ప్రధాన వార్తలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు కేవలం ముడి చమురు ధరలే కాదు అంతకుమించిన పెను సంక్షోభం ముంచుకొస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని హార్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన రంగంతోపాటు ప్రపంచ ఆహార భద్రతను, పారిశ్రామిక ఉత్పత్తిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎరువులు, సల్ఫర్, పారిశ్రామిక లోహాల సరఫరా గొలుసు విచ్ఛిన్నం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.1,150 శాతం పెరిగిన ధరలుప్రపంచ పారిశ్రామిక రంగానికి లైఫ్ లైన్ వంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆర్గస్ ప్రైసింగ్, యూఎస్ జియోలాజికల్ సర్వే గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లతో పోలిస్తే చైనా సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఏకంగా 1,150 శాతం పెరిగాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సల్ఫర్ ధరల్లో 750 శాతం పెరుగుదల నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారు అయిన చిలీలో ధరలు 230 శాతం పెరిగాయి.సల్ఫ్యూరిక్ యాసిడ్ లేకుండా ఎరువుల ఉత్పత్తి, రాగి ప్రాసెసింగ్, బ్యాటరీల తయారీ, సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్ అసాధ్యం. ప్రపంచ సల్ఫర్ ఎగుమతుల్లో సగానికి పైగా పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుండటంతో హార్మూజ్ జలసంధి మూసివేత ఈ సరఫరాను పూర్తిగా స్తంభింపజేసింది.చమురు సంక్షోభంసౌదీ ఆరామ్కో సీఈఓ అమిన్ నాసర్ ఈ పరిస్థితిని ‘ప్రపంచం ఇప్పటివరకు చూడని అతిపెద్ద ఇంధన సరఫరా షాక్’గా అభివర్ణించారు. గతంలో రోజుకు 70 నౌకలు ప్రయాణించే హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పుడు కేవలం 2 నుంచి 5 నౌకలు మాత్రమే వెళ్తున్నాయి. సుమారు 240 నౌకలు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి.ప్రతి వారం ప్రపంచ మార్కెట్లు 100 మిలియన్ బ్యారెళ్ల చమురును కోల్పోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 1 బిలియన్ బ్యారెళ్ల సరఫరాకు అంతరాయం కలిగింది. అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వలు 1982 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ హెచ్చరించింది.ఎరువుల కొరతతో ఆహార సంక్షోభంచమురు కంటే ఎరువుల సంక్షోభమే అత్యంత భయంకరంగా ఉండబోతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో మూడింట ఒక వంతు హార్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఖతార్ ఫెర్టిలైజర్ కంపెనీ ఇప్పటికే ‘ఫోర్స్ మేజర్’(నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితుల వల్ల పనిని పూర్తి చేయలేకపోవడం) ప్రకటించగా, నెలకు 3-4 మిలియన్ టన్నుల ఎరువుల సరఫరా నిలిచిపోయింది.భారత్ ఇప్పటికే మూడు యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించగా బంగ్లాదేశ్ ఐదు ప్లాంట్లలో నాలుగింటిని మూసివేసింది. బ్రెజిల్లో యూరియా దిగుమతులు 33 శాతం పడిపోయాయి. ఈ సరఫరా అంతరాయం కొనసాగితే వచ్చే కొద్ది నెలల్లోనే 4.5 కోట్ల మంది తీవ్ర ఆకలి బారిన పడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ఆందోళన వ్యక్తం చేసింది.పారిశ్రామిక రంగంపై ప్రభావంకేవలం వ్యవసాయమే కాదు, హైటెక్ పరిశ్రమలు కూడా చిక్కుల్లో పడ్డాయి. సెమీకండక్టర్లకు అవసరమైన హీలియం సరఫరా నిలిచిపోయింది. సల్ఫర్ కొరత కారణంగా ఇండోనేషియాలో నికెల్ ప్రాసెసింగ్ నిలిచిపోయింది. ఇది నేరుగా ఈవీ బ్యాటరీల తయారీపై దెబ్బకొడుతోంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలుఒకవైపు ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంటే, మరోవైపు అగ్రరాజ్యాల మధ్య దౌత్యపరమైన వేడి పెరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనలను తోసిపుచ్చడం, అమెరికా అణు జలాంతర్గామి జిబ్రాల్టర్ చేరుకోవడం వంటి పరిణామాలు యుద్ధ మేఘాలను సూచిస్తున్నాయి. మే 14-15 తేదీల్లో ట్రంప్ బీజింగ్ పర్యటనపైనే ఇప్పుడు ప్రపంచం ఆశలు పెట్టుకుంది.మార్కెట్లు కేవలం చమురు ధరల పెరుగుదలను మాత్రమే అంచనా వేస్తున్నాయి. కానీ తెరవెనుక ఎరువులు, సల్ఫర్ కొరత సృష్టిస్తున్న విధ్వంసం ఇంకా అంచనాలకు అందడం లేదు. ఒకవేళ జూన్ మధ్య నాటికి హార్మూజ్ జలసంధిలో పరిస్థితులు చక్కబడకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2027 వరకు కోలుకోవడం కష్టమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన
బంగారమా.. ఈరోజు కొంటామా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు పెరిగి 23,571 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 427 పాయింట్లు పుంజుకుని 75,062 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.49బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.58 శాతం పెరిగింది.నాస్డాక్ 1.2 శాతం పుంజుకుంది.Today Nifty position 14-05-2026(time: 09:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫాక్స్కాన్పై సైబర్ దాడి
అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో సరఫరా గొలుసు భద్రతపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. యాపిల్ సంస్థకు ప్రధాన తయారీ భాగస్వామి అయిన ఫాక్స్కాన్పై భారీ సైబర్ దాడి జరిగినట్లు ఆ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. ఉత్తర అమెరికాలోని పలు ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ రాన్సమ్వేర్ దాడిలో యాపిల్తో పాటు గూగుల్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థల రహస్య ప్రాజెక్ట్ ఫైళ్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.8టీబీ డేటా మాయం..ప్రముఖ రాన్సమ్వేర్ ముఠా ‘నైట్రోజన్’ ఈ దాడికి బాధ్యత వహిస్తూ సంచలన ప్రకటన చేసింది. ఫాక్స్కాన్ సర్వర్ల నుంచి సుమారు 1.1 కోట్ల ఫైళ్లు, అంటే దాదాపు 8 టెరాబైట్ల డేటాను తాము దొంగిలించినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. ఇందులో కేవలం ఫాక్స్కాన్ అంతర్గత సమాచారమే కాకుండా కొన్ని సంస్థల కీలక పత్రాలు ఉన్నాయని హ్యాకర్లు చెబుతున్నారు. అందులో..యాపిల్: భవిష్యత్తులో విడుదల కాబోయే పరికరాల సాంకేతిక డ్రాయింగ్లు.ఇంటెల్, ఎన్విడియా: సెమీకండక్టర్ డిజైన్లు, చిప్సెట్ మాన్యుస్క్రిప్ట్లు.గూగుల్, డెల్: అంతర్గత ప్రాజెక్ట్ పత్రాలు, రహస్య ఆదేశాలు.అప్రమత్తమైన టీమ్సైబర్ దాడిని గుర్తించిన వెంటనే ఫాక్స్కాన్ సెక్యూరిటీ టీమ్ అప్రమత్తమైంది. అత్యవసర సహాయక చర్యలు చేపట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ దాడుల వల్ల ఉత్పత్తి, డెలివరీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రభావితమైన ప్లాంట్లు దశలవారీగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి’ అని చెప్పింది. అయితే, వినియోగదారుల వ్యక్తిగత డేటా ఏదైనా లీక్ అయిందా అనే అంశంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.ఏమిటీ నైట్రోజన్ గ్యాంగ్..సైబర్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ నైట్రోజన్ రాన్సమ్వేర్ రష్యా మద్దతున్న ‘కాంటి’ గ్రూప్ కోడ్ నుంచి ఉద్భవించింది. 2023లో వెలుగులోకి వచ్చిన ఈ ముఠా ప్రధానంగా వీఎమ్వేర్ ఈఎస్క్సీ వంటి వర్చువలైజేషన్ సిస్టమ్స్ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ సాఫ్ట్వేర్లో ఉన్న సాంకేతిక లోపాల వల్ల బాధితులు హ్యాకర్లకు డబ్బు చెల్లించినా డేటా తిరిగి వస్తుందనే గ్యారెంటీ లేదని భద్రతా సంస్థ కోవైర్ హెచ్చరించింది.ఫాక్స్కాన్కు గతంలో..ఫాక్స్కాన్పై సైబర్ దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఈ సంస్థ హ్యాకర్ల బారిన పడింది. 2022 మెక్సికోలోని ఫాక్స్కాన్ అనుబంధ సంస్థపై లాక్బిట్ దాడి జరిగింది. 2024 ప్రారంభంలో ఫాక్స్కాన్ గ్రూప్లోని సెమీకండక్టర్ విభాగం ‘ఫాక్స్సెమికాన్’లో డేటా లీక్ అయింది.యాపిల్ మౌనం..యాపిల్ తన తయారీ భాగస్వాములకు ఇచ్చే సమాచారం విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. ఏయే భాగాలను ఎలా అసెంబ్లీ చేయాలో మాత్రమే అందించి సాంకేతిక సమాచారాన్ని పరిమితంగా పంచుకుంటుంది. అయినప్పటికీ, డ్రాయింగ్లు, డిజైన్ పత్రాలు లీక్ అవ్వడం అనేది యాపిల్ భవిష్యత్ ఉత్పత్తుల గోప్యతకు పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై యాపిల్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన
ఏఐ కోసం 30 శాతం సిబ్బందిపై వేటు..
అంతర్జాతీయ టెక్ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. ప్రముఖ అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ ‘గిట్ల్యాబ్’ తన మొత్తం శ్రామిక శక్తిలో ఏకంగా 30 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే, ఒకవైపు గ్లోబల్ స్థాయిలో తొలగింపులు జరుగుతున్నా భారత్లో మాత్రం కొత్త నియామకాలకు కంపెనీ మొగ్గు చూపుతుండటం గమనార్హం.ఏఐ కోసం పునర్నిర్మాణంజనవరి 2026 నాటికి గిట్ల్యాబ్లో మొత్తం 2,580 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన 30 శాతం కోత ప్రకారం వందలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కంపెనీ సీఈఓ బిల్ స్టేపుల్స్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఈ మార్పులను ధ్రువీకరించారు. ‘ఏజెంటిక్ ఏఐ యుగంలో మాకున్న ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వ్యయ నియంత్రణ ద్వారా వచ్చే పొదుపును తిరిగి ఏఐ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.ఈ పునర్నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇందులో భాగంగా వాలంటరీ సెవరెన్స్ విండో (స్వచ్ఛంద విరమణ) అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 1, 2026 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.భారత్పై గిట్ల్యాబ్ ఆసక్తిప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నప్పటికీ భారత్లో మాత్రం గిట్ల్యాబ్ విస్తరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫారమ్లలో భారతదేశానికి సంబంధించి 20కి పైగా ఉద్యోగ ప్రకటనలను కంపెనీ పోస్ట్ చేసింది. అందులో ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, కస్టమర్ సక్సెస్ ఇంజినీర్ వంటి పాత్రలున్నాయి. ఈ ఉద్యోగాలన్నీ రిమోట్ (ఇంటి నుంచే పని) పద్ధతిలో ఉండటం విశేషం. గిట్ల్యాబ్ తన కార్యకలాపాలు సాగించే దేశాల సంఖ్యను తగ్గించుకుని భారత్, అమెరికా వంటి కీలక మార్కెట్లపై దృష్టి సారించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.నిజమైన పెట్టుబడా? తొలగింపులకు సాకా?గిట్ల్యాబ్ నిర్ణయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఏఐ ఏజెంట్ల గురించి వ్యాసాలు రాస్తూ, మరోవైపు సిబ్బందిని తొలగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ అన్నట్లుగా.. కొన్ని కంపెనీలు తమ అసమర్థతను దాచుకోవడానికి లేదా ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని ఒక సాకుగా వాడుతున్నాయా? అనే సందేహాలను నిపుణులు లేవనెత్తుతున్నారు. ‘ఇది వాస్తవంగా ఏఐ కోసం చేస్తున్న మార్పా? లేక 2026లో ఏఐ పేరు చెప్పి చేస్తున్న సాధారణ తొలగింపా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.మెటా, అమెజాన్ వంటి దిగ్గజాల బాటలోనే గిట్ల్యాబ్ పయనిస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగా భారత్ వంటి దేశాల్లో నియామకాలు చేపట్టడం సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు స్వల్ప ఊరటనిచ్చే అంశం. ఏది ఏమైనా టెక్ ప్రపంచంలో మనుషుల స్థానాన్ని యంత్రాలు (ఏఐ) భర్తీ చేస్తున్నాయా అనే చర్చకు గిట్ల్యాబ్ తాజా నిర్ణయం మరింత ఆజ్యం పోసింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన
రష్యా నుంచి తగ్గిన చమురు దిగుమతులు
రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఏప్రిల్లో 15 శాతం తగ్గినట్లు ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’ (సెరా) వెల్లడించింది. మార్చిలో €5.3 బిలియన్ యూరోల విలువైన ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోగా, ఏప్రిల్లో €4.5 బిలియన్ల యూరోలకు తగ్గాయి. నయారా ఎనర్జీకి చెందిన వాదినార్ రిఫైనరీలో ఉత్పత్తిని నిర్వహణ పనుల వల్ల నిలిపివేయడం ఇందుకు ప్రధాన కారణమని సెరా తెలిపింది. ఏప్రిల్లో రష్యా చమురు విషయంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది.మొత్తం మీద ఏప్రిల్లో రష్యా నుంచి హైడ్రోకార్బన్ల కొనుగోలు (ముడి చమురు, గ్యాస్) 5 బిలియన్ యూరోలుగా ఉంది. ఇరాన్తో అమెరికా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడమే కాకుండా హర్మూజ్ జలసంధి మూసివేతతో సరఫరాలు తగ్గిపోవడం తెలిసిందే. దీంతో ధరలను తగ్గించేందుకు గాను రష్యా చమురు నౌకలపై అమెరికా ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వ రంగ రిఫైనరీలు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించాయి.రష్యా యూరల్స్ ముడి చమురు ధర ఏప్రిల్లో బ్యారెల్కు 112.3 డాలర్లకు చేరింది. ఐరోపా నిర్దేశించిన గరిష్ట ధర 44.1 డాలర్లు కంటే రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం. భారత్, టర్కీ వంటి దేశాల్లో శుద్ధి చేసిన రష్యా చమురు ఉత్పత్తులు తిరిగి ఐరోపా దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకే ఎగుమతి అవుతున్నట్టు సెరా తెలిపింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన
కార్పొరేట్
ఏఐ కోసం 30 శాతం సిబ్బందిపై వేటు..
జెన్ జెడ్ పారిశ్రామికవేత్తలు చాలా స్మార్ట్
సౌండ్ తగ్గిన ఎయిర్టెల్
గోల్డ్ స్మగ్లింగ్ ఇంకా పెరుగుతుందేమో!!
జుకర్బర్గ్ రికార్డు బద్దలు..
విజయ్ మాల్యాకు ఉద్యోగిని ట్వీట్..
సిలికాన్ వ్యాలీలో ‘దేశీ’ నెట్వర్క్
వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన
ఐటీ దిగ్గజం దిక్సూచీ
రాజకుటుంబం.. డబ్బు కష్టం: జాహ్నవి కుమారి మేవార్
మోదీ వార్నింగ్తో వణికిన మార్కెట్లు
(సాక్షి, బిజినెస్): ‘ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు...
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.10 లక్షల కోట్లు ఆవిరి!
భారతీయ స్టాక్ మార్కెట్కు ఈ రోజు 'బ్లాక్ ట్యూస్డే...
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
సెగ పుట్టిస్తున్న పసిడి.. వెండి మళ్లీ రికార్డు దిశగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో.. దేశ ప్రజలు ఏడాద...
రానున్న రోజుల్లో.. చమురు ధరలు ఇలా!
అంచనాలను మించి దీర్ఘకాలం కొనసాగుతున్న పశ్చిమాసియా ...
ఈసారి రేట్ల పెంపు తప్పదా?
భారత ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ సెగ తగలనుందా? రా...
నిధుల సమీకరణే మార్గం
భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో భారతీయ భాషల విషయంలో ప్రస్తుత ఏఐ టూల్స్ డొల్లతనాన్ని ‘హుమిన్ ల్యాబ్స్’ అధ్యయనం బట్టబయలు చేసింది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి అంతర్జాతీయ దిగ్గజాల మోడళ్లు సైతం భారతీయ భాషలను పాఠకులకు స్పష్టంగా తెలియజేయడం(ట్రాన్స్క్రిప్షన్)లో విఫలమవుతున్నాయని ఈ నివేదిక తెలియజేస్తోంది.మూడు పదాల్లో ఒకటి తప్పుఫిజికల్, వాయిస్ ఏఐ డేటా మౌలిక సదుపాయాల రంగంలో సర్వీసులు అందిస్తున్న హుమిన్ ల్యాబ్స్ అధ్యయనం ప్రకారం, ప్రసిద్ధ ఏఐ మోడళ్లు భారతీయ భాషలను వినేటప్పుడు ప్రతి మూడు పదాల్లో ఒకదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారతీయులు సహజంగా మాట్లాడే మిశ్రమ ప్రసంగం(ఇంగ్లీష్+హిందీ లేదా మరేదైనా భాష + ఇంగ్లీష్) విషయంలో ఈ సాధనాలు తడబడుతున్నాయి. వాక్యం మధ్యలో వచ్చే ఆంగ్ల పదాలను ఇవి పూర్తిగా వదిలేయడం లేదా తప్పుగా మార్చడం వల్ల అర్థం పూర్తిగా మారిపోతోంది.‘ప్రస్తుత ఏఐ ప్రొవైడర్లు ఇంటర్నెట్ డేటాతో శిక్షణ పొందిన సెట్లను ఉపయోగించి తమకు తామే మార్కులు వేసుకుంటున్నారు. కానీ గ్లోబల్ సౌత్ (భారత్ వంటి దేశాలు) వినియోగదారులు వాస్తవంగా ఎలా మాట్లాడుతారో ఈ గణాంకాలు ప్రతిబింబించవు. అసంబద్ధమైన వివరాలు చూసి సంస్థలు నిర్ణయాలు తీసుకోవడం ఆందోళనకరం’ అని హుమిన్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ అగర్వాల్ తెలిపారు.బెంచ్ మార్క్ స్కోర్లుహుమిన్ ల్యాబ్స్ రూపొందించిన ‘బ్రిడ్జ్’ అనే గ్లోబల్ ఎవాల్యుయేషన్ బెంచ్ మార్క్ ద్వారా పలు సంస్థల పనితీరును విశ్లేషించారు.ఏఐ మోడల్ / ప్రొవైడర్సెమాంటిక్ గ్యాప్ స్కోర్ (కచ్చితత్వం)ప్రస్తుత పరిస్థితిదీప్ గ్రామ్ నోవా-30.906ప్రస్తుతానికి అగ్రస్థానంలో ఉందిసర్వం ఏఐ (సారస్ V3)20.2% (WER)గ్లోబల్ మోడళ్ల కంటే మెరుగైన 3వ స్థానంఓపెన్ ఏఐ (GPT-4o)< 0.4ఆశాజనకంగా లేదుఅమెజాన్ ట్రాన్స్ స్క్రైబ్0.199అత్యంత బలహీనమైన ప్రదర్శనగమనిక: జెమిని 2.5 ఫ్లాష్, ఎలెవెన్ ల్యాబ్స్ వంటి టూల్స్ కూడా ఈ అధ్యయనంలో భాగంగా ఉన్నాయి.స్వదేశీ టూల్స్ మెరుగైనప్పటికీ.. సవాళ్లు తప్పవుభారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రూపొందించిన సారస్ వీ3, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాల కంటే మెరుగైన ఫలితాలను చూపడం విశేషం. వర్డ్ ఎర్రర్ రేట్ (డబ్ల్యూఈఆర్) పరంగా ఇది 20.2 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. అయితే, మిశ్రమ ప్రసంగం విషయానికి వస్తే ఇది కూడా 0.588 స్కోరులో నిలిచింది.వర్డ్ ఎర్రర్ రేట్ కొలమానం సరిపోదుపరిశ్రమలో సాధారణంగా వాడే వర్డ్ ఎర్రర్ రేట్ భారతీయ భాషల వైఫల్యాలను పట్టుకోవడంలో విఫలమవుతోందని హుమిన్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు ఇశాంక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ‘ఇంగ్లీష్ ఫోనాలజీ(భాషలో అర్థాన్ని ఎలా మారుతుంది అనే అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఫోనాలజీ అంటారు) కోసం రూపొందించిన స్కోరింగ్ సిస్టమ్తో ఇండిక్ భాషలను మదింపు చేయడం సరికాదు. హిందీలో రాణించిన మోడల్ తెలుగులోనో, తమిళంలోనో రాణించాలని లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
హీట్ బీటర్స్.. కూల్గా ఉంచే బెస్ట్ గాడ్జెట్స్!
వేసవిలో ఎండ ఎంత పెరిగినా, మిమ్మల్ని మాత్రం కూల్గా ఉంచే బెస్ట్ హెల్పర్సే ఈ చిన్న గాడ్జెట్స్! ఇవి వేసవి కాలంలో చాలా ఉపయోగపడతాయి. ధర కూడా కొంత తక్కువగానే ఉండటం గమనార్హం. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ..చల్లని టచ్తో గ్లోయింగ్ స్కిన్!వేసవిలో కూడా మీ ఫేస్ ఎప్పుడూ ఫ్రెష్గా, గ్లోయింగ్గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే ఈ చిన్న ఐస్ రోలర్ బ్యూటీ టూల్ మీ డైలీ స్కిన్ కేర్లో ఒక సూపర్ హెల్పర్ అవుతుంది. దీనిని ఫ్రిజ్లో కొద్దిసేపు పెట్టి, తర్వాత ముఖంపై నెమ్మదిగా రోల్ చేస్తే చల్లని థెరపీ లభిస్తుంది. ఇది ముఖానికి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇచ్చి, పఫీనెస్ తగ్గించడంలో, స్కిన్ మరింత ఫ్రెష్గా కనిపించడంలో సహాయపడుతుంది. సిలికాన్తో తయారైన ఈ రోలర్ మళ్లీ మళ్లీ వాడుకునేలా డ్యూరబుల్గా డిజైన్ చేశారు. నీళ్లు లేదా గ్రీన్ టీ, రోజ్ వాటర్ లాంటి వాటితో ఫ్రీజ్ చేసి మీకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు. ధర కేవలం రూ. 140 మాత్రమే!మెడలోనే రక్షణ కవచం!బయట అడుగు పెడితే చాలు... దుమ్ము, ధూళి, పొగతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందా? అయితే వేరబుల్ పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ మీ దగ్గర ఉండాల్సిందే! ఇది మీ మెడలో ఉంటే చాలు, మీరు ఎక్కడికి వెళ్లినా చల్లని, స్వచ్ఛమైన గాలి మీ వెంటే ఉంటుంది! గాలిలోని అత్యంత సూక్ష్మమైన కాలుష్య కణాలను, పొగను సెకన్లలో తొలగించి, ఇది గాలిని 99 శాతం స్వచ్ఛంగా మారుస్తుంది. పైగా ఫిల్టర్ మార్చాల్సిన అవసరం లేకుండా సులభంగా వాడుకునేలా డిజైన్ చేశారు. ట్రావెల్లో, ఆఫీస్లో లేదా బయట ఎక్కువసేపు ఉండాల్సిన వారికి ఇది ఒక స్మార్ట్ సపోర్ట్. ధర కేవలం రూ. 3,200.కూల్గా గేమ్ ఆడండి!వీడియో గేమ్స్ ఆడేటప్పుడు లేదా వీడియోలు ఎక్కువసేపు చూస్తుంటే ఫోన్ వేడెక్కి స్లో అవుతుందా? అయితే ఈ చిన్న ‘ఫోన్ కూలర్’ మీకు ఒక సూపర్ సొల్యూషన్. ఈ కూలర్ను ఫోన్కు జత చేస్తే చాలు, వేడి త్వరగా తగ్గించి ఫోన్ను కూల్గా ఉంచుతుంది. రెండు పవర్ మోడ్స్ ఉండటంతో అవసరానికి తగ్గట్టు కూలింగ్ లెవల్ను ఎంచుకోవచ్చు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ లేదా లాంగ్ కాల్స్ సమయంలో ఇది మంచి సపోర్ట్గా ఉంటుంది. చిన్న సైజ్లో ఉండటం వల్ల ఫోన్ పట్టుకున్నప్పుడు ఏ అసౌకర్యం కలగదు. పైగా ఎక్కువ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ధర కేవలం రూ. 1,100.
ఇక మూడింది మిడిల్ మేనేజర్లకే.. సీఈఓ వార్నింగ్
కృత్రిమ మేధస్సు (AI) విప్లవం కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా కేవలం పర్యవేక్షణకే పరిమితమయ్యే "ప్యూర్ పీపుల్ మేనేజర్ల" మనుగడ ఇకపై కష్టమేనని ఎయిర్బీఎన్బీబి (Airbnb) సీఈఓ బ్రియాన్ చెస్కీ హెచ్చరించారు. పనిలో ప్రత్యక్షంగా భాగస్వాములు కాకుండా, కేవలం సిబ్బందిని మేనేజ్ చేసే పాత పద్ధతులకు కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.పని చేయని వారికి చోటు లేదు!ఇటీవల ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన చెస్కీ, ఏఐ యుగంలో నెట్టుకురావాలంటే మేనేజర్లు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఇకపై మేనేజర్లు కేవలం మీటింగ్లు, పర్ఫార్మెన్స్ రివ్యూలకే పరిమితం కాకూడదు. ప్రాజెక్టుల లోతుపాతులను అర్థం చేసుకుంటూ టీమ్తో కలిసి పని చేయాలి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అప్డేట్ అవ్వని వారు, ఏఐ వినియోగాన్ని వ్యతిరేకించే వారు కెరీర్ రేసులో వెనుకబడిపోతారని ఆయన స్పష్టం చేశారు.ఎయిర్బీఎన్బీలో 60% కోడింగ్ ‘ఏఐ’తోనే..ఎయిర్బీఎన్బీ ఇప్పటికే ఏఐ వినియోగంలో ముందుంది. కంపెనీలో దాదాపు 60% కోడింగ్ ఇప్పుడు ఏఐ ద్వారానే జరుగుతోందని, దీనివల్ల ఉత్పత్తులను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడమే కాకుండా, తక్కువ మందితో సమర్థవంతంగా పనిచేయడం సాధ్యమవుతోందని కంపెనీ వెల్లడించింది.తగ్గుతున్న ‘మేనేజ్మెంట్’ పొరలుఒక్క ఎయిర్బీఎన్బీ మాత్రమే కాదు, అనేక దిగ్గజ టెక్ సంస్థలు ఇప్పుడు "ఫ్లాటర్ స్ట్రక్చర్" (తక్కువ మేనేజ్మెంట్ స్థాయిలు) వైపు మొగ్గు చూపుతున్నాయి.మెటా ఇప్పటికే మేనేజ్మెంట్ పొరలను తొలగించి నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేసింది. బ్లాక్ సీఈఓ జాక్ డోర్సే కూడా శాశ్వత మిడిల్ మేనేజ్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాయిన్బేస్ సీఈఓ బ్రియాన్ ఆర్మ్స్ట్రాంగ్ సైతం "ప్యూర్ మేనేజర్" పాత్రలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.వస్తున్నది ‘ప్లేయర్-కోచ్’ల కాలంనివేదికలు, షెడ్యూలింగ్, పనితీరును ట్రాక్ చేయడం వంటి పనులను ఏఐ సులభంగా చేసేస్తోంది. కాబట్టి, కేవలం ఆర్డర్లు వేసే మేనేజర్ల కంటే, సాంకేతిక పరిజ్ఞానం ఉండి ప్రాజెక్టులో నేరుగా పాల్గొనే "ప్లేయర్-కోచ్" తరహా నాయకులకే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.జూనియర్ల విషయంలో జాగ్రత్త!అయితే, ఏఐ మోజులో పడి కొత్త గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్ల నియామకాలను ఆపవద్దని చెస్కీ హెచ్చరించారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను పూర్తిగా తొలగిస్తే, భవిష్యత్తులో కంపెనీలను నడిపించే నాయకులు తయారుకారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని ఉత్పాదకత పెంచుకోవడానికి వాడుకోవాలి తప్ప, నైపుణ్యం కలిగిన మానవ వనరుల పైప్లైన్ను దెబ్బతీసేలా ఉండకూడదని ఆయన సూచించారు.
వైట్ కాలర్ ఉద్యోగాలకు ఏఐ గ్రహణం?
కంప్యూటర్ పుట్టుకొచ్చిన తొలినాళ్లలో చాలా రంగాల్లో సిబ్బంది అవసరం తగ్గిపోయింది. కానీ అప్పట్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉండటంతో ఆ శ్రమశక్తి ఇతర రంగాల్లోకి మళ్లింది. కానీ నేడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి వేరు. ‘ఏజెంటిక్ ఏఐ’ రూపంలో వస్తున్న సాంకేతిక విప్లవం, అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులు కలిసి ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలను తుడిచిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది.నిర్ణయం దానిదే.. అమలు దానిదే!2024లో తెరపైకి వచ్చిన ఏజెంటిక్ ఏఐ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, ఒక పనిని ఎలా చేయాలో స్వయంగా నిర్ణయించుకుని పూర్తి చేయగలదు. ఆంత్రోపిక్ క్లాడ్ వంటి టూల్స్ ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో చూస్తుంటే భయం కలగక మానదు. ‘ముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ కొన్ని రంగాలు పూర్తిగా కనుమరుగవుతాయి’ అని ఓపెన్ ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్మాన్ హెచ్చరించడం గమనార్హం.ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ అంచనా ప్రకారం.. కోడింగ్, ఫైనాన్స్, లా వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాల్లో 20 శాతం కోత పడే అవకాశం ఉంది. ఇది కేవలం సామాన్య ఉద్యోగులకే కాదు, మధ్యతరగతికి కీలకంగా మారే ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది.భారత ఐటీ రంగానికి రెడ్ అలర్ట్భారతదేశం ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్గా గుర్తింపు పొందింది. లక్షలాది మంది యువత ఐటీ సేవల ద్వారా ఉపాధి పొందుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.కాగ్నిజెంట్ ఇప్పటికే భారత్లో అధిక వాటా ఉండేటా 15,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.సేల్స్ఫోర్స్ సంస్థలో సగం సపోర్ట్ సర్వీసులను ఏఐ చూసుకోవడంతో 4,000 ఉద్యోగాల్లో కోత పడింది.ఫ్రెష్వర్క్స్ తన కోడింగ్లో సగానికి పైగా ఏఐతో చేయిస్తూ 11 శాతం సిబ్బందిని తగ్గించుకుంది.డ్యుయోలింగో (ట్రాన్స్లేషన్), చెగ్ (ఎడ్యుకేషన్), హెచ్పీ వంటి దిగ్గజాలు కూడా ఏఐ కారణంగా సిబ్బందిని తగ్గిస్తున్నాయి.నందన్ నిలేకని చెప్పినట్లుగా కంపెనీలు ఇప్పుడు ‘టాప్-టు-బాటమ్’ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాయి. గతంలో ఒక పనికి వందల మంది ఇంజినీర్లు అవసరమయ్యే వారు. ఇప్పుడు ఏఐ సాయంతో చిన్న టీమ్లు అదే పనిని నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి.యుద్ధ క్షేత్రంలోనూ రోబోలదే రాజ్యంసాంకేతికత కేవలం ఆఫీసులకే పరిమితం కాలేదు. రక్షణ రంగాన్ని కూడా మార్చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు, అటానమస్ రోబోల వినియోగం పెరిగింది. చైనా తన విమాన దళంలో మానవరహిత విమానాలను ప్రవేశపెడుతోంది. దీనిని గమనించిన భారత్ కూడా అప్రమత్తమైంది.బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డ్రోన్ లాబొరేటరీలను ఏర్పాటు చేసింది. ఐఐటీల సహకారంతో విద్యార్థులకు, గ్వాలియర్ వంటి కేంద్రాల్లో సైనికులకు డ్రోన్ ఆపరేటింగ్, డిఫెన్స్లో శిక్షణ ఇస్తున్నారు.భారత్ ముందున్న సవాలుఒకవైపు శ్రమశక్తి విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు శ్రమను నిర్వహించే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఏఐ వల్ల ఆవిరవుతున్నాయి. ఒకప్పుడు అవుట్సోర్సింగ్ ద్వారా భారత్కు వచ్చే కాంట్రాక్ట్లు ఇప్పుడు ఆయా దేశాల్లోనే ఏఐ సాఫ్ట్వేర్ల ద్వారా పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం వైట్ కాలర్ ఉద్యోగులు తమ నైపుణ్యాలను అత్యున్నత స్థాయికి పెంచుకోకపోతే ప్రమాదంలో పడతారని గ్రహించాలి.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు
పర్సనల్ ఫైనాన్స్
పోస్టాఫీసు డిపాజిట్లపై ఐటీ నిఘా..
పోస్టాఫీసు పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆదాయపు పన్ను (IT) నిబంధనలు-2026 ప్రకారం, పోస్టాఫీసు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై ఖాతా తెరవడం నుంచి డిపాజిట్లు, ఉపసంహరణల వరకు ప్రతి కీలక లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కోట్ చేయడం తప్పనిసరి అయింది.చిన్న మొత్తాల పొదుపు పథకాలను అధికారిక పన్ను రిపోర్టింగ్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS), రికరింగ్ డిపాజిట్లు (RD), టైమ్ డిపాజిట్లపై ఈ నిబంధనల ప్రభావం పడనుంది.పాన్ కార్డు లేకపోతే 'ఫారం 97'గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని చిన్న పొదుపుదారులు, పెన్షనర్ల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించింది. ఒకవేళ డిపాజిటర్ వద్ద పాన్ కార్డు లేకపోతే గతంలో ఉన్న ఫారం 60 స్థానంలో ఇప్పుడు ఫారం 97 సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో డిపాజిటర్ పేరు, చిరునామా, లావాదేవీ స్వభావం, మొత్తం, సంబంధిత గుర్తింపు పత్రాలను పొందుపరచాలి. దీనివల్ల పాన్ కార్డు లేని లావాదేవీలు కూడా పన్ను శాఖ రికార్డుల్లో నమోదవుతాయి.15G, 15H స్థానంలో 'ఫారం 121'పన్ను మినహాయింపు కోసం గతంలో ఉపయోగించే ఫారం 15G (60 ఏళ్లలోపు వారికి), ఫారం 15H (సీనియర్ సిటిజన్లకు)లను ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో ఏకీకృత 'ఫారం 121'ని ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల వారు ఇకపై ఒకే ప్రామాణిక ఫారమ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి విడివిడిగా ఈ ఫారమ్ను సమర్పించాలి.ఏడేళ్ల పాటు రికార్డుల భద్రతకొత్త నిబంధనల ప్రకారం పోస్టాఫీసులపై బాధ్యత పెరిగింది. డిపాజిటర్లు సమర్పించే పత్రాలను పోస్టాఫీసు సిబ్బంది అంతర్గతంగా ధ్రువీకరించాలి. అలాగే, ఈ రికార్డులను, సపోర్టింగ్ డాక్యుమెంట్లను కనీసం ఏడు సంవత్సరాల పాటు భద్రపరచడం ఇప్పుడు తప్పనిసరి. సాంకేతిక వ్యవస్థలు పూర్తిగా అప్గ్రేడ్ అయ్యే వరకు, పాత ఫారాలు (15G, 15H) తాత్కాలికంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ATM నుంచి EPF.. ఎప్పటి నుంచంటే..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన చందాదారులకు భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలంటే నెలల తరబడి వేచి చూడటం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఉండేవి. కానీ, ఇకపై ఆ అవసరం లేకుండా నేరుగా ఏటీఎం కార్డులు లేదా యూపీఐ (UPI) ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించనుంది. 'ఈపీఎఫ్ఓ 3.0' అప్గ్రేడ్లో భాగంగా ఈ సరికొత్త డిజిటల్ విప్లవం ఈనెల (మే 2026) చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వార్తా సంస్థ ఈటీ నౌ ఉటంకించిన వర్గాల సమాచారం.ఏటీఎం నుంచి సగమే!కొత్త వ్యవస్థ ప్రకారం, చందాదారుల పీఎఫ్ ఖాతాలకు అనుసంధానించిన ప్రత్యేక ఏటీఎం కార్డులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల దరఖాస్తులు, డాక్యుమెంట్ల తతంగం లేకుండానే అవసరమైనప్పుడు నిధులను డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ విధానంలో మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్లో 50 శాతం వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా పరిమితి విధించే అవకాశం ఉందని సమాచారం.విత్డ్రాకు కావాల్సినవి..యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN).ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం.బ్యాంక్ ఖాతా వివరాలు, సరైన IFSC కోడ్.నిబంధనల సరళీకరణగతంలో ఉన్న సంక్లిష్టమైన 13 రకాల ఉపసంహరణ నిబంధనలను ఈపీఎఫ్ఓ కేవలం మూడు ప్రధాన వర్గాలుగా కుదించింది.అత్యవసరాలు: వైద్య అత్యవసరాలు, పిల్లల చదువులు, వివాహ ఖర్చులు. ఇందులో విద్యా రుణం కోసం 10 సార్ల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. వివాహ ఖర్చుల కోసం 5 సార్ల వరకు నిధులు తీసుకునేందుకు అనుమతి ఉంటుంది.గృహ అవసరాలు: ఇల్లు కొనడం, నిర్మాణం, ఇంటి మరమ్మతులు లేదా హోమ్ లోన్ చెల్లింపులు.ప్రత్యేక పరిస్థితులు: ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులు.ఈపీఎఫ్ఓ 3.0: మరిన్ని కీలక మార్పులుసర్వీస్ పరిమితి తగ్గింపు: కేవలం 12 నెలల సర్వీస్ ఉన్నా సరే పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఇచ్చేలా రూల్స్ మారుతున్నాయి.ఎక్కువ మొత్తం విత్ డ్రా: గతంలో కేవలం ఉద్యోగి వాటా మాత్రమే వచ్చేది. ఇప్పుడు యజమాని వాటా, దానిపై వడ్డీని కూడా కలిపి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.ఉద్యోగం కోల్పోతే: ఉద్యోగం పోయిన వెంటనే 75% బ్యాలెన్స్ తీసుకోవచ్చు. ఏడాది పాటు నిరుద్యోగిగా ఉంటే మిగిలిన 25% కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.పూర్తి విత్ డ్రాయల్: 55 ఏళ్ల పదవీ విరమణ, వైకల్యం, విదేశాలకు వెళ్లడం వంటి సందర్భాల్లో పూర్తి మొత్తం తీసుకోవచ్చు.రికార్డు స్థాయిలో క్లెయిమ్ల పరిష్కారంకేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ వేగవంతమైంది. 2024-25లో 6.01 కోట్లుగా ఉన్న క్లెయిమ్ల పరిష్కారం, 2025-26 నాటికి 8.31 కోట్లకు చేరింది.త్వరలో రాబోయే ఈ 'ఈపీఎఫ్ఓ 3.0'తో సామాన్య ఉద్యోగులకు తమ సొంత డబ్బుపై పూర్తి నియంత్రణ లభించడమే కాకుండా, అత్యవసర సమయాల్లో పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: EPFO: రూ.7500లకు గనక పెంచితే..
మళ్లీ ఎంఎంటీసీ.. రూ.10కే డిజిటల్ గోల్డ్, సిల్వర్!
డిజిటల్ రూపంలో బంగారం, వెండిని నేరుగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఎంఎంటీసీ–పీఏఎంపీ ప్లాట్ఫామ్ తిరిగి ప్రారంభమైంది. ఎంఎంటీసీపీఏఎంపీ వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ నుంచి, అలాగే గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే యాప్స్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.ఈ సంస్థ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను మొదటిసారి 2017లో, డిజిటల్ వెండి కొనుగోళ్లకు 2023లో అవకాశం కల్పించింది. మరింత మెరుగైన అనుభవానికి వీలుగా వెబ్సైట్ను నవీకరించేందుకు 2024 చివర్లో ఈ సేవలను నిలిపివేసింది. ఈ కాలంలో థర్డ్ పార్టీ (ఫోన్పే తదితర) యాప్స్ ద్వారా కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. నవీకరించిన వెబ్సైట్ను తాజాగా ప్రారంభించినట్టు సంస్థ ప్రకటించింది.కనీసం రూ.10 నుంచి డిజిటల్ గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతీ కొనుగోలు విలువకు సరిపడా భౌతిక బంగారం, వెండిని బీమా రక్షణతో కూడిన ఖజానాల్లో ఎంఎంటీసీ–పీఏఎంపీ భద్రపరుస్తుంది. బంగారం, వెండిపై పెట్టుబడులకు ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో ఎంఎంటీసీ తిరిగి ఈ ప్లాట్ఫామ్ను తీసుకురావడం గమనార్హం.
45 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చా? చాట్ జీపీటీ రెస్పాన్స్
వేగవంతమైన జీవనశైలిలో 60 ఏళ్ల వరకు పనిచేయడం అనేది ఒకప్పుడు సాధారణం. కానీ, ఇప్పటి యువతరం 40 ఏళ్లకే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటోంది. 30 ఏళ్ల యువకుడు నెలకు రూ.1.5 లక్షల ఆదాయంతో ముంబై వంటి నగరంలో ఉంటూ 45 ఏళ్లకే పదవీ విరమణ ఎలా చేయాలి? ఈ ప్రశ్నపై ఏఐ దిగ్గజం చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అత్యంత సంక్లిష్టమైన ఆర్థిక లెక్కల కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలియే ముందస్తు పదవీ విరమణకు కీలమని ఏఐ స్పష్టం చేస్తోంది.పెట్టుబడి కంటే పొదుపే ముఖ్యం!త్వరగా రిటైర్ అవ్వాలంటే చాలామంది ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంటుంది? ఏ స్టాక్లో లాభాలు వస్తాయి? అని వెతుకుతుంటారు. కానీ, చాట్ జీపీటీ ఇచ్చిన సలహా ఆశ్చర్యకరంగా ఉంది. దీని ప్రకారం, ముందస్తు పదవీ విరమణకు పెట్టుబడి రాబడి ముఖ్యం కాదు, ఎంత పొదుపు చేస్తున్నామనేదే కీలకం.ఏఐ సూచించిన ప్రాథమిక సూత్రం60:40 నిష్పత్తి: ఉదాహరణకు నెలకు వచ్చే మీ రూ.1.5 లక్షల ఆదాయంలో రూ.60,000 మాత్రమే ఖర్చు చేయాలి. మిగిలిన రూ.90,000ను కచ్చితంగా పెట్టుబడిగా మార్చాలి.ముంబైలో జీవనశైలి పెరిగే ప్రమాదం ఉంది. ఎంత జీతం పెరిగినా ఆ అదనపు మొత్తాన్ని కూడా పెట్టుబడికే మళ్లించాలని ఏఐ సూచిస్తోంది.కేవలం డబ్బు దాచడమే కాకుండా దానిని సరైన మార్గాల్లో మళ్లించడం ద్వారా 15 ఏళ్లలో మెరుగైన కార్పస్ను నిర్మించవచ్చని ఏఐ విశ్లేషించింది.విభాగంనెలవారీ కేటాయింపుసూచనఈక్విటీ/ఇండెక్స్ ఫండ్స్రూ. 75,000దీర్ఘకాలిక కాంపౌండింగ్ కోసం డైరెక్ట్ ప్లాన్లను ఎంచుకోవాలి.డెట్/ఎమర్జెన్సీ ఫండ్రూ. 15,000లిక్విడ్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఆర్థిక భద్రత.నిర్వహణ వ్యయంరూ. 60,000అద్దె, ఆహారం, బీమా, ఇతర ఖర్చులు. సెబీ నిబంధనల ప్రకారం, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్స్ ఖర్చు తక్కువ. కాబట్టి లాభాలు ఎక్కువగా ఉంటాయని ఏఐ గుర్తుచేస్తోంది.వ్యూహాత్మక మార్పుముంబైలో పెరుగుతున్న జీవన వ్యయం మీ పొదుపు లక్ష్యానికి అతిపెద్ద అడ్డంకి. కాబట్టి 45 ఏళ్ల వయసులో పదవీ విరమణ తర్వాత ముంబై నుంచి ప్రశ్న అడిగిన వ్యక్తి స్వస్థలమైన లఖ్నవూకు మారిపోవాలనే ఆలోచన చాలా తెలివైనదని ఏఐ అభినందించింది. లఖ్నవూలో నివసించడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఇది మీ కార్పస్ మరింత కాలం మన్నేలా చేస్తుంది.చాట్ జీపీటీ మాటల్లో చెప్పాలంటే, 10 నుంచి 15 ఏళ్ల పాటు డబ్బు విషయంలో కాస్త విసుగుగా అనిపించినా సరే, క్రమశిక్షణ తప్పకూడదు. ఏఐ చెబుతున్న ఈ పద్ధతిని పాటిస్తే మీ 45వ ఏట ఆర్థిక స్వేచ్ఛను పొందడం అసాధ్యమేమీ కాదు. అయితే, పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయని, ఏదైనా పెట్టుబడికి ముందు ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం ఉత్తమమని గుర్తుంచుకోండి.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్!


