Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

stock market updates on 21 April 20261
350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 94 పాయింట్లు పెరిగి 24,462 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 351 పాయింట్లు ఎగబాకి 78,872 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.13బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 95.06 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.24 శాతం తగ్గింది.నాస్‌డాక్‌ 0.26 శాతం నష్టపోయింది.Today Nifty position 21-04-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Rising Prices Stagnant Wages Silent Struggle of India Middle Class2
టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సగటు వేతన జీవి పోరాటం అంతా ఆ నాలుగు మెతుకుల కోసమే. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సామాన్యుడికి భారంగా మారుతోంది. అంతర్జాతీయంగా ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మన కర్రీ పాయింట్లలో కరీ ప్యాకెట్ ధర పెరుగుతుంది. గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకితే రోడ్డు పక్కన బండి మీద ఇడ్లీ ధర మారుతుంది. ధరలు పెరిగిన ప్రతిసారీ సర్దుకుపోవడం సామాన్యుడికి అలవాటైపోయింది. కానీ ఆ సర్దుబాటు ఇప్పుడు అతని ఆకలిని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది.వ్యాపారులకు ఖర్చులు పెరిగాయన్నది నిజమే కావచ్చు, కానీ పరిస్థితులు చక్కబడ్డాక పెంచిన రేట్లను తగ్గించే మనసు మాత్రం ఏ వ్యాపారికీ రాదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఒక పక్క కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని సాకులు చెబుతూ ఉద్యోగి జీతంలో వందల రూపాయల పెంపునకు కూడా వెనకాడుతుంటే.. అదే కంపెనీల యజమానులు మాత్రం కుబేరుల జాబితాలో పోటీ పడుతున్నారు. ఈ అంతరం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక అశాంతికి పునాది.ఆకాశమే హద్దుగా ధరలుఒకప్పుడు రూ.20 ఉన్న కర్రీ ప్యాకెట్ నేడు రూ.30కి(కొన్ని ప్రదేశాల్లో మారుతుంటుంది) చేరింది. అంటే ఒక్కసారిగా 50 శాతం పెరుగుదల. కేవలం కర్రీ పాయింట్లే కాదు, టిఫిన్ సెంటర్లలో రూ.30 ఉండే ప్లేట్ ఇడ్లీ నేడు రూ.45కి చేరింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లలో ఈ ధరల పెరుగుదల మరింత తీవ్రంగా ఉంది. గ్యాస్ సిలిండర్ ధరలు, వంట నూనెలు, కూరగాయల ధరల పెరుగుదలను సాకుగా చూపిస్తూ అటు బడా హోటళ్లు, ఇటు వీధి వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు.అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడి, ముడి చమురు లేదా గ్యాస్ ధరలు తగ్గినా.. పెంచిన ఈ ధరలను మళ్లీ తగ్గించడం అనేది మన మార్కెట్ సంస్కృతిలో దాదాపు అసాధ్యం.పెరగని జీతాలు.. కార్పొరేట్ లాభాలువస్తువుల తయారీ ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయని సాకు చూపుతున్న కంపెనీలు ధరల భారమంతా వినియోగదారుడిపైనే మోపుతున్నాయి. కానీ, అదే నిష్పత్తిలో తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల జీతాలను పెంచుతున్నాయా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. వార్షికంగా ధరల పెరుగుదల 30-50 శాతం ఉంటే సగటు వేతన జీవి జీతాల పెరుగుదల మాత్రం 5 నుంచి 8 శాతం లోపే ఉంటోంది. మరోవైపు, ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయని వాపోతున్న కంపెనీల యజమానులు మాత్రం ఫోర్బ్స్ వంటి ప్రపంచ ధనవంతుల జాబితాలో తమ ర్యాంకులను మెరుగుపరుచుకుంటున్నారు.సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై అధిక శాతం ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతుంటే అది సామాజిక అశాంతికి దారితీస్తుంది.పరిష్కార మార్గాలుప్రభుత్వాలు చేయాల్సినవి..ధరల నియంత్రణ కమిటీలు: నిత్యావసర వస్తువుల ధరలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం ఉండాలి. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గినా ధరలు తగ్గించని సిండికేట్లపై చర్యలు తీసుకోవాలి.వేతన సవరణ చట్టం: కేవలం కనిష్ట వేతనం మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రైవేటు రంగంలోనూ కనీస వార్షిక ఇంక్రిమెంట్లు ఉండేలా నిబంధనలు తీసుకురావాలి.ప్రజా రవాణా పటిష్ఠం: సామాన్యుడి జేబుకు చిల్లు పడే మరో ప్రధానాంశం రవాణా. ప్రజారవాణాను చౌకగా అందుబాటులోకి తెస్తే కొంత ఊరట లభిస్తుంది.ప్రజలు చేయాల్సినవి..ఆర్థిక క్రమశిక్షణ: అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ సంస్కృతికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.నైపుణ్యాభివృద్ధి: మారుతున్న ఆర్థిక వ్యవస్థలో కేవలం జీతంపైనే ఆధారపడకుండా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలి.వినియోగదారుల హక్కులు: అన్యాయంగా ధరలు పెంచే వ్యాపార సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండి వినియోగదారుల ఫోరమ్ ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి.అభివృద్ధి అంటే కేవలం జీడీపీ అంకెలు పెరగడం కాదు.. సగటు సామాన్యుడి కొనుగోలు శక్తి పెరగడం. సంపద పంపిణీలో సమతుల్యత లేకపోతే అది దేశ పురోగతికి ఆటంకమవుతుంది. ఇప్పటికైనా పాలకులు, పారిశ్రామికవేత్తలు సామాన్యుడి బతుకు బండిని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్..

India Auto Sector Embraces Historic Shift Flexible CAFE 3 Norms update3
కాలుష్యంపై ఉక్కుపాదం

భారత ఆటోమొబైల్ రంగం ఒక చారిత్రాత్మక పరివర్తన దిశగా అడుగులు వేస్తోంది. 2027-32 కాలానికి సంబంధించి సవరించిన ‘కార్పొరేట్ యావరేజ్‌ ఫ్యుయెల్‌ ఎఫిషియెన్సీ’ (కేఫ్‌-3) నిబంధనలపై ప్రభుత్వం, పరిశ్రమ వర్గాల మధ్య ఒక సానుకూల ఏకాభిప్రాయం కుదరడం శుభ పరిణామం. గతంలో ప్రతిపాదించిన కఠిన నిబంధనలు వాహన తయారీదారులలో కొంత ఆందోళన కలిగించాయి. అయితే, తాజా ముసాయిదాలో ప్రభుత్వం వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించింది.గతంలో ప్రతిపాదన ప్రకారం.. ఐదేళ్ల పాటు స్థిరంగా 0.002 స్లోప్ కోఎఫీషియంట్(ఇది వాహనం బరువు, అది వినియోగించాల్సిన ఇంధన పరిమితి మధ్య ఉండే సంబంధాన్ని నిర్ణయిస్తుంది) గుణకాన్ని కొనసాగించాలని భావించారు. కొత్త నిబంధనల ప్రకారం.. దీన్ని 2027-28కి 0.00158కి, 2031-32 నాటికి 0.00131కి తగ్గించారు. దీనివల్ల తయారీదారులకు ఇంధన సామర్థ్య లక్ష్యాలను చేరుకోవడంలో సౌలభ్యం లభిస్తుంది. ముఖ్యంగా సబ్-4 మీటర్ల వాహన(4 మీటర్ల కంటే తక్కువ పొడువు) విభాగంలో తయారీదారులకు ఇది కలిసొచ్చే అంశం.ప్రభుత్వం కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మీదనే భారం వేయకుండా బహుళ సాంకేతిక మార్గాలను పరిగణలోకి తీసుకుంది. హైబ్రిడ్‌, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, బయో-ఫ్యూయల్స్ వాడకాన్ని ఈ ముసాయిదా స్పష్టంగా ప్రోత్సహిస్తోంది. స్టార్ట్-స్టాప్ సిస్టమ్స్, థర్మల్ మేనేజ్మెంట్ వంటి చిన్న మార్పుల ద్వారా వచ్చే సామర్థ్య లాభాలను కూడా లెక్కలోకి తీసుకోవడం విశేషం. దీనివల్ల ఐసీఈ ఇంజిన్లను ఆప్టిమైజ్ చేస్తూనే కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టే వీలు తయారీదారులకు కలుగుతుంది.క్రెడిట్-డెబిట్ విధానంపరిశ్రమలో అత్యంత సానుకూల స్పందన లభించిన అంశం 'పాస్ బుక్ సిస్టమ్'. లక్ష్యానికి మించి ఇంధన సామర్థ్యాన్ని సాధించే కంపెనీలు క్రెడిట్లను పొందుతాయి. వీటిని భవిష్యత్తులో లోటు ఏర్పడినప్పుడు సర్దుబాటు చేసుకోవచ్చు. బ్లాక్ పీరియడ్స్ (మొదట 3 ఏళ్లు, తర్వాత 2 ఏళ్లు)గా విభజించడం వల్ల సరఫరా గొలుసులో వచ్చే ఆకస్మిక అంతరాయాల నుంచి కంపెనీలకు రక్షణ లభిస్తుంది.అమలులోనే అసలు పరీక్షప్రభుత్వం రోడ్ మ్యాప్ ఇచ్చింది. సౌలభ్యాలను కల్పించింది. ఇక ఆటోమొబైల్ సంస్థల తీరు కీలకం కానుంది. కేవలం నిబంధనల కోసం కాకుండా ఈ కేఫ్‌-3 నిబంధనలను ఒక వ్యూహాత్మక మార్పుగా స్వీకరించాలి. అప్పుడే భారత్‌ గ్లోబల్ ఆటో హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలదు.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్..

RBI Governor Malhotra Stresses Wait and Watch Policy Global Tensions4
అనిశ్చితి సమయాల్లో ‘వెయిట్‌ అండ్‌ వాచ్‌’

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులో అంతరాయాలు వంటి అనిశ్చిత పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుసరిస్తున్న వేచి చూసే ధోరణి అత్యంత కీలకమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇటీవల అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ద్రవ్య విధానంలో చురుకైన మార్పులు చేయడం అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రసంగ సారాంశాన్ని తాజాగా ఆర్‌బీఐ తన వెబ్‌సైట్‌లో అధికారికంగా అందుబాటులో ఉంచింది.తటస్థ వైఖరితోనే వెసులుబాటుఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని ద్రవ్య విధాన సమీక్షల్లో ఆర్‌బీఐ తటస్థ వైఖరినే కొనసాగిస్తోంది. ఇది దేశీయ ద్రవ్యోల్బణం, వృద్ధి గమనానికి అనుగుణంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్‌కు అవసరమైన సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మా విధానం పూర్తిగా డేటా ఆధారితంగా ఉంటుంది. ప్రమాదాల సమతుల్యతను మేము నిరంతరం అంచనా వేస్తున్నాం. అందుకే ప్రస్తుతానికి వేచి చూడటం అనే పంథాను ఎంచుకున్నాం’ అని ఆయన తెలిపారు.అంతర్జాతీయ సవాళ్లుపశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ సవాళ్లపై స్పందిస్తూ సరఫరా వ్యవస్థలో తలెత్తే అంతరాయాలు ద్రవ్యోల్బణంపై చూపే ప్రభావం పట్ల అప్రమత్తంగా ఉండాలని మల్హోత్రా హెచ్చరించారు. సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగి అవి ఇతర రంగాలకు వ్యాపించి ద్రవ్యోల్బణ అంచనాలను పెంచితే అది ఆందోళన కలిగిస్తుంది. అటువంటి సమయంలో కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన సూచించారు.ప్రపంచ వృద్ధిలో అగ్రగామిగా భారత్గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధిని వివరిస్తూ చైనా వంటి అగ్ర దేశాల కంటే భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచిందని మల్హోత్రా ప్రకటించారు.భారత సగటు వార్షిక వృద్ధి: 6.1%చైనా: 5.6%ఇండోనేషియా: 4.2%ప్రపంచ ఆర్థిక వృద్ధి: 3.2%భారతదేశ వృద్ధికి అవసరమైన సులభతర పర్యావరణ వ్యవస్థను అందించడంలో రిజర్వ్ బ్యాంక్ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ స్థిరత్వమే లక్ష్యంగా ముందడుగు వేస్తామని గవర్నర్ తెలిపారు.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్..

India core sector dips in March due to West Asia crisis5
నిదానించిన మౌలిక రంగం 

న్యూఢిల్లీ: కీలక మౌలిక రంగాల పనితీరు మార్చి నెలలో నిదానించింది. ఎనిమిది రంగాల్లో ఉత్పత్తి క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 0.4 శాతం తగ్గింది. ఐదు నెలల్లో మౌలిక రంగం ఉత్పత్తి తగ్గడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా బొగ్గు, ముడి చమురు, ఎరువులు, విద్యుదుత్పత్తి క్షీణించడం మొత్తం మీద పనితీరును పరిమితం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 8 మౌలిక రంగాల పనితీరు నికరంగా 2.8% పెరగడం గమనార్హం. 2025–26 మొత్తం మీద ఈ రంగాలు 2.6% వృద్ధిని నమోదు చేశాయి. 2024–25లో వృద్ధి 4.5%తో పోల్చితే చెప్పుకోతగ్గ స్థాయిలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. రిఫైనరీ ఉత్పత్తుల తయారీ 0.1%, స్టీల్‌ ఉత్పత్తి 2.2%, సిమెంట్‌ ఉత్పత్తి 4% చొప్పున మార్చి నెలలో తగ్గాయి. సహజ వాయువు ఉత్పత్తి మాత్రం పెరిగింది. 4 రంగాల ఉత్పత్తి క్షీణించడంతో, ఐదు నెలల్లో తొలిసారి కీలక మౌలిక రంగాల పనితీరు తగ్గినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధంతో ముడి సరుకుల సరఫరా తగ్గడం ఎరువుల ఉత్పత్తిని ప్రభావితం చేసినట్టు చెప్పారు. దీంతో మార్చి నెలలో పారిశ్రామిక రంగం (ఐఐపీ) వృద్ధి 1–2%కి తగ్గిపోవచ్చని నాయర్‌ అంచనా వేశారు. ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి 5.2%గా ఉంది.

Vedanta is set to split into five separately listed companies6
5 కంపెనీలుగా వేదాంతా!

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా మే 1 నుంచి 5 కంపెనీలుగా విడిపోనుంది. దీంతో అల్యూమినియం, మర్చంట్‌ పవర్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ముడిఇనుము విభాగాలు ప్రత్యేక లిస్టెడ్‌ కంపెనీలుగా విడిపోనున్నాయి. వెరసి స్వతంత్ర కంపెనీలుగా వేదాంతా అల్యూమినియం మెటల్‌ (వీఏఎంఎల్‌), తల్వాండి సాబో పవర్‌ (టీఎస్‌పీఎల్‌), మాల్కో ఎనర్జీ(ఎంఈఎల్‌), వేదాంతా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ (వీఐఎస్‌ఎల్‌) ఏర్పాటు కానున్నాయి. అంతేకాకుండా ప్రస్తుత వేదాంతా (మాతృ సంస్థ) లిస్టెడ్‌ కంపెనీగా కొనసాగనుంది. విడదీత (డీమెర్జర్‌) మే 1నుంచి అమల్లోకి వచ్చేందుకు సోమవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వేదాంతా వెల్లడించింది. విడదీయనున్న బిజినెస్‌లతో సంప్రదించాక రికార్డ్‌ డేట్‌ను నిర్ణయించినట్లు తెలియజేసింది. ఈ పథకం ప్రకారం అర్హులైన వేదాంతా వాటాదారులకు 1:1 నిష్పత్తిలో ఇతర కంపెనీల షేర్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలియజేసింది. స్వతంత్ర బిజినెస్‌లుగా ఏర్పాటుకావడం ద్వారా సంబంధిత రంగాలపైనే దృష్టి సారించేందుకు వీలుంటుందని వేదాంతా పేర్కొంది. దీంతో వెల్త్‌ ఫండ్స్‌ తదితర గ్లోబల్‌ ఇన్వెస్టర్లు, రిటైలర్లు, వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు ప్రత్యేకించిన రంగాలలో పెట్టుబడులకు అవకాశం ఉంటుందని వివరించింది. ఇతర వివరాలివీ...అల్యూమినియం సంబంధిత మారి్పడిరహిత డిబెంచర్లను(ఎన్‌సీడీలు) వీఏఎంఎల్‌కు బదిలీ చేయనున్నట్లు వేదాంతా వెల్లడించింది. వీటితోపాటు భారత్‌ అల్యూమినియం కంపెనీ(బాల్కో)లో వాటాలు సైతం బదిలీ చేయనుంది. అంతేకాకుండా తల్వాండీ సాబో పవర్‌ను వేదాంతా పవర్‌(వీపీఎల్‌)గా, మాల్కో ఎనర్జీని వేదాంతా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌(వీఓజీఎల్‌)గా మార్పు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్‌ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 771 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement
Advertisement