Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Silver Prices Hit New Mark Sharp Movement Within Just a Week1
వెండి ధరలు కొత్త మార్క్.. కేవలం వారం రోజుల్లో!

బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా, వారం రోజుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. దీంతో సిల్వర్ రేట్లలో కొంత మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా వెండి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.గత ఆదివారం అంటే.. మార్చి 29న కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ.2.50 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. శనివారం (ఏప్రిల్ 4) నాటికి రూ.2.55 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో ధర పెరుగుతూ.. తగ్గుతూ కొత్త మార్కుకు చేరిందన్నమాట. ఈ ధరలు గత నెలతో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. ఇదే ధరలు బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో మాత్రం వారం రోజుల్లో సిల్వర్ రేటు రూ.2.45 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు చేరింది. నిజానికి దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే రాజధాని నగరంలో కొంత తక్కువగానే ఉంటుంది.వెండి ధరలు పెరగడానికి కారణాలుడిమాండ్ పెరగడం: వెండి నగలు (జ్యువెలరీ), ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిశ్రమలలో వినియోగం పెరిగితే వెండి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి.సరఫరా తగ్గడం: గనుల్లో ఉత్పత్తి తగ్గడం లేదా సరఫరాలో అంతరాయం కలిగితే మార్కెట్‌లో వెండి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి.ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బును భద్ర పెట్టుబడులలో పెట్టాలని చూస్తారు. అప్పుడు వెండి వంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరుగుతుంది.కరెన్సీ విలువ తగ్గడం: ముఖ్యంగా డాలర్ విలువ పడిపోతే, వెండి ధరలు పెరుగుతాయి.పెట్టుబడిదారుల ఆసక్తి: స్టాక్ మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వెండి వంటి ఆస్తులలో పెట్టుబడి పెడతారు.జియోపాలిటికల్ పరిస్థితులు: యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు వంటి పరిస్థితుల్లో ప్రజలు సురక్షిత పెట్టుబడులను ఆశ్రయిస్తారు. కాబట్టి వెండి ధరలు పెరుగుతాయి.ప్రభుత్వ విధానాలు: దిగుమతి సుంకాలు, పన్నులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కూడా వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.

The AI Shift How to Stay Relevant in a Changing Job Market2
డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా?

ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో మాంద్యం, కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపలేదు. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న AI కూడా ప్రతి ఉద్యోగాన్ని సమానంగా ప్రభావితం చేయదు. ఈ పరిస్థితుల్లో నిలబడే వారు ఎవరు అంటే?.. తమ ఉద్యోగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నవారు. ముఖ్యంగా.. యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేని పనులను చేసే వారు భవిష్యత్తులో విజయవంతంగా ముందుకు సాగుతారు.AI సులభంగా చేసే పనులు➤డేటా ప్రాసెసింగ్➤ప్యాటర్న్ గుర్తింపు➤కంటెంట్ తయారీ➤నియమాల ప్రకారం పనిచేయడంవీటన్నింటిని ఏఐ సులభంగా చేయగలదు. అంటే.. ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. లేదా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మంచిది. లేకుంటే ఏ సమయంలో అయినా ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.AI చేయలేని పనులుAI ఎంత అభివృద్ధి చెందినా.. అన్ని రంగాల్లో, అన్ని పనులను చేస్తుందని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏఐ సమర్థవంతంగా చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో..భావోద్వేగ నైపుణ్యం: మనుషుల భావాలు అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం AIకు కష్టం.నిర్ణయాలు: నైతికత, అనుభవం, పరిస్థితుల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు AIకి సవాలు.ఉన్నత స్థాయి క్రియేటివిటీ: “ఏం చేయాలి?” అనే ఆలోచన మనిషి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించలేదు.అనూహ్య పరిస్థితుల్లో నైపుణ్యం: ఉదాహరణకు.. ఒక ప్లంబర్ పని. ప్రతిసారీ ఒకే సమస్య తలెత్తదు. ప్రతిసారీ కొత్త సమస్య పుడుతుంది.సురక్షితమైన ఉద్యోగాలు / AI ప్రభావం తక్కువగా ఉండే రంగాలు➜హెల్త్‌కేర్: డాక్టర్లు, నర్సులు, థెరపిస్టులు➜ట్రేడ్స్: ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్➜మెంటల్ హెల్త్: కౌన్సిలర్, సైకాలజిస్టు➜AI రంగం: AI ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ➜కాంప్లెక్స్ సర్వీసెస్: లాయర్లు, స్ట్రాటజిస్టులు➜క్రియేటివ్ రంగం: బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ డైరెక్షన్ఏఐ అధికంగా విజృంభిస్తున్న కాలంలో.. ఏ మాత్రం భయపడకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే.. ఉద్యోగం సురక్షితంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఏఐ కూడా ఎదుర్కోలేని రంగాన్ని మీరు ఎంచుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలరు.

Oracle Layoffs Spark Outrage Amid Surge in H1B Hiring3
అందుకేనా 'ఒరాకిల్‌'లో ఉద్యోగుల తొలగింపు!

ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ వేలాది ఉద్యోగులను తొలగించిన విషయం పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన మరువకముందే.. కంపెనీ విదేశీ ఉద్యోగులను నియమించడానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధమైంది.యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)కు సంబంధించిన ఫెడరల్ డేటా ప్రకారం.. ఒరాకిల్ 2025-26 ఆర్థిక సంవత్సరాలలో H-1B కార్మికులను నియమించుకోవడానికి సుమారు 3,126 పిటిషన్లు దాఖలు చేసింది. ఇందులో 2026లో మాత్రమే 436 దరఖాస్తులు ఉన్నాయి.టెక్నాలజీ, రక్షణ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న విదేశీ ఉద్యోగులను కంపెనీ నియమించుకోవచ్చు. అయితే... అంతకంటే ముందు సంస్థలో అదే నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు లేరని సంస్థ నిరూపించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఒరాకిల్ భారీ లేఆఫ్స్ చేపట్టిందని చెబుతున్నారు.ఒరాకిల్ ఉద్యోగుల తొలగింపులు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చాలామంది ఉద్యోగులు అకస్మాత్తుగా తమ ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీ పంపిన ఈమెయిల్‌లో సంస్థ అవసరాల దృష్ట్యా మీ ఉద్యోగాన్ని రద్దు చేస్తున్నామని తెలియజేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారికి కొంతమేర పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ఒరాకిల్ కంపెనీ కంటే ముందు.. అమెజాన్ కూడా 16000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే సమయంలో 2675 H-1B పిటిషన్లు దాఖలు చేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఇది పెద్ద కంపెనీలు అనుసరిస్తున్న ఒక సాధారణ ధోరణిగా కనిపిస్తోంది. దీనిని అమెరికాలో చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ ఉద్యోగులను ఎక్కువగా నియమించడం వల్ల స్థానిక అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలు తగ్గుతున్నాయని వారు భావిస్తున్నారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే?

Myntra CEO Nandita Sinha to Leave4
మింత్రా సీఈఓ రాజీనామా!

ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ఆన్‌లైన్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్ 'మింత్రా' చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) నందితా సిన్హా రాజీనామా చేయనున్నారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించేందుకు కంపెనీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని, రాబోయే రోజుల్లో ఒక అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.దాదాపు 13 సంవత్సరాల క్రితం ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో అసోసియేట్ డైరెక్టర్‌గా చేరిన నందితా సిన్హా.. ఆ తరువాత కాలంలో ఫర్నీచర్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్, హెల్త్ అండ్ బ్యూటీ వంటి టీమ్స్‌లో పనిచేశారు. మీషోను 2014లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన తరువాత.. 2022లో నందితా దానికి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈమె రాజీనామా చేయడానికి కారణం ఏమిటనే విషయం వెల్లడికాలేదు.ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఐపీఓకు వెళ్లడానికి ముందే తన పదవి నుంచి నందితా సిన్హా వైదొలగనున్నారు. తరువాత.. షారన్ పైస్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.ఎవరీ షారన్ పైస్?షారన్ పైస్ గతంలో మింత్రాలో లీడర్‌షిప్ బాధ్యతలు చేపట్టారు. దదాపు నాలుగు సంవత్సరాలు కంపెనీలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సీబీఓ)గా పనిచేశారు. అంతే కాకుండా గత ఏడేళ్ల కాలంలో ఆయన సంస్థలో వివిధ పదవులలో కొనసాగారు. కంపెనీలో చేరడానికి కంటే ముందు.. అంటే 2014లో ప్రాక్టర్, గాంబుల్‌లో మేనేజర్ పదవుల్లో పనిచేశారు.

Maruti Suzuki 8000 Service Touchpoints At 2030 315
కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మారుతీ సుజుకీ టార్గెట్!

కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ సర్వీస్ నెట్‌వర్క్‌ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 502 సర్వీస్ టచ్‌పాయింట్స్‌ని ఏర్పాటు చేసింది. ఇవి ఎరీనా, నెక్సా వర్క్‌షాప్స్, మారుతీ సుజుకీ సేల్స్‌ అండ్‌ సర్వీస్ పాయింట్స్, సర్వీస్–ఆన్‌–వీల్స్, బాడీషాప్‌–ఆన్‌–వీల్స్‌ ఫార్మాట్లలో ఉన్నాయి.ప్రస్తుతం 5,926గా ఉన్న టచ్‌పాయింట్స్‌ని 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి 8,000కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ హిసాషి టకెయుచి తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే తమకు అవసరమైనప్పుడు స్పేర్‌ పార్ట్స్, సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయనేది కస్టమర్లకు ఒక భరోసాకల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే తమ నెట్‌వర్క్‌ని తీర్చిదిద్దుకుంటున్నట్లు వివరించారు.ఇదిలా ఉండగా.. గుజరాత్‌లోని కొత్త తయారీ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల యూనిట్లకు పెంచుకునేందుకు రూ. 10,189 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు కంపెనీ గత నెలలో వెల్లడించింది. 2030–31 నాటికి 40 లక్షల వార్షికోత్పత్తి సామర్థ్యాన్ని నిర్దేశించుకుంది.

SEBI Chief Warns Against Fake Apps Urges Tech Giants to Protect Investors6
త్వరలో స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహం!

ముంబై: నకిలీ అప్లికేషన్లు(యాప్స్‌)తో స్టాక్‌ మార్కెట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో మదుపరుల రక్షణార్థం గూగుల్, మెటా తదితర టెక్నాలజీ దిగ్గజాలు ఆర్థిక నియంత్రణ సంస్థలతో కలసి పనిచేయాలని సూచించారు.త్వరలోనే మరోసారి స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహానికి వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి మార్కెట్లో వాటాదారులందరికీ రక్షణ కల్పింపంచవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా యూనిక్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 14 కోట్లను తాకినట్లు వెల్లడించారు. మరోపక్క మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) 423 లక్షల కోట్లకు చేరినట్లు తెలియజేశారు. వెరిఫైడ్‌ యాప్‌ లేబుల్‌ను గూగుల్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా పాండే ఈ అంశాలను ప్రస్తావించారు.

Advertisement
Advertisement
Advertisement