ప్రధాన వార్తలు
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ దౌడు తీశాయి. ఒక్కసారిగా భారీ స్థాయిలో ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Price) రూ.1500 పైగా పెరిగాయి. వెండి ధరలు అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
Stock Market Updates: ఫ్లాట్గా సెన్సెక్స్.. నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 9 పాయింట్లు నష్టంతో 26,318 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 117 పాయింట్లు క్షీణించి 85,644 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.5బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 60.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.20 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.2 శాతం లాభపడింది.నాస్డాక్ 0.03 శాతం పెరిగింది.Today Nifty position 05-01-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Income Tax: కొత్త చట్టంలో జీతాల మీద ఆదాయం
ముందుగా టాక్స్ కాలమ్ పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... అరవై ఏళ్లు దాటిన ఆదాయపన్ను చట్టంకు బదులుగా దాని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను 2025 వస్తోంది. పేరులో 2025 అని ఉన్నా అమలు మాత్రం 1.4.2026 నుంచి వస్తోంది. ఈ వారం జీతాలకు సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం 31–3–2026తో ముగుస్తుంది. దీనికి, అంటే 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2026–27ని అస్సెట్మెంట్ ఇయర్ అంటారు. ఆర్థిక సంవత్సరం 2024–25 సంవత్సరం వరకు 1961 చట్టం వరిస్తుంది. 2024–25, అంతకుముందు ఆర్థిక సంవత్సరం వర్తించే 1961 చట్టంలో జీతం నిర్వచనం, దీని పరిధి, పలు అంశాలు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా, యజమాని తన ఉద్యోగికి ఇచ్చిన డబ్బుకి ఇవి వర్తిస్తాయి.ఇక టాక్సబిలిటీ విషయాకొస్తే, చేతికొచ్చినా, రాకపోయినా హక్కుగా ఏర్పడ్డా, జీతం పన్ను పరిధిలోకి వస్తుంది. డిడక్షన్ల జోలికొస్తే సాండర్డ్ డిడక్షన్ను, వృత్తి పన్ను డిడక్షన్ చేస్తారు. పాత పద్ధతిలో అయితే ఛాప్టర్ VI ప్రకారం మినహాయింపులు ఇస్తారు. ఇవి చాలా ఉన్నాయి. కొత్త పద్ధతి ప్రకారం డిడక్షన్లు చాలా తక్కువ. పాత పద్దతి చూస్తే తక్కువ శ్లాబులు .. ఎక్కువ రేట్లు. కొత్త పద్ధతిలో బేసిక్ శ్లాబ్ ఎక్కువ. శ్లాబులు ఎక్కువ. రేట్లు చాలా తక్కువ.ఇప్పుడు రాబోయే మార్పులు: 🔸 చట్టం సులభరీతిలో ఉంది. 🔸 నిర్వచనాలు, పన్ను పరిధి అంశాల్లో ఎటువంటి మార్పులేదు. 🔸 ఇక నుంచి అకౌంటింగ్ ఇయర్, అస్సెస్మెంట్ సంవత్సరం అని ఉండదు. 🔸 ఒకే ఒక పదం... దానిపేరే ఆదాయపు సంవత్సరం. కావున ఎటువంటి పొరబాటుకి తావులేదు. 🔸 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి మొత్తం నికర ఆదాయం .. అంటే టాక్సబుల్ ఇన్కం .. సంవత్సరానికి రూ.12,00,000 వరకు పన్ను పడదు. ఉద్యోగస్తులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేల వరకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకు రూ.12,75,000ల వరకూ ఎటువంటి పన్ను పడదు. 🔸 మీ ఆదాయం... నికర ఆదాయం రూ.12,00,00 లోపల ఉన్నట్లు అయితే ట్యాక్స్ పడదు. 🔸 దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రణాళిక చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇంటి మీద హక్కులు జాయింట్గా ఉంటే, ఆ అద్దెని ఇద్దరికి అకౌంటులో సర్దుబాటు చేయడం. రెండవ ఉదాహరణగా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ... ఒకరి పేరు మీదనే అన్ని డిపాజిట్లు ఉంచుకోకుండా ఇతర భాగస్వామి మీద బదిలీ చేయడం. అయితే ఈ రెండింట్లో ఏది చేసినా కాగితాలు ముఖ్యం. మరే, అగ్రిమెంట్లు రాసుకోకపోయినా ఓనర్షిప్.. టైటిల్ డీడ్స్లో ఇద్దరి పేరుండటం, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఆయా వ్యక్తి పేరు మీద ఉండటం. 🔸 రిబేటు రూపంలో బేసిక్ లిమిట్ రూ.12,00,000 పెంచినట్లే తప్ప, ఆదాయం రూపంలో కాదు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. 🔸 2025–26 ఆర్థిక సంవత్సరం కొత్త పద్ధతి ప్రకారం బేసిక్ లిమిట్... శ్లాబులు... రేట్లు మీకు సుపరిచితమే. 🔸 అలాగే పాత పద్ధతిలో కూడా...చివరిగా, ప్రాథమిక, మౌలిక విషయాల్లో మార్పు లేనప్పటికీ, విషయ విశదీకరణలో, సరళత్వం కన్పిస్తుంది. కొత్త పద్ధతిలో వెళ్లడానికి ప్రోత్సాహకరంగా ఉంది. అవే సర్కిళ్లు, అవే డివిజన్లు, అవే పద్ధతులు, అదే మదింపు పద్దతి విధానం, నోటీసులు, సమన్లు, జవాబులు, వడ్డీలు, పెనాల్టీలు, అధికార్ల అభిమతం, హక్కులు, అధికారాలు, బాధ్యతలు, విధివిధానాలు మారవు. అలాగే కొనసాగుతాయి. పాతసీసాలో కొత్త నీరు. పేరు మారితే పెత్తనం పోతుందా. భాషను మార్చినా, వేషము మార్చినా అధికార్లు అలాగే ఉండాలి.
బంగారు గృహాల భారతదేశం
ప్రముఖ వజ్రాల వ్యాపార సంస్థ డీ బియర్స్ వజ్రాలను ‘‘స్త్రీలకు అత్యంత ప్రియమైనవిగా’’ ప్రచారం చేసినా, భారత మహిళల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నది మాత్రం బంగారమే. ఆభరణాలుగా అలంకరణకు మాత్రమే కాకుండా, విలువ తగ్గని ఆస్తిగా (ఖరీదైన కారు లేదా తాజా ఐఫోన్ లాగా కాదు) బంగారం భారతీయులకు సంపద సృష్టిలో విప్లవాత్మక పాత్ర పోషించింది.బిలియన్ డాలర్ల సంపద సృష్టి 2011 నుంచి 2024 మధ్య భారత్ భారీగా బంగారం దిగుమతి చేసుకుంది. దీనివల్ల వాణిజ్య లోటు పెరిగిందనే విమర్శలు వచ్చాయి. కానీ నేటి ధరలతో చూసుకుంటే, ఈ బంగారం భారత కుటుంబాలకు అసాధారణమైన సంపదను సృష్టించింది.ఈ కాలంలో దిగుమతి చేసిన బంగారం విలువ సుమారు ఒక ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.దాదాపు 175% పెరుగుదల. భారతదేశ ప్రస్తుత విదేశీ మారక నిల్వలకంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అప్పట్లో వాణిజ్య లోటుపై ఆందోళన వ్యక్తం చేసిన విశ్లేషకులు, దీర్ఘకాల సంపద సృష్టిని అంచనా వేయలేకపోయారు.ఆభరణాల రీ–ఎగుమతులు – గ్లోబల్ జువెలరీ హబ్గా భారత్ దిగుమతి చేసిన బంగారంలో కొంత భాగం ఆభరణాల రూపంలో మళ్లీ విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఇది ప్రపంచ ఆభరణాల తయారీ, వ్యాపార కేంద్రంగా భారతదేశానికి ఉన్న స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే దేశీయంగా నిల్వ ఉన్న అపారమైన బంగారం సంపద ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించదు.భారత కుటుంబాల వద్ద 25,000–30,000 టన్నుల బంగారం అంచనాల ప్రకారం భారత కుటుంబాల వద్ద 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నిల్వలలో ఒకటి. ప్రస్తుత ధరలతో దీని విలువ 3.4 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.1 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ఇది భారత గృహ సంపదలో బంగారం ఎంత కీలక భాగమో స్పష్టం చేస్తోంది.2025లో బంగారం బ్లాక్బస్టర్, 2026పై అంచనాలు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు ఇవన్నీ కలిసి 2025లో బంగారాన్ని బ్లాక్బస్టర్ ఆస్తిగా మా ర్చాయి. భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల కారణంగా డిమాండ్ నిలకడగా కొనసాగింది. అయితే 2026కి చూస్తే, బంగారంపై దృక్పథం సానుకూలంగానే ఉన్నా కొంత జాగ్రత్త అవసరం. ద్రవ్య విధానాలు, వడ్డీ రేట్లు, కరెన్సీ మార్పులు బంగారం ధర విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ద్రవ్యోల్బణం దీర్ఘకాలం కొనసాగితే బంగారం కొనుగోలు శక్తిని కాపాడే కీలక రక్షణగా నిలుస్తుంది. వడ్డీ రేట్లు తీవ్రంగా పెరిగినా, దీర్ఘకాలంలో బంగారం విలువ నిలకడగా ఉంటుంది.పోర్ట్ఫోలియోలో బంగారం ఆర్థిక నిపుణులు సాధారణంగా పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 5–10% బంగారానికి కేటాయించమని సూచిస్తారు. ఇది ఈక్విటీల వృద్ధితో సమతుల్యతను కలిగిస్తుంది. ఇప్పటికే భౌతిక బంగారం ఎక్కువగా కలిగి ఉన్నవారు, లిక్విడిటీ కోసం గోల్డ్ ఫండ్స్ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. కొత్త ఏడాదిలో బంగారంలో పెట్టుబడులకు కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వంటి మార్గాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.ఇటీవల ప్రభుత్వ నిబంధనల మార్పులతో, ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలు బంగారం వంటి కమోడిటీల్లో పెట్టుబడి పెట్టే కొత్త ఫండ్స్ను ప్రారంభించనున్నాయి. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ కేంద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో, భౌతిక బంగారం ఆధారిత, ప్రొఫెషనల్గా నిర్వహించే గోల్డ్ ఫండ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి రెసిడెంట్ ఇండియన్లు, ప్రవాస భారతీయులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తాయి.ముగింపు ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో, 2026లో కూడా బంగారం భారత పెట్టుబడిదారుల వ్యూహాత్మక ఆస్తిగా కొనసాగనుంది. ధరల్లో హెచ్చుతగ్గులు సహజమే అయినా, సంస్కృతి, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, అపారమైన నిల్వ విలువ ఇవన్నీ బంగారాన్ని సంపద రక్షణలో అనివార్య భాగంగా నిలుపుతున్నాయి. సంప్రదాయ బంగారంతో పాటు ఆధునిక పెట్టుబడి సాధనాలను కూడా వినియోగించుకుంటే, పెట్టుబడిదారులు లాభాలను పొందుతూనే ఆర్థిక ఉపద్రవాలను సమర్థంగా ఎదుర్కొగలరు.
కోటి ఆశలతో కొత్త ఏడాది
కొత్త కేలండర్ ఏడాదిలో దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ దౌడు తీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు యూటర్న్ తీసుకోవచ్చనే అంచనాలు, క్యూ3 ఫలితాలపై ఆశలు, ఊపందుకుంటున్న వినియోగం ఇందుకు దోహదపడచ్చని అంచనా. గత వారం సాంకేతిక అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడం దీనిని బలపరుస్తోంది! వివరాలు చూద్దాం.. ఈ వారం ప్రధానంగా భారత్సహా యూఎస్, చైనా పీఎంఐ ఇండెక్సుల గణాంకాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఆశావహ ఆటోరంగ విక్రయాలు, జోరుమీదున్న ఆర్థిక పురోగతి, పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి బలహీనతలు, వాణిజ్య టారిఫ్లు కొంతమేర ప్రతికూల ప్రభావానికి కారణంకాన‡ున్నాయి. దేశీయంగా చూస్తే → గత నెల హెచ్ఎస్బీసీ సరీ్వసుల పీఎంఐ, కాంపోజిట్(తయారీ) పీఎంఐ తుది గణాంకాలు వెలువడనున్నాయి. → వచ్చే వారం ప్రారంభంకానున్న క్యూ3 కార్పొ రేట్ ఫలితాల సీజన్పై ఆశావహఅంచనాలున్నాయి. 12న ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ అక్టోబర్–డిసెంబర్(క్యూ3) పనితీరును వెల్లడించనున్నాయి. → 2025లో దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా విదేశీ ఇన్వెస్టర్లు 18.9 బిలియన్ డాలర్ల(రూ. 1.66 లక్షల కోట్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈ బాటలో 2026 తొలి రెండు రోజుల్లో సైతం నికరంగా రూ. 7,608 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే గతంలో ఇలా జరిగిన తదుపరి ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న అంశాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. విదేశీ అంశాలు ఇలా → ఈ వారం 2025 డిసెంబర్ నెలకు చైనా తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ ఇండెక్సుల వివరాలు విడుదలకానున్నాయి. విదేశీ నిల్వలు, ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. మరోవైపు వివిధ యూఎస్ గణాంకాలు వెలువడనున్నాయి. సరికొత్త రికార్డ్ గత వారం నిఫ్టీ ఇంట్రాడేలో 26,340 పాయింట్లను తాకింది. సరికొత్త గరిష్టానికి చేరి రికార్డ్ నెలకొల్పింది. గత వారం నికరంగా సెన్సెక్స్ 721 పాయింట్లు(0.84%) పుంజుకుని 85,762 వద్ద నిలవగా.. నిఫ్టీ 286 పాయింట్లు(1.1%) ఎగసి 26,329 వద్ద స్థిరపడింది.బుల్లిష్ వేవ్లో.. యూఎస్ వెనెజువెలా ప్రెసిడెంట్ను బందీగా పట్టుకుని స్వదేశానికి తరలించిన నేపథ్యంలో ఈ వారం అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం సైతం స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే జీడీపీ వృద్ధి, క్యూ3 ఫలితాలపై అంచనాలు, ప్రభుత్వ వ్యయాలు వంటి అంశాలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు చెబుతున్నారు. వెరసి మార్కెట్లు బలాన్ని పుంజుకునేందుకే అధికంగా వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → గత వారం అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 26,000 స్థాయికి ఎగువన నిలుస్తూ 26,340 వద్ద కొత్త గరిష్టాన్ని అందుకుంది. దీంతో ఈ వారం నిఫ్టీ 26,720– 26,900 పాయింట్ల వరకూ బలపడవచ్చు. ఒకవేళ బలహీనపడితే 26,000– 25,750 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించే వీలుంది. → గత వారం 85,350 పాయింట్లను దాటి 85,762కు ఎగసింది. వెరసి ఈ వారం 86,800, 87,200 పాయింట్లవరకూ పురోగమించవచ్చు. ఇలాకాకుండా నీరసిస్తే 84,800– 84,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ కనిపించే అవకాశముంది. – సాక్షి, బిజినెస్ డెస్క్
మీ ‘లైఫ్’ పాలసీ సరైనదేనా..?
గుడ్డివాళ్లు ఏనుగును తాకితే...? తోక పట్టుకున్నవారికి అదో తాడులా... తొండం తాకిన వారికి అదో పాములా... నడుము భాగాన్ని తాకినవారికి అదో గోడలా అనిపించింది. అంతేతప్ప ఎవ్వరికీ అదో ఏనుగులా అనిపించలేదు. దేన్నయినా సమగ్రంగా చూడాలి తప్ప ఒకే కోణంలో చూడొద్దని చెప్పేటపుడు పురాణాల్లోని ఈ తత్వాన్ని గుర్తు చేస్తుంటారు. ప్రస్తుతం మనవాళ్లు కొంటున్న బీమా పాలసీలకూ ఇదే తత్వం వర్తిస్తోంది. ఎందుకంటే నూటికి 90 శాతం మంది బీమా అవసరాన్ని అర్థం చేసుకుని కొనటం లేదు. రకరకాల కోణాల్లో దాన్ని చూసి డబ్బులు వృథా చేస్తున్నారన్నది తాజా సర్వేల సారాంశం. ఈ సర్వేల ప్రకారం... కొందరేమో బంధుమిత్రులు బలవంతపెట్టారనో, ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేకో మొహమాటానికి బీమా పాలసీ తీసుకుంటున్నారు. మరికొందరేమో దీన్నో పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా చేసే పాలసీగా భావించి కొంటున్నారు. ఇంకొందరేమో గడువు తీరిన తరువాత తమ చేతికి ఎంత వస్తుందన్నదానిపైనే దృష్టి పెడుతున్నారు. నిజానికి ఈ మూడూ సరికాదు. బీమా అవసరాన్ని అర్థం చేసుకుని, ఆ అవసరం కోసమే దాన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ బీమా తప్పనిసరిగా ఉండాలి కూడా. అసలు బీమా అవసరమేంటో... డబ్బులు ఎలా వృథా అవుతున్నాయో... వీటినెలా నివారించాలో వివరించే ‘వెల్త్’ స్టోరీ ఇది... ‘ఎండోమెంట్’ ఇష్టమైతే... కష్టమే జీవిత బీమా తీసుకోవాలనుకున్నవారు ఎక్కువగా ఎండోమెంట్ ప్లాన్లను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇందులో లో పాలసీదారు మరణించినట్టయితే ఎంపిక చేసుకున్న కవరేజీ (సమ్ అష్యూర్డ్) మేర పరిహారం లభిస్తుంది. అలాకాకుండా పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా సరే... ఈ ప్లాన్లో ఇస్తామని చెప్పిన అంతిమ ప్రయోజనాన్ని అందిస్తారు. చాలా మందికి నచ్చేది ఇదే. ఎందుకంటే భారతీయ భావనలో ‘మనం లేకపోతే’ అనే పదం చాలామందికి నచ్చదు. మనం జీవించి ఉంటామన్న ఆశే అందరికీ ఉంటుంది. దానివల్లే... జీవించి ఉంటే ఇంత మొత్తం వస్తుందని ఎండోమెంట్ ప్లాన్లలో చెబుతుంటారు. చాలామంది దీన్ని చూసే కొంటుంటారు. కానీ ఇది సరికాదన్నది నిపుణుల మాట.తప్పనిసరిగా ‘టర్మ్’ ఉండాలి... అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అనే పేరులోనే ఉంది కదా... అది జీవితానికిచ్చే బీమా అని. మరి జీవితానికి బీమా చేసుకుంటే చాలు కదా! ఆ బీమా మొత్తం నుంచి కూడా పెట్టుబడి తరహాలో లాభాన్ని ఆశించటమెందుకు? లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్లు అన్నవి కేవలం రక్షణ కల్పించడానికే పనికొస్తాయి. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే ఇవి పరిహారాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ పాలసీ గడువు తీరాక కూడా పాలసీదారు జీవించి ఉంటే చేతికి రూపాయి కూడా రాదు. చాలా మందికి ఇదే నచ్చదు. ఒక్కసారి తేడా చూద్దాం!. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఏడాదికి రూ.10–12 వేల ప్రీమియాన్ని చెల్లిచండానికి సిద్ధపడతే... ఎండోమెంట్ ప్లాన్ను ఎంపిక చేసుకున్న సందర్భంలో రూ.2 లక్షల సమ్ అష్యూర్డ్తో కవరేజీ లభిస్తుంది. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఇంతే ప్రీమియానికి రూ.50 లక్షల వరకూ కవరేజీ లభిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే రూ.2 లక్షలు సరిపోతుందా? రూ.50 లక్షలయితే కొన్నాళ్లయినా ఆ కుటుంబం నిలదొక్కుకోగలదు కదా? పాలసీ గడువు ముగిశాక కూడా బతికి ఉంటే ఆ 2 లక్షలు వెనక్కి వస్తాయన్న ఉద్దేశంతో కంటే ఎండోమెంట్ పాలసీ మంచిదా? లేక పాలసీ గడువు ముగిశాక రూపాయి రాకపోయినా... ఈ మధ్యలో ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకోగల రూ.50 లక్షల పాలసీ మంచిదా? ఇదిగో... ఈ కోణంలో సమగ్రంగా ఆలోచిస్తే బీమా విషయంలో డబ్బులు వృథా కావు. తక్కువ కాలం... తక్కువ కవరేజీ వద్దు కొంతమంది జీవిత బీమా పాలసీలను 5 ఏళ్ల కాలానికి, పదేళ్ల కాలానికి, 15 ఏళ్ల కాలానికి కూడా తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు వీటినే అంటగట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి పాలసీలు అమ్మితే వారికి వచ్చే లాభం ఎక్కువ. ఎందుకంటే ఐదేళ్లు తిరిగేసరికి మీరు మళ్లీ ఇంకో పాలసీ తీసుకోక తప్పదు కదా... అందుకని!. ఇది కూడా డబ్బు వృథా చేయటమే. ఎందుకంటే పాలసీదారుకు కనీసం 70 ఏళ్లు వచ్చేవరకైనా కవరేజీ ఉండాలి. అది 30 ఏళ్ల వయసులో తీసుకున్నా... లేక 40 ఏళ్ల వయసులో తీసుకున్నా సరే!. ఎందుకంటే సాధారణ అంచనాల ప్రకారం పాలసీదారుకు , 70 ఏళ్లు వచ్చేసరికి తన పిల్లలు కూడా పెద్దవాళ్లయి ఉంటారు. 70లోగా ఏమైనా జరిగితే... బీమా కవరేజీ మొత్తం కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఒకవేళ 70 ఏళ్లు పూర్తయినా తను జీవించి ఉంటే పాలసీగడువు ముగిసిపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అప్పటికే కుటుంబం ఎంతో కొంత సెటిలై ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించి దీర్ఘకాలానికి జీవితబీమా తీసుకోవాలి తప్ప... స్వల్ప కాలానికి తీసుకుంటే అది డబ్బులు వృథా చేయటమే. దీనికితోడు చిన్నచిన్న కవరేజీ కుటుంబానికి సరిపోదని గుర్తుంచుకోవాలి. కుటుంబ పెద్ద వార్షిక సంపాదనకు కనీసం 10 నుంచి 20 రెట్ల వరకు కవరేజీ ఉంటే మంచిది. ఈ స్థాయి కవరేజీకి ప్రీమియం కట్టడం కేవలం టర్మ్ ప్లాన్లలోనే సాధ్యం.యులిప్లూ ఎండోమెంట్ లాంటివే... యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) కూడా ఒక రకంగా ఎండోమెంట్ లాంటివే. ఎండోమెంట్లో బీమా చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి, వచ్చిన రాబడిని పాలసీదారులకు చెల్లిస్తారు. యులిప్లలో మోరా్టలిటీ, ప్రీమియం అలోకేషన్ తదితర చార్జీలు మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో ఎండోమెంట్ కంటే యులిప్లలో కొంచెం అదనపు రాబడి (8 శాతం వరకు) ఆశించొచ్చు. కానీ, వీటిల్లో మొదటి ఐదేళ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. బీమా సంస్థలు చార్జీల రూపంలో ఎక్కువ మినహాయించుకుంటూ ఉంటాయి. పైగా ఇది కూడా బీమా, పెట్టుబడి కలిపిన సాధనం. కనుక కవరేజీ మెరుగ్గా ఉండదు. పన్ను మినహాయింపు చూడొద్దుఎండోమెంట్ ప్లాన్లలో మెచ్యూరిటీ గడువు తీరాక చేతికి అందే మొత్తంపై ఆదాయపు పన్ను ఉండదు. పైపెచ్చు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్ 80సీ కింద (పాత పన్ను విధానం) చూపించుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు. చాలా మంది ఈ ప్రయోజనం కోసం ఎండోమెంట్ ప్లాన్ కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి టర్మ్ ప్లాన్కు చెల్లించే ప్రీమియంపైనా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. కాకపోతే ఎండోమెంట్ ప్లాన్లతో చివర్లో వచ్చే మొత్తాన్ని చూసుకుంటే అది మనం చెల్లించిన ప్రీమియానికి సరిపడా ఉంటుంది. దీనికి బదులు తక్కువ ప్రీమియంతో వచ్చే టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగతా మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను పోను నికర రాబడి.. ఎండోమెంట్ ప్లాన్లలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇంకా పెరుగుతుంది. రైడర్లూ అవసరమే.. → జీవిత బీమాలో అదనపు రైడర్లూ మంచివే. ఎందుకంటే దేశంలో జీవిత బీమా క్లెయిమ్లలో 70 శాతం ప్రమాద మరణాలు లేదా ప్రమాదం కారణంగా వైకల్యానికి సంబంధించినవే ఉంటున్నాయి. అయినాసరే చాలామంది ఈ రైడర్లను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయక్కర్లేదు. ఏటా రూ.200 నుంచి 1,000కే రైడర్లను పొందొచ్చు. → యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ (ప్రమాద మరణం లేదా అంగ వైక ల్యం) రైడర్ల ను తప్పకుండా జోడించుకోవాలి. → వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ కూడా అవసరమే. దీనికి ప్రీమియం రూ.100–200 వరకే ఉంటుంది. ప్రమాదాల్లో వైకల్యం పాలైన సందర్భాల్లో భవిష్యత్తు ప్రీమియం చెల్లించాల్సిన అవసరాన్ని ఈ రైడర్ తప్పిస్తుంది. → జీవిత బీమా అయినా, ఆరోగ్య బీమా అయినా, చివరికి హోమ్ ఇన్సూరెన్స్ అయినా.. కనీసం రెండేళ్లకోసారి సమీక్షించుకోవాలి. ఆదాయంతోపాటు కుటుంబ బాధ్యతలూ పెరుగుతుంటాయి. తీసుకున్న కవరేజీ, అందులోని సదుపాయాలు తమ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా? అన్నది పరిశీలించుకోవాలి. అవసరమైతే, అదనపు కవరేజీ తీసుకోవాలి.
కార్పొరేట్
కోటి ఆశలతో కొత్త ఏడాది
మీ ‘లైఫ్’ పాలసీ సరైనదేనా..?
జీఎస్టీ తగ్గించినా లభించని ఊరట!
ఇక పిజ్జా హట్లో కేఎఫ్సీ.. రూ. 8,000 కోట్ల విలీనం!
సిగరెట్లపై భారీ ట్యాక్స్.. వచ్చే 1 నుంచే..
అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే..
చైనా కంపెనీ దెబ్బకు.. వెనుకబడ్డ మస్క్ టెస్లా!
ఉద్యోగాలకు పెరిగిన పోటీ!.. 9 కోట్లకు పైగా దరఖాస్తులు
సోమనాథ్ ఆలయంలో అంబానీ కుటుంబం: విరాళంగా రూ. 5కోట్లు
దేశీ ఫైనాన్స్కు విదేశీ జోష్
బంగారం రూ.2 లక్షలు.. వెండి రూ.3 లక్షలు?
గత ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడం...
న్యూ ఇయర్లో మొదటిసారి తగ్గిన గోల్డ్ రేటు: కొత్త ధరలు ఇలా..
వరుసగా రెండు రోజులు ధరలు తగ్గిన తరువాత.. బంగారం ధర...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: రెండో రోజూ..
జనవరి 1న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు (జ...
బ్యాంక్లకు ఆర్థిక శాఖ ఆదేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు...
పసిడి, వెండి ధరల తగ్గుదల.. కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమ...
బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్బీఎఫ్సీల నుంచి సవాళ్లు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ రం...
విజిలెన్స్ వ్యవహారాలను వెంటనే వెల్లడించాలి
ప్రభుత్వరంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు హోల్టైమ్ ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
గూగుల్ క్రోమ్ తిరుగులేని ప్రయాణం
ఇంటర్నెట్ వినియోగంలో ఒక విప్లవం వస్తుందని, ఏఐ ఆధారిత బ్రౌజర్లు వెబ్ బ్రౌజింగ్ తీరును పూర్తిగా మార్చేస్తాయని గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓపెన్ఏఐ మద్దతు ఉన్న అట్లాస్, పెర్ప్లెక్సిటీ ఆధ్వర్యంలోని కామెట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోని కోపైలట్ వంటివి సాంప్రదాయ బ్రౌజర్లకు ముగింపు పలుకుతాయని భావించారు. కానీ, 2025 ముగింపు దశకు చేరుకున్నా గూగుల్ క్రోమ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.భారత మార్కెట్లో క్రోమ్ ప్రభంజనంభారతదేశంలో సుమారు 90% బ్రౌజింగ్కుపైగా మార్కెట్ వాటాతో గూగుల్ క్రోమ్ అగ్రస్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఉండటం, గూగుల్ ఖాతాతో ఉన్న విడదీయలేని అనుబంధం ఇందుకు కారణమని తెలుస్తుంది. ఒపెరా, సఫారీ వంటివి సింగిల్ డిజిట్ వాటాకే పరిమితం కాగా, ఎడ్జ్, ఫైర్ఫాక్స్ 1% కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. క్రోమ్ 71% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, యాపిల్ సఫారీ (15%) రెండో స్థానంలో ఉంది. ఏఐను ఉపయోగిస్తున్న ఇతర బ్రౌజర్లు ఇప్పటికీ నామమాత్రపు వాటాకే పరిమితమయ్యాయి.ఈ లెగసీకి కారణం..కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉందనే కారణంతో వినియోగదారులు తమ దశాబ్ద కాలపు అలవాట్లను మార్చుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికిగల కారణాలు..జీమెయిల్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలతో క్రోమ్ ఇచ్చే అనుభవం మరే బ్రౌజర్ ఇవ్వలేకపోతోంది.కొత్త ఏఐ బ్రౌజర్ల అవసరం లేకుండానే గూగుల్ తన జెమిని(Gemini) ఏఐని నేరుగా క్రోమ్లోకి ఎంబెడ్ చేసింది.సెర్చ్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెంట్, ట్యాబ్ ఆర్గనైజర్ వంటి ఫీచర్లను క్రోమ్ వినియోగదారులకు వారి పాత అలవాట్లను మార్చకుండానే అందుబాటులోకి తెచ్చింది.చాలా ఏఐ బ్రౌజర్లు క్రోమ్లానే పనిచేస్తున్నాయి. వినియోగదారులకు తమ పాస్వర్డ్లు, హిస్టరీ, బుక్మార్క్లను వదులుకుని కొత్త బ్రౌజర్కు వెళ్లడానికి బలమైన కారణాలు కనిపించడం లేదు. ఏఐ ఫీచర్లు ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్ల రూపంలో కూడా లభిస్తుండటం మరో కారణం.ఏఐ ఏజెంట్ వైపు..ప్రస్తుత ఏఐ బ్రౌజర్లు కేవలం సమాచారాన్ని క్రోడీకరించడానికి (Summarization) లేదా పోల్చడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో బ్రౌజర్ల పాత్ర మారబోతోంది. వినియోగదారుడి తరపున స్వయంగా పనులు చేసే (ఉదాహరణకు: టికెట్లు బుక్ చేయడం, షాపింగ్ చేయడం, షెడ్యూల్ మేనేజ్ చేయడం) అటానమస్ ఏజెంట్గా బ్రౌజర్ మారినప్పుడు మాత్రమే క్రోమ్కు నిజమైన పోటీ ఎదురవుతుందనే వాదనలున్నాయి. బ్రౌజర్ అనేది ఒక విండోలా కాకుండా, ఒక పర్సనల్ అసిస్టెంట్గా మారినప్పుడు మాత్రమే మార్కెట్ వాటాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా?
జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు
ప్రస్తుతం ఉపయోగిస్తున్న జీమెయిల్ అకౌంట్లోని డేటాను కోల్పోకుండానే, ప్రైమరీ ఖాతాకి కొత్త ఐడీని క్రియేట్ చేసుకునే వీలు కలి్పస్తూ టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఫీచర్ని ప్రవేశపెట్టింది. దీన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచరు కారణంగా యూజరు కొత్త జీమెయిల్ ఐడీకి మారినా, పాత ఖాతాలో సేవ్ చేసుకున్న ఫొటోలు, మెసేజీలు, ఈమెయిల్స్ లాంటి డేటాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అధికారిక సపోర్ట్ పేజీలో పేర్కొంది. యూజర్లు తమ పాత లేదా కొత్త ఈమెయిల్ అడ్రెస్తో జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్లాంటి గూగుల్ సర్వీసులకు సైన్ ఇన్ చేయొచ్చని వివరించింది. ఇలా ఒకసారి కొత్త జీమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకున్నాక మళ్లీ 12 నెలల వరకు మరో కొత్త ఐడీని క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. పాత అడ్రెస్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కేటగిరీ కింద గూగుల్ అకౌంట్ సెటింగ్స్లోని ఈమెయిల్ సెక్షన్లో ఈ ఫీచరు లభ్యతను యూజర్లు చెక్ చేసుకోవచ్చు. డేటా భద్రతకు గ్యారంటీ ఉన్నప్పటికీ, కొన్ని యాప్ సెట్టింగ్లు మారిపోయే అవకాశం ఉన్నందున మార్పులు, చేర్పులను చేపట్టడానికి ముందు యూజర్లు తమ సమాచారాన్ని బ్యాకప్ తీసుకోవాలంటూ గూగుల్ సూచించింది.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం
ఏఐపై అంబానీ ఫోకస్
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్, టెలికం వరకు వివిధ రంగాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రాబోయే రోజుల్లో అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ దిగ్గజంగా రూపాంతరం చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచుకోవాలని, దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై పది రెట్లు సానుకూల ప్రభావం చూపేలా వ్యవహరించాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనకు తోడ్పడేలా, కంపెనీ ఏఐ మేనిఫెస్టోను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మంగళవారం ఆవిష్కరించారు.‘మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పురోగతి’గా కృత్రిమ మేధను ఈ సందర్భంగా అభివర్ణించారు. దేశీయంగా డిజిటల్ పరివర్తనకు సారథ్యం వహించిన విధంగానే ఏఐ విప్లవానికి కూడా నేతృత్వం వహించాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. భద్రత, విశ్వసనీయత, జవాబుదారీతనం హామీతో ప్రతి భారతీయునికి అతి తక్కువ వ్యయాలతో ఏఐని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ‘అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ కంపెనీగా మారే దిశగా రిలయన్స్ ముందుకు సాగుతోంది. రిలయన్స్ ఏఐ ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నాం. కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఇది గైడ్గా పనిచేస్తుంది‘ అని అంబానీ పేర్కొన్నారు. ఐడియాలకు ఆహ్వానం.. టెలికం, రిటైల్, ఎనర్జీ, మెటీరియల్స్, లైఫ్ సైన్సెస్, ఆర్థిక సేవలు, మీడియా తదితర వ్యాపార విభాగాలతో పాటు దాతృత్వ కార్యకలాపాలవ్యాప్తంగా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడే ఐడియాలు ఇవ్వాలని ఉద్యోగులను అంబానీ కోరారు. జనవరి 10 నుంచి 26 వరకు కొత్త ఆలోచనలను తెలియజేయాలని సూచించారు. ఏఐ హార్డ్వేర్, రోబోటిక్స్లాంటి వాటితో సమర్ధత, సుస్థిరత, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.మేనిఫెస్టో ఇలా..మేనిఫెస్టో మొదటి భాగంలో అంతర్గత పరివర్తన, ఏఐని టెక్నాలజీ ప్రాజెక్టుగా కాకుండా కొత్త పని విధానంగా పరిగణించే అంశాలను చేర్చారు. రెండో భాగంలో దేశీయంగా ఏఐ పరివర్తనకు తోడ్పడే విజన్ని పొందుపర్చారు. కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు, నియామకాల నుంచి రిటైర్మెంట్ల వరకు, ప్లాంటు నుంచి పోర్టు వరకు కీలకమైన విధుల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించే విధంగా, నిర్ణయాల ప్రక్రియకు తోడ్పడేలా సంస్థవ్యాప్తంగా ఏఐతో పని విధానాల్లో మార్పులను తొలి భాగంలో ప్రస్తావించారు.డేటా, సమన్వయం, భద్రత, వివిధ వ్యాపారాలవ్యాప్తంగా పర్యవేక్షణ మొదలైన వాటన్నింటికీ ప్రమాణాలు నిర్దేశించేలా పన్నెండు అంచెల డిజిటల్ ఫంక్షనల్ కోర్ (డీఎఫ్సీ) ఉంటుంది. తమ వ్యాపారాలు, దాతృత్వ కార్యకలాపాల ద్వారా ఏఐ ఆధారిత భారతదేశ పరివర్తనకి తోడ్పడాలనే రిలయన్స్ ఆకాంక్షలను ప్రతిఫలించేలా రెండో భాగం ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, సమ్మిళిత ఆర్థిక సర్వీసులు మొదలైన వాటిల్లో ఏఐ దన్నుతో కొత్త సొల్యూషన్స్, కొత్త మెటీరియల్స్ను కనుగొనేందుకు అపార అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు.
మీకు మ్యాపల్స్ యాప్ గురించి తెలుసా?
లేటెస్ట్ టెక్నాలజీతో భారతీయ రోడ్లపై ప్రయాణాన్ని సులభతరం చేస్తున్న స్వదేశీ మ్యాపింగ్ దిగ్గజం మ్యాప్మైఇండియా తన 'మ్యాపల్స్'(Mappls) యాప్లో మార్పులు చేపట్టింది. నగర ప్రయాణాన్ని లక్ష్యంగా చేసుకుని మెట్రో, రైలు, బస్సు రూట్లను ఏకీకృతం చేస్తూ ‘మల్టీమోడల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్’ ఫీచర్ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.సమగ్ర మొబిలిటీ ప్లాట్ఫామ్గా..ప్రస్తుతం 40 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారులను కలిగి ఉన్న మ్యాప్ల్స్ యాప్.. ఇప్పుడు కేవలం ప్రైవేట్ వాహనాలకే పరిమితం కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సమాచారాన్ని కూడా ఒకే చోట అందిస్తుంది. వినియోగదారులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి అందుబాటులో ఉన్న మెట్రో రైళ్లు, లోకల్ ట్రైన్లు, బస్సు సర్వీసుల రూట్లు, స్టాపులు, ఇంటర్చేంజ్ (మారే ప్రదేశాలు) ఆప్షన్లను సులభంగా చూడవచ్చు.అందుబాటులో ఉన్న నగరాలు..ఈ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతాతో పాటు.. పుణె, అహ్మదాబాద్, జైపూర్, కొచ్చి, భోపాల్, లక్నో, కాన్పూర్, ఆగ్రా, నాగ్పూర్, ఇండోర్, పట్నా, చండీగఢ్ల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్, వెబ్ వెర్షన్లలో లైవ్లో ఉందని పేర్కొంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని స్పష్టం చేసింది.ఆత్మనిర్భర్ భారత్ దిశగా..ఈ సందర్భంగా మ్యాప్మైఇండియా సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ వర్మా మాట్లాడుతూ..‘వినియోగదారుల అవసరాలను గుర్తించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను రోజువారీ నావిగేషన్లో చేర్చాం దీని ద్వారా నగరాల్లో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. ఈ కొత్త ఫీచర్ కేవలం ప్రయాణ సౌలభ్యం కోసమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వెల్లడించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొంది. దీని ద్వారా రోడ్లపై వ్యక్తిగత వాహనాల రద్దీ తగ్గుతుంది. రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్, సేఫ్టీ అలర్ట్స్తో ప్రయాణ సమయం ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది.
పర్సనల్ ఫైనాన్స్
ఆధార్ యాప్ ద్వారా అడ్రస్ చేంజ్: చాలా సింపుల్
ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవాలంటే.. ఒకప్పుడు మీసేవ లేదు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో.. ఇంట్లో కూర్చునే అడ్రస్ మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ యాప్ ద్వారా కూడా దీనిని అప్డేట్ చేసుకోవచ్చు.అవసరమయ్యే డాక్యుమెంట్స్ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి గుర్తింపు కార్డుగా.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు మొదలైనవాటిలో ఎదో ఒకటి కావాలి.అడ్రస్ అప్డేట్ చేయడం ఎలా?➤యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.➤యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత.. ఆధార్ నెంబర్ & ఓటీపీ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.➤తరువాత కెమెరా స్క్రీన్లో.. మీ ముఖాన్ని చూపిస్తూ, గ్రీన్ లైట్ వచ్చేవరకు చూడాలి. అప్పుడప్పుడు కళ్ళుమూసి తెరవాలి.➤ఫేస్ డిటెక్షన్ పూర్తయిన తరువాత.. హోమ్ పేజీకి వెళ్తారు. అక్కడ సర్వీసెస్ విభాగంలో.. మై ఆధార్ అప్డేట్ సెలక్ట్ చేసుకోవాలి.➤అక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అందుబాటులో ఉందో ఎంచుకుని.. కంటిన్యూ చేయాలి.➤డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తరువాత వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది.➤అయితే ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న చిరునామా కనిపిస్తుంది, కాబట్టి మీరు మార్చాలన్న కొత్త చిరునామా ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి.➤మీరు 'ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్' క్లిక్ చేస్తే, మీ ముఖం మళ్లీ ధృవీకరించబడుతుంది.➤ఇవన్నీ పూర్తయిన తరువాత .. ఆన్లైన్లో 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
మారిన రూల్స్: పాన్-ఆధార్ లింక్ నుంచి క్రెడిట్ స్కోర్ వరకు..
2025 ముగియడంతో.. 2026 ప్రారంభం నుంచి అనేక మార్పులు అమలులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా బ్యాంకింగ్ నిబంధనలు, ఇంధన ధరలు, వివిధ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇవి జీతం పొందే వారిని, యువత, సాధారణ ప్రజలను ప్రభావితం చేస్తాయి. కొత్తగా వచ్చిన రూల్స్ గురించి వివరంగా..పాన్ కార్డుకు ఆధార్ లింక్పాన్ కార్డును.. ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31న చివరి తేదీగా ప్రకటించారు. ఈ గడువును పెంచుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి నేటి నుంచి పాన్ - ఆధార్ లింక్ చేయడం కుదరదు. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను ఫైల్ చేయలేరు. ట్యాక్స్ రిఫండ్ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు.క్రెడిట్ స్కోర్ అప్డేట్ఇప్పటివరకు బ్యాంకులు ప్రతి 15 రోజులకు ఒకసారి సిబిల్ స్కోర్ అప్డేట్ చేసేవి. ఇప్పుడు క్రెడిట్ బ్యూరోలు ఇప్పుడు ప్రతి వారం కస్టమర్ డేటాను రిఫ్రెష్ చేస్తాయి. అంటే.. లోన్ చెల్లింపులు లేదా డిఫాల్ట్లు మీ క్రెడిట్ స్కోర్లో చాలా వేగంగా ప్రతిబింబిస్తాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలు2026 సంవత్సరం మొదటి రోజు నుంచి ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధర రూ.111 పెరిగింది. తాజా సవరణతో.. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,691.50కి (గతంలో రూ. 1,580.50 గా ఉండేది) పెరిగింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి.మెరుగైన డిజిటల్ చెల్లింపు భద్రతమోసాలను అరికట్టడానికి బ్యాంకులు UPI లావాదేవీలపై కఠినమైన తనిఖీలను, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లకు మరింత బలమైన సిమ్ ధృవీకరణ నిబంధనలను అమలు చేస్తాయి.పిఎం కిసాన్ గుర్తింపు కార్డులుభారత ప్రభుత్వం PM-Kisan పథకం కోసం కొత్త రైతు ఐడీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ ఐడీకి.. రైతుల భూమి రికార్డులు, పంట సమాచారం, ఆధార్ & బ్యాంక్ వివరాలు అనుసంధానించబడి ఉంటాయి.
మధ్యతరగతి మదుపు.. ప్రశ్నలు.. సమాధానాలు
ప్రతి మధ్యతరగతి కుటుంబానికి డబ్బుతో కూడిన చాలా కలలు ఉంటాయి. సొంతిల్లు, పిల్లల చదువులు, బంగారం, సురక్షితమైన పదవీ విరమణ.. ఇవన్నీ నెరవేరాలంటే కేవలం సంపాదన ఉంటే సరిపోదు, సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ప్రస్తుత కాలంలో సామాన్యులు తమ పొదుపు ప్రయాణంలో ఎదుర్కొంటున్న ప్రధాన సందేహాలకు నిపుణుల సమాధానాలు ఇవే..రియల్టీ..సొంతిల్లు కొనుక్కోవటానికి కరెక్టు వయసంటూ ఏమైనా ఉందా? సొంతిల్లు ఫలానా వయసులోనే కొనుక్కోవాలనే నియమం కానీ, నిబంధన కానీ ఏమీ లేదు. ఇక్కడ వయసుకన్నా దీర్ఘకాలం సెటిల్మెంట్ ముఖ్యం. మీరు గనక తరచూ ప్రాంతాలు మారాల్సి వచి్చందనుకోండి. అప్పుడు సొంతిల్లు కొనుక్కునీ ప్రయోజనం ఉండదు. స్థిరమైన ఆదాయం లేనప్పుడు సొంతింటి లాంటి ఆలోచనలు చేయకూడదు. అందుకని వయసు కన్నా ఆర్థిక స్థిరత్వం, దీర్ఘకాలం అదే ప్రాంతంలో ఉండే అవకాశం, స్థిరమైన ఆదాయం అనేవి ప్రధానం.బ్యాంకింగ్..ప్రతినెలా నా ఆదాయంలో కొంత మిగులుతోంది. దీన్ని సిప్ చేయటం మంచిదా... లేక రికరింగ్ డిపాజిట్ చేయొచ్చా?రికరింగ్ డిపాజిట్... సిప్, రెండూ మంచివే. కాకపోతే రికరింగ్ డిపాజిట్లో భద్రత ఎక్కువ. కానీ రాబడి పరిమితంగా ఉంటుంది. సిప్ అనేది స్టాక్ మార్కెట్లకు, మ్యూచువల్ ఫండ్లకు మంచిదే. దీన్లోనూ భద్రత ఉంటుంది కానీ... గ్యారంటీ ఉండదు. అయితే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు సిప్తోనే సాధ్యమవుతాయి. కాబట్టి మీరు దీర్ఘకాలం వేచి చూసేటట్లయితే సిప్ను, స్వల్ప కాలానికైతే ఆర్డీని ఎంచుకోండి.బంగారం బంగారంలో నెలవారీ ఇన్వెస్ట్ చేయొచ్చా? దీనికున్న సాధనాలేంటి?నెలవారీనే కాదు. వారం, రోజువారీ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు కూడా వచ్చాయి. కాకపోతే ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నపుడు భౌతికంగా గోల్డ్ను కొనే ప్రయత్నాలు వద్దు. డిజిటల్ గోల్డ్ లేదా గోల్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయండి. రకరకాల ఫిన్టెక్ యాప్లు కూడా అత్యంత సులువుగా గోల్డ్లో ఎప్పుడు, ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కలి్పస్తున్నాయి. మార్కెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ... ధర పతనమైనప్పుడు ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయటమూ మంచిదే.స్టాక్ మార్కెట్...2026లో ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? చాలా ఐపీఓలు అధిక ధరలతో వస్తున్నాయి. కాబట్టి లిస్టింగ్లో రకరకాల కారణాల వల్ల లాభాలొచి్చనా అవి ఎక్కువకాలం నిలవటం లేదు. ఇప్పటి ఐపీఓలు కొని దీర్ఘకాలం ఉంచుకునేట్లుగా లేవు. కాబట్టి కంపెనీ ఫండమెంటల్స్ బాగుండి, వాళ్లు తక్కువ ధరకు ఆఫర్ చేస్తున్నారనిపిస్తేనో, కంపెనీ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంటేనో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లిస్టింగ్ లాభాల కోసం మాత్రం ఐపీఓల వెంట పడొద్దు. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగులేని పక్షంలో లిస్టింగ్నాడే పనతమయ్యే అవకాశాలూ ఉంటాయి.మ్యూచువల్ ఫండ్స్...నేను కొన్ని సంవత్సరాలుగా ‘సిప్’ చేస్తున్నాను. ఇప్పుడు ఆపేయవచ్చా? సిప్లో ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశామన్నది ముఖ్యం కాదు. ఏ లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేశాం... మనకు ఎంత రాబడులు వచ్చాయి అనేవే ముఖ్యం. మీరు ఏ లక్ష్యం కోసమైతే ఇన్వెస్ట్ చేశారో ఆ లక్ష్యం నెరవేరిందని అనుకోండి. అప్పుడు సిప్ ఆపేయొచ్చు. లేకపోతే మీకు సిప్ వల్ల బాగా నష్టాలు వస్తున్నాయని అనుకుందాం... అపుడు తాత్కాలికంగా సిప్ను నిలిపేసి అంతకన్నా ఎక్కువ రాబడులొచ్చే మార్గాలేమైనా ఉంటే అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్నాకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అది సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే కవరే జీ మొత్తం చాలా పరిమితంగా ఉంటుంది. పైపెచ్చు ఉద్యోగానితో ముడిపడి ఉంటుంది. ఉద్యోగం పోతే బీమా ఉండదు. నిబంధనలపై మీకు ఎలాంటి నియంత్రణా ఉండదు. ఇక చాలా గ్రూప్ ఇన్సూరెన్స్లలో కుటుంబ సభ్యులకు పరిమితి ఉంటుంది. తల్లిదండ్రులకు కవరేజీ ఉండదు. వీటన్నిటితో పాటు ఉద్యోగానంతరం మీకు సొంత ఆరోగ్య బీమా కావాలంటే ప్రీమియం రూపంలో చాలా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మొదట్నుంచీ ఉంటే తక్కువ ప్రీమియంతో సరిపోతుంది.ఇదీ చదవండి: గ్రామీణ క్రెడిట్ స్కోర్తో అప్పు!?
మిడిల్ క్లాస్ సప్తపది
జీతం చాలా ఎక్కువ. ఖర్చులు అంతకన్నా ఎక్కువ. ఏం లాభం? అందుకే... ఎంత సంపాదించామన్నది కాదు..! ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పొదుపు చేశాం? అన్నదే ముఖ్యం. అదే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణం ఆదాయం తక్కువగా ఉండడం కాదు. కాలం చెల్లిన ‘మనీ’ సూత్రాలను పట్టుకుని వేలాడటమే. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకుంటే మధ్యతరగతి వారయినా మహారాజుల్లా బతికేయొచ్చు. అందుకోసం ఈ 7 సూత్రాలు పాటించడం మాత్రం తప్పనిసరి. కొత్త సంవత్సరంలోనైనా పాటించాల్సిన ఈ ‘సప్త పది’ గురించి వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...అత్యవసర నిధి.. అవసరం వచ్చినప్పుడు సాయం కోసం ఒకరి దగ్గర చేయి చాచటమనేది చాలా ఇబ్బందికరం. ఒకప్పుడు మనుషుల మధ్య బంధాలను డబ్బుతో కొలవటమనేది తక్కువ. ఇపుడు ఎవరినైనా అడిగినా... వారు ఎంత దగ్గరివారైనా ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్లకూ ఏవో అవసరాలు ఉండి ఉండొచ్చు. పైపెచ్చు మన అవసరాన్ని వాళ్లు గుర్తించకపోవచ్చు. అందుకని ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తెలివైన నిర్ణయం. అత్యవసర నిధి అన్నది ఆప్షనల్ కాదు. తప్పనిసరి. రాజీపడకూడనిది. → కరోనా సమయంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆస్పత్రిలో వైద్యం కోసం చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన వారెందరో. కొన్ని సంస్థలు అయితే వేతనాలకు కోత పెట్టాయి. చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని అనిశ్చితి. → వైద్యం కూడా అంతే. ఎప్పుడు ఏ ప్రమాదం, ఏ అనారోగ్యం ముంచుకొస్తుందో ఊహించలేం. → అందుకే కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ప్రతి కుటుంబానికి ఉండాలి. కుదిరితే 9 నెలలు, 12 నెలల అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి. → ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులను కదపకుండా ఉండొచ్చు. అధిక రేటుపై రుణాలు తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవచ్చు. ఈఎంఐలు గీత దాటొద్దు.. → అవసరం వస్తే క్రెడిట్ కార్డు చేతిలో ఉందిలే... వెంటనే రుణం దొరుకుతుందిలే. అనే రీతిలో అన్నింటికీ ‘రుణ’ మంత్రం పనికిరాదు. బ్యాంక్లు, ఫిన్టెక్లు పిలిచి రుణం ఇస్తున్నాయి కదా అని చెప్పి.. ఇల్లు, కారు, ఇంట్లో వస్తువులు ఇలా ప్రతిదానికీ అప్పు చేసుకుంటూ వెళితే, ఆర్థిక పరిస్థితులు క్రమంగా అదుపు తప్పుతాయి. నెల సంపాదనలో 50–60 శాతం వరకు రుణ చెల్లింపులకే వెచ్చించే కుటుంబాలు మన మధ్య ఎన్నో ఉన్నాయి. → ఆదాయంలో నెలవారీ రుణ వాయిదాలను (ఈఎంఐలు) 35–40 శాతం మించకుండా చూసుకోవాలన్నది ముఖ్యమైన ఆర్థిక సూత్రం. దీనివల్ల ఇతర ముఖ్యమైన జీవన అవసరాలకు (గ్రోసరీ, యుటిలిటీ, విద్యా వ్యయాలు) ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. → ఆదాయమనేది నేటి అవసరాల కోసమే కాదు. భవిష్యత్ లక్ష్యాలు, విశ్రాంత జీవన అవసరాల కోసం కూడా. దీనికోసం ప్రతినెలా కొంత పక్కన పెట్టుకోవాలి. → పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు, రిటైర్మెంట్ జీవితం కోసం పెట్టుబడులకు కొంత కేటాయించుకోవాలంటే, ఆదాయంలో ఈఎంఐలు లక్ష్మణ రేఖ దాటకుండా చూసుకోవడం ముఖ్యం. → ఈఎంఐలు హద్దు మీరి చెల్లింపుల్లో విఫలమైతే, అది క్రెడిట్ హిస్టరీని దెబ్బతీస్తుంది. ఆదాయం అప్పులకే పోతుంటే సంపద సృష్టి ఎప్పటికీ సాధ్యం కాదు. ఆదాయాన్ని మించి పెట్టుబడి.. → సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఇపుడు బాగా ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనం. ఈ విధానంలో చేస్తున్న పెట్టుబడి, మన వార్షిక ఆదాయ వృద్ధికి మించి పెరిగేలా చూసుకోవాలి. వార్షిక వేతన పెరుగుదల సాధారణంగా 8–10 శాతంగా ఉంటుంది. కానీ, సిప్ పెట్టుబడులపై 12–15 శాతం వరకు రాబడి వచ్చేలా పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. → ద్రవ్యోల్బణం కారణంగా కొంత కాలానికి మన పెట్టుబడి దాని విలువను కోల్పోతుంటుంది. మన దగ్గర వార్షిక సగటు ద్రవ్యోల్బణం 5–6 శాతం స్థాయిలో ఉంటోంది. కనుక ఈ మేరకు మన పెట్టుబడి విలువ ఏటా క్షీణిస్తుంటుంది. → ఇపుడు మన జీవన వ్యయాలు నెలవారీ రూ.10,000గా ఉన్నాయనుకుంటే.. 6 శాతం ద్రవ్యోల్బణం రేటు ప్రకారం పదేళ్ల తర్వాత అవే అవసరాల కోసం రూ.17,908 ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే 20 ఏళ్ల తర్వాత అయితే రూ.32,071 అవసరం అవుతుంది. → ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు మించిన కాలంలో 12–15 శాతం రాబడులు సాధ్యమేనని చరిత్ర చెబుతోంది. → ఇక నెలవారీ చేస్తున్న సిప్ పెట్టుబడిని సైతం ఏటా ఆదాయ పెరుగుదలను మించిన స్థాయిలో పెంచుకోవడం ప్రధానం. లేదంటే కనీసం ద్రవ్యోల్బణం రేటు స్థాయిలో అయినా సిప్ పెట్టుబడిని ఏటా పెంచుకుంటూ వెళ్లాలి. → ఇలా సిప్ పెట్టుబడిని పెంచుకుంటూ, ఆ పెట్టుబడి ద్రవ్యోల్బణం మించి వృద్ధి చెందేలా చూసుకుంటే, కాంపౌండింగ్ ప్రయోజనంతో పెద్ద మొత్తంలో నిధి సమకూరుతుంది. ఆరోగ్య బీమా రూ.5 లక్షలు చాలదు.. → మనలో చాలా మందికి ఆరోగ్య బీమా రక్షణ లేదు. ఉన్న వారిలోనూ చాలా మందికి రూ.5 లక్షలకు మించి కవరేజీ లేదు. కానీ, మారుతున్న పరిస్థితుల కోణంలో చూస్తే ఈ రక్షణ ఎంత మాత్రం చాలదని స్పష్టమవుతోంది. → వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 12– 14 శాతం స్థాయిలో ఉంటోంది. అంటే చికిత్సలు, ఔషధాలు, ఇతరత్రా చార్జీలు ఈ స్థాయిలో ఏటా పెరుగుతున్నట్టు లెక్క. → అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ తరహా టెక్నాలజీలు రావడంతో క్లిష్టమైన సర్జరీలను సైతం సునాయాసయంగా, విజయవంతంగా చేస్తున్నారు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. అవయవ మార్పిడి కోసం రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చవుతోంది. → కనుక రూ.5 లక్షల కవరేజీ ఎంతమాత్రం సరిపోదు. ఒక కుటుంబానికి కనీసం రూ.10– 20 లక్షల వరకు అయినా బేసిక్ హెల్త్ ప్లాన్ ఉండాలి. రూ.10–20 లక్షల డిడక్టబుల్తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. వైద్య బిల్లు రూ.10– 20 లక్షల్లోపు ఉంటే బేసిక్ప్లాన్ నుంచి, అంతకు మించిన సందర్భాల్లో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు జరుగుతాయి. రెండు చేతులా సంపాదించాల్సిందే.. → ఒకవైపు కరెన్సీ విలువ క్షీణిస్తుండగా... మరోవైపు జీవన వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి వీటికి తగ్గట్టు ఆదాయం కూడా వృద్ధి చెందాలి. కానీ మన ఆర్థిక డేటాను పరిశీలిస్తే.. ఆదాయ వృద్ధి కంటే జీవన వ్యయ పెరుగుదలే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే రెండో ఆదాయ మార్గంపై దృష్టి పెట్టాలి. → అద్దె రూపంలో ఆదాయం లేదంటే తమ నైపుణ్యాల ఆధారంగా ఖాళీ సమయంలో ఫ్రీలాన్స్ వర్క్ లేదంటే వడ్డీ ఆదాయం లేదా డివిడెండ్ ఆదాయం ఇలా ఏదో ఒక మార్గం గుర్తించాలి. ఖర్చులపై కన్ను.. టీవీ ఛానళ్ల కోసం ఒకటి, నెట్ఫ్లిక్స్–అమెజాన్ ప్రైమ్, ఆహా ఇలా వేర్వేరు ఓటీటీ చందాలు, క్లౌడ్ స్టోరేజీ, లెరి్నంగ్ యాప్లు ఇలా చెప్పుకుంటూ పోతే డిజిటల్ లైఫ్ కోసం ప్రతి కుటుంబంలో నెలతిరిగేసరికి చందా చెల్లింపుల జాబితా పెరిగిపోతోంది. ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం ఈ తరహా రీచార్జ్ల కోసం కనీసం రూ.25,000– 40,000 వరకు ఖర్చు చేస్తోంది. కనుక ఏదో ఒక వినోద ఓటీటీ, ఒక లెర్నింగ్ యాప్నకు పరిమితమై, అనవసర దుబారాను అదుపు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛకు మార్గం వేసుకోవచ్చు. బంగారం కూడా బీమా లాంటిదే..→ బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కంటే రక్షణ కవచంగానే (హెడ్జింగ్ సాధనం) ఎక్కువ పరిగణిస్తారు. ఆర్థిక అస్థిరతలప్పుడు, కరెన్సీ విలువ క్షీణించినపుడు, ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడి విలువను కాపాడుకోవడంలో బంగారం కీలకంగా పనిచేస్తుంది. → ఈ ఏడాది బంగారం ధర దేశీ మార్కెట్లో 78 శాతం పెరిగింది. 2020లో రూ.48,000 స్థాయిలో ఉంది. ఐదేళ్లలో రెండు రెట్లు (200 శాతం వృద్ధి) పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో చూస్తే బంగారంపై వార్షిక రాబడి 11–12 శాతంగా ఉంది. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కంపెనీల లాభదాయకత ఆశాజనకంగా లేకపోవడం, వాణిజ్య అనిశి్చతులతో గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు ఎలాంటి రాబడులు ఇవ్వలేదు. ఈ కాలంలో బంగారం విలువను సృష్టించి పెట్టింది. → కనుక పెట్టుబడుల్లో వైవిధ్యానికి, అనిశి్చతులు, కరెన్సీ విలువల నుంచి పెట్టుబడి విలువకు రక్షణ కోసం, అత్యవసరాల్లో రుణం పొందేందుకు సైతం బంగారం అక్కరకు వస్తుంది. → అందుకే ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడుల్లో బంగారానికి 10–15 శాతం కేటాయించుకోవాలి.2026 చెక్ లిస్ట్అత్యవసర నిధి: 6–9 నెలలు ఆదాయంలో ఈఎంఐలు: 35 శాతం మించొద్దు సిప్ పెట్టుబడి: ఏటా పెంచుకుంటూ వెళ్లాలి, ఆదాయాన్ని మించి వృద్ధి చెందాలి హెల్త్ కవరేజీ: కనీసం రూ.10–20 లక్షలకు బీమా ఉండాలి పెట్టుబడుల్లో బంగారానికి కేటాయింపులు: 10–15 శాతం రెండో ఆదాయం తప్పనిసరి డిజిటల్ లైఫ్ ఖర్చును నియంత్రించుకోవాలి


