ప్రధాన వార్తలు
సాయంత్రానికి పెరిగిన రేటు.. బంగారం ధరలు ఇలా..
శుక్రవారం ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు మారిపోయాయి. ఈ కథనంలో ప్రస్తుత పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,43,150 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,44,250 వద్ద నిలిచింది. 1,56,170 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,57,370 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి.ఢిల్లీలో 1,43,330 వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల ధర 1,44,400 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,56,320 రూపాయల వద్ద నుంచి రూ. 1,57,520 వద్దకు చేరింది. అయితే చెన్నైలో.. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల రేటు రూ.1,44,200 వద్ద, 24 క్యారెట్ల రేటు 157310 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలువెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.70 లక్షల వద్ద ఉంది. నిన్న (గురువారం) రూ.10 వేలు పెరిగిన రేటు.. ఈ రోజు (శుక్రవారం) స్థిరంగా ఉంది.ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు?
కారు వెనుక నెంబర్స్.. మీనింగ్ ఏంటో తెలుసా?
సాధారణంగా ఒక కారును నిశితంగా పరిశీలిస్తే.. దాని ముందు, వెనుక బ్రాండ్ లోగో లేదా అక్షరాలు, సైడ్ డోర్స్ మీద కొన్ని స్టిక్కర్స్, వెనుక బీఎస్ 6 లేదా బీఎస్ 4 మోడల్స్ అని తెలిపే గుర్తులు వంటివి కనిపిస్తాయి. అయితే వెనుక భాగంలోనే 1.2, 1.5, 2.4 వంటి నెంబర్స్ కనిపిస్తుంటాయి. వీటి అర్థం కొందరికి తెలిసి ఉన్నా.. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.కారు వెనుక కనిపించే ఈ నెంబర్స్.. మోడల్ నెంబర్స్ అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి ఇంజిన్ కెపాసిటీని సూచిస్తాయి. బైకులలో ఇంజిన్ కెపాసిటీని సీసీ అంటారు. ఉదాహరణకు 100 సీసీ ఇంజిన్, 150 సీసీ ఇంజిన్ ఇలా. ఇక్కడ సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్ల అని అర్థం.ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలుకారు ఇంజిన్.. బైక్ ఇంజిన్ కంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి కారు ఇంజిన్ కెపాసిటీని లీటర్లలో కొలుస్తారు. లీటర్ నెంబర్ను 1000తో గుణించడం ద్వారా.. కారు ఇంజిన్ సీసీ కెపాసిటీ తెలుస్తుంది. అంటే.. 1.2 అనేది 1200 సీసీ ఇంజిన్ను, 1.5 అనేది 1500 సీసీ ఇంజిన్ను సూచిస్తుంది. కారు వెనుక ఉన్న నెంబర్ ఎంత పెద్దది అయితే.. ఇంజిన్ పరిమాణం కూడా ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రీమియం కార్లలో ఇంజిన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
బంగారం రూ.2 లక్షలకు?
ఇప్పుడిప్పుడే బంగారం ధరలు తగ్గుతున్నాయని పసిడి ప్రియులు సంబరపడుతున్నారు. ఈ తరుణంలో గోల్డ్ రేటు మళ్లీ రూ. 2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను, ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై కొనసాగుతున్న అనిశ్చితి వంటివి కారణాలు అని వెల్లడించారు.అమెరికా - ఇరాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా యుద్ధ వాతావరణం లేదా రాజకీయ అస్థిరతలు ఏర్పడినప్పుడు.. పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు చూస్తారు. ఇలాంటి సమయంలో.. బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడులు పెడతారు. ఇదే జరిగితే.. గోల్డ్, సిల్వర్ రేట్లు అమాంతం పెరుగుతాయి.ఇక మరో అంశం.. వడ్డీ రేట్లు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా? లేదా?.. అనేది చాలాకాలంగా పెట్టుబడిదారుల్లో నిలిచిపోయిన ఒక ప్రశ్న. వడ్డీ రేట్లు తగ్గితే.. బంగారం వంటి ఆస్తులు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఎందుకంటే వడ్డీ వచ్చే పెట్టుబడులపై లాభం తగ్గినప్పుడు, పెట్టుబడిదారులు బంగారం వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు.రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగితే.. ధరలు ఎగిసే అవకాశం ఉంది. అదే విధంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు ప్రకటిస్తే కూడా బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు.. మార్కెట్లో పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు.ప్రస్తుతం తగ్గిన ధరలు!2026 జనవరిలో రూ. 1.80 లక్షలకు చేరిన తులం బంగారం.. ప్రస్తుతం రూ. 1.50 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఇంత తక్కువ వ్యవధిలో రేటు ఎంత తగ్గిందో చూడవచ్చు. వెండి రేటు కూడా దాదాపు భారీగా తగ్గి కేజీ రేటు రూ. 2.70 లక్షలకు చేరింది.
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్నవేళ.. యాక్సెంచర్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉన్న సీనియర్ ఉద్యోగులకు.. ముఖ్యంగా అసోసియేట్ డైరెక్టర్లు & సీనియర్ మేనేజర్లు, పదోన్నతులు పొందాలంటే కంపెనీ రూపొందించిన ఏఐ టూల్స్ క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించింది.ఏఐ ఎనేబుల్డ్ కంపెనీగా మారాలనే లక్ష్యంతో యాక్సెంచర్ సరికొత్త వ్యూహం రచించింది. కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా.. ఉద్యోగులకు కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులో ఉంచి, దానిద్వారా.. పనితీరును & ఉత్పాదకతను పెంచడానికి సంస్థ సిద్ధమైంది. పోటీ ప్రపంచంలో మనం నిలబడాలంటే.. ప్రతి ఉద్యోగి ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలని సీఈఓ జూలీ స్వీట్ పేర్కొన్నారు.యాక్సెంచర్ ప్రకటించిన ఈ కొత్త విధానం.. యూరప్లోని 12 దేశాలలో ఉన్న సిబ్బందికి & అమెరికా ప్రభుత్వ ఒప్పందాల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు. మిగిలిన అందరూ తప్పకుండా పాటించాల్సిందే. ఏఐ ఉపయోగించాల్సిందే. కంపెనీ 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.మూడు నెలల్లో 11000 మంది!యాక్సెంచర్ కంపెనీ గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోకపోతే.. మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా కంపెనీ ఏఐలో స్థిరంగా నిలబడటానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్ల (0.38 శాతం) లాభంతో 82,814.71 వద్ద, నిఫ్టీ 116.90 పాయింట్ల (0.46 శాతం) లాభంతో 25,571.25 వద్ద నిలిచాయి.VL E-గవర్నెన్స్ & IT సొల్యూషన్స్ లిమిటెడ్, BLB లిమిటెడ్, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, సకార్ హెల్త్కేర్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. విక్రమ్ సోలార్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, ట్రాన్స్వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్, కెఎన్ అగ్రి రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
సహజంగా ఉండి సమర్థంగా పని చేసేలా కొత్త ఉత్పత్తులు
ఆయుర్వేద విజ్ఞానానికి ఆధునిక సైన్స్ను జోడిస్తూ ‘రిలీఫ్ వెల్నెస్’ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. భారత వెల్నెస్ మార్కెట్లో మొదటి స్మాల్ మాలిక్యూల్ హెర్బల్ ఫార్మా బ్రాండ్గా ఇది రికార్డు సృష్టించినట్లు చెప్పింది. ఈ బ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొని కంపెనీ ఉత్పత్తులను ఆవిష్కరించారు.సుమారు 5,000 ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానానికి, ప్రస్తుత ఫార్మాస్యూటికల్ టెక్నాలజీకి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా రీలీఫ్ వెల్నెస్ పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ‘కంపెనీ ఉత్పత్తుల్లో నానో సాంకేతికతను ఉపయోగించడం వల్ల సాధారణ హెర్బల్ ఉత్పత్తుల కంటే 20-30 రెట్లు వేగంగా శరీరంలోకి ఇంకుతాయి. కణాల స్థాయిలో పనిచేసే చిన్న అణువులతో కూడిన ఫార్ములేషన్లను భారత్లో తొలిసారిగా తీసుకొచ్చాం. ఇది అల్లోపతి మందుల తరహాలోనే వేగవంతమైన ఫలితాలను అందిస్తుంది’ అని కంపెనీ చెప్పింది.పరిశోధనలే పునాదిగా..రిలీఫ్ వెల్నెస్ వ్యవస్థాపకుడు మిస్టర్ డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ పరిశోధనలతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఆయుర్వేద మూలికల శక్తిని ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వేగంతో అందించడమే మా లక్ష్యం’ అని చెప్పారు. బ్రాండ్ సీఈఓ తరుణ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ‘కెమికల్స్తో కూడిన మందులకు ప్రత్యామ్నాయంగా, సహజంగా ఉండి సమర్థంగా పనిచేసే మందులు కావాలనేవారికి రిలీఫ్ వెల్నెస్ బెటర్ చాయిస్’ అన్నారు.ఈ సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేశ ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్తో అనుసంధానం చేసిన విధానం ఆకట్టుకుంది. వెల్నెస్ రంగంలో పరిశోధనల ఆధారిత ఉత్పత్తులు రావడం అభినందనీయం’ అన్నారు. ఈ సంస్థ భారత్లోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ హబ్ సీ-క్యాంప్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే..
కార్పొరేట్
బ్రెజిల్ కంపెనీతో.. దేశీ దిగ్గజం జట్టు!
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం
సహజంగా ఉండి సమర్థంగా పని చేసేలా కొత్త ఉత్పత్తులు
ఓపెన్ ఏఐ ఇన్ఫ్రాకు టీసీ‘ఎస్’
రూ. 2.01 లక్షల కోట్లకు ప్రకటన ఆదాయాలు
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
పాకెట్ ఎఫ్ఎం లక్ష్యం ఇదే!
జియోహాట్స్టార్లో వాయిస్ స్ట్రీమింగ్
పశు వికాస్ దినోత్సవం: వేలాది పశువులకు ఆరోగ్య సంరక్షణ!
అదానీ గ్రూప్ అతి భారీ పెట్టుబడులు
డబుల్ షాక్.. పసిడి, వెండి కొనేవారికి బ్యాడ్న్యూస్
దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చా...
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ...
పసిడి, వెండి పడిపోతాయా? ‘చైనా లూనార్ న్యూ ఇయర్’ ఎఫెక్ట్ ఎంత?
చైనా లూనార్ న్యూ ఇయర్ సెలవుల ప్రభావంతో ఆసియా కమోడి...
పబ్లిక్ ఇష్యూకు మూడు కంపెనీలు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ క్లీన్ మ్...
భారత్ పెట్టుబడులకు విశ్వసనీయ గమ్యస్థానం
వాణిజ్యం, పారిశ్రామిక సహకారం, దీర్ఘకాల పెట్టుబడులక...
అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు
అమెరికా నుంచి నాణ్యమైన కోకింగ్ కోల్ దిగుమతి పట్ల...
రూపే కార్డు వినియోగం పెంచాలి
చెల్లింపులకు యూపీఐ ప్రధాన సాధనంగా మారిందని.. నగదు ...
డిజిటల్ రాజ్యంలోనూ.. క్యాషే కింగ్
దేశంలో ఒకవైపు యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు గణ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో (#IndiaAIImpactSummit2026) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ టాప్ టెక్ సీఈవోలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రూప్ ఫోటో సందర్భంగా చోటుచేసుకున్న ఇద్దరు సంచలన సీఈవోల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.ఏఐ అభివృద్ధిపై ఐక్యతకు సంకేతంగా వేదికపై భారత ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా అందరూ చేతులు కలిపగా ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ (Sam Altman), ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమొడెయి (Dario Amodei) మాత్రం చేతులు కలపకుండా పిడికిలి బిగించి పలకరించుకోవడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.ఈ చిన్న సంఘటన సైతం ఏఐ రంగంలోని పోటీ వాతావరణాన్ని మరోసారి గుర్తు చేసింది. తీవ్రంగా పోటీ పడుతున్న రెండు ప్రముఖ ఏఐ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు వేదికపై మొదట క్షణకాలం సంకోచంగా కనిపించినా, అనంతరం పిడికిలితో పరస్పరం అభివాదం చేసుకున్నారు. ఈ దృశ్యం ఆన్లైన్లో హాస్యభరితమైన వ్యాఖ్యలకు దారితీసింది. పుచ్ ఏఐ కో ఫౌండర్ సిద్ధార్థ్ భాటియా తన సోషల్ మీడియా ఖాతాలో “ఏజీఐ ఎప్పుడు? డారియో, సామ్ చేతులు కలిపిన రోజు!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కాగా డారియో అమొడెయి ఓపెన్ఏఐలో రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2021 ప్రారంభంలో ఆ పదవి నుంచి వైదొలిగి, పలువురు సీనియర్ పరిశోధకులతో కలిసి ఆంథ్రోపిక్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు జనరేటివ్ ఏఐ రంగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి.When AGI?The day Dario and Sam hold hands. pic.twitter.com/bfmqgnTV89— Siddharth Bhatia (@siddharthb_) February 19, 2026
ముంబై, బెంగళూరుల్లో ఓపెన్ఏఐ కార్యాలయాలు
ప్రముఖ జనరేటివ్ ఏఐ చాట్ జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ తన భారతీయ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇప్పటికే న్యూఢిల్లీలో తన కార్యాలయం ప్రారంభించిన సంస్థ ఈ ఏడాది చివర్లో ముంబై, బెంగళూరుల్లో రెండు కొత్త కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా ఆల్ట్మన్ స్పందిస్తూ.. భారతదేశంలో ఏఐని వేగంగా స్వీకరిస్తుండడంపై సామ్ ఆల్ట్మన్ ప్రశంసలు కురిపించారు. ‘భారతదేశం ఇప్పటికే ఏఐ వినియోగంలో ప్రపంచ దేశాల కంటే ముందు వరుసలో ఉంది. ఇక్కడి అద్భుతమైన సాంకేతిక ప్రతిభ, ఏఐ పట్ల ప్రజల్లో ఉన్న ఆశావాదం, ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు ఆకట్టుకున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఏఐని ఎలా అభివృద్ధి చేయవచ్చో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారనుంది’ అన్నారు.ముంబై, బెంగళూరు కార్యాలయాల ద్వారా స్థానిక మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, భారతీయ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచుకోవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ‘భారతదేశం కోసం, భారతదేశంలో, భారత్తో కలిసి ఏఐని నిర్మించడమే మా సంకల్పం’ అని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు..
కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన
అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే 12 నుండి 18 నెలల్లో మిలియన్ల సంఖ్యలో వైట్-కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని అమెరికన్ పారిశ్రామికవేత్త, మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ (Andrew Yang) హెచ్చరించారు.ఏఐ సామర్థ్యం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్న ఆయన, తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉపయోగించిన ఏఐ ప్రోగ్రామ్ కొన్ని నిమిషాల్లోనే ఒక వెబ్సైట్ రూపకల్పన పూర్తి చేసిందని ఉదాహరణగా చెప్పారు. సాధారణంగా డిజైనర్కు లేదా నిపుణుడికి రోజులు పట్టే పనిని ఏఐ కేవలం నిమిషాల్లో ముగించగలగడం ఉద్యోగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం మిడ్-కెరీర్ కార్యాలయ ఉద్యోగులు, కాల్ సెంటర్ సిబ్బంది, సేల్స్ సిబ్బంది, కోడర్లు వంటి వారు నిర్వహిస్తున్న పనుల్లో చాలా భాగాన్ని ఏఐ ఆటోమేట్ చేసే అవకాశం ఉందని యాంగ్ అభిప్రాయపడ్డారు. డేటా ప్రాసెస్ చేయడం, నివేదికలు తయారు చేయడం మాత్రమే కాకుండా నిర్ణయ ప్రక్రియ కూడా ఆటోమేషన్ వైపు మళ్లవచ్చని ఆయన తెలిపారు.ఈ పరిణామం వైట్-కాలర్ ఉద్యోగాల్లో “గొప్ప విచ్ఛిన్నత”కు దారితీయవచ్చని హెచ్చరించిన ఆయన, ఒక కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ప్రారంభిస్తే, పోటీ కారణంగా ఇతర సంస్థలు కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశముందని అన్నారు. హెడ్కౌంట్ తగ్గిస్తే స్టాక్ మార్కెట్ ప్రతిఫలం ఇస్తుందనే భావన ఈ ధోరణిని మరింత వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.అమెరికాలో సుమారు 70 మిలియన్ల వైట్-కాలర్ కార్మికుల్లో 20 నుండి 50 శాతం మంది రాబోయే రోజుల్లో ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేశారు. డేటా విశ్లేషణ, రిపోర్ట్ తయారీ, కోడింగ్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో ఏఐ సాధనాలు వేగంగా విస్తరిస్తుండటం ఈ పరిస్థితికి కారణమవుతుందని వివరించారు.ఉద్యోగ నష్టాల ప్రభావం వినియోగదారుల ఖర్చులు, గృహ మార్కెట్, పన్ను ఆదాయాలపై పడే అవకాశం ఉందని, దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినవచ్చని యాంగ్ హెచ్చరించారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (UBI), పునఃశిక్షణ కార్యక్రమాలు, అలాగే ఏఐ కంపెనీలపై పన్నులు విధించడం వంటి విధానాలను పరిశీలించాలని ఆయన సూచించారు.
ఇక ‘జియో ఏఐ స్టాక్’.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో ముందడుగు
కృత్రిమ మేధా (AI) రంగంలో భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో ‘నేషన్-ఫస్ట్ ఏఐ స్టాక్’ బ్లూప్రింట్ను ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు (India AI Impact Summit) వేదికగా ‘జియో ఏఐ స్టాక్’ పేరుతో ఈ సమగ్ర, స్వదేశీ ఏఐ ఎకోసిస్టమ్ రూపకల్పనను సంస్థ వెల్లడించింది.జియో ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేస్తున్న ఈ ఏఐ స్టాక్, కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి సమగ్ర ఏఐ వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశ జనాభా పరిమాణం, భాషా వైవిధ్యం, సామాజిక-ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లుజియో ఏఐ స్టాక్లో ప్రధాన భాగంగా గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లు, అధిక సామర్థ్య గణన వసతులు (HPC), ఏఐ ప్లాట్ఫార్మ్లు, డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్లు, భారతీయ భాషల ఆధారిత డేటా ఫౌండేషన్లు, మల్టీలింగ్వల్ ఇంటెలిజెన్స్ లేయర్, రంగాల వారీ అప్లికేషన్ మాడ్యూల్స్ ఉంటాయని వెల్లడించింది.ఈ డేటా సెంటర్లు పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచేలా నిర్మాణం చేయనున్నట్లు జియో తెలిపింది. దేశవ్యాప్తంగా స్థిరమైన, సుస్థిర ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించడమే లక్ష్యమని పేర్కొంది.జియో ఏఐ స్టాక్ను “సార్వభౌమ ఏఐ ఎకోసిస్టమ్”గా సంస్థ అభివర్ణించింది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ, డేటా పరిరక్షణ, డిజిటల్ మౌలిక వసతులు, వ్యూహాత్మక స్వయం నియంత్రణ వంటి జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానమై ఉంటుంది.ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సూక్ష్మ-చిన్న వ్యాపారాలు, పౌర సేవలు వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించేలా ఈ వేదిక రూపుదిద్దుకుంటుందని సంస్థ పేర్కొంది.భారతీయ భాషలకు ప్రాధాన్యంఈ ప్రాజెక్ట్లో భాగంగా వివిధ భారతీయ భాషల్లో విస్తృత డేటా సేకరణ జరుగుతోందని జియో తెలిపింది. స్థానిక భాషలను అర్థం చేసుకునే ఏఐ వ్యవస్థలు, ఫేఫ్టీ మల్టీలింగ్వల్ వాయిస్ ఏఐ సొల్యూషన్లు, వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో సహజంగా సంభాషించగలిగే ఏజెంటిక్ ప్లాట్ఫార్మ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
పర్సనల్ ఫైనాన్స్
మెరుగైన రాబడులకు మార్గం
ఈక్విటీల్లో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునే వారు.. వివిధ రకాల పథకాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పోర్ట్ఫోలియోలో లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ కనిపిస్తుంటాయి. ఇలా భిన్న పథకాలకు కేటాయింపులు చేసుకునే బదులు.. ఒకే పథకం ద్వారా అన్ని విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. అంటే మార్కెట్ విలువ పరంగా ఇవి ఏదో ఒక విభాగానికే పరిమితం కాకుండా.. అన్ని రకాల అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో టాప్ ఫండ్స్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఒకటి.రాబడులుఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి గడిచిన ఏడాది కాలంలో రాబడి 16.19 శాతం వచ్చింది. ఇక గడిచిన మూడేళ్లలో వార్షిక రాబడి 23.07 శాతం చొప్పున నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 21.33 శాతం చొప్పున రాబడిని ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. ఇక ఈ ఫండ్ ఆరంభం నుంచి (1995) చూసుకున్నా.. వార్షిక రాబడి 16.78 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పెట్టుబడుల విధానంఈ పథకం ఈక్విటీల్లో కనీసం 65 శాతం తగ్గకుండా, గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. లార్జ్క్యాప్స్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ మధ్య ఎలాంటి పరిమితులు లేకుండా.. మెరుగైన వృద్ధి అవకాశాలు ఏ విభాగంలో ఉంటే అక్కడ కేటాయింపులు పెంచే స్వేచ్ఛతో పనిచేస్తుంది.ఈక్విటీ పెట్టుబడుల విలువను ఊహించని షాక్ల నుంచి రక్షించుకునేందుకు పరిస్థితులకు అనుగుణంగా డెరివేటివ్స్ (ఫ్యూచర్, ఆప్షన్ కాంట్రాక్టులు) పొజిషన్లలోనూ కొంత ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పరిస్థితులను బట్టి డెట్ సాధనాల్లో అరుదుగా (ఈక్విటీలు మరీ ఖరీదుగా మారినప్పుడు) 35 శాతం వరకూ ఇన్వెస్ట్ చేస్తుంది. రియల్ ఎస్టెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్వెస్ట్)ల్లోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. సగటు కంటే అధిక రాబడులు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.97,451 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విట్లీలో 82.12 శాతం ఇన్వెస్ట్ చేయగా, రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 2.32 శాతం మేర పెట్టుబడి పెట్టింది. డెట్ సెక్యూరిటీల్లో కేవలం 0.53 శాతం పెట్టుబడులు ఉండగా, 15 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా లేనప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇలా చెప్పుకోతగ్గ స్థాయిలో నగదు నిల్వలు నిర్వహిస్తుంటాయి.ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా.. ఇందులో 70 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 4.25 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 9.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. రంగాల వారీ కేటాయింపులను పరిశీలించగా, అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 47 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 16.87 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 11.20 శాతం, హెల్త్కేర్ కంపెనీల్లో 8.18 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 6.61 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్.. ‘కొత్త’ ఆఫర్స్!
ఓవైపు జీవిత బీమా భద్రత పొందుతూనే మరోవైపు సంపదను పెంచుకునేందుకు అవకాశం కలి్పస్తూ టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్స్ని ఆవిష్కరించింది. ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్, ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ పెన్షన్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వేల్యూ ఇన్వెస్టింగ్ పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. టాటా ఏఐఏ యూనిట్ లింక్డ్ ప్లాన్ల ద్వారా వీటిని తీసుకోవచ్చు. పిల్లల చదువులు, అసెట్స్ సమకూర్చుకోవడం, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మొదలైన ప్రణాళికలకు మొదటి ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడానికి రెండోది పని చేస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. ఓల్డ్ బ్రిడ్జ్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఈ ఫండ్ని ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 23 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. బాటమ్–అప్ వ్యూహంతో దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధికి దోహదపడే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయిదేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగించే వారికి అనువైన ఫండ్. కనీసం రూ. 5,000 నుంచి, సిప్ అయితే రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. కేవలం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పెట్టుబడులను కేటాయించకుండా కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. బీఎస్ఈ 500 టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది.
పన్నుల ముసాయిదాలోని ‘‘ప్రమోదం’’
కొత్త ఇన్కం టాక్స్ చట్టం వచ్చింది. ముసాయిదా నిబంధనలు–2026 విడుదల అయ్యాయి. ఈ ఫిబ్రవరి 22 తేదీ వరకు సలహాలు స్వీకరిస్తారు. ఆ తరువాత వాటిని అమలులోకి తెస్తారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలు చిన్న చిన్న అస్సెస్సీలకు, ఉద్యోగస్తులకు ఎంతో ఊరట, ఉపశమనం కల్పిస్తాయి అనడంలో సందేహం లేదు. ముసాయిదాలోని ప్రతిపాదనలు ప్రమోదాన్ని తెస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం... కేవలం వ్యక్తులకు సంబంధించిన వాటిని ప్రస్తావిస్తున్నాం....ఉద్యోగస్తులకు ఉపశమనంఉద్యోగికి జీతంతో పాటు అదనంగా లభించే వేతనేతర ప్రయోజనాలు/సౌకర్యాల పరిమితిని పెంచారు. కొత్తగా వచ్చే ఈ అదనపు ప్రయోజనాలతో లబ్ధి పొందేది అంతిమంగా ఉద్యోగస్తుడు. రెండు, మూడు దశాబ్దాలుగా వీటి జోలికెళ్లని డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆచరణాత్మకంగా అడుగులేస్తోంది. యజమాని సమకూర్చే వాహనాల సామర్థ్యం ఆధారంగా మినహాయింపు ఇస్తారు. ఈ సదుపాయంతో డ్రైవర్ ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం జరగొచ్చు. ఇంజిన్ సామర్థ్యం 1.6 లీటర్ దాటని సందర్భంలో ఇచ్చే మినహాయింపుని రూ.2,700 నుంచి రూ.8,000 లకు పెంచారు. కెపాసిటీ 1.6 లీటర్ దాటితే రూ.3,200 నుంచి రూ.10,000లకు పెంచారు.యజమాని ఇచ్చే భోజనం విలువ పరిమితిని ఒక్కొక్క భోజనానికి రూ.50 నుంచి రూ.200లకు పెంచారు. దాని విలువ ఏడాదికి లెక్కిస్తే మినహాయింపు విలువ రూ.1,05,000 దాకా వస్తుందని అంచనా.గిఫ్ట్ వోచర్ల విలువని రూ.15,000 లకు పెంచారు. ప్రస్తుతం వాటి విలువ రూ.5,000గా ఉంది. వడ్డీ లేని రుణాలు... వడ్డీ విలువ రూ.20,000 దాకా ఉంది. దాన్ని పదింతలు అంటే రూ.2,00,000 లకు పెంచారు.ఎడ్యుకేషన్ అలవెన్స్.. ఒక సంతనానికి నెలకి రూ.100 ఉంది. దానిని రూ.3,000లకు పెంచారు. విద్యార్థులకు హాస్టల్ అలవెన్సు పరిమితిని రూ.300 నుంచి రూ.3,000లకు పెంచారు.ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు దశాబ్దాల చరిత్ర కలిగినవి. కొంతమంది మరిచిపోయారు. కొంతమంది క్లెయిమ్ చేయడం మానేశారు. డిపార్ట్మెంట్ వారి ఆలోచనా విధానం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ పెంపుదల గణనీయం.. ఈ మేరకు ఉద్యోగస్తులకు ఎంతో పన్ను ఊరట కలుగుతుంది. పాన్తో తిప్పలు తప్పుతాయ్..! చేతిలో సెల్ఫోన్, బ్యాగులో ఆధార్కార్డు, పాన్ కార్డు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. కొంతమంది జిరాక్సులు చేయించి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం బ్యాంకులో నగదు డ్రా చేయాలంటే ఒక రోజులో రూ.50,000 దాటితే పాన్ తెలియచేయాలి. ఇక నుంచి డైయిలీ లిమిట్స్ ఉండవు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.10,00,000 నగదు విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా, ఈ పరిమితి రూ.10 లక్షలు దాటితేనే పాన్ వివరాలు ఇవ్వాలి. దీని వలన ఇల్లు కట్టిస్తున్నప్పుడు, ఏవైనా పెళ్లిళ్లు, కార్యాలున్నప్పుడు వ్యాపారంలో కొనుగోళ్లు, మెడికల్ ఎమర్జెనీ సందర్భాల్లో ఎంతో వెసులుబాటు ఉంటుంది. స్థిరాస్తి క్రయవిక్రయ సందర్భాల్లో రూ.10,00,000 ఉన్న పరిమితిని రూ.20,00,000లకు పెంచారు. అలాగే జాయింట్ డెవలప్మెంట్ సందర్భాల్లో రూ.20,00,000 లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వ్యవహారాలు జరుపుకోవచ్చు. అలాగే చిన్న, చిన్న మోటారు బైకులు కొనుగోలు సందర్భంలో విలువతో నిమిత్తం లేకుండా పాన్ అడిగేవారు. ఇక నుంచి రూ.5,00,000 దాటిన బండి కొంటేనే పాన్ అడుగుతారు. హోటల్, ఈవెంట్ల నిర్వహణ కోసం చెల్లించే మొత్తం రూ.1,00,000 దాటితేనే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే ఇవన్నీ ఒక దిశగా వెళ్లితే.., ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి అన్నట్లు బీమా రంగంలో మాత్రం ఎటువంటి సడలింపు లేదు. పాన్ వాడకం సడలింపు విషయంలో డిపార్ట్మెంట్ని అభినందించాలి. సడలింపుల వలన ఎంతో సౌలభ్యం ఏర్పడుతుంది. కాలం వృథా కాదు. టాక్సుపేయర్ ఎప్పుడూ చట్టాన్ని, రూల్స్తో కలిసి చదివి నిర్ణయానికి రావాలి. ఈ రూల్స్ ప్రకారం మన తెలుగు ప్రజలలో హైదరాబాద్ ఉద్యోగస్తులకు ఒక తీపి కబురు. హైదారాబాద్ ఉద్యోగస్తులుఇంటి అద్దె అలవెన్సు మినహాయింపు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మినహా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులకు జీతం మీద 40% మాత్రమే ఉండేది. నిజానికి హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దానితో పాటు సదుపాయాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు ఇప్పు డు విల్లాలు.. కొంతమంది ఇండిపెండెంట్ ఇంటిలో ఉంటారు. అమలులో ఉన్న రూల్స్ ప్రకారం వారికి మినహాయింపు 40% మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ లిమిట్ అన్నీ 40% నుంచి 50 శాతానికి పెంచారు. దాని వలన హైదరాబాదులో ఎక్కువ అద్దె ఇచ్చే వారికి మంచి ఉపమశనం. అంతేకాకుండా ఈ వెసులుబాటు పూణే, అహ్మదాబాద్, బెంగళూర్కి వర్తిస్తుంది. వెనకోముందో ఉద్యోగస్తులకు ప్రమోదం కలిగించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. అభినందనీయం..!
ఉఫ్.. బిగ్ రిలీఫ్!
రాజ్యలక్ష్మి(68) రిటైర్డ్ గవర్నమెంట్ టీచరు. ఉండేది హైదరాబాద్లో. ఎఫ్డీని రెన్యువల్ చెయ్యడానికి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు సిబ్బంది రెన్యువల్ చెయ్యకుండా... ఎఫ్డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందంటూ మార్కెట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయించారు. రెండేళ్లు గడిచాయి. మార్కెట్ పడిపోవడంతో ఆమె పెట్టుబడిలో 18 శాతం వరకూ పోయింది. ఎఫ్డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందన్నారు కదా? అంటూ బ్యాంకును నిలదీశారు. ‘‘మార్కెట్ లింక్డ్ సాధనాల్లో ఇవి సహజం. మీరూ ఒప్పుకుని సంతకం చేశారు కదా?’’ అని బ్యాంకు వాళ్లు చూపించటంతో లక్ష్మి హతాశురాలయ్యారు.ఇక వెంకటాచలం అయ్యర్ అనే 90 ఏళ్ల వ్యక్తికి ఏటా రూ.2 లక్షల ప్రీమియంతో 2124లో అంటే, వందేళ్ల తర్వాత మెచ్యూరయ్యే జీవిత బీమా పాలసీని అంటగట్టింది మరో బ్యాంకు. దీనిపై సోషల్ మీడియాలో నానా రచ్చ జరిగేసరికి సైలెంటుగా రిఫండ్ చేసేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకుండే హక్కులను వివరించేదే ఈ వెల్త్ స్టోరీ..బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మనకు పనికిరాని, అనవసరమైన ఉత్పత్తుల్ని బలవంతంగా కొనిపించేదంతా మిస్–సెల్లింగే. దీన్నుంచి వినియోగదారులను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ తొలిసారి స్పష్టమైన చర్యలకు దిగింది. ‘రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ – 2026’ ముసాయిదా ప్రకారం మిస్ సెల్లింగ్ రుజువైతే, కస్టమర్ల దగ్గరనుంచి వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని బ్యాంకులు వాపసు చేయాలి. సదరు ప్రోడక్టు విక్రయాన్ని రద్దు చేయాలి. ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్న ఈ నిబంధనలతో మిస్–సెల్ చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై పడుతుంది.మిస్–సెల్లింగ్ ఇదీ...రిజర్వ్ బ్యాంక్ తొలిసారిగా మిస్–సెల్లింగ్కంటూ స్పష్టమైన నిర్వచనాలిచ్చింది. అవేంటంటే...కస్టమర్ ప్రొఫైల్కి అనువుగా లేని ఉత్పత్తులను విక్రయించటంపూర్తిగా, లేక సరైన వివరాలు ఇవ్వకుండా అమ్మడంబండిల్గా ప్రోడక్టులను అంటగట్టడంకస్టమరు నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకోకుండానే విక్రయించడంఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కస్టమరు ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్పై సంతకాలు చేసినా, ప్రోడక్టు గానీ అనువైనది కాకపోతే అది మిస్–సెల్లింగ్ కిందికే వస్తుంది. ఇప్పటివరకు కస్టమర్ల సంతకాలు, డిజిటల్ క్లిక్లు అనే లూప్హోల్ని అడ్డం పెట్టుకుని, బయటపడిపోయిన బ్యాంకులు ఇకపై అలాంటివి చేయటానికి కుదరదు. ఆర్బీఐ కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం రాజ్యలక్ష్మి ఎదుర్కొన్నది మిస్ సెల్లింగే. ఎందుకంటే ఆమె వయస్సు, రిస్కు సామర్థ్యాల రీత్యా మార్కెట్లో భారీ పెట్టుబడులు పెట్టడం రిస్కీ వ్యవహారమే. పెట్టుబడికి కూడా హాని ఉంటుందనే విషయం సరిగ్గా చెప్పకుండా ఆమెకు అరకొర సమాచారమే ఇచ్చి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఆమెకు పూర్తి రిఫండ్ చేయాల్సి ఉంటుంది.బలవంతంగా బండిల్ చేయొద్దు..రుణం ఇవ్వాలంటే ఆ రుణానికి బీమా తీసుకోవాలంటూ బ్యాంకులు లింకు పెట్టడం సహజం. ఇదే బండ్లింగ్. ఒకటి కావాలంటే మరొకటి కూడా జత కలపటం. ఆర్బీఐ ముసాయిదా నిబంధనల ప్రకారం...రుణం కోసం తప్పనిసరిగా తాము చెప్పే బీమా పాలసీని తీసుకోవాల్సిందే అంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడానికి ఉండదు.నచ్చిన ఏ కంపెనీ నుంచైనా థర్డ్ పార్టీ ప్రోడక్టులను కొనుక్కునేందుకు కస్టమర్లకు స్వేచ్ఛ ఉంటుంది.కస్టమర్లు స్పష్టంగా సమ్మతించకుండా, రుణ మొత్తం నుంచి బీమా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్టులకు సంబంధించిన డబ్బును కట్ చేసుకోవడానికి ఉండదు. కస్టమర్ల సమ్మతి అనేది నిర్దిష్టంగా ఉండాలి. పూర్తి వివరాలు తెలుసుకుని ఇచ్చినట్లుగా ఉండాలి. అస్పష్టత ఉండకూడదు.వివిధ ప్రోడక్టులన్నింటికీ కలిపి ఒకే ఫారంలో లేదా డిజిటల్ చెక్బాక్స్ ద్వారా సమ్మతి తీసుకోవడానికి కుదరదు. ప్రతి ప్రోడక్టుకు విడిగా అప్రూవల్ తీసుకోవాల్సిందే. డిజిటల్ ‘డార్క్ ప్యాటర్న్స్’ కట్టడిబ్యాంకులు ఇకపై కస్టమర్లను మభ్యపెట్టే ‘డార్క్ ప్యాటర్న్స్’లాంటి డిజిటల్ మాయవేషాలు వేయడానికి ఉండదు. ఈ డార్క్ ప్యాటర్న్స్ ఏమిటంటే..ఇదిగో మరికాసేపట్లోనే ఆఫర్ ముగిసిపోతుంది, త్వరపడకపోతే నష్టపోతారనే విధంగా కంగారు పెట్టేయడం ముందే యాడ్–ఆన్స్ని సెలెక్ట్ చేసేసి ఉంచడంప్రీ–అప్రూవ్డ్ క్రెడిట్ కార్డులంటూ ఇచ్చేసి, కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్లలాంటివి అంటగట్టడంపేమెంట్ దశవరకు ఇతర చార్జీల గురించి చెప్పకుండా దాచి పెట్టి ఉంచడంఅన్సబ్స్క్రయిబ్ చేసేందుకు సంబంధించిన ఆప్షన్లు గందరగోళంగా ఉండటంఇలాంటివి చేయకుండా కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ మార్గనిర్దేశకాలను బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలి. తమ యూజర్ ఇంటర్ఫేస్లను తరచుగా ఆడిట్ చేసుకుంటూ ఉండాలి. దీనితో యాప్–ఆధారిత బ్యాంకింగ్లో పారదర్శకత గణనీయంగా మెరుగుపడుతుంది. టార్గెట్లే మిస్–సెల్లింగ్కి మూలం..అసలు మిస్–సెల్లింగ్కి మూలకారణం ఉద్యోగులకు ఉండే భారీ సేల్స్ టార్గెట్లు, ప్రోత్సాహకాలే. కాబట్టి ఇకపై బ్యాంకులు ఏవి చేయకూడదో ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. అవి...సేల్స్ కోసం అంతర్గతంగా పోటీ పెట్టడంస్పెషల్ ‘టార్గెట్ డేస్’ని నిర్దేశించడంఎలాగైనా ప్రోడక్టును అంటగట్టేలా ప్రోత్సహించే ప్రోత్సాహకాల విధానాలుథర్డ్ పార్టీ ప్రోడక్టులను విక్రయించే ఉద్యోగులు నేరుగా గానీ పరోక్షంగా గానీ సదరు సంస్థల నుంచి ప్రోత్సాహకాలేవీ పొందకూడదు. రిలేషన్షిప్ మేనేజర్లు టార్గెట్లను పూర్తిచేసేందుకు, తమకు భారీగా కమీషన్ వచ్చే ప్రోడక్టులను అంటగట్టకుండా ఇలాంటివి కట్టడి చేస్తాయి. టెలీమార్కెటింగ్ కష్టాలకు చెక్కొత్త రూల్స్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే కాల్స్కి అనుమతి ఉంటుందిడీఎన్డీ కింద రిజిస్టర్ చేసుకుంటే అసలు కాల్ చేయడానికే ఉండదుఏజెంట్లు తాము కూడా బ్యాంకు ఉద్యోగులమే అన్నట్లుగా వ్యవహరించకూడదుప్రమోషనల్ మెసేజీలను కస్టమర్లు స్పష్టంగా సమ్మతిస్తేనే పంపాలి. అన్సబ్స్క్రైబింగ్ ప్రక్రియ కూడా సరళంగా ఉండాలి.ఇదీ చదవండి: విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే


