Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Free Bikes EVs Gold Coins Real Estate Builders Roll Out Attractive Offers1
ఇల్లు కొంటే ఖరీదైన బైక్‌.. తులం బంగారం

షాపుల్లో మెగా సేల్స్‌.. బంపర్‌ ఆఫర్లు చూస్తుంటాం.. ఈ కామర్స్‌ సంస్థల ఇయర్‌ ఎండింగ్‌ డిస్కౌంట్లు చూస్తుంటాం.. మైక్‌ పట్టుకొని ‘రండి బాబూ రండి.. ఇలాంటి సువర్ణావకాశం మళ్లీ రాదు..’ అంటోంది స్థిరాస్తి రంగం. అందుబాటు ధరలు ఉండే హైదరాబాద్‌లో ఒకప్పుడు ప్రాపర్టీలు హాట్‌ కేక్‌లు. నిర్మాణం పూర్తి కాకముందే బ్రోచర్ల మీదే ఫ్లాట్ల అమ్మకాలు పూర్తయ్యేవి. ధరలు, నాణ్యత, బిల్డర్ల ట్రాక్‌ రికార్డ్‌లు, మార్కెట్‌ సెంటిమెంట్‌ అలా ఉండేది. 360 డిగ్రీల కోణంలో గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా, ఆకర్షించేలా ఉండేది. కానీ, కొన్నేళ్లుగా మార్కెట్‌ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. – సాక్షి, సిటీబ్యూరోమారిన పరిస్థితులతో పాటు కొన్ని ప్రతికూలతలతో స్థిరాస్తి రంగంలో సెంటిమెంట్‌ పూర్తిగా దెబ్బతింది. దీంతో విక్రయాలు లేక నిర్మాణ రంగం క్షీణించే దశకు చేరుకుంది. ఈ రంగంపైనే ఆధారపడిన నిర్మాణ సంస్థలు, బిల్డర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్ల వల వేయక తప్పడం లేదు. ఇళ్ల అమ్మకాలను పెంచుకునేందుకు విలువైన బైక్, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఈవీ), తులం బంగారం, ఉచిత ఇంటీరియర్‌.. ఇలా రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నారు.నిర్మాణ సంస్థలెన్నో.. స్థిరాస్తి రంగంలో ఆఫర్ల వల కొత్తేమీ కాదు. గతంలో ఉచిత ఇంటీరియర్, క్లబ్‌హౌస్‌ సభ్యత్వం, మాడ్యులర్‌ కిచెన్‌ వంటి పరిమిత స్థాయిలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ విక్రయాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో నగరంలోని చిన్నా, పెద్దా డెవలపర్లు, నిర్మాణ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీమియం మోటార్‌ సైకిళ్లు, 24 క్యారెట్ల బంగారం నాణేలు, ఈవీ వాహనాలు, ఉచిత ఇంటీరియర్‌ వంటి ఖరీదైన బహుమతులను అందజేస్తున్నాయి. ఉదాహరణకు నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కోకాపేట, కూకట్‌పల్లి, ఉప్పల్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో అపార్ట్‌మెంట్‌ బుకింగ్‌తో ప్రతి కొనుగోలుదారుడికి రూ.3 లక్షల విలువైన హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ను ఉచితంగా అందజేస్తామని ప్రచారం చేస్తోంది. మరో డెవలపర్‌ ఉప్పల్, రామాంతాపూర్‌లలో రాబోయే ప్రాజెక్ట్‌లో ప్రతి కస్టమర్‌కు రూ.8 లక్షల విలువైన ఈ–వాహనాన్ని అందిస్తామని ప్రచారం చేస్తున్నారు.ఆఫర్లతో విక్రయాలు స్పల్పకాలమే.. వేగంగా విక్రయాలు జరుపుకునేందుకు ఇలాంటి ఆఫర్లతో ప్రయత్నాలు చేస్తుంటారని డెవలపర్ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రతికూల మార్కెట్‌లో అమ్ముడుపోని ఇన్వెంటరీని విక్రయించేందుకు ఇలాంటి ప్రత్యేక డీల్స్‌ను ప్రవేశపెడుతుంటారు. అయితే ఈ ఉచితాల ధర ప్రాజెక్ట్‌ ధరలో భాగం అవుతుందని, ఈ తరహా మార్కెట్‌ స్వల్పకాలంలో అమ్మకాలను పెంచినా.. స్థిరమైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఉచితాలు కాకుండా ధర, నిర్మాణ నాణ్యత, ప్రాంతాన్ని చూసి ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.బంగారంతో ఆకర్షణ.. పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆఫర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఫ్లాట్‌ బుకింగ్‌ చేసుకునే కస్టమర్లకు రిటర్న్‌ గిఫ్ట్‌ అందజేసే సంప్రదాయంగా పెరుగుతోంది. మియాపూర్‌కు చెందిన ఓ డెవలపర్‌ రూ.75–85 లక్షల మధ్య ధర కలిగిన రెండు, మూడు పడక గదుల ఇంటి కొనుగోలుపై కస్టమర్‌కు రూ.3 లక్షల విలువైన బంగారం ఇస్తామని ప్రకటించారు. అంటే దగ్గరిదగ్గర 10–14 గ్రాముల బంగారం ఇస్తున్నారు. అలాగే పిల్లల బెడ్‌ రూమ్‌కు ఇంటీరియర్, మాడ్యులర్‌ కిచెన్‌తో పాటు అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు.రెరా పరిధిలోకి రావు.. ఆఫర్లు, ప్రోత్సాహకాలు కస్టమర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు పన్నే వాణిజ్య వ్యూహాలు. అయితే ఈ ఉచిత ఆఫర్ల ప్రకటనలు తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) నియంత్రణ పరిధిలోకి రావు. ఇవి గృహ కొనుగోలుదారులకు రక్షణ కల్పించలేవు. అయితే సేల్‌డీడ్‌లో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయడంలో డెవలపర్‌ విఫలమైతే ఈ ఉచితాలు, బహుమతులతో సహా కొనుగోలుదారులు టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ఆయా డెవలపర్లపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారు.

India announces visa relief for foreigners no penalty on overstay2
వీసాల పొడిగింపు.. భారత్ గుడ్‌ న్యూస్‌

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావిత విదేశీ పౌరులకు అన్ని రకాల వీసాలకు 30 రోజుల పాటు పొడిగింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎక్కువ కాలం బస చేసినందుకు విధించే జరిమానాలను కూడా మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది.దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. రెగ్యులర్ వీసాలు, ఈ-వీసాలు సహా అన్ని రకాల వీసాలకు ఈ సడలింపులు వర్తిస్తాయని తెలిపింది.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పలువురు విదేశీయులు ప్రయాణ సమస్యల కారణంగా తమ దేశాలకు వెళ్లలేకపోతున్నారు.వీసా పొడిగింపు, జరిమానా మాఫీభారత ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు ఇలా ఉన్నాయి..గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న అన్ని రకాల వీసాలకు ఒక నెల పాటు పొడిగింపు.కేసు ప్రాతిపదికన ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా ఈ పొడిగింపు మంజూరు.ఫిబ్రవరి 28, 2026 తర్వాత ఎక్కువ కాలం బస చేసిన విదేశీయులపై విధించే జరిమానా పూర్తిగా మాఫీ.ఎగ్జిట్ పర్మిట్, తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్‌పై సడలింపుయుద్ధ పరిస్థితుల వల్ల చిక్కుకుపోయిన విదేశీయులకు భారత్ మరిన్ని సడలింపులు ప్రకటించింది.అవసరమైన విదేశీయులకు ఎగ్జిట్ పర్మిట్లు ఉచితంగా జారీ.ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేయకపోవడం వలస చట్ట ఉల్లంఘనగా పరిగణించరు.విమానాల మళ్లింపు కారణంగా భారత్‌కు వచ్చే విదేశీయులకు తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్ (TLP) మంజూరు.ముందుగానే సూచనలుమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రారంభమైన వెంటనే, మార్చి 1న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశీ పౌరులకు సూచనలు జారీ చేసింది. వీసా పొడిగింపు లేదా బసను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉన్నవారు తమ సమీపంలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)ను సంప్రదించాలని సూచించింది.

IndiGo Flights To Get Costlier As It Imposes Fuel Surcharge Amid Iran War3
ఇండిగో విమాన టికెట్లపై ఇంధన సర్‌చార్జీలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంతో విమాన ఇంధన ధరలు భగ్గుమన్న నేపథ్యంలో దేశీయంగా విమానయాన సంస్థలు టికెట్లపై అదనపు చార్జీలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా చార్జీలు పెంచేయగా, తాజాగా ఇండిగో కూడా అదే బాట పట్టింది. మార్చి 14 నుంచి (నేడు) దేశీ, విదేశీ రూట్లలో బుక్‌ చేసుకునే టికెట్లపై రూ. 425 నుంచి రూ. 2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తున్నట్లు వెల్లడించింది.దేశీ రూట్లు, భారత ఉపఖండంలో తిరిగే ఫ్లయిట్లకు ఫ్యుయల్‌ చార్జ్‌ రూ. 425గా, పస్చిమాసియా సర్వి సులకు రూ. 900గా ఉంటుందని సంస్థ తెలిపింది. ఇక ఆగ్నేయాసియా, చైనా, ఆఫ్రికా ఫ్లయిట్లకు రూ. 1,800గా, యూరప్‌ రూట్లలో రూ. 2,300గా చార్జీ ఉంటుంది. ఇప్పటికే ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ దేశీ రూట్లలో విధిస్తున్న రూ. 399 కన్నా ఇది అధికంగా ఉండటం గమనార్హం. ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్‌ వాటా 40 శాతం ఉంటుంది.

Rupee falls 5 paise to 92.30 against dollar4
పాతాళానికి రూపాయి

ముంబై: చమురు ధరల సెగతో దేశీ కరెన్సీ విలువ కరుగుతూనే ఉంది. తాజాగా డాలరుతో మారకంలో రూపాయి 5 పైసలు క్షీణించి 92.30 వద్ద ముగిసింది. వెరసి వరుసగా మూడో రోజు సరికొత్త కనిష్టానికి చేరింది. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.5 శాతం పుంజుకుని 102 డాలర్ల ఎగువకు చేరడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 0.5 శాతం బలపడి 100ను అధిగమించడం రూపాయిని దెబ్బతీశాయి.దీంతో ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 92.33 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి ఇంట్రాడేలో 92.47 వద్ద మరోసారి చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు కొనసాగుతుండటం సైతం రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Fitch raises India GDP growth projection for FY26 to 7. 5 Percent5
ఈ ఏడాది జీడీపీ జోరు

న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 7.5 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.7%, 2027–28లో 6.5% మేర వృద్ధి నమోదవుతుందని తాజా అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4%, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.4% చొప్పున వృద్ధి ఉంటుందని లోగడ పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 2026లో బ్యారెల్‌కు సగటున 70 బ్యారెళ్ల స్థాయిలో ఉంటుందని అంచనా వ్యక్తం చేసింది.దేశీ డిమాండ్‌ ఈ ఏడాది వృద్ధిని నడిపించే కీలక అంశమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల వ్యయాలు 8.6%, పెట్టుబడులు 6.9% చొప్పున పెరుగుతాయని తెలిపింది. 2025 డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి 7.8%కి పరిమితం కావడం తెలిసిందే. గతేడాది సెపె్టంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4%గా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఆర్థిక కార్యకలాపాలు భారత్‌లో నిదానించినట్టు సంకేతాలు కనిపిస్తున్నా యంటూ, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, రుణ వితరణలో రెండంకెల వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. పెట్టుబడుల వృద్ధి పుంజుకుంటుంది.. స్వల్పకాలంలో పెట్టుబడుల వృద్ధి మందగించొచ్చని, సులభతర ఆర్థిక పరిస్థితులు, కనిష్ట స్థాయిలో వడ్డీ రేట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధ భాగంలో పుంజుకోవచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఈ ఏడాది, వచ్చే ఏడాదికి వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయిల్లోనే స్థిరపడొచ్చని పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2.6 శాతం ప్రపంచ జీడీపీ 2026లో 2.6%గా ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఇరాన్‌ యుద్ధంతో ఇంధన ధరలు భారీగా పెరగకపోవచ్చని భావిస్తూ ఈ అంచనాకు వచి్చంది. ఒకవేళ చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరి, అక్కడే కొనసాగితే అది ప్రపంచ సరఫరా వ్యవస్థకు పెద్ద షాక్‌గా మారుతుందని తెలిపింది. హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసిన నేపథ్యంలో క్రూడ్‌ ఈ నెలాఖరు వరకు 90–100 డాలర్ల స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది.

Star Health Settles Claims Worth Rs 1150 Crore in Telugu States: Himanshu Walia6
తెలుగు రాష్ట్రాల్లో రూ. 1,150 కోట్ల క్లెయిమ్‌ల సెటిల్మెంట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆరోగ్య బీమా సంస్థ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ 2026 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు తెలుగు రాష్ట్రాల్లో 1.7 లక్షల క్లెయిమ్‌లకు సంబంధించి రూ. 1,150 కోట్లు సెటిల్‌ చేసింది. 24 లక్షల మందికి పైగా బీమా కవరేజీ అందిస్తోంది. నగదురహిత క్లెయిమ్స్‌లో 96% క్లెయిమ్స్‌ని 3 గంటల వ్యవధిలోనే సెటిల్‌ చేస్తున్నట్లు సంస్థ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ హిమాంశు వాలియా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 75 శాఖల వ్యాప్తంగా 89,000 మంది అడ్వైజర్లు, 1,800 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయని, తమ వ్యాపారంలో ఈ రాష్ట్రాల వాటా 10%గా ఉంటుందని చెప్పారు.బీమా పాలసీలను మరింత చౌకగా పెద్ద సంఖ్యలో ప్రజలకు అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను పాలసీదారులకు పూర్తిగా బదలాయించామని, ప్రీమియంలు సైతం పెంచలేదని పేర్కొ న్నారు. కృత్రిమ మేధ దన్నుతో 20 శాతం క్లెయిమ్‌లను పరిష్కరిస్తుండగా, వచ్చే రెండేళ్లలో దీన్ని 50%కి పెంచుకోనున్నామని హిమాంశు తెలిపారు. ఇందుకోసం టెక్నాలజీపై గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement