Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

gold and silver rates on 26th january 2026 in Telugu states1
వామ్మో! బంగారం ఊసు ఎత్తకపోవడమే బెటర్‌..తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

which is better decision on gold and silver sell or buy2
కొందామా.. అమ్ముదామా?

బంగారం తులం లక్ష అంటే..? అమ్మో! అన్నారు!!. లక్ష దాటడమే అబ్బురం అనుకున్నారు. అలాంటిది నెలల వ్యవధిలో ఏకంగా రూ.1.65 లక్షలు దాటేసింది. ఇక వెండి గురించైతే చెప్పక్కర్లేదు. ఏడాదిన్నర కిందటి వరకూ కిలో లక్ష రూపాయలలోపే. లక్ష దాటడమే గగనం అనుకున్నారంతా. కానీ ఈ ఏడాదిన్నరలోనే ఏకంగా రూ.3.4 లక్షలకు చేరిపోయింది. నిజానికి ఊహలకు కూడా అందని పరుగులివి. సెంట్రల్‌ బ్యాంక్‌లు సైతం కొండంత నమ్మకంతో పసిడిని కొనుగోలు చేస్తుండటం... వ్యక్తిగత వినియోగ అవసరాలకుతోడు రిటైల్‌ ఇన్వెస్టర్లు, సంపన్నులు సైతం బంగారంవైపు చూస్తుండటం పసిడిని పరుగులు పెట్టిస్తున్నాయి.ఇక పారిశ్రామిక (సోలార్, ఈవీ తదితర) డిమాండ్‌ పెద్ద ఎత్తున పెరగ్గా.. సరఫరా ఆ స్థాయిలో లేకపోవడం, పెట్టుబడులకు సైతం ఇన్వెస్టర్లు మక్కువ చూపిస్తుండడంతో వెండి ధరలు ఆకాశమే హద్దుగా రివ్వుమంటున్నాయి. ఈ విలువైన లోహాల ధరలు గడిచిన మూడేళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలను నమోదు చేస్తుండడంతో రాబడుల కాంక్షతో కొందరు దూకుడుగా పెట్టుబడులు పెడుతున్నారు. మరిప్పుడు ఏం చేయాలి? కొత్తగా కొనాలనుకున్న వారి పరిస్థితేంటి? ఇళ్లలో కిలోలకు కిలోలు వెండి ఉన్నవారు మంచి రేటు వచ్చింది కనక దాన్ని విక్రయిస్తే మంచిదా? ఒకవేళ బంగారం, వెండి వంటి మెటల్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలంటే ఎలా? ఈటీఎఫ్‌లవైపు చూడొచ్చా? అందరికీ ఇవే సందేహాలు. వాటికి సమాధానమే ఈ వెల్త్‌ స్టోరీ...ఉరుకులు పరుగులు ఎందుకంటే...2025 జనవరి నుంచి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 79 శాతం పెరిగింది. ఔన్స్‌కు 2,780 డాలర్ల నుంచి 4,965 డాలర్లకు చేరగా, వెండి ఔన్స్‌ 30 డాలర్ల నుంచి 100 డాలర్ల స్థాయిని తాకింది. ఈ కాలంలో వెండి ఏకంగా 223 శాతం ర్యాలీ చేసింది. అంతర్జాతీయంగా వృద్ధి అంచనాలు మసకబారినప్పుడు లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఎగసినప్పుడు (పలు దేశాల మధ్య ఘర్షణలు/ యుద్ధాలు తలెత్తడం).. ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణితో తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని బంగారం, వెండిలోకి మళ్లిస్తుంటారు. అలాంటి ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడుల విలువ కాపాడుకునే హెడ్జింగ్‌ సాధనంగా బంగారానికి గుర్తింపు ఉంది. డాలర్‌ బలహీనత సైతం బంగారం, వెండి ధరలకు ఆజ్యం పోసేదే. డాలర్‌ విలువ తగ్గినప్పుడు ఇతర కరెన్సీల వారికి బంగారం, వెండి చౌకగా మారతాయి. కనుక అదనపు డిమాండ్‌ ఏర్పడుతుంది.యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను మరింత తగ్గించొచ్చన్న అంచనాలు కూడా ఒక కారణమే. వడ్డీ రేట్లు దిగొచ్చే క్రమంలో ఈల్డ్స్‌ తగ్గి బాండ్లు ఆకర్షణీయత కోల్పోతాయి. దీంతో అదనపు రాబడి వస్తుందనే కారణంతో పసిడి, వెండిలోకి పెట్టుబడులు పరుగెడుతుంటాయి. ఆర్‌బీఐ నుంచి అంతర్జాతీయంగా ఎన్నో దేశాల కేంద్ర బ్యాంక్‌లు తమ విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుతున్నాయి. గత రెండు మూడేళ్లుగా కొన్ని సెంట్రల్‌ బ్యాంక్‌లు బంగారం నిల్వలు అదే పనిగా పెంచుకుంటూ వెళుతున్నాయి. గోల్డ్, సిల్వర్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు)లోకి వచ్చే పెట్టుబడులు కూడా పెరగడం ధరలను మరింత ఎగిసేలా చేస్తోంది. వెండికి ప్రధానంగా పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. ఎల్రక్టానిక్స్, సోలార్‌ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతుండడంతో వీటి తయారీకి అదే స్థాయిలో వెండి అవసరం ఏర్పడుతోంది. ఈ స్థాయిలో సరఫరా పెరగకపోవడం ధరలను నడిపిస్తోంది. మన రూపాయి ఇటీవలి కాలంలో డాలర్‌తో విలువను కోల్పోతూ వస్తోంది. బంగారం, వెండిని డాలర్‌ రూపంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా దేశీయంగా వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ కంటే పెరిగేలా చేస్తోంది. ఒకవైపు ఈక్విటీలు ఏడాదిన్నరగా ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాయి. మరోవైపు బంగారం, వెండి గణనీయంగా ర్యాలీ చేస్తుండడంతో.. ఇన్వెస్టర్లు వాటివైపు ఆకర్షితం అవుతుండడం ధరలను మరింత పెరిగేలా చేస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఏం చేయాలి?బంగారం, వెండి ధరల పరుగును చూసి హడావిడిగా పెట్టుబడులు పెట్టేయాల్సిన పనిలేదు. ఉన్నట్టుండి వీటి ధరలు గణనీయంగా పెరగడమే కాదు.. వీటిల్లో దిద్దుబాటూ అదే విధంగా ఉండొచ్చు. స్వల్పకాలంలో వీటి డిమాండ్, ధరల తీరును కచ్చితంగా అంచనా వేయలేం. దీర్ఘకాలంలో మాత్రం బంగారం, వెండి మూలాలు పటిష్టమే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాబట్టి ధరలను చూసి ఉద్రేకపడాల్సిన పనే లేదు. ఇప్పటికే భౌతిక బంగారం కొనుగోలు చేసిన వారు గరిష్ట ధరల వద్ద విక్రయించి లాభం స్వీకరించాలనుకుంటే లేదా లిక్విడిటీ (నగదు లభ్యత) పెంచుకోవాలంటే లేదా తాము అనుకున్న లక్ష్యానికి చేరువ అయితే ముందుకెళ్లొచ్చు. భౌతిక రూపంలో విక్రయించే వారు జీఎస్‌టీ చార్జీలు, తరుగు రూపంలో లాభంలో కొంత నష్టపోవాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. అనుకున్న లక్ష్యానికి బంగారం ధరలు చేరినట్టయితే పాక్షికంగా విక్రయించడం మంచి ఆలోచనే. ధరల పరుగు చూసి, మరింత పెరిగితే కొనలేమోమోనన్న భయం అవసరం లేదు. అధిక ధరల వద్ద కొనుగోలు చేసినప్పుడు స్వల్పకాలంలో కరెక్షన్ల రిస్క్‌ కూడా ఉంటుంది. బంగారం హెడ్జింగ్‌గానూ పనిచేస్తుంది కనుక కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచుకుంటే మంచి రాబడిని ఆశించొచ్చు. కాకపోతే దాని భధ్రత కోసం చేయాల్సిన వ్యయాలు, జీఎస్‌టీ ఇతరత్రా చార్జీల ప్రకారం చూస్తే.. డిజిటల్‌ సాధనాలు అనుకూలం. వెండి భౌతిక రూపంలో కొనుగోలు చేస్తే, తర్వాత నగదుగా మార్చుకోవడం కష్టం కావొచ్చు. డిజిటల్‌ రూపంలో అయితే బంగారం, సిల్వర్‌ ఈటీఎఫ్‌లు, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్, డిజిటల్‌ గోల్డ్‌ అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?‘సిప్‌’ రూపంలోనే బెటర్‌...గరిష్ట ధరల వద్ద ఒకేసారి పెట్టుబడి పెట్టడం కాకుండా నెలవారీ నిర్ణీత మొత్తాన్ని గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం అన్నింటిలోకి మెరుగైన మార్గమన్నది విశ్లేషకుల సూచన. ఇక్కడి నుంచి ధరలు ఇంకా ముందుకే వెళ్లినా, లేక పతనాన్ని చూసినా పెట్టుబడి కొనసాగుతుంది. కొనుగోలు ధర సగటుగా మారుతుంది. పెట్టుబడుల్లో వైవిధ్యానికి.. పోర్ట్‌ఫోలియో హెడ్జింగ్‌ కోసం చూసే వారు దీర్ఘకాలం కోసం బంగారంలో సిప్‌ రూపంలోఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఎంత పెట్టుబడి..?ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారం, వెండికి కేటాయింపులు 10–20 శాతానికి పరిమితం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఇలా చేయడం వల్ల ఒక విభాగంలో అధిక ఎక్స్‌పోజర్‌ను నివారించొచ్చు. అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలతోపాటు, పెట్టుబడులకు రక్షణనిచ్చే డెట్‌ సాధనాలు, బంగారం–వెండి మధ్య తగినంత సమతుల్యం ఉండేలా చూసుకోవచ్చు.

Despite nationwide ban on real money gaming hiring remains robust3
ఈ-గేమింగ్ రంగంలో నియామకాలు భళా!

భారతీయ గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. రియల్ మనీ గేమింగ్ (RMG)పై ఉన్న ఆంక్షలు సుమారు రెండు లక్షల ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల మధ్య, ఈ-గేమింగ్ రంగం అనూహ్య రీతిలో పుంజుకుంటోంది. గడిచిన ఐదు నెలలుగా పరిశ్రమ తన వ్యూహాలను మార్చుకుంటూ, ప్రతిభను నిలుపుకోవడమే కాకుండా కొత్త విభాగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.కోర్ డెవలప్‌మెంట్‌కు క్రేజ్ప్రస్తుతం భారతీయ గేమింగ్ మార్కెట్ కేవలం వినోదం కోసమే కాకుండా హై-ఎండ్ గేమ్ డెవలప్‌మెంట్ హబ్‌గా మారుతోంది. ఇన్‌స్టాహైర్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఈ రంగంలో 50,000 నుంచి 60,000 వరకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. యూనిటీ (Unity), అన్‌రియల్ (Unreal) డెవలపర్లు, సీ++ ఇంజినీర్లు, 3డీ ఆర్టిస్టులు, గేమ్ డిజైనర్లకు గిరాకీ పెరిగింది. మొత్తం ఉద్యోగాల్లో వీటి వాటా 70-80 శాతంగా ఉంది. భారతీయ స్టూడియోలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి AAA క్వాలిటీ టైటిల్స్ రూపొందించడంపై దృష్టి పెట్టాయి. టోర్నమెంట్ మేనేజర్లు, కంటెంట్ క్రియేటర్లు, అనలిస్ట్‌ ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2026 చివరి నాటికి గేమింగ్ రంగంలో ఉపాధి 60-70 శాతం వృద్ధి చెందుతుందని ఇన్‌స్టాహైర్ అంచనా వేసింది.నియంత్రణలతో భరోసా‘ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం, 2025’ అమల్లోకి రావడం పరిశ్రమకు ఒక వరంలా మారిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్‌ఎంజీ, సాధారణ ఈ-గేమ్స్ మధ్య స్పష్టమైన సరిహద్దులను ఏర్పరిచినట్లు తెలుపుతున్నారు. ‘75 శాతం భారతీయ ఈ-స్పోర్ట్స్ ప్లేయర్లు ఈ రంగాన్ని ఒక గౌరవప్రదమైన కెరీర్‌గా భావిస్తున్నారు. కేవలం ప్లేయర్లుగానే కాకుండా కోచ్‌లు, ఈవెంట్ మేనేజర్లుగా మారేందుకు 56 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు’ అని జెంట్‌సింథసిస్ సర్వే తెలిపింది.ప్రతిభను వదులుకోని కంపెనీలుఆర్‌ఎంజీ కంపెనీల్లో గతంలో నియామకాలు తాత్కాలికంగా నెమ్మదించినప్పటికీ అక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఇతర గేమింగ్ విభాగాలు అందిపుచ్చుకుంటున్నాయి. డ్రీమ్ స్పోర్ట్స్ (Dream Sports) తమ వద్ద ఉన్న ప్రతిభను వదులుకోకుండా తమ గ్రూప్‌లోని ఇతర ఏడు ప్లాట్‌ఫారమ్‌ల్లో ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. ఫెలిసిటీ గేమ్స్ (Felicity Games) గతంలో ఆర్‌ఎంజీ విభాగాల్లో పనిచేసిన హెడ్ ఆఫ్ ఇంజినీరింగ్, అనలిటిక్స్ వంటి కీలక నిపుణులను నియమించుకుంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్‌ఎంజీపై ఆంక్షలు ఒక రకంగా ఇతర గేమింగ్ విభాగాలు గ్లోబల్ స్థాయిలో ఎదిగేందుకు మార్గం సుగమం చేశాయి.ఇదీ చదవండి: నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?

real-estate-vs-fd-gold-mutualfunds-insurance-guide4
నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?

సొంత ఇల్లు కొనాలన్నా, బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలన్నా సామాన్యుడికి ఎన్నో లెక్కలు.. మరెన్నో సందేహాలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భద్రంగా ఉంటుంది? ఎక్కడ పెడితే లాభసాటిగా ఉంటుంది? అన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, బంగారం నుంచి ఇన్సూరెన్స్ వరకు పెట్టుబడిదారుల మదిలో మెదిలే కీలక ప్రశ్నలకు ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక సమాధానాలు మీకోసం..రియల్టీ..నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం మేలా... లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలా?రెండింట్లోనూ దేనికుండే లాభాలు, దేనికి ఉండే ఇబ్బందులు దానికున్నాయి. ఎందుకంటే నిర్మాణం పూర్తయి తక్షణం వెళ్లగల ఇంటిని కొనుక్కోవటం సురక్షితం. వెంటనే వెళ్లిపోవచ్చు. వేచి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇళ్ల ధర సహ జంగానే ఎక్కువ ఉంటుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఇల్లయితే ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పటికి పూర్తవుతుంది... ఎప్పుడు డెలివరీ ఇస్తారు అనే విషయాలకు గ్యారంటీ ఉండదు. ఇవన్నీ బిల్డరు పూర్వ చరిత్రను చూసి ముందుకు వెళ్లాల్సిన విషయాలే. కాకపోతే ఎంత పేరున్న బిల్డరయినా ఒకోసారి ఇబ్బందులో పడొచ్చు. దానివల్ల మనకు ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యం కావచ్చు. అందుకని మీ అవసరం, వేచిచూసే సామర్థ్యాన్ని బట్టి దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. బ్యాంకింగ్‌..ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటును బట్టి బ్యాంకును ఎంచుకోవాలా? లేక సర్వీసును చూశా?మీరు ఎంత మొత్తాన్ని ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అది తక్కువ మొత్తమే అనుకోండి. వడ్డీ రేటు చూసి ఎఫ్‌డీ చెయ్యండి. అలాకాకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలనుకున్నానుకోండి. అపుడు బ్యాంకు అందిస్తున్న సేవలు, డిజిటల్‌ సౌకర్యాలు, ఆ బ్యాంకు ఎంత సురక్షితమైనది... అనే అంశాలన్నీ చూడాలి. 0.1 లేదా 0.25 వడ్డీ శాతం కన్నా మన సొమ్ము భద్రంగా ఉండటం ముఖ్యం కదా!. అందుకే మీరు ఎంత ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారనే అంశాన్ని బట్టి బ్యాంకును ఎంచుకోండి. మీరు చేసే ఎఫ్‌డీ గనక రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. అది ఏ బ్యాంకులో డిపాజిట్‌ చేసినా ఆ మొత్తానికి డిపాజిట్‌ క్రెడిట్‌ గ్యారంటీ పథకం కింద బీమా ఉంటుంది. కాబట్టి సురక్షితం. బంగారం సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ సురక్షితమేనా? అందులో ఇన్వెస్ట్‌ చేయొచ్చా?సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు పూర్తిగా సురక్షితం. వాటికి ఆర్‌బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను జారీ చెయ్యటాన్ని కేంద్రం నిలిపేసింది. గతంలో జారీ చేసినపుడు కొన్నవాటికి మాత్రం మెచ్యూరిటీ అయిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇవి మరికొన్ని సంవత్సరాలు జరుగుతాయి కూడా. ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినవారికి బంగారం ధర ఎంత పెరిగితే అంత చెల్లించటంతో పాటు ఏటా 2.5 శాతం మొత్తాన్ని అదనంగా కూడా చెల్లిస్తారు. భౌతికంగా బంగారం కొనటం కన్నా ఇదే ఎక్కువ లాభం కదా!. కాకపోతే ఇందులో ఉండే రిస్కల్లా ఒకటే. బంగారం ధర తగ్గితే చెల్లించేటపుడు తగ్గిన ధరే చెల్లిస్తారు. ఏడేళ్ల పాటు కాలపరిమితి ఉండటంతో పాటు ఐదేళ్ల లాకిన్‌ కూడా ఉంది.స్టాక్‌ మార్కెట్‌...1న బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు కనక ఆదివారమైనా స్టాక్‌ మార్కెట్‌ పనిచేస్తుందని ప్రకటించారు. బడ్జెట్‌కు, స్టాక్‌ మార్కెట్‌కు సంబంధమేంటి?బడ్జెట్‌ ప్రవేశపెట్టిననాడు సెలవు దినమైతే ఆ రోజున స్టాక్‌ మార్కెట్‌ ప్రత్యేకంగా పనిచేయటమన్నది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మొదలైన సంప్రదాయం. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 శనివారం వచి్చంది. ఆ రోజునా స్టాక్‌ మార్కెట్లు పనిచేశాయి. ఇపుడు ఆదివారం కూడా పనిచేస్తాయని ప్రకటించారు. వాస్తవానికి బడ్జెట్‌ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇపుడు బడ్జెట్‌ సమయంలో మార్కెట్‌ ఎలా ప్రతిస్పందిస్తుందనేది లైవ్‌లో దేశ ప్రజలకు తెలుస్తుందని, తమ నిర్ణయాలకు మార్కెట్‌ ఆమోదం ఉందో లేదో కూడా తెలిసిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.మ్యూచువల్‌ ఫండ్స్‌...సాధారణ డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయటం సురక్షితమేనా?షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోలిస్తే బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే డెట్‌ ఫండ్స్‌ చాలా సురక్షితం. అలాగని వాటిలో రిస్కు ఉండదని కాదు. అవి ఏ బాండ్లు కొంటున్నాయనేదాన్ని బట్టి అవెంత సురక్షితమో చెప్పొచ్చు. సాధారణంగా డెట్‌ఫండ్స్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లోను, ట్రెజరీ బిల్స్‌లోను, కార్పొరేట్‌ బాండ్లలోను, మనీమార్కెట్‌ సాధనాల్లోను ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు తక్కువ. తక్కువైనా... స్థిరమైన రాబడులుంటాయి. అయితే ఈ ఫండ్లు కార్పొరేట్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. సదరు కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గితే అది కొంతమేర రిస్కే. ఇక వడ్డీరేట్లు పెరిగినపుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్‌ పరిస్థితులు బాగులేకుంటే ఫండ్లు తమ బాండ్లను అమ్మటానికి ప్రయత్నించినా ఎవరూ కొనకపోవచ్చు. ఈ రిస్క్‌లు దృష్టిలో పెట్టుకోవాలి.ఇన్సూరెన్స్‌ఆయుష్‌ ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చులు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ పరిధిలోకి వస్తాయా?మన దేశంలో ఇపుడు చాలా పాలసీలు ఆయుష్‌ ట్రీట్‌మెంట్‌కు కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని షరతులుంటున్నాయి. ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వంటి చికిత్సలన్నీ ఆయుష్‌ పరిధిలోకి వస్తా యి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేక ప్రభు త్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనో, ఎన్‌ఏబీహెచ్‌ అక్రిడిటేషన్‌ ఉన్న ఆయుష్‌ ఆసుపత్రిలోనో తీసుకున్న చికిత్సకే కవరేజీ ఇస్తున్నారు. ఔట్‌పేషెంట్‌ చికిత్సలకు కాకుండా... ఆసుపత్రిలో చేరిన చికిత్స లకే ఇది వర్తిస్తుంది. గుర్తింపు లేని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నేరుగా మందులు కొనుక్కున్నా, వెల్‌నెస్‌ థెరపీ, స్పా, రిజువనేషన్‌ చికిత్సలకు ఇది వర్తించదు. పైపెచ్చు చాలా పాలసీలు కవరేజీ మొత్తాన్ని ఏడాదికి రూ.25వేల నుంచి రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..

Union Budget 2026 to US Fed meet, Q3 results may dictate Indian stock market this week5
బడ్జెట్, ఫెడ్‌ పైనే ఫోకస్‌

వచ్చే నెల తొలి రోజున కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌కు తెరతీయనుంది. మరోపక్క బుధవారం(28న) యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై సమీక్ష చేపట్టనుంది. ఈ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతోపాటు ఫిబ్రవరి సిరీస్‌ ప్రారంభంకానుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. రిపబ్లిక్‌ డే సందర్భంగా నేడు(26న) స్టాక్‌ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. అయితే ఆదివారం(ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 2026–27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆదివారం సైతం స్టాక్‌ ఎక్సే్ఛంజీలు ట్రేడింగ్‌కు వీలు కల్పిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో జనవరి ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు రేపు(27న) ముగియనుంది. బీఎస్‌ఈలో వీటి ఎక్స్‌ పైరీ గురువారం(29న)కాగా.. రెండు ఎక్సే్ఛంజీలలోనూ ఫిబ్రవరి సిరీస్‌ ప్రారంభంకానుంది. కాగా.. యూరోపియన్‌ యూనియన్‌– భారత్‌ మధ్య వాణిజ్య డీల్‌ కుదిరితే ఇన్వెస్టర్లకు ఉపశమనం లభించే వీలుంది. వడ్డీ తగ్గించేనా? కొత్త ఏడాదిలో రెండురోజులపాటు నిర్వహిస్తున్న తొలి పాలసీ సమీక్షా సమావేశంలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని ఆ ర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు ద్రవ్యోల్బణం, ఉపాధిసహా.. ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌పై రాజకీయంగా, లీగల్‌గా ఒత్తిడి కొనసాగుతుండటం ప్రభా వం చూపవచ్చని పేర్కొన్నారు. వెరసి ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 3.5–3.75 శాతంవద్దే కొనసాగే వీలుంది. గురువారం(29న) నవంబర్‌ నెలకు యూఎస్‌ వాణిజ్య గణాంకాలు వెలువడనున్నాయి. అక్టోబర్‌లో వాణి జ్య లోటు 29.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇతర దేశీ అంశాల ఎఫెక్ట్‌ → విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే కట్టుబడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 36,591 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో రూపాయిపై సైతం ఒత్తిడి పడుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతు న్నారు. వెరసి డాలరుతో మారకంలో రూపాయి గత వారం 91.97కు పతనమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. → 2025 డిసెంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు 28న విడుదలకానున్నాయి. నవంబర్‌లో ఐఐపీ 6.7 % ఎగసింది. → మరిన్ని దిగ్గజాలు 2026 క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో యాక్సిస్‌ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, మారుతీ, ఐటీసీ, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ తదితరాలున్నాయి. మరింత డీలా.. → గత వారం సెంటిమెంటు బలహీనపడటంతో మార్కెట్లు పతన బాటలో సాగాయి. సెన్సెక్స్‌ 2,033 పాయింట్లు క్షీణించి 81,538 వద్ద నిలిచింది. నిఫ్టీ 646 పాయింట్లు పడిపోయి వద్ద 25,049 ముగిసింది. → ఈ వారం సైతం అమ్మకాలతో మార్కెట్లు మరింత నీరసించవచ్చని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అంచనాల ప్రకారం నిఫ్టీకి 24,300– 24,000 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభించవచ్చు. బలపడితే 25,400– 25,600 పాయింట్లకు చేరే వీలుంది. → సెన్సెక్స్‌ 80,000– 79,500 పాయింట్ల స్థాయిలో మద్దతు అందుకునే వీలుంది. ఒకవేళ ఊపందుకుంటే 82,000–82,600 పాయింట్లవరకూ బలపడవచ్చు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Types Of Investments To Achieve Financial Freedom, sakshi special story6
విశ్రాంత జీవనంలోనూ ‘ఫండించొచ్చు!

స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులంటేనే కాస్త టెన్షన్‌. ఎందుకంటే ఇక్కడ రాబడుల వెనకాల రిస్కూ ఉంటుంది. వయసులో ఉన్నవారికైతే ఓకే. మార్కెట్లు పడినా కొన్నాళ్లు వేచిచూస్తే మళ్లీ సర్దుకుంటాయి. మరి రిటైరీల మాటేంటి? నెలవారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సిన సీనియర్‌ సిటిజన్లు ఈ టెన్షన్లతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించటం సాధ్యమా? అలాగని ఎఫ్‌డీలపైనే ఆధారపడితే అంతకంతకూ వడ్డీ రేట్లు తగ్గుతూ పోతున్నాయి. పైపెచ్చు జీవన వ్యయాలు, వైద్యం ఖర్చుల్లాంటివి పెరిగిపోతున్నాయి. మరి విశ్రాంత జీవనం గౌరవప్రదంగా, ఆర్థికంగా స్వేచ్ఛతో సాగించాలంటే దారేంటి? ద్రవ్యోల్బణాన్ని మించి కాకపోయినా బ్యాంకు ఎఫ్‌డీలకన్నా మెరుగైన రాబడి అందించే సాధనాలు ఏమున్నాయి? మ్యుచువల్‌ ఫండ్స్‌ వైపు మళ్లొచ్చా? అసలు సీనియర్‌ సిటిజన్లకు అవి మంచివేనా అనే ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు దొర కవు. కాకపోతే ఆచి తూచి, సరైన వ్యూహంతో ఎంచుకుంటే సీనియర్‌ సిటిజన్లకూ ఫండ్స్‌ ప్రయోజనకరంగానే ఉంటాయనేది నిపుణుల మాట. దాన్ని వివరించే ప్రయత్నమే ఈ వెల్త్‌ స్టోరీ....ప్రాధాన్యాలు మారుతాయి.. వయస్సు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మారుతాయి. యువ ఇన్వెస్టర్లతో పోలిస్తే సీనియర్‌ సిటిజన్ల ఆర్థిక అవసరాలు, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. వారికి రాబడికన్నా తమ పెట్టుబడిని కాపాడుకోవటం ముఖ్యం. క్రమం తప్పకుండా, కచ్చితంగా కొంత మొత్తం ఆదాయంగా చేతికి అందటం అంతకన్నా ముఖ్యం. అది కూడా పెరిగే ధరలను తట్టుకునే భరోసానివ్వాలి. ఆరోగ్యం పరంగానో లేక మరొకటో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే చేతిలో నగదు ఉండాలి. ఇలా ఒకటా, రెండా.. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో విషయాలు చూసుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు తోడుగా ఉంటూ, ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయకరంగానూ ఉంటాయి. సౌకర్యవంతంగా జీవించాలంటే... ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో, అద్దెను మినహాయించి తక్కువలో తక్కువగా, ఓ మధ్యతరగతి సీనియర్‌ సిటిజన్‌ కుటుంబ ఖర్చులు ఇలా ఉంటున్నాయి... → కరెంటు, ఇంటి మెయింటెనెన్సు మొదలైనవి: రూ. 8,000–10,000 → నిత్యావసరాలు : రూ. 10,000–12,000 → వైద్యం, ఔషధాల ఖర్చులు: రూ. 5,000–7,000 → ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ఖర్చులు: రూ. 5,000–6,000 → ఇలా, ఒక మోస్తరు సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకు సింపుల్‌గా రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అవసరమవుతోంది. → మరికాస్త సౌకర్యవంతంగా ఉండాలంటే (ట్రావెల్, హాబీలు, పని మనుషులు) ఖర్చులు నెలకు రూ. 45,000–60,000 వరకు పెరుగుతాయి.ఇంత ఆదాయం రావాలంటే ఎంత దాచిపెట్టాలి? రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఖర్చుల కోసం నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అందుకోవాలంటే, అందుకు ఏ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి? వార్షికంగా ఎంత మొత్తం రాబడిని ఆశించవచ్చు అనేది మరో ప్రశ్న. సీనియర్‌ సిటిజన్లకు, పెట్టుబడి భారీగా వృద్ధి చెందడం కన్నా, రాబడిపరమైన భద్రత అవసరం కాబట్టి తక్కువలో తక్కువగా ఏటా 6–7 శాతం రాబడిని ఆశించవచ్చు. దాన్ని బట్టి, పెద్దగా రిస్కులు ఉండని, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌ ప్రాతిపదికన చూస్తే..సీనియర్‌ సిటిజన్లకు పెట్టుబడి ఆప్షన్లు.. → బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీములు – స్థిరత్వం కోసం ఇవి పెట్టుబడులకు భద్రతనిచ్చేలా, రాబడులు అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది. కాకపోతే పెరిగే ధరలకు తగ్గ స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. కాబట్టి పోర్ట్‌ఫోలియోలో వీటికి 30–40 శాతం పెట్టుబడిని కేటాయించవచ్చు. → డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ వీటిలో వివిధ కేటగిరీలున్నా.. సీనియర్‌ సిటిజన్లకు ఈ కిందివి అనువైనవిగా ఉంటాయి. → సంప్రదాయ హైబ్రిడ్‌ ఫండ్స్‌ → స్వల్పకాలిక ఫండ్స్‌ → కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ వీటిని ఎందుకు పరిశీలించవచ్చంటే, ఇవి ఎఫ్‌డీలతో పోలిస్తే పన్నుల అనంతరం మరింత మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు కింద మార్చుకునే (లిక్విడిటీ) వీలుంటుంది. విత్‌డ్రాయల్‌ సులభతరంగా ఉంటుంది. వీటికి 30–35 శాతం కేటాయించవచ్చు. → ఎస్‌డబ్ల్యూపీ (సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌) – పొదుపు మొత్తం నుంచి నెలవారీ జీతం ఎస్‌డబ్ల్యూపీ అనేది మ్యుచువల్‌ ఫండ్స్‌ నుంచి ప్రతి నెలా ఇంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పెన్షనో లేదా శాలరీగానో అనుకోవచ్చు. వడ్డీ ఆదాయంతో పోలిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎంత విత్‌డ్రా చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. డెట్‌ లేదా కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌తో కలిపి ఉపయోగించుకోవచ్చు. → ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ – పరిమిత స్థాయిలోనే, కాకపోతే కీలకం సీనియర్‌ సిటిజన్స్‌ అయినంత మాత్రాన షేర్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. లార్జ్‌ క్యాప్‌ లేదా ఇండెక్స్‌ ఫండ్స్‌ లాంటివి ఎంచుకోవచ్చు. పెట్టుబడుల్లో 10–20 శాతానికి మించకుండా ఈక్విటీలకు కేటాయించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి పొదుపు మొత్తాలను కాపాడుకోవడానికి ఈ ఫండ్స్‌ ఉపయోగపడతాయి. శాంపిల్‌ రిటైర్మెంట్‌ పోర్ట్‌ఫోలియో (రూ. 1 కోటి నిధి) → బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు + ఎస్‌సీఎస్‌ఎస్‌: రూ. 35 లక్షలు → డెట్‌/కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌: రూ. 35 లక్షలు → ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ / ఇండెక్స్‌ ఫండ్స్‌: రూ. 15 లక్షలు → ఎమర్జెన్సీ నగదు – సేవింగ్స్‌: రూ. 15 లక్షలు పోర్ట్‌ఫోలియోను ఇలా తీర్చిదిద్దుకుంటే ఒక మోస్తరు స్థిరత్వంతో ప్రతి నెలా సుమారు రూ.45,000 నుంచి రూ. 55,000 వరకు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సీనియర్‌ సిటిజన్స్‌ గుర్తుంచుకోతగిన కీలకమైన అయిదు సూత్రాలు .. → భారీ రాబడుల హామీలతో ఊరించే స్కీములకు దూరంగా ఉండాలి → వడ్డీపై మాత్రమే ఆధారపడకుండా ఎస్‌డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలి→ చేతిలో ఉన్న మొత్తం నిధిని ఒకే సాధనంలో ఇన్వెస్ట్‌ చేయొద్దు.→ నామినేషన్లు, వీలునామా అప్‌డేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి → తగినంత స్థాయిలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండాలి.

Advertisement
Advertisement
Advertisement