ప్రధాన వార్తలు
హైదరాబాద్లో పాతకాలపు ఇళ్లకు ఫుల్ డిమాండ్
కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే సామెత మనలో చాలా మందికి తెలిసిందే.. అయితే చాలా మంది కొత్త విషయానికి ఆకర్షితులయ్యినంతగా.. అలవాటు పడిన పాతదానికి ఆకర్షితులు కారనేది ఒక కోణమైతే.. పాత విషయాన్నీ అలా వదిలేయకుండా నిలబెట్టుకుంటూ.. కొత్త వాటిని తొందరపడి వదులుకోకూడదు అనే మరో కోణాన్నీ ప్రతిబింబిస్తుంది. సరిగ్గా ఇదే చెవికెక్కించుకున్నారో! ఏమో గానీ నగరంలో పాత ఇళ్ల (వింటేజ్ హౌస్)కు ఆదరణ పెరుగుతోంది. అలాంటి ఇంటి వరండాలో కూర్చుని కబుర్లు చెబుతూ కాఫీ సేవించడం, లివింగ్ రూమ్లో ఆసీనులై పుస్తక పఠనం చేయడం, మిద్దె మీదకు ఎక్కి నక్షత్రాల నీడలో నచి్చన సంగీతాన్ని ఆస్వాదించడం.. వంటి సంప్రదాయ అభిరుచులన్నీ సిటీలోని ఏ ఆధునిక కేఫ్కి వెళ్లినా సుసాధ్యమే. సిటీలో ప్రస్తుతం ఈ తరహా ట్రెండీ కేఫ్స్ పాత ఇళ్లలోనే ఏర్పాటవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోనగరంలో నివసించాలి అనుకునేవారు మాత్రమే కాదు.. కేఫ్ ఏర్పాటు చేయాలనుకుంటున్న వారు కూడా ఇళ్లనే అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం కేఫ్స్ అంటే ఆహారం, పానీయాలు మాత్రమే అందించే చోటు కాదు.. పాత కథలను చెప్పే కొత్త వేదికలు కూడా. నగరంలో కేఫ్ సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఇటీవల ఒక కొత్త ధోరణిని సంతరించుకుంటోంది. పాత ఇళ్లు, బంగ్లాలు హాయిగా, అందమైన గొప్ప కేఫ్లుగా రూపాంతరం చెందుతున్నాయి.ఎంత ఓల్డ్ అయితే అంత గోల్డ్.. వీలైనంత పాత ఇళ్లనే కేఫ్స్ కోసం ఎంచుకోవడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కేఫ్స్లో 1970ల నాటి హెరిటేజ్ విల్లాలు సైతం కేఫ్స్గా అవతరించాయి. నగరంలో కేఫ్లుగా మారిన ఇళ్లు సాధారణ వాణిజ్య సెటప్ల నుంచి ప్రత్యేకంగా నిలుస్తూ ‘ఇంటి నుంచి దూరంగా ఉన్నవారి ఇల్లు’ లాగా సేద తీరుస్తున్నాయి. వీటిలో సూర్యకాంతి ధారాళంగా ప్రవహించే వరండాలు, పాతకాలపు కిటికీలు, ద్వారాలతో గత జీవితాల జాడలను గుర్తుచేస్తాయి. అలా నగరంలో పాత ఇంటి నుంచి కొత్త కేఫ్స్గా మారినవి కొన్ని..వారసత్వ నిర్మాణాలు.. 80 ఏళ్ల వయసు గల ఓ పురాతన భవనం బంజారాహిల్స్లో ప్రస్తుతం రోస్టరీ కాఫీ హౌస్గా ఆధునిక సొబగులు అద్దుకుంది. అతిగా మార్పు చేర్పులు లేకుండా ఈ భవనంలోకి వెళుతుంటే ఓ పాత ఇంట్లోకి అడుగుపెడుతున్న అనుభూతి పొందవచ్చు. ఈ వింటేజ్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ను కేఫ్గా మార్చారు. దాని పాతకాలపు అందాన్ని చెక్కుచెదరకుండా అలాగే ఉంచిన ఫలితంగా వారసత్వ నిర్మాణాన్ని తాజా కాఫీ సువాసనతో మిళితం చేస్తూ సరికొత్త ఫ్యూజన్ ప్లేస్గా నిలుస్తోంది. కేరళ తరహా నిర్మాణం.. దాదాపు కేరళ శైలి నిర్మాణాన్ని అనుకరించే వారసత్వ భవనానికి ప్రస్తుతం సృజనాత్మక, కళాత్మకను అద్ది ఆరోమలే కేఫ్ పేరిట రూపుదిద్దారు. జూబ్లీహిల్స్లోని ఆ ఇంటిలోని తోట సహా నాటి నివాస అనుభూతిని అచ్చంగా భద్రపరిచారు. దీనిని వాణిజ్య అవసరాలతో పునఃరూపకల్పన చేయడానికి బదులుగా, యజమానులు పాత ఇంటిలోని ప్రతి గదినీ చదవడం, సంగీతం, సంభాషణలు, కమ్యూనిటీ సమావేశాల కోసం ప్రత్యేకంగా మార్చారు.గాలి, వెలుతురుకు అనుకూలంగా.. జూబ్లీహిల్స్లోనే మరో కేఫ్ గ్లాస్ హౌస్. ఇంటి సుపరిచితమైన లేఅవుట్ను కొనసాగిస్తూనే కేఫ్గా మారిన నివాస స్థలం. ఇది ఇప్పటికీ ఇల్లులా కనిపిస్తుంది. వరండా, ప్రాంగణం సీటింగ్ ప్రదేశంగా మారింది. అలాగే ఒకదానితో ఒకటి అనుసంధానించిన ‘గదులు‘ ఉన్నాయి. గాలి, వెలుతురు ధారాళంగా ప్రవహిస్తూ ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తాయి. సైనిక్పురిలో ఉన్న దిస్ ఈజ్ ఇట్ కూడా దాని గత గృహశైలి లేఅవుట్ను యథాతథంగా ఉంచింది. లైటింగ్తో నివాస భవనాన్ని తలిపించేలా ఆలోచనాత్మకంగా పునర్నిర్మితమైంది.అబ్బురపరిచే ఆర్కిటెక్చర్.. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ నివేదిక ప్రకారం 1970లో నిర్మించిన ఇంటి లోపల ఏర్పాటైంది రేషియో. జూబ్లీహిల్స్లో ఇటీవలే ప్రారంభమైన ఈ కేఫ్ను దాని పురాతన ఆత్మను నిలుపుకునేలా ఆలోచనాత్మకంగా వాస్తుశిల్పులు పునఃరూపకల్పన చేశారు. పొడవైన పైన్–వుడ్ కిటికీలు, సూర్యకాంతి పడేలా ప్రత్యేక స్థలాన్ని ప్రవేశపెట్టారు. అదే సమయంలో అసలు ఇంటి సారం చెక్కుచెదరకుండా ఉంచారు.అలంకరణలు చెక్కు చెదరకుండా.. హిమాయత్నగర్లోని మిరోసా కేఫ్ మరో నివాస విల్లా. ఇది ఓపెన్ సీటింగ్తో రెండు అంతస్తుల లేఅవుట్. సన్నిహిత సీటింగ్, వెచ్చని రంగుల పాలెట్.. అతిథులకు సుపరిచితమైన ఇంటి అనుభూతిని ఇస్తుంది. ఫిల్మ్ నగర్లోని వైబేయార్డ్ బిస్ట్రో కేఫ్లోని ఆక్సైడ్ గోడలు, చెక్క తలుపులు/ కిటికీలు, విశాలమైన గార్డెన్.. పురాతన ఇంటి అనుభవాన్ని అందిస్తాయి.జూబ్లీ హిల్స్లోని ది ఫిఫ్త్ స్ట్రీట్ కేఫ్ ఇదే కోవకు చెందింది. చెక్క అలంకరణలు, ఒకదానితో ఒకటి అనుసంధానించిన గదులు, ఇంటి ఫీల్ను సజీవంగా ఉంచుతాయి.
3 లక్షల యమహా స్కూటర్లు రీకాల్..
యమహా మోటార్ ఇండియా కంపెనీ 3 లక్షలకు పైగా స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మోడళ్లకు చెందిన స్కూటర్లు ఉన్నాయి.2024 మే 2 నుంచి 2025 సెప్టెంబర్ 3 మధ్య తయారైన 125 సీసీ స్కూటర్ మోడళ్లలో మొత్తం 3,06,635 యూనిట్లకు స్వచ్ఛంద రీకాల్ ప్రచారాన్ని కంపెనీ ప్రారంభించింది.కొన్ని ప్రత్యేక ఆపరేటింగ్ పరిస్థితుల్లో, ఎంపిక చేసిన యూనిట్లలో ఫ్రంట్ బ్రేక్ కాలిపర్ పనితీరు పరిమితంగా ఉండే అవకాశం ఉందని గుర్తించడంతో ఈ రీకాల్ చేపట్టినట్లు యమహా వెల్లడించింది. ఈ రీకాల్ పూర్తిగా స్వచ్ఛందంగా చేపట్టినదని యమహా స్పష్టం చేసింది. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ రీకాల్ పరిధిలోకి వచ్చే అన్ని వాహనాలకు సంబంధిత భాగాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా మార్చి ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. రీకాల్ పరిధిలోకి వచ్చే స్కూటర్ల యజమానులను యమహా డీలర్లు నేరుగా సంప్రదిస్తారు. అలాగే వాహన యజమానులు తమ సమీపంలోని అధికారిక యమహా సర్వీస్ సెంటర్ను సంప్రదించి, తమ వాహనం రీకాల్కు అర్హత కలిగి ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఇంకా రెచ్చిపోయిన బంగారం.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ రెచ్చిపోతున్నాయి. రోజూ రూ.వేలకొద్దీ పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే బంగారం ధరలు(Today Gold Rate)భారీ పెరుగుదలను నమోదు చేశాయి. అయితే వెండి ధరల్లో మాత్రం మిశ్రమ మార్పులు కనిపించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
సిటీలో సొంతిల్లు.. పడుతుంది 23 ఏళ్లు!
మెట్రో నగరాల్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే సామాన్య, మధ్యతరగతికే కాదు ధనిక కుటుంబాలకూ పొదుపు తప్పనిసరి. వార్షిక ఆదాయ, పొదుపు, తలసరి వ్యయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న గృహాల ధరల నేపథ్యంలో హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే కనిష్టంగా 23 ఏళ్ల సేవింగ్స్ అవసరం. అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే ఏకంగా వందేళ్లకు పైగా పొదుపు చేస్తేనే ఇల్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది.2022–23లో దేశ స్థూల పొదుపు, స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నిష్పత్తి 30.2 శాతంగా ఉంది. దీన్ని ఆధారంగా తీసుకొని.. రాష్ట్రంలోని అత్యంత ధనవంతులైన 5 శాతం మంది సగటు కుటుంబ ఆదాయం, రాష్ట్ర రాజధానిలోని 110 చదరపు మీటర్లు(1,184 చ.అ.) ఇంటి సగటు ధరతో పోల్చి ఈ డేటాను రూపొందించారు.ఠి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ తలసరి వ్యయం(ఆర్బీఐ ఎంపీసీఈ) ప్రకారం హైదరాబాద్లో ఐదు శాతం ధనిక కుటుంబాల వార్షిక ఆదాయం రూ.12.5 లక్షలుగా ఉంది. దీనికి ఆయా ఫ్యామిలీలకు 30.2 శాతం పొదుపు రేటును వర్తింపజేస్తే వారి వార్షిక పొదుపు దాదాపు రూ.3.8 లక్షలుగా ఉంటుంది. నేషనల్ హౌసింగ్ బోర్డ్ (ఎన్హెచ్బీ) డేటా ప్రకారం 645 చ.అ. నుంచి 1,184 చ.అ. మధ్య కార్పెట్ ఏరియా ఉన్న ఇంటి చ.అ. ధర గతేడాది మార్చిలో రూ.89 లక్షలుగా ఉంది. అంటే ఈ లెక్కన ఏడాదికి రూ.3.8 లక్షల పొదుపుతో రాష్ట్ర రాజధానిలోని టాప్–5 అర్బన్ కుటుంబాలు ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి కనిష్టంగా 23 ఏళ్లు పొదుపు చేయాల్సి ఉంటుంది.ఢిల్లీలో 35 ఏళ్ల పాటు.. ఇదే విధమైన లెక్కల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఇల్లు కొనాలంటే 35 ఏళ్ల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గృహ ప్రవేశం చేయాలంటే ఏకంగా 109 ఏళ్ల పాటు సేవింగ్స్ చేయాల్సిందే. దేశంలో పది కంటే ఎక్కువ రాష్ట్రాల రాజధానుల్లో ఇల్లు కొనాలంటే 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పడుతుంది. వీటిల్లో ముంబై, గుర్గావ్, భువనేశ్వర్, పాట్నా, కోల్కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో, డెహ్రాడూన్ రాజధానులు ఉన్నాయి.దక్షిణాదిలో మన దగ్గరే తక్కువ..దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, విశాఖపట్నంతో పోలిస్తే భాగ్యనగరంలోనే తక్కువ కాలం పొదుపు చేస్తే సరిపోతుంది. చెన్నైలో 37 ఏళ్ల పాటు సేవింగ్స్ చేస్తేనే గృహ ప్రవేశం చేయవచ్చు. ఇక, బెంగళూరులో 36 ఏళ్లు, తిరువనంతపురం, విశాఖపట్నంలలో 26 సంవత్సరాలు పొదుపు చేస్తే సొంతిల్లు సొంతవుతుంది. ఇక, అత్యల్పంగా కేవలం 15 ఏళ్ల పొదుపుతో సొంతింటి కలను సాకారం చేసుకునే ఏకైక నగరం చంఢీగడ్. ఆ తర్వాత 16 ఏళ్లతో జైపూర్ నగరాలున్నాయి.
కొన్నది కొంతే.. ఆర్బీఐకి బంగారం చేదైందా?!
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ పసిడి కొనుగోళ్లను పెంచుకుంటుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాత్రం తగ్గిస్తోంది. 2025లో ఆర్బీఐ తన బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, 2025లో ఆర్బీఐ కేవలం 4.02 టన్నుల బంగారమే కొనుగోలు చేసింది. ఇది 2024లో కొనుగోలు చేసిన 72.6 టన్నులతో పోలిస్తే దాదాపు 94 శాతం భారీ తగ్గుదల.ప్రపంచ కేంద్ర బ్యాంకుల ధోరణిప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఇటీవలి సంవత్సరాల్లో బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. 2025 డిసెంబర్ నాటికి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల వద్ద మొత్తం 32,140 టన్నుల బంగారం ఉంది. ఇక కొనుగోళ్ల విషయానికి వస్తే 2022లో అన్ని కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 1,082 టన్నులు కాగా 2023లో 1,037 టన్నులుగా ఉన్నాయి. 2024లో రికార్డు స్థాయిలో 1,180 టన్నులకు చేరాయి. 2025లోనూ 1,000 టన్నులకుపైగా ఉంటాయని అంచనా.అయితే, కొనుగోళ్లు తగ్గినప్పటికీ ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారు 880.2 టన్నుల బంగారం ఉంది. 2025 నవంబర్ నాటికి ఈ బంగారం నిల్వల విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది.విదేశీ మారక నిల్వల్లో పెరిగిన బంగారం వాటాభారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా కూడా గణనీయంగా పెరిగింది. ఒక సంవత్సరంలో బంగారం వాటా 10% నుంచి 16%కి పెరిగింది. 2021 మార్చిలో ఇది కేవలం 5.87% మాత్రమే. అంటే, గత ఐదేళ్లలో ఆర్బీఐ తన నిల్వల్లో బంగారం ప్రాధాన్యతను దాదాపు మూడు రెట్లు పెంచింది.కొనుగోళ్లు ఎందుకు తగ్గాయి?బంగారం ధరలు అత్యధికంగా ఉండటం, అలాగే ఆర్బీఐ నిల్వల్లో ఇప్పటికే బంగారం వాటా గణనీయంగా పెరగడం వల్ల, ఇప్పుడు ఆర్బీఐ కొత్త కొనుగోళ్ల కంటే ఉన్న నిల్వల సమతుల్య నిర్వహణపై దృష్టి పెడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.ఆర్బీఐ బంగారం ఎక్కడ ఉంది?ఆర్బీఐకి చెందిన బంగారం మొత్తం భారతదేశంలోనే నిల్వ ఉండదు. 2025 మార్చి నాటికి భారత్ మొత్తం బంగారం నిల్వలు 879.59 టన్నులు కాగా ఇందులో భారత్లో నిల్వ చేసింది సుమారు 512 టన్నులు. మిగిలిన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద భద్రపరిచింది. కొంత భాగం బంగారం నిక్షేపాల (Gold Deposits) రూపంలో కూడా ఉంది.
ఆదాయ మార్గం.. స్టూడియో అపార్ట్మెంట్
స్థిరాస్తి రంగానికి తుది వినియోగదారులతో పాటు పెట్టుబడిదారులు కూడా ముఖ్యమే. అంతిమ కొనుగోలుదారులతో పోలిస్తే ఆదాయ మార్గంగా ఇన్వెస్టర్లు రియల్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండటంతో ధరలు వేగంగా పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇల్లు, ఆఫీసు, రిటైల్, వేర్హౌస్ల మాదిరిగానే పెట్టుబడిదారులకు స్టూడియో అపార్ట్మెంట్లు కూడా ఆదాయ మార్గంగా మారాయి. ప్రధానంగా మెట్రో నగరాల్లో స్టూడియో అపార్ట్మెంట్లు హాట్ ఫేవరెట్స్గా మారాయి. –సాక్షి, సిటీబ్యూరోఎవరు కొంటారంటే? సాధారణంగా బెడ్ కమ్ లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. వీటిని అధికంగా విద్యార్థులు, బ్యాచిలర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు కొనుగోలు చేస్తుంటారు. ఈ తరహా అపార్ట్మెంట్లకు విస్తీర్ణం పరంగా కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. ఉపాధి, వ్యాపార కేంద్రాల పరిసర ప్రాంతాలలో, పర్యాటక కేంద్రాలకు చేరువలో, ఖరీదైన ప్రదేశాలలో ఉండే స్టూడియో అపార్ట్మెంట్లకు గిరాకీ అధికంగా ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.మన దగ్గర తక్కువే.. కరోనా తర్వాత విశాలమైన ఇళ్లకు ఆదరణ పెరగడంతో స్టూడి యో అపార్ట్మెంట్ల కస్టమర్లు పునరాలోచనలో ఉన్నారు. సాధారణంగా ఈ తరహా అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాలలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే.. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో కేవలం 34 స్టూడియో అపార్ట్మెంట్ల ప్రాజెక్ట్లు ప్రారంభమయ్యాయి.
కార్పొరేట్
బిజినెస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ దాకా
వరుసగా 4 రోజులు సెలవులు.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
అమెజాన్ ఉద్యోగులకు అమావాస్యే! కత్తులు సిద్ధం!!
దుబాయ్ బ్యాంకు చేతికి ఆర్బీఎల్ బ్యాంక్
రూ.623 కోట్ల పెట్టుబడి.. స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
దేశీ ఎంట్రప్రెన్యూర్ల హవా.. చైనాను వెనక్కి నెట్టిన భారత్!
డాక్టర్ రెడ్డీస్ లాభం 1,210 కోట్లు
దావోస్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణ
జొమాటో: సీఈవోగా దిగిపోయిన దీపిందర్ గోయిల్
‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి
Stock Market Updates: లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ...
ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..
ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడు, ఎలా మారుతాయో.. ఎవరూ అం...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార...
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..
ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (R...
గిగ్ వర్కర్ల సామాజిక భద్రతే లక్ష్యంగా ముందడుగు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పని సంస్కృతికి అనుగుణంగ...
మెండుగా వ్యాపార విశ్వాసం!
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వ్యాపార విశ్వాస సూచీ...
ఎగువ మధ్యాదాయ దేశంగా భారత్
భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే నాలుగేళ్లలో (2030 నాటికి...
రూ.10,300 కోట్ల యూరియా ప్రాజెక్టు
దేశీయ ఎరువుల ఉత్పత్తి రంగంలో స్వయంసమృద్ధి సాధించడమ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఐటీకి కొత్త బూమ్ ఖాయం: విప్రో సీఈవో
ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తుపై విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని పల్లియా గట్టి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం గణనీయమైన మార్పును ఎదుర్కోనుందని చెప్పారు.పల్లియా ప్రకారం.. 2025 సంవత్సరం ప్రయోగాలు, చిన్న స్థాయి ట్రయల్స్కు పరిమితమైతే, 2026 పూర్తి స్థాయి అమలు, జవాబుదారీతనానికి కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పటికే సంస్థలు ఏఐ (AI) టెక్నాలజీని కేవలం పరీక్షించే దశను దాటేశాయని, చిన్న ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎంటర్ప్రైజ్-వైడ్ అమలు వైపు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.ఈ మార్పు భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతిదారులకు బలమైన కొత్త అవకాశాలను తెస్తోందని పల్లియా చెప్పారు. మెగా డీల్స్తో పాటు ప్రత్యేకమైన, చిన్న ఏఐ ప్రాజెక్టుల కోసం కూడా పోటీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.ఏఐ ఐటీ రంగ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోందని ఆయన అంగీకరించారు. ఏఐ-సహాయక సాఫ్ట్వేర్ అభివృద్ధి వల్ల కోడింగ్, టెస్టింగ్ ఖర్చులు సుమారు 25 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. దీని వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడినప్పటికీ, ఆ పొదుపును మరిన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు వినియోగిస్తారని ఆయన తెలిపారు.గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్నాలజీ వ్యయాలు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఏఐ ధోరణి ఐటీ పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని విప్రో భావిస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు శ్రీధర్ వెంబు సూచన
సాఫ్ట్వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొనసాగుతోంది. ముఖ్యంగా ‘కర్సర్’ (Cursor) వంటి ఏఐ సాధనాల ద్వారా కేవలం ప్రాంప్ట్లు ఇస్తూ వందల సంఖ్యలో కోడ్ లైన్లను రాయడాన్ని డెవలపర్లు అలవాటు చేసుకుంటున్నారు. దీనినే ‘వైబ్ కోడింగ్’ అని పిలుస్తున్నారు. అయితే, ఈ ధోరణిపై జోహో అధినేత శ్రీధర్ వెంబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైబ్ కోడింగ్కు ప్రత్యామ్నాయంగా ఏసీఈ(AI-Assisted Code Engineering) అనే కొత్త విధానాన్ని ఆయన తెరపైకి తెచ్చారు.ఏంటి వైబ్ కోడింగ్?ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకులు ఆండ్రెజ్ కార్పతి ఇటీవల వైబ్ కోడింగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. డెవలపర్లు లోతైన ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం లేకపోయినా కేవలం సహజ లాంగ్వేజీ ప్రాంప్ట్ల ద్వారా (Natural Language Prompts) ఏఐ అసిస్టెంట్లను ఉపయోగించి సాఫ్ట్వేర్ నిర్మించే ప్రక్రియను ఇది సూచిస్తుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇది భవిష్యత్తు అని అంగీకరించినప్పటికీ శ్రీధర్ వెంబు మాత్రం దీనివల్ల జరిగే నష్టాలను హెచ్చరించారు.‘ఏసీఈ’ ఎందుకు ముఖ్యం?శ్రీధర్ వెంబు అభిప్రాయం ప్రకారం, కేవలం ఏఐ ఇచ్చే ఫలితాలపై ఆధారపడటం వల్ల కంప్యూటర్ సైన్స్లోని మౌలిక అంశాలైన ఆప్టిమైజేషన్, అబ్స్ట్రాక్షన్, కంపైలేషన్ వంటి క్లిష్టమైన దశలను డెవలపర్లు విస్మరించే ప్రమాదం ఉంది.అసిస్టెడ్ కోడ్ ఇంజినీరింగ్ ప్రత్యేకతలుక్రమశిక్షణ కలిగిన ఇంజినీరింగ్గా దీనికి గుర్తింపు ఉంది. ఏసీఈ అనేది కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ సాధనాలు, కోడింగ్ పద్ధతులపై అవగాహన పెంపొందించేలా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏఐ మీకు సహాయం చేస్తుంది. అదేసమయంలో నిత్యం మీ నైపుణ్యాన్ని పెంచుకుంటూనే ఉండాలి. వైబ్ కోడింగ్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ కోతలకు అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుండగా, ఏసీఈ విధానం అనుభవజ్ఞులైన ఇంజినీర్లను అందిస్తుందని వెంబు స్పష్టం చేశారు.టెక్ పరిశ్రమ ఇప్పటికే లేఆఫ్స్ ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కేవలం ‘వైబ్’ మీద ఆధారపడకుండా క్రమశిక్షణతో కూడిన ఏఐ అసిస్టెడ్ కోడింగ్ను అలవాటు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి
ఐటీ రంగంలో పుంజుకుంటున్న ‘డిస్క్రెషనరీ’ ఖర్చులు
సుదీర్ఘ కాలం పాటు మందగమనంలో ఉన్న ఐటీ రంగంలో డిస్క్రెషనరీ టెక్నాలజీ ఖర్చులు (ఐచ్చికంగా ఆలోచించి అవసరాలకు మాత్రమే చేసే ఖర్చు) మళ్లీ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, గ్లోబల్ టెక్ కంపెనీలు ఇప్పటికీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల కోసం అదనపు నిధులను వెచ్చించే కంటే అంతర్గత వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా నిధులను మళ్లించడంపైనే సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.అంతర్గత పొదుపుతోనే కొత్త ప్రాజెక్టులుఎవరెస్ట్ గ్రూప్ సీఈఓ జిమిత్ అరోరా విశ్లేషణ ప్రకారం, ప్రతి రంగంలోని క్లయింట్లు తాము పూర్తిస్థాయి టెక్నాలజీ కంపెనీలుగా మారాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. అయితే, టెక్నాలజీ బడ్జెట్ల వృద్ధి కేవలం తక్కువగానే (లో-టు-మిడ్ సింగిల్ డిజిట్) ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పునరుద్ధరణ కొత్త పెట్టుబడుల ద్వారా కాకుండా రోజువారీ కార్యకలాపాల (బిజినెస్ యాజ్ యూజువల్ - BAU) ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా జరుగుతోంది. ఖర్చులను కుదించి ఆ నిధులను అత్యాధునిక సాంకేతికత వైపు మళ్లించడంపైనే కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.ఏఐ డీల్స్తో జోష్ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలిల్ పరేఖ్ క్యూ3 ఫలితాల సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, యుటిలిటీస్ రంగాల్లో డిస్క్రెషనరీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డీల్స్పై క్లయింట్లు ఆసక్తి చూపడం ఐటీ రంగానికి కలిసొస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు, స్థిరమైన డిమాండ్ వల్ల రాబోయే ఆర్థిక సంవత్సరంపై ఆశలు పెరుగుతున్నాయి.అప్రమత్తత అవసరం..పరిస్థితి మెరుగుపడుతున్నా అప్రమత్తత అవసరమని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వేతనాల పెరుగుదల వంటి చట్టబద్ధమైన ఖర్చుల వల్ల మార్జిన్లపై ఒత్తిడి ఉండొచ్చని, అందుకే సంస్థలు నియంత్రణాత్మక వ్యయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీల ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన తర్వాతే పూర్తిస్థాయిలో డిస్క్రెషనరీ ఖర్చులు ఊపందుకుంటాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు
‘మొబైల్ విడిభాగాలపై సుంకాల్లో కోత పెట్టాలి’
మొబైల్ ఫోన్ విడిభాగాలైన మైక్రోఫోన్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, వేరబుల్స్పై దిగుమతి సుంకాలు తగ్గించాలంటూ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ప్రకటించాలని డిమాండ్ చేసింది. అలాగే, దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ వ్యయాన్ని తగ్గించేందుకు గాను క్యాపిటల్ గూడ్స్, ఇతర విడిభాగాలపై టారిఫ్లను సవరించాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లేదంటే ఇటీవల చైనా విధించిన నియంత్రణ చర్యలు దేశీ మొబైల్ ఫోన్ల తయారీకి ముప్పుగా మారతాయని పేర్కొంది.ఐసీఈఏలో యాపిల్, ఫాక్స్కాన్, డిక్సన్, షావోమీ, వివో, ఒప్పో తదితర సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ‘తయారీ మెషినరీ ఎగుమతులపై చైనా ఇటీవల విధించిన ఆంక్షలు సరఫరా పరమైన సమస్యలను పెంచుతాయి. దిగుమతి పరికరాలపై భారత్ ఆధారపడి ఉండడం వ్యూహాత్మక బలహీనతగా మారింది. కనుక అన్ని రకాల విడిభాగాలు, సబ్ అసెంబ్లీలు, అసెంబ్లీల దిగుమతులపై జీరో సుంకం ప్రయోజనాన్ని వర్తింపజేయాలి’ అని ఐసీఈఏ సూచించింది. దీని ఫలితంగా స్వావలంబన పెరుగుతుందని, అంతర్జాతీయంగా భారత్ పోటీతత్వం ఇనుమడిస్తుందని అభిప్రాయపడింది. రూ.6.76 లక్షల కోట్లకు ఉత్పత్తి..దేశీ ఎల్రక్టానిక్స్ పరిశ్రమ 25 లక్షల మందికి ఉపాధి కలి్పస్తుండడం గమనార్హం. దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐసీఈఏ అంచనా. ఇందులో 30 బిలియన్ డాలర్లు మేర ఎగుమతులు ఉంటాయని పేర్కొంది. 2024–25లో రూ.5.5 లక్షల కోట్ల మొబైల్ ఫోన్ల తయారీ నమోదు కాగా, ఇందులో ఎగుమతులు రూ.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. కొన్ని రకాల సంక్లిష్టమైన, ప్రత్యేకమైన మెషినరీ అవసరం మొబైల్ ఫోన్లు, లిథియం అయాన్ సెల్ తయారీకి అవసరమని పేర్కొంటూ.. అయినప్పటికీ ఇవి కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులకు దూరంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి పరిశ్రమ తీసుకెళ్లింది. ఈ మెషినరీ దేశీయంగా తయారు కావడం లేదని, దిగుమతుల కోసం పెద్ద మొత్తంలో సుంకాలు చెల్లించాల్సి వస్తున్నట్టు.. ఫలితంగా మూలధన వ్యయాలు 7.5–20 శాతం మధ్య అధికంగా వెచ్చించాల్సి వస్తున్నట్టు వివరించింది.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు
పర్సనల్ ఫైనాన్స్
మీరు యాక్టివా.. పాసివా?
స్టాక్ మార్కెట్లపై పెద్దగా అవగాహన లేనివారు... షేర్ల గురించి ఎక్కువగా తెలియని వారు కూడా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఏ షేర్లో ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు వెనక్కు తీసుకోవాలో అవన్నీ చూసుకోవటానికి మ్యూచువల్ ఫండ్లలో ఓ పెద్ద వ్యవస్థ ఉంటుంది. అవన్నీ చేస్తూ... ఏడాది తిరిగేసరికల్లా చక్కని రాబడినిస్తాయి కనక మ్యూచువల్ ఫండ్లు చాలామందిని ఆకర్షిస్తుంటాయి. బ్యాంకు వడ్డీని మించి రాబడి సాధించాలన్నా... ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలన్నా ఇదో మంచి మార్గం. సరే! మరి ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? అంటే షేర్లలోను, బాండ్లలోను ఇన్వెస్ట్ చేసేయాక్టివ్ ఫండ్స్లోనా? లేక ఇండెక్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టే పాసివ్ ఫండ్స్లోనా? ఏది బెటర్? దీన్ని వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...భారతదేశ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏకంగా రూ.81 లక్షల కోట్లకు చేరిందిపుడు, ఒకరకంగా ఇది రికార్డు స్థాయి. ఇందులో పాసివ్ ఫండ్స్ విలువ దాదాపు రూ.14 లక్షల కోట్లు. మిగిలిన విలువ యాక్టివ్ ఫండ్స్ది. అసలు మనదేశంలో ఇండెక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే పాసివ్ ఫండ్ల విలువ రూ.14 లక్షల కోట్లకు చేరుతుందని ఎవరైనా ఊహించారా? మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందనేది నిపుణుల మాట. దీంతో పాసివ్ ఫండ్లు మంచివా... లేక యాక్టివ్ ఫండ్సా అనే చర్చ మళ్లీ జోరందుకుంది. నైపుణ్యం, అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లు మాత్రమే, నిరంతరం మార్కెట్ని మించి రాబడులు అందించగలరనే భావన కొన్నాళ్ల కిందటిదాకా ఉండేది. కానీ, ఇపుడు చాలా మంది ఇన్వెస్టర్లు క్రమంగా ఖర్చులను ఆదా చేసే, సరళంగా ఉండే, దీర్ఘకాలికంగా విశ్వసనీయంగా ఉండే పాసివ్ విధానంవైపు మళ్లుతున్నారు. ఈ రెండింట్లో ఉండే సానుకూల, ప్రతికూలాంశాలు చూస్తే...ఇండెక్స్ వర్సెస్ యాక్టివ్ ఫండ్స్..ఇండెక్స్ ఫండ్స్ అంటే, సెన్సెక్స్, నిఫ్టీ50, నిఫ్టీ– 500 లాంటి నిర్దిష్ట మార్కెట్ సూచీని ప్రతిబింబించేవి పాసివ్ ఫండ్స్. ఇవి ఆ సూచీలోని స్టాక్స్లో, అదే పరిమాణంలో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రత్యేకంగా షేర్లను ఎంచుకోవడం, మంచి సమయం కోసం వేచి ఉండటంలాంటిది ఉండదు. ఈ తరహా ఫండ్స్లో ఖర్చులు చాలా తక్కువ. దాదాపు సదరు ఇండెక్స్ స్థాయిలో పనితీరు కనపరుస్తాయి (కొంత వ్యయాలు పోగా).అదే యాక్టివ్ ఫండ్స్ని తీసుకుంటే బెంచ్మార్క్కి మించిన రాబడులను అందించేలా వీటిని ప్రొఫెషనల్స్ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం అధ్యయనం, షేర్ల ఎంపిక, వ్యూహాత్మకంగా సర్దుబాట్లు చేయడంలాంటి హడావిడి ఉంటుంది. ఈ తరహా ఫండ్లు ప్రామాణిక సూచీలకు మించిన పనితీరు సాధించే అవకాశం ఉంటుంది. వీటిల్లో పరిశోధనలు, ట్రేడింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఖర్చుల నిష్పత్తి కూడా ఎక్కువే.ఏవి ఎలా ఉంటాయ్..ఇండెక్స్ ఫండ్స్ పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఏదో ఒక్క మేనేజరు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. మార్కెట్ హెచ్చుతగ్గులపరమైన ప్రభావమే తప్ప నిర్దిష్ట స్టాక్పరమైన ప్రతికూల ప్రభావం ఉండదు. మరోవైపు, యాక్టివ్ ఫండ్స్ విషయానికొస్తే ఇవి నిర్దిష్ట సాధనాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడితే పెట్టుబడిపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పక్షంలో ఫండ్ పనితీరు దెబ్బతినే అవకాశాలూ ఉంటాయి.వాస్తవ పరిస్థితిఆర్థిక సమాచార సేవల సంస్థ ఎస్ అండ్ పీకి చెందిన ఎస్పీఐవీఏ ఇండియా నివేదిక ప్రకారం (2025 మధ్య, అంతకు ముందు ట్రెండ్స్) దాదాపు 65–66 శాతం లార్జ్ క్యాప్ యాక్టివ్ ఫండ్స్, 2025లో తమ తమ బెంచ్మార్క్ సూచీలకన్నా తక్కువ రాబడులను అందించాయి. దీర్ఘకాలికంగా అంటే పదేళ్ల పైగా వ్యవధిలో చూస్తే సుమారు 80 శాతం మిడ్, స్మాల్ క్యాప్ యాక్టివ్ ఫండ్స్ వెనుకబడ్డాయి. అయితే, కొన్ని యాక్టివ్ ఫండ్లు తీవ్ర హెచ్చుతగ్గుల మార్కెట్లలో కూడా రాణించగలిగే విధంగా ఉంటాయి. మరోవైపు, పాసివ్ ఫండ్స్ అనేవి కొంత రిస్కు తక్కువ వ్యవహారంగా విశ్వసనీయమైన స్థాయిలో రాబడులు అందించేందుకు అవకాశం ఉంది. ఎవరికి .. ఏవి అనువు..ఇండెక్స్ ఫండ్స్: తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు, దీర్ఘకాలిక సిప్ ఇన్వెస్టర్లు, రిటైర్మెంట్ ప్రణాళికల్లో ఉన్నవారు. పెట్టుబడుల ప్రక్రియ సరళంగా ఉండాలనుకునేవారు. ప్రతి రోజూ మార్కెట్లను, పెట్టుబడులను చూస్తూ కూర్చోవడానికి ఇష్టపడని వారు. యాక్టివ్ ఫండ్స్: పనితీరును సమీక్షించుకోవడానికి ఇష్టపడే అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు, నిర్దిష్ట రంగాలు/థీమ్ల్లో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలను కోరుకునేవారు.ఖర్చులు కీలకం..ఇండెక్స్ ఫండ్స్కి సంబంధించిన పెద్ద సానుకూల అంశం ఖర్చులు తక్కువగా ఉండటం. డైరెక్ట్ ప్లాన్లయితే సాధారణంగా 0.1 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉంటాయి. మరోవైపు, యాక్టివ్ ఫండ్లు సాధారణంగా 1.5 – 2.5 శాతం శ్రేణిలో చార్జీలు విధిస్తాయి. కాలక్రమేణా ఈ చార్జీలన్ని కలిపితే తడిసి మోపెడవుతుంది. దీర్ఘకాలంలో ఇదొక సైలెంట్ వెల్త్ కిల్లర్లాంటిది. 20–25 ఏళ్ల వ్యవధిలో చూస్తే ఆఖర్లో ఈ వ్యయాల భారం పెట్టుబడి, నిధిని బట్టి లక్షలు, కోట్లల్లోనూ ఉంటుంది. ఆ మేరకు రాబడీ తగ్గుతుంది.హైబ్రిడ్ వ్యూహంతో మేలు..చాలా మంది నిపుణులు ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించి హైబ్రిడ్ వ్యూహమైన ‘కోర్–శాటిలైట్’ విధానాన్ని సూచిస్తున్నారు. అంటే 60–70 శాతం మొత్తాన్ని (కోర్) తక్కువ వ్యయాలతో కూడుకుని ఉండే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటి నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి, పోర్ట్ఫోలియోకి స్థిరత్వం లభిస్తుంది. ఇక 30–40 శాతం మొత్తాన్ని అనుబంధంగా (శాటిలైట్), అధిక లాభాలను ఆర్జించి పెట్టే అవకాశమున్న నిర్దిష్ట యాక్టివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే, ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ ఒకే రకం పెట్టుబడి వ్యూహం ఉపయోగపడకపోవచ్చు. ఇండెక్స్ ఫండ్లతో ఖర్చులు ఆదా అవుతాయి. రాబడులు కాస్త అంచనాలకు అందే విధంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ ప్రయోజనాలు దక్కుతాయి. ముఖ్యంగా నిలకడగా మార్కెట్ని మించి రాబడులను సాధించడం కష్టంగా ఉండే లార్జ్–క్యాప్ సెగ్మెంట్కి సంబంధించి ఇవి అనువైనవిగా ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్ అనేవి అధిక రాబడుల ఆశలు కలి్పస్తాయి, కానీ ఫీజులు, రిసు్కలు అధికంగా ఉంటాయి. ఏదైతేనేం.. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. యాంఫీ, ఫండ్ ఫ్యాక్ట్ షీట్లు, విశ్వసనీయమైన ప్లాట్ఫాంల ద్వారా ఫండ్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మీ రిస్క్ ప్రొఫైల్, లక్ష్యాలకు అనువుగా ఉండే దాన్ని ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి.ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!
గోల్డ్ కార్డు: బంగారంతోనే షాపింగ్!
నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని వినియోగించే వినూత్న విధానంతో ‘ఓ గోల్డ్ మాస్టర్ కార్డు’ను దుబాయ్లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించకుండా, నేరుగా కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.ఓ గోల్డ్ మేనేజ్మెంట్ సంస్థ తమ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను లైఫ్స్టైల్ సూపర్ యాప్గా తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ యాప్ ద్వారా తక్కువ పరిమాణంలోనూ బంగారం యాజమాన్యాన్ని పొందే అవకాశం కల్పిస్తున్నారు.కొత్తగా ప్రవేశపెట్టిన ఓ గోల్డ్ మాస్టర్ కార్డుతో, వినియోగదారులు బంగారాన్ని నగదు మాదిరిగా ఉపయోగించి వివిధ వస్తువులు, సేవలను కొనుగోలు చేయవచ్చు. ఈ లావాదేవీలు సులభమైనవి, సురక్షితమైనని, అన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వినూత్న వ్యవస్థను మావరిడ్ ఫైనాన్స్, మాస్టర్ కార్డ్ సహకారంతో అమలు చేశారు.ఈ కార్డు వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయ లాంజ్లకు కాంప్లిమెంటరీ ప్రవేశం, హోటళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఆఫర్లు, అలాగే రెస్టారెంట్లు, ఈ-కామర్స్, ఎంటర్టైన్మెంట్ సేవలపై రాయితీలు లభిస్తాయి.ఓ గోల్డ్ మాస్టర్ కార్డు ద్వారా 8,000కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. యాప్ ద్వారా వోచర్లు, గిఫ్ట్ కార్డులను సులభంగా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే ఈ-సిమ్ కార్డులు, రివార్డులు, లాయల్టీ ప్రోగ్రామ్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని ఓ గోల్డ్ వ్యవస్థాపకుడు బందర్ అల్ ఓట్మాన్ తెలిపారు.
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది.ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి క్లెయిమ్ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.కొత్త విధానం అమలులోకి వచ్చిన తరువాత.. పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో కొంత భాగం మినహాయించి, మిగిలిన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇది ఈపీఎఫ్ ఖాతాకు సీడ్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చో చూడవచ్చు. అంతే కాకుండా యూపీఐ పిన్ నెంబర్ ఉపయోగించడం ద్వారా.. మీ ఖాతాలు బదిలీ చేసుకోవచ్చు. ఇలా బదిలీ చేసుకున్న తరువాత ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి
ఎస్బీఐ ఏటీఎం ఛార్జీల పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎం, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్డ్రాయల్ మెషిన్ (ఏడీడబ్ల్యూఎం) లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను సవరించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉచిత పరిమితిని మించి ఉపయోగించే కస్టమర్లపై ఫీజులు పెరిగాయి. ఈ సవరించిన ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత, ఎస్బీఐ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణ చేస్తే ఒక్కో లావాదేవీకి రూ.23 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలపై ఫీజును రూ.11 + జీఎస్టీగా నిర్ణయించారు. ఇంటర్చేంజ్ ఫీజు పెరుగుదల నేపథ్యంలో ఏటీఎం సేవల ధరలను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.ప్రభావం వీరిపైనే..ఉచిత లావాదేవీ పరిమితిని మించి ఎస్బీఐయేతర ఏటీఎంలను ఉపయోగించే సేవింగ్స్, శాలరీ ఖాతాదారులపై ఈ మార్పులు ప్రధానంగా ప్రభావం చూపుతాయి. అయితే, పలు ఇతర కేటగిరీల అకౌంట్లకు ఈ సవరణల నుంచి మినహాయింపును ఎస్బీఐ ఇచ్చింది.ఉచిత లావాదేవీల పరిమితులురెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర కలిపి) యథాతథంగా కొనసాగుతాయి. ఈ పరిమితిని దాటిన తర్వాత సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై అన్ని ప్రదేశాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతిస్తారు. గతంలో వీరికి అపరిమిత ఉచిత లావాదేవీలు ఉండేవి.ప్రభావం లేని ఖాతాలివే.. ఈ సవరణల వల్ల కింది ఖాతాదారులకు ఎలాంటి మార్పు ఉండదని ఎస్బీఐ స్పష్టం చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాలు – ప్రస్తుత ఛార్జ్ నిర్మాణమే కొనసాగుతుంది. ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా ఎస్బీఐ ఏటీఎంలలో చేసే లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఎస్బీఐ ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణలు అపరిమితంగా, ఉచితంగా కొనసాగుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డు (కేకేసీ) ఖాతాలకు కూడా ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది.


