Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India US Trade Deal Know The Lower 18 Percent Tariffs And Duty Free Boost1
భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

భారత్ - అమెరికా మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం తరువాత.. దేశీయ ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఈ ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలను కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ వెల్లడిస్తూ.. సుంకాల తగ్గింపులు, జీరో డ్యూటీ వస్తువులు, ఎగుమతులు మొదలైన విషయాలను పేర్కొన్నారు.సున్నా టారిఫ్ఈ ఒప్పందంతో అనేక భారత ఉత్పత్తులు అమెరికాకు సున్నా టారిఫ్‌తో ఎగుమతి చేయవచ్చని మంత్రి చెప్పారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, రత్నాలు, వజ్రాలు, ఔషధ ఉత్పత్తులు వంటి వాటికి ఇది వర్తిస్తుంది. అలాగే మసాలాలు, టీ, కాఫీ, కొబ్బరి, కొబ్బరి నూనె, జీడిపప్పు, పలు పండ్లు, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కూడా అమెరికా సున్నా టారిఫ్ విధించనుంది.అమెరికాకు ఎగుమతి చేసే అనేక వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం ఉండదు. ఇందులో సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరికాయలు, కొబ్బరి నూనె, జీడిపప్పు మాత్రమే కాకుండా అనేక రకాల పండ్లు & కూరగాయలు ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల దేశంలోని రైతులకు ఎలాంటి నష్టం జరగదని మంత్రి స్పష్టంగా చెప్పారు.The India-US Trade Deal will not only provide greater access to the US market for Indian products but also support our labour intensive sectors. Additionally, it will give a big boost to our digital infrastructure.#IndiaUSJointStatement pic.twitter.com/AAUB8x9MGM— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026ఎగుమతులకు ప్రోత్సాహంఅదేవిధంగా అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ పండ్లకు కూడా ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని తెలిపారు. గ్రీన్ టీ, కాబూలీ చన, పెసరపప్పు, నూనెగింజలు, వేరుశెనగలు, మాల్ట్ & మాల్ట్ ఆధారిత ఉత్పత్తులు, మద్యంలేని పానీయాలు, స్టార్చ్, ఎథనాల్, పొగాకు వంటి ఉత్పత్తులకు కూడా ఈ ఒప్పందంలో రాయితీలు లేవని గోయల్ పేర్కొన్నారు. మొత్తం , ఈ వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతులను ప్రోత్సహిస్తూ, దేశీయ రైతులు మరియు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేలా రూపొందించబడిందని ఆయన స్పష్టం చేశారు.భారత్‌లోకి జన్యుమార్పిడి (జీఎం) ఉత్పత్తులను దిగుమతి చేయబోమని గోయల్ స్పష్టం చేశారు. అంతే కాకుండా మన దేశంలో పండే అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ పండ్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని, వీటి దిగుమతులు అనుమతించబోమని చెప్పారు. గ్రీన్ టీ, కాబూలీ చనా, పెసలు, నూనె గింజలు, వేరుశెనగ, మాల్ట్, మాల్ట్ ఆధారిత ఉత్పత్తులు, మద్యంలేని పానీయాలు, స్టార్చ్, ఎథనాల్, పొగాకు వంటి వాటికీ ఎలాంటి టారిఫ్ సడలింపులు లేవని తెలిపారు.వీటిపై 18 శాతం సుంకంభారత్ ఎగుమతి చేసే వస్త్రాలు, దుస్తులు తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్ & రబ్బరు ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, గృహాలంకరణ, చేతివృత్తుల ఉత్పత్తులు & కొన్ని యంత్రాలపై అమెరికా 18 శాతం సుంకం విధించింది.సుంకాల తగ్గింపుతో.. భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో స్వల్ప ప్రయోజనం చేకూరనుంది. పొరుగు దేశాలైన చైనా (35 శాతం), బంగ్లాదేశ్ (20 శాతం), ఇండోనేషియా (19 శాతం) కూడా భారత్ (18 శాతం) కంటే ఎక్కువ సుంకాలను ఎదుర్కొంటున్నాయి. ఇదీ చదవండి: మీ దగ్గరున్న వెండి స్వచ్ఛమైనదా, కాదా?: తెలుసుకోండిలా..

AI Disruption Raises Fears Over the Future of White Collar Jobs Anthropic CEO Predicts2
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?

వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు గడ్డుకాలం మొదలైందా? రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా? విజృంభిస్తున్న ‘ఏఐ(AI) మహమ్మారి’ మానవ ఉద్యోగాలను మింగేస్తోందన్న భయాలు నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలను సైతం వణికిస్తున్న ‘ఆంథ్రోపిక్’ సీఈవో డారియో అమోడేయి చేసిన తాజా హెచ్చరికలు ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తుపై భయాన్ని రేకెత్తిస్తున్నాయి.ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర పతనంఅమోడేయి వ్యాఖ్యల తర్వాత విడుదలైన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు ఆయన అంచనాలకు అనూహ్యంగా సరిపోలడం ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. తాజా లేబర్ డేటా ప్రకారం.. గత డిసెంబర్‌ ఆఖరు నాటికి అమెరికాలో ఉద్యోగ ఖాళీలు 65.4 లక్షలకు పడిపోయాయి. 2020 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.ఏఐ వల్ల భారీ ఉద్యోగ నష్టంజనవరి చివరలో అమోడేయి “ది అడోలెసెన్స్ ఆఫ్ టెక్నాలజీ” అనే పేరుతో సుమారు 20,000 పదాల సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇవీ..“రాబోయే 1–5 సంవత్సరాల్లో ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ వైట్‌ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం వరకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు, 1–2 సంవత్సరాల్లో మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యం గల ఏఐ కూడా సాధ్యమే”2021లో ఆంథ్రోపిక్‌ను సహ-వ్యవస్థాపకుడిగా స్థాపించిన అమోడేయి, ఏఐ అభివృద్ధి వేగం కారణంగా లేబర్ మార్కెట్‌లో ‘అసాధారణ, బాధాకరమైన షాక్’ తప్పదని హెచ్చరించారు.“ఏఐ పురోగతి వేగం గతంలో వచ్చిన ఇతర సాంకేతిక విప్లవాల కన్నా వేగంగా ఉంది. ఉద్యోగం చేసే విధానం మారడమే కాదు, కొత్త ఉద్యోగాలకు మారాల్సిన అవసరం కూడా ప్రజలకు తీవ్ర సవాల్‌గా మారుతుంది”ఏఐ ఏదో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడం కాదు.. ‘మానవ కార్మిక శక్తికే ప్రత్యామ్నాయం’గా మారుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. న్యాయ శాఖ, ఫైనాన్స్, కన్సల్టింగ్‌ వంటి రంగాలు కూడా దీని ప్రభావానికి లోనవుతాయని హెచ్చరించారు.తరువాత ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ, ఉద్యోగ మార్కెట్‌పై ఏఐ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.నియామకాలు కనిష్టానికి.. తొగింపులు గరిష్టానికి..ఈ వారం విడుదలైన తాజా డేటా, కోవిడ్‌-19 మహమ్మారి తర్వాత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తోంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు మళ్లీ 65.4 లక్షలకే పరిమితమయ్యాయి. అదే రోజు విడుదలైన ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ నివేదిక ప్రకారం.. జనవరిలో యూఎస్‌ కంపెనీలు కేవలం 5,306 నియామక ప్రణాళికలను మాత్రమే ప్రకటించారు. 2009 నుంచి డేటా సేకరణ ప్రారంభించిన తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య.ఇదిలా ఉండగా, జనవరి 31తో ముగిసిన వారంలో 2.31 లక్షల మంది తాము నిరుద్యోగులుగా ఉన్నట్లు క్లెయిమ్‌ చేశారు. ఇది గత వారంతో పోలిస్తే 22,000 పెరుగుదల. అమెజాన్, యూపీఎస్ వంటి సంస్థలు ప్రకటించిన భారీ తొలగింపులు ఈ జనవరిని గ్రేట్ రిసెషన్ తర్వాత మళ్లీ అంత చెత్త నెలగా మార్చాయని ఛాలెంజర్ నివేదిక పేర్కొంది.నెలవారీ గణాంకాల ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు 1,08,435 ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇది డిసెంబర్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ కాగా, 2025 జనవరితో పోలిస్తే రెండింతలకుపైగా ఉంది. ఈ తొలగింపుల్లో అమెజాన్, యూపీఎస్ సంస్థల వాటా 40 శాతం. రవాణా, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఆర్థిక రంగాల్లో ఈ కోతలు ఎక్కువగా నమోదయ్యాయి.ఏఐ పాత్ర ఎంతవరకు?ఏఐ కారణంగా నేరుగా 7,624 ఉద్యోగ కోతలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. అయితే, “తొలగింపులపై ఏఐ ప్రభావం ఎంతవరకు ఉందో ఖచ్చితంగా చెప్పడం కష్టం” అని ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ ఛీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ ఆండీ ఛాలెంజర్ చెప్పారు. అయినా, చాలా సంస్థలు ఏఐ అమలుపై దృష్టి పెడుతున్నాయని, మార్కెట్ కూడా ఏఐని ప్రస్తావించే కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Rising Demand for Green Warehouses Leasing to Touch 40 45 Million sq ft 3
గ్రీన్‌ గోదాంలకే డిమాండ్‌.. ఈ ఏడాది భారీ లీజులు!

భవనాలే కాదు గిడ్డంగులు కూడా హరిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. తక్కువ విద్యుత్‌ వినియోగం, నీరు, వ్యర్థాల రీసైక్లింగ్, సౌర విద్యుత్‌ వంటి సౌకర్యాలు ఉండే గ్రీన్‌ గిడ్డంగులకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సమర్థవంతమైన ఇంధన వినియోగం, వ్యర్థాలు, కార్బన్‌ ఉద్గారాలు తగ్గించే పర్యావరణ ఉత్పత్తులు, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సొల్యూషన్, స్మార్ట్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, తాపన/శీతలీకరణ అవసరాలను తగ్గించేందుకు మెరుగైన ఇన్సులేషన్, సహజ కాంతి, వెంటిలేషన్‌ను వినియోగించే వీలు కల్పించే నిర్మాణ సామగ్రి, డిజైన్‌లను ఉపయోగించడం వంటి స్థిరమైన, పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యత ఇచ్చే గిడ్డంగులకు ఉజ్వల భవిష్యత్తు ఉండనుంది. పర్యావరణ, సామాజిక, పాలన(ఈఎస్‌జీ)లకు ప్రాధాన్యత ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాపర్టీగా గ్రీన్‌ గిడ్డంగులు ఆకర్షణగా నిలుస్తాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెరిగిన దేశీయ వినియోగం, మెరుగైన స్థూల ఆర్థిక స్థిరత్వం, సులువైన రుణ ప్రక్రియలతో ఈ ఏడాది గిడ్డంగులు, లాజిస్టిక్స్‌ రంగంలో డిమాండ్‌ అధికమైంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2026లో ఈ రంగం వార్షిక శోషణ 4–4.5 కోట్ల చ.అ.లకు చేరుకుంటుంది. మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారించడంతో ఈ రంగం నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందుతుంది.పట్టణాల్లోనూ.. తయారీ ఆధారిత డిమాండ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం(పీఎల్‌ఐ) పథకాలు, చైనా+1 వ్యూహం వంటి చొరవలతో ఈ రంగానికి మద్దతు లభిస్తుంది. దీంతో పెద్ద ఫార్మాట్, గ్రేడ్‌–ఏ గిడ్డంగులు, పారిశ్రామిక సౌకర్యాలకు ఆదరణ పెరుగుతుంది. మరోవైపు ఈ–కామర్స్‌ వినియోగం పెరగడం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో భూముల ధరలు ఉండటం, వేగవంతమైన నిర్మాణ అనుమతులు తదితర కారణాలతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా గిడ్డంగులు, లాజిస్టిక్స్‌ రంగానికి కీలక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.హైదరాబాద్‌లో.. గత ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3.87 కోట్ల చ.అ. గిడ్డంగుల స్థలం లీజుకు పోయింది. 2024లో జరిగిన 4.49 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 14 శాతం తక్కువ. బెంగళూరు, చెన్నై మినహా అన్ని నగరాల్లోనూ వేర్‌హౌస్‌ లీజులు క్షీణించాయి. 2025లో అత్యధికంగా ముంబైలో 1.52 కోట్ల చ.అ. వేర్‌హౌస్‌ స్థలం లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌లో 22 లక్షల చ.అ. స్పేస్‌ లీజుకు పోయింది. 2024లో నగరంలో 32 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే ఏడాదిలో ఏకంగా 31 శాతం లావాదేవీలు తగ్గాయి. దేశీయ స్థాయిలో గిడ్డంగుల లావాదేవీలలో నగరం వాటా 2024లో 7 శాతంగా ఉండగా.. 2025 నాటికి 6 శాతానికి తగ్గింది. లీజు కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ నగరంలో గిడ్డంగుల అద్దెలు మాత్రం ఏడాదిలో 10 శాతం పెరిగాయి. ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.20.8గా ఉంది.

Start considering alternative livelihoods Zoho Sridhar Vembu advice to coders4
‘ఐటీ వాళ్లు వేరే పని వెతుక్కోవాల్సిందే’

ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై ఆన్‌లైన్‌లో కొత్త చర్చను రేకిత్తించారు జోహో కోఫౌండర్‌ శ్రీధర్ వెంబు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లు కోడ్ రాయడంలో వేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా ఏఐ సహాయంతో భగవద్గీత యాప్‌ను అభివృద్ధి చేసిన విషయంపై ‘ఎక్స్‌’ (ట్విట్టర్)లో వచ్చిన ఒక పోస్ట్‌కు స్పందించిన వెంబు, “కోడ్ రాయడంపై ఆధారపడి బతుకుతున్నవారు ప్రత్యామ్నాయ జీవనోపాధుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. ఇది తనకు కూడా వర్తిస్తుందన్న ఆయన, ఇది భయాందోళనలతో కాకుండా ప్రశాంతంగా అంగీకరించాల్సిన వాస్తవమని పేర్కొన్నారు.“ఆ పోస్ట్‌లో చెప్పింది కేవలం భగవద్గీత యాప్ మాత్రమే కాదు. ఆంథ్రోరోపిక్ (Anthropic) సంస్థ వారి క్లాడ్ ఏఐ (Claude AI)తో మొత్తం సీ కంపైలర్‌ను నిర్మించింది. ఇదేదో చిన్న ఇంజినీరింగ్ ఫీట్ కాదు” అని వెంబు రాసుకొచ్చారు.ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఏఐ విప్లవం భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను ఎలా రూపుదిద్దుతుందన్న విషయంపై గూగుల్ జెమినీ చాట్‌బాట్‌తో తాను లోతైన చర్చ నిర్వహించానని వెంబు వెల్లడించారు. ఆ సంభాషణలో, కార్మికుల అవసరం తగ్గిన తర్వాతి ఆర్థిక వ్యవస్థ (post-labor economy)లో సమాజం ఎలా అభివృద్ధి చెందగలదో చర్చించడమే కాకుండా, ఏఐ తన సొంత సమాధానాలను కూడా విమర్శించవచ్చంటూ సవాలు చేసినట్లు చెప్పారు.ఈ సంభాషణల ఆధారంగా, భవిష్యత్తు రెండు విధాలుగా ఉండవచ్చని వెంబు అభిప్రాయపడ్డారు. ఏఐపై యాజమాన్యం ఎవరి చేతిలో ఉంటుందన్నదే కీలకమని పేర్కొంటూ టెక్నాలజీ మానవ జీవితంలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండి, మనుషులకు కుటుంబం, ప్రకృతి, కళ, సంగీతం, సంస్కృతి, క్రీడలు, పండుగలు, విశ్వాసంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఇస్తుందని ఆశావాద దృక్కోణంలో చెప్పుకొచ్చారు. ఇక నిరాశావాద దృక్కోణంలో.. ఈ టెక్నాలజీ ‘కేంద్రీకృత నియంత్రణ’కు దారి తీస్తుందని హెచ్చరించారు.శ్రీధర్‌ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వెంబు అంచనాలతో ఏకీభవించగా, మరికొందరు విభేదిస్తూ ఏఐ కోడింగ్ మానవ మేధస్సుకు ముగింపు కాదని వాదించారు.Examples are now pouring in about AI-assisted Code Engineering productivity. The quoted post is a Bhagwad Gita app. Anthropic has built an entire C compiler with their Claude AI. That is not an easy engineering feat at all.At this point, it is best for those of us who… https://t.co/KbgVX8G9nU— Sridhar Vembu (@svembu) February 6, 2026

Gold and Silver rates on 7th February 2026 in Telugu states5
పసిడి ఆశలకు బ్రేక్‌.. మళ్లీ రేటెక్కిన బంగారం

వరుస తగ్గుదలతో ఆనందంలో ఉన్న పసడి ప్రియుల ఆశలకు బ్రేక్‌ పడింది. బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

New Fame for Shamshabad Realty Buzz Returns6
శంషాబాద్‌కు కొత్త ఫేమ్‌.. ఇక మరో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌!

భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్‌.. ఇకముందు దేశానికే ఏరోట్రోపోలిస్‌ హబ్‌గా నిలవనుంది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్‌ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ నగరంగా శంషాబాద్‌ అభివృద్ధి చెందనుంది. ఇక్కడ హైస్పీడ్‌ టరి్మనల్‌ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో.. శంషాబాద్‌ ఇక శివారు ప్రాంతం కాదు.. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారనుంది. – సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏరోస్పేస్‌ హబ్‌గా అభివృద్ధి చెందిన శంషాబాద్‌.. తాజా ప్రకటనతో అటు ఏరోస్పేస్, ఇటు ట్రయిన్‌ నెట్‌వర్క్‌ మిశ్రమంతో ఏరోట్రోపోలిస్‌ హబ్‌గా శంషాబాద్‌ అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ నగరంలోనైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం సాధారణంగానే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.కానీ, శంషాబాద్‌ ప్రాంతానికి మెరుగైన రోడ్లతో పాటు విమానయానం, రైలు మార్గం.. అన్ని రకాల మెరుగైన రవాణా సదుపాయాలతో అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు శంషాబాద్‌కు తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో అనుసంధానమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో మెట్రో రైలు, రీజినల్‌ రింగ్‌ రోడ్‌(త్రిబుల్‌ ఆర్‌)తో కూడా అనుసంధానమవుతుంది.ఐటీ హబ్‌లతో అనుసంధానం.. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌లలో రాజీవ్‌గాంధీ విమానాశ్రయం ఒకటి. ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా నగరాలు అనుసంధానమై ఉన్నాయి. ఏటా 2.7 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలే ప్రభుత్వం శంషాబాద్‌ వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన నగరంతో పాటు గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ వంటి ఐటీ కేంద్రాలకు ప్రయాణం సులువవుతుంది.విమానాశ్రయ కారిడార్‌ సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్‌ ఏర్పడుతోంది. అలాగే దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌ నగరాలను ఈ హైస్పీడ్‌ రైలు అనుసంధానించనుంది. ఐటీ ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరొక నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. తద్వారా విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.ఈ ప్రాంతాలకు డిమాండ్‌.. 2–3 ఏళ్లలో శంషాబాద్, ఔటర్‌ వెంట ఉన్న ప్రాంతాలలో భూముల ధరలు 15–25 శాతం మేర పెరిగాయి. విమానాశ్రయం, గిడ్డంగులు, లాజిస్టిక్‌ హబ్‌లు, ప్రతిపాదిత మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. తాజా ప్రకటనతో శంషాబాద్‌ నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, మణికొండ, హైటెక్‌ సిటీ, కోకాపేట ప్రాంతాలలో భారీ నివాస సముదాయాలు వస్తాయి.సమగ్ర అభివృద్ధి దిశగా..ఈ ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే కేవలం హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు వస్తే చాలదు. ఆస్పత్రులు, పాఠశాలలు, రిటైల్, ఇతర పౌర సౌకర్యాలు కూడా అదే స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజువారీ అవసరాల కోసం ప్రధాన నగరంపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది.ప్రస్తుతం శంషాబాద్‌లో అపార్ట్‌మెంట్ల ధరలు చ.అ.కు రూ.6–8 వేలుగా ఉండగా.. భూముల ధరలు గజానికి రూ.55–60 వేలుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన సంస్థలు శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం కోసం శంషాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల వైపు దృష్టిసారించాయి. 2027 నాటికి ఏటా 10–17 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సీ–సూట్‌ ట్రాన్సిట్‌ ఆఫీస్‌గా..స్థిరాస్తి రంగంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏరోట్రోపోలిస్‌ హబ్‌తో శంషాబాద్‌ ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఇంజిన్‌ను సృష్టిస్తుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గుతుండటంతో ఈ ప్రాంతం ఎగ్జిక్యూటివ్‌లకు, కార్పొరేట్లకు సీ–సూట్‌కు ట్రాన్సిట్‌ ఆఫీస్‌గా మారుతుంది. ఫైవ్‌స్టార్‌ హాస్పిటాలిటీ, కన్వెన్షన్‌ సెంటర్లకు డిమాండ్‌ ఏర్పడుతుంది. అలాగే మెరుగైన రవాణా సదుపాయాలతో ఏవియేషన్, ఫార్మా వంటి పారిశ్రామిక కారిడార్లు, లగ్జరీ రెసిడెన్షియల్‌ క్లస్టర్లుగా అభివృద్ధి చెందుతాయి.

Advertisement
Advertisement
Advertisement