Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Foldable stairs adds value to home Real estate1
ఇంటి విలువను పెంచే మెట్లు..

కుర్చీని మడత పెట్టినట్టుగానే ఇంటి పైకప్పునకు ఎక్కేందుకు ఉపయోగించే మెట్లు ఉంటే ఎంత బాగుంటుందో కదూ.. అవును.. ఫోల్డబుల్‌ స్టేర్‌కేస్‌లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. తక్కువ స్థలంలో, అందంగా ఇమిడిపోవడం వీటి ప్రత్యేకత. తక్కువ స్థలం ఉన్న ఇళ్లకు, బాల్కనీలోకి వెళ్లేందుకు, చిన్న స్థలంలో నిర్మించే డూప్లెక్స్‌లకు ఈ మడత పెట్టే మెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.మడతపెట్టే మెట్లు సురక్షితంగానే ఉంటాయి కానీ వీటిని సరిగ్గా బిగించాలి.. లేకపోతే ప్రమాదకరం. ఈ మెట్ల మీదుగా ఎక్కేటప్పుడు ఇరువైపులా హ్యాండ్‌ రెయిల్స్, యాంటీ స్లిప్‌ రింగ్‌లు వంటివి ఉండేలా చూసుకోవాలి. లేకపోతే పిల్లలు, వృద్ధులు కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది.ఇంటి విలువను పెంచే మెట్లు.. నిరంతరం, రోజువారి అవసరాలకు వినియోగించే మెట్ల స్థానంలో ఈ మడతపెట్టే మెట్లు అంత శ్రేయస్కరం కాదు. స్టోర్‌ రూమ్‌లు, చిన్న స్థలం ఉండే ఇళ్లు, బాల్కనీలోకి ఎక్కేందుకు, అప్పుడప్పుడు వినియోగించే ప్రాంతాలలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి విలువను పెంచడంలో మెట్లు కూడా భాగస్వామ్యమే. కాబట్టి చిన్న స్థలంలో నిర్మించే డూప్లెక్స్‌ ఇళ్లలో ఈ మడత పెట్టే మెట్లను వినియోగించేటప్పుడు ఇంటీరియర్, రంగులకు అనుగుణంగా ఈ మెట్లను ఎంపిక చేసుకోవాలి. లేకపోతే ఇంటి అందం దెబ్బతింటుంది.నాణ్యమైన కలప లేదా అల్యూమీనియంతో ఈ మడతపెట్టే మెట్లను తయారు చేస్తారు. పిల్లల గది, చిన్న హాల్‌లో, ఇరుకైన స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి నిచ్చెనలు పాదాల కింద స్థిరంగా ఉండవు కాబట్టి బరువైన వస్తువులను మోసుకెళ్తూ ఈ మెట్లను ఎక్కకూడదు. సంప్రదాయ మెట్లతో పోలిస్తే ఇవి చౌక ధరల్లోనే లభిస్తాయి.

Rich Dad Poor Dad Robert Kiyosaki Says Goodbye To US Dollar2
‘కొత్త కరెన్సీ వస్తోంది.. డాలర్‌కు గుడ్‌బై’

ప్రముఖ ఇన్వెస్టర్‌, పాపులర్‌ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరో ఆసక్తికర ట్వీట్‌ చేశారు. అమెరికా డాలర్‌ స్థిరత్వం గురించి ఎప్పుడూ విమర్శలు చేసే ఆయన మరోసారి యూఎస్‌ కరెన్సీ గురించి వ్యాఖ్యానించారు. బ్రిక్స్‌ దేశాలు కొత్త కరెన్సీని ప్రకటించాయన్న పుకారు వార్తను ప్రస్తావిస్తూ ఇక అమెరికా డాలర్‌ పని అయిపోయింది.. ‘‘బై బై యూఎస్‌ డాలర్‌’’ అంటూ తన ‘ఎక్స్’ పోస్ట్ లో రాసుకొచ్చారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమూహం బ్రిక్స్ బంగారం మద్దతు ఉండే "యూనిట్" అనే "డబ్బు"అని ప్రకటించాయి అన్నారు. ‘అప్రమత్తంగా ఉండండి.. నష్టాలపాలవ్వొద్దు’ అని యూజర్లకు సూచించారు.‘నా అంచనా ఏమిటంటే యూఎస్ డాలర్ల పొదుపు చేసేవాళ్లు అత్యంత నష్టపరులు అవుతారు. మీరు యూఎస్ డాలర్లను కలిగి ఉంటే... అధిక ద్రవ్యోల్బణం మిమ్మల్ని తుడిచిపెట్టవచ్చు. నేను నా మంత్రానికి కట్టుబడి ఉన్నాను, బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథర్‌లను కలిగి ఉన్నాను’ అని రాసుకొచ్చారు.బంగారం, వెండిపై దీర్ఘకాలంగా పెట్టుబడులు పెడుతున్న కియోసాకి.. ఇటీవలి సంవత్సరాలలో బిట్ కాయిన్, ఎథేరియంలను డాలర్ క్షీణత నుంచి కాపాడుకునే ఆస్తులుగా పేర్కొంటున్నారు.BIG BREAKING $ NEWS:BRICS: Brazil, Russia, India, China, South Africa announces the “UNIT”a gold backed “money.”BYE BYE US DOLLAR!!!!!Stand by, stay awake, stay tuned in.DONT BE A LOSERMy forecast is Savers of US dollars biggest losers.If you own US Dollars…. Hyper…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 5, 2025

Redmi 15C Samsung Galaxy Tab A11 Launch in India Full Specs and Prices3
తక్కువ ధరలో వచ్చేసిన స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్‌..

రెడ్‌మీ తాజాగా ‘రెడ్‌మీ 15సీ’ పేరుతో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. 6.9 అంగుళాల హెచ్‌డీ అడాప్టివ్‌సింక్‌ డిస్‌ప్లే, డస్ట్‌ .. వాటర్‌ రెసిస్టెన్స్, 50 ఎంపీ ఏఐ డ్యూయల్‌ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, (33డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జింగ్‌) దీని ప్రత్యేకతలు.మిడ్‌నైట్‌ బ్లాక్, మూన్‌లైట్‌ బ్లూ, డస్క్‌ పర్పుల్‌ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి రెండేళ్ల ఓఎస్‌ అప్‌గ్రేడ్‌లు, నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇస్తారు. ధరల విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్‌ + 128 జీబీ మెమరీ వేరియంట్‌ రేటు రూ.12,499గా ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ. 13,999గా, 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ. 15,499గా ఉన్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఏ11 వచ్చేసింది దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ భారత్‌లో తన కొత్త ‘‘గెలాక్సీ ట్యాబ్‌ ఏ11’’ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇందులో 8.7 అంగుళాల స్క్రీన్, 5100ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6 ఎన్‌ఎం ఆధారిత ఆక్టా–కోర్‌ ప్రాసెసర్, 5ఎంపీ కెమెరా, 8జీబీ వరకు ర్యామ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.పెద్ద ఫైల్స్‌కు తగినంత స్థలాన్ని చేకూర్చుకునేందుకు 128జీబీ వరకు స్టోరేజ్‌ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో 2టీబీ వరకు విస్తరించకోవచ్చు. క్లాసిక్‌ గ్రే, సిల్వర్‌ రంగులలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999 (4జీబీ ర్యామ్‌ + 64జీబీ)కాగా, గరిష్ట ధర రూ.20,999 (8జీబీ ర్యామ్‌ + 128 బీజీ)గా ఉంది. ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లతో పాటు శాంసంగ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి.

Bajaj Pulsar N160 Gets a New Updated Variant4
పల్సర్‌ బైక్‌ కొత్త వేరియంట్‌.. మారిపోయింది!

బజాజ్‌ ఆటో సంస్థ తన పల్సర్‌ సిరీస్‌కి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పల్సర్‌ ఎన్‌160 కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.1,23,983గా ఉంది. ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ డిజైన్, లుక్‌లో కీలక మార్పులు చేసింది.పసిడి వర్ణపు అప్‌సైడ్‌ డౌన్‌ (యూఎస్‌డీ) ఫోర్క్, స్ల్పిట్‌ సీట్‌ బదులు సింగిల్‌ సీట్‌ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పర్ల్‌ మెటాలిక్‌ వైట్, రేసింగ్‌ రెడ్, పోలార్‌ స్కై బ్లూ, బ్లాక్‌ ఇలా మొత్తం నాలుగు కలర్‌ ఆప్షన్లలో అందిస్తోంది. లాంచింగ్‌ సందర్భంగా బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ సరంగ్‌ కనడే మాట్లాడుతూ ‘‘కస్టమర్ల అభిప్రాయాలు, డిమాండ్‌లకు అనుగుణంగా, దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ మార్పులను దృష్టిలో పెట్టుకొని గోల్డ్‌ యూఎస్‌బీ ఫోర్క్‌లు, సింగిల్‌ సీట్‌తో పల్సర్‌ ఎన్‌160ని అప్‌గ్రేడ్‌ చేశాము. మరింత మెరుగైన సౌకర్యాన్ని జత చేశాము. ఈ మార్పులు కొత్త తరాన్ని మెప్పిస్తాయని ఆశిస్తున్నాము’’ అన్నారు.

AI Steps Into Kitchen New Trend in Ultra Luxury Homes House Construction tips 5
ఇంటి కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ..

పిల్లలు లొట్టలేసుకొని తినే వంటకాలను రెడీ చేస్తుంది.. అత్తామామలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని వడ్డిస్తుంది.. శ్రీవారిని పసందైన వంటలతో కట్టిపడేస్తుంది.. ..స్మార్ట్‌ ఇల్లాలి రహస్యం కాదండీ ఇదీ. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌–ఏఐ) వంటగది మహత్యం. అవును.. స్మార్ట్‌ కస్టమర్ల అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా కిచెన్స్‌ కూడా ఏఐ అవతారమెత్తాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లో అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలలో డెవలపర్లు ఈ స్మార్ట్‌ వంటగదులనే అందిస్తున్నారు. మెట్రో నగరాలలో ఏఐ కిచెన్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. వంట గది అమ్మకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ అవసరమైన, ఆరోగ్యకరమైన ప్రాంతంగా మారిపోయింది. వినియోగదారుల ఆరోగ్య డేటా, వెల్‌నెస్‌ లక్ష్యాలను క్రోడీకరించి ఆహార పరిమితులను విశ్లేషించి భోజన ప్రణాళికలను రూపొందించడమే ఈ ఏఐ కిచెన్స్‌ ప్రత్యేకత. వినియోగదారుల ప్రవర్తన, అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా పోషకాహారాలు, వంటకాలను కూడా సూచిస్తుంది.వంటలో సహాయం.. కృత్రిమ మేధ సాంకేతికతతో కూరగాయల్ని కోయడం, వాటిని వంట పాత్రలో వేయడం, గరిటె తిప్పడం, మంట, వేడి ఉష్ణోగ్రతలను నియంత్రించడం వంటి పనులను ఏఐ ఉపకరణాలు చేస్తాయి. రిఫ్రిజిరేటర్‌లో ఆహార పదార్థాల గడువు తేదీలను గుర్తించి, ముందుగానే హెచ్చరించడం, వ్యర్థాలను తగ్గించడం, సమయాన్ని ఆదా చేస్తుంది కూడా.. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య సముదాయాలలో ప్రొఫెషనల్‌ కిచెన్‌లో హెడ్‌ చెఫ్‌కు రోజువారీ కార్యకలాపాలలో సహాయం చేసే ‘సౌస్‌ చెఫ్‌’ సిబ్బంది మాదిరిగా.. ఏఐ కూడా వంట గదిలో మనకు సహాయపడుతుంది. ప్రోగ్రామ్‌ చేసిన వంటకాలు లేదా వినియోగదారుల ఇన్‌పుట్‌ ఆధారంగా కూరగాయలు కత్తిరించడం, వేయించడం, తిప్పడం, ముద్దగా పిసుకుతూ కలపడం వంటి పనులు చేస్తాయి. అలాగే కొందరు కుటుంబ వంటకాలను అనుకరిస్తుంది కూడా.ఆహార వ్యర్థాల తగ్గుదల.. స్మార్ట్‌ రిఫ్రిజిరేటర్లు: ఏఐ ఆధారిత రిఫ్రిజిరేటర్లు అందులోని ఆహార పదార్థాల గడువు తేదీలను ట్రాక్‌ చేస్తుంది. అందుబాటులో ఉన్న పదార్థాల ఆధారంగా వంటకాలను సూచిస్తుంది. ఆహార వ్యర్థాలు, శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏఐ ఆధారిత ఓవెన్లు, ఇండక్షన్‌ కుక్‌టాప్‌లలో ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేయడానికి సెన్సార్లు ఉంటాయి. దీంతో వంటకాలు మాడిపోకుండా, తక్కువ ఉడకకుండా ఉంటుంది. సవాళ్లున్నాయ్‌.. ఏఐ కిచెన్స్‌ శరవేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఈ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. స్మార్ట్‌ ఉపకరణాల ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు వినియోగదారుల డేటా గోప్యత, భద్రతలపై ఆందోళనలు ఉన్నాయి. కంపెనీలు బలమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను రూపొందించడంతో పాటు వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు డేటా నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో ఏఐ ఉపకరణాలు.. వంట గదిలో ఆటోమేటెడ్‌ కుకింగ్‌ అసిస్టెంట్లు, స్మార్ట్‌ రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు, ఎయిర్‌ ఫ్రైయర్లు వంటి వంట ఉపకరణాల ఏఐతో పనిచేస్తాయి. ఇవి అలెక్సా, సిరి, గూగుల్‌ హోమ్‌ వంటి వాయిస్‌ అసిస్టెంట్లతో అనుసంధానమై ఉంటాయి. సమయం, లైటింగ్‌లను సర్దుబాటు చేస్తూ శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ వంట గది వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. శామ్‌సంగ్, ఎల్జీ, జీఈ వంటి కంపెనీలకు చెందిన వాయిస్‌ బేస్డ్, విజువల్‌ గైడ్‌లు ఏఐ కిచెన్‌ ఉపకరణాలను విస్తృత శ్రేణి వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి.

PRovoke Media has announced the Influence 100 for 20256
రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌  టాప్‌ ఉద్యోగులకు గుర్తింపు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌ తదితర భారతీయ కంపెనీల కమ్యూనికేషన్, మార్కెటింగ్‌ చీఫ్‌లు.. ప్రోవోక్‌ మీడియా ‘2025 ప్రపంచ టాప్‌ 100 ప్రభావవంతమైన నాయకుల జాబితా’లో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాచార సంబంధాలను గొప్పగా నిర్వహించే వారికి ఇందులో స్థానం కల్పించినట్టు ప్రోవోక్‌ మీడియా తెలిపింది. కంపెనీ ప్రతిష్టతను పెంచడం, ప్రజలతో సంబంధాల విషయంలో వీరి నిర్ణయాలు ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపింది. రిలయన్స్‌ గ్రూప్‌ కమ్యూనికేషన్స్‌ హెడ్‌ రోహిత్‌ బన్సాల్‌ ఇన్ఫోసిస్‌ గ్లోబల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అభినవ్‌ కుమార్‌ వేదాంత గ్రూప్‌ చీఫ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ రీతు జింగాన్‌ గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ చీఫ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ సుజిత్‌ పటేల్‌ జిందాల్‌ స్టీల్‌ కార్పొరేట్‌ బ్రాండ్, కమ్యూనికే షన్‌‹Ù్స హెడ్‌ అర్పణ కుమార్‌ అహుజా ‘‘రిలయన్స్‌ ఇండస్టీస్‌ భారత్‌లోనే అతిపెద్ద ప్రైవేటు కంపెనీ. దేశ ఆర్థిక వ్యవస్థ బూమింగ్‌కు ఓ సింబల్‌. ఇంధనం, రిటైల్, వినోదం, టెలికం, మాస్‌ మీడియా, టెక్స్‌టైల్స్‌ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ కమ్యూనికేషన్‌ హెడ్‌గా రోహిత్‌ బన్సాల్‌ పాత్ర ఎంతో కీలకమైనది. జియోజెన్‌నెక్ట్స్‌కు రోహిత్‌ మెంటార్‌ కూడా. భారత్‌లో ప్రముఖ 100 మంది ప్రజా సంబంధాల నిపుణుల్లో మొదటి ర్యాంక్‌లో నిలుస్తారు’’అని ప్రోవోక్‌ మీడియా తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement