Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Close January 21 Sensex Slips Nifty At1
నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం వరుసగా మూడవ సెషన్‌లోనూ క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 270.84 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 81,909.63 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 75 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టపోయి 25,157.5 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.9 శాతం క్షీణించాయి.

Wipro CEO Srini Pallia says AI is driving a new IT services boom2
ఐటీకి కొత్త బూమ్ ఖాయం: విప్రో సీఈవో

ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తుపై విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని పల్లియా గట్టి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం గణనీయమైన మార్పును ఎదుర్కోనుందని చెప్పారు.పల్లియా ప్రకారం.. 2025 సంవత్సరం ప్రయోగాలు, చిన్న స్థాయి ట్రయల్స్‌కు పరిమితమైతే, 2026 పూర్తి స్థాయి అమలు, జవాబుదారీతనానికి కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పటికే సంస్థలు ఏఐ (AI) టెక్నాలజీని కేవలం పరీక్షించే దశను దాటేశాయని, చిన్న ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎంటర్‌ప్రైజ్-వైడ్ అమలు వైపు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.ఈ మార్పు భారతీయ సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారులకు బలమైన కొత్త అవకాశాలను తెస్తోందని పల్లియా చెప్పారు. మెగా డీల్స్‌తో పాటు ప్రత్యేకమైన, చిన్న ఏఐ ప్రాజెక్టుల కోసం కూడా పోటీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.ఏఐ ఐటీ రంగ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోందని ఆయన అంగీకరించారు. ఏఐ-సహాయక సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వల్ల కోడింగ్, టెస్టింగ్ ఖర్చులు సుమారు 25 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. దీని వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడినప్పటికీ, ఆ పొదుపును మరిన్ని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టులకు వినియోగిస్తారని ఆయన తెలిపారు.గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్నాలజీ వ్యయాలు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఏఐ ధోరణి ఐటీ పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని విప్రో భావిస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు

Union Cabinet approved continuation of the Atal Pension Yojana3
అటల్ పెన్షన్ యోజన.. మరో ఐదేళ్లు పొడిగింపు

దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉన్న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, అంటే 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.పథకం ముఖ్యాంశాలు.. తాజా నిర్ణయాలుఈ పొడిగింపు ద్వారా పథకం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే కాకుండా క్షేత్రస్థాయిలో మరింత మందికి చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పథకం నిరంతరాయంగా సాగేందుకు అవసరమైన ‘గ్యాప్ ఫండింగ్‌’కు ప్రభుత్వ నిధుల మద్దతును కేంద్రం విస్తరించింది.గ్రామీణ, అనధికారిక రంగాల్లోని కార్మికులకు ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఈ పథకం కింద చేరిన వారు 60 ఏళ్ల వయసు తర్వాత తాము అందించిన సహకారం (Contribution) ఆధారంగా నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు గ్యారెంటీ పెన్షన్ పొందుతారు.8.66 కోట్ల మంది నమోదుమే 9, 2015న ప్రారంభమైన అటల్ పెన్షన్ యోజన భారత సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. అధికారిక పెన్షన్ సౌకర్యం లేని సామాన్యులను పెన్షన్‌ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. తాజా గణాంకాల ప్రకారం జనవరి 19, 2026 నాటికి ఈ పథకం కింద నమోదైన చందాదారుల సంఖ్య 8.66 కోట్లకు పైగా చేరింది.ఎందుకు ఈ పొడిగింపు?భారతదేశంలో మెజారిటీ కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు. వారికి వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని కేంద్రం పేర్కొంది. పథకం అమలును మరింత బలోపేతం చేయడం, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం కోసం ప్రభుత్వ మద్దతు అవసరమని భావించి ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.అటల్ పెన్షన్ యోజన.. మరిన్ని వివరాలుఏపీవై అనేది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సామాజిక భద్రతా పథకం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారు (ఉదాహరణకు: డ్రైవర్లు, తోపుడు బండ్ల వ్యాపారులు, కూలీలు) తమ వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి దీన్ని రూపొందించారు.అర్హతలుభారతీయ పౌరుడై ఉండాలి.వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.దరఖాస్తుదారునికి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి (ఆధార్ అనుసంధానం అవసరం).అక్టోబర్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధన ప్రకారం ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించే వారు ఈ పథకంలో చేరడానికి అనర్హులు.సమకూరే పెన్షన్చందాదారులు 60 ఏళ్లు నిండిన తర్వాత ఐదు రకాల పెన్షన్ మొత్తాల్లో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. అందులో నెలకు రూ. 1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000 లేదా రూ.5,000 స్లాబ్‌లున్నాయి. చందాదారులు ఎంచుకున్న పెన్షన్ మొత్తం, పథకంలో చేరినప్పటి వయసును బట్టి తాము చెల్లించాల్సిన నెలవారీ ప్రీమియం మారుతుంది.ప్రీమియం ఇలా..మీరు ఎంత త్వరగా (తక్కువ వయసులో) చేరితే ప్రీమియం అంత తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.ఉదాహరణకు: 18 ఏళ్ల వయసులో చేరి నెలకు రూ.1,000 పెన్షన్ కావాలనుకుంటే కేవలం రూ.42 చెల్లిస్తే సరిపోతుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరితే రూ.291 చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం డబ్బు మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. నెలవారీ, మూడు నెలలకొకసారి లేదా ఆరు నెలలకొకసారి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.పథకం ప్రయోజనాలుమార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం కనీస పెన్షన్‌కు హామీ ఇస్తుంది.చందాదారుడు మరణిస్తే అదే పెన్షన్ మొత్తం వారి జీవిత భాగస్వామికి అందుతుంది.చందాదారుడు, వారి భాగస్వామి ఇద్దరూ మరణిస్తే మొత్తం పెన్షన్ ఫండ్‌ను నామినీకి అందజేస్తారు.సెక్షన్ 80 సీసీడీ కింద చెల్లించిన ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది.ఎలా దరఖాస్తు చేయాలి?మీకు ఖాతా ఉన్న బ్యాంకును లేదా సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి ఏపీవై (APY) దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి ఇవ్వాలి. చాలా బ్యాంకులు ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ఈ పథకంలో చేరే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్‌ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి

Why Zoho cofounder Sridhar Vembu urged engineers to stop vibe coding?4
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు శ్రీధర్ వెంబు సూచన

సాఫ్ట్‌వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొనసాగుతోంది. ముఖ్యంగా ‘కర్సర్’ (Cursor) వంటి ఏఐ సాధనాల ద్వారా కేవలం ప్రాంప్ట్‌లు ఇస్తూ వందల సంఖ్యలో కోడ్ లైన్లను రాయడాన్ని డెవలపర్లు అలవాటు చేసుకుంటున్నారు. దీనినే ‘వైబ్ కోడింగ్’ అని పిలుస్తున్నారు. అయితే, ఈ ధోరణిపై జోహో అధినేత శ్రీధర్ వెంబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైబ్ కోడింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఏసీఈ(AI-Assisted Code Engineering) అనే కొత్త విధానాన్ని ఆయన తెరపైకి తెచ్చారు.ఏంటి వైబ్ కోడింగ్?ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకులు ఆండ్రెజ్ కార్పతి ఇటీవల వైబ్ కోడింగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. డెవలపర్లు లోతైన ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం లేకపోయినా కేవలం సహజ లాంగ్వేజీ ప్రాంప్ట్‌ల ద్వారా (Natural Language Prompts) ఏఐ అసిస్టెంట్లను ఉపయోగించి సాఫ్ట్‌వేర్ నిర్మించే ప్రక్రియను ఇది సూచిస్తుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇది భవిష్యత్తు అని అంగీకరించినప్పటికీ శ్రీధర్ వెంబు మాత్రం దీనివల్ల జరిగే నష్టాలను హెచ్చరించారు.‘ఏసీఈ’ ఎందుకు ముఖ్యం?శ్రీధర్ వెంబు అభిప్రాయం ప్రకారం, కేవలం ఏఐ ఇచ్చే ఫలితాలపై ఆధారపడటం వల్ల కంప్యూటర్ సైన్స్‌లోని మౌలిక అంశాలైన ఆప్టిమైజేషన్, అబ్‌స్ట్రాక్షన్, కంపైలేషన్‌ వంటి క్లిష్టమైన దశలను డెవలపర్లు విస్మరించే ప్రమాదం ఉంది.అసిస్టెడ్ కోడ్ ఇంజినీరింగ్ ప్రత్యేకతలుక్రమశిక్షణ కలిగిన ఇంజినీరింగ్‌గా దీనికి గుర్తింపు ఉంది. ఏసీఈ అనేది కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు, సాఫ్ట్‌వేర్‌ సాధనాలు, కోడింగ్‌ పద్ధతులపై అవగాహన పెంపొందించేలా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏఐ మీకు సహాయం చేస్తుంది. అదేసమయంలో నిత్యం మీ నైపుణ్యాన్ని పెంచుకుంటూనే ఉండాలి. వైబ్ కోడింగ్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ కోతలకు అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుండగా, ఏసీఈ విధానం అనుభవజ్ఞులైన ఇంజినీర్లను అందిస్తుందని వెంబు స్పష్టం చేశారు.టెక్ పరిశ్రమ ఇప్పటికే లేఆఫ్స్ ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కేవలం ‘వైబ్’ మీద ఆధారపడకుండా క్రమశిక్షణతో కూడిన ఏఐ అసిస్టెడ్ కోడింగ్‌ను అలవాటు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్‌ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి

Key Directives from DGCA regarding Chief of Flight Safety5
‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్‌ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి

దేశీయ విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, పునరావృతమవుతున్న భద్రతా పరమైన ఇబ్బందులను అరికట్టేందుకు అన్ని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు ఇకపై తప్పనిసరిగా ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ని నియమించాలని ఆదేశించింది.ప్రత్యేక భద్రతా విభాగం ఏర్పాటుప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం (రియాక్టివ్) కంటే, అవి జరగకముందే నివారించే (ప్రోఆక్టివ్) వ్యూహాన్ని అనుసరించాలని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా నిపుణులైన సిబ్బందితో కూడిన ప్రత్యేక ‘విమాన భద్రతా విభాగం’ను ప్రతి ఆపరేటర్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రమాదాల నివారణ కార్యక్రమాలను ఈ విభాగం నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.కీలక బాధ్యతల్లో నిపుణులుభద్రతా పర్యవేక్షణ కోసం డీజీసీఏ ఒక నిబంధనను విధించింది. దీని ప్రకారం ‘డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం కూడా తప్పనిసరి చేసింది. ఒకవేళ చీఫ్ హోదాలో ఉన్న వ్యక్తి పైలట్ అయితే డిప్యూటీ చీఫ్ హోదాలో తప్పనిసరిగా ఇంజినీర్ ఉండాలని తెలిపింది. ఒకవేళ చీఫ్ స్థానంలో ఇంజినీర్ ఉంటే, డిప్యూటీ చీఫ్ హోదాలో పైలట్ ఉండాలని పేర్కొంది. ఈ విధానం వల్ల విమాన నిర్వహణ (Maintenance), ఆపరేషన్స్ (Operations) మధ్య సమన్వయం పెరుగుతుందని డీజీసీఏ భావిస్తోంది.లోపాలపై ఆందోళనవిమాన ప్రమాదాలపై జరుగుతున్న పరిశోధనల్లో ప్రతిసారీ కొన్ని లోపాలు (Systemic flaws) బయటపడుతున్నాయని డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం లభించదని, సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (SMS)ను పటిష్టం చేయడం ద్వారానే అత్యున్నత భద్రత సాధ్యమని పేర్కొంది. ఈ కొత్త ఆదేశాలు కేవలం ప్యాసింజర్ విమానాలకే పరిమితం కాకుండా కింది విభాగాలన్నింటికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది.1. షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు.2. కార్గో (సరుకు రవాణా) సర్వీసులు.3. నాన్-షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు.సిబ్బంది సంక్షేమం - భద్రతా ఆడిట్లువిమానయానంలో మానవ తప్పిదాలను తగ్గించేందుకు సిబ్బంది అలసట (Fatigue)పై దృష్టి సారించాలని డీజీసీఏ ఆదేశించింది. పైలట్లు, ఇతర సిబ్బంది విమాన ప్రయాణ సమయాలు మించకుండా చూడాలని స్పష్టం చేసింది. గ్రౌండ్ సపోర్ట్, నిర్వహణ విభాగాల్లో ఎప్పటికప్పుడు అంతర్గత భద్రతా ఆడిట్లు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించింది.ఇదీ చదవండి: ఒకేరోజు ఊహించనంత పెరిగిన ధరలు

Gold and Silver rates on 21st January 2026 in Telugu states6
ఒకేరోజు ఊహించనంత పెరిగిన ధరలు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
Advertisement