Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Record Number of Americans Leave US Know The Reasons Here1
అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే?

అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికా దేశానికి చాలా సంవత్సరాలుగా.. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రజలు వలస వెళ్తున్నారు, వారిలో కొందరు అక్కడే స్థిరపడిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి & అనేక మార్పులు సంభవించాయి. మహా మాంద్యం తరువాత.. 2025లో దేశానికి వచ్చినవారి సంఖ్యకంటే, అమెరికా వీడి వెళ్లినవారి సంఖ్య ఎక్కువగా ఉంది.2026లో పెరిగే అవకాశం2023లో అమెరికా దేశానికి వలస వచ్చినవారి సంఖ్య 60 లక్షలు. ఈ సంఖ్య 2025 నాటికి 26 లక్షల నుంచి 27 లక్షలకు చేరుకుంది. కాగా ఈ సమయంలో (2025లో) యూఎస్ఏ విడిచి వెళ్లినవారు 1.5 లక్షలు కావడం గమనార్హం. 2026లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ప్రజలు అమెరికా విడిచి వెళ్లడానికి ప్రధాన కారణాలు.. పెరుగుతున్న జీవన వ్యయం, సామాజిక హింస, రాజకీయ అస్థిరత అని తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ పాలనలో దేశం విడిచి వెళ్తున్న అమెరికన్ల సంఖ్య పెరుగుదలను డొనాల్డ్ డాష్ అని పిలుస్తున్నారు.విదేశాల్లో అమెరికన్లు2025లో అమెరికా ప్రభుత్వం సుమారు 6.74 లక్షల మందిని దేశం నుంచి బహిష్కరించింది. కాగా మరో 22 లక్షలమంది దేశం విడిచి స్వచ్చందంగా బయటకు వెళ్లారు. కాగా కొన్ని గణాంకాల ప్రకారం.. ఇప్పటికే 40 లక్షల నుంచి 90 లక్షల మధ్య అమెరికన్లు విదేశాల్లో నివసిస్తున్నారు.పోర్చుగల్‌లోని లిస్బన్‌లో అనేక మంది అమెరికన్లు అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేస్తున్నారు. బాలి, కొలంబియా, థాయిలాండ్‌లలో ఇళ్ల ధరల పెరుగుదలకు కూడా అమెరికన్లు ఎక్కువ కావడం అనే తెలుస్తోంది. ఒక లక్ష మందికి పైగా యువ అమెరికన్లు తక్కువ ఖర్చుతో కూడిన డిగ్రీల కోసం విదేశాలలో చదువుతున్నారు. పదవీ విరమణ చేసినవారు తక్కువ ఖర్చుతో వైద్యసేవలు, వృద్ధాప్య సంరక్షణ వంటి వాటికోసం మెక్సికోకు వెళుతున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది.విద్యార్థులు సైతంకెనడా, యూకే, మెక్సికో వంటి దేశాలు అమెరికన్లకు ప్రధాన గమ్యస్థానాలుగా మారాయి. అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య గత ఏడాది 17 శాతం తగ్గింది. అదే సమయంలో యూరప్‌కు వెళ్లే అమెరికన్ విద్యార్థుల సంఖ్య 2011తో పోలిస్తే రెట్టింపైంది. యుకేలో మాత్రం ఈ సంఖ్య గత ఏడాది 14 శాతం పెరిగింది. ఒకప్పుడు అమెరికాకు ఎగబడి వెళ్లేవారు కూడా.. ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్తున్నారు.1935 మహామాంద్యం సమయంలో అమెరికాకు వచ్చినవారి కంటే.. యూఎస్ వీడి వెళ్లిన వారిసంఖ్య ఎక్కువగా నమోదైంది. అలాంటి పరిస్థితి సుమారు 90ఏళ్ల తరువాత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.

Deepinder Goyal Startup Temple Is Hiring But Only If You Have Less Body Fat2
దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్‌లో ఉద్యోగాలు

జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ తన హెల్త్-టెక్ స్టార్టప్ ‘టెంపుల్’ కోసం ఉద్యోగ నియామకాలను ప్రారంభించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్టులో, మెషిన్ లెర్నింగ్ నుంచి న్యూరల్ డీకోడింగ్ పరిశోధకుల వరకు పలు ఇంజనీరింగ్ హోదాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.అయితే, ఈ నియామక ప్రకటనలో శరీర కొవ్వు శాతాన్ని అర్హత ప్రమాణంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు 16 శాతం కంటే తక్కువున్నవారు, మహిళలు 26 శాతం కంటే తక్కువ శరీర కొవ్వు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని గోయల్ స్పష్టం చేశారు.ఏమిటీ ‘టెంపుల్’?ప్రస్తుతం పరిశోధన, ప్రోటోటైప్ దశలో ఉన్న ‘టెంపుల్’ అనేది ధరించదగిన (వేరబుల్) పరికరం. ఇది మెదడు రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, రియల్‌ టైమ్‌లో, నిరంతరంగా కొలిచే ప్రయోగాత్మక పరికరం. గోయల్ ప్రకారం.. ఈ స్టార్టప్ ఎలైట్ అథ్లెట్ల కోసం అత్యాధునిక పనితీరు కొలిచే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది.ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం‘టెంపుల్’ స్టార్టప్ ‘క్రాఫ్ట్’, ‘కేటగిరీ’ పట్ల మక్కువ కలిగిన వ్యక్తులను కోరుకుంటోంది. అభ్యర్థులు కేవలం నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా, తమ శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లుగా ఉండాలని గోయల్ అభిప్రాయపడ్డారు.ఈ ప్రకటన వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు గోయల్ ధైర్యవంతమైన ఆలోచనను ప్రశంసిస్తే, మరికొందరు శరీర కొవ్వు శాతం ఆధారంగా నియామకాలు చేపట్టడం సరైన ఫిల్టర్ కాదని అభిప్రాయపడ్డారు. “16 శాతం కంటే తక్కువ శరీర కొవ్వుతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ దొరకడం కష్టం” అని ఓ యూజర్‌ సరదాగా కామెంట్‌ చేశారు.We're recruiting at @temple.At Temple, we are building the ultimate wearable for elite performance athletes. A device that measures what no other wearable in the world measures, with a level of precision that doesn't exist yet.To build it, we need people who are obsessive… pic.twitter.com/iCHaMUwdEw— Deepinder Goyal (@deepigoyal) February 27, 2026

Mercedes Benz Issues Recall in India3
మెర్సిడెస్ బెంజ్ రీకాల్: ఈ మోడల్స్‌పై ఎఫెక్ట్

మెర్సిడెస్ బెంజ్ ఇండియా.. భారతదేశంలో స్వచ్ఛంద రీకాల్‌ ప్రకటించింది. ఈ ప్రభావం 149 వాహనాలపై చూపుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన రీకాల్ నోటీసును ఫిబ్రవరి 15న జారీ చేసింది.బెంజ్ రీకాల్ ప్రభావం.. సీఎల్ఈ క్యాబ్రియోలెట్, సీఎల్ఈ 53 ఏఎంజీ కూపే & సీ 63 ఎస్ఈ పెర్ఫార్మెన్స్ వాహనాలపై పడింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)లో సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున సంస్థ రీకాల్ జారీ చేసింది. కొన్ని సందర్భాల్లో.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫంక్షన్ పనిచేయకపోవచ్చని కూడా మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది.రీకాల్ ప్రభావానికి గురైన వాహనాలు 2 సెప్టెంబర్ 2024 & 18 మార్చి 2025 మధ్య తయారు చేసినవని తెలుస్తోంది. రీకాల్ నోటీసు పొందిన కస్టమర్లు అధీకృత మెర్సిడెస్-బెంజ్ సర్వీస్ సెంటర్లు నేరుగా సంప్రదించి.. అవసరమైన తనిఖీ చేసుకోవచ్చు. డబ్బు చెల్లించకుండానే సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Stock Market closing February 27 Sensex slumps 960 points4
బ్యాంకుల షేర్లు విలవిల.. స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం

దేశీ​య స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీతా పతనమయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య రియల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ క్షీణించడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు గణనీయంగా క్షీణించాయి.నిఫ్టీ 1.22 శాతం లేదా 311.85 పాయింట్ల నష్టంతో 25,178.65 వద్ద, సెన్సెక్స్ 961.42 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయి 81,287.19 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా పడిపోయాయి.విస్తృత మార్కెట్లు కూడా బెంచ్ మార్క్ సూచీలకు అనుగుణంగా పడిపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.14 శాతం, 1.10 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు అత్యధికంగా క్షీణించాయి. ఈ సూచీలు వరుసగా 2.3 శాతం, 2.1 శాతం నష్టపోయాయి.

Samsung Galaxy S26 Series Price and Features5
శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌: ధరలు ఇలా

దక్షిణ కొరియన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ తమ ఫ్లాగ్‌షిప్‌ గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఎస్‌26, ఎస్‌26ప్లస్, ఎస్‌ 26 అల్ట్రా అని మూడు వేరియంట్స్‌ ఉంటాయి. శాంసంగ్‌ పోర్టల్‌ ప్రకారం వేరియంట్‌ని బట్టి ధర రూ. 87,999 నుంచి రూ. 1,89,999 (అల్ట్రా) వరకు ఉంటుంది. ప్రీఆర్డర్‌ చేసే వారికి రూ. 20,000 వరకు విలువ చేసే ప్రయోజనాలు లభిస్తాయి.ఈ సిరీస్‌లోని అల్ట్రా వేరియంట్‌లో పరిశ్రమలోనే తొలిసారిగా ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ ఉంది. స్క్రీన్‌ మీద ఉన్న కంటెంట్‌ పక్క వారికి కనిపించకుండా కేవలం యూజరుకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్‌ని మార్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు ప్రైవసీని కాపాడుకునేందుకు సహాయకరంగా ఉంటుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలీట్‌ జెన్‌ 5 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, అరగంటలోనే 75 శాతం చార్జ్‌ అయ్యేలా సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ 3.0, 50 ఎంపీ, అల్ట్రా వైడ్‌ కెమెరా, 200 ఎంపీ వైడ్‌ కెమెరా, 256 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీనికి ముందు సిరీస్‌ తరహాలోనే ఈ ఫోన్లను కూడా భారత్‌లోని నోయిడా ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు శాంసంగ్‌ తెలిపింది. దక్షిణ కొరియా వెలుపల, బెంగళూరులోని తమ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ వీటిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించింది. ఈ సిరీస్‌తో దేశీయంగా యాపిల్‌ నుంచి పోటీ నెలకొన్న 800 డాలర్ల ఎగువ ధర పలికే సూపర్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్లో శాంసంగ్‌ తన స్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Yes Bank Detects Rs 2 5 Crore Fraud in Multi Currency Forex Cards6
యస్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ కార్డులతో రూ.2.5 కోట్ల ఫ్రాడ్‌

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ తమ మల్టీ–కరెన్సీ ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డుల ద్వారా 2,80,000 డాలర్ల (సుమారు రూ. 2.5 కోట్లు) అనధికారిక లావాదేవీలను గుర్తించినట్లు వెల్లడించింది. బుక్‌మైఫారెక్స్‌ భాగస్వామ్యంతో జారీ చేసిన 5,000 మంది కస్టమర్లకు చెందిన కార్డుల ద్వారా ఫిబ్రవరి 24 తెల్లవారు ఝామున ఓ లాటిన్‌ అమెరికా దేశంలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది.అసాధారణ స్థాయిలో లావాదేవీలు తిరస్కరణకు గురవుతుండటంతో సిస్టం దీన్ని గుర్తించినట్లు పేర్కొంది. సదరు కస్టమర్లు నష్టపోకుండా ఆ మొత్తాన్ని వెనక్కి రప్పించేలా కార్డ్‌ నెట్‌వర్క్‌తో కలిసి పని చేస్తున్నట్లు వివరించింది. పటిష్టమైన నియంత్రణ విధానాల కారణంగా 688 అనధికారిక ప్రయత్నాలను సిస్టం అడ్డుకుందని, దీంతో 1,00,000 డాలర్ల నష్టాన్ని నివారించిందని యస్‌ బ్యాంక్‌ తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement