Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and silver prices saw an increase1
మళ్లీ ట్రెండ్‌లోకి వెండి

న్యూఢిల్లీ: జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి వరుసగా మూడు రోజుల పాటు తీవ్ర పతనాన్ని చూసిన వెండి, బంగారం ధరలు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాల మధ్య ఢిల్లీ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ర్యాలీ చేశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.24,000 పెరిగి (9.23 శాతం) రూ.2.84 లక్షలకు (పన్నులతో కలుపుకుని) చేరింది. పసిడి సైతం 10 గ్రాములకు రూ.5,000 లాభపడి (3.3 శాతం) రూ.1,57,700 స్థాయిని తాకింది. జనవరి 29న వెండి రూ.4,04,500 వద్ద, పసిడి సైతం రూ.1,83,000 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్టాలను నమోదు చేయడం తెలిసిందే.కొనుగోళ్ల మద్దతు.. ‘‘బంగారం ఇటీవలి నష్టాలను మంగళవారం కొంత భర్తీ చేసుకుంది. వెండి ధర సైతం గణనీయంగా పెరిగింది. రెండు రోజుల భారీ విక్రయాలతో ధరలు క్షీణించడాన్ని ఇన్వెస్టర్లు చక్కని అవకాశంగా చూశారు’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. దీర్ఘకాల పొజిషన్లు తీసుకునేందుకు దిద్దుబాటు కోసం వేచి చూసిన ఇన్వెస్టర్లు.. ధరలు దిగిరావడాన్ని అవకాశంగా భావించినట్టు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి స్పాట్‌ ధర ఔన్స్‌కు 9.55 డాలర్లు (12.07) పుంజుకుని 88.77 డాలర్లకు చేరింది.బంగారం సైతం ఔన్స్‌కు (31.10 గ్రాములు) 275 డాలర్లు లాభపడి (5.91 శాతం) 4,935.49 డాలర్ల స్థాయిని తాకింది. బంగారం, వెండికి అధిక మార్జిన్లు అవసరం కావడం, ఈ ఏడాది మేలో ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ పదవీ కాలం ముగిసే వరకూ రేట్ల సవరణ ఉండదన్న అంచనాలు, రేట్ల పరంగా కఠిన దృక్పథం కలిగిన వార్‌‡్షను కొత్త చైర్మన్‌గా ప్రతిపాదించడం క్రితం మూడు సెషన్లలో బంగారం, వెండిలో విక్రయాలకు దారితీసినట్టు కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీ ఏవీపీ కేనత్‌ చైన్‌వాలా వివరించారు. వీటి ధరలు సమీప కాలంలో అస్థిరంగానే ఉండొచ్చన్నారు.

Adani Ports Q3 net profit rises 21 Percentage to Rs 3043 crore2
అదానీ పోర్ట్స్‌ లాభం జూమ్‌ క్యూ3లో రూ. 3,043 కోట్లు

న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ. 3,043 కోట్లను తాకింది. కార్గో హ్యాండ్లింగ్‌ బిజినెస్‌లో వృద్ధి కారణంగా ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,518 కోట్లు మాత్రమే ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 7,964 కోట్ల నుంచి రూ. 9,705 కోట్లకు బలపడింది. ఇది 22 శాతం అధికంకాగా.. దేశీ పోర్టుల నుంచి రూ. 6,701 కోట్లు, అంతర్జాతీయ పోర్టుల నుంచి రూ. 1,067 కోట్లు చొప్పున టర్నోవర్‌ సాధించింది. ఈ కాలంలో కార్గో హ్యాండ్లింగ్‌ 9 శాతం పుంజుకుని 123 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరింది. పూర్తి ఏడాదికి రూ. 11,000– 12,000 కోట్ల పెట్టుబడి వ్యయాలపై దృష్టి పెట్టింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 9 %పైగా జంప్‌చేసి రూ. 1,531 వద్ద ముగిసింది.లియోనార్డోతో అదానీ గ్రూప్‌ భాగస్వామ్యం న్యూఢిల్లీ: భారత్‌లో సమగ్ర హెలికాప్టర్ల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇటాలియన్‌ దిగ్గజం లియోనార్డోతో అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ చేతులు కలిపింది. భారత సాయుధ బలగాలకు అవసరమైన ఉత్పత్తులను, ముఖ్యంగా లియోనార్డోకి చెందిన ఏడబ్ల్యూ169ఎం, ఏడబ్ల్యూ109 ట్రెకర్‌ఎం హెలికాప్టర్లకి సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు, మెయింటెనెన్స్‌–రిపేర్‌–ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌వో) సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు, పైలట్లకు శిక్షణనిచ్చేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని అదానీ గ్రూప్‌ తెలిపింది.

Rupee Rallies 117 Paise to 90. 32 Per Dollar on India-US Trade Deal3
రూపాయి రయ్‌.. రయ్‌..!

ముంబై: భారత్‌–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో మంగళవారం రూపాయి విలువ భారీ ర్యాలీ చేసింది. డాలర్‌ మారకంలో ఏకంగా 117 పైసలు బలపడి రెండున్నర వారాల గరిష్టం 90.32 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ 2.50% పెరగడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు దేశీయ కరెన్సీ ర్యాలీకి సహకరించాయి.ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 90.30 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 144 పైసలు ర్యాలీ చేసి 90.05 గరిష్టాన్ని తాకింది. అలాగే 90.52 స్థాయి కనిష్టానికి దిగివచి్చంది. ‘‘అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమనం మొదలవుతుంది. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల రాకతో రూపాయిపై ఒత్తిడి తగ్గుతుంది’’ అని ఫారెక్స్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Yamaha EC-06 India Launch: Premium EV Scooter Enters Market at Rs 1. 67 Lakh4
యమహా ఈసీ06

చెన్నై: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం యమహా మోటర్స్‌ దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్లోకి ప్రవే శించింది. తమ తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈసీ–06ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,67,600గా (ఢిల్లీ ఎక్స్‌షోరూం రేటు) ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఒక్కసారి చార్జి చేస్తే ఇది 169 కి.మీ. వరకు రేంజినిస్తుంది. ముందుగా ఎంపిక చేసిన నగరా ల్లో కంపెనీ కి చెందిన బ్లూ స్క్వేర్‌ షోరూంల ద్వారా ఈ స్కూటర్లను విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. పర్యావరణహితమైన అర్బన్‌ మొబిలిటీ దిశగా తమ సంస్థ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయని యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ చైర్మన్‌ హజిమె యోటా తెలిపారు.

Deloitte Manager in Hyderabad Paying Rs 50000 Rent for 3BHK And Know The Details5
ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్ బెస్ట్!.. డెలాయిట్ మేనేజర్

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది. రెంట్ ఎక్కువైనా.. హైదరాబాద్ బెస్ట్ అంటున్నారు.. డెలాయిట్ కన్సల్టింగ్‌లో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌ 'కోమల్ ఝా'.కోమల్ ఝా.. డెలాయిట్ కన్సల్టింగ్‌లో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్. బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌కు చెందిన ఈమె ఉద్యోగ రీత్యా.. ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించింది. గత తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న కోమల్ ఝా.. భర్త & కుమార్తెతో కలిసి ఒక 3BHK ఇంట్లో ఉంటున్నారు. ఇతర మహానగరాలతో పోలిస్తే, హైదరాబాద్ జీవనశైలి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా వర్క్-లైఫ్ మధ్య మంచి సమతుల్యత కల్పిస్తుందని ఆమె చెబుతున్నారు.ఖర్చుల విషయానికి వస్తే.. 3BHK ఇల్లు అద్దె నెలకు రూ.50వేలు, పనిమనిషికి రూ.20వేలు.. ఎలక్ట్రిక్, వాటర్, యుటిలిటీ కోసం మరో 10వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కూతురు చదువు కోసం ఇంకో రూ. 30వేలు కేటాయిస్తుంది. కిరాణా సరుకులు & వంటింటి అవసరాల కోసం నెలకు సుమారు రూ.15,000 ఖర్చవుతుంది. అంటే నెలకు దాదాపు రూ.1.25 లక్షలు ఖర్చు అవుతుందన్న మాట. ప్రతి నగరంలో లాభాలు, నష్టాలు ఉన్నప్పటికీ.. జీవన నాణ్యత దృష్ట్యా హైదరాబాద్‌ను తాను ఎక్కువగా ఇష్టపడతున్నట్లు కోమల్ ఝా పేర్కొన్నారు.

Gold and Silver Price Hike Again in India Know The Latest Rates6
మళ్లీ పుంజుకున్న గోల్డ్, సిల్వర్: కొత్త ధరలు ఇలా..

జనవరి 30 నుంచి భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేటు మళ్లీ పెరుగుదల దిశగా పయనించింది. ఈ రోజు (మంగళవారం) ఉదయం రూ. 151750 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మారిపోయింది. దీంతో పసిడి కొనుగోలుదారుల్లో మరోమారు ఒకింత ఆందోళన మొదలైంది. అయితే ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,53,930 (రూ.760 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,41,100 వద్ద (రూ. 700 పెరిగింది) ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ.740 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ.700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,54,080 రూపాయల దగ్గర, 22 క్యారెట్స్ తులం పసిడి ధర రూ.1,41,250 వద్ద నిలిచాయి.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయానికి వస్తే.. ఇక్కడ బంగారం ధర దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3,490 రూపాయలు పెరిగి రూ.1,55,670 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ తులం రేటు 3200 రూపాయలు పెరిగి రూ.1,42,700 వద్దకు చేరింది.సిల్వర్ రేటుమంగళవారం ఉదయం రూ.20 వేలు తగ్గిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి అంతే పెరిగింది (రూ.20,000 పెరిగింది). దీంతో రూ. 2.80 లక్షల దగ్గర ఉన్న కేజీ వెండి రేటు రూ. 3 లక్షలకు చేరింది.ఇదీ చదవండి: జియో, ఎయిర్‌టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!

Advertisement
Advertisement
Advertisement