Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TheraNyM Biologics opens manufacturing facility Hyderabad1
అరబిందో ఫార్మా థెరానిమ్‌ బయోలాజిక్స్‌ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌: భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యేక బయోలాజిక్స్‌ కాంట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆర్గనైజేషన్లలో (సీఎంఓ) ఒకటైన థెరానిమ్‌ కేంద్రాన్ని అరబిందో ఫార్మా ప్రారంభించింది. తెలంగాణ మంత్రులు డి. శ్రీధర్‌ బాబు, దామోదర రాజనరసింహ సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. బయోలాజిక్స్‌ తయారీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్‌డీ ప్రధాన కస్టమర్‌గా చేరింది.ప్రారంభోత్సవానికి ముందు అరబిందో ఫార్మా డైరెక్టర్లు, ఎంఎస్‌డీ సీనియర్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి ప్రాజెక్ట్‌ వివరాలు తెలియజేసి ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్‌, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ ప్రాజెక్ట్‌ నిదర్శనంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు. బయోలాజిక్స్‌ కాంట్రాక్ట్‌ తయారీ రంగంలో అరబిందో ఫార్మా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఏర్పాటైన థెరానిమ్‌, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బయోలాజిక్‌ చికిత్సల డిమాండ్‌ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

Robert Kiyosaki Warns Why You Should Buy Gold and Silver Right Now2
ధనవంతుల రహస్యం చెప్పిన కియోసాకి

ప్రపంచ ప్రఖ్యాత పర్సనల్‌ ఫైనాన్స్‌ పుస్తకం ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండిపై తన మద్దతును వ్యక్తం చేశారు. సంపదను కాపాడుకోవాలంటే బంగారం వంటి వాస్తవ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.తాజాగా ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులో, చాలామంది బంగారం కొంటే డబ్బు సంపాదించవచ్చని భావిస్తారని, కానీ ధనవంతులు ఆ ఉద్దేశంతో బంగారం కొనరని పేర్కొన్నారు. డాలర్‌పై నమ్మకం లేకపోవడమే బంగారం కొనడానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. తన వయోజన జీవితమంతా బంగారం, వెండి నిల్వ చేసుకుంటూ వచ్చానని, వాటి ధరలు భారీగా పెరుగుతాయని ఆశించి కాదు, డాలర్‌ విలువ కాలక్రమేణా తగ్గుతుందనే అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.ప్రభుత్వాలు కొత్త కరెన్సీని ముద్రించిన ప్రతిసారీ నగదు కొనుగోలు శక్తి తగ్గిపోతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం లాభాలను హామీ ఇవ్వదని, కానీ సంపదను రక్షించే సాధనంగా పనిచేస్తుందని చెప్పారు. కోట్లాది రూపాయలు అవసరం లేదని, ఒక వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలో బంగారం కొనుగోలు చేయడం ద్వారా కూడా సంపద రక్షణను ప్రారంభించవచ్చని సూచించారు.అయితే ఎక్కువ మంది ప్రజలు సోషల్‌ మీడియాలో సమయం గడపడం, తదుపరి స్టాక్‌ టిప్‌ కోసం ఎదురు చూడడం లేదా ప్రభుత్వమే తమను కాపాడుతుందని ఆశించడం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన డబ్బు బంగారం, వెండి వంటి విలువైన లోహాలేనని, కాగితపు కరెన్సీ కేవలం నకిలీ డబ్బు లాంటిదేనని ఆయన పేర్కొన్నారు.వేల ఏళ్లుగా బంగారం, వెండి సంపద నిల్వ సాధనాలుగా కొనసాగుతున్నాయని, కానీ అమెరికా డాలర్‌ 1971 నుంచి క్రమంగా విలువ కోల్పోతోందని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం ఉంచాలా, లేక బంగారంపై విశ్వాసం పెంచుకోవాలా అనేది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు.

indian oil companies windfall profits truth behind rs 77821 crore profit fy263
అవి సాధారణ లాభాలే..

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎంసీ) లాభాలు సాధారణ స్థాయికి తిరిగొచ్చాయే తప్ప పశ్చిమాసియా సంక్షోభం నుంచి అవేమీ భారీగా లబ్ధి పొందలేదని ప్రభుత్వ, పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2025–26లో మూడు ఓఎంసీలు కలిసి రూ. 77,821 కోట్ల లాభాలను ప్రకటించాయి. ఇది 2024–25తో పోలిస్తే ఏకంగా 130 శాతం అధికం. దీనితో ఆయిల్‌ కంపెనీలు పశ్చిమాసియా సంక్షోభం సాకుతో రేట్లను పెంచేసి అనూహ్య లాభాలను ఆర్జించాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు ఓఎంసీలైన ఇండియన్‌ ఆయిల్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌) నిపుణుల విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకుంది.వాస్తవానికి 2024–25లో వంట గ్యాస్‌ రేట్లు పెరగకుండా రేట్లను అదే స్థాయిలో కొనసాగించడం వల్ల ఓఎంసీలు రూ. 40,434 కోట్ల ఆదాయ నష్టాన్ని భరించాయి. ఫలితంగా 2024–25లో లాభాలు రూ. 33,602 కోట్లకు పరిమితమయ్యాయి. 2025–26లో లాభాలు భారీగా పెరిగినట్లు కనిపిస్తున్నా, అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో అవి భారీగా అండర్‌ రికవరీలను నమోదు చేయడం వల్ల, దానితో పోల్చి చూడటం సరికాదని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న లాభాలు 2023–24లో నమోదైన రూ. 80,986 కోట్ల స్థాయికి దరిదాపుల్లో ఉన్నాయని, ఈ స్థాయి ప్రాఫిట్స్‌ సాధారణమే తప్ప ఆకస్మిక లాభాలు కావని తెలిపారు.ఆ మాత్రం మార్జిన్లుండాలి.. కంపెనీల ఆదాయాల స్థాయిని వాటి పరిమాణాన్ని బట్టి మదింపు చేయాలని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీయంగా మూడు ఏఎంసీల వార్షికాదాయం రూ. 20 లక్షల కోట్ల పైగానే ఉంటుంది. ఐవోసీలాంటి రిఫైనింగ్‌ సంస్థ ఆదాయామే ఏటా రూ. 10 లక్షల కోట్లు ఉంటుంది. భారీ కమోడిటీ రిఫైనింగ్‌ సంస్థల నిర్వహణ మార్జిన్లు 1–3 శాతం ఉండటం సాధారణమేనని నిపుణులు తెలిపారు. మూలధన పెట్టుబడులను కొనసాగించడానికి, రిఫైనరీలను అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం ఈ మాత్రం నిధులు కావాల్సి ఉంటుందని వివరించారు. కేవలం ఒక రిఫైనరీని విస్తరించాలన్నా రూ. 50,000–60,000 కోట్లు అవసరమవుతాయని తెలిపారు.2030 నాటికి రిఫైనింగ్‌ సామర్థ్యాలను వార్షికంగా 310 మిలియన్‌ టన్నులకు మించి పెంచుకోవాలని పరిశ్రమ నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 2025–26లో ఆదాయాలకు పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధం లేదని కంపెనీలు చెబుతున్నాయి. హార్మూజ్‌ జలసంధి సంక్షోభం తలెత్తడానికి 50–60 రోజుల ముందు కొన్న ముడిచమురును తాము శుద్ధి చేసినట్లు వివరించాయి. కాబట్టి పశ్చిమాసియా సంక్షోభంపరంగా క్రూడాయిల్‌ రేట్లు, రవాణా వ్యయాలు, ఇన్సూరెన్స్‌ సర్‌చార్జీల పెరుగుదల మొదలైనవన్నీ 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆదాయాల్లోనే కనిపించవచ్చంటున్నాయి. ఈ గణాంకాలు ఆగస్టులో వెల్లడవుతాయి.ప్రపంచంలో అయిదో వంతు ముడిచమురు హార్మూజ్‌ జలసంధి నుంచే రవాణా అవుతోంది. అక్కడ ఉద్రిక్తతల వల్ల ఆసియావ్యాప్తంగా ఆయిల్‌ ధరలు, షిప్పింగ్‌ వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. ఫిబ్రవరిలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి దేశీయంగా రిటైల్‌ పెట్రోల్, డీజిల్‌ రేట్లు 8–9 శాతం పెరిగాయి. అయితే పలు పొరుగు దేశాల్లో నమోదైన 20–67 శాతం వరకు పెంపుతో పోలిస్తే ఇది తక్కువేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. పైగా 2026 మార్చి 27 నుంచి పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినట్లు తెలిపాయి.దీనితో 2021 నుంచి చూస్తే పెట్రోల్‌పై రూ. 23, డీజిల్‌పై రూ. 26 మేర సుంకాలను తగ్గించినట్లయిందని పేర్కొన్నాయి. ఇక ఓఎంసీల లాభాల్లో దాదాపు సగం వాటా డివిడెండ్లు, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వస్తుందని.. హైవేలు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టుల్లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మిగతా మొత్తాన్ని ఇంధన భద్రత కోసం, రిఫైనింగ్‌ సామర్థ్యాల పెంపు కోసం పెట్టుబడులకి వినియోగమవుతున్నాయని వివరించాయి.

adani group record ebitda rs 94834 crore fy26 investment rs 153 lakh crore4
అదానీ గ్రూప్‌ ఇబిటా రికార్డ్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం, డైవర్సిఫైడ్‌ గ్రూప్‌ అదానీ గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో రికార్డ్‌ నిర్వహణ లాభం(ఇబిటా) సాధించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,834 కోట్లు(10 బిలియన్‌ డాలర్లు) ఆర్జించింది. ఇదేసమయంలో రూ. 1.53 లక్షల కోట్ల(16.1 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడి వ్యయాలు చేపట్టింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. వార్షికంగా అత్యధిక పెట్టుబడులు వెచ్చించిన దేశీ కార్పొరేట్‌ గ్రూప్‌గా నిలిచింది.దీంతో గ్రూప్‌ పోర్ట్‌ఫోలియో స్థూల ఆస్తుల విలువ రూ. 7.85 లక్షల కోట్ల(82.8 బిలియన్‌ డాలర్లు)కు చేరింది. పెట్టుబడుల్లో దాదాపు 80 శాతం ఎనర్జీ, యుటిలిటీస్, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్‌ బిజినెస్‌ తదితర కీలక మౌలిక సదుపాయాలపై వెచ్చించింది. అదానీ గ్రూప్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం కన్సాలిడేటెడ్‌ ఇబిటా వార్షికంగా 5.6 శాతం బలపడింది.

tiktok founder zhang yiming overtakes mukesh ambani asia second richest billionaire5
ధనవంతుల్లో అంబానీని దాటేసిన టిక్‌టాక్ ఫౌండర్‌

చైనా టెక్ దిగ్గజం బైట్‌డాన్స్‌ (ByteDance) సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ (Zhang Yiming) సంపద మరోసారి భారీగా పెరిగింది. ఫలితంగా ఆయన భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీని (Mukesh Ambani)ను వెనక్కి నెట్టి ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.తాజా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ (Bloomberg Billionaires Index) ప్రకారం జాంగ్ యిమింగ్ నికర సంపద 92.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన చైనాలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. 2019లో బ్లూమ్‌బర్గ్ ఆయన సంపదను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పుడు అది కేవలం 13 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం ఏడు రెట్లకు పైగా పెరగడం విశేషం.ఈ వృద్ధికి ప్రధాన కారణం టిక్‌టాక్ ప్రపంచవ్యాప్త విజయంతో పాటు బైట్‌డాన్స్ అభివృద్ధి చేసిన డౌబావో (Doubao) ఏఐ చాట్‌బాట్‌కు చైనాలో లభిస్తున్న ఆదరణ. డౌబావోకు ఇప్పటికే 300 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో బైట్‌డాన్స్ దూకుడుగా పెట్టుబడులు పెడుతుండటం కూడా కంపెనీ విలువను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలపై గత కొన్నేళ్లుగా నెలకొన్న నియంత్రణ అనిశ్చితి కూడా ఇటీవల కొంతవరకు తగ్గింది. బైట్‌డాన్స్ తన అమెరికా వ్యాపారంలోని భాగాలను అమెరికన్ పెట్టుబడిదారులకు బదిలీ చేయడంతో కంపెనీపై ఉన్న రిస్క్ డిస్కౌంట్‌ను బ్లూమ్‌బర్గ్ తగ్గించింది. దీంతో సంస్థ విలువపై మరింత సానుకూల అంచనాలు వెలువడ్డాయి.ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు బ్లాక్‌రాక్‌, ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, టి.రోవీ ప్రైజ్, జనరల్‌ అట్లాంటిక్‌, తదితర సంస్థల తాజా విలువల అంచనాల ఆధారంగా జాంగ్ సంపద ఒక్కసారిగా 24 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు సమాచారం.అగ్రస్థానంలో గౌతమ్‌ అదానీఇక భారతీయ బిలియనీర్లలో ముకేశ్ అంబానీ 86.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆసియాలో మూడో స్థానానికి దిగజారగా, గౌతమ్‌ అదానీ (Gautam Adani) 117.4 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఏఐతో కొత్త శకానికి బైట్‌డాన్స్సోషల్ మీడియా కంపెనీగా ప్రారంభమైన బైట్‌డాన్స్ ఇప్పుడు ఏఐ రంగంలోనూ భారీ ఆశయాలతో ముందుకు సాగుతోంది. 2026లో ఏఐ మౌలిక సదుపాయాలు, చిప్స్, మోడల్ అభివృద్ధిపై భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. టిక్‌టాక్ విజయాన్ని ఏఐ వ్యాపారంలోనూ పునరావృతం చేయగలిగితే, జాంగ్ యిమింగ్ సంపద మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Canara Bank Leadership Change Brajesh Kumar Singh Assumes Charge as MD CEO6
కెనరా బ్యాంక్‌కు కొత్త బాస్‌.. బ్రజేష్‌ కుమార్‌ సింగ్‌

బెంగుళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు కెనరా నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా బ్రజేష్‌ కుమార్‌ సింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం మే 30న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు బ్రజేష్‌ కుమార్‌ సింగ్‌ 2029 ఏప్రిల్‌ 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.మాజీ ఎండీ, సీఈఓ కె.సత్యనారాయణ రాజు పదవీ విరమణ అనంతరం స్థానంలో నియమితులయ్యారు. బ్రజేష్‌ కుమార్‌ సింగ్‌కు బ్యాంకింగ్‌ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కెనరా బ్యాంక్‌లో చేరకముందు ఇండియన్‌ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అలహాబాద్‌ అగ్రికల్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యవసాయ విద్యను అభ్యసించారు.ఫైనాన్స్‌లో ఎంబీఏ పట్టా పొందారు. బ్రజేష్‌ కుమార్‌ సింగ్‌ నాయకత్వంలో కెనరా బ్యాంక్‌ డిజిటల్‌ పరివర్తనను మరింత వేగవంతం చేయనుంది. ఆర్థిక చేరిక విస్తరణ, ఆస్తుల నాణ్యత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వినియోగదారుల సేవలను మెరుగుపరుస్తూ, షేర్‌ హోల్డర్లకు స్థిరమైన విలువను సృష్టించడమే లక్ష్యమని బ్యాంక్‌ తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement