Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

stock market updates on December 8th 20251
Stock Market Updates: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 50 పాయింట్లు తగ్గి 26,135కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 154 పాయింట్లు నష్టపోయి 85,557 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.88 వద్ద ట్రేడవుతోందిబ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 63.84 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.14% వద్ద ఉన్నాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 6,870.40 వద్ద ముగిసిందినాస్‌డాక్‌ 23,578.13 వద్ద ముగిసిందిToday Nifty position 08-12-2025(time: 9:44)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Tax Implications of Acquisition vs Registration Dates in Real Estate Deals2
Income Tax: అక్విజిషన్‌ డేటు V/S రిజిస్ట్రేషన్‌ డేటు

ఎన్నో స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో ఇదొక సమస్య. ఈ విషయంలో ఎన్నో వివాదాస్పదమైన చర్చలు, సంభాషణలు జరిగాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కంపల్సరీ. చట్టరీత్యా చెయ్యాలి. అలా చేసిన తర్వాతే కొనుక్కునే వారికి హక్కు ఏర్పడుతుంది. అందుకని రిజిస్ట్రేషన్‌ డేటునే ప్రాతిపదికగా తీసుకుంటారు. రిజిస్ట్రేషన్‌ తేదీ నాడే హక్కు సంక్రమిస్తుంది. హోల్డింగ్‌ పీరియడ్‌.. అంటే ఆ సదరు ఆస్తి ఎన్నాళ్ల నుంచి ఆ వ్యక్తి వద్ద ఉంది అనేది. కొన్న తేదీ అలాగే అమ్మిన తేదీ .. ఈ రెండూ కూడా ఒప్పందం/అగ్రిమెంట్‌/డీడ్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌ తేదీలే. ఈ మధ్య వ్యవధిని హోల్డింగ్‌ పీరియడ్‌ అంటారు. ఇక కొనుగోలు తేదీ నుంచి అమ్మకపు తేదీల మధ్య వ్యవధి .. దీన్ని నిర్ణయించడానికి రిజిస్ట్రేషన్‌ తేదీనే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ హోల్డింగ్‌ పీరియడ్‌.. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో 2 సంవత్సరాలు దాటితే దీర్ఘకాలికం. రెండు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే స్వల్పకాలికం అంటారు. దీర్ఘకాలికం అయితే ఒక రకమైన పన్ను రేటు ఉంటుంది. (రెసిడెంటుకి 20 శాతం, నాన్‌ రెసిడెంటుకి 12.5 శాతం) స్వల్పకాలికం అయితే, ఇతర ఆదాయాలతో కలిసి శ్లాబుల ప్రకారం రేట్లు విధిస్తారు. హోల్డింగ్‌ పీరియడ్‌ కాకుండా కాస్ట్‌ ఆఫ్‌ ఇండెక్సింగ్‌ లెక్కించడానికి అక్విజిషన్‌ డేటును ప్రాతిపదికగా తీసుకుంటారు.ఈ మేరకు ఎన్నో ట్రిబ్యునల్స్, కోర్టులు కూడా రూలింగ్‌ ఇచ్చాయి. వీటి సారాంశం ఏమిటంటే .. కొన్న వ్యక్తి మొత్తం ప్రతిఫలం చెల్లించి, ఆ ఆస్తిని తీసుకుని అనుభవిస్తున్నారు. అనుభవించడం అంటే తాను ఆ ఇంట్లో ఉండటం గానీ లేదా అద్దెకి ఇచ్చి.. ఆ అద్దెని ఇన్‌కం ట్యాక్స్‌ లెక్కల్లో చూపించినట్లయితే గానీ అని అర్థం. అయితే, ఏదో ఒక కారణం వల్ల రిజిస్ట్రేషన్‌ జరగలేదు. రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో పడింది. అలాంటప్పుడు అలాట్‌మెంట్‌నే పరిగనలోకి తీసుకుంటారు. సుప్రీం కోర్టు: సీఐటీ వర్సెస్‌ ఘన్‌శ్యామ్‌ 2009 రాజస్తాన్‌ హైకోర్టు: సీఐటీ వర్సెస్‌ రుక్మిణీ దేవి 2010.పైన చెప్పిన కేసుల్లో ఈ విషయాన్ని నిర్ధారించారు. వీటి సారాంశం ఏమిటంటే ఏ తేదీన అయితే స్వాధీనపర్చుకున్నారో, అంటే డేట్‌ ఆఫ్‌ అక్విజిషన్, ఆ తేదీనే రిజి్రస్టేషన్‌ తేదీగా పరిగణిస్తారు. కాబట్టి డేట్‌ ఆఫ్‌ అక్విజిషన్‌ ముఖ్యం. ఇక అలాట్‌మెంట్‌ డేట్‌ వేరు. ముఖ్యంగా సొసైటీల్లో, డెవలప్‌మెంట్‌ అథారిటీపరంగా ఎన్నెన్నో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఫలితంగా అలాట్‌మెంట్‌ జరుగుతుంది.. అక్విజిషన్‌ కూడా జరుగుతుంది.. కానీ న్యాయపరమైన చిక్కులు, కోర్టు లిటిగేషన్స్‌ వల్ల చట్టపరంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్‌ సంవత్సరాల తరబడి వాయిదా అవుతుంది. బేరసారాలు జరిగి, అగ్రిమెంటు ప్రకారం ప్రతిఫలం ఇచ్చి అక్వైర్‌ (acquire) చేసుకున్నా, రిజి్రస్టేషన్‌ ప్రక్రియ ఆగిపోతుంది. పెండింగ్‌ పడిపోతుంది. ఇదొక సాంకేతిక సమస్య తప్ప న్యాయపరమైనది లేదా హక్కులపరమైన సమస్య కాదు.అందుకని హోల్డింగ్‌ పీరియడ్‌కి, కాస్ట్‌ ఆఫ్‌ ఇండెక్సింగ్‌కి డేట్‌ ఆఫ్‌ అక్విజిషన్‌నే ప్రాతిపదికగా తీసుకుంటారు. క్రయవిక్రయాలు చేసే ముందు, లింక్‌ డాక్యుమెంట్లు, దస్తావేజులను క్షుణ్నంగా చదవాలి. అప్పుడే ముందడుగు వేయాలి. మరొక జాగ్రత్త. సేల్‌ డీడ్‌లో మార్కెట్‌ విలువను ప్రస్తావిస్తారు. ప్రతిఫలం కన్నా మార్కెట్‌ విలువ ఎక్కువ ఉంటే, మార్కెట్‌ విలువనే అమ్మకపు విలువగా తీసుకుంటారు. తగిన జాగ్రత్త వహించండి.

Government Calls on Corporates to Boost Investments in Food Processing3
ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో భారీగా ఇన్వెస్ట్‌ చేయండి

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ కార్యదర్శి ఎ.పి. దాస్‌ జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్‌ స్థాయిని, ఎగుమతులను పెంచే దిశగా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌ చేయాలంటూ కార్పొరేట్లకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.‘మనం భారీగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ సుమారు 12 శాతం మాత్రమే ప్రాసెస్‌ అవుతోంది. ఈ విషయంలో అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లను అటుంచితే కనీసం ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌కి కూడా దగ్గర్లో లేము. దేశవ్యాప్తంగా 24 లక్షల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండగా, వాటిలో రెండు శాతమే సంఘటిత రంగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు, దేశీయంగా ప్రైవేట్‌ పెట్టుబడులు పెట్టేందుకు గణనీయంగా ఆస్కారం ఉంది. దీని వల్ల గ్రామీణ రైతాంగానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది‘ అని జోషి చెప్పారు.2014–15లో మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 11 శాతంగా ఉన్న ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వాటా ప్రస్తుతం 22 శాతానికి పెరిగిందని తెలిపారు. 2030 నాటికి ఇది 30–32 శాతానికి చేరవచ్చని, పరిశ్రమకు అపరిమిత వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్‌ కోడ్‌లు, కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాలకు ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు.

Will Gold Prices Rise Further? Here's Questions & Answers In Sakshi4
పసిడి ధర మరింత పెరుగుతుందా?

బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగింది. ఇంకా పెరుగుతుందా? – శ్రావణి అద్దంకిబంగారం ధరలు అదే పనిగా ర్యాలీ చేస్తుండం తప్పకుండా ఆకర్షిస్తుంది. అవును బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయమైన రాబడిని ఇచ్చాయి. కానీ, ఇంకెంత పెరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. ఏ అసెట్‌ క్లాస్‌కు అయినా ఇదే వర్తిస్తుంది. కనుక దీనికి బదులు మీ పెట్టుబడుల్లో బంగారాన్ని చేర్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అనిశ్చితుల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో లేదా ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న తరుణంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అలాంటి అనిశి్చతులన్నీ సర్దుకుని, ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరు చూపిస్తుంటే అప్పుడు బంగారం పనితీరు పరిమితం అవుతుంది. గత 15 ఏళ్లలో బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. వివిధ రంగాలు, పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ ఇదే కాలంలో ఏటా ఇచ్చిన రాబడి 12 శాతంగా ఉంది.రాబడిలో వ్యత్యాసం స్వల్పమే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌ కారణంగా చెప్పుకోతగ్గంత అదనపు నిధి సమకూరుతుంది. ఈక్విటీలు అన్నవి వ్యాపారాల్లో వాటాలను అందిస్తాయి. అవి సంపదకు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వ ఉంచుకునే సాధనమే. కనుక ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు. నేను ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్లపాటు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో వేటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి? – దీపక్‌పెట్టుబడిలో తక్కువ రిస్క్‌ కోరుకునే వారు 50 శాతాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్‌ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్‌ విషయంలో షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ లేదా టార్గెట్‌ మెచ్యూరిటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీల్లో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ లేదా లో కాస్ట్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్‌ తీసుకునేట్టు అయితే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం, మిగిలిన మొత్తాన్ని డెట్‌ సాధనాలకు కేటాయించుకోవాలి.సమాధానాలు:: ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

SEBI issues guidelines for single window transactions in domestic stock market5
లోరిస్క్‌ విదేశీ ఇన్వెస్టర్లకు సింగిల్‌ విండో

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లోరిస్క్‌ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సింగిల్‌ విండోను ప్రవేశపెట్టింది. తద్వారా దేశీ స్టాక్‌ మార్కెట్లో లావాదేవీలు చేపట్టేందుకు నిబంధనలను సరళతరం చేసింది. ఇందుకు సింగిల్‌ విండో ఆటోమేటిక్‌ అండ్‌ జనరలైజ్‌డ్‌ యాక్సెస్‌ ఫర్‌ ట్రస్ట్‌డ్‌ ఫారిన్‌ ఇన్వెస్టర్స్‌(స్వాగత్‌–ఎఫ్‌ఐ)పేరుతో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకట్టుకునేందుకు వీలు చిక్కనుంది. దీంతో వివిధ పెట్టుబడి మార్గాలను ఏకీకృతం చేయడంతోపాటు.. ఆయా సంస్థలు నిబంధనలు పాటించడంలో మరింత సరళతర విధానాలకు తెరతీసింది. లోరిస్క్‌ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్, మలీ్టలేటరల్‌ సంస్థలు, అత్యధిక నియంత్రణలు కలిగిన పబ్లిక్‌ రిటైల్‌ ఫండ్స్, తగిన నియంత్రణలున్న బీమా కంపెనీలు, పెన్షన్‌ ఫండ్స్‌ను సెబీ చేర్చింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), విదేశీ వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టర్ల(ఎఫ్‌వీసీఐలు)కు విడిగా రెండు నోటిఫికేషన్లను స్వాగత్‌–ఎఫ్‌ఐ మార్గదర్శకాలకు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా సెబీ నిబంధనలను సవరించింది. వెరసి 2026 జూన్‌1 నుంచి ఇవి అమలుకానున్నాయి. ఈ ప్రతిపాదనలకు సెబీ బోర్డు సెపె్టంబర్‌లో ఆమోదముద్ర వేసింది.

US Fed decision, FIIs Trading Activity To Drive Stock Markets6
ఫెడ్‌పై మార్కెట్‌ దృష్టి 

ప్రధానంగా విదేశీ గణాంకాల ఆధారంగా ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు కదలనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షను చేపట్టనుంది. ఇది సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ 9న పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. 10న చైర్మన్‌ పావెల్‌ అధ్యక్షతన ఫెడరల్‌ ఒపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) మానిటరీ పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. ఫెడ్‌ ఫండ్స్‌(వడ్డీ) రేట్లను 0.25 శాతంమేర తగ్గించవచ్చని అధికశాతంమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత పాలసీ సమావేశంలోనూ వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 3.75–4 శాతంగా అమలవుతున్నాయి. కాగా.. ముందు రోజు అంటే 9న యూఎస్‌ ఉపాధి గణాంకాలు విడుదలకానున్నాయి. 11న సెపె్టంబర్‌ నెలకు వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆగస్ట్‌లో వాణిజ్య లోటు 59.6 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. జూలైలో 78 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. నవంబర్‌ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో చైనా 90 బిలియన్‌ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 10న గత నెలకు చైనా ద్రవ్యోల్బణ వివరాలు తెలియనున్నాయి. ఆర్‌బీఐ ఎఫెక్ట్‌ దేశీయంగా ఆర్‌బీఐ గత వారం వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. అంతేకాకుండా రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీయనుంది. ఫలితంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు వారాంతాన ఊపందుకున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి 90కు బలహీనపడటం గమనించదగ్గ అంశం. దీంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీకి దన్నుగా ఆర్‌బీఐ 5 బిలియన్‌ డాలర్ల రుపీ డాలర్‌ స్వాప్‌నకు తెరతీయనుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ చర్యలు జీఎస్‌టీ సంస్కరణలకు జత కలసి సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్‌ డాలరు ఇండెక్స్, ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ సైతం మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రభావితం చేసే అవకాశముంది. ఇవి గ్లోబల్‌ ఇన్వెస్టర్లను రిస్కు పెట్టుబడులైన ఈక్విటీల నుంచి పసిడి తదితర రక్షణాత్మక సాధనాలవైపు మళ్లించవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రిటైల్‌ ధరలు.. నవంబర్‌ నెలకు వినియోగ ధరల(సీపీఐ) గణాంకాలు శుక్రవారం(12న) విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ 0.25 శాతానికి నీరసించింది. దీంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు వీలు కలిగిన విషయం విదితమే. కాగా.. వరుసగా 9వ నెలలోనూ ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతానికంటే దిగువనే రిటైల్‌ ధరలు నమోదవుతుండటం గమనార్హం! ఎఫ్‌పీఐల అమ్మకాల స్పీడ్‌ తొలి వారంలో రూ. 11,820 కోట్లు ఔట్‌ దేశీ స్టాక్స్‌లో ఇటీవల విక్రయాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల మొదటి వారంలోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నగదు విభాగంలో నికరంగా రూ. 11,820 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దీంతో ఈ కేలండర్‌ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయింది! గత నెలలోనూ రూ. 3,765 కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించిన ఎఫ్‌పీఐలు అక్టోబర్‌లో మాత్రం రూ. 14,610 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెపె్టంబర్‌లో రూ. 23,885 కోట్లు, ఆగస్ట్‌లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం!బుల్లిష్‌గా..గత వారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. రూపాయి పతనంతో ఐటీ కౌంటర్లు బలపడ్డాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం మార్కెట్లు పుంజుకోవడానికే అధిక చాన్స్‌ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. → ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,300–26,350 పాయింట్లకు పెరిగే వీలుంది. ఈ స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే స్వల్ప కాలంలో 26,850–26,900 వరకూ పురోగమించే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 26,000, తదుపరి 25,850 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించే వీలుంది. ఆపై మరోసారి 25,700 వద్ద మద్దతు కనిపించవచ్చు. ఇంతకంటే దిగువకు చేరితే మరింత నీరసించేందుకు ఆస్కారం ఉంటుంది. → బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 86,350 వరకూ బలపడవచ్చు. ఈస్థాయిని దాటితే 87,500–88,000 పాయింట్లవరకూ పుంజుకునే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 84,800 వద్ద, తదుపరి 84,450 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చు. ఆపై మరింత నీరసిస్తే 83,600–83,300 పాయింట్లవరకూ క్షీణించే వీలుంది. –సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement