Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

2026 TVS Apache RTR 160 4V launched1
2026 అపాచీ RTR లాంచ్: ధర ఎంతంటే?

టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు 2026 అపాచీ RTR 160 4V లాంచ్ చేసింది. దీని ధర 1,25,440 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ఇది స్టాండర్డ్ బైక్ కంటే ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది.2026 అపాచీ RTR 160 4V ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ లైటింగ్ సెటప్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. USD ఫోర్కులు, TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా ఇందులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ చాలా వరకు హైఎండ్ ఫీచర్స్ పొందిందన్నమాట.2026 అపాచీ RTR 160 4V పనితీరులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి డే 17.55 Bhp పవర్ అందించే 160 సీసీ ఇంజిన్ ఉంది. ఈ బైక్ స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇదే మొదటి ఫీచర్, ఇది రైడింగ్ పరిస్థితులను బట్టి పనితీరును సర్దుబాటు చేసుకోవడానికి రైడర్‌లకు వీలు కల్పిస్తుంది.

RBI Infuses Rs 84582 Cr via VRR Auctions to Boost Banking Liquidity2
రూ.84,582 కోట్ల లిక్విడిటీని విడుదల చేసిన ఆర్‌బీఐ

దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను (లిక్విడిటీ) క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం రెండు వేర్వేరు వేరియబుల్ రేట్ రెపో (వీఆర్‌ఆర్‌) వేలాల ద్వారా మొత్తం రూ.84,582 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టింది.వేలం వివరాలు..సోమవారం నిర్వహించిన ఈ వేలాల్లో బ్యాంకుల నుంచి అనూహ్య స్పందన లభించినప్పటికీ రెండో వేలంలో మాత్రం బిడ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. మొదటి విడతలో మూడు రోజుల వీఆర్‌ఆర్‌ వేలంలో ఆర్‌బీఐ రూ.50,001 కోట్లను విడుదల చేసింది. దీని కోసం రూ.57,287 కోట్ల విలువైన బిడ్లు రాగా ఆర్‌బీఐ రూ.50,001 కోట్ల బిడ్లను ఆమోదించింది. దీని కట్ఆఫ్ రేటు 5.34 శాతం కాగా, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.44 శాతంగా నమోదైంది.రెండో వేలం ద్వారా ఆర్‌బీఐ రూ.34,581 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చింది. దీని కట్ఆఫ్ రేటు 5.26 శాతం, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.30 శాతంగా ఉంది. ఈ వేలంలో నోటిఫై చేసిన మొత్తం కంటే తక్కువ బిడ్లు దాఖలయ్యాయి.మిగులు దిశగా నగదు లభ్యతప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత తీరి మిగులు బాట పట్టినట్లు కనిపిస్తోంది. మార్చి 27 నాటికి వ్యవస్థలో సుమారు రూ.1.27 లక్షల కోట్ల మిగులు నగదు ఉంటుందని అంచనా. గత కొన్ని రోజులుగా ఆర్‌బీఐ వివిధ కాలపరిమితులు గల వీఆర్‌ఆర్‌ వేలాల ద్వారా మొత్తం రూ.2,73,530 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని చొప్పించడం వల్ల ఇది సాధ్యమైంది. తాత్కాలిక నిధులే కాకుండా జనవరి 2026 నుంచి ఆర్‌బీఐ బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తూ రూ.3.50 లక్షల కోట్ల లిక్విడిటీని ఇప్పటికే వ్యవస్థలోకి చేర్చింది.ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకుల వద్ద నగదు అవసరాలు పెరుగుతాయి. ఈ క్రమంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నగదును అందుబాటులో ఉంచడానికి ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓఎమ్ఓ కొనుగోళ్లు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఇస్తుండగా వీఆర్ఆర్ వేలాలు స్వల్పకాలిక అవసరాలను తీరుస్తున్నాయి.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

How to Become Rich by Investing in Stock Market Know The Warren Buffett Formula3
'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ లాభాలు గడిస్తారని లేదా అందరూ నష్టపోతారని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే ఇన్వెస్టర్ ఎలా ఉండాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి? అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. దీనికి ప్రపంచ దిగ్గజ మదుపరిగా ఎంతోమందికి సుపరిచితమైన 'బఫెట్' ఫార్ములా తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నప్పుడు.. కొంతమంది మిస్ అవుతామేమో అనే ఆందోళనతో కొనుగోలు చేస్తుంటారు. నష్టం వస్తే అయ్యో అని బాధపడతారు. ఇలాంటి సమయంలో బఫెట్ చెప్పే మాట ఏమిటంటే.. 'ఎప్పుడూ వెంటపడొద్దు' ప్రతి అవకాశాన్ని వెంటాడాల్సిన అవసరం లేదు.ఒక కంపెనీ ఎంత గొప్పదైనా సరే, దాని షేర్ ధర చాలా ఎక్కువగా ఉంటే వెంటనే కొనకూడదు. సరైన విలువ వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. ఇది పెట్టుబడిదారులకు ఓపికను, నియంత్రణను నేర్పిస్తుంది. పెట్టుబడిదారుడు ఎప్పుడూ కూడా.. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి.బఫెట్ తన తత్వాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ. బేస్‌బాల్ క్రీడాకారుడు.. బేస్‌బాల్‌లో మంచి ఫలితం పొందాలంటే సరైన బంతి కోసం ఎదురు చూడాలి. ప్రతి బంతిని కొట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ప్రతి స్టాక్‌ను కొనాల్సిన అవసరం లేదు.Warren Buffett’s greatest lesson: NEVER CHASE. In the market, you have time. If an exceptional company trades at insane prices, don’t buy it.Wait for an exceptional company at a reasonable price. When you find it, invest heavily. If you don’t, wait. pic.twitter.com/s2Aax4wCj6— R (@AlphaWizarDD) March 29, 2026బఫెట్ చెప్పినట్లుగా.. మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. కానీ మనకు అర్థమయ్యే, మంచి కంపెనీలు మాత్రమే ఎంచుకోవాలి. అవి సరైన ధరలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఒక అవకాశం వదిలేస్తే.. మిమ్మల్ని ఎవరూ శిక్షించరు. కాబట్టి ఆలోచించాలి.ప్రతి స్టాక్ లేదా ప్రతి ట్రెండ్ గురించి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి విషయాలను బాగా అర్థం చేసుకోవడం చాలు. అదే నిజమైన విజయం తీసుకువస్తుంది. మీకు జీవితంలో కేవలం 20 సార్లు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తే.. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. తప్పులు తక్కువ చేస్తారు, మంచి అవకాశాలను మాత్రమే ఎంచుకుంటారు, దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదిస్తారు అని పేర్కొన్నారు.

Sri Lanka Hikes Power Tariffs Amid Global Fuel Price Surge4
శ్రీలంకలో విద్యుత్ షాక్

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకపై మరో భారం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 7.2%, పరిశ్రమలకు 8.7% మేర విద్యుత్‌ టారిఫ్‌లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఐఎంఎఫ్‌ నిబంధనలే కారణమా?అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి పొందిన 2.9 బిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీలో భాగంగా శ్రీలంక కఠిన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కోసం కాస్ట్ రిఫ్లెక్టివ్(ఖర్చుకు అనుగుణంగా ధరలు) విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడాదికి పలుమార్లు విద్యుత్ ధరలను సవరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.మరింత పెరిగే అవకాశం ఉందా?‘యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో ఇంధన ధరలు మరింత పెరిగితే, విద్యుత్ ఛార్జీలను మళ్లీ పెంచాలనే అభ్యర్థనను మేము పరిశీలిస్తాం’ అని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.పి.ఎల్. చంద్రలాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి సీఈబీ 13.56 పెంపును కోరినప్పటికీ ప్రస్తుతానికి దాన్ని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.తీవ్ర స్థాయిలో ఇంధన కొరతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు, ఫర్నేస్ ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. దీనిపై సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ జానక రాజకరుణ మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. ‘వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇంధన రేషనింగ్‌ను ప్రవేశపెట్టారు. విద్యుత్ ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. నిరంతరాయ సరఫరా కోసం రష్యా, భారత్, అమెరికా దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్‌లో శుద్ధి చేసిన ఇంధనం కోసం 600 మిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

HDFC Bank Faces Governance Lapses Allegations Over AT-1 Bond Sales to NRIs5
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ‘ఏటీ-1 బాండ్ల’ సంక్షోభం

దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పాలనాపరమైన లోపాలు, నైతిక విలువల వివాదంలో చిక్కుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్‌లోని ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) నిబంధనలకు విరుద్ధంగా అడిషనల్‌ టైర్-1 (ఏటీ-1) బాండ్లను విక్రయించిన వ్యవహారంలో బ్యాంక్ మేనేజ్‌మెంట్ వైఖరిపై ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంలో బ్యాంక్ అనూహ్యంగా ఆలస్యం చేసిందని ఆరోపించారు.ఏటీ-1 బాండ్లు అంటే ఏమిటి?సాధారణ బాండ్లలాగా వీటికి నిర్ణీత గడువు ఉండదు. వీటిని ‘పెర్పెచువల్ బాండ్స్’ అని పిలుస్తారు. అంటే బ్యాంక్ లాభాల్లో ఉన్నంత కాలం వీటికి వడ్డీ (కూపన్‌) చెల్లిస్తూనే ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లినా లేదా మూతపడే స్థితికి వచ్చినా ఈ బాండ్లలోని పెట్టుబడిని బ్యాంక్ పూర్తిగా రద్దు చేసే అధికారం ఉంటుంది.వీటిని ఎందుకు జారీ చేస్తారు?అంతర్జాతీయ ‘బాసెల్-3’ నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ వద్ద కొంత మేర కనీస మూలధనాన్ని ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో నష్టాలను తట్టుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. ఈక్విటీ షేర్లను జారీ చేసి కొత్త భాగస్వాములను చేర్చుకోవడం కంటే, బాండ్ల ద్వారా నిధులు సేకరించడం బ్యాంకులకు సులభం. దీనివల్ల బ్యాంక్ యాజమాన్య హక్కులు మారవు.దుబాయ్ బ్రాంచ్‌లో మిస్-సెల్లింగ్క్రెడిట్ సూయిస్ బ్యాంక్‌కు చెందిన అత్యంత రిస్క్‌తో కూడిన ఏటీ-1 బాండ్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన దుబాయ్, బహ్రెయిన్ శాఖల ద్వారా ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులకు తప్పుగా విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అక్రమ విక్రయాలను గుర్తించిన దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (డీఎఫ్‌ఎస్‌ఏ), బ్యాంక్ బ్రాంచ్‌పై కఠిన ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 26, 2025 నుంచి కొత్త క్లయింట్లను చేర్చుకోవడం లేదా కొత్త ఆర్థిక సేవలను అందించకుండా నిషేధించింది. అంతర్గత దర్యాప్తు అనంతరం, ఈ నెలలో ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను బ్యాంక్ విధుల నుంచి తొలగించింది. మరో 12 మంది సిబ్బందిపై వివిధ స్థాయిల్లో జరిమానాలు విధించినట్లు మార్చి 23 నాటి ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడైంది.ఎనిమిదేళ్లుగా ఏం చేస్తున్నారు?ఇటీవల అకస్మాత్తుగా రాజీనామా చేసిన చక్రవర్తి బ్యాంక్ తీరును తూర్పారబట్టారు. ‘గత ఎనిమిదేళ్లుగా లోపాలు జరుగుతున్నా బ్యాంక్ మౌనంగా ఉంది. అకస్మాత్తుగా ఇప్పుడు మేల్కొని చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరం. ఇది మొదట్లో కేవలం డాక్యుమెంటేషన్ సమస్యగా భావించినప్పటికీ ఇది బ్యాంక్ ప్రతిష్టకు తీరని నష్టం కలిగించింది’ అని చెప్పారు. బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ పుననియామకం విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీశన్ నియామక ప్రక్రియ తన పర్యవేక్షణలో కానీ, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (ఎన్‌ఆర్‌సీ) పరిధిలో కానీ జరగలేదని స్పష్టం చేశారు.పెట్టుబడిదారుల్లో ఆందోళనఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి సంస్థ విలువలు, నైతికత అంశాలపై విభేదించి తప్పుకోవడం బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో బ్యాంక్ షేర్ల విలువపై ప్రభావం పడకుండా ఉండేందుకు యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయితే, చక్రవర్తి రాజీనామాకు గల కచ్చితమైన కారణాలను బ్యాంక్ అధికారికంగా వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ అవకతవకలపై ఆర్‌బీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

Gold Prices Rise and Silver Jumps New Mark in India6
గంటల వ్యవధిలో.. ఊహకందని గోల్డ్ రేటు!

సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వెండి రేటు కూడా గరిష్టంగా రూ.5000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాలలో ఉదయం రూ.1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ.1,35,900 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే గంటల వ్యవధిలో రూ.900 పెరిగినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల తులం రేటు 1,47,280 రూపాయల దగ్గర నుంచి 1,48,260 రూపాయల (రూ.980 పెరిగింది) వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,48,370 రూపాయల నుంచి 1,50,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు 1,36,050 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీలో ఉదయం 1,35,150 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,36,050 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 147430 రూపాయల దగ్గర నుంచి రూ.148410 వద్దకు చేరింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిన మార్పు.వెండి ధరఈ రోజు (సోమవారం) ఉదయం రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉన్న వెండి రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ.2.55 లక్షల వద్దకు చేరింది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ఉంది.

Advertisement
Advertisement
Advertisement