Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Credit card rule changes from April 2026 alert for Axis Bank YES Bank SBI Card users1
కస్టమర్లకు అలర్ట్‌.. మారిపోతున్న క్రెడిట్‌ కార్డు రూల్స్‌..

దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు ఏప్రిల్ 2026 నుంచి తమ క్రెడిట్ కార్డు నియమాలలో మార్పులు అమలు చేయనున్నాయి. ముఖ్యంగా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు, రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ విధానం, అలాగే కొన్ని చెల్లింపులపై లావాదేవీ ఛార్జీల్లో మార్పులు ఉండనున్నాయి.ఈ మార్పులను ఇప్పటికే యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis Bank), యెస్‌ బ్యాంక్‌ (YES Bank), ఎస్‌బీఐ (SBI Card) తమ వినియోగదారులకు తెలియజేశాయి. కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగదారులు కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకుని తమ ఖర్చు విధానాన్ని సర్దుబాటు చేసుకోవడం మంచిది.యాక్సిస్‌ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్‌లో మార్పులుఏప్రిల్ 12 నుంచి ఎయిర్‌టెల్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు రివార్డ్ స్ట్రక్చర్‌లో కొన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి. వాటిలో ముఖ్యమైనవి..ఎయిర్‌టెల్‌ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్‌ చెల్లింపులపై 25% క్యాష్‌బ్యాక్ కొనసాగుతుంది.ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్ ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే 10% క్యాష్‌బ్యాక్ అందుతుంది.అయితే ప్రతి బిల్లింగ్ సైకిల్‌కు గరిష్ట క్యాష్‌బ్యాక్ పరిమితి ఇప్పుడు బేస్ క్యాష్‌బ్యాక్ క్యాప్‌తో అనుసంధానం అవుతుంది.స్విగ్గీ, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటివరకు ఉన్న 10% క్యాష్‌బ్యాక్ నిలిపివేయనున్నారు.బదులుగా జొమాటో, బ్లింకిట్‌, డిస్ట్రిక్ట్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై 10% వాల్యూ-బ్యాక్ అందించనున్నారు.యెస్‌ బ్యాంక్‌ కొత్త ఛార్జీలుఏప్రిల్ 1 నుంచి యెస్‌ బ్యాంక్‌ యుటిలిటీ బిల్లులు, ట్రాన్స్‌పోర్ట్ చెల్లింపులపై కొత్త పరిమితులు, ఛార్జీలు అమలు చేయనుంది. కొత్త నిబంధనలు ఇలా.. విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులపై నెలవారీ ఖర్చు నిర్దిష్ట పరిమితిని దాటితే 1% ఛార్జీ వసూలు చేస్తారు.కార్డు రకాన్ని బట్టి పరిమితులు ఉంటాయి. యెస్‌ ప్రైవేట్‌ క్రెడిట్‌ కార్డు అయితే నెలకు రూ.1,00,000 వరకు, ప్రీమియం కార్డులైతే రూ.50,000 వరకు, ఇతర కార్డులకు రూ.25,000 వరకు పరిమితులను నిర్ణయించారు.ఈ పరిమితులను దాటిన తర్వాత చేసిన యుటిలిటీ చెల్లింపులపై 1% ఫీజు వర్తిస్తుంది.అదే విధంగా టోల్, బ్రిడ్జ్‌ చెల్లింపులు కూడా నిర్దిష్ట పరిమితిని మించితే 1% ఛార్జీ వసూలు చేస్తారు. అయితే ఒక్క లావాదేవీకి గరిష్ట ఛార్జీ రూ.5,000 వరకు మాత్రమే ఉంటుంది.ఎస్‌బీఐ.. రివార్డ్ పాయింట్ రిడంప్షన్ మార్పులుఎస్‌బీఐ కార్డ్‌ కూడా ఏప్రిల్ 1 నుంచి రివార్డ్ పాయింట్ రిడంప్షన్ విధానంలో కొత్త నియమాలను అమలు చేయనుంది. కొత్త పాలసీ ప్రకారం..స్టేట్‌మెంట్ క్రెడిట్‌గా నెలకు గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్లు మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు.రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ 4,000 పాయింట్ల గుణిజాల్లో మాత్రమే ఉంటుంది.అయితే ఎయిర్‌ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్‌ కార్డ్‌ వంటి కొన్ని కార్డులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది.

Gold and Silver rates on evening 16th March 2026 in Telugu states2
బంగారం ధరల్లో భారీ మార్పు.. సాయంత్రానికే కొత్త రేట్లు

దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. సోమవారం ఉదయం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత ఊరట లభించింది.హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం రూ.450 తగ్గి రూ.1,45,900 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.2050 క్షీణించి రూ.1,44,300 లకు దిగివచ్చింది.అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర సోమవారం ఉదయం రూ.490 తగ్గి రూ.1,59,170 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.2240 కరిగి రూ. 1,57,420 లకు క్షీణించింది.ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్‌ మార్కెట్‌లో ఉదయం స్వల్పంగా కేజీకి రూ.100 తగ్గిన వెండి సాయంత్రానికి రూ.4000 క్షీణించి రూ.2,76,000 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

UAE Recruitment Drive Free Visa Flight Tickets for Selected Candidates3
యూఏఈలో ఉపాధి.. వీసా, విమాన టికెట్‌ ఉచితం

మోర్తాడ్‌(బాల్కొండ): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఉపాధి విస్తరణకు ఏడీఎన్‌హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి ఉచిత నియామకాల మేళా నిర్వహించనున్నాయి. కేటరింగ్‌ విభాగంలో ఇప్పటికే ఎంతో మందికి ఉచితంగానే వీసాలు, విమాన టికెట్‌లు అందించిన ఈ రెండు సంస్థలు.. మరో మూడు విభాగాల్లో ఉచిత వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో మాదిరిగా నిర్ణీత తేదీల్లో నియామకాల ర్యాలీలు కాకుండా వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం సంస్థ చైర్మన్‌ చీటీ సతీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. హెవీ, లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవర్లు, స్టీవార్డింగ్‌ సూపర్‌వైజర్లు, ఆఫీస్‌ బాయ్స్‌గా పని చేయాలనుకునే వారిని నేరుగా ఇంటర్వ్యూ చేస్తామన్నారు. వేతనం, అర్హతల వివరాలు.. హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవర్లు, స్టీవార్డ్‌ సూపర్‌వైజర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.60 వేల చొప్పున, లైట్‌ డ్రైవర్లకు రూ.45 వేలు, ఆఫీస్‌ బాయ్స్‌కు రూ.25 వేల వరకు వేతనాలు చెల్లించనున్నారు. వసతి, భోజన సదుపాయాలు కంపెనీలు కల్పిస్తాయి. డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు యూఏఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. స్టీవార్డ్‌ సూపర్‌వైజర్లుగా పని చేయాలనుకునేవారికి గతంలో గల్ఫ్‌లో పని చేసిన అనుభవం అవసరం. ఆఫీస్‌ బాయ్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ పాసై ఇంగ్లిష్‌ మాట్లాడగలగాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు gulfjobsgtm @gmail.com మెయిల్‌కు వివరాలను పంపించాలని కంపెనీల ప్రతినిధులు సూచించారు. పూర్తి వివరాలకు జీటీఎం సంస్థ కార్యాలయాలు ఉన్న ఆర్మూర్‌ (83320 62299), నిజామాబాద్‌ (93916 61522), జగిత్యాల(83320 42299), సిరిసిల్ల(93916 61522)లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Stock Market closing March 16 Sensex up 939pts auto banks lead recovery4
మార్కెట్‌ అదుర్స్‌.. అదరగొట్టిన ఆటో షేర్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, బ్యాంక్ స్టాక్స్ మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు ట్రేడ్ చివరి దశలో పదునైన లాభాలతో మూడు రోజుల నష్టాల పరంపరను బ్రేక్‌ చేశాయి.నిఫ్టీ 1.11 శాతం లేదా 257.70 పాయింట్ల లాభంతో 23,408.80 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 939 పాయింట్లు లేదా 1.26 శాతం పెరిగి 75,502.85 వద్ద ముగిశాయి.అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎటర్నల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్ సెన్సెక్స్‌లో టాప్ గెయినర్లలో ఉన్నాయి. బీఈఎల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టైటాన్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.65 శాతం నష్టపోయాయి.సెక్టార్ వారీగా చూస్తే ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లలో నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. ఇక నిఫ్టీ రియల్టీ ఇతర సూచీల కంటే తక్కువ పనితీరు కనబరిచింది.

LPG Crisis Drives Massive Demand for Induction Stoves Before Ugadi Ramzan5
గ్యాస్‌ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టౌలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. ఇండక్షన్ స్టౌల కొరత పెరగడంతో.. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడిపదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇండక్షన్ స్టౌల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేమిటి? వరుస పండగల వేళ.. పౌరుల పరిస్థితి ఏమిటి?500 శాతం డిమాండ్ హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది.. అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్ మరో మూడునాలుగు రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండుగ పూట పిండివంటలు చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్‌పీజీ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి.హోటళ్లలో దోశ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్‌లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. బుక్ చేసిన వారం పది రోజులకు గానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ ప్లాట్ ఫారాల్లో.. ఇటు ఆఫ్‌లైన్‌లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ షోరూంలలో కూడా ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టౌల కోసం ఒక్కసారిగా 500 శాతం దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టౌల ఉత్పత్తిని పెంచొచ్చా?ఇండక్షన్ స్టౌల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుంచి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడిపదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డరిచ్చినా.. అవి భారత్‌కు చేరడానికి కనీసం 45 రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క ఇండక్షన్ స్టౌ అని కాకుండా.. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఓటీజీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యపట్టణం లఖ్‌నవూల్లో దాదాపుగా ఇండక్షన్ స్టౌలకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టౌల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2,200 రూపాయలకు దొరికే ఇండక్షన్ స్టౌ ధర ఇప్పుడు 3 వేల రూపాయలకు చేరుకుంది. ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపై స్పందించారు. ఎల్‌పీజీ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందన్నారు. భోపాల్‌లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల విక్రయాలు జరిగేవని... ఇప్పుడు రోజుకు 10 వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడిపదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌ తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.ఏయే రంగాలపై ప్రభావం?గ్యాస్ కొరత దాదాపు అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్‌పీజీ కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతో వంటలు చేసుకుంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్ల రీఫిలంగ్ చార్జీలుంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడం లేదు. దీంతో వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటకరంగంపై పడుతుంది. ఇండక్షన్ స్టౌలు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప.. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వంటకు పెద్దగా ఉపయోగపడవు.రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?ఉగాదికి భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. దీంతోపాటు.. కొత్త మామిడికాయలతో చేసే పులిహోర, పంచభక్ష్య పలహారాలను దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్‌కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో.. గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టౌల లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపించనుంది. ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు.. అంటే మార్చి 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు.

Govt Eases LPG Rules Relief for Hotels Restaurants Catering Nationwide6
కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కేటాయింపు షురూ

దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభాగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను వివిధ రాష్ట్రాలు ప్రారంభించాయి. ఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేటాయింపులు అమల్లోకి వచ్చాయి.ప్రాధాన్యత క్రమంలో పంపిణీప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) రోజువారీ సగటు వినియోగంలో 20 శాతం మేర నియంత్రిత పంపిణీ కోసం కేటాయించాయి. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో రోజుకు సుమారు 1,800 సిలిండర్లను ఈ విధానం కింద పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంపిణీలో ఐదు స్థాయిల ప్రాధాన్యతను నిర్ణయించారు:స్థాయి 1, 2: విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వేలు, విమానాశ్రయాలకు అత్యున్నత ప్రాధాన్యత.స్థాయి 3: రెస్టారెంట్లు, భోజనశాలలకు 42 శాతం వాటా.స్థాయి 4: హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, ట్రస్టులకు 4 శాతం కేటాయింపు.స్థాయి 5: డెయిరీలు, బేకరీలు, స్వీట్ షాపులకు 11 శాతం కేటాయింపు.రాష్ట్రాల వారీగా..కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికే ఢిల్లీ, బిహార్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గృహ వినియోగ గ్యాస్ మళ్లింపును అరికట్టడానికి, వాణిజ్య అవసరాలకు అంతరాయం కలగకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల పండుగల సీజన్‌లో, రద్దీ సమయాల్లో వాణిజ్య గ్యాస్ కొరత తలెత్తకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష

Advertisement
Advertisement
Advertisement