Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Automobile retail sales sustain momentum in November says FADA1
కొనసాగిన పండగ సీజన్‌ జోష్‌..

న్యూఢిల్లీ: పండుగలు అయిపోయినప్పటికీ వాహనాలకు సంబంధించి నవంబర్‌లోనూ ఆ జోష్‌ కొనసాగింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు భారీగా డిమాండ్‌ నెలకొంది. జీఎస్‌టీ 2.0 సంస్కరణలు కూడా తోడు కావడంతో హోల్‌సేల్‌ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ గణాంకాల ప్రకారం హోల్‌సేల్‌ డేటాకి తగ్గట్లే ప్యాసింజర్‌ వాహనాలు, త్రీ–వీలర్ల అమ్మకాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఏర్పడే డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు.. డీలర్‌íÙప్‌ల దగ్గర స్టాక్స్‌ గణనీయంగా పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ద్విచక్ర వాహనాల రిజి్రస్టేషన్లు మాత్రం వార్షికంగా 3 శాతం మేర నెమ్మదించాయి. 2024 నవంబర్‌లో 26,27,617 యూనిట్లు రిజిస్టర్‌ కాగా ఈసారి నవంబర్‌లో 25,46,184 యూనిట్లు రిజిస్టర్‌ అయ్యాయి. పండగల నెల కావడంతో అక్టోబర్‌లోనే భారీగా టూ –వీలర్ల కొనుగోళ్లు జరగడం, పంట సంబంధ చెల్లింపుల్లో జాప్యం, కస్టమర్లకు నచి్చన మోడల్స్‌ అందుబాటులో లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని ఎఫ్‌ఏడీఏ పేర్కొంది. బులిష్ గా పరిశ్రమ.. పంటల దిగుబడులు పటిష్టంగా ఉండటం, పెళ్లిళ్ల సీజన్‌లాంటి అంశాల దన్నుతో టూ–వీలర్లతో పాటు మిగతా వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరుగుతాయని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ సీఎస్‌ విఘ్నేశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున పాలసీపరమైన సంస్కరణలు, మార్కెట్‌ సెంటిమెంట్లు మెరుగుపడటం లాంటి అంశాల మద్దతుతో వచ్చే ఏడాది కూడా ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని పరిశ్రమ ఆశిస్తున్నట్లు సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ చెప్పారు. అమ్మకాలపరంగా ఈసారి నవంబర్‌ తమకు అత్యుత్తమ నెలగా గడిచిందని ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ తెలిపింది. ‘‘గత 40 ఏళ్లలో (కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి) నవంబర్‌ నెలకు సంబంధించి ఈ ఏడాది అత్యుత్తమంగా గడిచింది. గత నెలలో అత్యధికంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి’’ అని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. తమ రిటైల్‌ అమ్మకాలు 31% పెరిగినట్లు వివరించారు. అలాగే ఎనిమిది మోడల్స్‌ విషయంలో ఫ్యాక్టరీ స్థాయిలో కూడా నిల్వలు లేకుండా పూర్తిగా అమ్ముడైపోయినట్లు పేర్కొన్నారు. ఇక చిన్న కార్ల (4 మీటర్ల లోపు పొడవు, 18 శాతం ట్యాక్స్‌ రేటు వర్తించేవి) సంగతి తీసుకుంటే అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 38 శాతం పెరిగాయని బెనర్జీ చెప్పారు. అలాగే పెద్ద కార్ల (40 శాతం పన్ను రేటు వర్తించేవి) విక్రయాలు 17 శాతం పెరిగాయని వివరించారు. పెండింగ్‌లో లక్షన్నర బుకింగ్స్‌ .. మారుతీ సుజుకీ దగ్గర 1,50,000 వాహనాలకు బుకింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల దగ్గర మరో 1,20,000 యూనిట్లు ఉన్నాయి. వెయిటింగ్‌ పీరియడ్‌లను తగ్గించేందుకు, సకాలంలో వాహనాలను డెలివరీ చేసేందుకు సెలవు రోజుల్లో కూడా సిబ్బంది పని చేస్తున్నట్లు బెనర్జీ వివరించారు. డిసెంబర్‌లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అటు టాటా మోటర్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా తదితర దిగ్గజాలు కూడా నవంబర్‌లో భారీ అమ్మకాలు నమోదు చేశాయి. టాటా మోటర్స్‌ అమ్మకాలు 22 శాతం పెరిగి 57,436 యూనిట్లకు చేరాయి.

Why CNG Car Mileage Higher Than Petrol2
అందుకే.. పెట్రోల్ కంటే సీఎన్‌జీ కారు మైలేజ్ ఎక్కువ!

సాధారణంగా పెట్రోల్ కార్లు ఇచ్చే మైలేజ్ కంటే కూడా సీఎన్‌జీ (Compressed Natural Gas) కార్లు ఇచ్చే మైలేజ్ కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఎందుకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందనే విషయం మాత్రమే బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఇంధన రసాయన నిర్మాణంపెట్రోల్ అనేది C8​H18 వంటి హైడ్రోకార్బన్‌ల మిశ్రమం. ఇది ఒక మధ్యస్థాయి పరిమాణం గల అణువు. అయితే సీఎన్జీలో మీథేన్ (CH4) ఉంటుంది. ఇది పరిమాణంలో చిన్నది, తేలికైంది.. కాబట్టి ఇది గాలిలో తేలికగా మండుతుంది, తద్వారా పవర్ డెలివరీ సమర్థవంతంగా సాగుతుంది. ఇది మండే సమయంలో కూడా కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెట్రోల్ అనేది సీఎన్జీతో పోలిస్తే అసంపూర్తిగా మండుతుంది. దీనివల్ల కొంత ఇంధన శక్తి వృధా అవుతుంది. కాబట్టి సీఎన్జీ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.ఎయిర్ ఫ్యూయెల్ రేషియోసీఎన్జీ వాహనాల్లో.. ఎయిర్ - ఫ్యూయెల్ రేషియో (నిష్పత్తి) 17.2:1గా ఉంటుంది. అంటే 17.2 భాగాల గాలికి, ఒక ఫ్యూయెల్ (ఇంధనం) అవసరం అవుతుంది. పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే.. ఈ రేషియో (ఎయిర్:ఫ్యూయెల్) 14.7:1గా ఉంటుంది. దీని ప్రకారం.. ఎక్కువ గాలి ఉండటం వల్ల, సీఎన్జీ పూర్తిగా మండి శక్తిని అందిస్తుంది.ఎనర్జీ కంటెంట్పెట్రోల్‌లో సుమారు 34.2 MJ/L ఎనర్జీ ఉంటుంది, కానీ CNGలో 1 కేజీకి 53.6 MJ ఉంటుంది (MJ-మెగాజౌల్). గ్యాస్ పరిమాణం తక్కువ కాబట్టి వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీ పెరగదు. కానీ CNG ఇంజిన్స్ ఎక్కువ కంప్రెషన్ రేషియోకి అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇది వేడి నష్టం తగ్గించి, ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది.వేడి నష్టం తక్కువCNG తక్కువ వేడి నష్టం కలిగిన ఇంధనం. కాబట్టి మండే (దహనం) సమయంలో వేడి సమర్థవంతంగా ఉపయోగిస్తే, ఇంజిన్ పనితీరు పెరుగుతుంది. పెట్రోల్ కారు కొంత శక్తిని వేడిగా వృథా చేస్తుంది. అందువల్ల పెట్రోల్ వాహనాల మైలేజ్ తక్కువ.మైలేజ్సాధారణంగా ఒక పెట్రోల్ కారు 12-15 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. సీఎన్జీ కారు 18-22 కిమీ/కేజీ అందింశింది. దీన్నిబట్టి చూస్తే.. మైలేజ్ ఏది ఎక్కువగా ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మైలేజ్ అనేది వెహికల్ డిజైన్, ట్రాఫిక్ కండిషన్, డ్రైవింగ్ వంటివాటిపై ఆధారపడి ఉంటుంది.మరో ప్రధానమైన విషయం ఏమిటంటే పెట్రోల్ కార్ల కంటే సీఎన్జీ వాహనాల పవర్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సాధారణ హైవేలు, ట్రాఫిక్ లేని రోడ్లపైన.. ఈ కార్లు మైలేజ్ కొంత ఎక్కువగానే అందిస్తాయి. కానీ ఎత్తైన రోడ్లలో ప్రయాణించే సమయంలో మాత్రం.. పెట్రోల్ కార్లు అందించినంత పవర్ డెలివరీ చేయవు.

Why Platinum Prices Lower Than Gold and Silver3
పీక్‌లో గోల్డ్, సిల్వర్: డీలా పడిన ప్లాటినం!

భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఊహకందని రీతిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు క్రాస్ చేయగా.. కేజీ వెండి రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రెండు కాకుండా ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం వంటి విలువైన లోహాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామందికి తెలిసిన లోహాలు గోల్డ్, సిల్వర్, ప్లాటినం మాత్రమే. పెట్టుబడిదారులకు పల్లాడియం గురించి తెలుసుంటుంది.ఇతర లోహాల సంగతి పక్కన పెడితే.. బంగారం వెండి ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి. ప్లాటినం ధరలు ఎందుకు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి?.. ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా పెరిశీలిద్దాం..బంగారం ధరలు పెరగడానికి కారణాలుద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాల కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం, డిమాండుకు తగ్గ.. బంగారం సరఫరా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణాలు అవుతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులలో.. లాభనష్టాలు ఉంటాయి. కానీ బంగారం పెట్టే పెట్టుబడి భద్రంగా ఉంటుందని భావిస్తారు. ఈ కారణంగానే పెట్టుబడిదారులు.. మార్కెట్స్ కుప్పకూలినప్పుడు గోల్డ్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.వెండి ధరలు పెరగడానికి కారణాలుఈ ఏడాది వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం ఒక కారణం అయితే.. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీలలో వెండి వినియోగం పెరిగిపోవడం కూడా మరో కారణం. నీటి శుద్ధి, వైద్య రంగం, పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలలో కూడా వెండి వినియోగం విరివిగా ఉంది. ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలలో కూడా వెండిని ఉపయోగిస్తారు.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. వెండిని పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల.. సిల్వర్ రేటు రెండు లక్షల రూపాయలు దాటేసింది.ప్లాటినం ధరలు ఎందుకు తక్కువ?➤బంగారం, వెండితో పోలిస్తే.. ప్లాటినం ధరలు చాలా తక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.➤బంగారం, వెండి ఆభరణాలకు ఉన్నంత డిమాండ్.. ప్లాటినం ఆభరణాలు లేదు.➤ప్లాటినంపై పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువ➤ఇండస్ట్రీల్ వినియోగం ఎక్కువగా ఉంది.➤ప్లాటినం ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, రష్యాలలో మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.➤డిమాండ్ తక్కువగా ఉండటం వల్లనే.. ప్లాటినం ధరలు తక్కువగా ఉన్నాయి.ఇతర లోహాలుబంగారం, వెండి మాదిరిగానే.. ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం కూడా విలువైన లోహాలు. అయితే వీటికున్న డిమాండ్ భారతదేశంలో చాలా తక్కువ. ఈ కారణంగానే వీటి ధరలు కూడా అలాగే ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది.

Huge Demand for EV Batteries4
ఈవీ బ్యాటరీలకు భారీ డిమాండ్‌

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీ (ఈవీ బ్యాటరీ) డిమాండ్‌ వచ్చే ఏడేళ్లలో గణనీయంగా పెరనుందని కస్టమైజ్డ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ (సీఈఎస్‌) సంస్థ అంచనా వేసింది. 2025లో ఈవీ బ్యాటరీ డిమాండ్‌ 17.7 గిగావాట్‌ హవర్‌ (జీడబ్యూ్యహెచ్‌) ఉండగా, 2032 నాటికి 256.3 గిగావాట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఏటా 35 శాతం కాంపౌండెడ్‌ వృద్ధి (సీఏజీఆర్‌) ఈ రంగంలో నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇంధన ధరలు పెరుగుతుండడం, ఎలక్ట్రిఫికేషన్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడం, వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్, ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు విడుదల అవుతుండడం, విధానపరమైన మద్దతు అన్నీ కలసి ఈవీ మార్కెట్‌ భారీ వృద్ధికి అనుకూలిస్తున్నట్టు తన నివేదికలో సీఈఎస్‌ వివరించింది.‘‘భారతదేశ ఎలక్ట్రిక్‌ వాహన విప్లవానికి బ్యాటరీ కెమిస్ట్రీ పురోగతులు కీలకమైనవి. ఎల్‌ఎఫ్‌పీ జెన్‌ 4, సోడియం అయాన్‌ టెక్నాలజీ ఆవిష్కరణలు కేవలం సాంకేతికపరమైన పురోగతులే కాదు. ఎలక్ట్రిక్‌ వాహనాలను మరింత అందుబాటు ధరలకు తీసుకొచ్చే సంచలనాలు. సురక్షితమైన, ఒక్కచార్జ్‌తో మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కల్పిస్తాయి’’అని సీఈఎస్‌ ఎండీ వినాయక్‌ వలింబే తెలిపారు. ఎల్‌ఎఫ్‌పీ జెన్‌4 సెల్స్‌ అన్నవి ఇప్పుడు 300 వాట్‌హవర్‌/కిలోని అధిగమించాయంటూ.. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు, ధరలు తగ్గేందుకు అనుకూలిస్తాయ ఈ నివేదిక తెలిపింది.సవాళ్లను అధిగమించాలి..భారత్‌ తన ఎలక్ట్రిఫికేషన్‌ (ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్లడం) లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పరిశ్రమతో సహకారం, బలమైన బ్యాటరీ ఎకోసిస్టమ్‌ ఏర్పాటు, వ్యూహాత్మక పెట్టుబడుల సవాళ్లను అధిగమించేందుకు విధానపరమైన జోక్యం అవసరమని సీఈఎస్‌ నివేదిక సూచించింది. బ్యాటరీల్లో వినియోగించే కీలక ముడి పదార్థాలను, ఖనిజాలపై చైనా నియంత్రణలు.. భారత్‌లో గిగాఫ్యాక్టరీల నిర్మాణాన్ని నిదానింపజేయొచ్చని, సరఫరా వ్యవస్థ రిస్‌్కలకు దారితీయొచ్చని హెచ్చరించింది. అధిక ఆరంభ పెట్టుబడులకుతోడు, దేశీయంగా ఖనిజ నిల్వలు పరిమితంగా ఉండడం భారత స్వావలంబన లక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది.

Manufacturing to Contribute 25 Percent of GDP by 20475
తయారీ హబ్‌గా భారత్‌!

భారత్‌ 2047 నాటికి తయారీ దిగ్గజంగా మారాలంటే.. జీడీపీలో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 25 శాతానికి చేర్చాలని బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూప్‌ (బీసీజీ), జెడ్‌47 సంయుక్త నివేదిక సూచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్‌భారత్, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ)తో దేశీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నట్టు పేర్కొంది.ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఆటోమోటివ్‌-ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధనం, ఫార్మాస్యూటికల్స్‌ రంగాల్లో 2047 నాటికి 25 ట్రిలియన్‌ డాలర్ల అవకాశాలున్నట్టు తెలిపింది. రానున్న కాలంలో తయారీ రంగంలో భారత్‌ వృద్ధికి ఈ రంగాలు కీలకంగా మారనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వీటికితోడు బలమైన జీడీపీ వృద్ధి, పారిశ్రామిక మద్దతు, స్పష్టమైన విధానాలు/పెట్టుబడులతో తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీతత్వాన్ని పెంచడం, టెక్నాలజీ అమలు ద్వారా సామర్థ్యాలను విస్తృతం చేయడం ద్వారా తయారీ రంగానికి బలమైన పునాదులు వేయాలని సూచించింది.2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం కోసం.. రక్షణ, ఈవీ, సెమీకండక్టర్లకు సంబంధించి ప్రాంతీయ తయారీ క్లస్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నివేదిక పేర్కొంది. నోయిడా–చెన్నై–హోసూర్, దొలెరా కారిడార్లు ఇప్పటికే ఫలితాలను చూపిస్తున్నట్టు తెలిపింది. ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల తుది మార్కెట్‌ 2022లో 33 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి 117 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. రక్షణ రంగానికి 2025–26లో కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉండగా, దేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చే దశాబ్దంలో కేటాయింపులు రెట్టింపు కానున్నట్టు పేర్కొంది.

Will Diesel Cars Be Stopped in India And Know The Reasons Here6
డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు..

ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రమంగా దేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు అందుబాటులో ఉన్నన్ని డీజిల్ కార్లు ప్రస్తుతం అందుబాటులో లేదు. దీనికి గల కారణం ఏమిటి?, భవిష్యత్తులో డీజిల్ కార్లు కనుమరుగవుతాయా? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన డీజిల్ కార్లు.. నేడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కంపెనీలు సైతం ఈ కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అధిక కాలుష్యం కారణంగా.. కూడా ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ కార్లను నిషేధిస్తున్నాయి.డీజిల్ కార్లు తగ్గడానికి ప్రధాన కారణాలుబీఎస్6 నిబంధనలు: 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 నిబంధనలు అమలులోకి వచ్చాయి. కంపెనీలు తయారు చేసే కార్లను తప్పకుండా ఈ నిబంధనలను అనుగుణంగా ఉండాలని, ఇంజిన్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖలు వెల్లడించాయి. పెట్రోల్ వాహనాలలో ఇంజిన్లను బీఎస్6 నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేయడం కొంత సులభమే. కానీ డీజిల్ ఇంజిన్లను కొత్త నిబంధనలకు తగ్గట్లుగా అప్డేట్ చేయడం కష్టం. దీనివల్ల ధరలు భారీగా పెరుగుతాయి. ధరలు పెరిగితే అమ్మకాలు క్రమంగా తగ్గుతాయి.కాలుష్యం: డీజిల్ కార్ల వినియోగం వల్ల.. వాతావరణంలోకి వెలువడే కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట పరిమితి దాటిన తరువాత డీజిల్ కార్ల నుంచి వెలువడే పొగ అధికంగా ఉంటుంది. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొంతవరకు నిషేధించాయి.ధరల మధ్య తేడా: చాన్నాళ్లకు ముందు.. డీజిల్, పెట్రోల్ ధరలలో తేడా ఉండేది. లీటరు పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే, డీజిల్ ధర 80 రూపాయలు వరకు ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే.. డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాల్సి ఉంటుంది.తగ్గిన అమ్మకాలు: కార్లను కొనుగోలు చేసేవారిలో కూడా చాలామంది.. పెట్రోల్, ఈవీలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. అమ్మకాలు తగ్గుతున్న కారణంగా.. కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి.ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ.. డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా మోటార్స్, టయోటా వంటి కంపెనీలతో పాటు లెక్సస్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవేళా కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తే.. కొత్త డీజిల్ కార్లు అందుబాటులో ఉండవు. బహుశా ఈ స్థితి రాదనే కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ.. ''సంఖ్య మాత్రం తగ్గుతుందనేది నిజం. పూర్తిగా డీజిల్ కార్లను కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమే''.డీజిల్ కార్లను తగ్గడానికి మరోకారణం.. కొనుగోలుదారుల ఆలోచన కూడా. ఎందుకంటే.. మారుతున్న కాలంతో పాటు వారు వినియోగించే కార్లలో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. చాలామంది యువత ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ రాష్ట్రాల్లో డీజిల్ కార్లు నిషేధం!వాయుకాలుష్యం రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న డీజిల్ కార్లను నిషేధించారు. ఈ జాబితాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొన్ని సందర్భాల్లో డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఇంజిన్ అప్డేట్ పొందిన డీజిల్ కార్ల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు.ఇదీ చదవండి: వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా?

Advertisement
Advertisement
Advertisement