మార్గాల్లో కంపెనీ తన ఆధిక్యతను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.టాటా గ్రూప్ పూర్తి మద్దతుఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంస్థ పునరుద్ధరణకు టాటా గ్రూప్ కట్టుబడి ఉందని చంద్రశేఖరన్ భరోసా ఇచ్చారు. ‘టాటా గ్రూప్ బోర్డు సంస్థకు పూర్తి మద్దతు ఇస్తుంది. మేనేజ్‌మెంట్ టీమ్‌తో కలిసి నిరంతరం పనిచేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్‌ గిఫ్ట్!

Advertisement
Advertisement
Advertisement