Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India GST collections rise 6. 1percent to Rs 1. 75 lakh crore in December1
జోరుగా జీఎస్‌టీ వసూళ్లు 

న్యూఢిల్లీ: నిత్యావసరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) 2025 డిసెంబర్‌ నెలకు రూ.1.74 లక్షల కోట్లు వసూలైంది. 2024 డిసెంబర్‌లో ఆదాయం రూ.1.64 లక్షల కోట్లు కంటే 6 శాతం పెరిగింది. గత ఏడాది సెపె్టంబర్‌ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్‌టీ రేటు తగ్గించడం తెలిసిందే. 12, 28 శాతం శ్లాబులు ఎత్తివేయడం ఫలితంగా వాటి రేట్లు దిగొచ్చాయి. అయినప్పటికీ జీఎస్‌టీ ఆదాయం మెరుగ్గా నమోదవుతుండడం గమనార్హం. దేశీ ఉత్పత్తులపై ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.1.22 లక్షల కోట్లుగా ఉంటే, దిగుమతి అయిన వస్తువులపై జీఎస్‌టీ రూపంలో ఆదాయం 19.7 శాతం పెరిగి రూ.51,977 కోట్లకు చేరింది. రిఫండ్‌లు సైతం 31 శాతం పెరిగి రూ.28,890 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్‌ నెలకు నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.45 లక్షల కోట్లుగా నమోదైంది. 2024 డిసెంబర్‌ నెలకంటే 2.2 శాతం పెరిగింది. సెస్సు రూపంలో ఆదాయం రూ.4,238 కోట్లకు పరిమితమైంది. 2024 డిసెంబర్‌లో రూ.12,003 కోట్ల సెస్సు వసూలు కావడం గమనించొచ్చు. సెపె్టంబర్‌ 22 నుంచి సెస్సు అన్నది కేవలం పొగాకు, వాటి ఉత్పత్తులకే పరిమితం చేయగా, లగ్జరీ వస్తువులపై తొలగించడం తెలిసిందే.

India allows banks to sponsor pension funds under NPS2
పెన్షన్‌ ఫండ్‌ ఏర్పాటుకు బ్యాంక్‌లకు అనుమతి 

న్యూఢిల్లీ: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) కింద పెన్షన్‌ ఫండ్స్‌ ఏర్పాటుకు బ్యాంక్‌లను అనుమతిస్తూ పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్ణయం తీసుకుంది. పెన్షన్‌ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం, చందాదారుల ప్రయోజనాలను కాపాడడంతోపాటు, పోటీని పెంచేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రకటించింది. పెన్షన్‌ ఫండ్స్‌ అన్నవి ఎన్‌పీఎస్‌ చందాదారుల పెట్టుబడులను ఇన్వెస్ట్‌ చేస్తూ, రాబడులను పంచే బాధ్యతను చూస్తుంటాయి. బ్యాంకుల నెట్‌వర్త్‌ ఆధారంగా వాటిని అనుమతించేందుకు, పూర్తి కార్యాచరణ, మార్గదర్శకాలను తర్వాత నోటిఫై చేయనున్నట్టు పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌ కింద 10 పెన్షన్‌ ఫండ్స్‌ సేవలు అందిస్తున్నాయి. మరోవైపు ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌లో ముగ్గురిని నియమిస్తూ పీఎఫ్‌ఆర్‌డీఐ నిర్ణయం తీసుకుంది.

Cloud Wars Heat Up as Tech Giants Expand AI Infrastructure3
బిలియన్ల బిడ్‌ వార్‌ 

సాధారణంగా సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల రంగ దిగ్గజాలు కార్యకలాపాల ద్వారా భారీగా నగదు ఆర్జిస్తుంటాయి. దీంతో వాటాదారులకు అత్యధికస్థాయిలో డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. వీటితోపాటు కొన్ని సందర్భాలలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు సైతం తెరతీస్తుంటాయి. నికర లాభాలను వాటాదారులకు పంచే కంపెనీ విధానాలే దీనికికారణంకాగా.. నగదు నిల్వలను ఇతర కంపెనీల కొనుగోళ్లకూ వెచ్చిస్తుంటాయి. అయితే ఈ ఏడాది(2025–26) కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్‌ఏ)కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో టాప్‌–10 టెక్‌ దిగ్గజాలు ఉమ్మడిగా 4.3 బిలియన్‌ డాలర్లు(రూ. 38,700 కోట్లు) వెచ్చించాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), క్లౌడ్‌ టెక్నాలజీలలో అధిక కొనుగోళ్లకు ఈ ఏడాది తెరలేచింది. గతేడాది(2024–25) డివిడెండ్లకు టాప్‌–10 ఐటీ కంపెనీలు 10.8 బిలియన్‌ డాలర్లు(రూ. 96,557 కోట్లు) కేటాయించగా.. ఈక్విటీ బైబ్యాక్‌లకు 1.5 బిలియన్‌ డాలర్లు(రూ. 14,000 కోట్లు) వెచ్చించాయి. ఇక ఇతర సంస్థల కొనుగోళ్లకు రూ. 27,000 కోట్లు వినియోగించాయి. కారణాలున్నాయ్‌ ఈ ఏడాది కొత్త టెక్నాలజీలు, కంపెనీలపై ఐటీ దిగ్గజాలు బాగా దృష్టి పెట్టాయి. ఇందుకు ఐటీ రంగంలో ఆదాయ సంబంధ మందగమనంతోపాటు.. ఐటీ సేవలకు అతిపెద్ద మార్కెట్‌ యూఎస్‌ నుంచి హెచ్‌1బీ తదితర అనుకోని సవాళ్లు ఎదురుకావడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆదాయ వనరులను పెంచుకునేందుకు సరికొత్త టెక్నాలజీల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలపై అధిక పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఏఐ, క్లౌడ్‌ వినియోగం పెరుగుతుండటంతో విభిన్న వరి్టకల్స్, డొమైన్లలో వేగంగా విస్తరిస్తున్న కంపెనీలపై ఐటీ దిగ్గజాలు కన్నేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇదీ తీరు ఆదాయం, ఆర్డర్‌బుక్‌ను పటిష్టపరచుకునే బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ ఇతర కంపెనీలకు సొంతం చేసుకుంటున్నాయి. లిస్టయిన 2004 తదుపరి టీసీఎస్‌ డజను కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీలు కోఫోర్జ్, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ మరో అడుగు ముందుకేశాయి. వెరసి నగదు ఆర్జనలో అధిక శాతాన్ని వాటాదారులకు పంచడంకంటే ఇతర కంపెనీల కొనుగోళ్లకే కేటాయిస్తున్నాయి. డివిడెండ్లు, ఈక్విటీ బైబ్యాక్‌లను మించుతూ కొత్త టెక్నాలజీ కంపెనీలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. కొనుగోళ్ల జోరు దేశీ ఐటీ కంపెనీల చరిత్రలోనే భారీ డీల్‌కు తెరతీస్తూ గత వారం మిడ్‌టైర్‌ కంపెనీ కోఫోర్జ్‌ 2.39 బిలియన్‌ డాలర్ల విలువైన కొనుగోలుని ప్రకటించింది. యూఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఎన్‌కోరాను సొంతం చేసుకునేందుకు షేర్ల జారీ ద్వారా డీల్‌ కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ కోఫోర్జ్‌ ఇతర కంపెనీల కొనుగోళ్లపై రూ. 21,450 కోట్లు వెచ్చించింది. ఇదే కాలంలో వాటాదారులకు కేవలం రూ. 260 కోట్లు డివిడెండ్‌గా చెల్లించింది. మరో మధ్యస్థాయి ఐటీ కంపెనీ హెక్సావేర్‌(జనవరి–డిసెంబర్‌ ఆర్థిక సంవత్సరం) సైతం ఇతర సంస్థలను సొంతం చేసుకునేందుకు రూ. 1,614 కోట్లు వెచ్చించింది. సెపె్టంబర్‌ చివరివరకూ వాటాదారులకు డివిడెండ్‌ రూపేణా రూ. 349 కోట్లు కేటాయించింది. ఇక దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, విప్రో ఉమ్మడిగా 7 కంపెనీల కొనుగోళ్లకు 1.03 బిలియన్‌ డాలర్లు వినియోగించాయి. వీటిలో డేటా అనలిటిక్స్, డిజైన్‌ ఇంజినీరింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తావించదగ్గ అంశం! – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Tobacco products and pan masala will attract additional central excise duty4
పొగాకు మీద పన్నుల మోత

న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, గుట్కా, పాన్‌ మసాలాపై హెల్త్‌ సెస్సు .. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఈ ఉత్పత్తులపై 40 శాతం జీఎస్‌టీ రేటుకి అదనంగా జాతీయ భద్రత సెస్సు, హెల్త్‌ సెస్సు, ఎక్సైజ్‌ డ్యూటీ ఉండనున్నాయి. బీడీలపై 18 శాతం జీఎస్‌టీకి అదనంగా ఇవి ఉంటాయి. గుట్కాపై అదనంగా 91 శాతం, నమిలే పొగాకుపై 82 శాతం, జర్దా సెంటెడ్‌ పొగాకుపై 82 శాతం మేర అదనంగా ఎక్సైజ్‌ డ్యూటీ విధించనున్నారు. ఇక పొడవు, ఫిల్టర్‌ను బట్టి ప్రతి 1,000 సిగరెట్లకు రూ. 2,050–రూ. 8,500 వరకు సుంకాలు ఉంటాయి. ప్యాకేజీపై ముద్రించిన రిటైల్‌ ధర ప్రాతిపదికన జీఎస్‌టీ విలువను మదింపు చేసే విధంగా కొత్త ఎంఆర్‌పీ ఆధారిత వేల్యుయేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా వచ్చే నిధులను ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం పొగాకు, గుట్కా తదితర ఉత్పత్తుల తయారీ సంస్థలు తమ దగ్గరున్న ప్యాకింగ్‌ మెషీన్ల సంఖ్య, వాటి సామర్థ్యాల గురించి ఎక్సైజ్‌ అధికారులకు తెలియజేయాలి. ప్యాకింగ్‌ మెషీన్లన్నీ కనిపించేలా సీసీటీవీ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్‌ చేయాలి. అలాగే ఫుటేజీని కనీసం 24 నెలల పాటు భద్రపర్చాలి. ప్రస్తుతం పాన్‌ మసాలా, సిగరెట్లు, సిగార్లు, హుక్కా, జర్దా మొదలైన పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జీఎస్‌టీతో పాటు వివిధ స్థాయిల్లో కాంపెన్సేషన్‌ సెస్సు విధిస్తున్నారు. 2017 జూలై 1న జీఎస్‌టీని ప్రవేశపెట్టినప్పుడు, రాష్ట్రాలకు వాటిల్లే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు 2022 జూన్‌ 30 వరకు అయిదేళ్ల పాటు కాంపెన్సేషన్‌ సెస్సు విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. తర్వాత దీన్ని 2026 మార్చి 31 వరకు (నాలుగేళ్లు) పొడిగించింది. కోవిడ్‌ సమయంలో రాష్ట్రాలకు పరిహారం ఇచ్చేందుకు తీసుకున్న రూ. 2.69 లక్షల కోట్ల రుణాలను 2026 జనవరి 31 నాటికి తీర్చివేశాక కాంపెన్సేషన్‌ సెస్సు విధించడం నిల్చిపోతుంది. ఈ నేపథ్యంలో తాజా సెస్సుల ప్రతిపాదనలను డిసెంబరులో పార్లమెంటు ఆమోదించింది. టొబాకో షేర్లు డౌన్‌ .. అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ నోటిఫికేషన్‌తో టొబాకో కంపెనీల షేర్లలో గురువారం భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీసీ షేరు దాదాపు 10 శాతం క్షీణించి సుమారు రూ. 364కి తగ్గింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా షేరు ఏకంగా 17 శాతం తగ్గి దాదాపు రూ. 2,290 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 19 శాతం క్షీణించి రూ. 2,230 స్థాయిని కూడా తాకింది. అటు వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ 0.60 శాతం క్షీణించి రూ. 255.15 వద్ద ముగిసింది.

How To Changes Your Address in Aadhaar App5
ఆధార్ యాప్ ద్వారా అడ్రస్ చేంజ్: చాలా సింపుల్

ఆధార్‌ కార్డులో చిరునామా మార్చుకోవాలంటే.. ఒకప్పుడు మీసేవ లేదు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో.. ఇంట్లో కూర్చునే అడ్రస్ మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ యాప్‌ ద్వారా కూడా దీనిని అప్డేట్ చేసుకోవచ్చు.అవసరమయ్యే డాక్యుమెంట్స్ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి గుర్తింపు కార్డుగా.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు మొదలైనవాటిలో ఎదో ఒకటి కావాలి.అడ్రస్ అప్డేట్ చేయడం ఎలా?➤యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.➤యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత.. ఆధార్ నెంబర్ & ఓటీపీ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.➤తరువాత కెమెరా స్క్రీన్‌లో.. మీ ముఖాన్ని చూపిస్తూ, గ్రీన్ లైట్ వచ్చేవరకు చూడాలి. అప్పుడప్పుడు కళ్ళుమూసి తెరవాలి.➤ఫేస్ డిటెక్షన్ పూర్తయిన తరువాత.. హోమ్ పేజీకి వెళ్తారు. అక్కడ సర్వీసెస్ విభాగంలో.. మై ఆధార్ అప్‌డేట్ సెలక్ట్ చేసుకోవాలి.➤అక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అందుబాటులో ఉందో ఎంచుకుని.. కంటిన్యూ చేయాలి.➤డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తరువాత వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది.➤అయితే ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న చిరునామా కనిపిస్తుంది, కాబట్టి మీరు మార్చాలన్న కొత్త చిరునామా ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి.➤మీరు 'ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్' క్లిక్ చేస్తే, మీ ముఖం మళ్లీ ధృవీకరించబడుతుంది.➤ఇవన్నీ పూర్తయిన తరువాత .. ఆన్‌లైన్‌లో 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

UPI December Payments Details6
యూపీఐ రికార్డ్: డిసెంబర్‌లో ఎన్ని కోట్లంటే..

భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ప్రతి నెలలో జరుగుతున్న యూపీఐ లావాదేవీలు ఎక్కువవుతున్నాయి. గత నెలలో (డిసెంబర్ 2025) కూడా యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.డిసెంబర్ 2025లో జరిగిమ మొత్తం యూపీఐ లావాదేవీలు 21.6 బిలియన్లు. వీటి విలువ రూ.27.97 లక్షల కోట్లు. గతేడాదితో పోలీస్తే లావాదేవీలు 29 శాతం పెరిగింది. కాబట్టి మొత్తం మీద ఇప్పటి వరకు నమోదైనవాటిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. నవంబర్‌లో జరిగిన లావాదేవీలు 20.47 బిలియన్లు.

Advertisement
Advertisement
Advertisement