Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

here business ideas earn lakhs sitting at home without any investment1
ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్‌ ఐడియాలు

నేటి డిజిటల్ యుగంలో పెట్టుబడి లేకుండా, ఇంట్లో కూర్చుని లక్షల్లో సంపాదించే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. అయితే వీటికి మీ నైపుణ్యాలు, సమయాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకునే చాలా వ్యాపారాలు సాగుతున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎలాంటి శ్రమ లేకుండా నిజానికి లక్షల రూపాయలు సంపాదించడం అనేది సాధ్యంకాదు. నిరంతర కృషి, సరైన వ్యూహం, మార్కెటింగ్ సామర్థ్యం, కొత్త ట్రెండ్‌లను ఉపయోగించుకుంటే డబ్బు సంపాదన తేలికవుతుంది. నగదు రూపేణా పెద్దగా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించడానికి అవకాశం ఉన్న కొన్ని వ్యాపార ఆలోచనలు చూద్దాం.ఫ్రీలాన్సింగ్ సేవలుమీకు ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉంటే దాన్ని సర్వీసుగా మార్చి డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు కంటెంట్ రైటింగ్ (తెలుగు/ఇంగ్లీష్), గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్‌మెంట్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, డేటా ఎంట్రీ, ట్రాన్స్‌లేషన్ (అనువాదం) వంటి నైపుణ్యాలు ఉన్నాయంటే ఆన్‌లైన్‌లోని Fiverr, Upwork, Freelancer వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో మీ సర్వీసులు అందించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. స్థానిక చిన్న వ్యాపారాలు లేదా స్టార్టప్‌ల కోసం డిజిటల్ మార్కెటింగ్ లేదా కంటెంట్ సేవలు అందిస్తూ డబ్బు సమకూర్చుకోవచ్చు.ఆన్‌లైన్ ట్యూటరింగ్/ కోచింగ్ఏదైనా అకడమిక్ సబ్జెక్ట్‌లో పరిజ్ఞానం (గణితం, సైన్స్), సంగీతం, యోగా, వంట, ప్రోగ్రామింగ్, భాషా నైపుణ్యాలు ఉంటే డిజిటల్‌ వేదికగా ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ కోసం చాలా ప్లాట్‌ఫామ్‌లున్నాయి. లేదా సొంతంగా వీడియో కాల్స్ ద్వారా ట్యూషన్ చెప్పవచ్చు.Udemy, Skillshare వంటి వేదికల్లో ఆన్‌లైన్ కోర్సులను రికార్డ్ చేసి అమ్ముకోవచ్చు. కోర్సు అమ్మకాలు ఎక్కువైతే లక్షల్లో సంపాదన సాధ్యమవుతుంది.డ్రాప్‌షిప్పింగ్డ్రాప్‌షిప్పింగ్ అంటే ఉత్పత్తిని ముందే కొనుగోలు చేయకుండా ఆర్డర్ వచ్చిన తర్వాత నేరుగా సరఫరాదారు నుంచి కస్టమర్‌కు పంపే విధానం. ఇందుకోసం ఆన్‌లైన్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై అవగాహన పెంచుకోవాలి. మీరు ఒక ఆన్‌లైన్ స్టోర్‌ను సృష్టించి ఇతర కంపెనీల ఉత్పత్తులను అందులో ఉంచాల్సి ఉంటుంది. కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు ఆ ఆర్డర్‌ను సరఫరాదారుకు పంపితే వారు నేరుగా కస్టమర్‌కు డెలివరీ చేస్తారు. కొనుగోలు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని లాభంగా మీకు వస్తుంది.అనుబంధ మార్కెటింగ్ (Affiliate Marketing)సోషల్ మీడియా (YouTube, Instagram..) లేదా వెబ్‌సైట్ ద్వారా భారీ ఫాలోయింగ్/ట్రాఫిక్ ఉంటే ఈ అనుబంధ మార్కెటింగ్‌లో మంచిగానే సంపాదించవచ్చు. ఒక ఉత్పత్తికి సంబంధించిన ప్రత్యేక లింక్‌ను (Affiliate Link) మీ వెబ్‌సైట్‌లో లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆ లింక్ ద్వారా ఎవరైనా వస్తువులు కొనుగోలు చేస్తే మీకు నిర్దిష్ట శాతం కమీషన్ వస్తుంది.విజయానికి ముఖ్య అంశాలుపెట్టుబడి లేకుండా లక్షల్లో సంపాదించడానికి కేవలం ఆలోచన సరిపోదు. ఆన్‌లైన్ వ్యాపారాలలో విజయం సాధించడానికి రోజూ క్రమం తప్పకుండా ఫాలోఅప్‌ అవసరం. మీ సర్వీసులు లేదా కంటెంట్ ఎక్కువ మందికి చేరడానికి సోషల్ మీడియా మార్కెటింగ్ తప్పనిసరి. మీరు అందించే సర్వీసు నాణ్యతగా ఉంటేనే కస్టమర్‌లు లేదా వీక్షకులు మిమ్మల్ని నమ్ముతారు. ఇంట్లో కూర్చొని పని చేసేటప్పుడు ఏకాగ్రతతో సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ముఖ్యం.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్‌ బఫెట్‌ ఆర్థిక సూత్రాలు

Warren Buffett believes economic principles growth middle class2
మధ్యతరగతి వారికి వారెన్‌ బఫెట్‌ ఆర్థిక సూత్రాలు

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో వారెన్ బఫెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా భారతదేశంలోని సాధారణ వేతన జీవులు ఆర్థికంగా ఎదగడానికి, సంపదను సృష్టించడానికి ఉపయోగపడే అత్యంత విలువైన, ఆచరణాత్మక ఆర్థిక సూత్రాలను సూచించారు.ముందుగా పొదుపు, తర్వాతే ఖర్చుప్రతినెల జీతం వచ్చిన వెంటనే ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయడం కంటే ముందుగా పొదుపు చేయదలిచిన మొత్తాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత మిగిలిన దానితో ఖర్చులను సరిపెట్టుకోవాలి. ఈ సూత్రం ద్వారా పొదుపుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుంది. మధ్యతరగతి వారికి ఇది ఒక బలమైన ఆర్థిక పునాదిని ఏర్పరుస్తుంది.అనవసరమైన రుణాలను నివారించడంఅధిక వడ్డీ రేట్లు ఉండే రుణాలకు (ముఖ్యంగా క్రెడిట్ కార్డు రుణాలు) దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి సంపదను హరించివేస్తాయి. రుణాలను నివారించడం లేదా వీలైనంత త్వరగా వాటిని తీర్చేయడం ద్వారా వడ్డీ రూపంలో పోయే డబ్బు ఆదా అవుతుంది. దాన్ని పెట్టుబడికి ఉపయోగించవచ్చు. ఇది సంపద సృష్టి వేగాన్ని పెంచుతుంది.దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడిస్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు భయపడకుండా బలమైన వ్యాపార నమూనా, మంచి నిర్వహణ ఉన్న కంపెనీలను ఎంచుకుని దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టాలి. స్వల్పకాలిక లాభాల కోసం వెంపర్లాడకుండా సహనంతో ఉంటే కాలక్రమేణా చక్రవడ్డీతో చిన్న పెట్టుబడులు కూడా భారీ మొత్తంగా మారతాయి. మధ్యతరగతి వారికి సంపద సృష్టిలో ఇది అత్యంత కీలకమైన సూత్రం.తెలిసిన వాటిలో మాత్రమే పెట్టుబడి పెట్టడంమీకు పూర్తిగా అర్థం కాని లేదా అవగాహన లేని వ్యాపారాలు/పరిశ్రమలలో పెట్టుబడి పెట్టవద్దు. మధ్యతరగతి వారు నష్టాలను భరించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందుకే తాము అర్థం చేసుకోగలిగే, భవిష్యత్తులో వృద్ధి చెందే సామర్థ్యం ఉన్న వాటిలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి.సాధారణ వేతన జీవులకు సలహాలుప్రతి నెల బడ్జెట్‌ను పాటించాలి. అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించి అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. ధనవంతులుగా కనిపించడానికి లగ్జరీ వస్తువులు (పెద్ద ఇల్లు, ఖరీదైన కారు) కొనడానికి అప్పులు చేయవద్దు. విలువ తగ్గే ఆస్తులపై (ఉదా: కొత్త కారు) అధికంగా ఖర్చు పెట్టకుండా ఉండాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, జ్ఞానాన్ని నిరంతరం పెంచుకోవడం ద్వారా సంపాదన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. మంచి విద్య, నైపుణ్య శిక్షణ, నిరంతర అభ్యాసం ద్వారా ఉద్యోగంలో మెరుగైన స్థానం, అధిక జీతం పొందవచ్చు.ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు!

Telangana Minister Sridhar Babu said Hyderabad Aero Engine Capital3
‘ఏరో-ఇంజిన్’ రాజధానిగా తెలంగాణ: మంత్రి

తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో-ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.ఆదిభట్లలో న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీటాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(TASL), సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ఫెసిలిటీ ద్వారా ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజిన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపోనెంట్), లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్ (రోటేటివ్ కాంపోనెంట్)లు తయారు కానున్నాయి.ఈ కొత్త యూనిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్ అంటే కేవలం ‘సిటీ ఆఫ్ పెరల్స్’ మాత్రమే కాదని ‘ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్’ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.రాష్ట్రంలో ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు 2023-24లో రూ.15,900 కోట్లు ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరిగాయని మంత్రి చెప్పారు. విమాన తయారీ కంపెనీలకు రాష్ట్రం గమ్యస్థానంగా ఉందని, ఇక్కడ తామ కార్యకలాపాలు చేపట్టాలని అంతర్జాతీయ దిగ్గజ ఏరో సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. ఇంజిన్స్, కాంపోనెంట్స్, కన్వర్షన్స్, స్పేస్, డ్రోన్స్, డిజిటల్, ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వైస్ ప్రెసిడెంట్ డొమినిక్ డూప్, టీజీఐఐసీ ఎండీ శశాంక తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు!

Reliance Jio expanded its user base in Andhra Pradesh Telangana4
తెలుగు రాష్ట్రాల్లో జియో టాప్‌

రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది. సెప్టెంబర్ 2025లో సంస్థ వైర్‌లెస్, వైర్‌లైన్ రెండు విభాగాల్లోనూ వృద్ధి సాధించినట్లు తెలిపింది. టెలికాం రెగ్యులేటర్ సంస్థ (TRAI) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, వైర్‌లైన్ విభాగంలో జియో 40,641 కొత్త యూజర్లను చేర్చుకొని తన సబ్‌స్క్రైబర్ సంఖ్యను 17.87 లక్షల నుంచి 18.28 లక్షలకు పెంచుకుంది. ఇది అన్ని ఆపరేటర్లలో అత్యధికం.ఈ వృద్ధి ముఖ్యంగా టైర్‌ 2, టైర్‌ 3 నగరాల్లో జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్‌ప్రైజ్ కనెక్టివిటీ సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భారతి ఎయిర్‌టెల్ సెప్టెంబర్‌లో 12,043 మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోగా, బీఎస్ఎన్ఎల్ తక్కువ స్థాయిలో మాత్రమే వృద్ధి నమోదు చేసింది. వొడాఫోన్ ఐడియా మాత్రం 1,310 మంది యూజర్లను కోల్పోయింది.వైర్‌లెస్ విభాగంలో జియో 1.17 లక్షల కొత్త మొబైల్ సబ్‌స్క్రైబర్లను చేర్చుకొని తన మొత్తం యూజర్ బేస్‌ను సెప్టెంబర్ 2025 నాటికి 3.18 కోట్లకు చేర్చుకుంది. ఎయిర్‌టెల్ 39,248 కొత్త యూజర్లను యాడ్‌ చేసుకుంది. బీఎస్ఎన్ఎల్ చవక ధర ప్లాన్లతో 80,840 యూజర్లను సాధించింది. అయితే వొడాఫోన్ ఐడియా దాదాపు 70,000 యూజర్లను కోల్పోయింది.ఇదీ చదవండి: ఆరేళ్లు పూర్తి చేసుకున్న తొలి ప్రైవేట్ రైలు

India first private train Tejas Express offers ​high ticket prices5
ఆరేళ్లు పూర్తి చేసుకున్న తొలి ప్రైవేట్ రైలు

భారతీయ రైల్వే ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి విస్తృత శ్రేణి సేవలను అందిస్తున్నప్పటికీ, 2019లో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలును ప్రవేశపెట్టి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే ఈ రైలు ఆరేళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ రైలును పూర్తిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తుంది.మొదటి ప్రైవేట్ రైలుదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్.న్యూఢిల్లీ నుంచి లఖ్‌నవూ వరకు ఈ రైలు నడుస్తుంది.ఈ సర్వీసును అక్టోబర్ 4, 2019న ప్రారంభించారు.ఈ సర్వీసు ప్రారంభించి ఆరేళ్లు పూర్తయినప్పటికీ, అదే మార్గంలో నడుస్తున్న రాజధాని, శతాబ్ది, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ఇతర ప్రీమియం సేవల కంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.న్యూఢిల్లీ - లఖ్‌నవూ మధ్య టి​క్కెట్‌ ఛార్జీల పోలికరైలు సర్వీసుతరగతిటికెట్ ధర (రూ.)IRCTC తేజస్ ఎక్స్‌ప్రెస్‌ఏసీ చైర్ కార్రూ. 1,679IRCTC తేజస్ ఎక్స్‌ప్రెస్‌ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 2,457శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ఏసీ చైర్ కార్రూ. 1,255శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 1,955వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ఏసీ చైర్ కార్రూ. 1,255వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 2,415రాజధాని ఎక్స్‌ప్రెస్‌ఏసీ థర్డ్ టైర్ (3A)రూ. 1,590రాజధాని ఎక్స్‌ప్రెస్‌ఏసీ సెకండ్ టైర్ (2A)రూ. 2,105రాజధాని ఎక్స్‌ప్రెస్‌ఏసీ ఫస్ట్ క్లాస్ (1A)రూ. 2,630 తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలుతేజస్ ఎక్స్‌ప్రెస్ అనేది ఆధునిక సదుపాయాలతో కూడిన సెమీ హై స్పీడ్ రైలు. ఈ కోచ్‌లను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడవగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే రైలు పట్టాలకు సంబంధించిన అడ్డంకుల కారణంగా ఈ కోచ్‌లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. స్టీల్ బ్రేక్ డిస్క్, సింటెర్డ్ ప్యాడ్లు, ఎలక్ట్రో-న్యూమాటిక్ అసిస్ట్ బ్రేక్ సిస్టమ్‌ ఇందులో ఉంది.ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు!

How base salary of Rs 100 in 1956 grown to Rs 26000 by 2016 8th pay commission6
60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు!

ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు అందించింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్‌ పెంచేలా 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్‌ మంగళవారం (అక్టోబర్‌28) ఆమోదం తెలిపింది. ఎనిమిదో సెంట్రల్ పే కమిషన్ విధి విధానాలకు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) రూపొందించేందుకు కేబినెట్‌ ఆమోదించింది.8వ పే కమిషన్8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు జరిపింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి త్వరగానే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.ఎవరిపై ప్రభావం?ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)కు తాజాగా ఆమోదం తెలిపింది. ఇది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్‌ ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌(కొత్త బేసిక్‌పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్‌పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.ఇదీ చదవండి: అధిక సంఖ్యలో టీకాల వల్ల పిల్లల్లో ఆటిజం: శ్రీధర్ వెంబు60 ఏళ్లలో 260 రెట్లు పెరుగుదలకేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గత ఆరు దశాబ్దాలలో (1956 నుంచి 2016 వరకు) భారీగా వృద్ధి చెందాయి. మొదటి వేతన సంఘం (1956) కాలంలో ఒక ఉద్యోగికి రూ.100 మూల వేతనం ఉంటే, అది ఏడో వేతన సంఘం (2016) నాటికి సుమారు రూ.26,000కి చేరింది. అంటే 60 ఏళ్ల కాలంలో జీతం సుమారు 260 రెట్లు పెరిగింది. 8వ పే కమిషన్‌ అమల్లోకి వస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.వేతన సంఘాల వారీగా జీతాల వృద్ధి (1956లో రూ.100 మూల వేతనంగా పరిగణించి)వేతన సంఘం (CPC)సంవత్సరంసవరించిన తర్వాత బేసిక్‌ జీతంముఖ్య అంశాలు1వ CPC1956రూ.100వ్యవస్థీకృత వేతన స్కేళ్ల (Structured Pay Scales)ను ప్రవేశపెట్టారు.2వ CPC1960రూ.105–110ద్రవ్యోల్బణం కోసం సర్దుబాట్లు చేశారు.3వ CPC1973రూ.180–200ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరగడం వల్ల పెంపు.4వ CPC1986రూ.700–750కరువు భత్యం (DA) విలీనం, భారీ పెంపు.5వ CPC1996రూ.2,500–3,00030–35% పెంపును సిఫార్సు చేశారు.6వ CPC2006రూ.7,000–8,000పే బ్యాండ్ (Pay Band) + గ్రేడ్ పే (Grade Pay) విధానం, ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్ సుమారు 1.86గా నిర్ణయించారు.7వ CPC2016రూ.25,000–26,0002.57 ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్

Advertisement
Advertisement
Advertisement