ప్రధాన వార్తలు
రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!
ఇండియన్ మార్కెట్లో ఆటోమాటిక్ కార్లకు ఇప్పుడు కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే వీటికోసం ఎక్కువ డబ్బు కేటాయించాలేమో అనుకుంటే పొరపాటే? ఎందుకంటే దేశీయ విఫణిలో రూ.10 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరకు లభించే కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఆ కార్ల గురించి తెలుసుకుందాం.కియా సోనెట్రూ. 10 లక్షల లోపు సెగ్మెంట్లోని అత్యంత ప్రీమియం కాంపాక్ట్ SUVలలో ఒకటి కియా సోనెట్. దీని ప్రారంభ ధర రూ.9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆకట్టుకునే డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందింది. ఇందులోని 83 పీఎస్ పవర్, 115 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 120 పీఎస్ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందించే 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 116 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజిన్స్ అన్నీ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి.ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది 385-లీటర్ల బూట్ స్పేస్ను కూడా అందిస్తుంది.స్కోడా కైలాక్స్కోడా కైలాక్ ప్రారంభం: రూ. 9.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మంచి పనితీరును అందించడంతో.. దీనిని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది 1-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. 115 PS పవర్ 178 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెగ్మెంట్లో స్కోడా పూర్తిగా పెట్రోల్ పవర్ట్రెయిన్లపై దృష్టి సారించినందున, డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు. ఇందులోని 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.టాటా పంచ్టాటా పంచ్ ప్రారంభం: రూ. 7.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇటీవల ఫేస్లిఫ్ట్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్బాక్స్ను పొందుతుంది. ఈ ఇంజన్ 88 PS, 115 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. పంచ్లో డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు.మారుతి సుజుకి డిజైర్రూ. 7.62 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే మారుతి సుజుకి డిజైర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది, ఇది 90 PS పవర్, 113 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో వైర్లెస్ కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, చుట్టూ LED లైటింగ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఎయిర్-కాన్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.రెనాల్ట్ ట్రైబర్రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 8.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 72 PS, 96 Nm టార్క్ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది, 5-స్పీడ్ AMT గేర్బాక్స్ ఎంపిక లభిస్తుంది. ఇందులో 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, 625 లీటర్ల బూట్ స్పేస్ మొదలైనవి ఉన్నాయి.
దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!
ముంబైలోని జుహు తారా రోడ్డులో.. సముద్రానికి ఎదురుగా ఉన్న లీలా బంగ్లా రూ. 221 కోట్లకు అమ్ముడైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బంగ్లా ఆర్ట్ డెకో నిర్మాణం, గ్రేడ్ IIB వారసత్వ హోదాను కలిగి ఉంది. దీనిని అమ్మకానికి పెట్టిన తరువాత చాలామంది డెవలపర్లు, వ్యాపారవేత్తలను ఆకట్టుకుంది.నానావతి మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన గౌతమ్ నానావతికి చెందిన లీలా బంగ్లాను నోటండాస్ జ్యువెలర్స్ గ్రూప్లో భాగమైన నోటండాస్ రియల్టీ రూ.221 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత బుధవారం ఈ లావాదేవీ అధికారికంగా ఖరారైందని సమాచారం.నోటండాస్ రియల్టీ సంస్థకు చెందిన మహేష్ జగ్వాని, హర్ష్ జగ్వాని అనే తండ్రి-కొడుకు ఈ డీల్ను పూర్తి చేశారు. వీరు నోటండాస్ జ్యువెలర్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనిని 1983లో కిషిన్ జగ్వానీ స్థాపించారు. ఇది బాంద్రాలోని వాటర్ఫీల్డ్ రోడ్ నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.చదరపు అడుగుకు రూ. 2,60,5921,355 చదరపు మీటర్ల స్థలంలో ఉన్న లీలా బంగ్లా నిర్మాణ విస్తీర్ణం సుమారు 8,480 చదరపు అడుగులు. అదనంగా 2,500 చదరపు అడుగుల టెర్రస్.. 5,000 చదరపు అడుగుల తోట కూడా ఉన్నాయి. చదరపు అడుగుకు రూ. 2,60,592 ధర చెల్లించినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ బంగ్లాలో 1950ల కాలానికి చెందిన బర్మా టేకు చెక్కతో తయారైన తలుపుల ఫ్రేములు, మెట్ల నిర్మాణం, అలంకరణలు ఉన్నాయి. ఈ భవనం ఆర్ట్ డెకో శైలిని ప్రతిబింబిస్తూ పురాతన సౌందర్యాన్ని కాపాడుకుంటోంది. సముద్రం వైపు ఉండే ఇలాంటి పెద్ద స్థలాలు జూహు ప్రాంతంలో చాలా అరుదుగా లభిస్తాయి. అందుకే ఈ ఆస్తికి వ్యాపారవేత్తలు, డెవలపర్లు ఎంతో ఆసక్తి చూపారు.కేవలం మరమ్మతులు మాత్రమే..అయితే.. గ్రేడ్ IIB హెరిటేజ్ హోదా ఉండటం వల్ల ఈ భవనాన్ని పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మించలేరు. కేవలం మరమ్మతులు, విస్తరణలు మాత్రమే చేయవచ్చు. అవి కూడా అసలు నిర్మాణ శైలిని కాపాడే విధంగా ఉండాలి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఈ ఆస్తి ప్రాముఖ్యత తగ్గలేదు.ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ఈ లావాదేవీని నిర్వహించిందని నివేదిక పేర్కొంది, అయితే ఈ విషయంపై సంప్రదించినప్పుడు ఆ సంస్థ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఈ బంగ్లాను మొదట 2022లో రూ. 210-220 కోట్ల అంచనా ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ధరను రూ. 250 కోట్లకు పెంచారు. చివరికి రూ.221 కోట్లకు అమ్ముడైంది.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు!
ఇందుకేనా బంగారం ధరలు తగ్గుతున్నది..?
గత వారం రోజులుగా పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయ మార్కెట్లో మారుతున్న సమీకరణాలు పసిడి ధరను కిందకు దింపుతున్నాయి. గత వారం రోజులుగా దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర గణనీయంగా తగ్గుతూ వస్తోంది. అక్షయ తృతీయ వంటి పర్వదినాల వేళ కూడా డిమాండ్ ఊహించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం వంటి అంశాలు పసిడి వెలుగులను తగ్గించాయి.దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 24 మధ్య కాలంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ 19వ తేదీన 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ. 1,42,800 గా ఉండగా, ఏప్రిల్ 24 నాటికి అది రూ. 1,40,200 కి చేరి, మొత్తం రూ. 2,600 మేర తగ్గింది. అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, ఏప్రిల్ 19న రూ. 1,55,780 గా ఉన్న ధర, ఏప్రిల్ 24 నాటికి రూ. 1,52,950కి పడిపోయింది, అంటే తులంపై సుమారు రూ. 2,830 మేర ధర తగ్గింది. గత ఐదు రోజులుగా వరుసగా ధరలు క్షీణించడంతో కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది.ధరలు తగ్గడానికి దారితీసిన 4 కీలక అంశాలుబలపడుతున్న అమెరికన్ డాలర్అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పెరగడం బంగారం ధరపై నేరుగా ప్రభావం చూపుతోంది. డాలర్ ఇండెక్స్ బలపడినప్పుడల్లా పెట్టుబడిదారులు పసిడి కంటే డాలర్ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తున్నాయి.ముడిచమురు సెగ.. వడ్డీ రేట్ల భయంప్రస్తుతం అంతర్జాతీయంగా (ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద) నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటాయి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పుడప్పుడే తగ్గించకపోవచ్చనే సంకేతాలు వెలువడటంతో, బంగారంపై పెట్టుబడులు తగ్గాయి.లాభాల స్వీకరణఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలకు (తులం దాదాపు రూ.1,50,000 పైచిలుకు) చేరాయి. ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు పెద్ద ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి లాభాలను గడించడం (Profit Booking) మొదలుపెట్టారు. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరగడం కూడా ధరల తగ్గుదలకు ఒక కారణం.దేశీయ మార్కెట్లో తగ్గిన డిమాండ్భారత్లో బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ, పాత బంగారాన్ని ఇచ్చి కొత్తది తీసుకోవడం లేదా తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడం వల్ల రిటైల్ మార్కెట్లో సందడి తగ్గింది.ప్రస్తుతం మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వచ్చి, డాలర్ విలువ స్థిరపడితే తప్ప ధరల్లో స్పష్టత రాదు. అయితే, ధరలు తగ్గుతున్న ఈ సమయం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుముందు ధరలు మరింత తగ్గుతాయా లేదా మళ్లీ పుంజుకుంటాయా అన్నది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పసిడి ప్రేమికులు మాత్రం ఈ ధరల తగ్గింపును ఆస్వాదిస్తూ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.
పెరిగిన యూనియన్ బ్యాంక్ లాభం.. రూ.5 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,504 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడానికితోడు ఆస్తుల(రుణాలు) నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 7 శాతం పుంజుకుని రూ. 5,316 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు బ్యాంక్ వెల్లడించింది. ట్రెజరీ వీక్ తాజా క్యూ4లో యూనియన్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 1 శాతం క్షీణించి రూ. 9,406 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు 2.87 శాతం నుంచి 2.64 శాతానికి నీరసించడం ప్రభావం చూపింది. ట్రెజరీ ఆదాయం మందగించడంతో 3 శాతం తక్కువగా రూ. 5,412 కోట్ల వడ్డీయేతర ఆదాయం అందుకుంది. ఈ కాలంలో రుణ నాణ్యత మెరుగుపడటంతో స్లిప్పేజీలు, రుణ వ్యయాలు తగ్గినట్లు బ్యాంక్ వెల్లడించింది.దీంతో ప్రొవిజన్లు 3 శాతం తగ్గి రూ. 2,640 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో ఇవి రూ. 2,715 కోట్లుగా నమోదయ్యాయి. అంతేకాకుండా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.6 శాతం నుంచి 2.82 శాతానికి దిగివచ్చాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,483 కోట్ల నుంచి రూ. 2,023 కోట్లకు వెనకడుగు వేశాయి. ప్రధానంగా ఎంఎస్ఎంఈల నుంచి రూ. 895 కోట్లు నమోదయ్యాయి.
ఒకేసారి రెండు బైకులు లాంచ్
క్లాసిక్ లెజెండ్స్ తాజాగా యెజ్డీ, బీఎస్ఏ బ్రాండ్స్ కింద స్క్రాంబ్లర్ మోటర్సైకిల్స్ని ప్రవేశపెట్టింది. వీటిలో యెజ్డీ స్క్రాంబ్లర్ 350 ప్రారంభ ధర రూ. 1,99,950గా ఉంటుంది. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 ప్రారంభ ధర రూ. 3,24,950గా ఉంటుంది.కంపెనీ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా గురువారం వీటిని ఆవిష్కరించారు. బీఎస్ఏ స్క్రాంబ్లర్ దేశీయంగా ఈ సెగ్మెంట్లో ఏకైక 650 సీసీ సింగిల్ సిలిండర్ వాహనమని సంస్థ తెలిపింది. ఈ రెండు వాహనాలకు 4ఏళ్లు లేదా 50,000 కి.మీ. స్టాండర్డ్ వారంటీ, 6 ఏళ్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ, 8 ఏళ్ల వరకు రోడ్సైడ్ అసిస్టెన్స్ మొదలైనవి ఉంటాయి.
ఉద్యోగి కోసం బాస్ చేసిన పని.. నెటిజన్లు ఫిదా!
ఒక కంపెనీలో బాస్ అంటే.. కేవలం ఉద్యోగులతో పనిచేయించుకోవడం మాత్రమే కాదు, వారి కష్టాలను కూడా గుర్తించాలి. అవసరమైన సహాయం చేయాలి. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తులలో ఒకరు ప్రదీప్ కన్నన్. ఇంతకీ ఈయన ఎవరు?, ఈయన చేసిన సహాయం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.తమిళనాడుకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కన్నన్.. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి, కొన్ని రోజులుగా ఆఫీసులో చాలా నీరసంగా ఉండటం, పనిపై ఏకాగ్రత చూపించకపోవడం వంటివి గమనించారు. అతను ఆలా ఉండటానికి కారణం ఏమిటని ఆరాతీస్తే.. భారీ ఎండల కారణంగా రాత్రివేళల్లో సరిగ్గా నిద్రపోవడం లేదని తెలిసింది. అయితే.. ఇది ఉద్యోగి వ్యక్తిగత సమస్య అని వదిలేయకుండా, ప్రదీప్ అతనికి ఒక ఎయిర్ కూలర్ కొని ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.Our employee was struggling to sleep in this heat.Next day, we bought him an air cooler.Not posting this to brag.Posting this because many founders miss the real math:The cost of an air cooler is small.The cost of a:- tired mind- low energy, - bad work, and- feeling… pic.twitter.com/o6TQnuB9co— Pradeep Kannan (@Pradeepkannanj) April 21, 2026ఎయిర్ కూలర్ విలువ, కంపెనీ విలువతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉద్యోగి సమస్యకు స్పందించిన బాస్ అని పలువురు నెటిజన్లు 'ప్రదీప్ కన్నన్'ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.నిజానికి చాలా కంపెనీలలో ఉద్యోగులు జాబ్ వదిలేయడానికి కారణం, జీతం సరిపోకపోవడం కాదు. సంస్థలో వారికి విలువ ఇవ్వకపోవడం లేదా పట్టించుకోకపోవడం అని ప్రదీప్ పేర్కొన్నారు. మీ టీమ్ కేవలం పనిచేసే ఉద్యోగులు కాదు. వారు మీతో కలిసి వ్యాపారాన్ని నిర్మించే భాగస్వాములు అని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్ జీతం ఎంతో తెలుసా?
కార్పొరేట్
ఏఐ యుగంలో భారత్: నాస్కామ్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు!
పెరిగిన యూనియన్ బ్యాంక్ లాభం.. రూ.5 డివిడెండ్
ఉద్యోగి కోసం బాస్ చేసిన పని.. నెటిజన్లు ఫిదా!
నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు!
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ‘బైఅవుట్’!
ఏఐ డేంజర్.. బ్యాంకులకు ఆర్థిక మంత్రి కీలక సూచన
రిలయన్స్తో జతకట్టిన ‘టైమ్’
మస్క్ కంపెనీలో జాబ్ కావాలా?
ఇన్ఫోసిస్ లాభం జూమ్
'పని ఇష్టం లేనప్పుడే.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్'
పసిడి, వెండి.. డబుల్ ధమాకా!
దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. ...
నష్టాల్లో కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
భగ్గుమన్న పశ్చిమాసియా
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్ట...
గోల్డ్ అలర్ట్: బంగారం మళ్లీ ఎంత తగ్గిందంటే..
దేశంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు మళ్లీ ఊరటనిచ్చా...
ఆన్లైన్ గేమింగ్ కొత్త నిబంధనలు
ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక, నియంత్రణ చట్టాన్ని ...
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత...
మసులుతున్న భూమి.. మగ్గుతున్న ఆహార వ్యవస్థ!
ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. దాం...
నాలుగేళ్ల తర్వాత గోధుమ రైతులకు గుడ్న్యూస్
దేశ రాజధాని రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. దాదాప...
ఆటోమొబైల్
టెక్నాలజీ
అక్రమంగా అధిక ఛార్జీ వసూలు!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీ సంస్థలను దెబ్బతీసేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై యూకేలో దాఖలైన ‘క్లాస్ యాక్షన్’ దావాను విచారించేందుకు లండన్ కోర్టు పచ్చజెండా ఊపింది. ఈ కేసులో మైక్రోసాఫ్ట్ ఓడిపోతే సుమారు 1.7 బిలియన్ యూరోలు (సుమారు రూ.18,700 కోట్లు) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ఏమిటీ వివాదం?మైక్రోసాఫ్ట్ తన విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించే వ్యాపార సంస్థల నుంచి అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. తన మార్కెట్ శక్తిని ఉపయోగించుకుని ఇతర క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్లకుండా వినియోగదారులను నియంత్రించిందని హక్కుదారులు వాదిస్తున్నారు.సుమారు 59,000 బ్రిటీష్ వ్యాపార సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ దావా పరిధిలోకి వస్తాయి. లండన్లోని కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (సీఏటీ) న్యాయమూర్తులు ఈ దావాలో పిటిషన్దారుల విజయానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.నియంత్రణ సంస్థల నిఘా నీడలో..కేవలం ఈ ప్రైవేట్ దావా మాత్రమే కాకుండా యూకే యాంటీట్రస్ట్ సీఎంఏ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వ్యాపార పద్ధతులపై లోతైన దర్యాప్తు చేస్తోంది. వర్డ్, ఎక్సెల్ వంటి ప్రసిద్ధ అప్లికేషన్లతో పాటు ఏఐ ఆధారిత కోపైలట్ వంటి ఉత్పత్తుల లైసెన్సింగ్ నిబంధనలు పోటీని అణచివేస్తున్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. సీఏంఏ దర్యాప్తులో సాక్ష్యాలు మైక్రోసాఫ్ట్ తన లైసెన్సింగ్ విధానాల ద్వారా పోటీని వక్రీకరించిందని నిరూపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.మైక్రోసాఫ్ట్ వాదనఈ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ అసహనం వ్యక్తం చేసింది. కంపెనీ ప్రతినిధి బుధవారం మాట్లాడుతూ, తాము ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ రోజు వెలువడిన నిర్ణయం కంపెనీపై వస్తున్న ఆరోపణలపై తుది తీర్పు కాదని నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
99.99 శాతం మందికి భవిష్యత్తే లేదు : జాక్మా సంచలన వ్యాఖ్యలు
అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా యువత నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని అత్యంత ప్రతిభావంతులైన కొందరు యువతను ఉద్దేశించి రష్యాలోని లోమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీలో ఆయన చేసిన ప్రసంగం ఇపుడు నెట్టింట ఆందోళనకరంగా మారింది. అయితే భయపడకండి, ఆశాజనకంగా ఉండండి సమస్యల పరిష్కారంలో భాగస్వాములవ్వండి! అంటూ ఒక సవాలును యువత ముందుంచడమే ఆయన వ్యాఖ్యల్లోని అంతరార్థం. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? ఆయన వ్యాఖ్యల అర్థం పరమార్థం ఏంటి?జాక్ మా సందేశంయూనివర్శిటీలోని మేధావులతో జాక్ మాట్లాడుతూ “ప్రపంచంలోని 99.9శాతం మందికి భవిష్యత్తు లేదు” అన్న వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా ఉలిక్కి పడ్డారు. అత్యంత తెలివైన, సమర్థులైన యువత భయానికి, నిరాశకు లొంగిపోతే, ప్రపంచాన్ని రక్షించడానికి ఎవరు ముందుకొస్తారన్న జాక్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘మాస్కో యూనివర్శిటీకి చెందిన మీరు కూడా సమస్యలను పరిష్కరించలేకపోతే, మీరే భయపడితే.. ఇక ప్రపంచంలోని 99.9% మందికి భవిష్యత్తు ఉండదు.” అని అన్నారు. వెంటనే వారికి ముందుకు వెళ్లే మార్గాన్ని కూడా చూపించారు. తెలివైన, సమర్థులైన యువతే భయపడి చేతులు ముడుచుకు కూర్చుంటే, ఇక ప్రపంచాన్ని రక్షించే వారెవరూ ఉండరు. అందుకే సమస్యలొస్తాయని భయపడటం మానేసి, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని పిలుపు నిచ్చారు.సానుకూలంగా ఉండాలని, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ శక్తిని వృథా చేసుకోవద్దని యువ మేధావులకు సూచించారు. భయపడుతూ ఆలోచిస్తూ కూర్చోకుండా, పని మొదలుపెట్టాలని చెప్పారు. ఆందోళన చెందితే, మకో అవకాశమేదీ ఉండదు. భయం నుండి కార్యాచరణకు మారడమే గొప్ప విజయం అని పేర్కొన్నారు. Jack Ma explains why action matters more than worrying about the future pic.twitter.com/zKHPzHJRS1— Mindset Machine (@mindsetmachine) April 16, 2026 నిజానికి ప్రపంచంలోని ప్రతి ఆందోళన ఒక అవకాశమే అన్నారు. యంత్రాల వల్ల ఉద్యోగాలు కోల్పోతామని ప్రజలు భయపడితే, మార్పు గురించి ఆందోళన చెందితే ఫలితం లేదు. నిజానికి అది పూరించాల్సిన ఖాళీ. విద్యావంతులైన, సమర్థులైన యువత చేయాల్సిన పని ఈ ఆందోళనల నుండి దాక్కోవడం కాదు, వాటి వద్దకు నేరుగా వెళ్లి, వాటిని అర్థం చేసుకుని, పరిష్కారాలను గుర్తించడం. కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసుకోవడం. సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించడం మొదలుపెడితే ప్రపంచ భవిష్యత్తును మార్చవచ్చు అని జాక్మా సూచించడం విశేషం.
ప్రపంచంలోనే టాప్ కంపెనీకి కొత్త బాస్
ప్రపంచంలోనే నం 1 టెక్ కంపెనీ యాపిల్ తన నాయకత్వంలో మార్పులు ప్రకటించింది. దశాబ్ద కాలానికిపైగా సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది చివర్లో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన వారసుడిగా ప్రస్తుతం హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగం బాధ్యతలు చూస్తున్న జాన్ టెర్నస్ సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు. అదే సమయంలో యాపిల్ చిప్ డిజైన్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జానీ స్రూజీకి సంస్థ అత్యంత కీలకమైన చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్ బాధ్యతలను అప్పగించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా టిమ్ కుక్సుమారు రెండు దశాబ్దాలుగా యాపిల్లో అంతర్భాగంగా ఉన్న జాన్ టెర్నస్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. టిమ్ కుక్ వారసుడిగా ఆయన ఎంపిక సంస్థ అంతర్గత వారసత్వ ప్రణాళికలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో టెర్నస్ సీఈఓగా బాధ్యతలు చేపడతారు. పదవీ విరమణ తర్వాత కుక్ పూర్తిగా తప్పుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉంటూ దిశానిర్దేశం చేయనున్నారు.హార్డ్వేర్ చీఫ్గా జానీ స్రూజీయాపిల్ చిప్ల సృష్టికర్తగా పేరొందిన జానీ స్రూజీ పాత్ర ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఇప్పటివరకు హార్డ్వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఇకపై చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్ హోదాలో పూర్తిస్థాయి హార్డ్వేర్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. ఈ హోదాలో ఆయన బాధ్యతలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!స్రూజీ పర్యవేక్షణలో ఉండే విభాగాలుసిలికాన్, ప్రాసెసర్లు: ఏ-సిరీస్ (iPhone), ఎం-సిరీస్ (Mac) చిప్ల అభివృద్ధి.డిస్ప్లేలు, కెమెరా సెన్సార్లు, బ్యాటరీ టెక్నాలజీ, స్టోరేజ్ కంట్రోలర్లు.సెల్యులార్ మోడెమ్ల తయారీ, ఇంటిగ్రేషన్.
నెలకు రూ.1.90 లక్షల జీతం.. 4 నెలలే సంబరం!
నెలకు రూ. 1.90 లక్షల భారీ జీతం.. కేవలం నాలుగు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది! ఒక కంపెనీకి అత్యంత కీలకమైన ఉద్యోగి అనిపించుకుని, ఏకంగా 90 శాతం జీతం పెంపు పొందిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సైమన్ ఇంగారి అనే 'ఎక్స్' (ట్విట్టర్) యూజర్ పంచుకున్న ఈ ఉదంతం, రాజీనామా చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే కౌంటర్ ఆఫర్లను నమ్మి వెనక్కి తగ్గితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కళ్లకు కడుతోంది.కథనంలోకి వెళ్తే.. ఒక ఉద్యోగి కొత్త కంపెనీలో మెరుగైన ఆఫర్ రావడంతో తన ప్రస్తుత సంస్థకు రాజీనామా లేఖ సమర్పించాడు. అప్పటి వరకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న అతనికి, కొత్త చోట రూ. 1.70 లక్షల ఆఫర్ వచ్చింది. అయితే, ఆ ఉద్యోగి రాజీనామాతో షాక్ తిన్న హెచ్ఆర్ విభాగం, అతడిని వదులుకోవడం ఇష్టం లేక ఏకంగా రూ. 1.90 లక్షల జీతం ఇస్తామని 'కౌంటర్ ఆఫర్' ఇచ్చింది. కంపెనీ తనను ఇంతలా గుర్తిస్తోందని మురిసిపోయిన సదరు ఉద్యోగి, తన రాజీనామాను వెనక్కి తీసుకుని పాత సంస్థలోనే ఉండిపోయాడు.అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా నాలుగు నెలల తర్వాత కంపెనీ ఆ ఉద్యోగికి ఉద్వాసన పలుకుతూ లేఖ పంపింది. వ్యాపార లాభాలు తగ్గడం వల్ల పునర్నిర్మాణ ప్రక్రియ చేపడుతున్నామని, అందుకే తొలగిస్తున్నామని కంపెనీ కుంటిసాకులు చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతూనే, మరోవైపు కొత్తగా ఒక అసిస్టెంట్ను నియమించుకోవడం గమనార్హం. కేవలం రెండు వారాల్లోనే బాధ్యతలన్నీ అప్పగించి వెళ్లిపోవాలని సీనియర్ మేనేజ్మెంట్ నుండి ఆదేశాలు వచ్చాయని నిర్మొహమాటంగా చెప్పేసింది.ఈ ఉదంతం కార్పొరేట్ ప్రపంచంలోని ఒక చేదు నిజానికి నిదర్శనం. ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే పెంపుదలలు కేవలం తక్షణ ప్రత్యామ్నాయం దొరికే వరకు చేసే తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ పెంపుతో ఉద్యోగిని ఆపి, ఆ లోపు అతని బాధ్యతలను ఇతరులకు బదిలీ చేసే ప్లాన్ ఇందులో దాగి ఉండవచ్చు. అందుకే, ఒక్కసారి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాక, కౌంటర్ ఆఫర్లకు లోబడి వెనక్కి తగ్గడం క్షేమం కాదని ఈ కథనం హెచ్చరిస్తోంది.
పర్సనల్ ఫైనాన్స్
ఆటోమెటిక్గా కట్ అయ్యే డబ్బులు.. ఆర్బీఐ కొత్త అప్డేట్
డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ ఈ-మాండేట్ (e-Mandate) నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా రూ. 15,000 దాటే ఆటో-డెబిట్ లావాదేవీలపై పర్యవేక్షణను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రికరింగ్ (పునరావృత) చెల్లింపులకు సంబంధించి పాత నిబంధనలను సవరిస్తూ, కస్టమర్ల రక్షణ కోసం కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది.మార్పులు ఏమిటంటే..కొత్త నిబంధనల ప్రకారం, ఆటో-డెబిట్ లావాదేవీలకు సంబంధించి రూ. 15,000 పరిమితిని ప్రామాణికంగా తీసుకున్నారు.రూ. 15,000 లోపు: చిన్న మొత్తాల చెల్లింపులు (OTT సబ్స్క్రిప్షన్లు, ఫోన్ బిల్లులు వంటివి) ఎటువంటి ఓటీపీ (OTP) అవసరం లేకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతాయి.రూ. 15,000 పైన: లావాదేవీ విలువ రూ. 15,000 దాటితే మాత్రం ఖచ్చితంగా అదనపు ప్రామాణీకరణ అవసరమవుతుంది. అంటే కస్టమర్ ఓటీపీని ఎంటర్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.అయితే బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి వాటికి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.ఈ నిబంధనలు యూపీఐ (UPI) ఆటో-పే, డెబిట్/క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి.ఈ-మాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు.అనధికారిక లావాదేవీలు జరిగితే, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది.ముందస్తు హెచ్చరికలు తప్పనిసరికస్టమర్ల ప్రమేయం లేకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా ఉండేందుకు ఆర్బీఐ 'అలర్ట్ సిస్టమ్'ను తప్పనిసరి చేసింది. నగదు డెబిట్ అయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్కు మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. ఇందులో మర్చంట్ పేరు, మొత్తం, డెబిట్ తేదీ స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్ అందిన తర్వాత కస్టమర్ ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేసే లేదా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది.
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
పెట్టుబడి ప్రపంచంలో 'లెజెండ్'గా పేరొందిన వారెన్ బఫెట్.. కేవలం 11 ఏళ్ల వయస్సులో మూడు షేర్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు రూ. 11 లక్షల కోట్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలిచారు. మరి అతి తక్కువ డబ్బుతో పెట్టుబడి మొదలుపెట్టేవారికి ఆయన ఇచ్చే సలహాలేంటి? సామాన్యులు కూడా బఫెట్ రూట్ లో సంపదను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.చిన్న మొత్తంతోనే శ్రీకారం చుట్టండిచాలామంది తమ దగ్గర లక్షలాది రూపాయలు ఉంటేనే షేర్ మార్కెట్లోకి రావాలని అనుకుంటారు. కానీ బఫెట్ దృష్టిలో ఇది తప్పు. మీ దగ్గర రూ. 500 లేదా రూ. 1000 ఉన్నా సరే, పెట్టుబడిని తక్షణమే ప్రారంభించాలి. "సమయం మీ వైపు ఉంటే, చిన్న మొత్తమే భవిష్యత్తులో కొండంత సంపదగా మారుతుంది" అని ఆయన పదే పదే చెబుతుంటారు.ఇండెక్స్ ఫండ్స్: సామాన్యుల ఆయుధంఏ షేర్ కొనాలి? ఏ కంపెనీ బాగుంటుంది? అన్న అవగాహన లేని వారికి బఫెట్ సూచించే ఉత్తమ మార్గం 'లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్'. కంపెనీలను విశ్లేషించే సమయం, నైపుణ్యం లేని వారికి ఇవి అత్యంత సురక్షితమైనవని ఆయన నమ్ముతారు. అమెరికాలో S&P 500 లాగా, భారత్లో నిఫ్టీ 50 (Nifty 50) వంటి ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు.తెలివితేటలే అసలైన పెట్టుబడితెలివితేటలే అసలైన పెట్టుబడి అని వారెన్ బఫెట్ నమ్ముతారు. అందుకే జ్ఞానం కోసం అనే పుస్తకాలు ఆయన తిరగేస్తుంటారు. ఇప్పటికీ రోజుకు కనీసం 500 పేజీలు చదువుతారు. "అన్నింటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ జ్ఞానం మీద పెట్టేదే" అని ఆయన అంటారు. పెట్టుబడులు పెట్టేవారు కంపెనీల వార్షిక నివేదికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవాలి. బెంజమిన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' వంటి పుస్తకాలు చదవాలని ఆయన సూచిస్తుంటారు.కాంపౌండింగ్ మాయాజాలంబఫెట్ సంపదలో 90 శాతం ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది. దీనికి కారణం 'చక్రవడ్డీ' (Compounding). మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టి, దాన్ని ఎంత కాలం కొనసాగిస్తారో, మీ డబ్బు అంత వేగంగా రెట్టింపు అవుతుంది. అందుకే "పెట్టుబడి పెట్టడానికి నిన్నటి కంటే ఈరోజే సరైన సమయం" అని ఆయన చెబుతారు.కేవలం ఎఫ్డీ(FD)లు, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకుంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. ధనవంతులు కావాలంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనివార్యమని బఫెట్ సిద్ధాంతం చెబుతోంది. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకుని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఎవరైనా ‘కోటీశ్వరులు’ కావచ్చని బఫెట్ సూత్రం నిరూపిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ‘సీనియర్ సిటిజన్లు’
కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్ ప్రకారం కేవలం సీనియర్ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది. 80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్ చెకప్కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది. గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్ సబి్మట్ చేస్తే టీడీఎస్ చేయరు. చేయకపోతే టీడీఎస్ రివకరీ చేసి గవర్నమెంట్ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్ ఇన్కం. ఇప్పుడు దీని లిమిట్ రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే... (ఎ) కేవలం పెన్షన్ ఉండాలి (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్ రికవరీ అయ్యి గవర్నమెంట్ ఖజానాలో జమ అయ్యి ఉండాలి ఈ సదుపాయం కొనసాగుతుంది. ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్ అస్సెస్మెంట్ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. ఫైలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రీ ఫిక్స్డ్ ఫారమ్లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్గా రిటర్ను వేయవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి.
విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్
నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్ను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్ ఫోకస్డ్ టర్మ్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్ ఇన్సూర్డ్తో ప్లాన్ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది.


