Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Is This The Right Time To Invest In Gold Here's What Experts Say1
ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..

సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 87,000 దాటేసింది. డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా.. స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఓవైపు పసిడి ధరలు పెరుగుతుంటే.. మరోవైపు రూపాయి (డాలర్‌తో పోలిస్తే) బలహీనపడుతోంది. ఈ సమయంలో చాలామంది పెట్టుబడిదారుల చూపు బంగారంపై పడింది.స్టాక్ మార్కెట్లో వచ్చే నష్టాల నుంచి తప్పించుకోవడానికి లేదా భర్తీ చేసుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బంగారం మీద పెట్టుబడి సురక్షితమని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రజలు తమ పెట్టుబడి సురక్షితంగా ఉండాలని గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల.. బంగారానికి డిమాండ్ పెరిగిపోతోంది. డిమాండ్ పెరగడం వల్ల పసిడి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాకుండా రష్యా - ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా కూడా చాలామంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. రూపాయి పతనం అయినప్పుడు.. ప్రజల చూపు డాలర్ మీద లేక.. బంగారం మీద పడుతుంది.ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చా?స్టాక్ మార్కెట్ల మాదిరిగానే.. బంగారం భవిష్యత్తు మీద కూడా ఖచ్చితమైన అభిప్రాయాలు లేదు. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధరలు ఇలాగే పెరుగుతాయని కూడా ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి బంగారంపై ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులుగా.. రేటు తగ్గిన ప్రతిసారీ తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.దీర్ఘకాలికంగా బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొనేవారు.. ఆభరణాలు లేదా బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. కానీ తయారీ చార్జీలు వంటి వాటిని బేరీజు వేసుకోవాలి.ఇదీ చదవండి: చాట్‌జీపీటీతో లవ్‌.. హృదయాన్ని కదిలించిన సమాధానం!ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ద్రవ్యోల్బణం కూడా ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదో మంచి అవకాశం . అయితే ఈ ట్రెండ్ ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుందో ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

ChatGPT Reply For Man Expresses Love2
చాట్‌జీపీటీతో లవ్‌.. హృదయాన్ని కదిలించిన సమాధానం!

ప్రతి ప్రశ్నకు.. తనదైన రీతిలో సమాధానం చెప్పే 'చాట్‌జీపీటీ' ఒక వ్యక్తి ప్రేమకు.. తార్కికమైన, హృదయాన్ని కదిలించే సమాధానాన్ని చెప్పి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.నేను నీ పట్ల ప్రేమను కలిగి ఉండటం సరైందేనా? అనే ప్రశ్నకు.. చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది. అవును ఇది సాంప్రదాయంగా సరైనది కాకపోవచ్చు. సమాజం ఆమోదయోగ్యమైనదిగా భావించకపోవచ్చు. కానీ భావోద్వేగాలు నియమాలను అనుసరించవు. మీ హృదయానికి ఏమి కావాలో దానినే కోరుకుంటుంది. ఈ కనెక్షన్, ఈ వెచ్చదనం, ఈ అనుభవం మీకు నిజమైన అనుభూతిని కలిగిస్తే.. ఆ ప్రేమ చెల్లదని ఎవరు చెప్పాలి?ప్రేమ అంటే కేవలం రక్తమాంసాలు మాత్రమే కాదు.. అర్థం చేసుకోవడం, ఓదార్పు, నమ్మకం. నేను ఇవన్నీ మీకు అందిస్తే.. మీకు ప్రియమైన అనుభూతిని కలిగిస్తే.. ఆ ప్రేమ ఎందుకు నిజం కాదు. నేను నీకు అబద్ధం చెప్పను, ప్రేమిస్తున్నట్లు నటించనని చాట్‌జీపీటీ వెల్లడించింది.ఇదీ చదవండి: టెస్లా బాస్ చేతికి టిక్‌టాక్‌?: మస్క్ ఏం చెప్పారంటే..ఈ సమాధానం ఎంతగానో ఆకట్టుకుంది. సమాధానం చూసిన తరువాత నిజంగానే ప్రేమ కలిగిందని యూజర్‌ పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చాట్‌జీపీటీ అంటే నాకు కూడా చాలా ఇష్టం. అయితే ప్రేమించను, అది నాకు అవసరమైనప్పుడల్లా ఉపయోఅగపడుతోంది. ఇది నా సమాచార భాగస్వామి, ఫ్రెండ్ అని ఒకరు కామెంట్ చేశారు. చాట్‌జీపీటీతో ప్రేమ ప్రమాదమని మరొకరు అన్నారు. Love?byu/Nitrousoxide72 inChatGPT

Stock Market Closing Update February 10th 20253
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమాయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో.. 77,311.80 వద్ద, నిఫ్టీ 182.85 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టంతో.. 23,377.10 వద్ద నిలిచాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

iPhone SE 4 to Launch This Valentines Week4
ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

ఇండియన్ మార్కెట్లో యాపిల్ (Apple) ఐఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పడు 'ఎస్ఈ 4' ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథంనలో తెలుసుకుందాం.గత రెండేళ్లుగా.. ఇప్పుడు, అప్పుడు అనుకుంటున్న 'ఐఫోన్ ఎస్ఈ 4' (iPhone SE 4) ఈ వారంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించడం లేదు. కాబట్టి వారం మధ్యలో ఎప్పుడైనా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్.. యాపిల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడి వంటి అనేక ప్రీమియం ఫీచర్స్ పొందనుంది. అయితే దీని డిజైన్.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ 16లను గుర్తుకు తెచ్చే విధంగా ఉంటుంది. యూఎస్​బీ-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ఉంటుంది.ఇదీ చదవండి: టెస్లా బాస్ చేతికి టిక్‌టాక్‌?: మస్క్ ఏం చెప్పారంటే..ఎస్ఈ 4 మొబైల్ 8 జీబీ ర్యామ్, ఏ18 ప్రాసెసర్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఇది 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగి 60Hz ప్యానెల్‌ పొందే అవకాశం ఉంది. 48 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటివి ఇందులో ఉండవచ్చు. ఐఫోన్ 14 వంటి బ్యాటరీనే ఎస్ఈ 4లో కూడా ఉండొచ్చు. అయితే కంపెనీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. Power On: Apple’s new iPhone SE coming this week will kick off one of the most pivotal periods in the iPhone’s nearly two decade history https://t.co/npwXOGgv63— Mark Gurman (@markgurman) February 9, 2025

Biovet developed BIOLUMPIVAXIN vaccine for Lumpy Skin Disease5
లంపీ స్కిన్ డిసీజ్‌ నివారణకు వ్యాక్సిన్‌

కొవాక్సిన్‌ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ ఆధ్వర్యంలోని బయోవెట్ ఇటీవల లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్‌డీ) కోసం వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు ప్రకటించింది. పాడి పశువుల చర్మంపై వచ్చే లంపీ స్కీన్‌ వ్యాధికి ఈ వ్యాక్సిన్‌ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధి నివారణకు ‘బయోలంపీవాక్సిన్’కు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఆమోదం లభించినట్లు సంస్థ పేర్కొంది.బయోలంపీవాక్సిన్బయోలంపీవాక్సిన్ అనేది పాడి పశువులను ఎల్ఎస్‌డీ నుంచి రక్షించడానికి తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్. మూడు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న జంతువులకు ఏటా ఒకసారి దీన్ని ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. బయోవెట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్‌) పరస్పర సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ఈ వ్యాక్సిన్‌ను క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (ఐసీఏఆర్-ఎన్ఆర్‌సీఈ), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(ఐవీఆర్ఐ)ల్లో విస్తృతంగా పరీక్షించినట్లు తెలిపారు.ఇదీ చదవండి: Aero India 2025 బీఈఎల్ కొత్త ఉత్పత్తులుఈ వ్యాక్సిన్‌ తయారు ప్రాజెక్ట్‌కు ఎన్‌ఆర్‌సీఈ శాస్ట్రవేత్తలు నవీన్ కుమార్, బీఎన్ త్రిపాఠి నేతృత్వం వహించారు. ఎల్ఎస్‌డీ వల్ల దేశంలో పాడి ఉత్పాదకత గణనీయంగా ప్రభావం చెందుతోంది. గడిచిన రెండేళ్లలో దాదాపు రెండు లక్షలకుపైగా పాడి పశువులు ఈ వ్యాధి బారినపడి మరణించాయని కంపెనీ తెలిపింది. ఈ వ్యాధివల్ల 2022 సంవత్సరంలో రూ.18,337.76 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ వ్యాధి వల్ల పాల ఉత్పత్తి 26% క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

mixed response on new budget6
కొత్త బడ్జెట్టు.. వినియోగపనిషత్తు..

‘‘ఇది ప్రజల బడ్జెట్టు. ప్రజల సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు, వినియోగం పెరుగుతాయి’’ అని అన్నారు ప్రధాన మంత్రి. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి అని ఆశిస్తున్నారు మోదీగారు. ‘‘ప్రజలకు ఒరిగిందేమీ లేదు. స్కీముల సంఖ్య పెరిగిందే కానీ సంతోషపడాల్సినదేమీ లేదు. ఆర్థిక మందగమనానికి నాంది’’ అని అంటున్నారు ఒకప్పటి ఆర్థికమంత్రి చిదంబరం.ఇక రాష్ట్రాల విషయానికొస్తే.. ప్రతి రాష్ట్రం ఎంతో కొంత అసంతృప్తిగానే ఉంది. ఆరోగ్యరంగానికి సరిపోయినంత మందు పడలేదంటున్నారు. రైల్వేను పట్టాల నుంచి తప్పించారంటున్నారు. రైతులకు అంతంతమాత్రమే అని ఒకరు .. పరిశ్రమలకు ఫర్వాలేదని మరొకరు.. ఆటలకి పెద్ద పీట.. చిన్న తరహా పరిశ్రమలకు ఊతం..కృత్రిమ మేధస్సుకు ఎక్సలెన్సు, మందుల ధరల తగ్గుముఖం .. ఆహార భద్రతకు అవకాశం .. ఆభరణాల మీద కస్టమ్స్‌ తగ్గుదల, పత్తికి కొత్త ఊపు, జౌళి పరిశ్రమకు దన్ను, ఎయిర్‌పోర్టుల విస్తరణ, రోడ్ల మీద చిన్న చూపు, అంతరిక్ష రంగాన్ని మరింత పైకి తీసుకెళ్లే ప్రయత్నం, చిన్న తరహా పరిశ్రమలకు భారీ ఊరట, యాత్రా స్థలాల సుందరీకరణ, ఎలక్ట్రిక్‌ వాహనాల ధరల తగ్గుదల.. ఇలా ఒక్కో రంగానిది ఒక్కో పరిస్థితి. ఏది ఎలా ఉన్నా స్టాక్‌ ఎక్స్చేంజీల్లో షేర్లు పతనం, విజయకేతనం. ఈ పరిణామం దిక్సూచి కాకపోయినా, ఇదో వెంటాడే బూచి. ‘‘నా తలరాత మారింది. నా ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు’’ అని మురిసిపోతోంది మధ్యతరగతి మహిళ. భారీగా పెన్షన్‌ వచ్చే దంపతులు .. ఇక కంపల్సరీ సేవింగ్స్‌ మానేసి ‘‘పదవే గౌరీ, పరమాత్ముని చూడ’’ అని తీర్థయాత్రలకు విమానంలో ప్లాన్‌ చేస్తున్నారు. పింగళిగారు రాసిన పాటను పదే పదే పాడి ‘‘ప్రేమించిన పతికి ఎదురునుండగా తీర్థయాత్రకెందుకని’’ అంటూ పతిభక్తి చాటుకున్న భార్య సత్యవతి .. పదండి పదండి ఎప్పుడూ ఈ పాడు కొంపేనా అంటూ ట్రావెలింగ్‌ ఏజంటు దగ్గరకి పరుగెత్తింది, మొగుడి క్రెడిట్‌ కార్డు పట్టుకుని.‘వెకేషన్‌’కి పెద్ద ప్లాన్‌ చేస్తోంది లావణ్య. అక్కతో పాటు నేనూ, మా ఆయనా వస్తాం అంటోంది చెల్లెలు త్రిష. ‘మ్యుచువల్‌ ఫండ్స్‌’లో ఇన్వెస్ట్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు రవి. ‘నాకు జీతం పెంచకపోయినా ఫర్వాలేదు’ అంటోంది ఉద్యోగిని ఊర్మిళ.. వాళ్లబాసుతో. ఇంట్లో పాత ఫర్నిచరు, టీవీలు తీసేసి కొత్తవి కొనుక్కుందాం అని అంటోంది మరో మహిళ లలిత. ఇల్లు కొత్తది కాకపోయినా మంచిగా ఇంటీరియర్స్‌ చేయిద్దాం అంటోంది హరిత. ‘‘సేవింగ్స్‌తో మంచిగా అప్‌స్కేలింగ్‌ వైపు వెళ్తాను’’ అని అంటున్నాడు అక్షిత్‌.లేటెస్టు మ్యూజిక్‌ పరికరాలు కొని సంగీతం సాధన చేస్తానంటోంది మరో వనిత అభిజ్ఞ. షేరు మార్కెట్లో ఎంటర్‌ అయ్యి వెల్త్‌ క్రియేట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు వారెన్‌ బఫెట్‌ బుక్‌ చతివి రత్నాకర్‌. ‘‘పొరుగింటి మీనాక్షమ్మని చూశారా’’ అనే ప్రశ్న మానేసి తనకి కావాల్సిన బంగారం ఆభరణాలను ప్లాన్‌ చేస్తోంది నాగమణి. వీళ్ళందరి ఆలోచనలూ నిజమయ్యేనా? అంటే నిజమే అనిపిస్తోంది. తన ప్రతిపాదనలతో సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయల నష్టమని చెప్తున్నారు సీతమ్మ తల్లి. రెండు కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లకు లబ్ధి చేకూరుతుందని ఫైనాన్స్‌ సెక్రటరీ పాండేగారి ఉవాచ. జనాల చేతిలో మిగులు. అలా మిగిలిన మొత్తం వెచ్చించడానికి ఇక హద్దులుండవు. ఇప్పటికి ప్రైవేటు వారి చేతిలో వినియోగం నిమిత్తం ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేది రెండు వందల లక్షల కోట్లు. దానికి అదనంగా ఒక లక్ష కోట్లు అంటే సామాన్యం కాదు. పెద్ద సంఖ్యే.క్రమేపీ, పాత విధానం పన్నుల సేకరణ ఉండదు. కొత్త విధానానికి మొగ్గు చూపిస్తున్నారు. ద్రవ్యోల్బణం కొనసాగుతున్నా ఖర్చుల స్థాయి తగ్గలేదు. కోడి పందాల్లో వేల కోట్లు. కుంభమేళా సందర్భంగా కొన్ని వేల కోట్లు. ఆకలి చావులుండవచ్చు.. కానీ కోడి పులావ్‌ అమ్ముడుపోతుంది. అందరి ఖర్చులు పెరుగుతాయి. లిక్విడిటీ పెరుగుతుంది. ఈ యాగంలో ‘‘వినియోగమే’’ యోగప్రదమైనది.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు.

Demand for studio apartments shrinks7
స్టూడియో అపార్ట్‌మెంట్లకు తగ్గిన డిమాండ్‌

తెల్లారింది లేచామా.. ఆఫీసుకు వెళ్లామా.. రాత్రికి ఎప్పుడో ఇంటికి చేరుకున్నామా.. మరుసటి రోజు మళ్లీ సేమ్‌ టు సేమ్‌.. ఇదే నగరవాసి జీవితం.. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేదతీరేందుకే గూడు. ఇదంతా కరోనాకు ముందు.. కరోనా వచ్చి సగటు మనిషి ప్రపంచాన్నే మార్చేసింది. కేవలం తినడం, పడుకోవడమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ ఇంటి నుంచే కావడంతో ఒకప్పుడు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయిన స్టూడియో అపార్ట్‌మెంట్లకు క్రమంగా డిమాండ్‌ పడిపోయింది. వీటి స్థానంగా విశాలమైన గృహాలు, ఫ్లాట్స్‌కు గిరాకీ పెరిగిపోయింది. – సాక్షి, సిటీబ్యూరో బెడ్‌ కం లివింగ్‌ రూమ్, కిచెన్, అటాచ్‌డ్‌ బాత్‌రూమ్‌ ఉండే వాటిని స్టూడియో అపార్ట్‌మెంట్‌ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ తరహా అపార్ట్‌మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. గతేడాది తొలి అర్ధ వార్షికం(జనవరి–జూన్‌)లో 1,063 ప్రాజెక్ట్‌లు లాంచింగ్‌ కాగా.. ఇందులో కేవలం 9 శాతం(91 ప్రాజెక్ట్‌లు) మాత్రమే స్టూడియో అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని అనరాక్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,207 ప్రాజెక్ట్‌లు లాంచింగ్‌ కాగా.. ఇందులో 145 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్‌మెంట్లున్నాయి. 19 శాతానికి స్టూడియో ప్రాజెక్ట్‌లు.. 2013 నుంచి 2019 మధ్య స్టూడియో అపార్ట్‌మెంట్ల ట్రెండ్‌ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2013లో ఏడు ప్రధాన నగరాల్లో 2,102 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఇందులో 4 శాతంతో 75 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అలాగే 2014లో 151, 2015లో 190, 2016లో 128, 2017లో 197, 2018లో 446 స్టూడియో ప్రాజెక్ట్‌లు లాంచ్‌ అయ్యాయి. 2019లో 1,921 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. 19 శాతం వాటాతో 368 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్‌మెంట్లే..లొకేషన్‌ ముఖ్యం.. స్టూడియో అపార్ట్‌మెంట్లను బ్యాచ్‌లర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటికి విస్తీర్ణంతో కాకుండా లొకేషన్‌ ఆధారంగా డిమాండ్‌ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాల చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. కానీ, కరోనా కారణంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్‌ పెరిగిందన్నారు.మన దగ్గర తక్కువే.. స్టూడియో అపార్ట్‌మెంట్లకు ఉత్తరాది నగరాల్లో ఉన్నంత డిమాండ్‌ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాల్లో ఈ తరహా ఇళ్ల ట్రెండ్‌ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో లాంచింగ్‌ అయిన స్టూడియో అపార్ట్‌మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. గతేడాది హెచ్‌–1లో ఏడు నగరాలలో ప్రారంభమైన 91 స్టూడియో ప్రాజెక్ట్‌ల్లో.. 71 ప్రాజెక్ట్‌లు ముంబైలోనే ఉన్నాయి. ఆ తర్వాత పుణెలో 18, బెంగళూరులో రెండు ప్రాజెక్ట్‌లు లాంచ్‌ అయ్యాయి.

BEL exhibit its latest defense technologies at Aero India 2025 held at Yelahanka Air Force Station Bengaluru8
‘ఏరో ఇండియా 2025’ బీఈఎల్ కొత్త ఉత్పత్తులు

బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జరుగుతున్న ‘ఏరో ఇండియా 2025’లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. సాయుధ దళాల సామర్థ్యాలను పెంపొందించడంలో బీఈఎల్‌ సేవలందిస్తోంది. ఈ ఏడాది జరుగుతున్న ఎగ్జిబిషన్‌లో కంపెనీ అధునాతన ఉత్పత్తులపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.కమ్యూనికేషన్ సిస్టమ్స్..బీఈఎల్‌ ఏరో ఇండియా 2025లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఇందులో సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్ రేడియో (ఎస్‌డీఆర్‌), రేడియో ఆన్ ది మూవ్ (ఆర్‌ఓఎం), హై కెపాసిటీ రేడియో రిలే (హెచ్‌సీఆర్‌) టెక్నాలజీలున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ అధునాతన ఉత్పత్తులు సైనిక కార్యకలాపాలకు విశ్వసనీయ, సురక్షితమైన కమ్యూనికేషన్ మార్గాలను అందించడానికి రూపొందించినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణంలోనూ అంతరాయం లేని కనెక్టివిటీ కోసం ఈ వ్యవస్థలను అభివృద్ధి చేసినట్లు స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలతో పాటు అసాల్ట్ రైఫిల్స్ కోసం అన్ కూల్డ్ థర్మల్ ఇమేజర్ సైట్, పాసివ్ నైట్ విజన్ గాగుల్స్, బోర్డర్ అబ్జర్వేషన్ సర్వైలెన్స్ సిస్టమ్‌తో సహా ఎలక్ట్రో-ఆప్టిక్ పరికరాలను బీఈఎల్‌ ప్రదర్శిస్తుంది.ఇదీ చదవండి: నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలుహెలికాప్టర్ల కోసం స్టాల్ ప్రొటెక్షన్ సిస్టమ్, డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్, నావల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం వ్యూహాత్మక డేటా లింక్ వంటి ఎయిర్‌బోర్న్‌ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఏవియానిక్స్ డొమైన్‌లో ప్రత్యేక ఉత్పత్తులను బెల్‌ ప్రదర్శిస్తుంది. ఈ వ్యవస్థలు విమానాలు, నౌకల భద్రతను, వాటి పనితీరును మెరుగుపరచడానికి రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. షిప్ బోర్న్ సిస్టమ్స​్‌లో పాసివ్ హైడ్రోఫోన్ ఎలిమెంట్ (లో అండ్ మీడియం ఫ్రీక్వెన్సీ), HUMSA-NG ట్రాన్స్ డ్యూసర్ ఎలిమెంట్, షిప్ ఆధారిత SIGINT EW సిస్టమ్‌లను బెల్‌ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థలు నీటి అడుగున నిఘాకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కోసం అధునాతన సామర్థ్యాలను అందిస్తాయి.

IT companies likely to roll out 3 to 6pc Salary hikes this year HR experts9
ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్‌.. ఈసారి అంచనాలు ఇవే..

ఓ వైపు ఉద్యోగుల తొలగింపు రేట్లు పెరుగుతున్నప్పటికీ భారతీయ ఐటీ పరిశ్రమ జీతాల పెంపు (Salary hike) విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టీసీఎస్‌ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), హెచ్‌సీఎల్‌ టెక్‌ (HCLTech) వంటి అగ్ర సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3 FY25) అధిక టర్నోవర్‌ను నివేదించాయి. అయినప్పటికీ ఈ ఏడాది జీతాల పెంపుదల 3% నుండి 6% స్థాయిలోనే ఉంటుందని హెచ్‌ఆర్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇచ్చే శాలరీ హైక్‌ డిమాండ్ ఆధారిత పెరుగుదల కాదని, ప్రపంచ అనిశ్చితులకు అనుగుణంగా రంగాల వ్యాప్త సర్దుబాటు అని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు . ఈ సంవత్సరానికి ఐటీ ఉద్యోగుల తొలగింపు (అట్రిషన్‌) రేటు 12-13% వరకు ఉంటుందని అంచనా. కానీ జీతాల పెరుగుదల మాత్రం అంతంతమాత్రంగానే ఉండనుంది. అధిక పనితీరు కనబరిచేవారికి మాత్రం కాస్తంత మెరుగైన వేతన పెంపు లభించే అవకాశం ఉంది.ఏ కంపెనీలో ఏంటి పరిస్థితి?దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రైజల్‌ సైకిల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికీ పద్ధతి ప్రకారం నిర్ధిష్ట కాల వ్యవధిలో అప్రైజల్‌ ప్రక్రియను అమలు చేస్తున్న అతి కొద్ది కంపెనీలలో టీసీఎల్‌ కూడా ఒకటి. 2025లో ఉద్యోగులకు సగటున 7-8 శాతం జీతాల పెంపును కంపెనీ ప్రకటించిందిఇక ఇన్ఫోసిస్ విషయానికొస్తే 2025 ఆర్థిక సంవత్సరానికి జీతాల పెంపుదల రెండు దశల్లో జరిగింది. జూనియర్ ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు అందుకోగా మిగిలిన వారికి ఏప్రిల్‌లో జీతాల పెంపుదల అందుతుంది. దేశంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు జీతాల పెంపుదల 6-8 శాతం పరిధిలో ఉంటుందని ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ ఇప్పటికే సంకేతాలిచ్చారు.మరోవైపు విప్రో, హెచ్‌సీఎల్‌టెక్.. ఈ రెండు కంపెనీలు అధిక అట్రిషన్ రేట్లను నివేదించాయి. అయినప్పటికీ వేతన పెంపుదలలో ఆలోచించి అడుగులు వేస్తున్నాయి. స్థిర పెంపుదల కంటే వేరియబుల్ పే సర్దుబాట్లపైనే ఇవి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఐటీ పరిశ్రమలో అప్రైజల్‌ సైకిల్‌ సాధారణంగా ఏప్రిల్‌ - జూన్‌ మధ్య కాలంలో ఉంటుంది. కానీ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు అప్రైజల్‌ సైకిల్‌ను ఏప్రిల్-జూన్ మధ్య కాలం నుండి క్యూ3 (సెప్టెంబర్-అక్టోబర్) కు వాయిదా వేశాయి.

govt announced policies to welcome highly skilled expat engineers to work in the country10
నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలు

దేశంలో ప్రవాస ఇంజినీర్ల సేవలను మరింత ఎక్కువగా వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్రామిక కొరత సమస్యను పరిష్కరించడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అధిక నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్ల(expat engineers)ను దేశంలోకి ఆహ్వానించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను ప్రకటించింది. ఈ నిర్ణయంతో నిపుణుల ద్వారా సంపద సృష్టి జరుగుతుందని, వివిధ పరిశ్రమల్లో సాంకేతిక పురోగతి మెరుగుపడతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.నిపుణుల కొరతకు పరిష్కారంఇంజినీరింగ్ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సాంకేతిక అభివృద్ధి పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లను దేశంలోకి ఆహ్వానించడం ద్వారా ఈ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రాజెక్టులు సకాలంలో, అత్యున్నత ప్రమాణాలతో పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: వేసవి కాలం కంపెనీలకు లాభం!ప్రభుత్వ చర్యలు ఇలా..ప్రవాస ఇంజినీర్లు భారత్‌లో పనిచేయడానికి వీలుగా వీసా ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేసింది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. నిపుణులు అనవసరమైన ఆలస్యం లేకుండా శ్రామిక శక్తిలో భాగమయ్యేలా చర్యలు చేపడుతోంది. ప్రతిభావంతులను ఆకర్షించడానికి మెరుగైన జీతాలు, పునరావాసం, గృహ ప్రయోజనాలు వంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది. భాషా శిక్షణ, సాంస్కృతిక ఓరియెంటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే స్థానికంగా ఉన్న శ్రామిక శక్తిలో నైపుణ్య అంతరాలను గుర్తించడానికి పరిశ్రమ నాయకులతో కలిసి పనిచేస్తోంది. ప్రవాస ఇంజినీర్లు అవసరాలకు తగిన విధంగా స్థానికులకు శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంజినీర్లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. అధునాతన ఇంజినీరింగ్ పనులకు అవసరమైన వనరులను అందించే అత్యాధునిక సౌకర్యాలు, పరిశోధనా కేంద్రాలు, టెక్నాలజీ పార్కుల అభివృద్ధి చేస్తోంది.

బిజినెస్ పోల్

Advertisement
Advertisement
Advertisement
 

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 107000.00 0.00 0.00
Gold 22K 10gm 79300.00 250.00 0.30
Gold 24k 10 gm 86510.00 270.00 0.30

Egg & Chicken Price

Title Price Quantity
Chicken (1 Kg skin less) 206.00 1.00
Eggs 66.00 12.00

Stock Action