Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

govt clear no relaxation no extension on the SIM binding rules messaging apps1
సైబర్‌ భద్రతలో రాజీ లేదు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మెసేజింగ్ యాప్‌లకు సంబంధించి ప్రతిపాదించిన ‘సిమ్ బైండింగ్’ నిబంధనల్లో ఎటువంటి సడలింపు ఉండబోదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ముఖ్యంగా వెబ్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు విధించిన 6 గంటల ఆటోమేటిక్ లాగ్-అవుట్ నిబంధనను సడలించబోమని తేల్చి చెప్పారు.ఏమిటీ సిమ్ బైండింగ్? వినియోగదారులపై ప్రభావం?టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్-2024 ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్.. మెసేజింగ్ యాప్‌లు ఇకపై వినియోగదారుడి ఫోన్‌లోని యాక్టివ్ సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానమై ఉండాలి. ఒకవేళ ఫోన్ నుంచి ఒరిజినల్ సిమ్ కార్డును తొలగించినా లేదా అది డీయాక్టివేట్‌ అయినా ఆ పరికరంలో మెసేజింగ్ సేవలు తక్షణమే నిలిచిపోతాయి. ల్యాప్‌టాప్ లేదా పీసీల్లో వాడే వెబ్ వెర్షన్లు ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగ్-అవుట్ అవుతాయి. వినియోగదారులు క్యూఆర్ కోడ్ ద్వారా మళ్లీ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.ఈ నిబంధనలను పాటించడానికి ఇచ్చిన 90 రోజుల గడువు ఫిబ్రవరి 28, 2026తో ముగియనుంది. దీన్ని పొడిగించే ఆలోచన లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్‌) స్పష్టం చేసింది. ‘జాతీయ భద్రతే మాకు ముఖ్యం. మోసాలను నివారించడానికి సిమ్ బైండింగ్ తప్పనిసరి. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు’ అని సింధియా పేర్కొన్నారు.ఏజీఆర్, స్పెక్ట్రమ్ వేలంటెలికాం ఆపరేటర్లు కోరుతున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) ఉపశమనంపై మంత్రి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వొడాఫోన్ ఐడియా తరహాలో ఏజీఆర్‌ ఉపశమనం కోరే ఏ సంస్థ అయినా న్యాయపరమైన మార్గాలనే అనుసరించాలని సూచించారు. మరోవైపు, తదుపరి స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్ సిఫార్సులను సమర్పించిందన్నారు. వీటిని పరిశీలించి త్వరలోనే వేలం కాలక్రమాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.శాటిలైట్ ఇంటర్నెట్: స్టార్‌లింక్‌కు షరతులుభారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ ఇంకా అవసరమైన భద్రతా డెమోలను పూర్తి చేయలేదని మంత్రి తెలిపారు. భారత సరిహద్దుల వెలుపల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే సామర్థ్యం, నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయి భద్రతా నియంత్రణ వంటి అంశాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగుతాయని వివరించారు.ఇదీ చదవండి: విమాన ప్రయాణికులకు ఊరట

Major Relief in Real Estate PAN Requirement Likely Only for Deals Above Rs 20 Lakh2
పాన్‌ కార్డు లేకుండానే ప్రాపర్టీ డీల్స్‌!

దేశంలో ఆస్తి లావాదేవీలకు సంబంధించిన కీలక నిబంధనల్లో మార్పులు చేయాలని ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాన్ కార్డు నిబంధనలకు సడలింపు కల్పిస్తూ రూ.20 లక్షల లోపు ఉన్న ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం లేకపోవచ్చని ముసాయిదా ఆదాయపు పన్ను నియమాల్లో సూచించింది. ఈ ప్రతిపాదన కొత్త ఆదాయపు పన్ను పాలనలో భాగంగా తీసుకువచ్చిన మార్పులలో ఒకటి. ప్రస్తుతం ఇది ప్రజా సంప్రదింపుల దశలో ఉంది.ప్రస్తుతం ఎలా ఉందంటే.. ప్రస్తుత నియమాల ప్రకారం.. రూ.10 లక్షలకు మించిన విలువ కలిగిన స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయాల సమయంలో పాన్ నంబర్‌ను తప్పనిసరిగా కోట్ చేయాలి.కొత్త ప్రతిపాదన ఏమిటి?ముసాయిదా ప్రకారం.. రూ.20 లక్షల లోపు విలువైన ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం లేదు. రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ఈ మార్పు చిన్న స్థాయి ఆస్తి కొనుగోలుదారులకు, ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి ఉపశమనం కలిగించనుంది.గిఫ్ట్‌ డీడ్స్‌, జాయింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాలకూ వర్తింపుసవరించిన ముసాయిదా ప్రకారం, పాన్ నిబంధన కేవలం కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాదు. స్థిరాస్తి బహుమతిగా బదిలీ, ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలకూ వర్తిస్తుంది. ఇలాంటి లావాదేవీలకూ ఇదే రూ.20 లక్షల పరిమితి వర్తిస్తుంది. అంటే ఆస్తి విలువ రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అయితే మాత్రమే పాన్ తప్పనిసరి అవుతుంది.మార్పు వెనుక కారణంగత కొన్ని సంవత్సరాల్లో ఆస్తి ధరలు గణనీయంగా పెరిగాయి. అనేక నగరాల్లో సాధారణ ఇళ్ల ధర కూడా రూ.10 లక్షలను దాటిపోయింది. ఈ నేపథ్యంలో పాత పరిమితి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు సరిపోవడం లేదని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రతిపాదన వల్ల చిన్న కొనుగోలుదారులపై పేపర్‌వర్క్ భారం తగ్గుతుంది. అఫర్డబుల్‌ హౌసింగ్‌ మార్కెట్‌లో లావాదేవీలు సులభతరం అవుతాయి. ప్రస్తుత రియల్ ఎస్టేట్ విలువలకు అనుగుణంగా నిబంధనలు మారుతాయి. ప్రత్యేకంగా టైర్-2, టైర్-3 నగరాల్లో గృహ కొనుగోలుదారులకు ఇది ప్రయోజనకరంగా మారుతుంది.అమలు ఎప్పుడు?ప్రస్తుతం ఇవి ముసాయిదా దశలోనే ఉన్నాయి. ప్రజల నుంచి, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడనుంది. అమల్లోకి వస్తే, చిన్న స్థాయి ఆస్తి కొనుగోలుదారులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. అదే సమయంలో, భారీ లావాదేవీలపై పారదర్శకతను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

DGCA Mandates 48 Hour Free Ticket Cancellation3
విమాన ప్రయాణికులకు ఊరట

విమాన ప్రయాణికుల కోరికను నెరవేరుస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై విమాన టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా టికెట్‌ను రద్దు చేసుకోవడానికి లేదా మార్పులు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ‘లుక్-ఇన్ ఆప్షన్’ను తప్పనిసరి చేస్తూ కొత్త సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ (సీఏఆర్‌)ను జారీ చేసింది.ఎందుకీ నిర్ణయం?గత కొంతకాలంగా విమానయాన సంస్థల కఠినమైన విధానాలు, టికెట్ రద్దు చేసినప్పుడు రిఫండ్ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ప్రయాణికుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల హక్కులను కాపాడేందుకు డీజీసీఏ ఈ నిబంధనలను రూపొందించింది. నవంబర్ 2025లోనే ఈ ప్రతిపాదనలపై ప్రాథమిక నివేదికలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఇది అధికారికంగా అమలులోకి రానుంది.‘లుక్-ఇన్’ సదుపాయంఈ కొత్త నిబంధన ప్రకారం ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన 48 గంటల లోపు రద్దు చేసుకుంటే ఎటువంటి క్యాన్సిలేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.ప్రయాణ తేదీ లేదా సమయాన్ని మార్చుకోవాలనుకుంటే ఎయిర్‌లైన్స్ ఎటువంటి అదనపు సవరణ ఛార్జీలు వసూలు చేయవు.అయితే, కొత్తగా ఎంచుకున్న విమాన టికెట్ ధరలో వ్యత్యాసం ఉంటే మాత్రం ప్రయాణికుడే భరించాల్సి ఉంటుంది.డొమెస్టిక్ ఫ్లైట్స్ పరంగా ప్రయాణ తేదీకి కనీసం ఏడు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పరంగా ప్రయాణానికి కనీసం 15 రోజుల ముందు బుకింగ్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.ఈ సౌకర్యం ప్రస్తుతం నేరుగా ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకే అమలవుతుంది.రిఫండ్ ప్రక్రియపై గడువుకేవలం రద్దు సదుపాయమే కాకుండా ప్రయాణికులకు రావాల్సిన నగదును తిరిగి చెల్లించే విషయంలో కూడా డీజీసీఏ కఠినమైన కాలపరిమితిని నిర్ణయించింది. విమానయాన సంస్థలు ప్రయాణికుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, రిఫండ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఈ కొత్త సీఏఆర్‌ స్పష్టం చేస్తోంది. విమాన ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికల్లో అనివార్య కారణాల వల్ల మార్పులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది.ఇదీ చదవండి: షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌!

Gold and Silver rates on 27th February 2026 in Telugu states4
విచిత్రంగా బంగారం ధరలు.. తగ్గాయా.. పెరిగాయా?

దేశంలో పుత్తడి ధరలు (Today Gold Rate) ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రితం రోజున తగ్గినట్టే తగ్గి మళ్లీ ఎగిశాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు నిరాశే ఎదురైంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం విచిత్రంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే నేడు కూడా ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 27 February 20265
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు తగ్గి 25,403 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 269 పాయింట్లు నష్టపోయి 81,971 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.81బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 70.8 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.54 శాతం నష్టపోయింది.నాస్‌డాక్‌ 1.18 శాతం దిగజారింది.Today Nifty position 27-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

SEBI Chairman Tuhin Kanta Pandey comments on AI6
ఏఐ టెక్నాలజీ మార్కెట్లకు మంచిదే

టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో పర్యవేక్షణను పటిష్టపరచడం, రిస్క్‌ నిర్వహణ, పారదర్శకతతోపాటు.. ఇన్వెస్టర్‌ అవగాహనను సైతం పెంపొందించేందుకు వీలుంటుందని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొటక్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సందర్భంగా దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లనుద్ధేశించి పాండే ప్రసంగించారు.దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంటే మార్కెట్‌ నాణ్యత, పాలనా ప్రమాణాలు, సమాచార వెల్లడి, లిక్విడిటీ, సంస్థల బలిమి ద్వారా తదుపరి వృద్ధి ప్రతిఫలిస్తుందని వివరించారు. సప్లై చైన్‌లో మార్పులు, రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, వేగంగా మారుతున్న టెక్నాలజీ సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వాతావరణం సంక్షిష్టంగా మారుతున్నదని పాండే పేర్కొన్నారు. వెరసి వృద్ధి అనేది రిటర్నులపైకాకుండా నిలకడ, నమ్మకం(క్రెడిబిలిటీ), వాస్తవిక అంచనాలు తదితరాలకు సంబంధించిన అంశంగా మారుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌!

Advertisement
Advertisement
Advertisement