Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Experts Views and Advice to this week1
ఆటుపోట్లున్నా ముందుకే..! 

గత వారం తొలుత అంచనాలకు విరుద్ధంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో కొంత కోలుకున్నాయి. వెరసి ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ముందుకుసాగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగవచ్చని భావిస్తున్నారు. మరోపక్క దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ ఇండెక్స్‌(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) విడుదలకానున్నాయి. అక్టోబర్‌(2025)లో ప్రతిద్రవ్యోల్బణం(మైనస్‌ 1.21 శాతం) నమోదుకాగా.. నవంబర్‌ నెలకు సైతం ధరల క్షీణత కనిపించనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో కాస్తమెరుగ్గా మైనస్‌ 0.5 నుంచి –0.6 శాతంస్థాయిలో గణాంకాలు వెలువడవచ్చని చెబుతున్నారు. ఈ బాటలో నవంబర్‌ నెలకు వాణిజ్య సంబంధ గణాంకాలు విడుదలకానున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా పసిడి ధరలు భారీగా పెరగడంతో అక్టోబర్‌లో వాణిజ్య లోటు(ఎగుమతి, దిగుమతుల మధ్య అంతరం) రికార్డ్‌ గరిష్టం 41.68 బిలియన్‌ డాలర్లను తాకింది. నవంబర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్‌లో దిగుమతుల బిల్లు 76 బిలియన్‌ డాలర్లను దాటగా.. ఎగుమతులు 34.38 బిలియన్‌ డాలర్లు మాత్రమే. కరెన్సీ మారకంపై కన్ను గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఇంట్రాడేలో చరిత్రాత్మక కనిష్టం 90.56కు పడిపోయింది. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 98.4కు బలహీనపడగా.. 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ తొలుత నీరసించినప్పటికీ 4.18 శాతానికి కోలుకున్నాయి. ఫెడ్, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతలు కరెన్సీ, బాండ్లపై ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కాగా.. యూఎస్‌ విధించిన అదనపు టారిఫ్‌లకుతోడు మెక్సికో సైతం భారత్‌ దిగుమతులపై సుంకాలను పెంచడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే ఇటీవల యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌తో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు, మెక్సికో వాణిజ్య అధికారులతో భారత అధికారుల భేటీ టారిఫ్‌ల సమస్యలకు చెక్‌ పెట్టే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ గణాంకాలు యూఎస్, యూరోజోన్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. గత నెలకు యూఎస్‌ వినియోగ ధరలు, రిటైల్‌ అమ్మకాలు, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. వెరసి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతర్గత పటిష్టత, ద్రవ్యోల్బణ ఔట్‌లుక్‌ తదితర అంశాలు ఫెడ్‌ మానిటరీ పాలసీపై ప్రభావం చూపనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు తెలియజేశారు. ఈ బాటలో విడుదలకానున్న జపనీస్‌ ద్రవ్యోల్బణం, వాణిజ్య గణాంకాలు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పరపతి సమీక్షను ప్రభావితం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లలో హెచ్చుతగ్గులకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చిన్న షేర్లు భళా అంచనాలకు అనుగుణంగా గడిచిన వారం యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటులో 0.25 శాతం కోత పెట్టడంతో చివర్లో మార్కెట్లు రికవరీ అయ్యాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,000 పాయింట్లకు ఎగువన, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85,200స్థాయికి పైన నిలిచాయి. డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరడం, యూఎస్‌కు తోడు కొత్తగా దేశీ ఎగుమతులపై మెక్సికో సుంకాల పెంపు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం నికరంగా సెన్సెక్స్‌ 445 పాయింట్లు(0.51 శాతం) క్షీణించి 85,268 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 140 పాయింట్ల(0.53 శాతం) వెనకడుగుతో 26,047 వద్ద ముగిసింది. అయితే బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.14 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.65 శాతం చొప్పున పుంజుకోవడం గమనార్హం! సాంకేతికంగా ముందుకే.. చార్టుల ప్రకారం గత వారం అంచనాలకు భిన్నంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే రెండో సపోర్ట్‌ స్థాయిల వద్ద నుంచి కోలుకున్నాయి. వెరసి సాంకేతికంగా కీలకమైన 85,000 పాయింట్లు(సెన్సెక్స్‌), 26,000 పాయింట్ల(నిఫ్టీ) కీలకస్థాయిలకు ఎగువన ముగిశాయి. ఈ వారం సైతం ఆటుపోట్ల మధ్య బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → నిఫ్టీకి తొలుత 26,000 పాయింట్లు సపోర్ట్‌గా నిలవవచ్చు. తదుపరి 25,800 వద్ద తిరిగి మద్దతు లభించే వీలుంది. 26,000 పాయింట్ల స్థాయికి ఎగువన నిలదొక్కుకుంటే 26,350 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. ఆపై సమీప భవిష్యత్‌లో 26,900–27,000 వరకూ పుంజుకునే చాన్స్‌లున్నాయ్‌. → సెన్సెక్స్‌ జోరందుకుంటే తొలుత 85,700–85,800 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. ఈ స్థాయిలను అధిగమిస్తే 88,000–88,500 వరకూ బలపడే వీలున్నట్లు అంచనా. ఒకవేళ అమ్మకాలతో బలహీనపడితే 85,000 నుంచి 84,000 పాయింట్లవరకూ క్షీణించవచ్చు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Co-living segment gains traction in India2
కో–లివింగ్‌.. ఇన్వెస్ట్‌మెంటే! 

ఒకప్పుడు సింగిల్‌గా అద్దెకుండే వారికి సింగిల్‌ రూమ్‌లు దొరికేవి. కానీ ఇప్పుడు ఆ జమానా పోయింది. అయితే సింగిల్‌ బెడ్‌రూమ్‌ తీసుకోవాలి. ఇపుడు అవీ దొరకటం లేదు. ఇక డబుల్‌ లేదా ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు తీసుకుంటే అద్దెలు తడిసి మోపెడవుతాయి. హైదరాబాద్‌ వంటి నగరాల్లోనైతే కో–లివింగ్‌ లేదా షేర్డ్‌ రెంటల్‌ ఇళ్లు బాగా దొరుకుతాయి. అంటే ఒక ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ను మూడు బెడ్‌రూమ్‌లుగా విభజించి... కిచెన్, హాల్‌ వంటివి కామన్‌గా వినియోగించుకోవటమన్న మాట. ఆ సింగిల్‌ బెడ్‌రూమ్‌లో ఒక్కరే గానీ, ఇద్దరు గానీ ఉండొచ్చు. దాన్ని బట్టే అద్దె ఉంటుంది. అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన కో–లివింగ్‌ రెంటల్‌ హౌసింగ్‌ విధానం ఇపుడు ద్వితీయ శ్రేణి (టైర్‌–2) నగరాల్లోనూ పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఈ సంస్కృతి ఇపుడిపుడే ప్రాచుర్యం అందుకుంటోంది. అటు ప్రొఫెషనల్స్‌తో పాటు ఇటు పెట్టుబడులపై అధిక రాబడులనిచ్చే కొత్త మార్గాలను అన్వేíÙస్తున్న ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి అవకాశమేనని చెప్పాలి. నాస్కామ్‌ తాజా నివేదిక ప్రకారం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాలు కొత్త టెక్నాలజీ, ఎడ్యుకేషన్‌ హబ్‌లుగా ఎదుగుతున్నాయి. దీనితో ఆయా ప్రాంతాలకు యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు బాగా వస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటూనే, తక్కువ అద్దెకు లభించే వసతి సదుపాయాల కోసం వారు వెతుక్కుంటున్నారు. ఫలితంగా... అలాంటి సౌకర్యాలను అందిస్తున్న కో–లివింగ్‌ ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. సింగిల్‌ బెడ్రూమ్‌ అద్దెకన్నా సుమారు 35 శాతం చౌకగా, సరళతరమైన నిబంధనలతో లీజుకు తీసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు వై–ఫై, క్లీనింగ్, కమ్యూనిటీ కార్యక్రమాల్లాంటి హంగులెన్నో ఉంటుండటంతో జెన్‌ జెడ్‌ వీటివైపు మొగ్గు చూపుతోంది. నిర్వహణ బాదరబందీ లేకుండా... ఇలాంటి ప్రాపర్టీలను కో–లివింగ్‌ తరహాలో అద్దెకు ఇవ్వాలనుకునే యజమానులకు నిర్వహణ బాధ్యతలను గానీ, కిరాయిదార్లతో డీల్‌ చేయటం వంటి బాధ్యతలు గానీ లేకుండా వాటన్నిటినీ తామే చూసుకునే నిర్వహణ ఏజెన్సీలు చాలా వస్తున్నాయి. నెస్ట్‌ అవే, స్టాంజా లివింగ్, కోలివ్, యువర్‌స్పేస్‌ లాంటి కంపెనీలు రకరకాల విధానాల్లో నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. కిరాయిదారుకు అద్దెకివ్వడం నుంచి గదుల మెయింటెనెన్స్, ఫరి్నíÙంగ్, అద్దెల వసూళ్లు మొదలైన పనులన్నీ ఓనర్ల ప్రమేయం లేకుండా అవే చూసుకుంటాయి. ఫలితంగా నిర్వహణ బాదరబందీ లేకుండా యజమానులకు స్థిరంగా నెలకి ఇంత చొప్పున అద్దె లభిస్తుంది. సాధారణ ఫ్లాటు కాస్త అధిక రాబడి అందించే సాధనంగా మారుతుంది. లాభసాటి ఇన్వెస్ట్‌మెంట్‌ కూడా... ఓనరు ఏమాత్రం కలుగజేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వసతి సదుపాయాలను మేనేజ్‌ చేసే సంస్థలిపుడు చాలా వస్తున్నాయి. వాటి కారణంగా ఇలాంటి ప్రాపర్టీలు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఉదాహరణకు వైజాగ్‌లో సాధారణ ట్రిపుల్‌ బెడ్రూమ్‌ ఫ్లాట్‌ అద్దె నెలకు రూ.18,000 ఉందనుకుంటే, ఆ ఇంటినే కో–లివింగ్‌ కింద (మూడు వేర్వేరు గదులుగా) మారిస్తే రూ. 24,000– రూ. 30,000 వరకు వస్తోంది. అంటే దాదాపు 35–40 శాతం మేర అధికంగా రాబడి వచి్చనట్లే. సంప్రదాయ రెంటల్‌ విధానమైతే పెట్టుబడిపై వార్షికంగా సుమారు 2 నుంచి 3 శాతం మేర నికరంగా రాబడి లభిస్తుంటే... ఈ కో–లివింగ్‌ విధానంలో 5 నుంచి 7 శాతం రాబడి వస్తోంది. అదే ఎడ్యుకేషన్, టెక్నాలజీ సెంటర్లకు దగ్గర్లో ఉన్నవైతే కొన్ని సందర్భాల్లో 8 శాతం వరకు రాబడి ఉంటోంది. అంటే బ్యాంకు వడ్డీతో సమానంగా వస్తున్నట్లే. పైపెచ్చు దీర్ఘకాలంలో విలువ పెరగటం లాంటి రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులకు ఉండే పెరుగుదల ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. ఖాళీగా ఉండేది తక్కువే.. సాధారణంగా విద్యార్థులు, జూనియర్‌ ఐటీ ఉద్యోగులు కొంత సమయం పాటు వచ్చి వెళ్లిపోతుంటారు. ఫలితంగా కో–లివింగ్‌ ప్రాపరీ్టలకు డిమాండ్‌ స్థిరంగా ఉంటోంది. వైజాగ్‌లోని మధురవాడ, విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లాంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా 90– 95 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంటున్నట్లు కన్సలి్టంగ్‌ సంస్థల చెబుతున్నాయి.రిస్క్ లు తెలుసుకోవాలి.. షరా మామూలుగా ఏ పెట్టుబడి సాధనంలోనైనా ఎంతో కొంత రిస్క్ లు ఉంటాయి. కో–లివింగ్‌లోనూ అలాంటివి కొన్ని ఉంటాయి. కిరాయిదారులు తరచుగా మారుతుండటం వల్ల ప్రాపర్టీ పాతబడిపోతుంటుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతుంటాయి. వివాదాలు తలెత్తవచ్చు. ప్రమాదాలు, డ్యామేజ్‌లకు ఆస్కారం ఉండటం వల్ల ఖరీదైన ఇన్సూరెన్స్‌ పాలసీని కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇవి కాకుండా జోనింగ్‌ పరిమితుల్లాంటి రెగ్యులేటరీ నిబంధనల అవరోధాలు, పరస్పరం సంబంధంలేని కిరాయిదార్లు, స్వల్పకాలిక రెంటల్‌ నిబంధనలపరంగా ఏవైనా వివాదాలు తలెత్తడంలాంటి సమస్యలు రావచ్చు. అయితే, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిస్క్ లతో పోలిస్తే ప్రయోజనాలే ఎక్కువన్నది నిపుణుల మాట.

Four Days Work Week in India Ministry of Labour and Employment Tweet3
వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..

భారతదేశంలో.. చాలా ప్రభుత్వ & ప్రైవేట్ సంస్థలు వారానికి 5 రోజుల పని షెడ్యూల్‌ను పాటిస్తున్నాయి. కానీ ఇప్పుడు చాలామంది కార్మికులు వారానికి నాలుగు రోజులు పని చేసి మూడు రోజులు సెలవు తీసుకోవాలని కోరుకుంటారు. జపాన్, స్పెయిన్ & జర్మనీ వంటి దేశాలు వారానికి 4 రోజుల పని విధానాన్ని పాటిస్తున్నాయి. ఇది ఇండియాలో సాధ్యమవుతుందా? అని చాన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయంపైనే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.మంత్రిత్వ శాఖ.. వారానికి నాలుగురోజుల పనికి సమ్మతించినట్లు పోస్టులో వెల్లడించింది. అయితే కొన్ని షరతులను కూడా వెల్లడించింది. సవరించిన కార్మిక నియమావళి ప్రకారం.. నాలుగు రోజులు, రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులుగా పొందవచ్చని స్పష్టం చేసింది.మంత్రిత్వ శాఖ ప్రకారం వారానికి 48 గంటలు (4 రోజులు, రోజుకు 12 గంటలు) పనిచేయాలన్న మాట. ఉద్యోగులు దీనికి సిద్ధంగా ఉంటే.. ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు ఉండవు. ఈ సమయంలో రోజుకు 12 గంటలు పనిచేస్తే.. ఓవర్ టైం కింద జీతం పెరుగుతుందా? అనే ప్రశ్న తలెత్తింది. వారంలో 48 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే.. ఓవర్ టైంకి అదనపు చెల్లింపులు ఉంటాయి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.The Labour Codes allow flexibility of 12 hours for 4 workdays only, with the remaining 3 days as paid holidays.Weekly work hours remain fixed at 48 hours and overtime beyond daily hours must be paid at double the wage rate.#ShramevJayate pic.twitter.com/5udPMqRXbg— Ministry of Labour & Employment, GoI (@LabourMinistry) December 12, 2025నాలుగు లేబర్ కోడ్‌లుభారతదేశంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు.. వచ్చినట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు. అవి ''వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తి భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSHWC) (2020)''.వేతనాల కోడ్ (2019): కనీస వేతనాలను నోటిఫైడ్ 'షెడ్యూల్డ్ ఉద్యోగాల'కు అనుసంధానించే మునుపటి వ్యవస్థను భర్తీ చేస్తూ, అన్ని రంగాలలో కనీస వేతనాలు & సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును ఈ కోడ్ వివరిస్తుంది.పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020): ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు/మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం ఈ కోడ్ లక్ష్యం.సామాజిక భద్రత కోడ్ (2020): సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది. అంతే కాకుండా మొదటిసారిగా గిగ్ & ప్లాట్‌ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్‌వర్క్‌ను సృష్టిస్తుంది.OSHWC కోడ్ (2020): ఈ కోడ్ కార్యాలయ భద్రత & పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో విలీనం చేస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు

Robots Everywhere amd What Should Humans Do4
అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలి

గోస్ట్ వేర్‌హౌస్‌లు గురించి చాలామంది వినే ఉంటారు. బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మనుషులు కనిపించరు, అందుకే వీటిని గోస్ట్ అని పిలుస్తారు. ఇక్కడంతా ఏఐ ఆధారిత రోబోట్స్‌ పనిచేస్తుంటాయి. 24/7 అలసట లేకుండా.. సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి తరహా విధానం చైనాలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అన్ని పనుల్లో రోబోలే!పాస్కల్ బోర్నెట్ (Pascal Bornet) అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. కొన్ని ఏఐ ఆధారిత రోబోటిక్ వాహనాలు నెమ్మదిగా కదులుతూ.. కంటైనర్లను మోసుకెళ్తుండటం చూడవచ్చు. వీడియోలో ఒక్క మనిషి కూడా కనిపించడు. గిడ్డంగులలో సరుకులు ఎత్తడం, కదలించడం, ప్యాక్ చేయడం వంటివన్నీ ఏఐ రోబోలే చూసుకుంటారు. కాబట్టి మనుషుల అవసరం ఉండదు.అలీబాబా, జేడీ.కామ్ వంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి ఏఐ రోబోట్స్ వినియోగిస్తున్నాయి. ఇలాంటి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. కార్మిక కొరత ఉండదు, మానవుల మాదిరిగా తప్పులు జరగవు, ఖర్చులు తగ్గిన్చుకోవచ్చు, పని కూడా వేగంగా.. నిరంతరాయంగా జరుగుతుంది.Ghost warehouses aren’t science fiction anymore — they’re already humming quietly in ChinaThey are warehouses run entirely by AI-powered robots, operating 24/7 with zero human presence.China and much of Asia have already embraced this shift, and they’re not slowing down.… pic.twitter.com/Spxwfaq7TJ— Pascal Bornet (@pascal_bornet) December 12, 2025మనుషులు చేయాల్సింది!ఈ వీడియో షేర్ చేసిన.. పాస్కల్ బోర్నెట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, పనులన్నీ రోబోలు చేస్తున్నాయి, మనుషులు ఏమి చేయాలో ఆలోచించాలని అన్నారు. రోబోలు ఎప్పుడూ ఒకే పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు డిజైన్, ఇన్నోవేషన్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ వంటి వారిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. చివరగా మీరేమనుకుంటున్నారని.. ప్రశ్నిచారు.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..పని చేయడానికి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. చాలామంది ఉద్యోగావకాశాలు కోల్పోతారు. అయితే సంస్థలు కొత్త స్కిల్స్ రోబోల నుంచి ఆశించడం అసాధ్యం. రోబోట్స్ వినియోగం చైనా వంటి దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి విధానం ప్రారంభం కావడానికి ఎంతోకాలం పట్టకపోవువచ్చు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ''మనుషులు కష్టపడే యంత్రాలు కాదు - ఆలోచించే సృష్టికర్తలు''. కాబట్టి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి.

Reliance Jio Happy New Year 2026 Plans Launched5
జియో లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: యూజర్లకు పండగే!

రిలయన్స్ జియో తన కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియోను ''హ్యాపీ న్యూ ఇయర్ 2026'' ప్లాన్‌లను ఆవిష్కరించింది. ఇందులో నెల రోజుల ప్లాన్, ఏడాది ప్లాన్ రెండూ ఉన్నాయి. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హీరో యాన్యువల్ రీఛార్జ్ఏడాది పాటు రీఛార్జ్ కావాలనుకునే వారి కోసం రిలయన్స్ జియో ఈ ప్లాన్ పరిచయం చేసింది. రూ. 3599లతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.5 జీబీ 5జీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌కు 18 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ పేరుతో 500 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా జియో ప్రకటించింది. ఇది 28 రోజుల చెల్లుబాటు ఉన్నప్పటికీ.. రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా ఓటీటీ ప్రయోజనాలు (యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్‌, సోని లివ్, జీ5 మొదలైనవి) లభిస్తాయి. యాన్యువల్ ప్లాన్ మాదిరిగానే 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా పొందవచ్చు.ఫ్లెక్సీ ప్యాక్ఫ్లెక్సీ ప్యాక్ పేరుతో.. 103 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. అయితే ఇందులో కేవలం డేటా మాత్రం లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుడు.. హిందీ, ఇంటర్నేషనల్, ప్రాంతీయ ప్యాక్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్

BSNL 365 Plan At Rs 2399 and Know The Details6
ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 365 రోజుల ప్లాన్ పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన రూ. 2399 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 2జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్ఎ‌స్‌లు, అపరిమిత కాల్స్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. నాన్ స్టాప్ కనెక్షన్ అని పోస్ట్ చేసింది.సంవత్సరం ప్లాన్ కోరుకునేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంటే తక్కువే. దీన్నిబట్టి చూస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లన్స్ పరిచయం చేస్తూ ముందుకు సాగుతుందని స్పష్టమవుతోంది.Attention !!!Non- stop connection at 2399/- for 365 days#BharatFibre #SuccessStory #Partnership #4Gmobile #BusinessSuccess #BSNLSelfCareApp #SwitchToBSNL #entertainment #mobilerecharge #fypage✨ #explorepage pic.twitter.com/774dFc3jeJ— BSNL_Kolkata (@BSNL_KOTD) December 13, 2025

Advertisement
Advertisement
Advertisement