Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Rolls-Royce unveiled a major India expansion plan1
భారత్‌లో రోల్స్-రాయ్స్ విస్తరణ చర్యలు

ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్‌, ఇంజినీరింగ్‌ దిగ్గజం రోల్స్-రాయ్స్ భారత్‌లో తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ భారత రక్షణ రంగ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతను అందించడమే కాకుండా స్థానికంగా ఇంజిన్ల తయారీకి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోల్స్-రాయ్స్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్ బిల్గిక్ ఇటీవల సమావేశమైన నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడటం విశేషం.ప్రకటనలోని అంశాలు..భారత తదుపరి తరం యుద్ధ విమానాల కోసం 120 కేఎన్‌ క్లాస్ కాంబాట్ జెట్ ఇంజన్‌ను అభివృద్ధి చేసేందుకు రోల్స్-రాయ్స్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి పూర్తి మేధో సంపత్తి హక్కులతో పాటు వంద శాతం సాంకేతిక బదిలీ జరుగుతుంది. ఇది స్వదేశీ రక్షణ పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భారత ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ కోసం అవసరమైన ఇంజన్లను భాగస్వామ్య సంస్థలతో కలిసి ఇక్కడే తయారు చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.వికసిత్ భారత్ దిశగా అడుగులుప్రధాని మోదీతో భేటీ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎర్గిన్ బిల్గిక్ వెల్లడించారు. ‘మా అత్యాధునిక సాంకేతికతతో భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం’ అని సీఈఓ అన్నారు.ఉపాధి, ఆర్థిక వృద్ధిఈ విస్తరణ ప్రణాళికల వల్ల భారత్‌లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం రోల్స్-రాయ్స్, దాని భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సుమారు 10,000 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుత సంఖ్య కంటే రెట్టింపు. భారత్ నుంచి కంపెనీ చేసే ఔట్‌ సోర్సింగ్ సర్వీసులు రాబోయే కాలంలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరుతుంది. రక్షణ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన పవర్ సొల్యూషన్లను అందించడానికి కూడా సంస్థ సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..

​how Love Beyond Language Bound by the Market Valentines Day2
ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..

ప్రేమకు భాషతో పనిలేదు అంటారు. అది వాస్తవమే అయినా భాషలకు అతీతంగా యువతీ యువకుల ప్రేమైనా, తల్లిదండ్రుల ప్రేమైనా, అన్నా చెల్లల ప్రేమనా.. మార్కెట్‌తో కనెక్ట్‌ అవ్వాల్సిందే. నేటి కాలంలో ప్రేమకు ‘మార్కెట్’తో విడదీయలేని ముడిపడి ఉంది. ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే ఇప్పుడు కేవలం ఒక భావోద్వేగపూరితమైన రోజుగా మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఒక భారీ కమర్షియల్ ఈవెంట్‌గా అవతరించింది. భారత్‌లో ఈ ఒక్క రోజున జరిగే వ్యాపారం విలువ సుమారు రూ.25,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల వరకు ఉంటుందని వాణిజ్య వర్గాల అంచనా.విందులు.. వినోదాలువాలెంటైన్స్ డే ప్రభావం అత్యధికంగా కనిపించేది హోటళ్లు, రెస్టారెంట్లపైనే. క్యాండిల్ లైట్ డిన్నర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కపుల్ మెనూ’లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే ఈ రోజు రెస్టారెంట్ల ఆదాయం 40-50% పెరుగుతుంది. నగరాల్లోని ఫైవ్‌స్టార్‌ హోటళ్లు లవ్ ప్యాకేజీల పేరుతో బస, స్పా, డిన్నర్ కలిపి ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.బహుమతుల్లో కొత్త పోకడలువస్తువుల క్రయవిక్రయాల్లో ఈ సీజన్‌లో మెరుగైన వృద్ధి కనిపిస్తుంది. గులాబీ పూల ఎగుమతి, దిగుమతులు ఈ వారంలో పీక్ స్టేజ్‌లో ఉంటాయి. కేవలం ఒక్క రోజులోనే కోట్లాది రూపాయల విలువైన గులాబీలు అమ్ముడవుతాయి. ప్రత్యేకంగా ఫొటోలు ఉన్న బహుమతులు, కస్టమైజ్డ్ జువెలరీ, గాడ్జెట్స్‌కు యువత ప్రాధాన్యత ఇస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్‌ సంస్థలు ప్రత్యేకంగా సేల్స్ నిర్వహించడం వల్ల ఆన్‌లైన్ షాపింగ్ వృద్ధి నమోదు చేస్తుంది.టూరిజంప్రేమికులు ఏకాంతంగా గడపడానికి పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవడంతో ట్రావెల్ ఇండస్ట్రీకి లాభాలొస్తాయి. దేశీయంగా గోవా, ఉదయ్‌పూర్, కేరళ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు విమాన టిక్కెట్లు, హోటల్ రూమ్స్ నెల రోజుల ముందే బుక్ అవుతున్నాయి. విదేశీ ప్రయాణాల్లో భాగంగా మాల్దీవులు, థాయిలాండ్, బాలి వంటి దేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ సంస్కృతి నేడు భారత్‌లో ఒక బలమైన వాణిజ్య శక్తిగా మారింది. వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యం పెరగడం, సోషల్ మీడియా ప్రభావం వెరసి వాలెంటైన్స్ డేని ఒక బిలియన్ డాలర్ ఇండస్ట్రీగా మార్చేశాయి.ఇదీ చదవండి: రాజ్‌పాల్‌ యాదవ్‌ గ్యారేజీలోని కార్ల లిస్ట్‌ ఇదే..

standard engineering establishment new plant3
స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ కొత్త ప్లాంటు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హై–ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ సేవల సంస్థ స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ (గతంలో స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ) రూ. 240 కోట్లతో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో రూ. 120 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ ప్రమోటర్‌ కందుల నాగేశ్వరరావు తెలిపారు. ఇది వచ్చే ఏడాది వ్యవధిలో అందుబాటులోకి రాగలదని చెప్పారు. అలాగే ఇప్పుడున్న ప్లాంట్లపై దాదాపు రూ. 60 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు, ఇప్పటికే రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా వివరించారు. ఈ ఏడాదిలో సుమారు రూ. 760–800 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు, ప్రస్తుతం 95 రకాల ఉత్పత్తులను అందిస్తున్నట్లు నాగేశ్వరరావు చెప్పారు. ఆదాయంలో ఎగుమతుల వాటా 13 శాతంగా ఉన్నట్లు వివరించారు. శుక్రవారం షేరు సుమారు 2 శాతం క్షీణించి రూ. 129.70 వద్ద క్లోజయ్యింది.

Visa Introduces Single 16 Digit Card for Credit and Debit in India4
డబ్బుఉందా? డెబిట్‌! లేదా? క్రెడిట్‌!

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ మరో కీలక మలుపు తీసుకుంటోంది. అంతర్జాతీయ చెల్లింపుల దిగ్గజం వీసా త్వరలో భారత్‌లో ఒకే కార్డుతో అటు డెబిట్‌కి, ఇటు క్రెడిట్‌కి రెండు విధాలుగా ఉపయోగపడేలా ‘డెబిట్‌–కమ్‌–క్రెడిట్‌ కార్డు’ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త విధానం వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, దేశంలో క్రెడిట్‌ వినియోగాన్ని విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూపీఐ, డెబిట్, క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే ప్రస్తుతం భారత్‌లో యూపీఐ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, అది ప్రధానంగా బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్‌ అయ్యే విధానమే. డెబిట్‌ కార్డులు కూడా ఖాతాలో డబ్బు ఉంటేనే పనిచేస్తాయి. మరోవైపు, క్రెడిట్‌ కార్డులు సౌకర్యవంతమే అయినా వాటి వినియోగం డిజిటల్‌ రూపంలో,యూపీఐ చెల్లింపుల విషయంలో ఇంకా పరిమితంగానే ఉంది. ఈ నేపథ్యంలో వీసా తీసుకొస్తున్న కొత్త కార్డు యూపీఐతో అందే సౌలభ్యం, డెబిట్‌ కార్డుతో చేయగల నియంత్రణ, క్రెడిట్‌ కార్డు ఫ్లెక్సిబిలిటీ ఈ మూడింటినీ కలిపిన ఉపయోగకరమైన సాధనంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. బ్యాంకులు, వినియోగదారులకు లాభాలు ఈ కొత్త విధానం ద్వారా బ్యాంకులు తమ రిస్క్‌ పాలసీలకు అనుగుణంగా క్రెడిట్‌ వినియోగాన్ని నియంత్రించగలుగుతాయి. వినియోగదారులకు మాత్రం ఒకటి కంటే ఎక్కువ కార్డులని ప్రతిచోటుకూ మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా స్థిర ఆదాయం ఉన్నా క్రెడిట్‌ కార్డు లేని మధ్యతరగతి వర్గానికి ఇది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం నిపుణుల అంచనాల ప్రకారం, ఈ విధానం నగదు వినియోగాన్ని తగ్గించడంలో, టైర్‌–2, టైర్‌–3 నగరాల్లో కార్డు వినియోగాన్ని పెంచడంలో, ఫార్మల్‌ ఎకానమీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే, అతిగా క్రెడిట్‌ వినియోగం వల్ల వినియోగదారుడు అప్పుల ఊబిలో కూరుకునే ప్రమాదం కూడా ఉందని, అందుకే ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వీసా ప్రతిపాదిస్తున్న ఈ డెబిట్‌–కమ్‌–క్రెడిట్‌ కార్డు భారత్‌ చెల్లింపుల వ్యవస్థను మరింత స్మార్ట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా మార్చే విధానంగా పరిగణించవచ్చు. ఇది వినియోగదారుల సౌకర్యం, బ్యాంకులకు భద్రత ఈ రెండింటికీ మధ్య సమతుల్యత తీసుకురావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. కార్డు కాదు కాంబోప్యాక్‌ వీసా అభివృద్ధి చేసిన ‘ఫ్లెక్సిబుల్‌ క్రెడెన్షియల్‌ (వీసా ఫ్లెక్స్‌) ’ టెక్నాలజీ ఆధారంగా ఈ కార్డు పనిచేస్తుంది. 16 అంకెల ఒకే కార్డు నంబర్‌ ద్వారా కస్టమర్‌ లావాదేవీ చేసే సమయంలో అది అవసరాన్ని బట్టి డెబిట్‌గా లేదా క్రెడిట్‌గా వాడుకోవచ్చు. చెల్లింపు ఎలా జరగాలన్నది కస్టమర్‌ కొనుగోలు చేసే విలువ మొత్తం, లేదా వినియోగదారు ముందుగా ఎంచుకున్న సెట్టింగ్స్‌ ఆధారంగా ఆటోమేటిక్‌గా నిర్ణయమవుతుంది.ఉదాహరణకు, రోజువారీ చిన్న ఖర్చులు డెబిట్‌గా, పెద్ద కొనుగోళ్లు క్రెడిట్‌లో జరిగేలా ఈ కార్డును సెట్‌ చేసుకోవచ్చు.భారత్‌ ఎందుకు కీలక మార్కెట్‌? భారత్‌లో క్రెడిట్‌ కార్డు వినియోగం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ. అదే సమయంలో నగదు లావాదేవీల వాటా చాలా పెద్దది. ఈ పరిస్థితిలో ఒకే కార్డు ద్వారా డెబిట్‌–క్రెడిట్‌ సౌకర్యం ఇవ్వడం వల్ల డిజిటల్‌ చెల్లింపులు మరింత విస్తరించవచ్చని వీసా భావిస్తోంది. సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Silver Price Down In India Know The Full Details5
ఒక్కరోజే రూ. 20వేలు డౌన్.. తగ్గుతున్న వెండి రేటు!

బంగారం, వెండి ధరలు ఊహకందని విధంగా మారిపోతున్నాయి. గత వారంలో రూ. 3.20 లక్షలకు చేరింది సిల్వర్ రేటు.. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఈ రోజు (శుక్రవారం) ధర రూ. 20,000 తగ్గింది. దీంతో కేజీ రేటు రూ. 2.80 లక్షలకు చేరింది.ఫిబ్రవరి 9న రూ.3 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఆ తరువాత మూడు రోజులు స్థిరంగా ఉండి.. నేడు (ఫిబ్రవరి 13) రూ. 20వేలు తగ్గింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందా?, పెరుగుతుందా? అనే ఆందోళన చాలామంది పెట్టుబడిదారుల్లో మొదలైంది. గ్లోబల్ మార్కెట్లో కూడా వెండి రేటు 9 శాతం తగ్గి 76.53 డాలర్ల వద్దకు చేరింది.ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. గ్లోబల్ మార్కెట్లో వస్తున్నా పరిణామాలే అని తెలుస్తోంది. ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా దీనిపై ప్రభావం చూపింది. అయితే.. భవిష్యత్తులో సిల్వర్ రేటు పెరుగుతుందని కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు.2025 నాటి వెండి రేటుకు.. 2026 వెండి రేటుకు చాలా తేడా ఉంది. ఏడాది కాలంలో ధర రూ. 153 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం జనవరి రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ ఏడాది జనవరి రూ.3 లక్షలు దాటేసింది. దీన్నిబట్టి చూస్తే.. వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.

BSNL Rs 2799 Annual Plan Details Explained6
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!

రూ.2626 యాన్యువల్ ప్లాన్ పరిచయం చేసిన బీఎస్ఎన్ఎల్ మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ కొంత ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త రూ. 2766 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు.A Year of Connectivity, SortedChoose BSNL ₹2799 Annual Plan, get- 3GB data/day, Unlimited calls, 100 SMS/day for 365 days validity. Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c #BSNL #BSNLAnnualPlan #BSNL2799 #StayConnected pic.twitter.com/80JMv67IaH— BSNL India (@BSNLCorporate) February 12, 2026రూ. 2,626 రీఛార్జ్ ప్లాన్దేశ్ కా నెట్‌వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్లాన్ కోసం వినియోగదారులు 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 365 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ ద్వారా.. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

Advertisement
Advertisement
Advertisement