Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

LPG Shortage Shuts Down Restaurants in Mumbai Bengaluru Supply Chain Crisis1
గ్యాస్ కష్టాలు.. మూతపడుతున్న రెస్టారెంట్లు!

అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణంగా దేశీయంగా వాణిజ్య ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఫలితంగా ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే ముంబయిలో 20 శాతం హోటళ్లు మూసివేశారు. పరిస్థితి చక్కబడకపోతే మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని హోటళ్లు స్తంభించే ప్రమాదం ఉంది.నగరాల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితిదేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏఆర్‌) అధ్యక్షుడు విజయ్ శెట్టి తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే నగరంలోని 20% హోటళ్లు మూతపడ్డాయి. మరో రెండు రోజుల్లో సరఫరా పునరుద్ధరించకపోతే కనీసం 50% రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేయక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,950 పలుకుతుండటం అదనపు భారంగా మారింది.సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందనే పుకార్ల మధ్య బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ స్పందించింది. ప్రస్తుతానికి రెస్టారెంట్లు తెరిచే ఉంటాయని, అయితే అనిశ్చితిని తట్టుకోవడానికి పనివేళలు తగ్గించాలని, మెనూలో వంటకాలను పరిమితం చేయాలని సూచించింది.హైదరాబాద్‌లో గ్యాస్‌ పంపిణీదారులు ఉన్నస్టాక్‌ను రేషనింగ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారు. ఇక పంజాబ్‌లో ఎల్పీజీ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను దాదాపు నిలిపివేశాయి. జైపూర్‌లో వెడ్డింగ్ క్యాటరింగ్ సేవలకు కనీసం 7 రోజుల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.అసలు కారణం ఏమిటి?భారతదేశం ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుండగా అందులో 62 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూతపడటంతో సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి రావాల్సిన 85-90 శాతం దిగుమతులు నిలిచిపోయాయి. ప్రభుత్వం అందుబాటులో ఉన్న పరిమిత స్టాక్‌ను గృహ వినియోగానికి, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర విభాగాలకు మళ్లిస్తుండటంతో వాణిజ్య రంగం తీవ్రంగా నష్టపోతోంది.రంగంలోకి చమురు మంత్రిత్వ శాఖవాణిజ్య ఎల్పీజీ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ఈ కమిటీ ఓఎంసీల ద్వారా సరఫరా పునరుద్ధరణను పర్యవేక్షించనుంది.ఆతిథ్య రంగం కేవలం ఆహార అవసరాలనే కాక లక్షలాది మందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో జాప్యం జరిగితే అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతులను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: డబుల్‌ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు

Bangladesh Turns to India for Emergency Diesel Imports Amid West Asia War2
బంగ్లాదేశ్‌కు భారత్‌ ఆపన్నహస్తం

పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు దక్షిణ ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన బంగ్లాదేశ్ తన అవసరాల కోసం ఇప్పుడు పూర్తిగా భారత్ వైపు చూస్తోంది. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడంతో తలెత్తిన కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి అత్యవసరంగా డీజిల్ దిగుమతులను వేగవంతం చేసింది.బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) ఛైర్మన్ ముహమ్మద్ రెజానుర్ రెహ్మాన్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్‌తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా 5,000 టన్నుల డీజిల్ సరుకు బంగ్లాదేశ్‌కు చేరుతోంది. భారత్ నుంచి ఏటా 1.8 లక్షల టన్నుల డీజిల్‌ను పైప్‌లైన్ ద్వారా దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఆరు నెలల్లో కనీసం 90 వేల టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అందుతున్న 5,000 టన్నులతో పాటు రాబోయే రెండు నెలల్లో ఆరు నెలలకు సరిపడా కోటాను పూర్తిగా భారత్ నుంచి దిగుమతి చేస్తామని రెహమాన్ తెలిపారు.మూతపడుతున్న యూనివర్సిటీలుబంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ధరలు ఆకాశాన్ని తాకడం, సరఫరా నిలిచిపోవడంతో దేశంలో ఇంధన పరిమితులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేసింది. ల్యాబ్‌లు, ఏసీలు, హాళ్లలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండటమే దీనికి కారణం. ప్రజలు ఇంధనాన్ని నిల్వ చేయకుండా ఉండేందుకు రోజువారీ విక్రయాలపై పరిమితులు విధించారు. స్పాట్ మార్కెట్ నుంచి అత్యధిక ధరలకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్‌ఎన్‌జీ) కొనుగోలు చేస్తోంది.భారత్ పాత్ర కీలకంఅంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మండుతున్న వేళ పొరుగు దేశానికి భారత్ అందిస్తున్న ఈ సహకారం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘వినియోగాన్ని తగ్గించడానికి, ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మరింత కాలం కొనసాగితే బంగ్లాదేశ్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు భారత్ వంటి దేశాలు భరోసాగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డబుల్‌ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు

Indo‑American Discontent with Trump Preference for Biden Policy3
ఏడాది కాలంలోనే సీన్‌ రివర్స్‌!

అమెరికా రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న భారత సంతతి ప్రజలు (ఇండో అమెరికన్లు) డొనాల్డ్‌ ట్రంప్‌ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారా? భారత్‌తో సంబంధాలను నెరపడంలో ట్రంప్ కంటే అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాలు మెరుగని భావిస్తున్నారా? అంటే అవుననే అంటోంది ప్రతిష్టాత్మక ‘కార్నెగీ ఎండోమెంట్’ సర్వే. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఇండో-అమెరికన్లలో ఆయనపై వ్యతిరేకత పెరగడం చర్చనీయాంశమైంది.సర్వే ఏం చెబుతోంది?‘ఇండియన్‌–అమెరికన్‌ యాటిట్యూడ్‌ సర్వే’ పేరుతో ‘కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌’ చేసిన ఈ సర్వేలో ఫలితాల ప్రకారం.. దాదాపు 71 శాతం మంది భారత సంతతి ప్రజలు ట్రంప్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో సంబంధాల విషయంలోనూ 55 శాతం మంది ఆయన తీరును తప్పుబడుతున్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే ట్రంప్ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తుండటం గమనార్హం.బైడెన్ ఎందుకు మెరుగనిపిస్తున్నారు?జో బైడెన్ తన పదవీ కాలంలో భారత్‌తో సంబంధాలను కేవలం వ్యాపార కోణంలో కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యంగా చూశారని మెజారిటీ ఇండో-అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐ-సీఈటీ) ద్వారా రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్‌కు బైడెన్ అండగా నిలిచారు. బైడెన్ హయాంలో వీసా విధానాలు (హెచ్‌1బీ), కమలాహారిస్ వంటి వారిని కీలక పదవుల్లో కూర్చోబెట్టడం ద్వారా భారత సంతతికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.ట్రంప్ 2.0.. పెరిగిన ఆందోళనలుట్రంప్ మొదటి హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇండో-అమెరికన్లలో అసహనాన్ని పెంచుతున్నాయి.భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించడం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై భారత్‌ను హెచ్చరించడం వంటి అంశాలు కేవలం ఇచ్చిపుచ్చుకోవడమనే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం భారతీయ టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది.ట్రంప్ హయాంలో ఆన్‌లైన్ విద్వేషం, వర్ణ వివక్ష పెరిగిందని సగం మందికి పైగా భారత సంతతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: డబుల్‌ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు

Gold and Silver rates on 10 March 2026 in Telugu states4
డబుల్‌ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 10 March 20265
నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 92 పాయింట్లు పెరిగి 24,127 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 334 పాయింట్లు ఎగబాకి 77,905 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.91బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 93.87 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.11 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.83 శాతం పుంజుకుంది.నాస్‌డాక్‌ 1.38 శాతం పెరిగింది.Today Nifty position 10-03-2026(time: 9:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Women Workforce Participation Key to Viksit Bharat 2047 Axis Bank Study6
‘ఆమె’తోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం

వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని యాక్సిస్‌ బ్యాంక్‌ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా చెల్లింపు పనుల్లో కార్మికుల భాగస్వామ్యం ప్రస్తుతమున్న 47 శాతం నుంచి 60 శాతానికి పెరగాలని సూచిస్తూ, ఈ విషయంలో మహిళల పాత్ర ఎంతో అవసరమని సూచించింది. జీ–20 దేశాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు భారత్‌లోనే చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. అందులోనూ వ్యవసాయం, స్వయం ఉపాధి లేదా చెల్లింపుల్లేని పనుల్లోనే మహిళలు ఎక్కువగా భాగస్వాములై ఉన్నట్టు తెలిపింది.దేశవ్యాప్తంగా 42 పట్టణాల్లో కాలేజీ విద్య అర్హత కలిగిన 11,000 మందిని సర్వే చేసి ఈ వివరాలను యాక్సిస్‌ బ్యాంక్‌ విడుదల చేసింది. చదువుకున్న 12.5 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని, 60 శాతం పట్టభద్రులు పారితోíÙకంతో కూడిన పనుల్లో పాలు పంచుకోవడం లేదని ఈ అధ్యయన నివేదిక తెలిపింది. భద్రతా సవాళ్లు..ఉద్యోగాలకు వెళ్లకపోవడానికి భద్రత, రవాణా పరమైన సవాళ్లను మహిళలు ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘వచ్చే 25 ఏళ్ల పాటు జీడీపీ వృద్ధి రేటును 7 శాతం స్థాయిలో కొనసాగేందుకు వీలుగా పారితోíÙకం ఇచ్చే పనుల్లో కారి్మకుల భాగస్వామ్యం తప్పనిసరిగా 47 శాతం నుంచి 60 శాతానికి పెరగాల్సిందే. ఇందుకు గాను మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకం’’అని ఈ నివేదిక వెల్లడించింది. వచ్చే దశాబ్దంలో వృద్ధి అన్నది మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరే విధంగా కెరీర్‌లను తీర్చిదిద్దే సంస్థలకే చెందుతుందని యాక్సిస్‌ బ్యాంక్‌ మానవ వనరుల విభాగం గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజ్‌కమల్‌ వెంపటి పేర్కొన్నారు. 22 శాతం మహిళా కారి్మకుల భాగస్వామ్యం అన్నది సామాజిక లక్ష్యమే కాదని, అత్యంత కీలకమైన ఆర్థిక చోదకమన్నారు.వివాహం, తల్లికావడం వల్ల మహిళలు కెరీర్‌ అవకాశాలను కోల్పోతున్నారని, ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక పేర్కొంది. కనుక ఈ సమస్యలకు పరిష్కారంగా ఉద్యోగాలను రూపొందించాలని సూచించింది. పిల్లల సంరక్షణ విషయంలో మద్దతునిస్తూ, తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు వీలుగా వారిని ప్రోత్సహించాలని అభిప్రాయపడింది. ‘‘ఉద్యోగాలకు డిమాండ్‌ను పెంచాలి. పట్టణ మౌలిక వసతులను మెరుగుపరచాలి. కాలం చెల్లిన చట్టపరమైన అవరోధాలను తొలగించాలి. పిల్లల సంరక్షణ వసతులు, పని ప్రదేశాల్లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలి. అప్పుడే మహిళల భాగస్వామ్యాన్ని పెంచగలం’’అని యాక్సిస్‌ బ్యాంక్‌ ముఖ్య ఆర్థికేవత్త నీలకాంత్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. మహిళలు మరింతగా పనిచేయగలిగిన రంగాల్లో వారికి అవకాశాలు పెంచాలని, పార్ట్‌టైమ్‌ అవకాశాలు కలి్పంచాలని ఈ నివేదిక సూచించింది.ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్‌!?

Advertisement
Advertisement
Advertisement