Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

From Rs 20 Lakh Salary to Organic Farming, Viral Journey Redefines Success1
రూ.20 లక్షల నుంచి రూ.20 వేలకు తగ్గిన సంపాదన..

నేటి ఆధునిక సమాజంలో సక్సెస్ అంటే ఏంటి? ఆరంకెల జీతం, ఏటా పెరిగే బోనస్‌లు, సమాజంలో హోదా పెంచే కార్పొరేట్ పదవులు.. ఇదే కదా అందరి లెక్క! కానీ, వీటన్నింటినీ కాదని ఆత్మసంతృప్తి కోసం ఒక మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ భార్య రుచి వారికూ కార్పొరేట్‌ కంపెనీలో వార్షికంగా రూ.20 లక్షల ప్యాకేజీని వదులుకొని నెలకు కేవలం రూ.20 వేలు వచ్చే సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.కలల కొలువు నుంచి బ్రేక్‌వైరల్‌ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. రుచి వారికూ కెరీర్ ప్రారంభం నుంచి ఒక మూస పద్ధతిలో ఆలోచించలేదు. 19 ఏళ్ల వయస్సులోనే ఆమెకు భవిష్యత్తుపై స్పష్టమైన, భిన్నమైన ఆలోచనలు ఉండేవని అంకుర్ గుర్తు చేసుకున్నారు. కాలేజీ పూర్తి కాగానే ఒక మ్యాగజైన్‌లో చేరిన ఆమె ఆ తర్వాత తన కలల సంస్థ అయిన డిస్కవరీ ఛానెల్‌లో ఉద్యోగం సంపాదించారు. 2005 నుంచి 2010 వరకు అక్కడే పనిచేస్తూ ఏటా రూ.20 లక్షల ఆదాయంతో అత్యున్నత స్థాయిలో నిలిచారు.జీవితం మలుపు తిరిగింది ఇలా..తమకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత రుచి తన ప్రాధాన్యతలను మార్చుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే తన కుమారుడి పెంపకం కోసం ఉద్యోగానికి విరామం ప్రకటించారు. నాలుగు ఏళ్ల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమైన ఆమె మళ్లీ కెరీర్ ప్రారంభించాలనుకున్నప్పుడు అందరిలా తిరిగి కార్పొరేట్ రంగానికి వెళ్లలేదు. ‘నా భార్య సంవత్సరానికి రూ.20 లక్షల సంపాదన నుంచి నెలకు రూ.20 వేల సంపాదనకు మారింది. 2014లో ఆమె సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపింది. నెలకు కేవలం రూ.20 వేలు మాత్రమే అందుతున్నా ఆమె పొందిన సంతృప్తి వెలకట్టలేనిది’ అని అంకూర్‌ లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో అన్నారు.సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘విజయం కేవలం ఆదాయం గురించి కాదు, ఆ దశలో మీకు ఏది ముఖ్యమో దానితో కలిసి ప్రయాణించడం’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘కెరీర్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులను బట్టి మారుతుంటుంది’ అని మరొకరు పేర్కొన్నారు. డబ్బు కంటే మానసిక ప్రశాంతత, కుటుంబం, వ్యక్తిగత ఆసక్తి ముఖ్యమని నిరూపించిన రుచి వారికూ కథ, కెరీర్ రేసులో పరుగెడుతున్న నేటి యువతకు గొప్ప పాఠం.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

US Sanctions on China Hengli Petrochemical Shake Global Oil Markets2
చైనా చమురు దిగ్గజంపై ట్రంప్‌ ఆంక్షలు

ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇరాన్ నుంచి అక్రమంగా చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాకు చెందిన ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం ‘హెంగ్లీ పెట్రోకెమికల్’పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనితో పాటు ఇరాన్ చమురు రవాణాలో పాలుపంచుకుంటున్న సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై కూడా వేటు వేసింది.ఆంక్షల వెనుక ప్రధాన ఉద్దేశంఇరాన్ సైన్యానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవడమే ఈ నిర్ణయం ఉద్దేశం. తాజా చర్యతో ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, కంపెనీలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామన్న తన హెచ్చరికను ట్రంప్ ప్రభుత్వం అమలు చేసి చూపింది. దాంతో చైనాలోని డాలియన్ నగరంలో ఉన్న హెంగ్లీ పెట్రోకెమికల్ సదుపాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. రోజుకు సుమారు 4,00,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ పెసిలిటీ ఉత్పాదకత తగ్గిపోయే ప్రమాదముంది. అయితే, 2023 నుంచి ఈ సంస్థ ఇరాన్ ముడి చమురును స్వీకరిస్తూ తమ సైన్యానికి వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని చేకూర్చినట్లు అమెరికా ట్రెజరీ విభాగం నిర్ధారించింది.ప్రపంచ ఇంధన మార్కెట్‌లో అలజడిఒకవైపు ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే మరోవైపు భౌగోళికంగా కూడా అమెరికా ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధిపై అమెరికా దిగ్బంధనాన్ని విధించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో ప్రపంచ ఇంధన వాణిజ్యం ప్రస్తుతం గందరగోళంలో ఉంది.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

War Clouds In West Asia Push Condom Prices Up3
కండోమ్ ధరల పెంపు! ఎంతంటే..

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కండోమ్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న మలేషియాకు చెందిన ‘కారెక్స్’ సంస్థ కీలక ప్రకటన చేసింది. ముడి పదార్థాల కొరత, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో తమ ఉత్పత్తుల ధరలను 30 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది.ధరల పెంపునకు కారణాలుప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 500 కోట్ల (5 బిలియన్ల) కండోమ్‌లను ఉత్పత్తి చేసే కారెక్స్, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ‘ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం వల్ల చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. కండోమ్ తయారీలో వాడే నైట్రైల్, సింథటిక్ రబ్బర్, సిలికాన్ ఆయిల్, ప్యాకేజింగ్ కోసం వాడే అల్యూమినియం షీట్‌ వంటి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయ సరుకు రవాణా రేట్లు పెరగడంతో పాటు సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది’ అని చెప్పింది.‘కొన్ని రకాల ముడి పదార్థాల ధరలు ఏకంగా 100 శాతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధరల సవరణ చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు’ అని కారెక్స్ సీఈఓ గోహ్ మియా కియాట్ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం..ప్రపంచ కండోమ్ అవసరాల్లో దాదాపు 20 శాతం వాటాను కారెక్స్ ఒక్కటే భర్తీ చేస్తోంది. ఆసియా, యూరప్ దేశాల నుంచి సేకరించే 100కు పైగా రసాయనాలపై ఈ పరిశ్రమ ఆధారపడి ఉంటుంది. ఒక్క కెమికల్ లేదా ఒక ప్యాకేజింగ్ మెటీరియల్ అందుబాటులో లేకపోయినా మొత్తం ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందని గోహ్ హెచ్చరించారు. మలేషియా, థాయ్‌లాండ్‌లోని కంపెనీ ప్లాంట్లలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఉత్పత్తి తగ్గితే ఉద్యోగ కోతలు తప్పవని యాజమాన్యం సంకేతాలిస్తోంది.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Inside Trisha Krishnan's Chennai Home Tradition Modern Design Simplicity4
చెన్నైలో త్రిష కలల సౌధం ధర ఎంతంటే..

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో రెండు దశాబ్దాలకుపైగా తనదైన ముద్ర వేసి సౌత్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు నటి త్రిష కృష్ణన్. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ నిత్యం వెలుగు జిలుగుల మధ్య గడిపే సెలబ్రిటీల ఇళ్లు అంటే సాధారణంగా ఆడంబరాలకు నిలయంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ, చెన్నైలోని త్రిష నివాసం ఇందుకు భిన్నం. ఆడంబరం కంటే అభిరుచికి, ప్రదర్శన కంటే ప్రశాంతతకు పెద్దపీట వేస్తూ ఆమె తీర్చిదిద్దుకున్న ఈ ఇల్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.చెన్నైలోని అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన తైనాంపేటలోని సెనోటాఫ్ రోడ్‌లో త్రిష నివాసం ఉంది. నగరంలోని వీవీఐపీలు, ఉన్నతాధికారులు నివసించే ఈ ప్రాంతం భద్రతకు, గోప్యతకు మారుపేరు. దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఈ ఇంటిని తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా మలుచుకున్నారు. త్రిష నివాసంలో ప్రతి మూలా ఆమె అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఇంటి లోపల వాడిన రంగులు, అలంకరణ సామాగ్రి కళ్లకు ఇంపుగా ఉంటాయి. దక్షిణ భారత సంప్రదాయ కట్టడాల శైలిని విస్మరించకుండానే ఆధునిక ఆర్కిటెక్చర్‌ను ఇందులో జోడించారు. పెద్ద కిటికీలు సహజ సిద్ధమైన వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చేస్తూ ఒక హైబ్రిడ్ లుక్ ఇస్తున్నాయి. భారీ అలంకరణల కంటే, కంఫర్ట్‌కే ప్రాధాన్యం ఇస్తూ గదులను డిజైన్ చేశారు.గతంలో ఈ ఇల్లు కొన్ని అవాంఛనీయ ఘటనల వల్ల కూడా వార్తల్లో నిలిచింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వల్ల పోలీసులు ఇక్కడ సోదాలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే, ఇలాంటి ఆటంకాలు ఎదురైనా తన వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా త్రిష జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Domestic consumption is sustaining the growth momentum in the economy5
దేశీ వినియోగమే వృద్ధికి దన్ను 

పుణె: దేశీ వినియోగం వృద్ధి వేగాన్ని నిలబెడుతోందని, ఇక మీదటా జీడీపీ మెరుగ్గా వృద్ధి చెందేందుకు స్పష్టమైన విధానపర మద్దతు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రపంచంలోనే భారత్‌ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఎస్‌బీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. దేశీ తయారీ, వ్యవసాయ రంగం బలమైన పనితీరు, పర్యాటకం, ఐటీ, అనుబంధ సేవల రంగాల నుంచి స్థిరమైన, విధానపరమైన మద్దతు లేకపోతే భారత్‌ వృద్ధి ప్రయాణం క్లిష్టంగా మారుతుందన్నారు. ఎగుమతులు సైతం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియలో ఘర్షణలతో దెబ్బతిన్న రంగాలకు ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ప్రభుత్వం తనవంతు మెరుగ్గా ఏం చేయగలదో చూస్తుందని చెప్పారు. యూఎస్‌ టారిఫ్‌ల ప్రభావిత సంస్థలకు ప్యాకేజీని ప్రకటించడాన్ని గుర్తు చేశారు. థర్డ్‌ పార్టీ (వేరే సంస్థకు చెందిన) ఉత్పత్తుల పంపిణీకి ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకునేలా బ్యాంక్‌లను అనుమతించాలా? లేదా? అన్న దానిపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) పరిధిలోని కమిటీ అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన∙తరుణంలో కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాలపై దృష్టి సారించాలని బ్యాంక్‌లకు సూచించారు. ఐడీబీఐలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐపై లోతైన అధ్యయనం.. ఆంథ్రోపిక్‌ సంస్థ తీసుకొచ్చిన ‘మైథోస్‌’ కృత్రిమ మేధ (ఏఐ) నమూనాపై ఆందోళనల నేపథ్యంలో.. గురువారం ఢిల్లీలో బ్యాంక్‌లతో సమావేశం నిర్వహించినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్‌ తెలిపారు. ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి నాయకత్వంలో (ఐబీఏ చైర్మన్‌ కూడా) పనిచేయాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లను కోరినట్టు చెప్పారు.

Tanla Platforms declares second interim dividend of Rs 6 per share for FY266
తాన్లా లాభం రూ. 134 కోట్లు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ లాభం రూ. 134 కోట్లుగా నమోదైంది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 117 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14.5 శాతం అధికం. అటు ఆదాయం రూ. 1,024 కోట్ల నుంచి సుమారు 15 శాతం వృద్ధితో రూ. 1,178 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 509 కోట్లగా, ఆదాయం రూ. 4,418 కోట్లుగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ. 6 చొప్పున కంపెనీ రెండో మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. దీనికి ఏప్రిల్‌ 30 రికార్డు తేదీగా ఉంటుంది. విశ్వసనీయమైన ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సవాళ్లను పరిష్కరిస్తూ, కస్టమర్ల వ్యాపార వృద్ధికి తోడ్పడుతున్నామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ ఉదయ్‌ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement