Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Hyderabad Sees Rising Demand for Vintage Homes1
హైదరాబాద్‌లో పాతకాలపు ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌

కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే సామెత మనలో చాలా మందికి తెలిసిందే.. అయితే చాలా మంది కొత్త విషయానికి ఆకర్షితులయ్యినంతగా.. అలవాటు పడిన పాతదానికి ఆకర్షితులు కారనేది ఒక కోణమైతే.. పాత విషయాన్నీ అలా వదిలేయకుండా నిలబెట్టుకుంటూ.. కొత్త వాటిని తొందరపడి వదులుకోకూడదు అనే మరో కోణాన్నీ ప్రతిబింబిస్తుంది. సరిగ్గా ఇదే చెవికెక్కించుకున్నారో! ఏమో గానీ నగరంలో పాత ఇళ్ల (వింటేజ్‌ హౌస్‌)కు ఆదరణ పెరుగుతోంది. అలాంటి ఇంటి వరండాలో కూర్చుని కబుర్లు చెబుతూ కాఫీ సేవించడం, లివింగ్‌ రూమ్‌లో ఆసీనులై పుస్తక పఠనం చేయడం, మిద్దె మీదకు ఎక్కి నక్షత్రాల నీడలో నచి్చన సంగీతాన్ని ఆస్వాదించడం.. వంటి సంప్రదాయ అభిరుచులన్నీ సిటీలోని ఏ ఆధునిక కేఫ్‌కి వెళ్లినా సుసాధ్యమే. సిటీలో ప్రస్తుతం ఈ తరహా ట్రెండీ కేఫ్స్‌ పాత ఇళ్లలోనే ఏర్పాటవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోనగరంలో నివసించాలి అనుకునేవారు మాత్రమే కాదు.. కేఫ్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్న వారు కూడా ఇళ్లనే అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం కేఫ్స్‌ అంటే ఆహారం, పానీయాలు మాత్రమే అందించే చోటు కాదు.. పాత కథలను చెప్పే కొత్త వేదికలు కూడా. నగరంలో కేఫ్‌ సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఇటీవల ఒక కొత్త ధోరణిని సంతరించుకుంటోంది. పాత ఇళ్లు, బంగ్లాలు హాయిగా, అందమైన గొప్ప కేఫ్‌లుగా రూపాంతరం చెందుతున్నాయి.ఎంత ఓల్డ్‌ అయితే అంత గోల్డ్‌.. వీలైనంత పాత ఇళ్లనే కేఫ్స్‌ కోసం ఎంచుకోవడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కేఫ్స్‌లో 1970ల నాటి హెరిటేజ్‌ విల్లాలు సైతం కేఫ్స్‌గా అవతరించాయి. నగరంలో కేఫ్‌లుగా మారిన ఇళ్లు సాధారణ వాణిజ్య సెటప్‌ల నుంచి ప్రత్యేకంగా నిలుస్తూ ‘ఇంటి నుంచి దూరంగా ఉన్నవారి ఇల్లు’ లాగా సేద తీరుస్తున్నాయి. వీటిలో సూర్యకాంతి ధారాళంగా ప్రవహించే వరండాలు, పాతకాలపు కిటికీలు, ద్వారాలతో గత జీవితాల జాడలను గుర్తుచేస్తాయి. అలా నగరంలో పాత ఇంటి నుంచి కొత్త కేఫ్స్‌గా మారినవి కొన్ని..వారసత్వ నిర్మాణాలు.. 80 ఏళ్ల వయసు గల ఓ పురాతన భవనం బంజారాహిల్స్‌లో ప్రస్తుతం రోస్టరీ కాఫీ హౌస్‌గా ఆధునిక సొబగులు అద్దుకుంది. అతిగా మార్పు చేర్పులు లేకుండా ఈ భవనంలోకి వెళుతుంటే ఓ పాత ఇంట్లోకి అడుగుపెడుతున్న అనుభూతి పొందవచ్చు. ఈ వింటేజ్‌ ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌ను కేఫ్‌గా మార్చారు. దాని పాతకాలపు అందాన్ని చెక్కుచెదరకుండా అలాగే ఉంచిన ఫలితంగా వారసత్వ నిర్మాణాన్ని తాజా కాఫీ సువాసనతో మిళితం చేస్తూ సరికొత్త ఫ్యూజన్‌ ప్లేస్‌గా నిలుస్తోంది. కేరళ తరహా నిర్మాణం.. దాదాపు కేరళ శైలి నిర్మాణాన్ని అనుకరించే వారసత్వ భవనానికి ప్రస్తుతం సృజనాత్మక, కళాత్మకను అద్ది ఆరోమలే కేఫ్‌ పేరిట రూపుదిద్దారు. జూబ్లీహిల్స్‌లోని ఆ ఇంటిలోని తోట సహా నాటి నివాస అనుభూతిని అచ్చంగా భద్రపరిచారు. దీనిని వాణిజ్య అవసరాలతో పునఃరూపకల్పన చేయడానికి బదులుగా, యజమానులు పాత ఇంటిలోని ప్రతి గదినీ చదవడం, సంగీతం, సంభాషణలు, కమ్యూనిటీ సమావేశాల కోసం ప్రత్యేకంగా మార్చారు.గాలి, వెలుతురుకు అనుకూలంగా.. జూబ్లీహిల్స్‌లోనే మరో కేఫ్‌ గ్లాస్‌ హౌస్‌. ఇంటి సుపరిచితమైన లేఅవుట్‌ను కొనసాగిస్తూనే కేఫ్‌గా మారిన నివాస స్థలం. ఇది ఇప్పటికీ ఇల్లులా కనిపిస్తుంది. వరండా, ప్రాంగణం సీటింగ్‌ ప్రదేశంగా మారింది. అలాగే ఒకదానితో ఒకటి అనుసంధానించిన ‘గదులు‘ ఉన్నాయి. గాలి, వెలుతురు ధారాళంగా ప్రవహిస్తూ ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తాయి. సైనిక్‌పురిలో ఉన్న దిస్‌ ఈజ్‌ ఇట్‌ కూడా దాని గత గృహశైలి లేఅవుట్‌ను యథాతథంగా ఉంచింది. లైటింగ్‌తో నివాస భవనాన్ని తలిపించేలా ఆలోచనాత్మకంగా పునర్‌నిర్మితమైంది.అబ్బురపరిచే ఆర్కిటెక్చర్‌.. ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్‌ నివేదిక ప్రకారం 1970లో నిర్మించిన ఇంటి లోపల ఏర్పాటైంది రేషియో. జూబ్లీహిల్స్‌లో ఇటీవలే ప్రారంభమైన ఈ కేఫ్‌ను దాని పురాతన ఆత్మను నిలుపుకునేలా ఆలోచనాత్మకంగా వాస్తుశిల్పులు పునఃరూపకల్పన చేశారు. పొడవైన పైన్‌–వుడ్‌ కిటికీలు, సూర్యకాంతి పడేలా ప్రత్యేక స్థలాన్ని ప్రవేశపెట్టారు. అదే సమయంలో అసలు ఇంటి సారం చెక్కుచెదరకుండా ఉంచారు.అలంకరణలు చెక్కు చెదరకుండా.. హిమాయత్‌నగర్‌లోని మిరోసా కేఫ్‌ మరో నివాస విల్లా. ఇది ఓపెన్‌ సీటింగ్‌తో రెండు అంతస్తుల లేఅవుట్‌. సన్నిహిత సీటింగ్, వెచ్చని రంగుల పాలెట్‌.. అతిథులకు సుపరిచితమైన ఇంటి అనుభూతిని ఇస్తుంది. ఫిల్మ్‌ నగర్‌లోని వైబేయార్డ్‌ బిస్ట్రో కేఫ్‌లోని ఆక్సైడ్‌ గోడలు, చెక్క తలుపులు/ కిటికీలు, విశాలమైన గార్డెన్‌.. పురాతన ఇంటి అనుభవాన్ని అందిస్తాయి.జూబ్లీ హిల్స్‌లోని ది ఫిఫ్త్‌ స్ట్రీట్‌ కేఫ్‌ ఇదే కోవకు చెందింది. చెక్క అలంకరణలు, ఒకదానితో ఒకటి అనుసంధానించిన గదులు, ఇంటి ఫీల్‌ను సజీవంగా ఉంచుతాయి.

Yamaha Recalls Over 3 Lakh Scooters in India Due to Front Brake Issue2
3 లక్షల యమహా స్కూటర్లు రీకాల్‌..

యమహా మోటార్ ఇండియా కంపెనీ 3 లక్షలకు పైగా స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రేజెడ్‌ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ మోడళ్లకు చెందిన స్కూటర్లు ఉన్నాయి.2024 మే 2 నుంచి 2025 సెప్టెంబర్ 3 మధ్య తయారైన 125 సీసీ స్కూటర్ మోడళ్లలో మొత్తం 3,06,635 యూనిట్లకు స్వచ్ఛంద రీకాల్ ప్రచారాన్ని కంపెనీ ప్రారంభించింది.కొన్ని ప్రత్యేక ఆపరేటింగ్ పరిస్థితుల్లో, ఎంపిక చేసిన యూనిట్లలో ఫ్రంట్ బ్రేక్ కాలిపర్ పనితీరు పరిమితంగా ఉండే అవకాశం ఉందని గుర్తించడంతో ఈ రీకాల్ చేపట్టినట్లు యమహా వెల్లడించింది. ఈ రీకాల్ పూర్తిగా స్వచ్ఛందంగా చేపట్టినదని యమహా స్పష్టం చేసింది. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ రీకాల్ పరిధిలోకి వచ్చే అన్ని వాహనాలకు సంబంధిత భాగాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా మార్చి ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. రీకాల్ పరిధిలోకి వచ్చే స్కూటర్ల యజమానులను యమహా డీలర్లు నేరుగా సంప్రదిస్తారు. అలాగే వాహన యజమానులు తమ సమీపంలోని అధికారిక యమహా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి, తమ వాహనం రీకాల్‌కు అర్హత కలిగి ఉందో లేదో తెలుసుకోవచ్చు.

Gold and Silver rates on 24th January 2026 in Telugu states3
ఇంకా రెచ్చిపోయిన బంగారం.. తులం ఎంతంటే..

దేశంలో బంగారం ధరలు అంతకంతకూ రెచ్చిపోతున్నాయి. రోజూ రూ.వేలకొద్దీ పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే బంగారం ధరలు(Today Gold Rate)భారీ పెరుగుదలను నమోదు చేశాయి. అయితే వెండి ధరల్లో మాత్రం మిశ్రమ మార్పులు కనిపించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Owning a Home Takes 23 Years of Savings in Hyderabad4
సిటీలో సొంతిల్లు.. పడుతుంది 23 ఏళ్లు!

మెట్రో నగరాల్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే సామాన్య, మధ్యతరగతికే కాదు ధనిక కుటుంబాలకూ పొదుపు తప్పనిసరి. వార్షిక ఆదాయ, పొదుపు, తలసరి వ్యయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న గృహాల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే కనిష్టంగా 23 ఏళ్ల సేవింగ్స్‌ అవసరం. అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే ఏకంగా వందేళ్లకు పైగా పొదుపు చేస్తేనే ఇల్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది.2022–23లో దేశ స్థూల పొదుపు, స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నిష్పత్తి 30.2 శాతంగా ఉంది. దీన్ని ఆధారంగా తీసుకొని.. రాష్ట్రంలోని అత్యంత ధనవంతులైన 5 శాతం మంది సగటు కుటుంబ ఆదాయం, రాష్ట్ర రాజధానిలోని 110 చదరపు మీటర్లు(1,184 చ.అ.) ఇంటి సగటు ధరతో పోల్చి ఈ డేటాను రూపొందించారు.ఠి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నెలవారీ తలసరి వ్యయం(ఆర్బీఐ ఎంపీసీఈ) ప్రకారం హైదరాబాద్‌లో ఐదు శాతం ధనిక కుటుంబాల వార్షిక ఆదాయం రూ.12.5 లక్షలుగా ఉంది. దీనికి ఆయా ఫ్యామిలీలకు 30.2 శాతం పొదుపు రేటును వర్తింపజేస్తే వారి వార్షిక పొదుపు దాదాపు రూ.3.8 లక్షలుగా ఉంటుంది. నేషనల్‌ హౌసింగ్‌ బోర్డ్‌ (ఎన్‌హెచ్‌బీ) డేటా ప్రకారం 645 చ.అ. నుంచి 1,184 చ.అ. మధ్య కార్పెట్‌ ఏరియా ఉన్న ఇంటి చ.అ. ధర గతేడాది మార్చిలో రూ.89 లక్షలుగా ఉంది. అంటే ఈ లెక్కన ఏడాదికి రూ.3.8 లక్షల పొదుపుతో రాష్ట్ర రాజధానిలోని టాప్‌–5 అర్బన్‌ కుటుంబాలు ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి కనిష్టంగా 23 ఏళ్లు పొదుపు చేయాల్సి ఉంటుంది.ఢిల్లీలో 35 ఏళ్ల పాటు.. ఇదే విధమైన లెక్కల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఇల్లు కొనాలంటే 35 ఏళ్ల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గృహ ప్రవేశం చేయాలంటే ఏకంగా 109 ఏళ్ల పాటు సేవింగ్స్‌ చేయాల్సిందే. దేశంలో పది కంటే ఎక్కువ రాష్ట్రాల రాజధానుల్లో ఇల్లు కొనాలంటే 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పడుతుంది. వీటిల్లో ముంబై, గుర్గావ్, భువనేశ్వర్, పాట్నా, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో, డెహ్రాడూన్‌ రాజధానులు ఉన్నాయి.దక్షిణాదిలో మన దగ్గరే తక్కువ..దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, విశాఖపట్నంతో పోలిస్తే భాగ్యనగరంలోనే తక్కువ కాలం పొదుపు చేస్తే సరిపోతుంది. చెన్నైలో 37 ఏళ్ల పాటు సేవింగ్స్‌ చేస్తేనే గృహ ప్రవేశం చేయవచ్చు. ఇక, బెంగళూరులో 36 ఏళ్లు, తిరువనంతపురం, విశాఖపట్నంలలో 26 సంవత్సరాలు పొదుపు చేస్తే సొంతిల్లు సొంతవుతుంది. ఇక, అత్యల్పంగా కేవలం 15 ఏళ్ల పొదుపుతో సొంతింటి కలను సాకారం చేసుకునే ఏకైక నగరం చంఢీగడ్‌. ఆ తర్వాత 16 ఏళ్లతో జైపూర్‌ నగరాలున్నాయి.

Why RBI Has Hit Pause on Gold Buying?5
కొన్నది కొంతే.. ఆర్బీఐకి బంగారం చేదైందా?!

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ పసిడి కొనుగోళ్లను పెంచుకుంటుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాత్రం తగ్గిస్తోంది. 2025లో ఆర్బీఐ తన బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, 2025లో ఆర్బీఐ కేవలం 4.02 టన్నుల బంగారమే కొనుగోలు చేసింది. ఇది 2024లో కొనుగోలు చేసిన 72.6 టన్నులతో పోలిస్తే దాదాపు 94 శాతం భారీ తగ్గుదల.ప్రపంచ కేంద్ర బ్యాంకుల ధోరణిప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఇటీవలి సంవత్సరాల్లో బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. 2025 డిసెంబర్ నాటికి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల వద్ద మొత్తం 32,140 టన్నుల బంగారం ఉంది. ఇక కొనుగోళ్ల విషయానికి వస్తే 2022లో అన్ని కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 1,082 టన్నులు కాగా 2023లో 1,037 టన్నులుగా ఉన్నాయి. 2024లో రికార్డు స్థాయిలో 1,180 టన్నులకు చేరాయి. 2025లోనూ 1,000 టన్నులకుపైగా ఉంటాయని అంచనా.అయితే, కొనుగోళ్లు తగ్గినప్పటికీ ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారు 880.2 టన్నుల బంగారం ఉంది. 2025 నవంబర్ నాటికి ఈ బంగారం నిల్వల విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది.విదేశీ మారక నిల్వల్లో పెరిగిన బంగారం వాటాభారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా కూడా గణనీయంగా పెరిగింది. ఒక సంవత్సరంలో బంగారం వాటా 10% నుంచి 16%కి పెరిగింది. 2021 మార్చిలో ఇది కేవలం 5.87% మాత్రమే. అంటే, గత ఐదేళ్లలో ఆర్బీఐ తన నిల్వల్లో బంగారం ప్రాధాన్యతను దాదాపు మూడు రెట్లు పెంచింది.కొనుగోళ్లు ఎందుకు తగ్గాయి?బంగారం ధరలు అత్యధికంగా ఉండటం, అలాగే ఆర్బీఐ నిల్వల్లో ఇప్పటికే బంగారం వాటా గణనీయంగా పెరగడం వల్ల, ఇప్పుడు ఆర్బీఐ కొత్త కొనుగోళ్ల కంటే ఉన్న నిల్వల సమతుల్య నిర్వహణపై దృష్టి పెడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.ఆర్బీఐ బంగారం ఎక్కడ ఉంది?ఆర్బీఐకి చెందిన బంగారం మొత్తం భారతదేశంలోనే నిల్వ ఉండదు. 2025 మార్చి నాటికి భారత్‌ మొత్తం బంగారం నిల్వలు 879.59 టన్నులు కాగా ఇందులో భారత్‌లో నిల్వ చేసింది సుమారు 512 టన్నులు. మిగిలిన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద భద్రపరిచింది. కొంత భాగం బంగారం నిక్షేపాల (Gold Deposits) రూపంలో కూడా ఉంది.

Studio Apartments The New Real Estate Income Model6
ఆదాయ మార్గం.. స్టూడియో అపార్ట్‌మెంట్

స్థిరాస్తి రంగానికి తుది వినియోగదారులతో పాటు పెట్టుబడిదారులు కూడా ముఖ్యమే. అంతిమ కొనుగోలుదారులతో పోలిస్తే ఆదాయ మార్గంగా ఇన్వెస్టర్లు రియల్టీలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తుండటంతో ధరలు వేగంగా పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇల్లు, ఆఫీసు, రిటైల్, వేర్‌హౌస్‌ల మాదిరిగానే పెట్టుబడిదారులకు స్టూడియో అపార్ట్‌మెంట్లు కూడా ఆదాయ మార్గంగా మారాయి. ప్రధానంగా మెట్రో నగరాల్లో స్టూడియో అపార్ట్‌మెంట్లు హాట్‌ ఫేవరెట్స్‌గా మారాయి. –సాక్షి, సిటీబ్యూరోఎవరు కొంటారంటే? సాధారణంగా బెడ్‌ కమ్‌ లివింగ్‌ రూమ్, కిచెన్, అటాచ్‌డ్‌ బాత్‌రూమ్‌ ఉండే వాటిని స్టూడియో అపార్ట్‌మెంట్‌ అంటారు. వీటిని అధికంగా విద్యార్థులు, బ్యాచిలర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు కొనుగోలు చేస్తుంటారు. ఈ తరహా అపార్ట్‌మెంట్లకు విస్తీర్ణం పరంగా కాకుండా లొకేషన్‌ ఆధారంగా డిమాండ్‌ ఉంటుంది. ఉపాధి, వ్యాపార కేంద్రాల పరిసర ప్రాంతాలలో, పర్యాటక కేంద్రాలకు చేరువలో, ఖరీదైన ప్రదేశాలలో ఉండే స్టూడియో అపార్ట్‌మెంట్లకు గిరాకీ అధికంగా ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.మన దగ్గర తక్కువే.. కరోనా తర్వాత విశాలమైన ఇళ్లకు ఆదరణ పెరగడంతో స్టూడి యో అపార్ట్‌మెంట్ల కస్టమర్లు పునరాలోచనలో ఉన్నారు. సాధారణంగా ఈ తరహా అపార్ట్‌మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్‌ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాలలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్‌ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాలలో లాంచింగ్‌ అయిన స్టూడియో అపార్ట్‌మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే.. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో అపార్ట్‌మెంట్ల ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి.

Advertisement
Advertisement
Advertisement