ప్రధాన వార్తలు

బ్యాంక్ షేర్లు పతనం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్, ఎఫ్ఐఐ అమ్మకాల ఒత్తిడిపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సానుకూలంగా ప్రారంభమై స్వల్ప లాభాలతో ట్రేడయిన భారత బెంచ్మార్క్ సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో స్థిరపడ్డాయి.ఇంట్రాడేలో 83,850 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 170.22 పాయింట్లు (0.2 శాతం) క్షీణించి 83,239.7 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 48.1 పాయింట్లు (0.19 శాతం) క్షీణించి 25,405.3 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ సానుకూల దిశలో ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.26 శాతం నష్టపోయింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 0.89 శాతం క్షీణించి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, రియల్టీ, బ్యాంక్, ఫియాన్షియల్ సర్వీసెస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.నిఫ్టీ మీడియా, ఆటో, ఫార్మా, హెల్త్కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.48 శాతం క్షీణించి 12.38 పాయింట్ల వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదేసమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి.

‘ఖరీదైన బెంజ్ కారు.. రెండున్నర లక్షలకే అమ్ముకున్నా’
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన కఠినమైన ఇంధన నిషేధం ఖరీదైన కార్ల యజమానులకు శాపంగా మారింది. చాలా మంది తమ ఖరీదైన పాత ప్రీమియం కార్లను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయకూడదు. రాజధానిలో నెలకొన్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు నిషేధాన్ని అమలు చేస్తున్నారు.మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. వరుణ్ విజ్ అనే వ్యక్తి తన లగ్జరీ ఎస్యూవీ 2015 మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ 350ని తప్పని పరిస్థతిలో చాలా చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. పదేళ్ల కిందట ఈ వాహనాన్ని ఆయన రూ.84 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాత వాహనాలకు ఇంధన నిషేధం కారణంగా కేవలం రూ.2.5 లక్షలకే అమ్ముడుపోయింది.దశాబ్ద కాలంగా తమ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా ఉన్న కారును ఇప్పుడు వదిలించుకోవాల్సి రావడం వల్ల కలిగే భావోద్వేగాన్ని విజ్ వివరించారు. తన కుమారుడిని హాస్టల్ నుండి తీసుకురావడానికి వారానికి కేవలం 7-8 గంటల ప్రయాణానికి మాత్రమే ఈ కారును వినియోగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తంగా 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు రొటీన్ సర్వీసింగ్, టైర్ రీప్లేస్మెంట్లకు మించి మరే ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇంత చౌకగా అమ్ముడుపోయిందని విజ్ ఆవేదన వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.62 లక్షలతో ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లు విజ్ తెలిపారు. ప్రభుత్వం ఇలా మరోసారి విధానం మార్చుకోకపోతే 20 ఏళ్ల పాటు దీన్ని వాడుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.రితేష్ గండోత్రా అనే వ్యక్తి కూడా తాను రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును చౌకగా అమ్మాల్సి వస్తోందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్సీఆర్లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాల కారణంగా నా కారును విక్రయించవలసి వస్తోంది. అది కూడా ఎన్సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు.

బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదు
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి అనేలా బ్యాంకులు పట్టుబట్టకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ వాడకం ప్రజల స్వచ్ఛంద నిర్ణయంగా ఉండాలని తెలిపింది. బ్యాంకింగ్ వంటి సేవలకు ఆధార్ను తప్పనిసరి చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఉటంకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఆధార్ వివరాలు లేవనే కారణంతో ఖాతా తెరవడంలో జాప్యం చేసిన బ్యాంకుకు, ఓ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ తీర్పు వెలువడింది. కంపెనీ ప్రత్యామ్నాయంగా నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాలను అందించినప్పటికీ బ్యాంకు ఆధార్ కోసం పట్టుబట్టింది. ఫలితంగా కొంతకాలం బ్యాంకు ఖాతా తెరవడం ఆలస్యం అయింది. ఇది కంపెనీ నిర్వహణ అంతరాయాలకు, ఆర్థిక నష్టానికి దారితీసిందని సంస్థ పేర్కొంది.బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధం..బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్ను స్వచ్ఛందంగా ఇవ్వగలిగినప్పటికీ, దాన్ని తప్పనిసరి చేయకూడదని నొక్కి చెప్పింది. పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఆధార్ వినియోగం నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకే పరిమితమని మరోసారి స్పష్టం చేసింది. చట్టసభల మద్దతు లేకుండా ప్రైవేటు సేవలకు దీన్ని తప్పనిసరి చేయకూడదని పేర్కొంది.The Bombay High Court has held that a bank could not have insisted on Aadhaar as a mandatory requirement for opening a bank account after the Supreme Court's verdict in Justice K.S. Puttaswamy v. Union of India (2018), and awarded ₹50,000 in compensation to a company whose… pic.twitter.com/aHDMMKuat3— Live Law (@LiveLawIndia) July 2, 2025ఇదీ చదవండి: భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలునష్టపరిహారం చెల్లింపుఖాతా తెరిచేందుకు జాప్యం జరిగిన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడినట్లు సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని గుర్తించిన బాంబే హైకోర్టు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కేవైసీ నిబంధనలు చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని ఈ తీర్పు ఆర్థిక సంస్థలకు గుర్తు చేస్తోంది. ప్రత్యేకించి ప్రత్యామ్నాయ, చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన డాక్యుమెంటేషన్ అందించినప్పుడు కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తెలుపుతుంది.

భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలు
భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్ గ్లోబల్ హబ్గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.గత రెండు నెలల్లో భారత్లో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్కాన్ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్ ఎగుమతులకు చెక్ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.అసలేం జరిగిందంటే..యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్ ఐఫోన్ 17ను లాంచ్ చేయనుంది. ఈమేరకు భారత్లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్కాన్పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్ సైట్ల్లో ఉంచుతుంది.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్ కేసు
ముంబయిలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రిమినల్ కేసులో బలమైన ఆధారాలేవీ లేవని, పెండింగ్ చెల్లింపులపై ఒత్తిడి తప్పా మరేమీ కాదని జగదీషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.జగదీషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆసుపత్రి ట్రస్టీలు నమోదు చేయించిన ఎఫ్ఐఆర్కు బలమైన ఆధారాలు లేవని, ఆసుపత్రి నుంచి డబ్బు రికవరీ చేయడానికి బ్యాంకు ప్రయత్నిస్తున్నందునే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని వాదించారు. ఈ కేసును బాంబే హైకోర్టులోని మూడు వేర్వేరు బెంచ్లు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ విచారించలేకపోయాయని ఆయన అన్నారు.కొద్దిసేపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ కేసును శుక్రవారంకు వాయిదా వేశారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ చీఫ్పై ఇలా ఎఫ్ఐఆర్ నమోదు కావడానికిగల కచ్చితమైన కారణాలను ఇరువర్గాలు పంచుకోలేదు. అయితే కొన్ని సంస్థలు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ట్రస్ట్ ఆరోపణలు..ట్రస్ట్ పాలనపై అనవసర నియంత్రణ కోసం జగదీషన్ మాజీ ట్రస్టీ చేతన్ మెహతా నుంచి అనధికారికంగా రూ.2.05 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా ఆయన స్వచ్ఛంద సంస్థ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ట్రస్ట్ పేర్కొంది. లీలావతి ఆస్పత్రిలో జగదీషన్, తన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించారని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ట్రస్ట్ డిపాజిట్ల కింద రూ.48 కోట్లు ఉన్నాయని చెప్పింది.

‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఆకస్మిక గుండె మరణాల పెరుగుదలకు కొవిడ్-19 వ్యాక్సిన్లతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఖండించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు అవాస్తవమని, వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపారు.‘భారత్లో అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను అత్యవసర వినియోగ ఆథరైజేషన్ ఫ్రేమ్వర్క్ కింద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన ప్రోటోకాల్స్ను అనుసరించి ఆమోదించారు. ఈ వ్యాక్సిన్లు హడావుడిగా ఆమోదించారని తెలపడం సరికాదు. ఇది ప్రజల్లో తప్పుడు సమాచారానికి దోహదం చేస్తుంది. ఈ వ్యాక్సిన్లు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే చాలా తక్కువ సంఖ్యలో కొందరిలో దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. నిందలు మోపడం కంటే వ్యాక్సిన్ల అభివృద్ధి వెనుక ఉన్న సైన్స్, డేటా-ఆధారిత ప్రక్రియలను గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాశారు.కమిటీ ఏర్పాటు..హసన్ జిల్లాలో గత నెలలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. పిల్లలు, యువకులు, అమాయకుల మరణాలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాల ఆందోళనలను తాము పంచుకుంటామని సిద్ధరామయ్య సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా ఆమోదించి ప్రజలకు పంపిణీ చేయడం కూడా ఈ మరణాలకు ఒక కారణం కావొచ్చని చెప్పారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సూచించాయని తెలిపారు.భాజపా రాజకీయ లబ్ధి కోసం..కర్ణాటక వ్యాప్తంగా యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కొవిడ్-19 వ్యాక్సిన్లతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను అధ్యయనం చేసే బాధ్యతను ఫిబ్రవరిలో ఇదే నిపుణుల కమిటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. గుండె సంబంధ వ్యాధిగ్రస్తులపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యలను భాజపా నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు.COVID-19 vaccines developed in India were approved under the Emergency Use Authorisation framework, following rigorous protocols aligned with global standards for safety and efficacy. To suggest that these vaccines were ‘hastily’ approved is factually incorrect and contributes to… https://t.co/uMEcMXzBV0— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 3, 2025ఇదీ చదవండి: ‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు: కేంద్రంసిద్ధరామయ్య వాదనలకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని అత్యున్నత ప్రజారోగ్య పరిశోధనా సంస్థలకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్లకు, హసన్ జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) సంయుక్త వివరణలో ప్రస్తుత విశ్లేషణలు కొవిడ్కు ముందు, కొవిడ్ అనంతరం సంభవించిన గుండె సంబంధిత మరణాల మధ్య పెద్ద తేడాలు గుర్తించలేదని తెలిపాయి.
కార్పొరేట్

భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలు

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్ కేసు

‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’

‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’

యస్ బ్యాంక్లో వాటాపై సీసీఐకి దరఖాస్తు

వొడాఫోన్ను పీఎస్యూగా మార్చే ప్రసక్తే లేదు

మైక్రోసాఫ్ట్లో మరిన్ని ఉద్యోగాలు కట్..

బీమా పథకాల మిస్–సెల్లింగ్ వద్దు..

తెలంగాణలో పీవీఆర్ ఐనాక్స్ విస్తరణ

ఆఫీస్ స్పేస్ లీజింగ్.. జీసీసీలు టాప్గేర్

పసిడికి కొనుగోళ్ల కళ
న్యూఢిల్లీ: పసిడి ధరల్లో ఏడు రోజుల నష్టాలకు బ్రేక్...

ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...

ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో ఆచితూచి ఆశావహ దృక్పథంతో భారత ఈక్...

ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఏకంగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...

వస్తు సేవల పన్ను విజయాల పరంపర
భారత్లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను జులై 1, 2017...

భారత్-అమెరికా వాణిజ్యం ఒప్పందం కుదిరేనా?
అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఈ వారంలోనే ఖ...

కార్యకలాపాలను విస్తరించి లిస్ట్ చేయండి
న్యూఢిల్లీ: సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరిం...

‘బ్యాంకులు అప్పులు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి’
కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ అర శాతం తగ్గి...
ఆటోమొబైల్
టెక్నాలజీ

BSNL ఫ్లాష్ ఆఫర్.. మరికొన్ని గంటలే అవకాశం
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5జీ నెట్వర్క్ కింద వాణిజ్య 5జీ సేవలను త్వరలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇవి తాజాగా 90,000 లను దాటాయి. ఈ మైలురాయిని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం పరిమిత కాల ప్రమోషనల్ "ఫ్లాష్ సేల్"ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ "ఫ్లాష్ సేల్"లో భాగంగా 400 జీబీ హైస్పీడ్ 4జీ డేటాను రూ.400లకే అందిస్తోంది. అంటే ఒక జీబీకి ఒక రూపాయి మాత్రమే అన్నమాట. దీనికి 40 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.400 ప్రత్యేక డేటా రీఛార్జ్ ప్యాక్ జూన్ 28 నుంచి అందుబాటులోకి వచ్చింది. జూలై 1 వరకు కొనసాగుతుంది. ఇది డేటా రీచార్జ్ కాబట్టి యూజర్లు ఇప్పటికే ఉన్న ప్లాన్తో కలిపి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. కేవలం 400 జీబీ డేటా మాత్రమే లభిస్తుందని, 400 జీబీ తర్వాత స్పీడ్ 40 కేబీపీఎస్కు తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.BSNL celebrates the milestone of 90,000 towers with a limited-time Flash Sale.Get 400GB for just ₹400, with 40 days validity.Tomorrow is the last day to benefit from this offer.Experience trusted, nationwide connectivity with BSNL.Recharge Now - https://t.co/yDeFrwK5vt… pic.twitter.com/lz7Kv4iKlm— BSNL India (@BSNLCorporate) June 30, 2025

అదిరే గ్యాడ్జెట్స్.. హోమ్ హ్యాపీస్
ఇప్పుడు ఇంట్లో పని గట్టిగా కాదు, గాడ్జెట్స్తో స్మార్ట్గా చేయండి. ఎందుకంటే పని తగ్గించి, సమయాన్ని ఆదా చేసి, సంతోషాన్ని ఇచ్చే కొన్ని హౌస్ గాడ్జెట్లు ఇవిగో మీ కోసం!ఈగలకు నో ఎంట్రీకిటికీ తీయగానే, ఈగలు వచ్చి చుట్టూ తిరగడం కామన్! అలాగని, అవి చెవి దగ్గరకు వచ్చి ‘జూయ్.. జూయ్.. ’ రాగాలు వినిపిస్తూ విసిగిస్తుంటే, చేతికి గాజు వేసుకోండి. అవును, ఈ గాజు పేరు ‘వ్రోక్సీ’ ఇది చూడటానికి గాజులాగే ఉంటుంది కాని, దీని లోపల నేచురల్ ఆయిల్స్, ఇతర ఆయుర్వేద మూలికల వాసనలతో ఈగలకి నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. సాఫ్ట్ సిలికాన్తో ఉంటుంది కాబట్టి చేతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజూ వాడేలా స్టయిలిష్గా, తేలికగా ఉంటుంది. ఇది ఇంట్లోకి, పిక్నిక్కి, క్యాంపింగ్కి బెస్ట్ ఆప్షన్. ధర రూ. 299 మాత్రమే!చేతులకు వెచ్చదనంచలికాలం వచ్చిందంటే మీ చేతులు జారిపోతున్నాయా? ఇంట్లో పని చెయ్యాలన్నా, మొబైల్ స్క్రోల్ చేయాలన్నా, చేతులు తిమ్మిరితో మొద్దుబారితే ఎలా? అప్పుడు వెంటనే మీకు కావాల్సింది మామూలు రూమ్ హీటర్ కాదు, ఈ ‘ఒకూపా హ్యాండ్ వార్మర్’. ఇది చిన్న లిప్స్టిక్ సైజులో ఉంటుంది. ఇందులో రెండు చేతులకూ సరిపోయేలా రెండు మినీ హ్యాండ్ వార్మర్లు మాగ్నెట్కు అంటిపెట్టుకొని ఉంటాయి. వేరుచేసి వాడితే, రెండు చేతులకు వెచ్చదనాన్ని ఇస్తాయి. రెండింటినీ కలిపి వాడితే, చిన్న రూమ్ హీటర్లాగా కూడా పనిచేస్తుంది. అదిరే కాంబో కదా! ఒక్కసారి చార్జ్చేస్తే దాదాపు ఆరుగంటల వరకు పనిచేస్తుంది. ధర రూ. 3,999.వెచ్చని కౌగిలి! ఇంటి పని అంతా ముగించుకుని కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటే; వెన్నునొప్పులు, కాళ్ల నొప్పులు వెంటనే ‘‘హాయ్ సిస్టర్!’’ అని వచ్చేస్తాయి. నెలసరి సమయంలో ఇవి మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పడే ఒక మంచి సహాయం మసాజ్తో కాదు, వెచ్చదనంతో కావాలి. ఆ వెచ్చదనం అందించే స్నేహితురాలే ఈ ‘హగ్బ్యాగ్’! ఇది కేవలం బొమ్మ కాదు. ఇది ఓ చిట్టి డాక్టర్ లాంటిది. క్యూట్ టాయ్లా కనిపిస్తుంది కాని, లోపల మాత్రం వాటర్ బాటిల్తో ఉంటుంది. అందులో వేడి నీళ్లు పోసి, వెచ్చని చికిత్సను ఇంట్లోనే పొందొచ్చు. వంటింట్లో గంటల పాటు నిలబడి పని చేసిన తర్వాత ఇది పట్టుకొని పడుకోండి, గట్టిగా నిద్ర పడుతుంది. నెలసరి నొప్పుల నుంచి ఇది చక్కని ఉపశమనం కూడా ఇస్తుంది. ధర రూ.799 మాత్రమే!మీ మాటే తనకు శాసనం!చెప్పిందే పది సార్లు చెప్పినా కూడా టీవీలో మునిగిపోయిన భర్త వినడు, గేమ్స్లో లీనమైపోయిన పిల్లలు వినరు. ఇక అత్త మామలకైతే వాట్సాప్లో మెసేజ్ చేసినా, బ్లూటిక్ పడటానికి పదిరోజులు పడుతుంది. ఇలా ఇంట్లో ఎవరూ మీ మాట వినకపోయినా! ఈ ‘అలెక్సా ఎకో పాప్’ మాత్రం మీ మాటే శాసనంగా పాటిస్తుంది. ఎందుకంటే, ఇది అలెక్సా సరికొత్త, స్మార్ట్ మోడల్. మీకు టైమింగ్ గుర్తు చేస్తుంది, పాటలు పాడుతుంది, టీవీ, లైట్లు ఆన్, ఆఫ్ చేస్తుంది. అలాగే, లేటెస్ట్ షాపింగ్కు కావాల్సిన డిస్కౌంట్ ఆఫర్లు కూడా చెబుతుంది. ఇది మీ ఇంట్లో ఉండాలంటే, పెద్ద కారణాలు అవసరం లేదు. కాని, ఇది ఉంటే మాత్రం మీ పనులు చకచకా చిటికెలో జరిగిపోతాయి. ఇకపై ‘మా ఇంట్లో ఎవరూ నా మాట వినరు’ అనే ఫీలింగ్ కూడా ఉండదు. ధర రూ. 4,499.

రెండు సంస్థల ఆధిపత్యం మంచిది కాదు
న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా రెండే సంస్థల గుత్తాధిపత్యం ఉంటే మంచిది కాదని టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా మరింత పోటీ ఉండాలని బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. దేశీ టెలికం రంగంలో భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఆధిపత్యం నడుస్తుండటం, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం, బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను ప్రవేశపెట్టడంపై కసరత్తే చేస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఆయన చెప్పారు. వైఫై సరీ్వసులకు ఉపయోగపడే 6 గిగాహెట్జ్ స్పెక్ట్రం డీలైసెన్సింగ్కి సంబంధించి ఆగస్టు 15లోగా ప్రభుత్వం నిబంధనలను ప్రకటించే అవకాశం ఉందని సింధియా చెప్పారు. శాటిలైట్ కమ్యూనికేషన్స్ సరీ్వసులకు త్వరలోనే స్పెక్ట్రం కేటాయించనున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరికి టెక్నాలజీ ఫలాలు అందేలా అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ బాధ్యతని సింధియా చెప్పారు. సాధారణంగా పరిమాణం పెరిగే కొద్దీ ధర తగ్గుతుందని, ఒకప్పుడు దేశీయంగా ఫోన్ కాల్ చేస్తే నిమిషానికి రూ. 16 చార్జీ ఉండేదని, పదేళ్ల క్రితం అది అర్థ రూపాయికి తగ్గిందని, ఇప్పుడు 0.03 పైసలకు దిగి వచి్చందని ఆయన తెలిపారు. మరోవైపు ప్రజలు మరింతగా బ్రాడ్బ్యాండ్ వినియోగించుకునేందుకు వీలుండేలా డివైజ్లను చౌకగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలని డివైజ్, చిప్ల తయారీ కంపెనీలను మంత్రి కోరారు.

సింపుల్ యాప్లు.. సీక్రెట్గా దోచేస్తున్నాయ్..
ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లలో ఏవేవో పదుల సంఖ్యలో యాప్లు ఉంటున్నాయి. వివిధ అవసరాల నిమిత్తం వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అధికారిక గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఇవేం హాని చేయవులే అనుకుంటున్నారా? హానిచేయనిదిగా కనిపించే యాప్ నిశ్శబ్దంగా మీ ఫొటోలను స్కాన్ చేస్తుంది. మీ డిజిటల్ లైఫ్కు సంబంధించిన ఆధారాల కోసం శోధిస్తుంది. ఆ యాప్ మీ మనీ వాలెట్లను టార్గెట్ చేస్తే.. ఇది ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ సాధారణ సెక్యూరిటీ గేట్లను దాటింది. ఇది సుదూర ముప్పు కాదు. ఇది ప్రస్తుతం జరుగుతోంది.రిస్క్తో కూడుకున్న వ్యవహారంచాలా మంది అధికారిక ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసే యాప్లను నమ్ముతారు. ఎందుకంటే ప్రమాదకర యాప్లను ఇవి తొలగిస్తాయని చెబుతుంటాయి. కానీ స్పార్క్ కిట్టీ అనే కొత్త మాల్వేర్ స్ట్రెయిన్ ఈ తనిఖీలను అధిగమించగలిగింది. భద్రతా పరిశోధకులు దీనిని మొదట 2025 ప్రారంభంలో గుర్తించారు. అప్పటి నుండి ఇవి సాధారణంగా కనిపించే యాప్లుగా మారిపోయాయి. వీటిని గుర్తించకముందే కొంతమంది వేల సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు.ఏం చేయాలంటే..ఈ ట్రిక్ సింపుల్ కానీ ఎఫెక్టివ్ గా ఉంటుంది. మెసేజింగ్ లేదా క్రిప్టో ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించే యాప్లలో స్పార్క్ కిట్టీ దాగి ఉంది. ఇన్ స్టాల్ చేసిన తర్వాత, ఇది మీ ఫోటోలను యాక్సెస్ చేయడానికి అనుమతి అడుగుతుంది. చాలా మంది యూజర్లు దీని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించరు. కానీ తెరవెనుక, మాల్వేర్ టెక్స్ట్ కోసం చిత్రాలను స్కాన్ చేయడానికి ఆప్టికల్ క్యారెక్టర్ గుర్తింపును ఉపయోగిస్తుంది.మీరు విశ్వసించే డెవలపర్ల నుంచి మాత్రమే యాప్లను డౌన్ లోడ్ చేయండి. ఇన్ స్టాల్ చేయడానికి ముందు యాప్ రివ్యూలు, వివరాలను తనిఖీ చేయండి. స్పష్టమైన కారణం లేకుండా మీ ఫోటోలు లేదా ఫైళ్లకు యాప్ యాక్సెస్ అడిగితే జాగ్రత్తగా ఉండండి. రికవరీ పదబంధాలు లేదా పాస్ వర్డ్ లను మీ ఫోటో గ్యాలరీలో ఎప్పుడూ స్టోర్ చేయవద్దు. సున్నితమైన డేటా కోసం ఎన్ క్రిప్టెడ్ స్టోరేజ్ లేదా పాస్ వర్డ్ మేనేజర్ ఉపయోగించండి.
పర్సనల్ ఫైనాన్స్

‘మెట్రో నగరాల్లో రియల్టీ మార్కెట్ ఓ ట్రాప్’
దేశంలోని మెట్రో నగరాల్లో రియల్టీ మార్కెట్ను ఉద్దేశిస్తూ ప్రముఖ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ తాను గమనించిన అత్యంత అవినీతి రంగాల్లో రియల్ఎస్టేట్ మార్కెట్ ఒకటని చెప్పారు. ఈ రంగం నల్లధనంతో కుదేలైందని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో వాస్తవ గృహ డిమాండ్ ద్వారా కాకుండా అక్రమ పెట్టుబడి ప్రవాహాల వల్ల పట్టణ ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు.రిగ్గింగ్ గేమ్సంపన్న పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ను ఆసరాగా చేసుకొని పన్ను చెల్లించని డబ్బును నిల్వ చేసి కృత్రిమంగా ధరలు పెంచుతున్నట్లు తెలిపారు. సాధారణ ప్రజలను ఉద్దేశించి ‘మీరు వాస్తవంగా రియల్టీ పెరుగుదలను పరిగణించి ఆస్తులు కొనుగోలు చేయడం లేదు. రిగ్గింగ్ గేమ్లో వాటిని కొంటున్నారు’ అని అన్నారు. తన వాదనను మరింత సమర్థించేలా ముంబయిలో 20 శాతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో తొమ్మిది కుటుంబాలదే పైచేయని తెలిపే డేటాను ఎత్తి చూపారు.ఇదీ చదవండి: లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్స్ఖర్చుతో మానసిక సౌకర్యంస్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ మెట్రో నగరాల్లో అద్దె రాబడులు మాత్రం 2–3% వరకు ఉంటున్నాయని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ను ఉత్పాదక ఆస్తిగా కాకుండా, అనుమానాస్పద ఆర్థిక స్థితిలోని నెట్టివేస్తుందని తెలిపారు. మెట్రో నగరాల్లో ఇల్లు ఉండడం ఆర్థిక ఖర్చుతో కూడిన మానసిక సౌకర్యాన్ని అందిస్తుందని చెప్పారు.కొనుగోలుదారులకు సలహాలు..అద్దె రాబడులు మొత్త ఆస్తి విలువలో ఏటా 4% మించకపోతే కొనుగోలు చేయవద్దని శ్రీవాస్తవ అన్నారు.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేమని సేల్స్ ఒత్తిడికి లోనవ్వకూడదు. ఆర్థికంగా అన్ని చూసుకోవాలి.మెట్రోలకు బదులుగా టైర్-2, 3 నగరాలపై ఓ లుక్కేయండి.

ఐటీ రిటర్నులు ఎవరు ఫైల్ చేయాలి..?
ఇదొక ప్రశ్నా..? అనుకోకండి... ఆదాయం అంటే నికర ఆదాయం లేదా టాక్సబుల్ ఇన్కం బేసిక్ లిమిట్ దాటిన ప్రతి వ్యక్తీ, ప్రతి ఏటా విధిగా, కచ్చితంగా సకాలంలో రిటర్నులు దాఖలు చేయాలి. ఇదొక ప్రాథమిక సూత్రం. ఫాలో అవ్వండి. చట్ట ప్రకారం, వ్యక్తులకు ఎటువంటి ఆదాయం లేకపోయినా బేసిక్ లిమిట్ పరిధిలోకి వస్తారు. టాక్స్బుల్ ఇన్కం ఉంటే ఆదాయపు పన్ను రిటర్నులు చేయాల్సిందే. ఇటువంటి వ్యక్తులు ఎవరు? ఏమిటా సందర్భము? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..మీరు ఒక సంవత్సరం కాలం, అంటే ఓ ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి రూపాయిలు దాటి బ్యాంకులో డిపాజిట్ చేశారనుకొండి. మీరు రిటర్ను వేయాల్సిందే. అమెరికా నుంచి మీ అబ్బాయి రూ.కోటి దాటి పంపితే, అది మీ అకౌంటులో జమ కాబట్టి మీరు రిటర్ను వేయాలి. సాంకేతికంగా ఒక సలహా.. మీ అకౌంట్లో కోటి లోపు, మీ జీవిత భాగస్వామి అకౌంట్లో కోటి లోపు వేసినట్లయితే ఈ బాధ్యత నుంచి బయట పడవచ్చు. ఇటువంటి బదిలీల వలన మీకు ఎటువంటి పన్ను భారం మాత్రం ఉండదు.మీరు ఓ కంపెనీకి డైరెక్టర్ అనుకోండి. లేదా లిమిటెడ్ పార్టనర్ షిప్లో భాగస్వామి అనుకోండి. జీతం/పారితోషికం/కమీషన్ ఏమీ తీసుకోకపోయినా రిటర్ను వేయాల్సిందే. దగ్గరి వారో లేదా మిత్రులో.. ప్రోద్బలం వల్ల కంపెనీ పెట్టవచ్చు. లిమిటెడ్ పార్టనర్షిప్లో చేరవచ్చు. మీకు ఎటువంటి బరువు, బాధ్యతలు ఉండకపోవచ్చు. కానీ రిటర్ను మాత్రం వేయాలి. మీకు చెప్పుకుండా మీ పేరు కూడా వాడుకోవచ్చు. తగిన జాగ్రత్త వహించాలి.విదేశీయానం మీద రూ.2 లక్షలు దాటి పెట్టారనుకోండి. మీరు రిటర్ను దాఖలు చేయాలి. అలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందీ, పన్ను భారం ఉండకపోవచ్చు. మీ అబ్బాయో/అమ్మాయో టికెట్ కొనమనండి. ఆ డబ్బుల్ని వారిని చెల్లించమనండి.మీకు కరెంట్ బిల్లు సంవత్సరంలో రూ.ఒక లక్ష దాటింది అనుకొండి. ఆ షాక్తో పాటు రిటర్ను దాఖలు షాక్ కూడా మీ నెత్తిన పడుతుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో మీ పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయనుకోండి. అన్నీ కలిపి మీ పేరు మీద బిల్లు రూ.లక్ష దాటింది అనుకోండి. మీకు ఈ బాధ్యత వర్తిస్తుంది. కరెంటు బిల్లు.. ఇంటికి, బిల్డింగ్కి, అపార్ట్మెంట్కి, కమర్షియల్ ప్రాపర్టీకే కాదు ఒక వ్యక్తికి వస్తుంది. ఇలాంటి జాబితాలో చాలామంది ఉంటారు. ఉన్నారు. ప్రస్తుతం సమాచార సమన్వయం లేకపోవడంతో వీళ్లు తప్పించుకుంటున్నారు. కానీ కృత్రిమ మేథస్సు వలన ఇవన్నీ బయటపడతాయి.మీ విషయంలో టీడీఎస్ రూ.25,000 లేదా ఆపైన జరిగిందనుకోండి. సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ లిమిట్ రూ.50,000గా ఉంటుంది. వీరు రిటర్ను వేయాల్సిందే. వెంటనే ఫారం 16/ఫారం 16ఏ చెక్ చేసుకోండి. ‘నిప్పు లేనిదే పొగరాదు’ మాదిరిగా ఏదొక వ్యవహారం జరగనిదే టీడీఎస్ కోత తప్పదు. ఈ వ్యవహారాన్ని బయట పెట్టే సందర్భమే... ఈ రిటర్ను వేయడం.మీ వ్యాపారం/బిజినెస్/వసూళ్లు/ అమ్మకాలు సంవత్సర కాలంలో రూ.60 లక్షలు దాటాయనుకోండి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ద్వారా ఇది బయటపడుతుంది. అలాగే వృత్తి పరంగా వచ్చే ఆదాయం ఏటా రూ.10 లక్షలు దాటిందంటే రిటర్ను వేయాలి. ఈ రెండు కేసుల్లోనూ నికర ఆదాయంతో సంబంధం లేదు. లాభనష్టాలతో అసలు పనేంలేదు. రిటర్ను వేయాలి.టీడీఎస్ జరిగింది.. ఆదాయం టాక్స్బుల్ ఇన్కం లోపల ఉన్నా, ఆదాయం ఏమాత్రం లేకున్నా, పన్ను భారానికి మించి టాక్స్ కట్ చేసినా రిఫండ్ పొందాలి. రిఫండ్ కోసం రిటర్ను వేయాల్సిందే.ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలుచివరిగా, మీకు రుణాల మంజూరు, విదేశీ ప్రయాణాలకు వీసాలు లాంటి విషయాల్లో .. గౌరవం, పరపతి, గుర్తింపు ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి రిటర్నులు వేయడంపై దృష్టి పెట్టండి. ఎగవేత మార్గాన్ని ఎంచుకోకండి.

స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు
నేను స్వల్పకాలం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలమైన సాధనాలు ఏవి? – నళినీ ప్రకాశ్స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారు పెట్టుబడిని కాపాడుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పెట్టుబడి భద్రంగా ఉన్నప్పుడే రాబడులు సాధ్యపడతాయి. స్వల్పకాల పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మార్గం. సేవింగ్స్ ఖాతాలో ఉంచడం వల్ల వచ్చే రాబడి కంటే ఎఫ్డీలోనే అధికంగా లభిస్తుంది. కచ్చితమైన రాబడి కావాలని కోరుకునే వారికి ఎఫ్డీ కంటే మెరుగైన సాధనం లేదు. బ్యాంకులో రూ.5 లక్షల వరకు డిపాజిట్పై బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (డీఐసీజీసీ) రూపంలో ఆర్బీఐ ద్వారా ఈ బీమా సదుపాయం లభిస్తుంది. ఒకవేళ బ్యాంకు సంక్షోభంలో పడినా రూ.5 లక్షల వరకు ఒక వ్యక్తికి భరోసా ఉంటుంది. కానీ, ఈ తరహా సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎఫ్డీల రూపంలో వచ్చే వడ్డీ ఆదాయం సంబంధిత పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎఫ్డీపై రాబడి పన్ను వర్తించే ఆదాయం కిందకే వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే కనుక ఎఫ్డీ ద్వారా వచ్చే నికర ఆదాయం పెద్దగా ఉండదని అర్థం చేసుకోవాలి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ఇక స్వల్పకాల పెట్టుబడుల కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్ను కూడా పరిశీలించొచ్చు. ఫండ్స్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను పడుతుంది. డెట్ ఫండ్లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభం అని లేదు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి.. ఆ తర్వాత కాలంలో విక్రయించినట్టయితే వచ్చే మూలధన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఏ శ్లాబు పరిధిలో ఉండే ఆ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇన్వెస్టర్లు తమ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా వీటిల్లో అనుకూలమైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల కోసం అయితే మంచి లిక్విడ్ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది అంతకుమించిన కాలానికి అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మంచి ఎంపిక. అంతకుమించిన కాలానికి అయితే షార్ట్ డ్యురేషన్ ఫండ్ అనుకూలం. డెట్ ఫండ్స్ అన్నవి రాబడులకు కానీ, పెట్టుబడికి కానీ హామీ ఇవ్వవు. కానీ, ఎఫ్డీల్లో పెట్టుబడి, రాబడికి హామీ ఉంటుంది. డెట్ ఫండ్స్లో మెరుగైన రేటింగ్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసే పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ నాణ్యమైన పేపర్లలో పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్లో రాబడులతో పాటు రిస్క్ కూడా ఎక్కువ. డిపాల్ట్ రిస్క్ ఉంటుంది. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ చాలా ఉన్నాయి కదా.. వీటి నుంచి మంచి పథకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? – వెంకటస్వామిఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కవ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ట్రాకింగ్ ఎర్రర్ను కూడా గమనించాలి.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనఒక ఇండెక్స్ ఫండ్.. అది పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది తెలియజేస్తుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా ఇండెక్స్ ఫండ్ను ఎంపిక చేసుకోండి.-ధీరేంద్ర కుమార్, సీఈఓ వ్యాల్యూ రీసెర్చ్.

రాబడుల తీరుతెన్నులే పోర్ట్ఫోలియోకు కీలకం..
పెట్టుబడులకు సంబంధించి ఏ పోర్ట్ఫోలియోకైనా రాబడుల ధోరణే కీలకంగా ఉంటుంది. ఉదాహరణకు ఓ సందర్భాన్ని ఊహించుకోండి. మీకు ఇష్టమైన క్రికెట్ టీమ్ భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో ప్రారంభంలోనే ఓ అయిదు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బాగానే ఆడినా, మ్యాచ్ పూర్తయ్యేంతవరకు టీమ్పై ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. అలా కాకుండా, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్రారంభంలోనే భారీ స్కోర్ చేస్తే టీమ్పై ఒత్తిడి తగ్గుతుంది. గెలిచే అవకాశాలూ కాస్త మెరుగ్గా ఉంటాయి. దీన్నే ఇన్వెస్టింగ్ కోణంలో ఒకసారి చూద్దాం. రాము, కృష్ణ ఇద్దరూ ఒకేసారి ఒకే తరహాలో రూ. 1 కోటి కార్పస్తో రిటైరయ్యారు.ఏటా రూ. 5 లక్షల చొప్పున విత్డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే పదేళ్లలో రూ. 50 లక్షలు విత్డ్రా చేసుకున్నారు. పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్లపై వచ్చే రాబడులతో పదేళ్ల తర్వాత, రాము నిధి రూ. 37.32 లక్షలు పెరగ్గా, కృష్ణ నిధి రూ. 58.52 లక్షలు పెరిగింది. రెండింటి మధ్య వ్యత్యాసం ఏకంగా 36 శాతం ఏర్పడింది. నిర్దిష్ట వ్యవధిలో మొత్తం విత్డ్రా చేసుకున్నది, ఆఖర్లో ఉన్న బ్యాలెన్స్ను కలిపితే రాము మొత్తం రూ. 87.32 లక్షలు ఆర్జించినట్లు కాగా, కృష్ణ రూ. 1.08 కోట్లు (రూ. 50 లక్షలు + రూ. 58.52 లక్షలు) ఆర్జించినట్లయింది. 2015–19 మధ్య కాలంలో వరుసగా అయిదేళ్ల పాటు నెగటివ్ రిటర్న్స్ నమోదై, రూ. 50 లక్షలు విత్డ్రా చేసుకున్నప్పటికీ కృష్ణ నిధి అసలు మొత్తం మీద మరో రూ. 8.52 లక్షల మేర పెరిగింది. పదేళ్లలో రాము రాబడులనేవి –5%, –6%, –15%, –8%, –4%, 5%,7%,9%,11%, 9%గా నమోదయ్యాయి. అదే సమయంలో దీనికి భిన్నంగా కృష్ణ రాబడులు 9%, 11%, 9%, 7%,5%,–4%, –8%, –15%, –6%, –5%గా నమోదయ్యాయి. రాము బేర్ ఫేజ్లో పెట్టుబడులు ప్రారంభించగా, కృష్ణ బుల్ ఫేజ్లో పెట్టుబడులు పెట్టారు. ఇలా పెట్టుబడులు పెట్టే సమయమనేది పోర్ట్ఫోలియోపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. ఇద్దరు ఇన్వెస్టర్లు తమ సేవింగ్స్ నుంచి ఒకే స్థాయిలో విత్డ్రా చేస్తున్నా, అసలు మొత్తం భిన్నంగా ఉండటం వల్లే ఇద్దరి రాబడుల్లో అంతరానికి కారణమైంది. ఉదాహరణకు తొలి ఏడాది మార్కెట్లు 5 శాతం పడి, రూ. 5 లక్షలు విత్డ్రా చేసుకున్నప్పుడు రాము కార్పస్ రూ. 90 లక్షలకు తగ్గిపోయింది. కానీ కృష్ణ కూడా అంతే మొత్తం విత్డ్రా చేసుకున్నప్పటికీ తొలి ఏడాదిలో 9 శాతం రాబడి రావడంతో ఆయన బ్యాలెన్స్ రూ. 1.04 కోట్లకు పెరిగింది. కృష్ణ పెట్టుబడులపై ఆరో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వరకు నెగటివ్ రాబడులే వచి్చనప్పటికీ, చివరికి వచ్చే సరికి రాము స్థాయి ప్రతికూల ప్రభావం కృష్ణపై పడలేదు. తొలి ఐదేళ్లలో రాము పెట్టుబడులపై రాబడులు క్షీణించడంతో పాటు ఏటా రూ. 5 లక్షలు వెనక్కి తీసుకుంటూ ఉండటమనేది అతని పోర్ట్ఫోలియో విలువపై బాగా ప్రతికూల ప్రభావం చూపింది. రాబడులు వచ్చే తీరుతెన్నులు ఏ విధంగా పోర్ట్ఫోలియోను ప్రభావితం చేస్తాయనేది ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడే రిటైరీలకు ఇది మరీ ముఖ్యమైన విషయం. ఈ కాన్సెప్టు థియరీ ప్రకారం కరెక్టే అయినప్పటికీ .. సరైన సమయంలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమనేది ఎవరికైనా కష్టమే. ముఖ్యంగా రిటైరీలకు మరింత సమస్యగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రస్థానంలో రిటర్న్ రిసు్కల సీక్వెన్స్ను పరిగణనలోకి తీసుకుని ప్లానింగ్ చేసుకోవడం కీలకంగా ఉంటుంది.‘బకెటింగ్’తో రిసు్కలకు చెక్.. చారిత్రకంగా సెన్సెక్స్ వరుసగా రెండేళ్ల పాటు 1986–87, 1995–97, 2000–01లో క్షీణించింది. అయితే, మరింత లోతుగా పరిశోధిస్తే (నెలవారీ లేదా రోజువారీ రిటర్నులు) ఇలాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి. బకెటింగ్ విధానంతో ఇన్వెస్టర్లు ఇలాంటి రిస్కులను అధిగమించవచ్చు. ఈ విధానంలో కార్పస్ను స్వల్పకాలికం (ఫిక్సిడ్ ఇన్కం పోర్ట్ఫోలియో), మధ్యకాలికం (హైబ్రిడ్), దీర్ఘకాలిక (ఈక్విటీ) ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసి, అదనంగా మరో ఆదాయ మార్గాన్ని కూడా ఏర్పర్చుకుంటే, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు బఫర్గా పని చేస్తుంది.ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు తమ విత్డ్రాయల్ రేటును తగ్గించుకుని, ఏదైనా ఫిక్సిడ్ యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేయొచ్చు లేదా డెట్, బంగారం, రీట్లు, ఇంటర్నేషనల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పోర్ట్ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించవచ్చు. తద్వారా మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నష్టపోయే అవకాశాలను తగ్గించుకోవచ్చు. కార్పస్ ఫండ్ నుంచి విత్డ్రా చేసుకునే యోచనతో, భారీ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను రూపొందించుకుంటున్నప్పుడు, రాబడుల తీరుతెన్నులను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. భారీ టార్గెట్ను ఛేదించేటప్పుడు ప్రారంభంలోనే వేగంగా స్కోర్ చేస్తే గెలిచే అవకాశాలు ఎలాగైతే ఎక్కువగా ఉంటాయో, పెట్టుబడుల ప్రస్థానంలో తొలినాళ్లలో మెరుగైన రాబడులు రావడం వల్ల మీ పోర్ట్ఫోలియో తుది విలువపై సానుకూల ప్రభావం ఉంటుంది. - అజిత్ మీనన్ ,సీఈవో, పీజీఐఎం ఇండియా ఎంఎఫ్