Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

US Job Market Shock February Sees 92000 Job Cuts Unemployment Rises1
అమెరికాలో పెరిగిన నిరుద్యోగం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న అమెరికా జాబ్‌ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్‌ఎస్‌) తాజాగా విడుదల చేసిన తాజా గణాంకాలు అంతర్జాతీయ మార్కెట్లను విస్మయానికి గురిచేశాయి. ఈ ఏడాది ఆరంభంలో బలంగా కనిపించిన యూఎస్‌ ఉపాధి రంగంలో ఫిబ్రవరి నెలలో అనూహ్యంగా 92,000 ఉద్యోగాల కోత నమోదైంది. ఈ పరిణామంతో అమెరికాలో నిరుద్యోగిత రేటు 4.4 శాతానికి పెరిగింది.ఆరోగ్య రంగంపై సమ్మెల ప్రభావంబ్లూమ్‌బెర్గ్ విశ్లేషణ ప్రకారం, ఇంత భారీగా పేరోల్స్ నమోదు కావాడానికి ప్రధాన కారణం ఆరోగ్య సంరక్షణ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలే. ఆసుపత్రులు, వైద్య సేవల విభాగాల్లో కొనసాగుతున్న సమ్మె వల్ల ఉపాధి గణనీయంగా క్షీణించింది. జనవరిలో భారీ నియామకాలతో జోరు మీద ఉన్న అమెరికా కంపెనీలు ఫిబ్రవరిలో నియామకాలను ఒక్కసారిగా తగ్గించడం ఆశ్చర్యపరిచింది.ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగానా?నిరుద్యోగిత రేటు పెరగడం, నెగటివ్ పేరోల్ గణాంకాలు వెలువడటంతో ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాది ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఫిబ్రవరి నివేదికతో నీరుగారిపోయిందని కొందరు భావిస్తున్నారు.ఆరోగ్య సంరక్షణ రంగంలో సమ్మె ఎందుకు?వైద్య రంగంలోని కార్మికులు ప్రధానంగా ‘సేఫ్ స్టాఫింగ్’ (సరైన నిష్పత్తిలో సిబ్బంది ఉండటం) కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో తగినంత మంది నర్సులు, ఇతర సిబ్బంది లేకపోవడం వల్ల ఒక్కో నర్సుపై రోగుల భారం పెరుగుతోంది. ఇది రోగుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని, వైద్య సేవల్లో జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రస్తుత వేతనాలు తమ జీవన వ్యయానికి సరిపోవడం లేదని నర్సులు, ఇతర హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ వాదిస్తున్నారు.కొన్ని సంస్థల్లో కార్మికులు వచ్చే నాలుగేళ్లలో దాదాపు 25% వేతన పెంపు కావాలని కోరుతున్నారు.పెరుగుతున్న ఇంటి అద్దెలు, నిత్యావసర ధరల నేపథ్యంలో పాత వేతన ఒప్పందాలు సరిపోవని స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో పనితీరుపై సమీక్ష

WhatsApp Plus Subscription Will Messaging Soon Cost Premium2
వాట్సాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌.. ఫీచర్లు ఇవే..

వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను పరిచయం చేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తరహాలోనే వాట్సాప్ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఇకపై వాట్సాప్ వాడాలంటే డబ్బులు కట్టాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలు కింద చూద్దాం.వాట్సాప్ ప్లస్‌లో స్పెషల్ ఫీచర్లుప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పెయిడ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులకు ఈ కింది ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు.ఫీచర్వివరణచాట్ పిన్సాధారణంగా 3 చాట్లు మాత్రమే పిన్ చేయగలం, కానీ ఇందులో 20 చాట్ల వరకు పిన్ చేయవచ్చు.కస్టమైజేషన్యాప్ ఐకాన్ రంగులు, ట్యాబ్లు, బటన్లు మార్చుకునే సౌలభ్యం.థీమ్స్, స్టిక్కర్స్ఎక్స్‌క్లూజివ్‌ థీమ్స్, స్పెషల్ స్టిక్కర్ ప్యాక్స్.రింగ్‌టోన్స్‌కాంటాక్ట్స్ కోసం కస్టమ్ రింగ్‌టోన్స్‌ సెట్ చేసుకునే ఆప్షన్.రియాక్షన్స్మెసేజ్ రియాక్షన్ల రంగులను మార్చుకునే వెసులుబాటు. వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాట్సాప్ ప్లస్ అనేది పూర్తిగా ఆప్షనల్‌ మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఎలాంటి సర్వీసులు ఉచింతంగా అందుబాటులో ఉంటాయో కింద చూద్దాం.ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో పనితీరుపై సమీక్ష

RBI Tightens Digital Banking Security Draft Framework on Customer Liability3
డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట

డిజిటల్‌ బ్యాంకింగ్ విభాగంలో శరవేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఖాతాదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. అనధికార లావాదేవీల వల్ల నష్టపోయే వినియోగదారులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా కస్టమర్ బాధ్యత (కస్టమర్‌ లయబిలిటీ) ఫ్రేమ్‌వర్క్‌లో సవరణలను ప్రతిపాదిస్తూ ఆర్‌బీఐ ముసాయిదా జారీ చేసింది.ముసాయిదాలోని ప్రధానాంశాలుమోసపూరిత లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకులు స్పందించే సమయాన్ని భారీగా తగ్గించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న జాప్యాన్ని తగ్గించి నిర్ణీత కాలవ్యవధిలోగా సమస్యను పరిష్కరించేలా నిబంధనలను కఠినతరం చేశారు.2017లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నిబంధనలు అప్పటి డిజిటల్ వ్యవస్థకు అనుగుణంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మారిన టెక్నాలజీ నేపథ్యంలో కొత్త తరహా మోసాలను కూడా ఈ పరిధిలోకి చేర్చారు.తక్కువ విలువ గల మోసపూరిత లావాదేవీల విషయంలో వినియోగదారులకు వేగంగా నగదు వాపసు అందేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రతిపాదించారు.భవిష్యత్తులో మోసాలకు సంబంధించి బ్యాంకులు భరించే పరిహారం వాటాను పెంచే దిశగా ఆర్‌బీఐ యోచిస్తోంది.ఎందుకు ఈ మార్పు?గత ఎనిమిదేళ్లలో దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు సైతం సరికొత్త పద్ధతుల్లో ఖాతాదారులను మోసం చేస్తున్నారు. ఫిబ్రవరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ప్రకటించిన విధంగానే ఆర్‌బీఐ ఈ సమీక్షా ప్రక్రియను చేపట్టింది. ‘2017 నుంచి డిజిటల్ బ్యాంకింగ్ ఎకోసిస్టమ్‌ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత సవరణలు వినియోగదారుల నమ్మకాన్ని పెంచడమే కాకుండా, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పారదర్శకంగా మారుస్తాయి’ అని ఆర్‌బీఐ ప్రతినిధి తెలిపారు.ఈ కొత్త మార్గదర్శకాలపై వాటాదారులు, ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను ఏప్రిల్ 6, 2026 లోపు సమర్పించాలని ఆర్‌బీఐ కోరింది. కొత్త ఆదేశాలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ పరిహార ఏర్పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా నిబంధనలను మరింత సమీక్షించనున్నారు.ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో పనితీరుపై సమీక్ష

Flipkart Lays Off 300 Employees Amid Walmart Led IPO Preparations4
ఫ్లిప్‌కార్ట్‌లో పనితీరుపై సమీక్ష

ఈ-కామర్స్ సర్వీసులు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్ష తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ త్వరలో రానున్న పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఉద్యోగ కోతలపై ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా స్పందిస్తూ, ఇది ఒక సాధారణ ప్రక్రియ అని స్పష్టం చేసింది. ‘ఫ్లిప్‌కార్ట్‌లో స్పష్టంగా నిర్వచించిన అంచనాలకు అనుగుణంగా రెగ్యులర్ పనితీరు సమీక్షలను నిర్వహిస్తాం. ఈ ప్రక్రియలో భాగంగా కొద్ది శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి బయటకు వెళ్లవచ్చు. ఇందులో ప్రభావితమైన ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తున్నాం’ అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.ఐపీఓ లక్ష్యంగా..2025 డిసెంబర్‌లో ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్‌కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం చేసింది.నష్టాలున్నా.. పెరిగిన ఆదాయంబిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ‘టోఫ్లర్’ డేటా ప్రకారం ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.5,189 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 17.3 శాతం వృద్ధి చెంది రూ.82,787.3 కోట్లకు చేరింది (గత ఏడాది ఇది రూ.70,541.9 కోట్లు). మొత్తం ఖర్చులు 17.4 శాతం పెరిగి రూ.88,121.4 కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా స్టాక్ కొనుగోళ్ల వ్యయం పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.ఇదీ చదవండి: రష్యా చమురు కొనుగోలుకు యూఎస్‌ ఓకే

Anthropic gauges workers, observed exposure to AI5
ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు 

న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో భారీ సంఖ్యలో ఉద్యోగాలేమీ పోలేదని ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌ ఒక నివేదికలో వెల్లడించింది. దీని వల్ల టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే నెమ్మదించిన సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. ఏఐ సామర్థ్యం కొండంత ఉన్నప్పటికీ, ప్రస్తుతం వినియోగించుకుంటున్నది గోరంతేనని పేర్కొంది. కోడింగ్, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్, అనాలిసిస్, రొటీన్‌ డిజిటల్‌ విధులను నిర్వర్తించే వైట్‌ కాలర్‌ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కంప్యూటర్‌ ప్రోగ్రామర్లు, కస్టమర్‌ సర్విస్‌ రిప్రజెంటేటివ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మార్కెట్‌ రీసెర్చ్‌ అనలిస్టులు, ఫైనాన్షియల్‌..ఇన్వెస్ట్‌మెంట్‌ అనలిస్టుల్లాంటి ఉద్యోగ విధులను ఆటోమేట్‌ చేసేందుకు భారీగా అవకాశాలు ఉన్నందున, ఆయా ఉద్యోగాలకు రిసు్కలు ఉంటాయని నివేదిక తెలిపింది. మరోవైపు, వంటవాళ్లు, మోటార్‌సైకిల్‌ మెకానిక్‌లు, లైఫ్‌గార్డ్‌లు, బార్‌టెండర్లు, డ్రెస్సింగ్‌ రూమ్‌ అటెండెంట్స్‌లాంటి మాన్యువల్‌ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు ఢోకా ఉండదని పేర్కొంది. అమెరికా లేబర్‌ స్టాటిస్టిక్స్‌ బ్యూరో డేటా ప్రకారం 2022 ఆఖరు నుంచి టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉండే విభాగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే తగ్గినట్లు తెలుస్తోందని వివరించింది. ఏఐతో భారీగా ఉద్యోగాల్లో కోత పడుతోందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్‌ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.

Sensex and Nifty as West Asia crisis escalates, crude prices surge6
చమురు సలసల..  మార్కెట్‌ విలవిల!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ భయాలు, ముడిచమురు ధరల సెగ కలగలసి మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లను పడగొట్టాయి. దీంతో సెన్సెక్స్‌ 79,000 పాయింట్ల స్థాయిని కోల్పోగా.. నిఫ్టీ 24,500 పాయింట్ల దిగువన స్థిరపడింది. ముంబై: ముడిచమురు ధరలు మండుతుండటంతో దిగుమతుల బిల్లు పెరగడంతోపాటు.. రూపాయి బలహీనపడనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. ఫలితంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆపై యూరోపియన్‌ మార్కెట్ల క్షీణతతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. వెరసి సెన్సెక్స్‌ 1,097 పాయింట్లు పతనమై 78,919 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 315 పాయింట్లు కోల్పోయి 24,450 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్ల (ఫ్యూచర్స్‌) నష్టాలు, క్రూడ్‌ భగభగలు సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో మిడ్‌సెషన్‌ నుంచీ మార్కెట్లు మరింత నీరసించాయి. చివరి సెషన్‌లో సెన్సెక్స్‌ 78,812 వద్ద, నిఫ్టీ 24,416 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.బ్యాంకులు బోర్లా: ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులుసహా రియల్టీ ఇండెక్స్‌ 2 శాతం క్షీణించింది. ఆటో 1 శాతం నీరసించగా.. కెమికల్స్, ఐటీ నామమాత్రంగా బలపడ్డాయి. ప్రయివేట్‌ బ్యాంకులలో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఆర్‌బీఎల్, ఇండస్‌ఇండ్, కొటక్‌ 3–1.5 శాతం మధ్య నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకులలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, బీవోబీ, కెనరా, మహారాష్ట్ర, ఐవోబీ 3–1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే బీఈఎల్, ఆర్‌ఐఎల్, ఓఎన్‌జీసీ 2.5–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. షేర్లపై చమురు ఎఫెక్ట్‌: చమురు సెగ ప్రభావంతో ఇంధన మార్కెటింగ్‌ దిగ్గజాలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ 3–1.7% మధ్య నీరసించాయి. → పెయింట్ల విభాగంలో ఇండిగో, కన్సాయ్‌ నెరోలాక్, అక్సో నోబెల్‌ 3.4–2.5 శాతం మధ్య పతనమయ్యాయి. → ఏటీఎఫ్‌ భయాలతో విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ 2.4 శాతం నష్టపోయింది. → ముడిసరుకుల ధరల ఆందోళనతో టైర్ల కంపెనీలలో టీవీఎస్‌ శ్రీచక్ర, అపోలో, ఎంఆర్‌ఎఫ్‌ 3–1 శాతం మధ్య క్షీణించాయి.డిఫెన్స్‌ సేఫ్‌..: యుద్ధ భయాల నేపథ్యంలో రక్షణ రంగ షేర్లు.. భారత్‌ డైనమిక్స్‌(బీడీఎల్‌), గార్డెన్‌ రీచ్, మజ్గావ్‌ డాక్, పారస్‌ డిఫెన్స్, స్పేస్‌ టెక్నాలజీస్, ఎంటార్‌ టెక్, హెచ్‌ఏఎల్, డేటా ప్యాటర్న్స్, కొచిన్‌ షిప్, మిధానీ 6–3.3% మధ్య జంప్‌చేసింది. వెరసి ఎన్‌ఎస్‌ఈ డిఫెన్స్‌ ఇండెక్స్‌ 2.8% ఎగసింది. కారణాలివీ...: పశ్చిమాసియాలో దాడులతో చమురు, గ్యాస్‌ సరఫరాలకు విఘాతం కలగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతోంది. క్రూడ్‌ మంటతో వాణిజ్య లోటు పెరగడంతోపాటు, ద్రవ్యోల్బణాన్ని ఎగదోయనున్నట్లు నిపుణులు తెలిపారు. దేశీ కరెన్సీ మరింత బలహీనపడనున్నట్లు పేర్కొన్నారు. ఇది ఆర్‌బీఐ పరపతి విధానాలను ప్రతికూలంగా ప్రభావితం చేయనున్నట్లు వివరించారు. చమురు ధరలు పలు రంగాల లాభదాయకతను దెబ్బతీసే వీలున్నట్లు పేర్కొన్నారు.12 శాతం జంప్‌ చేసిన క్రూడ్‌రాత్రి 11.30 సమయంలో న్యూయార్క్‌లో నైమెక్స్‌ చమురు 14% జంప్‌చేసి 92.5 డాలర్లకు చేరింది. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 11 శాతం ఎగసి 94.5 డాలర్లను దాటింది. ఇవి మరింత బలపడితే ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై సోమవారం(9న) కనిపించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క యూఎస్‌ ఇండెక్సులు సైతం 1 శాతం పైగా క్షీణించి ట్రేడవుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement