ప్రధాన వార్తలు
చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!
ప్రపంచవ్యాప్తంగా భారత్తోపాటు వివిధ దేశాల్లో ఉద్యోగులు పనిచేసే చేసే పని గంటలకు, అందుకు వారికి లభించే వేతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయులు వారానికి ఎక్కువ గంటలు శ్రమిస్తున్నప్పటికీ వారి సంపాదన మాత్రం ఆయా దేశాల ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉంటోంది. 2024-25 నాటి గణంకాలు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదికల ఆధారంగా వివిధ దేశాల పనిగంటలు, వేతనాల విశ్లేషణ కింద చూద్దాం.వివిధ దేశాల పనిగంటలు.. వేతనాల పరిశీలనదేశంసగటు వారపు పనిగంటలుసగటు నెలవారీ వేతనంగంటకు ఆదాయంఅమెరికా34 - 36 గంటలురూ.5,60,000రూ.4,100జర్మనీ34 - 35 గంటలురూ.4,50,000రూ.3,100జపాన్38 - 40 గంటలురూ.3,10,000రూ.1,900చైనా46 - 48 గంటలురూ.1,40,000రూ.750భారతదేశం46 - 48 గంటలురూ.32,000రూ.170 గమనిక: ఈ వేతనాలు ఆయా దేశాల కరెన్సీ విలువను ప్రస్తుత మారకపు రేటు ప్రకారం రూపాయిల్లోకి మార్చగా వచ్చిన సగటు విలువలు. రూపాయి విలువను అనుసరించి వీటిలో మార్పులుంటాయని గమనించాలి.అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితిఅమెరికా, జర్మనీ దేశాల్లో వారానికి కేవలం 35 గంటల లోపు పనిచేస్తూనే భారీ వేతనాలను అందుకుంటున్నారు. ఇక్కడ స్మార్ట్ వర్క్, హై-టెక్నాలజీ వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత లభిస్తుంది.ఒకప్పుడు అధిక పనిగంటలకు పేరుగాంచిన జపాన్, ప్రస్తుతం వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వైపు మొగ్గు చూపుతోంది. 40 గంటల పని పరిమితిని కచ్చితంగా అమలు చేస్తోంది.చైనాలో కూడా పనిగంటలు భారత్తో సమానంగా ఉన్నప్పటికీ అక్కడి ఉత్పాదకత, తయారీ రంగం బలంగా ఉండటం వల్ల వేతనాలు భారత్ కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.భారత్లో ఎందుకీ పరిస్థితి?భారతదేశంలో కార్మికులు లేదా ఉద్యోగులు అత్యధిక సమయం పనిచేస్తున్నా తక్కువ ఆదాయాన్ని పొందడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 90% పైగా శ్రామిక శక్తి అసంఘటిత రంగంలోనే ఉంది. ఇక్కడ కచ్చితమైన వేతన చట్టాలు లేదా పనిగంటల నియంత్రణ తక్కువగా ఉంటుంది.అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక గంటలో తయారయ్యే వస్తువు/సర్వీసు విలువ, భారత్లో తయారయ్యే దానికంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అధునాతన సాంకేతికత, మెరుగైన మౌలిక సదుపాయాలు లేకపోవడం.శ్రమ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు తక్కువ వేతనాలకే ఉద్యోగులను నియమించుకోగలుగుతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటం వల్ల బేరమాడే శక్తి ఉద్యోగులకు తక్కువగా ఉంటోంది.భారత్లో జీవన వ్యయం (Rent, Food, Medical) అమెరికా, జర్మనీలతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి రూపాయి విలువ పరంగా తక్కువగా కనిపించినా స్థానిక అవసరాలకు అది సరిపోతుందని కంపెనీల వాదన. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చినప్పుడు ఇది భారీ వ్యత్యాసంగానే కనిపిస్తుంది.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్నప్పటికీ సామాన్య ఉద్యోగికి దక్కే ఫలితం ఇంకా ఆశాజనకంగా లేదు. పనిగంటలను తగ్గించి, వేతనాలను పెంచాలంటే ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆటోమేషన్, సంఘటిత రంగం విస్తరణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!
పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్’(పీయూసీ) లేని ఏ వాహనానికీ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించకూడదని రాష్ట్ర రవాణా యంత్రాంగం (ఎస్టీఏ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.చమురు సంస్థలకు కీలక ఆదేశాలుఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, షెల్ వంటి ప్రైవేట్ చమురు సంస్థలకు కూడా రవాణా శాఖ లేఖలు రాసింది. ప్రతి ఫ్యుయల్ స్టేషన్ వద్ద వాహనదారుడి పీయూసీ సర్టిఫికేట్ను సిబ్బంది భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో తనిఖీ చేసిన తర్వాతే ఇంధనం పోయాల్సి ఉంటుంది.అవగాహన కార్యక్రమాలుఈ కొత్త నిబంధనపై వాహనదారులకు, పెట్రోల్ బంక్ సిబ్బందికి తగినంత అవగాహన కల్పించాలని చమురు సంస్థలను కోరింది. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తే సంబంధిత డీలర్లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్టీఏ హెచ్చరించింది.చట్టపరమైన నిబంధనలు ఇవే..మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 190(2), సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 115 ప్రకారం.. ప్రతి వాహనం నిర్దేశిత ఉద్గార ప్రమాణాలకు లోబడి ఉండాలి. పీయూసీ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ బాటలోనే ఒడిశాదేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరడంతో అక్కడ ఇప్పటికే ‘నో పీయూసీ - నో ఫ్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ-4) అమల్లో ఉంది. అదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్పై నిఘా
కెనరా బ్యాంక్ కొత్త యాప్.. ఏఐ ఫీచర్లతో..
డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా చేసేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ కొత్తగా ’కెనరా ఏఐ1పే’ పేమెంట్స్ యాప్ని ప్రవేశపెట్టింది. యూపీఐ ప్లాట్ఫాం ద్వారా వేగవంతంగా, సురక్షితంగా పేమెంట్స్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది.నెలవారీగా ఖర్చులను విశ్లేషించుకునేందుకు స్పెండ్ అనలిటిక్స్, సులువుగా క్యూఆర్ స్కాన్ చేసేందుకు విడ్జెట్ సదుపాయం, తక్షణ నగదు బదిలీలు.. బిల్లుల చెల్లింపులు మొదలైన వాటికి యూపీఐ ఆటోపేలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. అలాగే, పిన్ నంబరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న మొత్తాలను చెల్లించేందుకు వీలుగా యూపీఐ లైట్ ఫీచరు సైతం ఇందులో ఉన్నట్లు వివరించింది.ఇదే యాప్లో మల్టీ లెవల్ భద్రతా వ్యవస్థను కూడా పొందుపరిచినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు (Fraud Detection) ద్వారా అనుమానాస్పద లావాదేవీలను తక్షణమే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేసే విధంగా ఈ యాప్ను రూపొందించారు. బయోమెట్రిక్ లాగిన్, డివైస్ బైండింగ్, రియల్టైమ్ అలర్ట్స్ వంటి సదుపాయాలతో వినియోగదారుల ఖాతా భద్రత మరింత బలోపేతం అవుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు.అలాగే, ఈ యాప్ ద్వారా వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా సులభంగా చెల్లింపులు స్వీకరించవచ్చని పేర్కొన్నారు. చిన్న దుకాణాలు, స్వయం ఉపాధి వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కెనరా బ్యాంక్ స్పష్టం చేసింది.
పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్పై నిఘా
కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ఆదాయపు పన్ను బిల్లు, 2025 ద్వారా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖకు పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఇతర డిజిటల్ ఖాతాలను యాక్సెస్ చేసే అధికారం లభించనుంది. పన్ను ఎగవేతను అరికట్టడానికి, ఆర్థిక పారదర్శకతను పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ విస్తరణప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలు కేవలం బ్యాంకు ఖాతాలకు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఆన్లైన్ వేదికల ద్వారా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ అనే నిర్వచనాన్ని విస్తరించింది. దీని పరిధిలోకి..సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు (Facebook, Instagram, X మొదలైనవి)వ్యక్తిగత కమ్యూనికేషన్.. ఈమెయిల్ రికార్డులు.ఆన్లైన్ ఖాతాలు.. క్లౌడ్ స్టోరేజ్, ట్రేడింగ్ ఖాతాలు, ఇన్వెస్ట్మెంట్ పోర్టల్స్ వస్తాయి.పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన ఆదాయానికి, వారి వాస్తవ జీవనశైలికి మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయని గమనించాలి. కొందరు పన్ను చెల్లింపుదారులు తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ విదేశీ పర్యటనలు చేయడం లేదా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి ప్రతిపాదిత మార్పుల ద్వారా నిఘా పరిధిలోకి వస్తాయి.ఈ డిజిటల్ పర్యవేక్షణ ద్వారా పన్ను చెల్లింపుదారులలో బాధ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో భారీ డేటాను విశ్లేషించి పన్ను ఎగవేతను ముందస్తుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.గోప్యతా ఆందోళనలు.. చట్టపరమైన సవాళ్లుఈ సంస్కరణ అమలుపై న్యాయ నిపుణులు, పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా గోప్యత ప్రాథమిక హక్కు అనే అంశంపై చర్చ జరుగుతోంది. కోర్టు అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం అధికారులకు ఇవ్వడం దుర్వినియోగానికి దారితీయవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. క్లౌడ్ స్టోరేజ్ నుంచి వ్యక్తిగత సందేశాల వరకు యాక్సెస్ ఉండటం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఫాక్స్కాన్ ప్లాంట్లో 30,000 మంది నియామకం
బీమా ప్రీమియం పెరిగింది.. మరి కవరేజీ సరిపోతుందా?
విద్యలేని వాడు వింత పశువు అని ఒకప్పుడు అనేవారు.. ఈ ఆధునిక కాలంలో మాత్రం ఈ సామెతను బీమా లేని వారికి వాడుకోవాలి. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కబళించిన 2020 నుంచి భారత్లో బీమా ప్రీమియం గణనీయంగా పెరిగింది. కచ్చితంగా చెప్పాలంటే ప్రీమియం 73 శాతం వరకూ పెరగ్గా బీమా చేసిన మొత్తం కూడా 240 శాతం వరకూ ఎక్కువైంది. కానీ... ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే... ఉన్న బీమా కవరేజీ అస్సలు సరిపోవడం లేదు. ఇతర అవసరాల కోసం దాచుకున్న సొమ్ము ఖర్చుపెట్టాలి లేదంటే అప్పు చేయాలి. అందుకే... మీ బీమా పాలసీ ఏటికేడాదీ పెరిగిపోతున్న వైద్యం ఖర్చులను తట్టుకునేలా ఉందా? లేదా? సరిచూసుకోండి.దేశంలో చాలామంది బీమా పాలసీ తీసుకున్న వారు తమకు రూ.10 - 15 లక్షల కవరేజీ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారు. కొంచెం ఆదాయం తక్కువగా ఉన్న వారు రూ.పది లక్షల మొత్తానికి సర్దుకుంటూంటే.. మధ్యతరగతి వారు ఇంకో ఐదు లక్షల వరకూ ఎక్కువ మొత్తంతో పాలసీలు తీసుకుంటున్నారు. అయితే ఈ పెంపు సరిపోతుందా? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే వైద్యం ఖర్చులు ఏటా పన్నెండు నుంచి 14 శాతం వరకూ పెరుగుతున్నాయి. శస్త్రచికిత్సలకు మాత్రమే కాకుండా.. ఆసుపత్రుల్లో గదుల అద్దెలు, మందులు, ఇతర కన్స్యూమబల్స్ రేట్లు పెరిగిపోవడం ఇందుకు కారణం. గత ఐదేళ్లలో పెరిగిన ప్రీమియం మొత్తం కూడా ఈ వ్యత్యాసాన్ని తట్టుకోలేకపోతోంది. ఎక్కువ మొత్తానికి పాలసీ తీసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదని చాలామంది పాలసీదారులు అనుకుంటున్నారని, అంతకంటే వేగంగా ఆసుపత్రి బిల్లులు పెరుగుతున్నాయని గుర్తించడం లేదని నిపుణులు చెబుతున్నారు.టాప్ అప్లతో ఉపశమనం...పెరిగిపోతున్న వైద్యం ఖర్చులకు అనుగుణంగా మీ పాలసీను మలచుకోవడం ఒక మార్గం. బేస్ ప్లాన్కు అనువైన టాప్అప్ పాలసీలు జోడించుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీ వస్తుంది. కొన్ని కంపెనీలు ద్రవ్యోల్బణానికి తగ్గట్టు ఏటా బీమా మొత్తాన్ని పెంచే పాలసీలు అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లంబార్డ్లలో పాలసీ మొత్తం ఏటా పదిశాతం పెరిగేలా ఇన్ఫ్లేషన్ షీల్డ్ కవరేజీ అందిస్తున్నాయి. కుటుంబంలో ఒకొక్కరి ఒక్కో పాలసీ కాకుండా.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు ఎంచుకోండి. దీనివల్ల అందుబాటులో ఉండే మొత్తం ఎక్కువగా ఉంటుంది. పాలసీని ఎంచుకునేటప్పుడు ఏ ఏ అంశాలపై కవరేజీ లేదన్నది స్పష్టంగా అర్థం చేసుకోండి. కొన్ని పాలసీల్లో ఆసుపత్రిలో గది అద్దెలపై పరిమితి ఉంటుంది. లేదా పూర్తి మినహాయింపు ఉండవచ్చు. అలాగే ఏ ఏ ప్రొసీజర్లకు కవరేజీ వర్తిస్తుందో కూడా గమనించండి. వీటితోపాటు వీలైనంత వరకూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొంత అదనపు మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేసుకోవడమూ అవసరమే.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.
ఐఫోన్ తయారీ ప్లాంట్లో 30,000 మంది నియామకం
భారతదేశ తయారీ రంగంలో నియామకాల పర్వం కొనసాగుతోంది. తైవాన్కు చెందిన దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన తన కొత్త ఐఫోన్ అసెంబ్లీ యూనిట్లో రికార్డు స్థాయిలో నియామకాలు చేపట్టింది. కేవలం 8 నుండి 9 నెలల వ్యవధిలోనే దాదాపు 30,000 మంది కార్మికులను నియమించుకోవడం ద్వారా తన కార్యకలాపాలను వేగవంతం చేసింది.మహిళలకు పెద్దపీట300 ఎకరాల ఈ భారీ సదుపాయంలో మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 80 శాతం మంది మహిళలే. వీరిలో మెజారిటీ ఉద్యోగులు 19-24 సంవత్సరాల వయస్సు కలిగిన వారు, మొదటిసారి ఉద్యోగంలో చేరుతున్న వారే కావడం గమనార్హం. వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటే మొత్తం ఉద్యోగుల సంఖ్య 50,000కు పెరుగుతుందని అంచనా. తద్వారా దేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలో లేని విధంగా ఒకే ప్రాంగణంలో అత్యధిక మంది మహిళా కార్మికులు పనిచేస్తున్న ప్లాంట్గా ఇది రికార్డు సృష్టించనుంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తయారీ ఇక్కడే..ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఐఫోన్ 16 మోడల్తో ట్రయల్ రన్ ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం యాపిల్ అత్యాధునిక మోడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను తయారు చేస్తోంది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తుల్లో 80 శాతానికి పైగా విదేశాలకు ఎగుమతి కానున్నాయి.ప్లాంట్ విశేషాలుసుమారు రూ.20,000 కోట్లు పెట్టుబడి.2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం.సగటున వేతనం నెలకు రూ.18,000 (ఉచిత వసతి, సబ్సిడీ భోజనం).ఉద్యోగుల కోసం ఇప్పటికే 6 భారీ వసతి గృహాలు అందుబాటులోకి వచ్చాయి.‘మినీ టౌన్షిప్’గా దేవనహళ్లికేవలం ఫ్యాక్టరీగానే కాకుండా ఈ ప్లాంట్ భవిష్యత్తులో ఒక మినీ టౌన్షిప్లా మారనుందని కంపెనీ చెప్పింది. ఇందులో నివాస సముదాయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, వినోద సౌకర్యాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మహిళా కార్మికులకు ఇది ఎంతో ఆసరాగా నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చలి చంపుతున్నా వ్యాపారం భళా
కార్పొరేట్
ఐఫోన్ తయారీ ప్లాంట్లో 30,000 మంది నియామకం
జస్ట్ 99.. కానీ కాస్ట్లీ
కొత్త టెక్నాలజీల పరిశీలనకు వర్కింగ్ గ్రూప్
వీధి దీపాల కింద చదువుకుని ప్రపంచ గుర్తింపు: కొనియాడిన అంబానీ
స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో నీతా అంబానీ
ఫుడ్ డెలివరీ యాప్లు వద్దు బాబోయ్..
కొటక్ బ్యాంక్పై కొరడా.. ఆర్బీఐ భారీ జరిమానా
50 లక్షల మందికి ఐబీఎం శిక్షణ
కొలువులు ఉంటేనే.. విదేశాల్లో చదువు..
ఫోర్బ్స్ జాబితాలో 26 ఏళ్ల కళ్యాణి రామదుర్గం
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ మారిపోతున్నాయి. తీవ్...
బంగారం ధరలు.. ఏడాది తిరిగేలోపు చుక్కలు!
ఈ ఏడాది ఇక ముగింపునకు వచ్చేసింది. 2025 సంవత్సరం బం...
2026లో బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
2025 ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది. బంగార ధరలు మాత...
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
దేశంలో వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. మరో కొత్త...
చిన్న సంస్థలకు ఏఐ దన్ను
కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సూక్ష్మ, చిన్న, మధ్య స...
కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ
ఒకవైపు ఆకాశాన్ని తాకే ఆడంబరపు అద్దాల భవనాలు.. మరోవ...
నిధుల నిర్వహణలో పారదర్శకత
కేంద్ర ప్రభుత్వం ద్రవ్య నిర్వహణలో పారదర్శకతకు సంబం...
రూపాయి నిదానంగా కోలుకుంటుంది
ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో (2025–26) జీడీపీ 7.5 శా...
ఆటోమొబైల్
టెక్నాలజీ
భారత్లో చాట్జీపీటీ, పర్ప్లెక్సిటీ జోరు
చాట్జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీలాంటి ప్లాట్ఫాంల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ఎల్ఎం (లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్) మార్కెట్గా భారత్ ఎదిగిందని బ్రోకరేజీ సంస్థ బీవోఎఫ్ఏ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. దీనితో స్వతంత్రంగా పనులను చక్కబెట్టగల ఏజెంటిక్ ఏఐ యాప్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత్ టెస్ట్ బెడ్గా ఉపయోగపడగలదని పేర్కొంది. అయితే, దీనివల్ల దేశీయంగా స్టార్టప్ వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని బీవోఎఫ్ఏ సెక్యూరిటీస్ వివరించింది.టెలికం సంస్థలు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తుండటమనేది ఎల్ఎల్ఎం ఆధారిత యాప్ల వినియోగం పెరగడానికి ఒకానొక కారణంగా ఉంటోంది. అలాగే, నెలకు 2 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో 20 జీబీ డేటా ప్లాన్లు చౌకగా లభిస్తుండటం సైతం ఇందుకు దోహదపడుతోంది. నివేదిక ప్రకారం..14.5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లతో భారత్లో చాట్జీపీటీ అగ్రగామి ఎల్ఎల్ఎంగా నిలుస్తోంది. 10.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే సగటున 6.5 కోట్ల మంది భారతీయులు చాట్జీపీటీని ఉపయోగిస్తుండగా, 1.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో ప్లేస్లో ఉంటోంది. చాట్జీపీటీ యూజర్లలో 16 శాతం మంది భారతీయులు ఉన్నారు. తద్వారా సదరు ప్లాట్ఫాంనకు అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. దాని పోటీ సంస్థలకు కూడా భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉండటం గమనార్హం. సగటున నెలవారీ గూగుల్ జెమినీ యూజర్లలో 30 శాతం మంది, పర్ప్లెక్సిటీ యూజర్లలో 38 శాతం మంది భారత్ నుంచే ఉంటున్నారు. జూలైలో చాట్జీపీటీ డౌన్లోడ్స్ 2.4 కోట్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఎయిర్టెల్ బండిల్డ్ ప్యాకేజ్ దన్నుతో అక్టోబర్లో పర్ప్లెక్సిటీ డౌన్లోడ్స్ 2 కోట్ల గరిష్ట స్థాయిని తాకాయి.ఎల్ఎల్ఎం యాప్ల వినియోగం అందరికీ ప్రయోజనకరంగా ఉంటోంది. ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు, భాషపరమైన పరిమితులను అధిగమించి కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటోంది. అటు తమ మోడల్స్ను మరింత మెరుగుపర్చుకునేందుకు కావల్సిన డేటా ఎల్ఎల్ఎంలకు లభిస్తోంది. ఇక టెల్కోల విషయం తీసుకుంటే తీవ్రమైన పోటీ ఉండే రంగంలో.. వీటిని ఆఫర్ చేయడం ద్వారా యూజర్లపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలవుతోంది. స్థానిక ఎల్ఎల్ఎంలు భారీ స్థాయికి ఎదిగేంత వరకు దేశీ స్టార్టప్లపై గ్లోబల్ ఎల్ఎల్ఎంల ప్రభావం కొనసాగుతుంది. ఫేస్బుక్, యూట్యూబ్లాంటి ఉత్పత్తుల ద్వారా మెటా, గూగుల్లాంటి దిగ్గజాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు.ఇదీ చదవండి: మురిపిస్తున్న ముగింపు!
అంటార్కిటికాలో భారత మైత్రి-2 పరిశోధనా కేంద్రం
మంచు ఖండం అంటార్కిటికాలో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడంలో భారతదేశం మరింత పట్టు సాధించనుంది. తూర్పు అంటార్కిటికాలో భారత్ నిర్మించదలచిన సరికొత్త పరిశోధనా కేంద్రం ‘మైత్రి-2’ 2032 నాటికి సిద్ధం కానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ముందుగా ఈ ప్రాజెక్ట్ను 2029 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడినట్లు ప్రభుత్వం చెప్పింది. సుమారు రూ.2,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మైత్రి-1 స్థానాన్ని భర్తీ చేయనుంది.మైత్రి-11981లో భారత అంటార్కిటిక్ యాత్రలు ప్రారంభమైనప్పటికీ 1989లో షిర్మాకర్ ఒయాసిస్లో స్థాపించిన మైత్రి-1 ఇండియా పరిశోధనలకు కీలకంగా నిలిచింది. అంతకుముందు ఉన్న ‘దక్షిణ గంగోత్రి’ మంచులో కూరుకుపోయిన తర్వాత మైత్రి-1 ప్రధాన కార్యస్థానంగా మారింది.మైత్రి-1 సాధించిన విజయాలుగత 35 ఏళ్లుగా నిరంతరాయంగా శాస్త్రవేత్తలకు ఆశ్రయం ఇస్తూ వాతావరణ మార్పులపై విలువైన డేటాను అందించింది. భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, హిమానీనదాల అధ్యయనంలో మైత్రి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ స్టేషన్ పాతబడటంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో మైత్రి-2 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.మైత్రి-2 భవిష్యత్ పరిశోధనల దిశగా..మైత్రి-2 అత్యాధునిక సాంకేతికతతో కూడిన శాస్త్రీయ ప్రయోగశాల. ఈ స్టేషన్ ద్వారా భారత్ చేపట్టబోయే ప్రధాన పరిశోధనలు ఇవే:ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అంటార్కిటిక్ మంచు ఫలకాలు కరగడాన్ని నిశితంగా పరిశీలించడం. ఇందుకోసం అధునాతన ‘ఐస్-కోర్ స్టోరేజ్’ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.తీవ్రమైన చలిలో జీవించే సూక్ష్మజీవులు, వృక్షజాతులపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక జీవ, సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుంది.ఓజోన్ పొరలో మార్పులు, భూకంప తరంగాల పర్యవేక్షణ, దీర్ఘకాలిక పర్యావరణ స్థితిగతులను ఈ స్టేషన్ ట్రాక్ చేస్తుంది.ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా శాస్త్రీయ కార్యకలాపాలు సాగడానికి బలమైన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థను మైత్రి-2లో రూపొందిస్తున్నారు.ప్రస్తుత స్థితి.. సవాళ్లుకేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, మైత్రి-2 నిర్మాణాన్ని కొన్ని కారణాల వల్ల 2032కి మార్చారు. దీనికి అవసరమైన ఆర్కిటెక్చరల్ డిజైన్, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ప్రభుత్వం రూ.29.2 కోట్లను ఇప్పటికే మంజూరు చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, రవాణా సవాళ్ల దృష్ట్యా ఈ నిర్మాణానికి పట్టే ఏడేళ్ల సమయం అత్యంత కీలకం.గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) ఆధ్వర్యంలో భారత్ అంటార్కిటికాలో తన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది. మైత్రి-2 అందుబాటులోకి రావడం ద్వారా కేవలం పరిశోధనల పరిధి పెరగడమే కాకుండా ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భారతదేశం తన నాయకత్వ పాత్రను చాటుకుంటుంది.ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ బోర్డులు
సామాన్యుడి చేతిలో సమస్తం!
ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే వింతగా చూసిన పల్లె ప్రజలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్తో ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యామా అని ఇప్పుడు చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చింది. చాట్జీపీటీ, జెమిని.. వంటివి కేవలం నగరాలకో, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకో పరిమితం కాలేదు. పంటకు పట్టిన తెగులును ఫోటో తీసి పరిష్కారం అడిగే రైతు నుంచి, ప్రభుత్వ పథకాల వివరాలను మాతృభాషలో అడిగి తెలుసుకునే సామాన్యుడి వరకు.. ఏఐ నేడు ఒక డిజిటల్ సహాయకుడిలా మారుతోంది. ఇంగ్లీష్ రాకపోయినా, టెక్నాలజీపై అవగాహన లేకపోయినా.. కేవలం మాటతోనే పనులు పూర్తి చేసుకునేలా ఏఐ అందుబాటులోకి వస్తోంది.సామాన్యుల కోసం టెక్ కంపెనీల వ్యూహాలుచదవడం, రాయడం రాని వారు కూడా తమ మాతృభాషలో మాట్లాడి సమాచారాన్ని పొందేలా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వాయిస్ అసిస్టెంట్లను అభివృద్ధి చేశాయి. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన భాషిణి వంటి ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులు, గూగుల్ ‘1,000 ల్యాంగ్వేజీ ఏఐ మోడల్’ ద్వారా స్థానిక మాండలికాల్లో ఏఐ సర్వీసులు అందిస్తున్నారు. కొత్త యాప్లను డౌన్లోడ్ చేయడం కష్టంగా భావించే వారి కోసం నేరుగా వాట్సాప్ చాట్బాట్ల ద్వారా ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.గ్రామ స్థాయిలో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది?వ్యవసాయానికి సంబంధించి నేల స్వభావం, వాతావరణ మార్పులను బట్టి ఏ పంట వేయాలి? ఎప్పుడు నీరు పెట్టాలి? పురుగుల మందు ఎప్పుడు చల్లాలి? వంటి అంశాలను ఏఐ ముందే సూచిస్తుంది. ఉదాహరణకు, పంట ఆకు ఫోటో తీసి ఏఐ యాప్లో పెడితే దానికి ఉన్న సమస్యలు ఏమిటో, ఏ మందు వాడాలో వెంటనే చెబుతుంది.గ్రామాల్లో డాక్టర్ల కొరత ఉంటుంది. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి నగరంలోని డాక్టర్లకు సమాచారాన్ని పంపవచ్చు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తమ సొంత భాషలో అడిగి తెలుసుకోవడానికి ఏఐ చాట్బాట్లు సహాయపడుతున్నాయి.ఏఐని సులువుగా ఎలా వాడవచ్చు?స్మార్ట్ఫోన్లో ఏదైనా ఏఐను అడగాలంటే టైప్ చేయడం కష్టమైతే కీబోర్డ్ పైన లేదా సెర్చ్ బార్లో ఉండే మైక్ బటన్ నొక్కి మీకు కావాల్సిన విషయాన్ని అడగాలి.గూగుల్ లెన్స్ వంటి ఏఐ టూల్స్ వాడి ఏదైనా తెలియని వస్తువును లేదా మొక్కను ఫోటో తీసి దాని వివరాలు తెలుసుకోవచ్చు.మీకు రాని భాషలో ఏదైనా ఉత్తరం లేదా బోర్డు ఉంటే, ఏఐ కెమెరా ద్వారా దాన్ని వెంటనే కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం చదువుకున్న వారి కోసం మాత్రమే కాదు, దీన్ని అందరి కోసం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. డిజిటల్ అక్షరాస్యత పెంచడంతో పాటు భాషా పరమైన అడ్డంకులను తొలగిస్తే ఏఐ ఒక సామాన్యుడి డిజిటల్ సహాయకుడిగా మారుతుంది.ఇదీ చదవండి: వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు
వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఏటా పెరుగుతోంది. వాహనదారుల్లో పర్యావరణంపై అవగాహన అధికమవుతోంది. భారత రోడ్లపై గతేడాది దాదాపు 15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కడం పర్యావరణ స్పృహకు నిదర్శనం. అయితే, ఈ వాహనాల్లో కీలక భాగంగా ఉన్న ‘లిథియం-అయాన్’ బ్యాటరీల ఆయుష్షు తీరిపోయాక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో ఏటా 50,000 టన్నులకు పైగా బ్యాటరీ వ్యర్థాలు పోగుపడనున్నాయి. కానీ, ఈ వ్యర్థాలను పర్యావరణ ముప్పుగా కాకుండా ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశంగా మార్చే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు (2024)’ ఈ రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కేవలం రీసైక్లింగ్ మాత్రమే కాకుండా ఈ పాత బ్యాటరీలను ‘సెకండ్ లైఫ్’ కింద కొన్ని మార్పులు చేసి మారుమూల గ్రామాల్లో సోలార్ గ్రిడ్లుగా, వ్యవసాయ పంపు సెట్లకు ఎనర్జీ సోర్స్లుగా మలచవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.పెరుగుతున్న బ్యాటరీలుప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం సాధారణంగా 8 నుంచి 10 ఏళ్లు. భారత ప్రభుత్వం ఫేమ్ 2 పథకం ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో వచ్చే దశాబ్ద కాలంలో లక్షలాది టన్నుల బ్యాటరీ వ్యర్థాలు పోగుపడతాయని అంచనా. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే అందులోని రసాయనాలు భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రమాదం ఉంది.రీసైక్లింగ్ ప్రక్రియబ్యాటరీలను కేవలం వ్యర్థాలుగా చూడకుండా రీసైక్లింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాలి. కొన్ని పద్ధతుల ద్వారా పాత బ్యాటరీల నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలను 90% పైగా తిరిగి పొందవచ్చు. భారతదేశంలో లిథియం నిల్వలు తక్కువ. రీసైక్లింగ్ పెరిగితే ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ (2022)’ ప్రకారం తయారీదారులే బ్యాటరీల సేకరణ, రీసైక్లింగ్కు బాధ్యత వహించాలి.బ్యాటరీలకు ‘సెకండ్ లైఫ్’అన్ని బ్యాటరీలను వెంటనే రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవీల్లో బ్యాటరీ సామర్థ్యం 70-80% కి పడిపోయినప్పుడు అవి వాహనానికి పనికిరావు కానీ, ఇతర అవసరాలకు అవి మెరుగ్గా పని చేస్తాయి. దీనినే సెకండ్ లైఫ్ అప్లికేషన్లు అంటారు. రీసైకిల్ చేయకుండానే ఈ బ్యాటరీలను గ్రామీణ ప్రాంతాల్లో విభిన్న అవసరాలకు ఉపయోగించవచ్చు.సోలార్ మైక్రో గ్రిడ్లు: గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ పాత ఈవీ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. పగలు నిల్వ చేసిన విద్యుత్తును రాత్రి పూట వీధి దీపాలకు, ఇళ్లకు వాడుకోవచ్చు.వ్యవసాయ పంపు సెట్లు: పొలాల్లో సోలార్ పంపు సెట్లకు బ్యాటరీ స్టోరేజ్గా వీటిని అనుసంధానిస్తే విభిన్న వాతావరణ పరిస్థితులున్న సమయంలో కూడా నీటి సరఫరా ఆగదు.బ్యాకప్ పవర్: గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఇన్వర్టర్ల స్థానంలో ఈ బ్యాటరీ ప్యాక్లను తక్కువ ధరకే ఏర్పాటు చేయవచ్చు.నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో బ్యాటరీ రీసైక్లింగ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల(సుమారు రూ.9000 కోట్లు)కు చేరుకుంటుంది. ఈ క్రమంలో పాత బ్యాటరీలను గ్రామీణ విద్యుదీకరణకు వాడటం వల్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సులభమవుతుంది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త బ్యాటరీల తయారీలో కనీసం 5% రీసైకిల్ చేసిన పదార్థాలను వాడాలనే నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లోహమ్ (LOHUM) వంటి సంస్థలు ఇప్పటికే పాత ఈవీ బ్యాటరీలను ఎనర్జీ స్టోరేజ్లుగా మార్చి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయోగాలు చేస్తున్నాయి. రీసైక్లింగ్ ద్వారా లభించే లిథియం, కోబాల్ట్ ధరలు కొత్త ఖనిజాల తవ్వకం కంటే 25% తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈవీల ధరలు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.ఇదీ చదవండి: భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్
పర్సనల్ ఫైనాన్స్
అప్పుడే తీర్చేయొద్దు!
ఇపుడు ఫోన్ తెరిచి మెసేజ్లు, వాట్సాప్లు చూసినా... మెయిల్ తెరిచినా రుణాలిస్తామంటూ రోజూ ఆఫర్ల కొద్దీ ఆఫర్లు. దీంతో పాటు ఫోన్లు. ఫోన్ చేసి మరీ... లోన్ కావాలా? అని అడిగే ఏజెన్సీలు కోకొల్లలు. ఇలాంటివేమీ లే కున్నా.. జస్ట్ యాప్ తెరిచి క్లిక్ కొడితే మన ఖాతాలోకి డబ్బులిచ్చేసే రుణ యాప్లు కూ డా ఉన్నాయి. అదీ ఫిన్టెక్ మహిమ. నిజానికి ఈ యాప్లన్నీ అప్పులిచ్చేది వాటి సొంత డబ్బేమీ కాదు. అవన్నీ ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీతోనో, బ్యాంకుతోనో జతకట్టి ఉంటాయి. వాటికన్నా కాస్త ఎక్కువ వడ్డీ వేసుకుని... అత్యంత ఈజీగా మీ ఖాతాలోకి వేసేస్తూ ఉంటాయి. తీర్చటం కాస్త ఆలస్యమయినా, తీర్చకపోయినా వీటి వ్యవహారశైలి కూడా చాలా దుర్మార్గంగా ఉంటుంది. అందుకే రుణం తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తీసుకున్నాం? ఎంత వడ్డీకి తీసుకున్నాం? ప్రాసెసింగ్ ఛార్జీలెంత? ప్రీపేమెంట్ పెనాల్టీ ఎంత? ఇవన్నీ తప్పనిసరిగా చూడాలి. సరే! ఇవన్నీ చూశాకే రుణం తీసుకున్నారనుకుందాం. ఇల్లు, కారు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గృహోపకరణాల కొనుగోళ్లు, టూర్లు... ఇలా దేనికైనా రుణం తీసుకుని ఉండొచ్చు. కాకపోతే చాలామంది ఈజీగా వస్తున్నాయి కదా అని ప్రతిదానికీ రుణం తీసేసుకోవటం... ఆ తరువాత దాన్ని భారంగా భావించి త్వరగా వదిలించుకునే మార్గాల కోసం వెతకడం చేస్తుంటారు. దేశంలో ముందస్తు రుణ చెల్లింపులు పెరుగుతుండడం దీన్నే సూచి స్తోంది. 1వ తారీఖు వస్తుందంటే మనసులో ఆందోళన పెరగడం... ‘ఈఎంఐ’ కట్టడంలో ఉన్న నొప్పి... వారితో అలా చేయిస్తుంటా యి. కానీ, అన్ని రుణాలనూ ఇలా ముందు గా తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పనేమీ కా దు. రుణాల్లో మనల్ని పిండేసే వాటితో పాటు కొన్ని మనకు లాభాన్నిచ్చేవి కూడా కొన్ని ఉంటాయి. ఆర్థికంగా గుల్ల చేసే రుణాలను వదిలించుకోవడం, చౌక రుణాలతో నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం ఎలాగో చూద్దాం...రుణాన్ని ముందుగా తీర్చేయడం ఎందుకు? → రుణ భారం నుంచి బయటపడాలన్న ప్రయత్నం వెనుక ఎన్నో కారణాలుంటాయి. → అత్యవసరమో లేక నచి్చన వస్తువును సొంతం చేసుకోవాలన్న బలహీనత వల్లో రుణం తీసుకుని ఉండొచ్చు. నెలవారీ రుణ చెల్లింపులు మొదలయ్యాక భారంగా అనిపించొచ్చు. ఆదాయం నుంచి ఈఎంఐలకు సర్దుబాటు చేయలేక, రుణాన్ని ముగించాలని భావించొచ్చు. → పెట్టుబడులు గడువు తీరి చేతికి రావొచ్చు. లేదా పనిచేస్తున్న కంపెనీ నుంచి బోనస్ బ్యాంక్లో జమ కావొచ్చు. వీటితో రుణం భారం తగ్గించుకుందామని అనిపించొచ్చు. → నెలవారీ ఆదాయంలో చాలా వరకు రుణ చెల్లింపులకే ఖర్చు చేసేస్తుంటే.. ఇక ఇతర ఖర్చులకు చాలని పరిస్థితులతో ఇంట్లో ఒత్తిళ్లు తట్టుకోలేక.. రుణాన్ని క్లోజ్ చేసే ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు. రుణంతో కలసి సాగడమే.. కొన్ని రుణాలను ముందుగా చెల్లించడం కంటే, వాటిని కొనసాగించుకోవడం ద్వారా రుణ గ్రహీత అదనపు ప్రయోజనం పొందొచ్చు. అది ఎప్పుడంటే.. → రుణంపై వడ్డీ రేటు 9–10 శాతం మించకుండా ఉండాలి. సాధారణంగా గృహ రుణం, వాహన రుణం, విద్యా రుణాలు ఇంత తక్కువ రేటుకు వస్తుంటాయి. ప్రాపర్టీ తనఖాపైనా ఇంతే తక్కువ రేటుకు రుణాలు లభిస్తున్నాయి. → రుణాన్ని తీర్చే బదులు, ఆ మొత్తాన్ని పెట్టుబడి పెడితే.. రుణ రేటు కంటే అధిక రాబడి వచ్చేట్టు ఉండాలి. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై రాబడులు 10–15 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాలంలో 12–20 శాతం మధ్య ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → అత్యవసరాల కోసం ఉద్దేశించిన నిధిని తీసుకెళ్లి రుణానికి కట్టేయడం వివేకం అనిపించుకోదు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతేనో లేదా వైద్య అత్యవసరం ఏర్పడితేనో నిధుల కోసం మళ్లీ అప్పు చేయాల్సి వస్తుంది. కనుక అత్యవసర నిధిని రుణాల కోసం ఉపయోగించొద్దు. → నెలవారీ రుణ చెల్లింపులు ఆదాయంలో 30% లోపే ఉన్నప్పుడు దాన్ని ముందుగా తీర్చడం కంటే.. మిగులు ఆదాయాన్ని పెట్టుబడులకు మళ్లించుకునే మార్గాలను చూడొచ్చు. → పన్ను ఆదా ప్రయోజనాలున్న రుణాలను వదిలించుకోవడం కంటే కొనసాగించడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఉదాహరణకు గృహ రుణం. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద ఇంటి రుణం కోసం చేసే చెల్లింపుల్లో అసలు రూ.1.50 లక్షల వరకు, సెక్షన్ 24 కింద వడ్డీ రూ.2 లక్షలపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంటి రుణంపై 8.3% వడ్డీ రేటు చెల్లిస్తున్నప్పటికీ.. నికరంగా పడే భారం 6.5–7% మించదు. పైగా ముందస్తు చెల్లింపుల ను ఈక్విటీ, బంగారంలోకి పెట్టుబడిగా మళ్లించి మెరుగైన రాబడులూ సొంతం చేసుకోవచ్చు.ఇలాంటపుడు తీర్చేయటమే బెటర్...→ నెలవారీ సంపాదనలో ఈఎంఐలు 45 శాతం మించినట్టయితే, ఆయా రుణాలను త్వరగా చెల్లించే మార్గాలను చూడొచ్చు. → పదవీ విరమణకు చేరువవుతుంటే (మరికొన్నేళ్లే ఉంటే)... అప్పుడు వీలైనంత త్వరగా ఆ రుణాల నుంచి బయటకు రావాలి. → రుణాల్లో అధిక వడ్డీ రేటుతో ఉన్న వాటిని త్వరగా వదిలించుకోవాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డులపై 36– 44 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఆ తర్వాత వ్యక్తిగత రుణాలపైనా 15 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ఇలాంటి వాటిని ముందుగా చెల్లించడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదు. → కొన్ని వాహన రుణాలపై వడ్డీ రేటు 12 శాతం వరకు ఉంటుంది. ఇలాంటివీ ముందుగా తీర్చేయొచ్చు. → గృహ, విద్యా రుణం తప్ప మిగిలిన రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. కనుక అధిక రేటుతో ఉంటే త్వరగా బయటకు వచ్చేయడం లాభమే. → కొందరు ఈక్విటీ పెట్టుబడులపై మెరుగైన రాబడి వచి్చనప్పటికీ.. పెట్టుబడి కంటే రుణాన్ని ముగించేందుకే మొగ్గు చూపుతుంటారు. అధిక రాబడి కోసం పెట్టుబడులపై రిస్క్ తీసుకోవడం వారికి నచ్చదు. పైగా రుణాన్ని ఎక్కువ కాలం పాటు కొనసాగించేందుకు ఇష్టంలేని వారికి సైతం రుణభారం దింపుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. → ఏది ఏమైనా మెరుగైన రాబడులు ఇస్తున్ను పెట్టుబడులను ముందస్తు రుణ ముగింపునకు వినియోగించడం వివేకం అనిపించుకోదు.ఆదా మామూలుగా లేదుగా..! → రూ.20 లక్షల గృహ రుణాన్ని 15 ఏళ్ల టర్మ్తో తీసుకున్నారు. వడ్డీ రేటు 8.3%. → ఇందులో రూ.5 లక్షలను ముందుగా చెల్లించినట్టయితే 15 ఏళ్ల కాలంలో మొత్తం మీద రూ.3.2 లక్షలు వడ్డీ రూపంలో ఆదా అవుతుంది. → రూ.5 లక్షలను ముందస్తు రుణం చెల్లింపులకు వినియోగించకుండా, 12 శాతం రాబడినిచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? → 15 ఏళ్ల కాలంలో రూ.27.36 లక్షలు సమకూరుతుంది. → ముందస్తు రుణ చెల్లింపులకు బదులు.. ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ.24 లక్షలు సమకూర్చుకోవచ్చని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. → పెట్టుబడులపై రాబడి, రుణం రేటు కంటే అధికంగా ఉంటే అలాంటప్పుడు ముందస్తు చెల్లింపులతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. వీటిని గమనించాలి.. అధిక రేటుతో తీసుకున్న రుణాలను ముందుగా తీర్చేయడం లాభమే. కానీ, గడువు కంటే ముందుగానే వాటిని ముగించేందుకు బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఉచితంగా అనుమతించకపోవచ్చు. ఫోర్క్లోజర్ చార్జీలంటూ చాలా సంస్థలు రుణ గ్రహీతల నుంచి వసూలు చేస్తున్నాయి. రుణాన్ని గడువులోపు తీర్చేస్తుంటే.. అప్పటికి మిగిలిన బకాయిపై 2–5 శాతం వరకు ఈ రూపంలో చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తదితర కొన్ని బ్యాంక్లు అయితే వ్యక్తిగత రుణాలను ముందుగా తీర్చేస్తుంటే ఎలాంటి చార్జీలు విధించడం లేదు. కనుక ఇలాంటి చార్జీల్లేని చోటే రుణాలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల తర్వాతి కాలంలో వీలైనంత ముందుగానే గుడ్బై చెప్పేయొచ్చు.
పీఎఫ్ కొత్త రూల్: ఎన్పీఎస్ నుంచి ఇక 80 శాతం విత్డ్రా
జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) సభ్యులకు హార్షానిచ్చే మార్పులకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) శ్రీకారం చుట్టింది. పదవీ విరమణ నాటికి సమకూరిన మొత్తం నిధిలో 60 శాతం ఉపసంహరణకు ప్రస్తుతం అనుమతి ఉండగా, ఇకపై 80 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యూటీ ప్లాన్ (క్రమానుగతంగా పింఛను చెల్లించే) కొనుగోలు చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం గరిష్టంగా 70 ఏళ్ల వయసు వరకే ఎన్పీఎస్లో కొనసాగేందుకు అనుమతి ఉంది. దీన్ని ఇప్పుడు 85 ఏళ్లకు పెంచారు. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలను పీఎఫ్ఆర్డీఏ ప్రకటించింది. గెజిట్ ప్రకటించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. పథకం నుంచి వైదొలిగే నాటికి పింఛను నిధి రూ.8లక్షల్లోపు ఉంటే ఆ మొత్తాన్ని సభ్యులు ఒకే విడత, లేక సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ రూపంలో (క్రమానుగతంగా/ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ మాదిరి) వెనక్కి తీసుకోవచ్చు. నాలుగేళ్ల విరామంతో సభ్యులు ఇకపై నాలుగు పర్యాయాలు పాక్షిక ఉపసంహరణ చేసు కోవచ్చు. ప్రస్తుతం 3 సార్లకు అనుమతి ఉంది. 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసు తర్వాత కొనసాగే వారు మూడేళ్ల విరామంతో మూడు పాక్షిక ఉపసంహరణలే చేసుకోగలరు. ఎన్పీఎస్లో ప్రభుత్వ చందాదారులు సైతం 85 ఏళ్ల వరకు కొనసాగొచ్చు. అంటే 85 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడులను సైతం కొనసాగించుకోవచ్చు. వీరు పథకం నుంచి వైదొలిగే సమయంలో కనీసం 40 శాతంతో యాన్యూటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతాన్ని ఒకే విడత లేదా క్రమానుగతంగా వెనక్కి తీసుకోవచ్చు. రాజీనామా లేక తొలగింపు కారణంగా పథకం నుంచి మందుగా వైదొలిగే ప్రభుత్వ చందాదారులు.. పింఛను నిధి నుంచి 20 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యూటీ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి. పింఛను నిధి రూ.5 లక్షల్లోపే ఉంటే.. సాధారణ వైదొలగడం, ముందస్తుగా వైదొలగడం లేదా సభ్యుడు మరణించిన సందర్భాల్లో పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.
Rupee fall: జీతం తగ్గుతుందా.. EMI పెరుగుతుందా?
భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకీ బలహీనపడుతోంది.. డాలర్ మారకంలో భారత రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరడంతో సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అంశాలపై ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా జీతాలు, ఈఎంఐలు (EMIs), రోజువారీ ఖర్చులు అన్నీ ఒకేసారి ఒత్తిడిలో పడుతున్నాయి.ఈఎంఐలపై ప్రభావం ఇలా..రూపాయి విలువ పడిపోతే లోన్లపై ప్రభావం రెండు విధాలుగా కనిపిస్తుంది.విదేశీ కరెన్సీ లోన్లుడాలర్లు లేదా ఇతర విదేశీ కరెన్సీలో లోన్ తీసుకున్నవారికి నేరుగా దెబ్బ పడుతుంది. ఉదాహరణకు డాలర్ ధర రూ.80 నుంచి రూ.90కి పెరిగితే, రీపేమెంట్ భారం సుమారు 12.5 శాతం పెరుగుతుంది.దేశీయ లోన్లుఇక్కడ ప్రభావం పరోక్షంగా ఉంటుంది. రూపాయి బలహీనపడటంతో దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా ఇంధనం, మందులు, ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనిని నియంత్రించేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచితే, ఫ్లోటింగ్ రేట్ లోన్ల ఈఎంఐలు పెరుగుతాయి.ఉదాహరణకు మీరు రూ.50 లక్షల హోం లోన్ తీసుకున్నారనుకోండి.. 20 ఏళ్లు టెన్యూర్, 8% వడ్డీతో ప్రస్తుతం ఈఎంఐ సుమారు రూ.41,045 గా ఉంటే వడ్డీ రేటు 0.5% పెరిగితే ఈఎంఐ రూ.42,366కి చేరుతుంది. అంటే నెలకు రూ.1,321 అదనపు భారం. మొత్తం కాలంలో రూ.3.17 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుందన్న మాట.జీతాలపై రూపాయి ప్రభావంరూపాయి పతనం వల్ల జీతాలు వెంటనే తగ్గవు కానీ సమస్య అక్కడే మొదలవుతుంది.ప్రైవేట్ ఉద్యోగులకుకంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లు ఆలస్యం కావచ్చు.కొత్త నియామకాలు తగ్గే అవకాశంకొన్నిచోట్ల బోనసులు, వేరియబుల్ పే తగ్గవచ్చుఐటీ, ఎగుమతి రంగాలలోని డాలర్లలో ఆదాయం వచ్చే కంపెనీలకు కొంత లాభం ఉన్నా, ఆ ప్రయోజనం ఉద్యోగుల జీతాల పెంపులోకి వెంటనే రావడం కష్టంప్రభుత్వ ఉద్యోగులకుజీతాలు స్థిరంగానే ఉన్నా, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల జీతం విలువ తగ్గినట్లే అవుతుంది. డీఏ పెంపు ఆలస్యమైతే భారమవుతుంది.రూపాయి పతనం అంటే కేవలం ఎగుమతులు–దిగుమతుల సమస్య కాదు. ఇది జీతం విలువను తగ్గించి, ఈఎంఐ భారం పెంచి, కుటుంబ బడ్జెట్ను కుదించే నిశ్చబ్ద దెబ్బ. నేరుగా అయినా, పరోక్షంగా అయినా సామాన్యుడిపై ప్రభావం తప్పదు.
ఎస్బీఐ యోనో కొత్త వెర్షన్.. 20 కోట్లు టార్గెట్!
ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అయిన ‘యోనో’ వచ్చే రెండేళ్లలో కస్టమర్ల సంఖ్యను 20 కోట్లకు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉంది. యోనో 2.0 (కొత్త వెర్షన్)ను విడుదల చేసిన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు. ఎస్బీఐ 2.0 మెరుగైన వెర్షన్ అని, కస్టమర్లకు మెరుగైన సేవల అనుభవాన్ని అందిస్తుందన్నారు. ఎస్బీఐకి వెన్నెముకగా నిలుస్తుందన్నారు. ఈ ప్లాట్ఫామ్పై పూర్తి స్థాయి సదుపాయాలను వచ్చే 6–8 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.‘‘డిజిటలైజేషన్కు యోనో 2.0 మూలస్తంభంగా ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్కు ఉమ్మడి కోడ్ ఉంటుంది. దీంతో వివిధ ఛానళ్ల మధ్య అనుసంధానత సాఫీగా సాగుతుంది. దీని కారణంగా కొత్త ఉత్పత్తులను, సేవలను ఎస్బీఐ వేగంగా కస్టమర్లకు అందించగలదు. యోనోకి ప్రస్తుతం 10 కోట్ల కస్టమర్లు ఉన్నారు. యోనో మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్పై కస్టమర్ల సంఖ్య 20 కోట్లకు చేర్చాలన్నది మా ఉద్దేశ్యం. వచ్చే రెండేళ్లలో దీన్ని చేరుకుంటాం’’అని శెట్టి చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ (నిమ్)ను 3 శాతం సాధిస్తామని మరోసారి ప్రకటించారు. ర్యామ్ విభాగంలో (రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ) రుణాల పరంగా 14 శాతం వృద్ధి సాధిస్తామని, అలాగే రూ.25 లక్షల కోట్ల పోర్ట్ఫోలియో మైలురాయిని అధిగమిస్తామని చెప్పారు. బంగారం రుణాలు, ఎక్స్ప్రెస్ క్రెడిట్ (అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలు)లో మంచి వృద్ధి సాధిస్తామన్నారు.


