Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Prices Crash in India Today Sharp Drop in Hyderabad Delhi Chennai More1
పసిడి ధరల పతనం.. ఊహకందని రీతిలో ఇలా!

భారతదేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఈ రోజు భారీ పతనాన్ని చవి చూసింది. దీంతో ఒక్కసారిగా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉంది?, సిల్వర్ ధరల్లో ఏమైనా మార్పు కనిపించిందా? అనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2780 తగ్గి 1,50,930 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 2550 రూపాయలు తగ్గి రూ.1,38,350 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో గోల్డ్ రేటు వరుసగా రూ.1420, రూ.1300 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 153820 రూపాయల వద్ద, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.141000 వద్ద నిలిచాయి. ఈ ధరలు నిన్నటి (మంగళవారం)తో పోలిస్తే చాలా తక్కువ.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు పతనమయ్యాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,51,080 (రూ.2780 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,38,500 (రూ.2550 తగ్గింది) వద్ద ఉంది.వెండి ధరలు ఇలాబంగారం మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేటు రూ.2.65 లక్షలు (రూ.5000 తగ్గింది) వద్ద, ఢిల్లీలో రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా!

RBI Approves Mobikwik NBFC License2
ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్‌.. మొబిక్విక్‌కు NBFC లైసెన్స్‌!

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా సేవలు అందించేందుకు వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ చేసుకున్న దరఖాస్తుకు ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ జారీ చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించినట్టు సంస్థ ప్రకటించింది. దీంతో రుణ విభాగం ‘మొబిక్విక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌’ను ఆరంభించేందుకు అవకాశం లభించిందని, తమ రుణ వ్యాపార అవకాశాల విస్తరణకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.వర్తకులు, వినియోదారులకు మరింత విస్తృతమైన సేవలకు వీలు కల్పిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నాలుగు నెలల్లోనే తమ దరఖాస్తుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని, తమ గ్రూప్‌ విశ్వసనీయతకు ఇది నిదర్శనమని మొబిక్విక్‌ సహ వ్యవస్థాపకురాలు, ఈడీ ఉపాసనా టకు పేర్కొన్నారు. తమ గ్రూప్‌నకు ఉన్న 18.6 కోట్ల యూజర్ల బేస్, బలమైన టెక్నాలజీ వసతులు, వసూలు సామర్థ్యాల పునాదులపై ఎన్‌బీఎఫ్‌సీని నిర్మించనున్నట్టు చెప్పారు.

UK Student Spends Over Rs 1 Crore On Degree But Fails To Land Job After 500 Applications3
డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు!

బ్రిటన్‌లో యువ ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా ఉంటాయనే విషయాన్ని 21 ఏళ్ల గ్రాడ్యుయేట్ ఖాలెద్ షరీఫ్ వెల్లడించారు. లండన్ శివార్లలోని కింగ్‌స్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిజిటల్ మీడియా టెక్నాలజీలో డిస్టింక్షన్‌తో పట్టభద్రుడైనప్పటికీ, అతనికి ఉద్యోగం దొరకలేదు.ఖాలెద్ షరీఫ్ సుమారు 500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్కటి కూడా సాధించలేకపోవడం అతని నిరాశను పెంచింది. 100,000 పౌండ్లకు (రూ. కోటి కంటే ఎక్కువ) పైగా ఖర్చు పెట్టి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా అవకాశాలు లభించకపోవడం.. వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే భావన కలిగించింది.ఈజిప్టులో జన్మించి, ఖతార్‌లో పెరిగి, 18 ఏళ్ల వయసులో లండన్‌కు వెళ్లిన షరీఫ్, బ్రిటిష్ రాజధాని తనకు వృత్తిపరంగా అవకాశాలను కల్పిస్తుందని ఆశించాడు. కానీ అతని ఆశలు ఫలించలేదు. కోవిడ్19 ప్రభావం, కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి కూడా ఉద్యోగ అవకాశాల తగ్గుదలకు కారణమని అతను అభిప్రాయపడ్డాడు.కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తూ కొత్త ఉద్యోగులను నియమించడాన్ని తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ, సాధారణ ఉద్యోగం చేసుకోవడం కంటే తన చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని అతను కోరుకుంటున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఖాలెద్ వెనుకడుగు వేయలేదు. ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ తన సృజనాత్మకతను కొనసాగిస్తున్నాడు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''అంతే కాకుండా.. ''జోక్'' అనే దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించి, తన ఆసక్తులను వ్యాపారంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని అనుభవం ప్రకారం.. యూనివర్సిటీలో నేర్చుకున్నదానికంటే.. స్వయంగా నేర్చుకున్న నైపుణ్యాలే వృత్తిలో ఎక్కువ ఉపయోగపడుతున్నాయి.

Anant Ambani Appeals To Colombia To Save 80 Hippos4
'ఆ 80 హిప్పోలను చంపకండి': అనంత్ అంబానీ లేఖ

కొలంబియాలోని మగ్డలేనా నది పరివాహక ప్రాంతంలో.. ఒక పర్యావరణ సమస్య తలెత్తింది. ఇక్కడ సుమారు 200 వరకు హిప్పోపొటమస్‌లు జీవిస్తున్నాయి. వీటి వల్ల స్థానిక జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, మనుషుల భద్రతపై ప్రభావం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కొలంబియా ప్రభుత్వం 80 హిప్పోలను చంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆపాలని అనంత్ అంబానీ కొలంబియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వంతారా స్థాపకులు అయిన అనంత్ అంబానీ.. హిప్పోలను చంపాలనే నిర్ణయం సరికాదని వెల్లడించారు. జంతువులను చంపడం కంటే, వాటిని సురక్షితంగా మరో ప్రదేశానికి తరలించడం ఒక మంచి పరిష్కారం అని అన్నారు. ఈ విషయంపై కొలంబియా పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్‌కు ఒక లేఖ రాశారు.అనంత్ అంబానీ రాసిన లేఖలో.. 80 హిప్పోపొటమస్‌లను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారాకు తరలించవచ్చని, ఇక్కడ జంతువులకు అనుకూలమైన సహజ వాతావరణం, వైద్య సదుపాయాలు, శాశ్వత సంరక్షణ అందుబాటులో ఉంటాయని చెప్పారు. జంతువులను చంపడం కంటే.. ఇది సరైన ప్రత్యామ్నాయం అని అన్నారు.''ఆ ఎనభై హిప్పోలు తాము ఎక్కడ పుట్టాలో ఎంచుకోలేదు, అలాగే తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా సృష్టించుకోలేదు'' కాబట్టి వాటిని చంపడం తగదు. సురక్షితమైన పరిష్కారం ద్వారా వాటిని కాపాడే సామర్థ్యం మనకు ఉంటే, ప్రయత్నించాల్సిన బాధ్యత మనపై ఉందని అనంత్ అంబానీ అన్నారు.వంతారా గురించిగుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా, ప్రపంచంలోనే అతిపెద్ద. అత్యంత అధునాతన వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ.. పరిరక్షణ కేంద్రాలలో ఒకటి. అనంత్ అంబానీ దీనిని 3000 ఎకరాల్లో (కృత్రిమ అడవి) ఏర్పాటు చేసి.. జంతువులకు రక్షిస్తున్నారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా.. సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.

Stock Market Closing Update 28th April 20265
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 416.73 పాయింట్లు లేదా 0.54 శాతం నష్టంతో 76,886.91 వద్ద, నిఫ్టీ 97.00 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 23,995.70 వద్ద నిలిచాయి.అబాన్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లిమిటెడ్, వెరాండా లెర్నింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఊర్జా గ్లోబల్ లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎమామి రియల్టీ లిమిటెడ్, యూనికామర్స్ ఇ-సొల్యూషన్స్ లిమిటెడ్, లక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విసాగర్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

NSE Sells 1 Percent Stake In Indian Gas Exchange To Comply With Regulatory Norm6
ఐజీఎక్స్‌లో 1 శాతం వాటా విక్రయం!

స్టాక్‌ ఎక్స్చేంజీ దిగ్గజం.. ఎన్‌ఎస్‌ఈ తాజాగా ఇండియన్‌ గ్యాస్‌ ఎక్స్చేంజీ(ఐజీఎక్స్‌)లో 1 శాతం వాటా విక్రయించింది. నేచురల్‌ గ్యాస్‌ డెలివరీ ఆధారిత ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐజీఎక్స్‌లో వాటాను నియంత్రణ సంస్థల నిబంధలనమేరకు అమ్మినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ఐజీఎక్స్‌లో ఏ ఒక్క సంస్థ 25 శాతానికి మించి వాటాను కలిగి ఉండటాన్ని పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ నియంత్రణ సంస్థ(పీఎన్‌జీఆర్‌బీ) మార్గదర్శకాలు అనుమతించవు. నేచురల్‌ గ్యాస్‌లో స్పాట్, ఫార్వార్డ్, డెలివరీ ఆధారిత కాంట్రాక్టులకు ఐజీఎక్స్‌ నిర్వహించే ఎల్రక్టానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వీలు కల్పించే సంగతి తెలిసిందే. కాగా.. తాజా వాటా విక్రయం తదుపరి ఐజీఎక్స్‌లో ఎన్‌ఎస్‌ఈ వాటా 25 శాతానికి పరిమితమైంది.2021 మార్చిలో ఎన్‌ఎస్‌ఈ రూ. 19 కోట్లకు ఐజీఎక్స్‌లో 26 శాతం వాటాను సొంతం చేసుకుంది. పీఎన్‌జీఆర్‌బీ నుంచి అనుమతులు పొందడం ద్వారా ఐజీఎక్స్‌కు సహప్రమోటర్‌గా అవతరించింది. దేశీ నేచురల్‌ గ్యాస్‌ ధరల ఆధారంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్‌ డెరివేటివ్స్‌కు తెరతీసేందుకు వీలుగా ఎన్‌ఎస్‌ఈ ఈ నెల మొదట్లో ఐజీఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం విదితమే.వెరసి ఐజీఎక్స్‌ ప్రామాణిక ధరల ఇండెక్స్‌ జీక్సీ ఆధారంగా గ్యాస్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టులకు శ్రీకారం చుట్టనుంది. ఇక మరోపక్క ఐజీఎక్స్‌ ఈ జనవరిలో పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఐపీవో చేపట్టాలని భావిస్తోంది. 2026 జూన్‌లోగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసే వీలున్నట్లు ఎండీ, సీఈవో రాజేష్‌ కుమార్‌ ఎం. పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement