Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India pumps up Russia oil buy by 50 Percent in March1
రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు

న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఈ నెలలో 50 శాతం పెరిగాయి. రోజువారీ 1.5 మిలియన్‌ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఇది 1.04 మిలియన్‌ బ్యారెళ్లుగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో చమురు సరఫరాలు నిలిచిపోవడం తెలిసిందే. దీంతో భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకుంది. మన దేశం ప్రతి రోజూ సగటున 5.8 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంటుంది. ఇందులో 2.5–2.7 మిలియన్‌ బ్యారెళ్లు హర్మూజ్‌ జలసంధి నుంచే భారత్‌కు వస్తుంటుంది.అంతేకాదు మన దేశ ఎల్‌పీజీ అవసరాల్లో 55 శాతం, ఎల్‌ఎన్‌జీలో 30 శాతం కూడా ఈ మార్గం నుంచే వస్తుంటుంది. రష్యా నుంచి రోజువారీ 1–1.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురును సమకూర్చుకుంటున్న నేపథ్యంలో హర్మూజ్‌ను మూసివేయడం కారణంగా మనకు ఏర్పడే లోటు 1.6 మిలియన్‌ బ్యారెళ్లు (రోజువారీ/బీపీడీ)గా ఉంటుందని కెప్లర్‌ అనలిస్ట్‌ సుమిత్‌ రిటోలియా తెలిపారు. ఇక రోజువారీ ఎల్‌పీజీ వినియోగం ఒక మిలియన్‌ బీపీడీగా ఉంటే.. ఇందులో 40–45 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన మొత్తాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఇందులో 80–90 శాతం హర్మూజ్‌ జలసంధి నుంచే రావాలి. ఈ మార్గం మూసుకుపోవడంతో దేశీయంగా ఎల్‌పీజీకి కటకట నెలకొంది. దేశీ సంస్థలు ఉత్పత్తిని 10–20 శాతం పెంచినా సరే, 47–50 శాతం లోటును ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Cognizant Research Shows Plug and Play AI is a Myth2
అందరికీ ఒకే ఏఐ పరిష్కారాలు సరిపోవు

న్యూఢిల్లీ: కంపెనీల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ప్లగ్‌ అండ్‌ ప్లే (సిద్ధంగా ఉన్న) రకమైన సాధారణ సాఫ్ట్‌వేర్‌లు సరిపోవని ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ వెల్లడించింది. సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పూర్తి స్థాయి ఏఐ పరిష్కారాలను అందించే ఐటీ కంపెనీలకే ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని తెలిపింది. ఏఐపై నిర్ణయాధికారం కలిగిన 600 మందితోపాటు 38 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను సర్వే చేసి ఒక నివేదిక విడుదల చేసింది.సంస్థలు ఏఐ భాగస్వామిని (టెక్నాలజీ సంస్థ) ఎంపిక చేసేటప్పుడు ధర లేదా సత్వర ఫలితాలు కంటే, తమ అవసరాలకు తగ్గట్టు రూపొందించిన ప్రత్యేక పరిష్కారాలు, విధానాలను కీలకంగా చూస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా అందుబాటులో ఉండే ఏఐ సాఫ్ట్‌వేర్‌లు తమ వ్యాపార అవసరాలకు సరిపోవంటూ కొన్ని సంస్థలు ఏఐ సేవలను తిరస్కరిస్తున్నాయని వెల్లడించింది. తగినంత అనుభవం లేకపోవడం, ఇప్పటికే ఉన్న సాంకేతిక వ్యవస్థలతో అనుసంధానం చేయకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడాన్ని కారణాలుగా పేర్కొంది. కీలక సవాళ్లు.. ఏఐ స్వీకరణలో సంస్థలు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లలో.. నియంత్రణ, నిబంధనలపరమైన ఆందోళనలు.. పెట్టుబడిపై సరైన రాబడిని చూపించడం కష్టంగా ఉండడం.. ఏఐ వ్యూహంపై సరైన స్పష్టతలేమిని పేర్కొంది. ఏఐ విజయవంతం కావాలంటే ఒక్కో నమూనాను అమలు చేయడంతోనే సరిపోదని, సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పరిష్కారాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ పేర్కొన్నారు. అలాగే ఏఐపై పెట్టుబడులను ప్రయోగాత్మకంగా కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడులుగా సంస్థలు చూస్తున్నాయని తెలిపారు. ఏఐ మనుషుల పనులను వేగవంతం చేస్తుందే కానీ, వారి ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదని కాగ్నిజెంట్‌ అధ్యయన నివేదిక పేర్కొంది. మనుషులు ఏఐ కలిసి పనిచేసే విధంగా పనితీరులో మార్పులు వస్తాయని తెలిపింది.

Cyber fraudsters using new tech to bypass UPI security for financial transaction3
ప్రమాదంలో యూపీఐ సెక్యూరిటీ!

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ మోసగాళ్లు కొత్త టెక్నాలజీతో యూపీఐ యూజర్లనూ బురిడీ కొట్టిస్తున్నారు. యూపీఐ భద్రతా ఫీచర్లను ఛేదించుకుని మరీ, ఆర్థిక లావాదేవీలు కానిచ్చేస్తున్నారని, సైబర్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ క్లౌడ్‌సెక్‌ ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. టెలీగ్రామ్‌లో 20 గ్రూప్‌లు చురుగ్గా పనిచేస్తున్నట్టు, ప్రతీ బృందంలో 100కు పైగా సభ్యులున్నుట్టు తెలిపింది. ఈ గ్రూప్‌లు ‘డిజిటల్‌ లూటెరా’ పేరుతో చర్చించుకోవడం, పంపిణీ చేయడం, నిర్వహించడం చేస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇది కేవలం మరొక యూపీఐ మాల్వేర్‌ రకమే కాదు.డివైజ్‌పై ఉన్న నమ్మకంపైనే డిజిటల్‌ లూటెరా దాడి చేస్తోంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌నే మార్చివేస్తున్నప్పుడు.. సంప్రదాయ రక్షణలైన సిమ్‌ బైండింగ్‌ యాప్‌ (సిమ్‌కు అనుసంధానమైన) సిగ్నేచర్‌ తనఖీ కూడా పనికిరాకుండా పోతుంది. దీనికి పరిష్కారం కనుగొనకపోతే డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ అంతటినీ తన చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉంటుంది’’అని హెచ్చరించింది. ఒక టెలిగ్రామ్‌ గ్రూప్‌ రెండు రోజుల్లోనే రూ.25–30 లక్షల లావాదేవీలను పూర్తి చేసిందని క్లౌడ్‌సెక్‌ విశ్లేషణలో తేలింది. ఈ మోసపూరిత వ్యవస్థ ఎంత వేగంగా విస్తరించగలదు, ఎంత మంది మోసం చేయగలదన్నదానికి ఇది నిదర్శమని పేర్కొంది. మోసం ఇలా... మొబైల్‌ ఫోన్‌ యూజర్‌ తనకు తెలియకుండా హానికారక ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నప్పుడు.. డిజిటల్‌ లూటెరా కిట్‌ ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. వెంటనే సైబర్‌ నేరస్థులకు ఫోన్‌పై నియంత్రణ వెళుతుంది. దీంతో బ్యాంక్‌ ఓటీపీలు అటాకర్ల టెలీగ్రామ్‌ ఛానళ్లకు వెళతాయి. భద్రతకు ఢోకాలేదు: ఎన్‌పీసీఐ దీనిపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(యూపీఐ నిర్వహణ సంస్థ/ఎన్‌పీసీఐ) స్పందించింది. డిజిటల్‌ చెల్లింపుల నిర్వహణకు సంబంధించి బలమైన తనిఖీలున్నట్టు స్పష్టం చేసింది. ‘‘సంబంధిత నివేదికను ఎన్‌పీసీఐ పరిశీలించింది. ఆ విధమైన రిస్క్‌లను పరిష్కరిచేందుకు తగినన్ని రక్షణలు ఉన్నాయి. బహుళ అంచల రక్షణలతో, గుర్తింపు ధ్రువీకరణలతో లావాదేవీలను సురక్షితంగా, భద్రంగా చేసుకునే విధంగా యూపీఐని రూపొందించడమైంది’’అని ఎన్‌పీసీఐ వివరణ ఇచ్చింది.

iQOO Z11x Smartphone for College Students: Price Starts at Rs 174994
కాలేజీ స్టూడెంట్స్‌ కోసం ఐక్యూ జెడ్‌11ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఐక్యూ తాజాగా కాలేజీ విద్యార్థుల కోసం జెడ్‌11ఎక్స్‌ ఫోన్‌ని ఆవిష్కరించింది. దీని ధర డిస్కౌంట్ల అనంతరం రూ. 17,499 నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్, ఐక్యూ పోర్టల్స్‌తో పాటు వివో స్టోర్స్, ఇతర ఔట్‌లెట్స్‌లో మార్చి 16 మధ్యాహ్నం నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.మల్టీటాస్కింగ్‌కి ఉపయోగపడేలా 7200 ఎంఏహెచ్, మీడియాటెక్‌ డైమెన్సిటీ టర్బో చిప్, సోనీ ఏఐ ఆధారిత 50 ఎంపీ కెమెరా, ముందు..వెనుక కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్, 6.76 అంగుళాల డిస్‌ప్లే, రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉంటాయని సంస్థ సీఈవో నిపుణ్‌ మార్యా తెలిపారు. నిర్దిష్ట ఎస్‌బీఐ, యాక్సిస్‌ క్రెడిట్‌ కార్డులపై డిస్కౌంట్లు లభిస్తాయి. మేకిన్‌ ఇండియా నినాదానికి కట్టుబడి ఉంటూ గ్రేటర్‌ నోయిడాలోని వివో ప్లాంటులో వీటిని తయారు చేస్తారు.

India hiring outlook hits record high for April-June quarter: Report5
నియామకాల పండగే!

న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు వచ్చే ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో గణనీయంగా పెరగనున్నట్లు మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ తాజా సర్వే తెలిపింది. వ్యాపారాల్లో పెరిగిన విశ్వాసం, దేశీ డిమాండ్‌ బలంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయిమెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే ప్రకారం.. 2026 సంవత్సరం రెండో త్రైమాసికానికి నెట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఎన్‌ఈవో) 68 శాతానికి చేరి రికార్డు స్థాయిని తాకింది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 17 పాయింట్లు, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 పాయింట్లు ఎక్కువ.జనవరి 1 నుంచి ఫిబ్రవరి 3 మధ్య దేశవ్యాప్తంగా 3,000కిపైగా సంస్థల యజమానుల అభిప్రాయాలను మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ తెలుసుకుని ఈ వివరాలు విడుదల చేసింది. గతేడాది చేపట్టిన జీఎస్‌టీ సంస్కరణలు, 2026 సంవత్సరానికి బలమైన ఆర్థిక వృద్ధి అంచనాలు వ్యాపారాలకు మద్దతునిస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. అలాగే భారత్‌– ఐరోపా సమాఖ్య (ఈయూ) వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వంటివి మెరుగైన ఎగుమతులకు సహాయపడతాయని పేర్కొంది. నియామకాలు పెరుగుతాయన్న సంస్థల అంచనాల నుంచి, నియామకాలు తగ్గుతాయని చెప్పిన కంపెనీల అంచనాలను మినహాయించగా వచి్చందే నెట్‌ ఎంప్లాయిమెంట్‌ అవుట్‌లుక్‌ (ఎన్‌ఈవో). ఫైనాన్స్, బీమాలో ఎక్కువ.. ⇒ మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ సర్వే ప్రకారం.. ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ రంగంలోని కంపెనీలు గరిష్ట నియామక అంచనాలతో ఉన్నాయి. ఇది 71 పాయింట్లుగా ఉంది. గత త్రైమాసికం నుంచి 8 పాయింట్లు పెరిగింది. అదే గతేడాది క్యూ2తో పోలి్చతే ఏకంగా 26 పాయింట్లు పెరిగింది. అంతేకాదు ఫైనాన్స్, బీమా రంగంలో నియామక అంచనాల పరంగా అంతర్జాతీయంగానూ భారత్‌ మొదటి స్థానంలో ఉంది. ⇒ ఆటోమోటివ్‌ రంగం సైతం పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగులను ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో తీసుకోనుంది. ఆ తర్వాత టెక్నాలజీ, ఐటీ రంగంలో ఎక్కువ అవకాశాలు రానున్నాయి. ⇒ ఆతిథ్య రంగంలో నియామకాల అంచనా 31 శాతంగా ఉంది. ఈ రంగంలో కొంత అప్రమత్త ధోరణి కనిపించింది. ⇒ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యోగ నియామకాలు పెరగనుండగా, ఉత్తర భారత్‌లో మాత్రం 70 పాయింట్లతో బలమైన అంచనాలు కనిపించాయి. ⇒ ఇప్పటికే 87 శాతం సంస్థలు నియామకాలు, శిక్షణ విషయంలో ఏఐని వినియోగిస్తున్నాయి. ఏఐ తమ అంచనాలను పూర్తిగా అందుకుంటున్నట్టు 11 శాతం సంస్థలే చెప్పాయి.వేధిస్తున్న నిపుణుల కొరత..‘‘నియామకాల ఉద్దేశ్యం బలంగా ఉంది. ఇది యాజమాన్యాల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. అదే సమయంలో నిపుణుల కొరత సైతం వేధిస్తోంది. తమకు కావాల్సిన నైపుణ్యాలను గుర్తించడం కష్టంగా ఉందని 82 శాతం సంస్థలు అంటున్నాయి. రానున్న రోజుల్లో నియామక నిర్ణయాలను కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావితం చేయనుంది’’అని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఎండీ సందీప్‌ గులాటీ తెలిపారు.

Devendra Singh Chaplot Joined Elon Musk SpaceX xAI6
మస్క్ టీమ్‌లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?

ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలలో భారతీయుల ప్రతిభ ఎంతో గుర్తింపు పొందుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు.. ఇండియన్ రోబోటిక్స్ ఎక్స్‌పర్ట్‌ & ఏఐ పరిశోధకుడు అయిన దేవేంద్ర చాప్లోట్‌.. ఎలాన్ మస్క్ కంపెనీలో చేరారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేవేంద్ర చాప్లోట్ తన సోషల్ మీడియా ఖాతాలో.. ఎలాన్ మస్క్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. సూపర్ ఇంటెలిజెన్స్ నిర్మించడానికి మస్క్ టీమ్‌లో చేరుతున్నాను అని వెల్లడించారు. దీనికి స్పందిస్తూ.. xAIలోకి స్వాగతం అంటూ మస్క్ ట్వీట్ చేశారు.ఎవరీ దేవేంద్ర చాప్లోట్?IIT-బాంబే పూర్వ విద్యార్థి అయిన చాప్లోట్, AI & రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. ఈయన 2014లో IIT-బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో B.Tech & అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో మైనర్ పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మెషిన్ లెర్నింగ్ విభాగం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసాడు. అక్కడే బిల్డింగ్ ఇంటెలిజెంట్ అటానమస్ నావిగేషన్ ఏజెంట్లపై పనిచేశారు.చాప్లోట్ దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌లో దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత అతను ఫేస్‌బుక్ AI రీసెర్చ్‌లో చేరాడు. AI రీసెర్చ్ సైంటిస్ట్‌గా, అతను ఆ సంస్థలో కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్‌లో పనిచేశాడు. 2020లో, రోబోటిక్స్ నిపుణుడు మిస్ట్రాల్ AIలో చేరారు.Welcome to @xAI! https://t.co/5tAdHPJmfx— Elon Musk (@elonmusk) March 13, 2026సాధించిన పురస్కారాలుదేవేంద్ర చాప్లోట్ తన పరిశోధనలకు అనేక పురస్కారాలు అందుకున్నారు. 2020లో ఫేస్‌బుక్ ఫెలోషిప్ పొందారు. అలాగే కంప్యూటర్ విజన్ రంగంలో నిర్వహించే సీవీపీఆర్ AI హాబిటాట్ ఆబ్జెక్ట్ నావిగేషన్ ఛాలెంజ్ & 2018లో CVPR 2018 డీప్ లెర్నింగ్ ఫర్ విజువల్ SLAM వర్క్‌షాప్‌లో బెస్ట్ పేపర్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement