ప్రధాన వార్తలు
దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం
అస్సాంలో గోహ్పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ విలువ ఏకంగా రూ. 18,662 కోట్లు. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం నిర్మించనున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్గా నిలవనుంది.ప్రస్తుతం.. NH715లోని నుమాలిఘర్ & NH-15లోని గోహ్పూర్ మధ్య దూరం 240 కి.మీ. ఇది NH-52లోని సిల్ఘాట్ సమీపంలోని కాలియాభంభోరా మీదుగా వెళుతుంది. ఈ ప్రయాణం నుమాలీగఢ్, కాజిరంగ నేషనల్ పార్క్, బిస్వనాథ్ టౌన్ వంటి ప్రాంతాల గుండా సాగుతుంది. కొత్త గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణంతో దూరం & ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీనిని ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (EPC) మోడల్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదికి కింద నిర్మించే ఈ రోడ్డు - రైలు టన్నెల్ ద్వారా.. అస్సాం మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ & ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీఈ కారిడార్ 11 ఆర్థిక కేంద్రాలు, మూడు సామాజిక కేంద్రాలు, రెండు పర్యాటక కేంద్రాలు & ఎనిమిది లాజిస్టిక్ కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అంతే కాకుండా నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు, రెండు విమానాశ్రయాలు, రెండు అంతర్గత జలమార్గాలతో కూడిన మల్టీ మోడల్ కనెక్టివిటీని ఇది బలోపేతం చేస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యం పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.
దేశంలోనే టాప్ 5 టోల్ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు
భారతదేశంలో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై గత ఐదేళ్లలో (2020-21 నుంచి 2024-25 వరకు) సుమారు రూ. 2.27 లక్షల కోట్ల టోల్ వసూళ్లు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. అయితే టాప్ టోల్ ప్లాజాల వివరాలు 2019-20 నుంచి 2023-24 వరకే అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాప్ 5 టోల్ ప్లాజాల గురించి తెలుసుకుందాం.
అమెరికా-ఇరాన్ యుద్ధం?.. స్టాక్ మార్కెట్లలో టెన్షన్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సంభవించే అవకాశంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం ‘మిడ్ నైట్ హామర్ ఆపరేషన్’తో పోలిస్తే, ఈసారి అమెరికా మరింత వ్యూహాత్మక సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో యూ.ఎస్. విమాన వాహక నౌక బృందాన్ని మోహరించినప్పటి నుంచి, స్థానిక యూఎస్ శిబిరాల్లో కూడా సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి.అమెరికా దళాలు వారాలపాటు సైనిక కార్యకలాపాలకు సన్నద్ధమవుతున్నాయని సైనిక వర్గాలు అంతర్జాతీయ మీడియాకు అనామకంగా తెలియజేశాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊ అనడమే ఆలస్యం.. రంగంలోకి దిగి ఇరాన్పై దాడులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.శాంతి చర్చలు ఫలించేనా?ఇక ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలు జెనీవాలో జరగనుండగా, ఈ నెల 17న ఈ చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతాయని భావిస్తున్నారు. ఇరాన్ తన అణు పరీక్షలను ఆపకపోతే “సైనిక చర్యలు తప్పవు” అని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే, ఇరాన్ తన అణు, క్షిపణి కార్యక్రమాలను ఆపే ఎటువంటి ప్రణాళికలు లేవని ప్రకటించింది. అంతే కాకుండా, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడి జరిగితే, ప్రతీకారం తప్పనిసరిగా జరిగుతుందని హెచ్చరిస్తోంది. ఇలా పరిస్థితులు తీవ్రమైతే, ఈ ప్రాంతంలో యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచం అంతటా ముడి చమురు, బంగారం, స్టాక్ మార్కెట్లు ప్రభావితమవుతాయి.చమురు ధరలు పెరిగే అవకాశంఇదిలా ఉండగా, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయించాయి. ఇరాన్-చైనా చమురు అమ్మకాలపై అమెరికా దృష్టి సారించింది. ప్రస్తుతం ఇరాన్ చమురు అమ్మకాలలో 80 శాతం చైనాకు జరుగుతున్నాయి. దీన్ని నివారించగలిగితే ఇరాన్ ఆర్థికంగా మరింత నాశనం అవుతుందని ఇరు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. చైనాపై మరిన్ని సుంకాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదే జరిగితే, అరుదైన లోహాల ఎగుమతిపై చైనా మళ్లీ ఆంక్షలు విధిస్తుంది. ఇది యూఎస్-చైనా సంబంధాలను మరింత దిగజార్చుతుంది. ప్రధాన చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్ నుంచి ముడి చమురు ఆగిపోతే మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.బంగారం, వెండి ధరలపై ప్రభావంగత వారం హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి ధరలకు రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు కీలకం. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కావడంతో బంగారానికి కొత్త డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 5,041 డాలర్ల వద్ద ముగిసింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల భయాల మధ్య ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి.
కాపర్ మరో సిల్వర్ కానుందా?.. సంక్షోభం ఆసన్నమైందా?
దేశీయంగా, అంతర్జాతీయంగా రాగి మార్కెట్పై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. 2025లో వెండి ధరలు 150 శాతం వరకు ఎగసిన నేపథ్యంలో, రాగి కూడా అదే బాట పట్టే అవకాశముందా అన్న ప్రశ్న ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది.ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు2026 ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, రాగి ఉత్పత్తిలో స్థిరత్వం కనిపించడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక దేశీయ రాగి ఉత్పత్తి 3.33 మిలియన్ టన్నులు. 2023–24లో ఇది 3.78 మిలియన్ టన్నులకు పెరిగింది. అయితే 2024–25లో మళ్లీ 3.56 మిలియన్ టన్నులకు పడిపోయింది.రాగి సాంద్రత (కాన్సన్ట్రేట్) ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. 2022–23లో 1,12,745 టన్నులు ఉండగా 2023–24లో 1,25,230 టన్నులకు పెరిగింది. కానీ, 2024–25లో 1,05,012 టన్నులకు క్షీణించింది.తగ్గుతున్న ధాతు గ్రేడ్లురాగి గనుల్లో సగటు ధాతు గ్రేడ్లు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అనేక గనులు 0.4–0.6 శాతం మాత్రమే దిగుబడితో పనిచేస్తున్నాయి. అంటే ఒక టన్ను రాగి కోసం వందల టన్నుల రాతిని తవ్వి ప్రాసెస్ చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి.ఆర్థిక సర్వే ఉదాహరణగా 1 గిగావాట్ విండ్ టర్బైన్ ప్రాజెక్ట్ను పేర్కొంది. దీనికి సుమారు 2,866 టన్నుల రాగి అవసరం. 0.6 శాతం దిగుబడి వద్ద దాదాపు 4.7 లక్షల టన్నుల రాగి ధాతువును ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని అంచనా. వ్యర్థ రాయి కలుపుకుంటే మొత్తం తరలింపు 10 లక్షల నుంచి 20 లక్షల టన్నుల వరకు ఉండొచ్చని నివేదిక చెబుతోంది.పెరుగుతున్న డిమాండ్రాగి వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. వైర్లు, మోటార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, డేటా సెంటర్ల శీతలీకరణ వ్యవస్థలు ఇలా.. ప్రతి రంగంలో రాగి కీలక పాత్ర పోషిస్తోంది.ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల విస్తరణతో రాగిపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. పవర్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్గేర్, జీపీయూలు, సర్వర్లను నడిపే పవర్ డెలివరీ వ్యవస్థలకు విస్తృతంగా రాగి అవసరమవుతోంది.ధరల దిశ2025లో కీలక లోహాల్లో రాగి ధరలు గణనీయంగా పుంజుకున్నాయి. మెటల్ ధరల సూచీలో ఇది సంవత్సరానికి 32 శాతం పెరుగుదల నమోదు చేసింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాబోయే కాలంలో ధరలపై మరింత ఒత్తిడి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భవిష్యత్తు ఎలా?వెండి లాగా 150 శాతం పెరుగుతుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోయినా, రాగి మార్కెట్లో బుల్లిష్ సంకేతాలు కనిపిస్తున్నాయి. శక్తి పరివర్తన, విద్యుతీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ.. ఈ మూడు ధోరణులు కొనసాగితే రాగి ధరలు మధ్యకాలంలో మరింత ఎగిసే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు.మొత్తంగా, రాగి ఇక సాధారణ పారిశ్రామిక లోహం మాత్రమే కాదు.. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు కీలక మౌలిక వనరుగా మారుతోంది. సరఫరా-డిమాండ్ అసమతౌల్యం కొనసాగితే మార్కెట్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది!.
ఇంటి విలువను పెంచే కొత్త రకం కిచెన్..
ఇంట్లో వంట గది స్థానం ప్రత్యేకం.. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి, శ్రేయస్సుకు, సానుకూల శక్తికి బీజం పడేది ఇక్కడే. అందుకే వాస్తుశాస్త్రంలోనూ వంట గదికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. అలాంటి కిచెన్ రూమ్ అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉండాలి కదా.. అందుకే మార్కెట్లో రకరకాల మాడ్యులర్ కిచెన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ, కలప, వెదురుతో కిచెన్ వార్డ్ రోబ్స్ తయారు చేస్తుండటంతో కొంతకాలం తర్వాత మన్నిక తగ్గి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారమే ‘స్టెయిన్ లెస్ స్టీల్ మాడ్యులర్ కిచెన్స్’! సంప్రదాయ వంట గదులకు కాలం చెల్లింది. ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, బార్లు, కాఫీ షాప్స్లో వినియోగించిన స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్స్ను ఇప్పుడు ఇళ్లలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్లో స్టెయిన్లెస్ స్టీల్ భాగమైపోయింది. ఇవి సాటిలేని మన్నిక, పరిశుభ్రత, సొగసైన, ఆధునిక సౌందర్యాన్ని అందిస్తాయి. నివాస, వాణిజ్య సముదాయాలు రెండింటిలోనూ అనువైనవి.నిర్వహణ సులువు.. స్టెయిన్లెస్ స్టీల్ వంట గదుల వేడిని గ్రహించవు. తుప్పు నిరోధక గుణాన్ని కలిగి ఉంటాయి. పైగా వీటి ఉపరితలాలపై రంధ్రాలు ఉండకపోవడంతో ద్రవాలు, రసాయనాలు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వంటివి లోపలికి వెళ్లవు. దీంతో ఎప్పుడూ మరకలు లేకండా పరిశుభ్రంగా ఉంటుంది. వీటి నిర్వహణ చాలా సులువు. ప్రత్యేకమైన క్లీనర్లు అవసరం లేకుండా తేలికపాటి సబ్బు, నీటితో శుభ్రం చేయవచ్చు. ఇవి అగ్ని నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అన్ని రకాల వాతావరణాలకు అనుకూలమైనవి. నీరు పడితే ఉబ్బడం, అధిక వేడికి కాలిపోవడం, కరగడం జరగదు. ఈ స్టీల్కు రంధ్రాలు ఉండవు కాబట్టి తెగుళ్లు, చెదపురుగులు పట్టవు.పర్యావరణ అనుకూలమైనవి.. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఉండే ఇంటి విలువ కొంత మెరుగ్గా ఉంటుంది. ఉన్నతశైలి అనుభూతిని కలిగిస్తుంది. ఇది పర్యావరణ అనుకూలమైనది. స్టయిన్లెస్ స్టీల్తో తరుచూ కిచెన్ కౌంటర్ టాప్లు, క్యాబినెట్ల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే వీటి ఎంపికలో జాగ్రత్తలు అత్యవసరం. కేవలం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్, ఇండియన్ స్టాండర్డ్ ఇనిస్టిట్యూషన్(ఐఎస్ఐ) మార్క్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి.
రిలయన్స్కి వెనెజులా చమురు
న్యూఢిల్లీ: వెనెజులా నుంచి ముడి చమురు నేరుగా దిగుమతి చేసుకునేందుకు దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కి అమెరికా నుంచి లైసెన్సు లభించింది. కంపెనీకి చెందిన జామ్నగర్ రిఫైనరీకి అనువైన ఈ క్రూడాయిల్ని డిస్కౌంటు రేటుకు పొందడం వల్ల రిలయన్స్ రిఫైనింగ్ మార్జిన్లు మరింత మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇప్పటివరకు ట్రేడర్ల ద్వారా మాత్రమే విక్రయించడానికి అమెరికా అనుమతిస్తూ వస్తోంది. తాజాగా జనరల్ లైసెన్సు ఇవ్వడం వల్ల ఇప్పటికే ఆయిల్ని వెలికితీసిన సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. వాస్తవానికి 2019–20 వరకు వెనెజులా నుంచి రిలయన్స్ క్రూడాయిల్ని కొనుగోలు చేసింది. ఆ దేశంపై అమెరికా ఆంక్షలతో కొన్నాళ్లు నిలిపివేసి, వాటిని సడలించాక 2024లో కొనుగోలు చేసింది.మళ్లీ ఈ ఏడాది ట్రేడర్ల ద్వారా వెనెజులా ఆయిల్ అమ్మకాలు ప్రారంభమయ్యాక 2 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించిన తర్వాత ఆ దేశ ఇంధన రంగంపై ఆంక్షలను అమెరికా సడలించింది.
కార్పొరేట్
దేశంలోనే టాప్ 5 టోల్ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు
కాపర్ మరో సిల్వర్ కానుందా?.. సంక్షోభం ఆసన్నమైందా?
రిలయన్స్కి వెనెజులా చమురు
లెన్స్కార్ట్కు భారీ లాభాలు
రుణాలపై టాటా క్యాపిటల్ అవగాహన కార్యక్రమాలు
పైలట్లకు భలే డిమాండ్.. రూ.లక్షల్లో జీతాలు
గిఫ్ట్ సిటీ ఛైర్మన్గా ఉదయ్ కోటక్ నియామకం
ఐటీ రంగంలో ఖర్చుల సెగ..
స్టాండర్డ్ ఇంజనీరింగ్ కొత్త ప్లాంటు
ఎన్పీసీఐ భారత్ కనెక్ట్తో ఎన్టీటీ డేటా జట్టు
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్ట...
పతనమైన పసిడి విలువ.. కారణాలు..
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర...
సెబీ చైర్మన్ కీలక ప్రకటన.. ఎస్ఎంఈల్లో..
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) అభివ...
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
పవర్ఫుల్ పాస్పోర్ట్ల్లో భారత్ స్థానం ఎంతంటే..
అంతర్జాతీయ ప్రయాణ విభాగంలో భారత పాస్పోర్ట్ తన ప్ర...
విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు ఝలక్!
ఇండియా నుంచి వెళ్ళిపోయి.. యూకేలో ఉంటున్న విజయ్ మాల...
జనవరిలోనూ ఎగుమతులు సానుకూలమే
భారత వస్తు, సేవల ఎగుమతులు ఈ ఏడాది ఇప్పటి వరకు సాను...
ఖజానా హౌస్ఫుల్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ప్రస్తుత...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం?
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ యాప్లు ప్రజల జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి కోట్లాది మంది వినియోగదారులను కలుపుతున్నాయి. ఇలాంటి సమయంలో.. రష్యా ప్రభుత్వం తమ సేవలను దేశంలో పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించిందని వాట్సాప్ వెల్లడించింది. దీనికి కారణం.. ప్రభుత్వం నిర్వహించే 'మ్యాక్స్' సూపర్ యాప్ను ముందుకు తీసుకురావడానికే అని పేర్కొంది.రష్యా మ్యాక్స్ యాప్మ్యాక్స్ అనే యాప్ను రష్యా ప్రభుత్వం వీచాట్ (చైనా దేశంలో ప్రసిద్ధి చెందన యాప్) నమూనాను అనుసరించి రూపొందించింది. ఇది కేవలం మెసేజెస్, కాల్స్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రభుత్వ సేవలు, డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. మనీ ట్రాన్సక్షన్స్ చేయడానికి కూడా ఇది అనుమతిస్తుంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న అన్ని స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లలో ఈ మ్యాక్స్ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.Today the Russian government attempted to fully block WhatsApp in an effort to drive people to a state-owned surveillance app. Trying to isolate over 100 million users from private and secure communication is a backwards step and can only lead to less safety for people in Russia.…— WhatsApp (@WhatsApp) February 12, 2026''రష్యా ప్రభుత్వం వాట్సాప్ను పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది. ప్రజలను ప్రభుత్వ యాజమాన్యంలోని యాప్కి నడిపించే ప్రయత్నం చేసింది. అయితే వినియోగదారులను కనెక్ట్ చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తూనే ఉన్నాము'' అని వాట్సాప్ ట్వీట్ చేసింది.టెలిగ్రామ్ సేవలు పరిమితం!రష్యా ప్రభుత్వం విదేశీ యాప్లపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో భాగంగానే.. వాట్సాప్, టెలిగ్రామ్ సేవలను పరిమితం చేసింది. టెలిగ్రామ్ కంపెనీ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని, క్రిమినల్ & ఉగ్రవాద కంటెంట్ తొలగించలేదని ఆరోపణలు రావడంతో.. రష్యా కమ్యూనికేషన్ నియంత్రణ సంస్థ రోస్కోమ్నాడ్జర్ టెలిగ్రామ్పై పరిమితులు విధించేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా, టెలిగ్రామ్పై 64 మిలియన్ రూబిళ్ల జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.మ్యాక్స్ యాప్పై విమర్శలుఇక రష్యా ప్రభుత్వం నిర్వహించే.. మ్యాక్స్ యాప్పై విమర్శకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగదారుల సమాచారం ప్రభుత్వం చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ (Dmitry Peskov) ప్రకారం.. వాట్సాప్ రష్యాలో తిరిగి తన సేవలు యధావిధిగా అందించాలంటే, దేశంలోని చట్టాలను పూర్తిగా పాటించాలి. మెటా సంస్థ రష్యా అధికారులతో చర్చలకు సిద్ధంగా ఉంటే.. ఒప్పందం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మెటా మొండిగా ప్రవర్తిస్తే మాత్రం.. వాట్సాప్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని అన్నారు.ఇదీ చదవండి: రైలులో అత్యవసర బెర్త్లు ఉంటాయని తెలుసా.. వీటిని ఎవరికి ఇస్తారంటే?
ఏడాదిలో 4000 కోట్ల స్పామ్ కాల్స్!
భారత్ డిజిటల్ విప్లవం దిశగా దూసుకుపోతున్న వేళ స్పామ్ కాల్స్, సైబర్ మోసాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. 2025 సంవత్సరంలో భారతీయులకు ఏకంగా 4,000 కోట్లకు పైగా స్పామ్ కాల్స్ వచ్చినట్లు ‘ట్రూకాలర్ ఇండియా ఇన్సైట్స్ రిపోర్ట్ 2025’ కొన్ని విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్ఝున్వాలా మాట్లాడుతూ.. వికసిత్ భారత్ విజన్లో భాగంగా దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారుతున్న తరుణంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై నమ్మకం చాలా కీలకమన్నారు. ‘ఈ రోజుల్లో మోసం అనేది కేవలం సాంకేతిక సమస్య కాదు, అది మానవ బలహీనతలతో ఆడుకునే ప్రక్రియ. భయం, అత్యవసరం, అనిశ్చితిని పెట్టుబడిగా చేసుకుని స్కామర్లు రెచ్చిపోతున్నారు. ప్రతి భారతీయుడికి డిజిటల్ భద్రత కల్పించాలన్నదే మా లక్ష్యం’ అన్నారు.నివేదిక ప్రకారం, గడిచిన ఏడాదిలో నమోదైన స్పామ్ కాల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:మొత్తం స్పామ్ కాల్స్: 4,168 కోట్లు.బ్లాక్ చేసిన కాల్స్: 1,189 కోట్లు (యూజర్లకు చేరకముందే సాంకేతికతతో నిరోధించినవి).మోసపూరిత కాల్స్: సుమారు 770 కోట్లు. ఇవి ప్రధానంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పేమెంట్ ప్లాట్ఫారమ్ల పేరుతో వచ్చాయి.స్పామ్ ఎస్ఎంఎస్లు: ఏడాది పొడవునా 12,903 కోట్ల స్పామ్ సందేశాలు నమోదయ్యాయి.స్పామ్ కాల్స్ నిరోధించడం వల్ల కేవలం మోసాలు తగ్గడమే కాకుండా ప్రజల విలువైన సమయం కూడా ఆదా అవుతోంది. కమ్యూనిటీ రిపోర్టింగ్ ద్వారా భారతీయులకు రోజుకు సుమారు 21.7 లక్షల గంటల సమయం ఆదా అవుతోందని నివేదిక పేర్కొంది. దీనివల్ల అనవసరపు ఒత్తిడి తగ్గడమే కాకుండా హడావుడిలో తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.2026లో పొంచి ఉన్న ముప్పురాబోయే రోజుల్లో మోసగాళ్లు మరింత అధునాతన పద్ధతులను అవలంబిస్తారని నివేదిక హెచ్చరించింది. అందులో ఏఐ సృష్టించిన వాయిస్ స్కామ్స్, కాల్స్, మెసేజ్లతో చేసే మోసాలు ఉండనున్నాయి. ఇతరుల పేర్లతో డిజిటల్ ఐడెంటిటీని దొంగిలించడం వంటి మోసాలు ఎక్కువగా జరగవచ్చని అంచనా.జాగ్రత్తలుఅత్యవసరమని వచ్చే కాల్స్ను వెంటనే నమ్మకుండా ధ్రువీకరించుకోవాలి. వ్యక్తిగత వివరాలను, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. నమ్మకమైన కాలర్ ఐడీ సాధనాలను ఉపయోగించాలి. డిజిటల్ సాధికారత సాధించే క్రమంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండటమే అసలైన రక్షణ అని గుర్తించాలి.ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!
ఐటీ కంపెనీలను వణికిస్తున్న ఆ ‘పేరు’ మాదే..
అమెరికా ఆధారిత ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ భారత విస్తరణ ప్రణాళికలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అదే పేరుతో పనిచేస్తున్న భారతీయ సంస్థ ‘ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్’.. తమ బ్రాండ్కు గందరగోళం కలుగుతోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు భారత కోర్టులో పెండింగ్లో ఉండటం వల్ల, దేశంలో ఆంథ్రోపిక్ వ్యూహాత్మక ప్రణాళికలు క్లిష్టతరం అయ్యే అవకాశముంది.అమెరికా ఆంథ్రోపిక్ Vs ఇండియా ఆంథ్రోపిక్టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ గత నెలలో కర్ణాటక వాణిజ్య కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. 2017 నుంచే తమ సంస్థ "ఆంథ్రోపిక్" పేరును ఉపయోగిస్తోందని, అమెరికా సంస్థ భారత మార్కెట్లో ప్రవేశించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోందని కంపెనీ పేర్కొంది.స్థానిక సంస్థ తన ముందస్తు వినియోగాన్ని అధికారికంగా గుర్తించాలని, అలాగే మరింత గందరగోళం నివారించేందుకు తగిన ఉపశమనం ఇవ్వాలని కోరుతోంది. అదనంగా, రూ.1 కోటి నష్టపరిహారం కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.భారతీయ సంస్థ వాదన ఏమిటంటే..ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మొహమ్మద్ అయ్యాజ్ ముల్లా టెక్ క్రంచ్తో మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు వెనుక ఉద్దేశం ఘర్షణ కాదని, తమ ముందస్తు వినియోగానికి అధికారిక గుర్తింపు పొందడమేనని తెలిపారు. గుర్తింపు లభించకపోతే, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.భారతీయ సంస్థ తమ వెబ్సైట్లో “ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అప్లికేషన్ పెండింగ్) ట్రేడ్మార్క్” అని పేర్కొంది. ట్రేడ్మార్క్ నమోదు ఇంకా పెండింగ్లో ఉన్నందున, ఇది నేరుగా ట్రేడ్మార్క్ ఉల్లంఘన కేసుగా పరిగణించబడకపోవచ్చు. అయితే కోర్టు భారతీయ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే, అమెరికా సంస్థ భారతదేశంలో తన పేరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీకేసు ప్రస్తుత స్థితిజనవరి 20న కోర్టు ఆంథ్రోపిక్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే, సంస్థ తన కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న జరగనుంది.ఇదిలా ఉండగా, ఆంథ్రోపిక్ ఏఐ భద్రతా విభాగాధిపతి మృణక్ శర్మ రాజీనామా చేశారు. ఇలీవల ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తన రాజీనామాను ప్రకటించారు. తాను వెంటనే కొత్త వెంచర్ ప్రారంభించడం లేదని, తదుపరి నిర్ణయం తీసుకునే ముందు స్వల్ప విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!
బంగారం షాపులో నగదు చెల్లించి నచ్చిన నగను కొనుక్కుంటాం. అద్దాల షోరూమ్లో విద్యుత్ కాంతుల మధ్య తళతళలాడే ఆ బంగారు ఆభరణాలను చూసి మురిసిపోతాం. కానీ, ఆ మెరుపు వెనుక.. వందల మంది కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ హొయల వెనుక.. వేల అడుగుల లోతులో పేలే బాంబుల మోత, ఊపిరాడని గనుల్లో ఉక్కపోత ఉందని చాలా మందికి తెలియదు కదా.. ఒక చిన్న ఉంగరం మన వేలికి చేరడానికి ముందు అది ఒక కఠినమైన శిల. ఆ శిల నుంచి స్వచ్ఛమైన పసిడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రకృతితో చేసే యుద్ధమే ఈ ‘బంగారు ప్రయాణం’. బంగారాన్ని గనుల్లో నుంచి ఎలా వెలికితీస్తారో.. ఆభరణాల రూపంలోకి ఎలా మారుస్తారో తెలుసుకుందాం.అన్వేషణ, మైనింగ్బంగారం ఎక్కడ ఉందో గుర్తించడం మొదటి దశ. దీన్ని ప్రోస్పెక్టింగ్ అంటారు. భూగర్భంలో బంగారం నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన తర్వాత మైనింగ్ ప్రారంభమవుతుంది. బంగారం భూమిపై పొరల్లోనే ఉన్నప్పుడు పెద్ద గుంతలు తవ్వి వెలికితీస్తారు. దీన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. బంగారం చాలా లోతులో ఉన్నప్పుడు సొరంగాలు తవ్వి, పేలుళ్ల సాయంతో ముడి ఖనిజాన్ని బయటకు తీస్తారు. దీన్ని అండర్గ్రౌండ్ మైనింగ్ అంటారు.ముడి ఖనిజాన్ని పొడి చేయడంగనుల నుంచి సేకరించిన పెద్ద రాళ్లను క్రషర్స్ యంత్రాల్లో వేసి చిన్న ముక్కలుగా మారుస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న స్పటికాల పరిమాణంలోకి, ఆపై మెత్తటి పౌడర్లాగా పిండి చేస్తారు. ఈ పొడిలోనే అతి సూక్ష్మమైన బంగారు రేణువులు దాగి ఉంటాయి.బంగారం వేరు చేయడంపొడి చేసిన మట్టి నుంచి బంగారాన్ని వేరు చేయడానికి ప్రధానంగా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు.సైనైడ్ లీచింగ్: ఈ పౌడర్కు సోడియం సైనైడ్ ద్రావణాన్ని కలుపుతారు. ఇది బంగారాన్ని ద్రవ రూపంలోకి మారుస్తుంది. ఆ తర్వాత జింక్ పౌడర్ లేదా యాక్టివేటెడ్ కార్బన్ ఉపయోగించి బంగారాన్ని తిరిగి ఘన రూపంలోకి మారుస్తారు.గ్రావిటీ సెపరేషన్: బంగారం బరువు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ప్రవాహం ద్వారా తేలికపాటి మట్టిని కొట్టుకుపోయేలా చేసి బంగారు రేణువులను కిందకు చేరేలా చేస్తారు.స్మెల్టింగ్పైన తెలిపిన ప్రక్రియలో వచ్చిన బంగారాన్ని (దీన్ని డోర్ అని పిలుస్తారు) దాదాపు 1064 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కరిగిస్తారు. ఈ దశలో బంగారం నుంచి ఇతర లోహాలు వేరవుతాయి. ఇక్కడ వచ్చే పసిడి 100% స్వచ్ఛంగా ఉండదు. ఇందులో వెండి లేదా రాగి కలిసి ఉంటాయి. వీటిని బార్స్ రూపంలోకి మారుస్తారు.శుద్ధీకరణ(రిఫైనింగ్)చివరి దశలో బంగారాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేయడానికి మిల్లర్ ప్రక్రియ లేదా వోల్విల్ ప్రక్రియ వాడతారు. ఈ ప్రక్రియల్లో క్లోరిన్ గ్యాస్ను ఉపయోగించి ఇతర మలినాలను తొలగిస్తారు. దీని ద్వారా 99.9% (24 క్యారెట్) స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది.ఆభరణాల తయారీచివరిగా ఈ స్వచ్ఛమైన బంగారానికి కొంత మోతాదులో రాగి లేదా వెండిని కలిపి (సాధారణంగా 22 క్యారెట్లు) నచ్చిన ఆభరణాలుగా మలుస్తారు.ఒక గ్రాము బంగారాన్ని పొందడానికి దాదాపు ఒక టన్ను ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే బంగారం అంత విలువైనది!ఇదీ చదవండి: భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
పర్సనల్ ఫైనాన్స్
రాధికాగుప్తాను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలు ఇవే..
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, అనిశ్చితి నేపథ్యంలో ఏ ఫండ్ను ఎంచుకోవాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే గందరగోళం పెట్టుబడిదారుల్లో పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా పెట్టుబడిదారులకు దిశానిర్దేశం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొన్ని సూచనలు చేశారు.ఇటీవలి కాలంలో ‘నా దగ్గర రూ.30,000 ఉన్నాయి. వెండి కొనాలా? ఏ ఫండ్ తీసుకోవాలి?’ వంటి ప్రశ్నలు తనను ఎక్కువగా అడుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. తక్షణ పరిష్కారాల కోసం వెతకడం కంటే సరైన పోర్ట్ఫోలియోను నిర్మించుకోవడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.ప్రాథమిక అవగాహన ముఖ్యంచాలామంది ఫైనాన్స్ గురించి కనీస అవగాహన లేకుండానే నేరుగా ఫండ్స్ కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. దీన్ని ఆమె ‘శ్వాస తీసుకోవడం నేర్చుకోకముందే డైవింగ్ చేయడం’తో పోల్చారు. పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలని, దీనికోసం తన పుస్తకం ‘మ్యాంగో మిలియనీర్’ ఎంతో దోహదపడుతుందని సూచించారు.ఆర్థిక స్థితిగతులపై స్పష్టతపెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వాస్తవాలను డాక్యుమెంట్ చేసుకోవాలి.మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు ఎంత?ప్రస్తుత పెట్టుబడులు, అప్పులు ఏమిటి?మీ ఆర్థిక లక్ష్యాలు, వాటి కాలపరిమితి ఎంత?స్వల్పకాలికంగా నష్టాలు వస్తే భరించే శక్తి ఉందా?ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటేనే బలమైన పునాది ఏర్పడుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు.నిపుణుల సలహా తీసుకోవడంమ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు లేదా క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సహాయం తీసుకోవాలని ఆమె కోరారు. పైన పేర్కొన్న ఆర్థిక స్పష్టతతో నిపుణులను కలిసినప్పుడు వారు మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్రణాళికను రూపొందించగలరు. మీకు నమ్మకం కలిగే వరకు ఒకటి కంటే ఎక్కువ మంది నిపుణులతో మాట్లాడటంలో తప్పు లేదని ఆమె అన్నారు."I have 30,000 to invest, should I buy silver? What fund do I buy?"I am seeing a lot more friends, family, and folks in general reach out for advice on their portfolio in the last few months. It is probably because volatility is so high across asset classes, returns over the…— Radhika Gupta (@iRadhikaGupta) February 9, 2026తొందరపాటు నిర్ణయాలు వద్దుపెట్టుబడి ప్రయాణం ప్రారంభంలోనే డైరెక్ట్ స్టాక్స్, వెండి, లేదా సంక్లిష్టమైన పీఎంఎస్(ధనవంతులైన పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్) ఉత్పత్తుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. మార్కెట్పై అవగాహన పెరిగే వరకు వీటి కోసం వేచి చూడటం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.తప్పుల నుంచి నేర్చుకోండి‘ఇప్పుడే మొదలుపెట్టే వారు వెంటనే పని ప్రారంభించండి. తప్పులు చేసిన వారు కాసేపు విశ్రాంతి తీసుకోండి’ అని ఆమె సరళంగా వివరించారు. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఎంతోమంది మేధావులు తప్పులు చేశారని గుర్తు చేస్తూ పెట్టుబడి ప్రయాణంలో తప్పులు సహజమని పేర్కొన్నారు. మార్కెట్ దిద్దుబాట్లు అనేవి బోర్డు పరీక్షల వంటివని, అవి మనకు క్రమశిక్షణ, సహనం నేర్పుతాయని ఆమె విశ్లేషించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట
మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీములు
ముంబై: కోటక్ మహింద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. కోటక్ సర్వీసెస్ ఫండ్ పేరుతో కొత్త పథకాన్ని (ఎన్ఎఫ్వో) ప్రారంభించింది. ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. దేశ జీడీపీలో 55 శాతం వాటా ఆక్రమిస్తూ, వృద్ధికి కీలక చోదకంగా ఉన్న సేవల రంగంలో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుందని కోటక్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది.వినియోగ సేవలు, టెలికం, హెల్త్కేర్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, ఐటీ, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాలతో కూడిన సేవలు దీర్ఘకాల పెట్టుబడులకు మంచి వృద్ధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. మంచి వృద్ధి అవకాశాలు, సహేతుక ధరల వద్దనున్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపారం, యాజమాన్యం, కంపెనీ విలువకు ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రకాల మార్కెట్ విలువల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.నాణ్యమైన వ్యాపారం, బలమైన నగదు ప్రవాహాలను చూస్తుంది. కనీసం రూ.1,000, అంతకుమించి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ముగిసిన కొన్ని రోజుల అనంతరం తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో, దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధిని కోరుకునే వారికి ఈ పథకం అనుకూలమని కోటక్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.360 వన్ ఎంఎఫ్ నుంచి సిఫ్ పథకం సంపన్న ఇన్వెస్టర్ల కోసం 360 వన్ మ్యుచువల్ ఫండ్ తాజాగా డైనాసిఫ్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్ పేరిట స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్)ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 20న ముగుస్తుంది. ఇది కనీసం 80 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్కి కేటాయిస్తుంది. ఈక్విటీ డెరివేటివ్స్ ద్వారా 25 శాతం వరకు షార్ట్ ఎక్స్పోజర్ తీసుకునేందుకు, డెట్ అలాగే ఇని్వట్స్లో 20 శాతం వరకు ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది.దీనికి బీఎస్ఈ 500 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 10 లక్షలు (అక్రెడిటెడ్ ఇన్వెస్టర్లయితే రూ. 1,00,000) ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యుచువల్ ఫండ్స్ పరమైన ట్యాక్సేషన్ ప్రయోజనాలతో పాటు మరింత మెరుగైన రాబడులను అందించే విధంగా ఈ ఫండ్ ఉంటుందని 360 వన్ అసెట్ మేనేజ్మెంట్ సీఈవో రాఘవ్ అయ్యంగార్ తెలిపారు. డీఎస్పీ మల్టీ అసెట్ ఆమ్ని ఎఫ్వోఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను సరళతరం చేసే దిశగా డీఎస్పీ మ్యుచువల్ ఫండ్ సంస్థ మల్టీ అసెట్ ఆమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్)ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 19 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థకు చెందిన స్వంత మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ డీఎస్పీ నేత్ర దన్నుతో ఇది పని చేస్తుంది. ఈక్విటీ, డెట్ ఆధారిత స్కీములు, గోల్డ్..సిల్వర్ ఈటీఎఫ్ల్లాంటి కమోడిటీ ఆధారిత స్కీములు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది.మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ ఆధారిత స్కీముల్లో 25–75 శాతం, డెట్ స్కీముల్లో 15–50 శాతం, గోల్డ్–సిల్వర్ ఈటీఎఫ్లలో 10–50 శాతం మేర ఇది పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు ఈక్విటీల్లో పెట్టుబడులను కనిష్టంగా 25 శాతానికి కూడా తగ్గించే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడులను వివిధ సాధనాల్లో డైవర్సిఫై చేయడం వల్ల రాబడుల కోసం కేవలం ఒకే సాధనంపై ఆధారపడాల్సిన రిసు్కలు తగ్గుతాయని సంస్థ ప్రోడక్ట్ హెడ్ సాహిల్ కపూర్ తెలిపారు.
పిల్లలకు ప్రత్యేక బీమా పథకాలు
పిల్లల భవిష్యత్ ప్రణాళికల కోసం ఉపయోగపడేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ స్మార్ట్కిడ్ 360 ప్లాన్ని ప్రవేశపెట్టింది. ఇది బీమా ప్రయోజనాలను కల్పించడంతో పాటు దీర్ఘకాలిక పొదుపు పథకంగా కూడా ఉపయోగపడుతుంది. పాలసీదారుకేదైనా జరిగితే ప్రీమియంల నుంచి మినహాయింపు, ప్రయోజనాల కొనసాగింపు, కుటుంబానికి క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే ఫ్యామిలీ ఇన్కం బెనిఫిట్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పిల్లల చదువులు తదితరాలకు మనీబ్యాక్ పొందే వీలుంది. బజాజ్ జనరల్ ఫీటల్ ఫ్లరిష్ ఆరోగ్య బీమా గర్భస్త శిశువు ఆరోగ్యానికి సంబంధించి ‘ఫీటల్ ఫ్లరిష్’ పేరిట బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రత్యేక ఇన్సూరెన్స్ రైడర్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని అధునాతన ఇన్–యుటెరో ప్రొసీజర్లు, రిస్కులు ఎక్కువగా ఉండే ప్రెగ్నెన్సీలకు కవరేజీ లభిస్తుంది. ‘మై హెల్త్ కేర్ ప్లాన్’, ‘హెల్త్ గార్డ్’ పథకాలతో కలిపి ఈ రైడర్ని తీసుకోవచ్చు. 18–45 ఏళ్ల వయస్సు గల మహిళలకు, ఒక్కో ప్రసవానికి రూ. 2 లక్షల సమ్ ఇన్సూర్డ్తో రెండు ప్రసవాల వరకు వర్తిస్తుంది. ప్రీమియం రూ. 1,025గా ఉంటుంది.
బంగారానికి బదులుందా? బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్కాయిన్కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్కాయిన్కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki) తెలిపారు. బిట్కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత బిట్కాయిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్కాయిన్ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్ మైనింగ్, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయినప్పటికీ, బిట్కాయిన్ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.I am often asked:Which is a better investment?Gold or Bitcoin.Obviously I would say both for diversification of assets and add silver.Yet if I had to choose only one asset I would choose Butcoin.Why?Because gold is in theory infinite. When the price of gold rises…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026


