Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Q3 earnings, global trends to drive stock markets this week1
క్యూ3 ఫలితాలే దిక్సూచి 

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాలే నిర్దేశించనున్నాయి. ఫిబ్రవరి 1న ప్రకటించనున్న బడ్జెట్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నప్పటికీ సమీపకాలంలో కార్పొరేట్‌ పనితీరు, గ్లోబల్‌ అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. గత వారాంతాన ఇండెక్స్‌లను ప్రభావితం చేయగల బ్లూచిప్‌ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తోపాటు.. బ్యాంకింగ్‌ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్యూ3 పనితీరు వెల్లడించాయి. ఈ ప్రభావం నేడు(19న) కనిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదేవిధంగా ఈ వారం మరిన్ని కంపెనీలు క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ జాబితాలో బీహెచ్‌ఈఎల్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, డీఎల్‌ఎఫ్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తదితరాలు చేరాయి. వీటితోపాటు పలు మిడ్, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ప్రకటించనున్న ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ట్రంప్‌ ఎఫెక్ట్‌ యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వెనిజువెలా అధ్యక్షుడిని అరెస్ట్‌ చేయడంసహా.. ఇరాన్‌లో అంతర్యుద్ధానికి మద్దతు పలకడం, గ్రీన్‌ల్యాండ్‌ తమదేనంటూ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రక్షణాత్మక పెట్టుబడి సాధానాలుగా భావించే పసిడి, వెండి ధరలు రేసు గుర్రాల్లా పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రిస్క్‌ పెట్టుబడులు నీరసించే వీలున్నట్లు విశ్లేíÙంచారు. మరోపక్క యూఎస్‌తో భారత్‌ వాణిజ్య చర్చలు ఒక కొలిక్కిరాకపోవడం సైతం సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు తెలియజేశారు. విదేశీ గణాంకాలు నేడు చైనా.. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ4) జీడీపీ గణాంకాలు ప్రకటించనుంది. జూలై–సెప్టెంబర్‌(క్యూ3)లో ఎకానమీ 4.8 శాతం ఎగసింది. ఈ బాటలో డిసెంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ అమ్మకాల గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వడ్డీ రేట్లపై స్పందించనుంది. ఇక మరోవైపు యూఎస్‌ క్యూ3 జీడీపీ వృద్ధి రేటు తుది గణాంకాలు విడుదలకానున్నాయి. ఈ నెల 17కల్లా నమోదైన నిరుద్యోగ గణాంకాలు ప్రకటించనుంది. వారం చివర్లో యూఎస్‌తోపాటు.. దేశీయంగా తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ ఇండెక్సులు విడుదలకానున్నాయి. కాగా.. 27 దేశాలతోకూడిన యూరోపియన్‌ యూనియన్‌తో స్వేచ్చా వాణిజ్య చర్చలు తుది దశకు చేరినట్లు వాణిజ్యం, పరిశ్రమల కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించడం సానుకూల అంశమని నిపుణులు పేర్కొన్నారు. నెలాఖరుకల్లా ఒప్పందం ఖరారుకానున్నట్లు మంత్రి తెలియజేశారు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Protect Yourself from Stock Market Scams, Sakshi Special Story2
మొసళ్లుంటాయ్‌... జాగ్రత్త!

స్టాక్‌ మార్కెట్లు అదేపనిగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటిదాకా దూరంగా ఉన్నవాళ్లు కూడా పెట్టుబడి పెడితే బాగుంటుంది కదా అని ఊగిసలాడుతున్నారు. ఇదే అదనుగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఏఐ అండతో ఏకంగా నకిలీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌నే సృష్టిస్తున్నారు. నకిలీ లాభాలు చూపిస్తున్నారు. 10వేలు విత్‌డ్రా చేయనిచ్చి... 10 లక్షలు లాగేస్తున్నారు. కొందరి దగ్గరైతే కోట్లు కొట్టేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్‌లో సాక్షాత్తూ సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ భార్యనే మోసం చేశారంటే మోసగాళ్లు ఏ స్థాయిలో రెచి్చపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. చాలామందికి లాభాల ఆశచూపించి... నకిలీ ఖాతాల్లోకి నగదు వేయించుకుని చెక్కేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే... మార్కెట్‌ ర్యాలీలో భాగంగా కొన్ని అనామకపు షేర్లు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫలానా షేరు కొంటే నెలలో రెండింతలవుతుందంటూ ఎస్‌ఎంఎస్‌లూ వస్తున్నాయి. వీటి వలలో చిక్కుకుని చాలామంది విలవిలలాడుతున్నారు. మరి దీనికి మార్గమేంటి? స్టాక్‌ మార్కెట్‌ అంటే మోసం మాత్రమే కాదు కదా? ఈ మోసాల బారిన పడకుండా ఉండటమెలా? మన డబ్బులు మనం కాపాడుకోవటం ఎలా? ఇదే ఈ వారం బిగ్‌ ‘వెల్త్‌ స్టోరీ’.నకిలీలు, మోసగాళ్ల సంగతి పక్కనబెడితే... ముందుగా మార్కెట్లో ట్రేడవుతున్న షేర్లతోనే ఎలాంటి స్కామ్‌లు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. పంప్‌ అండ్‌ డంప్‌.. పెద్దగా ఎవరికీ తెలియన ఓ అనామకపు షేరు ఉన్నట్టుండి తెరమీదికి వస్తుంది. అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న ఆ షేరు ధర అప్పటికే పెరగటం మొదలవుతుంది. దీనికి గురించి సోషల్‌ మీడియాలో ఫిన్‌ఫ్లుయెన్సర్లు ఊదరగొడతారు. ఊరూపేరూ లేని ఎస్‌ఎంఎస్‌లు కూడా వచ్చేస్తుంటాయి. అప్పటిదాకా ఆ షేరు గురించి తెలియనివారు కొందరు ఇన్వెస్ట్‌ చేయటం మొదలుపెడతారు. కొందరు వేచి చూద్దామని వాచ్‌లిస్ట్‌లో పెడతారు. అది మెల్లగా పెరుగుతుంటుంది. దీంతో అందరూ ఎగబడతారు. అంతే... అప్పటికే దాన్ని కొనిపెట్టుకున్న స్టాక్‌మార్కెట్‌ తిమింగలాలు రేటు పెరిగే కొద్దీ వాటిని అమ్మేస్తుంటారు. బాగా సొమ్ము చేసుకుంటారు. ఒక దశ తర్వాత వేగంగా ఆ షేరు కుప్పకూలుతుంది. మళ్లీ లేచినా... కొద్దిరోజులకే మళ్లీ పడుతుంది. భారీ రేటుకు కొన్న ఇన్వెస్టర్లు ఇరుక్కు పోయినట్లే!!.బాయిలర్‌ రూమ్‌ ఆపరేషన్స్‌ బాయిలర్‌ రూమ్‌లో ఎవరూ ఎక్కువసేపు ఉండలేరు. తక్షణం బయటపడేలా బాయిలర్‌ ఒత్తిడి చేస్తుందన్న మాట. అదే తరహాలో... మంచి తరుణం మించిన దొరకదు, లాస్ట్‌ చాన్స్‌ అంటూ ఊరూ పేరూ లేని, పనికిమాలిన స్టాక్స్‌ను కొనిపించేలా కొందరు బ్రోకర్లు, ఫిన్‌ఫ్లుయెన్సర్లు ఒత్తిడి పెంచుతుంటారు. దాన్ని వాళ్లు సొమ్ము చేసుకుంటారు.శక్తివంతమైన ఆయుధాలున్నాయ్‌.. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు, మన చేతిలోనే కొన్ని శక్తివంతమైన ఆయుధాలున్నాయి. వాటిని కాస్త పదును పెట్టుకుంటే సరి. అవేంటంటే... → ఏ అంశాన్నయినా లోతుగా పరిశీలించాలి.. → కంపెనీ ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలి → కంపెనీ వార్షిక నివేదికలను చదవాలి → వార్తలను విశ్వసనీయ సోర్స్‌ల ద్వారానే ధృవీకరించుకోవాలి → సెబీ ఇన్వెస్టర్‌ హెల్ప్‌లైన్‌ → ఎన్‌ఎస్‌ఈ/బీఎస్‌ఈ అలర్టులు → ప్రామాణికమైన ఫైనాన్షియల్‌ న్యూస్‌ ప్లాట్‌ఫాంలుఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కంపెనీలు బయటకు వెల్లడించని సమాచారం కూడా యాజమాన్యానికి తెలిసి ఉంటుంది. అది సహజం. దీన్ని ఆధారం చేసుకుని యాజమాన్యంగానీ, వారికి దగ్గరగా ఉండే వారు గానీ ఆ కంపెనీ షేర్లలో ట్రేడింగ్‌ చేస్తుంటారు. కంపెనీకి ప్రతికూలంగా ఉండే సమాచారం గనక వారికి తెలిస్తే... షేర్లను విక్రయించేయటం, సానుకూలమైన సమాచారం తెలిస్తే కొని పెట్టుకోవటం చేస్తుంటారు. ఆ తరువాత సమాచారం బయటకు వస్తుంది. దానికి తగ్గట్టుగా షేరు రియాక్ట్‌ అవుతుంది. దీనివల్ల ముందే ట్రేడింగ్‌ చేసిన కంపెనీ ఇన్‌సైడర్లు బాగుపడతారు. కాబట్టే దీన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు. ఇలాంటి సందర్భాల్లో షేరు పెరగడానికి లేదా పడటానికి అసలు కారణాలేంటో తెలియని ఇన్వెస్టర్లు నష్టపోతూ ఉంటారు. పోంజీ, పిరమిడ్‌ స్కీములు ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీములో కొత్తగా ఎవరినైనా చేరిస్తే, భారీగా లాభాలిస్తామంటారు. కానీ అసలు లాభాల్లో నుంచి కాకుండా, కొత్త ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న డబ్బులో కొంత పాత ఇన్వెస్టర్లకు చెల్లిస్తుంటారు. అంతిమంగా ఇలాంటి స్కీములు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాయి. లింకు తెగి అప్పటిదాకా ఇన్వెస్ట్‌ చేసిన వాళ్లంతా కుప్పకూలుతారు.బేసిక్‌ అంశాలను తెలుసుకోవాలి .. పెట్టుబడుల పెట్టే ముందు ఇలాంటి కొన్ని ఆర్థికాంశాల గురించి తెలుసుకుంటే మంచిది. → పీ/ఈ నిష్పత్తి (కంపెనీ లాభాన్ని సంవత్సరాలతో గుణించడమన్న మాట) → ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌ (ఈపీఎస్‌– సదరు కంపెనీ ఒక షేరుకు ఎంత చొప్పున ఆర్జిస్తోంది) → రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌వోఈ– షేర్‌హోల్డర్ల ప్రతి రూ.100కు కంపెనీ ఎంత లాభాన్ని తెస్తోంది) అంకెల గురించి అంతగా అర్థం కాకపోయినా ఫర్వాలేదని, గుడ్డిగా ఇన్వెస్ట్‌ చేసేయొద్దు.ఫాంటమ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వీటినే ఫాంటమ్‌ రిటర్న్స్‌’, ఫాంటమ్‌ అసెట్స్‌ అని కూడా పిలుస్తుంటారు. ఫాంటమ్‌ అనేది ఊహే కదా... అలాగే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కూడా అన్నమాట. అసలు ఉనికిలోనే లేని నకిలీ స్టాక్స్, బాండ్స్, ఫండ్స్‌లాంటి వాటిని అంటగడతారు. నకిలీ లాభాలు చూపిస్తుంటారు. నకిలీ స్టేట్‌మెంట్లు పంపిస్తారు. అంతా రియల్‌ అనుకుని, లాభాలు పెరుగుతుండటం చూసి మరింత పెట్టుబడి పెట్టేస్తుంటారు. ఎప్పుడైనా విత్‌డ్రా చేద్దామని అనుకుంటే... ఆ రోజే మొత్తం సిస్టమ్‌ మాయమైపోతుంది. ఈ మధ్య ఇలాంటివి బాగా పెరిగాయి. మరి తప్పించుకోవటమెలా? మరి ఇన్ని రూపాల్లో మోసగాళ్లు దాడులు చేస్తుంటే మనని మనం కాపాడుకోవటం ఎలా? ఈ సందేహానికి సమాధానం ఒక్కటే... ఆథరైజ్డ్‌ అవునా కాదా అన్నది చూసుకోవటం. రూపాయి పెట్టుబడి పెడుతున్నా సరే, ఇన్వెస్టింగ్‌కు ముందే బ్రోకర్‌ లేదా ప్లాట్‌ఫాం గురించి ధ్రువీకరించుకోవాలి. సెబీలోను, ఎన్‌ఎస్‌ఈ లేదా బీఎస్‌ఈలోను రిజిస్టర్డా కాదా అన్నది తెలుసుకోవాలి. సెబీలో నమోదు చేసుకోనివారికి ఎవరికైనా... పెట్టుబడి సలహాలివ్వడానికి గానీ మీ డబ్బును మేనేజ్‌ చేయడానికి గానీ చట్టబద్ధమైన అర్హత ఉండదు. → గ్యారంటీ రాబడులొస్తాయని చెబితే...! ఎందుకంటే స్టాక్‌మార్కెట్లో రాబడులకు గ్యారంటీ ఉండదు. → వెంటనే నిర్ణయం తీసుకోకపోతే నష్టపోతారంటూ ఒత్తిడి చేస్తే...! ఎందుకంటే ఒత్తిడిలో ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. → అవాంఛిత కాల్స్, మెసేజీలు లేదా ఈమెయిల్స్‌ ద్వారా వచి్చన సమాచారాన్ని నమ్మొద్దు. ఎందుకంటే ఆ సమాచారం సరైనదైతే మీకెందుకు పంపుతారు? వాళ్లే ఉపయోగించుకుంటారుగా!. → నమ్మశక్యం కాని ఆఫర్లు ఇస్తే నమ్మొద్దు → గుర్తు తెలియని ప్రొఫైల్స్‌ లేదా ఫేక్‌ యోగ్యతాపత్రాలు చూపిస్తే పట్టించుకోవద్దు → ఎవరైనా సరే ‘‘మీ డబ్బు చాలా వేగంగా రెట్టింపవుతుంది’’ అంటూ హామీ ఇస్తున్నారంటే, అది సలహా కాదు, అలర్టవ్వాల్సిన విషయమని గుర్తుంచుకోవాలి. ఈ ప్రశ్నలు వేసుకోవాలి.. పెట్టుబడికి ముందు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అవేంటంటే.. → అసలు సదరు కంపెనీ ఏం చేస్తుంది? → దాన్ని నడిపేది ఎవరు? వారికి విశ్వసనీయత ఉందా? → ఆదాయం నిజమైనదేనా? నిలకడగా వచ్చేదేనా? → ఈ పెట్టుబడి ఎందుకు పెట్టానో ఎవరు అడిగినా సరళంగా వివరించగలనా? → ఏదైనా తేడా వస్తే బైటపడే మార్గమేంటి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చుకోలేకపోతే, కాస్త ఆగి, ఆలోచించాలి.తప్పుడు రీసెర్చ్‌ రిపోర్టులు కొన్ని ఊరూపేరూ లేని సంస్థల నుంచి రీసెర్చ్‌ రిపోర్టులంటూ బయటికొస్తాయి. వారు కావాలనుకున్న షేరు తాలూకు భవిష్యత్తును ఊదరగొడుతూ చూపిస్తారు. రకరకాల మెయిల్స్‌ ద్వారా ఈ రిపోర్టులు వచ్చి పడుతుంటాయి. నిజమేనని నమ్మి ఇన్వెస్ట్‌ చేస్తే అంతే గతి.అనధికారిక ట్రేడింగ్‌ ఒక్కోసారి కమీషన్‌ కోసం కక్కుర్తి పడి ఏజెంట్లు లేదా బ్రోకర్లు మీ అనుమతి లేకుండా మీ అకౌంట్లో అనధికారికంగా ట్రేడింగ్‌ చేస్తుండవచ్చు. దీన్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి.మోసపూరిత అడ్వైజరీ స్కాములు సడెన్‌గా వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ వస్తుంది. ఫలానా గ్రూపుకు చెందిన నిపుణుడు సలహాలిస్తాడంటూ లింకు పంపిస్తారు. ఆ గ్రూపు లో చేరితే... అప్పటికే కొందరు ఆ ఎక్స్‌పర్ట్‌ను పొగుడుతూ ఉంటారు. మీరిచి్చన సలహా వల్ల నేను లక్షలు సంపాదించానంటూ మెసేజీలు పెడుతుంటారు. ఆ సలహా ఏంటో... ఎప్పుడిచ్చారో కూడా మనకు తెలీదు. ఇలా కొందరు చేస్తుండగానే... ఫలానా చోట ఖాతా తెరిస్తే తాను నేరుగా సలహాలిస్తానంటూ సదరు నిపుణుడు చెబుతాడు. అందులో ఉన్నదంతా ఆ నిపుణుడి మనుషులే కాబట్టి ‘సరే సర్‌’.. అంటారు. అదంతా నిజమని నమ్మి మనం కూడా ఖాతా తెరిచినా... ఎక్స్‌పర్ట్‌కు ఫీజు చెల్లించినా... అంతే సంగతి.ఆన్‌లైన్‌ ఖాతాలను రక్షించుకోవాలి.. డిజిటల్‌ భద్రతకు చెక్‌లిస్ట్‌ → 2–ఫ్యాక్టర్‌ ఆథెంటిఫికేషన్‌ని ఎనేబుల్‌ చేయాలి → బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను వాడాలి → ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దు → సందేహాస్పద లింకులను క్లిక్‌ చేయకుండా జాగ్రత్త వహించాలి → అధికారిక సోర్సుల నుంచే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి ప్రస్తుత ప్రపంచంలో మిమ్మల్ని ముంచినా మీ ఫోనే... మిమ్మల్ని కాపాడగలిగేది కూడా మీ చేతిలోని ఫోనే.ఫ్రాడ్‌ అని అనుమానం వస్తే.. వెంటనే యాక్షన్‌ తీసుకోవాలి. సత్వరం ఫిర్యాదు చేస్తే రికవరీ చేసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఏ మా త్రం జాప్యం చేసినా మోసగాళ్లు తప్పించుకునేందుకు అవ కాశం ఇచి్చనట్లవుతుంది. ఈ కింది వాటికి రిపోర్ట్‌ చేయాలి. → సెబీ ఆన్‌లైన్‌ కంప్లైంట్‌ పోర్టల్‌ → ఎన్‌ఎస్‌ఈ లేదా బీఎస్‌ఈ → మీ బ్రోకర్‌ → లోకల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ఆరోగ్యకరమైన మైండ్‌సెట్‌ పెట్టుబడులకు సంబంధించి ఆరోగ్యకరమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలి. → హైప్‌ని బట్టి కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేయాలి → పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం పాటించాలి. అంటే డబ్బంతా ఒకే దాంట్లో ఇన్వెస్ట్‌ చేయకుండా, కొంత ఈక్విటీ, కొంత డెట్, కాస్తంత బంగారంలో పెట్టుబడి పెడితే ఎటు పోయి ఎటొచ్చీ ఏదైనా పడిపోయినా మరొకటి మెరుగ్గా ఉండటం వల్ల ఓవరాల్‌గా రిసు్కలు తగ్గుతాయి. → ‘హాట్‌ టిప్స్‌’ వెంటబడకూడదు. చేతులు కాల్చుకోకూడదు. → FOMO.. అంటే ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేయకపోతే ఇక ఎప్పటికీ కుదరదు, ఆ మంచి అవకాశం ఇక దొరకనే దొరకదు అన్నట్లుగా ఒక్కోసారి కంగారు పుట్టించే పరిస్థితులు ఎదురవుతుంటాయి. స్కామర్లు ఇలాంటివాటిని ఆయుధాలుగా వాడుకుంటూ ఉంటారు. జాగ్రత్త వహించాలి. → సిసలైన ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది చాలా బోరింగ్‌గానే ఉంటుంది. కానీ అదే మంచిది. ఓపిగ్గా, రీసెర్చ్‌ చేసి, క్రమశిక్షణతోనే పెట్టుబడుల ఫలాలు అందుకోవచ్చు. షార్ట్‌కట్‌లంటూ ఉండవు. స్టాక్‌ మార్కెట్‌ అనేది అన్ని వివరాలను తెలుసుకుని, జాగ్రత్తగా వ్యవహరించే ఇన్వెస్టర్లకు మాత్రమే లాభాలనిస్తుంది. అజాగ్రత్తగా ఉండే వారిని నష్టాలతో శిక్షిస్తుంది. పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉండాలి. అదే సమయంలో అప్రమత్తంగానూ ఉండాలి. రాత్రికి రాత్రి లాభాలు గడించాలనుకోవడం కాకుండా పెట్టుబడిని కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలి!.

Dubai Sets Minimum Monthly Salary for private employees at Rs 1 48 lakh3
దుబాయ్‌లో కొత్త కనీస వేతనం.. మారిన జీతాలు

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటి పౌరుల కోసం కొత్త కనీస వేతనాన్ని ప్రకటించింది. 2026 జనవరి 1 నుండి, ఎమిరాటి ఉద్యోగులకు నెలకు కనీసం 6,000 యూఏఈ దిర్హామ్‌లు (సుమారు రూ.1.48 లక్షలు) ఇవ్వడం తప్పనిసరి. ఇంతకు ముందుక ఇది 5,000 దిర్హామ్‌లుగా (రూ.1.23 లక్షలు) ఉండేది.ఈ నిర్ణయం ప్రైవేట్ రంగంలో ఎమిరాటీలకు అధికారిక వేతన అంతస్తును ఏర్పరచడం ద్వారా ఉద్యోగ ప్రమాణాలను బలోపేతం చేస్తుంది. కొత్త, పునరుద్ధరించిన, లేదా సవరించిన వర్క్ పర్మిట్లకు ఈ వేతన అంతస్తు వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న ఎమిరాటి ఉద్యోగుల వేతనాలను 2026 జూన్ 30 నాటికి సవరించాల్సి ఉంటుంది.నిబంధనలు ఉల్లంఘిస్తే..2026 జూలై 1 నుండి కనీస జీతాల మార్గదర్శకాలను పాటించని కంపెనీలపై కఠిన చర్యలు ఉంటాయి. ఇందులో ఎమిరటైజేషన్ కోటాల నుండి తొలగించడం, కొత్త వర్క్ పర్మిట్లను నిలిపివేయడం వంటివి ఉంటాయి.ప్రవాస కార్మికులకు వర్తిస్తుందా?ఈ కొత్త కనీస వేతనం కేవలం యూఏఈ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. భారతీయులతోపాటు ఇతర ప్రవాస కార్మికులకు అధికారిక కనీస వేతనం వర్తించదు. ప్రవాస కార్మికుల వేతనాలు పరిశ్రమ, నైపుణ్యం, ఒప్పందాల ఆధారంగా మారుతూ వస్తాయి. అయితే, కార్మిక చట్టాల ప్రకారం ప్రాథమిక జీవన అవసరాలు తీర్చేలా యజమానులు వేతనాలను కేటాయించాలి.వేతన మార్గదర్శకాలుమానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) కొన్ని వర్గాల ఉద్యోగుల కోసం సిఫార్సు చేసిన వేతన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లకు కనీస జీతం నెలకు 12,000 దిర్హామ్‌లు, డిప్లొమా/టెక్నీషియన్లకు 7,000 దిర్హామ్‌లు, సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ ఉన్న నైపుణ్య కార్మికులకు 5,000 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది.

Maruti Suzuki Invest Rs 35000 Crore In Developing New Gujarat Plant4
రూ. 35వేల కోట్ల పెట్టుబడి: 10 లక్షల వెహికల్స్!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL).. గుజరాత్‌లోని ఖోరాజ్‌లో కొత్త ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి రూ.35,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల వాహనాలు ఉంటుందని వెల్లడించింది.గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో మారుతి సుజుకి ఎండీ శ్రీయుత్ హిసాషి టకేయుచి ముఖ్యమంత్రికి పెట్టుబడి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా.. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ చర్య భారత్ - జపాన్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' దార్శనికతతో గుజరాత్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటిగా.. ప్రపంచ పెట్టుబడిదారులకు ఒక గమ్యస్థానంగా నిలిచిందని పటేల్ అన్నారు.ఇదీ చదవండి: అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GIDC) అందించిన 1,750 ఎకరాల భూమిలో మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ వారం ప్రారంభంలో కంపెనీ గుజరాత్‌లో తన తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి భూమిని సేకరించడానికి రూ.4,960 కోట్ల ప్రతిపాదనను తన బోర్డు ఆమోదించిందని తెలియజేసింది.Glad to witness the Investment Letter Handover by Maruti Suzuki India Limited to the Government of Gujarat for setting up a mega car manufacturing facility at Khoraj, with an investment of ₹35,000 crore.Guided by the visionary leadership of Hon’ble Prime Minister Shri… pic.twitter.com/Kso6hLmDUL— Bhupendra Patel (@Bhupendrapbjp) January 17, 2026

Bank Holidays Next Week 2026 Jan 19 to 25th5
బ్యాంకులకు వరుస సెలవులు!

2026 జనవరి నెలలో సగం రోజులు పూర్తైపోయాయి. కాగా వచ్చే వారంలో (జనవరి 19 నుంచి 24 వరకు) బ్యాంకు ఎన్ని రోజులు పని చేస్తాయి, సెలవు రోజులు ఎన్ని ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.23 జనవరి (శుక్రవారం): నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు / సరస్వతీ పూజ (శ్రీ పంచమి) / వీర్ సురేంద్రసాయి జయంతి / బసంత పంచమి కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా & త్రిపురలలో బ్యాంకులకు సెలవు.జనవరి 24 (శనివారం): నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు.జనవరి 25 (ఆదివారం): ఆదివారం కారణంగా బ్యాంకు సెలవు.జనవరి 2026లో వారాంతాలతో సహా మొత్తం 16 బ్యాంకు సెలవులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా భారతదేశంలోని అన్ని ప్రభుత్వ & ప్రైవేట్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినంగా పరిగణిస్తాయి. అంతే కాకుండా నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులు. కాగా ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారే అవకాశం ఉంది.అందుబాటులో ఆన్‌లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

Tesla Model Y Gets Up To Rs 2 Lakh Discount6
అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!

చాలారోజుల నిరీక్షణ తరువాత.. అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లా భారతదేశంలో 'మోడల్ వై' లాంచ్ చేసింది. అయితే ప్రారంభం నుంచి దీని అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో కార్లన్నీ.. షోరూంలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ.. వీటి అమ్మకాలను మెరుగుపరచడానికి భారీ ఆఫర్ ప్రకటించింది.టెస్లా ఇండియా.. ప్రస్తుతం ఉన్న స్టాక్ అమ్ముకోవడానికి మోడల్ Y కొనుగోలుపైై రూ. 2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ స్టీల్త్ గ్రేలో పూర్తిగా నలుపు రంగు ఇంటీరియర్‌తో కూడిన స్టాండర్డ్ రేంజ్ వేరియంట్‌కు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో కంపెనీ 300 మోడల్ వైలను దిగుమతి చేసుకుంది. అయితే ఇప్పటికి కూడా 100 యూనిట్లను కూడా అమ్మలేకపోయింది.టెస్లా అమ్మకాలు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టాయి. 2025లో కూడా వరుసగా రెండవ సంవత్సరం సేల్స్ తగ్గినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో చైనా బ్రాండ్ బీవైడీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న పోటీ & కొన్ని కార్ మార్కెట్లలో సబ్సిడీలు తగ్గడం వల్ల అమెరికా, యూరప్, చైనా అంతటా టెస్లా వాటా తగ్గిపోయిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: పెరిగిన బజాజ్ పల్సర్ ధరలు: కొత్త రేట్లు ఇలా..

Advertisement
Advertisement
Advertisement