Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock market updates on 16 April 20261
లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు పెరిగి 24,303 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 242 పాయింట్లు ఎగబాకి 78,356 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.93బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 94.9 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.8 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 1.59 శాతం పుంజుకుంది.Today Nifty position 16-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Self Driving Cars: Who Is Liable When AI Takes the Wheel?2
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. ప్రమాదానికి బాధ్యులెవరు?

సాంకేతిక విప్లవం ఆటోమొబైల్ రంగాన్ని ఊహించని మలుపు తిప్పుతోంది. కొంతకాలం క్రితం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన సెల్ఫ్ డ్రైవింగ్ (స్వయం చాలిత) కార్లు ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నాయి. టెస్లా, వేమో, క్రూయిజ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు పలు భారతీయ స్టార్టప్‌లు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, స్టీరింగ్‌ డ్రైవర్‌ చేతిలో లేకుండా కార్లు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు వాహనదారుల్లో మెదులుతున్నాయి.బాధ్యత ఎవరిది? డ్రైవర్‌దా లేక సాఫ్ట్‌వేర్‌దా?సాధారణ కార్ల ప్రమాదాల్లో మానవ తప్పిదం (హ్యుమన్‌ ఎర్రర్‌) ప్రధాన కారణం కాబట్టి డ్రైవర్‌పై బాధ్యత ఉంటుంది. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో విషయం వేరు. ఇక్కడ ప్రమాద బాధ్యతను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు.1. లెవల్ 2, 3 (సెమీ-అటానమస్): ఇక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ సాఫ్ట్‌వేర్ హెచ్చరించినా డ్రైవర్ స్పందించకుంటే బాధ్యత డ్రైవర్‌దే అవుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాత పద్ధతిలోనే జరుగుతుంది.2. లెవల్ 4, 5 (ఫుల్లీ-అటానమస్): ఇక్కడ కారు పూర్తిగా సాఫ్ట్‌వేర్ నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రమాదం జరిగితే అది ‘ప్రొడక్ట్ లయబిలిటీ’ కిందకు వస్తుంది. అంటే తయారీ కంపెనీ లేదా సాఫ్ట్‌వేర్ డెవలపర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధానంసెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రమాదానికి గురైనప్పుడు క్లెయిమ్ ప్రక్రియలో డేటా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి అటానమస్ కారులో సెన్సార్లు, కెమెరాల డేటా రికార్డ్ అవుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు మాన్యువల్ మోడ్‌లో ఉందా లేక అటానమస్ మోడ్‌లో ఉందా అన్నది ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుగా తనిఖీ చేస్తాయి.ఒకవేళ కారు సెన్సార్లు పనిచేయకపోవడం వల్ల లేదా అల్గారిథమ్ లోపం వల్ల ప్రమాదం జరిగిందని తేలితే ఇన్సూరెన్స్ కంపెనీ సదరు కార్ల తయారీ సంస్థ నుంచి నష్టపరిహారాన్ని రికవరీ చేస్తుంది. దీనినే ‘సబ్రోగేషన్’ అంటారు.బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు ప్రస్తుతం ఉన్న ‘థర్డ్ పార్టీ లయబిలిటీ’ నిబంధనలే వర్తిస్తాయి. అయితే, పరిహారం చెల్లించిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ తయారీదారుడిపై కేసు వేసే అవకాశం ఉంటుంది.ప్రస్తుత కంపెనీల విధానాలుసైబర్ ఇన్సూరెన్స్.. కారు హ్యాకింగ్‌కు గురై ప్రమాదం జరిగితే ఈ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది.అల్గారిథమ్ లయబిలిటీ.. సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో లోపాల వల్ల జరిగే నష్టాలకు కంపెనీలే బాధ్యత వహించేలా కొత్త క్లాజులు వస్తున్నాయి.టెస్లా ఇన్సూరెన్స్.. టెస్లా వంటి కంపెనీలు స్వయంగా ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. డ్రైవర్ ‘సేఫ్టీ స్కోర్’ ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తున్నాయి.భారత్‌లో పరిస్థితి ఏమిటి?భారతదేశంలో మోటార్ వాహనాల చట్టం (ఎంవీఏ) ప్రకారం, వాహనానికి డ్రైవర్ ఉండటం తప్పనిసరి. ప్రస్తుతానికి పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు మన రోడ్లపై అనుమతి లేదు. అయితే, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్‌) ఉన్న కార్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రమాదాలు జరిగితే ప్రస్తుతానికి డ్రైవర్‌నే బాధ్యుడిని చేస్తూ క్లెయిమ్‌లు సెటిల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!

Tata Motors Surpasses Hyundai Record Sales, April Discounts up to Rs 550003
కొత్త కారు కొనేవారికి రూ.55,000 వరకు ఆఫర్‌!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన అమ్మకాలతో దేశంలోనే మూడో అతిపెద్ద కార్ల తయారీదారుగా (మారుతీ సుజుకీ, మహీంద్రా తర్వాత) నిలిచిన టాటా మోటార్స్ అదే జోరును కొనసాగించేందుకు ఏప్రిల్ నెలలో ఆఫర్లను ప్రకటించింది. తన పాపులర్ ఐసీఈ (పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ) మోడళ్లపై ఏకంగా రూ.55,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.హ్యుందాయ్‌ను దాటేసిన టాటా!గత ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) విభాగం ఊహించని వృద్ధిని సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 5,53,585 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు 2026 నాటికి 14.05% వృద్ధిని నమోదు చేస్తూ 6,31,387 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఘనతతో హ్యుందాయ్ మోటార్ ఇండియాను వెనక్కి నెట్టి టాటా మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు?వినియోగదారుల డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ డిస్కౌంట్ రూపంలో ఈ రాయితీలు లభిస్తాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.మోడల్గరిష్ఠ డిస్కౌంట్టాటా కర్వ్ (Curvv)రూ. 55,000టాటా హారియర్ (Harrier)రూ. 45,000టాటా సఫారీ (Safari)రూ. 45,000టాటా ఆల్ట్రోజ్ (Altroz)రూ. 35,000టాటా నెక్సాన్ (Nexon)రూ. 30,000టాటా టియాగో (Tiago)రూ. 30,000టాటా టిగోర్ (Tigor)రూ. 30,000 పోటీ మార్కెట్‌లో హోరాహోరీవేసవి సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రధాన కంపెనీలన్నీ పోటీ పడుతున్నాయి. మారుతీ సుజుకీ తన కార్లపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించగా, హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.60,000 వరకు తగ్గింపు ఇస్తోంది. వాటితో పోలిస్తే టాటా ఆఫర్లు తక్కువగా అనిపించినప్పటికీ సేఫ్టీ రేటింగ్స్, సరికొత్త డిజైన్ల కారణంగా టాటా కార్లకు డిమాండ్ భారీగా ఉందని కంపెనీ అధికారలు చెబుతున్నారు.గమనిక: పైన పేర్కొన్న డిస్కౌంట్లు సీటీ, డీలర్‌షిప్, స్టాక్ లభ్యతను బట్టి మారుతుంటాయి. కచ్చితమైన ధర, ఆఫర్ల కోసం మీ సమీపంలోని అధికారిక షోరూమ్‌ను సంప్రదించగలరు.ఇదీ చదవండి: లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!

India will remain fastest-growing major economy in 2026 and 20274
భారత్‌ వృద్ధి వేగవంతం 

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, 2027లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 2026లో 6.5 శాతం వృద్ధి అంచనాతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొంది. భారత వస్తువులపై అమెరికా అదనపు టారిఫ్‌లను 50 శాతం నుంచి10 శాతానికి తగ్గించడం వంటి సానుకూల అంశాలు వృద్ధికి దోహదం చేస్తాయని ఐఎంఎఫ్‌ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో ఘర్షణల కారణంగా ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, ఈ సానుకూలతల అండతో 2026లో వృద్ధి రేటు 0.3 శాతం మెరుగుపడి 6.5 శాతానికి చేరుతుందని, 2027లో కూడా ఇదే వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి రేటు తగ్గొచ్చు.. ఇరాన్‌ యుద్ధంతో ప్రంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిందంటూ, దీని ఫలితంగా 2025లో వృద్ది రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 2026లో వృద్ధి అంచనాను 3.3 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గించింది. 2025లో నమోదైన 3.4 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. 2027లోనూ 3.2 శాతానికి వృద్ధి రేటు తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు ఈ ఏడాదికి ద్రవ్యోల్బణం అంచనాలను లోగడ ప్రకటించిన (జనవరిలో) అంచనా 3.8 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. యుద్ధానికి ముందు వరకు అమెరికా టారిఫ్‌లను ఎదుర్కొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగానే నిలబడిందని.. డేటా సెంటర్లు, ఏఐపై భారీ పెట్టుబడులు, ఉత్పాదక పెరగడం ఆర్థికంగా అనుకూలించినట్టు విశ్లేషించింది. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం ఈ వేగానికి అడ్డుపడిందని ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త పీర్నే ఒలీవర్‌ పేర్కొన్నారు.

Mid-Level Talent And Salary Hike Trends5
కార్పొరేట్‌ మిడ్‌ లెవెల్‌ మంత్ర

న్యూఢిల్లీ: అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) పెరుగుతున్న నేపథ్యంలో దేశీ కార్పొరేట్‌ కంపెనీలు నియామకాల విషయంలో విభిన్న పంథాలో వెళ్తున్నాయి. ప్రధానంగా మధ్య స్థాయి నిపుణులను రిక్రూట్‌ చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. స్టాఫింగ్‌ సర్వీసెస్, హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ సంస్థ జీనియస్‌ హెచ్‌ఆర్‌టెక్‌ నివేదిలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న సంస్థల్లో 49 శాతం కంపెనీలు తాము మిడ్‌ లెవెల్‌ ప్రొఫెషనల్స్‌ని హైర్‌ చేసుకోవడంపై ఫోకస్‌ చేస్తున్నట్లు తెలిపాయి. సిబ్బందిని పెంచుకోవడానికి సంబంధించి 10–15 శాతానికి మించి గణనీయంగా రిక్రూట్‌ చేసుకోనున్నట్లు 28 శాతం సంస్థలు, 0–5 శాతం వరకు పెంచుకునే అవకాశాలున్నట్లు 43 శాతం సంస్థలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల నుంచి 2,359 మంది సీఎక్స్‌వో స్థాయి లీడర్లు, సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. దీని ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేతనాల పెంపు ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా. 34 శాతం సంస్థలు వేతనాల పెంపు 10 శాతానికి మించి ఉండేలా ప్రణాళికలు వేసుకుంటుండగా, 46 శాతం సంస్థల్లో ఒక మోస్తరుగా 5–10 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. రిపోర్టులోని మరిన్ని కీలకాంశాలు.. → వేతనాల పెంపు విషయంలో రెగ్యులేటరీ, కార్మిక చట్ట సంస్కరణలు కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది. మిడ్‌–సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశం 48 శాతంగా ఉండగా, జూనియర్, సీనియర్‌ స్థాయుల్లో వరుసగా 26, 22 శాతంగా నమోదైంది. → అట్రిషన్‌ అంశం చాలా సంస్థలకు ఆందోళనకర విషయంగా ఉంటోంది. మెజారిటీ 55 శాతం సంస్థలు 10–20 శాతం మేర అట్రిషన్‌ ఉంటుందని అంచనా వేస్తుండగా, ఇది 20 శాతానికి మించి ఉంటుందని 15 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిడ్‌–సీనియర్‌ స్థాయి ఉద్యోగుల సెగ్మెంట్‌లో ఇది ఎక్కువగా ఉంటుందని 67 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ప్రాంతీయంగా చూస్తే దక్షిణాది జోన్‌లో అత్యధికంగా అట్రిషన్‌ ఉంటుందని 55 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఉద్యోగుల ఆకాంక్షలు కూడా దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. పనిపరంగా వెసులుబాట్లు, లక్ష్యాలు, కెరియర్‌లో వేగంగా పురోగమించేందుకు అవకాశాలు మొదలైన విషయాల్లో 50 శాతం పైగా ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉంటున్నాయి. ముఖ్యంగా జెన్‌ అల్ఫా, జెన్‌ జెడ్‌ తరానికి చెందిన యువ ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. ఉద్యోగులను అట్టే పెట్టుకోవాలంటే నిరంతరం వారితో ఎంగేజ్‌ కావడం, ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుండటం, నేర్చుకునే అవకాశాలు కల్పించడంలాంటివి కీలకాంశాలుగా ఉంటున్నాయని 38 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. → ఉద్యోగ భద్రత గురించి ఆందోళనపై మిశ్రమాభిప్రాయాలు నెలకొన్నాయి. వేతనం, వృద్ధి అంశాలతో పోలిస్తే అట్రిషన్‌పై దీని ప్రభావం ఒక మోస్తరుగానే ఉంటుందని లేదా పరిమిత స్థాయిలోనే ఉంటోందని చెరి 43 శాతం సంస్థలు వెల్లడించాయి. → 2026–27లో డేటా ఆధారిత వ్యూహాలతో, మిడ్‌ లెవెల్‌ నిపుణులు, డిజిటల్‌ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ, మారే వ్యాపార అవసరాలకు అనుగుణంగా హైరింగ్‌ ఆచితూచి ఉంటుంది. అట్రిషన్‌ రేటు పెరుగుతుండటమనేది మరింత పటిష్టమైన ప్లానింగ్, రిటెన్షన్‌ (ఉద్యోగులు వీడిపోకుండా అట్టే పెట్టుకోవడం) ఆవశ్యకతను తెలియజేస్తోంది. → పరిస్థితి, అవసరాలను బట్టి హైర్‌ చేసుకోవడం, పర్మనెంట్‌–ప్రాజెక్ట్‌ ఆధారిత నియామకాల మధ్య సమతౌల్యత పాటించే దిశగా పరిశ్రమ మళ్లుతోంది. వేగం, నైపుణ్యాలు, టెక్నాలజీని అందిపుచ్చుకునే సామర్థ్యాలు, సంస్థ నిలకడగా వృద్ధి చెందేందుకు తోడ్పడే సామర్థ్యాలు మొదలైనవి హైరింగ్‌ని ప్రభావితం చేస్తున్నాయి. → డైవర్సిఫికేషన్‌కి పెద్ద పీట వేస్తూ పురుషులు, మహిళా ఉద్యోగుల హైరింగ్‌లో పురుషులు, మహిళల నిష్పత్తి 50:50 స్థాయిలో ఉండేలా 27 శాతం కంపెనీలు చూసుకుంటున్నాయి. ఇది 60:40 స్థాయిలో ఉండేలా చూసుకునేందుకు 31 శాతం కంపెనీలు ప్రయతి్నస్తున్నాయి. అయితే, ఇప్పటికీ పురుషులను రిక్రూట్‌ చేసుకోవడం వైపే చాలా మటుకు పరిశ్రమలు ఒకింత ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. → చెరో 32 శాతం వాటాతో పశ్చిమ, ఉత్తరాదిలో హైరింగ్‌ కార్యకలాపాలు ఎక్కువగా ఉండనున్నాయి. తూర్పు, దక్షిణాది ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

AI Growth In India Masks Deep Regional Capability Gaps6
ఏఐ వినియోగంలో భారత్‌ టాప్‌.. కానీ.. 

న్యూఢిల్లీ: కోడింగ్, డేటా అనాలిసిస్, సంక్లిష్టమైన రీజనింగ్‌లాంటి అంశాల్లో భారత్‌ ప్రపంచంలోనే అధునాతన ఏఐ మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఓపెన్‌ ఏఐ ఒక నివేదికలో తెలిపింది. సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు, అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో ఏఐని తరచుగా యూజర్లు వినియోగించుకోవడంలో టాప్‌ అయిదు దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంటోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేథ వినియోగం కొన్ని నగరాలకే పరిమితమవుతోందని, గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటోందని వివరించింది. సాటి దేశాలతో పోల్చి చూసినప్పుడు, భారత్‌లో మిగతా ప్రాంతాల కన్నా టాప్‌ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు అధికంగా ఉంటోందని ఓపెన్‌ఏఐ తెలిపింది. రిపోర్ట్‌ ప్రకారం కోడింగ్, డేటా అనలిటిక్స్‌ వినియోగంలో కూడా భారత్‌కి పటిష్టమైన ర్యాంకింగ్‌ ఉంది. 2026 ఫిబ్రవరిలో ఓపెన్‌ఏఐ కోడెక్స్‌ (కోడింగ్‌ టూల్‌) యాప్‌ను ఆవిష్కరించిన రెండు వారాల్లోనే దీని యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. అయితే, ఈ వినియోగం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా, ఒకే రకంగా లేదు. అడ్వాన్స్‌డ్‌ ఏఐ వినియోగంలో భారీగా అంతరాలు ఉంటున్నాయి. మరిన్ని విశేషాలు.. → మొత్తం ఏఐ యూజర్లలో 50 శాతం మంది టాప్‌ 10 నగరాల్లో ఉంటున్నారు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ అగ్రస్థానంలో ఉంది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీలాంటి సాటి దేశాలతో పోలిస్తే దేశీయంగా టాప్‌ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దేశ జనాభాలో ఈ నగరాల్లో నివసించే వారి సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది. → అడ్వాన్స్‌డ్‌ ఏఐ వినియోగం విషయానికొస్తే అంతరం మరింత ఎక్కువగా ఉంటోంది. వెనుకబడిన నగరాలతో పోలిస్తే టాప్‌ సిటీల్లో డేటా అనాలిసిస్‌ వినియోగం 30 రెట్ల వరకు, కోడింగ్‌ వినియోగం 4 రెట్లు, ఏఐ డెవలపర్‌ (కోడెక్స్‌) వినియోగం 9 రెట్లు అధికంగా ఉంది. → పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌కి ఏఐ సామర్థ్యాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్, బెంగళూరు,, ఢిల్లీ, చెన్నైలాంటి కొన్ని పట్టణ ప్రాంత హబ్‌లలో మాత్రమే అవి కేంద్రీకృతమై ఉంటున్నాయి. → విద్య, ఆరోగ్యంలాంటి రంగాల్లో అత్యంత అర్థవంతమైన విధంగా ఏఐ వినియోగం పెరుగుతోంది. విద్య విషయంలో తూర్పు రాష్ట్రాలు ముందుంటున్నాయి. విద్యాభ్యాసానికి సంబంధించిన మొత్తం మెసేజీలు జాతీయ సగటైన 20 శాతానికి మించి అస్సాంలో 22 శాతం స్థాయిలో ఉంటున్నాయి. ఒరిస్సా, మణిపూర్, త్రిపుర, చత్తీస్‌గఢ్‌లలో కూడా దాదాపు ఇదే ధోరణి ఉంది. ఆరోగ్యం విషయంలో జమ్మూ కాశీ్మర్, పంజాబ్, చండీగఢ్, హిమాచల్‌ ప్రదేశ్, కేరళలాంటి ప్రాంతాల్లో ఏఐ వినియోగం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రతి 10 మెసేజీల్లో ఒకటి ఆరోగ్యానికి సంబంధించినది ఉంటోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. → టెక్నాలజీ వినియోగ సామర్థ్యాలు ఎంత విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయనే దానిపై భారతదేశపు తదుపరి దశ ఏఐ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. తొలినాటి వినియోగదారుల పరిధిని దాటి ఏఐ ప్రయోజనాలు ఎంత వేగంగా మరింత భారీ స్థాయిలో జనాభాకు అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంతరాలను భర్తీ చేయాలంటే నైపుణ్యాలను పెంపొందించడం, అర్థవంతమైన విధంగా ఉపయోగించుకునేందుకు తోడ్పాటు అందించడం కీలకంగా ఉండనున్నాయి.

Advertisement
Advertisement
Advertisement