Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

indigo ceo pieter elbers expects full normalisation likely by december 10 15 1
విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ

అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం వరకు సుమారు 1,000 పైగా విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇండిగోలో తలెత్తిన విమానాల రద్దు సంక్షోభంపై దాని సీఈవో సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను, షెడ్యూళ్లను "రీబూట్" చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పారు. శనివారం నాటికి విమానాల రద్దు సంఘటనలు తగ్గుతాయని హామీ ఇచ్చారు. రాబోయే 5-10 రోజుల్లో అంటే డిసెంబర్ 10-15 నాటికి క్రమంగా కోలుకుని కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు.సిబ్బంది పని గంటలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలను అమలు చేయడంలో ప్రణాళిక అంతరాల కారణంగా ఈ సంక్షోభం ఉద్భవించిందని వివరణ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈ నిబంధనలను సమీక్ష పెండింగ్ లో ఉంచింది.

Weaker rupee is not entirely negative says Finance Minister Nirmala Sitharaman2
‘రూపాయి’ని అలా చూడొద్దు: నిర్మలా సీతారామన్‌

కొనసాగుతున్న రూపాయి పతనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు స్పందన వచ్చింది. యూఎస్ డాలర్‌తో రూపాయి మారక విలువ కొన్ని రోజులుగా రికార్డ్‌ కనిష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఇటీవల ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ .90.43కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రూపాయి ఇటీవలి కదలికలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ మొదటి స్పందనను అందించారు.హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. రూపాయి విలువలో భారీ జోక్యం చేసుకోకుండా మార్కెట్ శక్తులకు వదిలివేయాలన్నారు. మారకం రేట్లు "చాలా సున్నితమైనవి" అన్నారు. కరెన్సీ కదలికలను అతిగా రాజకీయం చేయడం లేదా అతిగా నిర్వహించడం గురించి ఆమె హెచ్చరించారు. అవి ప్రపంచ ఒత్తిళ్లకు త్వరగా స్పందిస్తాయని పేర్కొన్నారు.ఆర్థిక ప్రాథమికాంశాలు ముఖ్యంనేటి రూపాయి స్థాయిలను గత పరిస్థితులతో పోల్చకుండా 2026 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ అంచనా వేసిన భారతదేశ ప్రస్తుత వృద్ధి పథంపై దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ పరిశీలకులను కోరారు.పూర్తిగా ప్రతికూలం కాదురూపాయి బలహీనమైనప్పుడల్లా పూర్తిగా ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. రూపాయి విలువ క్షీణించినప్పుడు ఎగుమతిదారులు తరచుగా ప్రయోజనం పొందుతారని, ఎందుకంటే ఇది భారతీయ వస్తువులను విదేశాలలో మరింత పోటీగా మారుస్తుందని ఆమె పేర్కొన్నారు.

Luxury Housing market Hyderabad Real estate 3
లగ్జరీ హౌసింగ్‌ మార్కెట్‌ రయ్‌.. రయ్‌..

భారత లగ్జరీ మార్కెట్‌ గతేడాది 17 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి 103 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని మ్యాజిక్‌ బ్రిక్స్‌ అంచనా వేసింది. ప్రీమియం వ్యయాలకు కస్టమర్లు ఏమాత్రం వెనుకడుగు వేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భారత లగ్జరీ హౌసింగ్‌ మార్కెట్‌ పరిపక్వత దశకు చేరుకుందని, సంప్రదాయ మెట్రో కేంద్రాల నుంచి కొత్త భౌగోళిక ప్రాంతాలు, శివార్లకు లగ్జరీ గృహ విపణి విస్తరిస్తుందని పేర్కొంది.ప్రధాన నగరాల్లో లగ్జరీ ప్రైజ్‌ ఇండెక్స్‌(ఎల్‌పీఐ) 2021లో 2.32గా ఉండగా.. 2025 నాటికి 2.27కి తగ్గింది. ఇదే కాలంలో కొత్త ప్రాంతాలు, శివార్లలో ఎల్‌పీఐ 1.00 నుంచి 1.44కి పెరగడమే దీనికి సూచన అని వివరించింది. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, టౌన్‌షిప్‌ల అభివృద్ధితో శివార్లలో లగ్జరీ గృహాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. మధ్యస్థ లగ్జరీ గృహాల ధరలు ముంబైలో అత్యధికంగా రూ.9.66 కోట్లుగా ఉండగా.. గుర్‌గావ్‌లో రూ.5.46 కోట్లు, బెంగళూరులో రూ.2.91 కోట్లు, హైదరాబాద్‌లో రూ.2.20 కోట్లు, చెన్నైలో రూ.2 కోట్లు, పుణెలో రూ.1.97 కోట్లు, కోల్‌కతాలో రూ.1.50 కోట్లుగా ఉన్నాయి. లగ్జరీ యూనిట్లకు ఆసక్తి.. 2021 నుంచి దేశంలో లగ్జరీ హౌసింగ్‌ గణనీయంగా విస్తరిస్తోంది. డెవలపర్లు పెద్ద లేఅవుట్లు, ప్రీమియం వసతులు, ఇంటిగ్రేటెడ్‌ లైఫ్‌ స్టైల్‌ సౌకర్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో లగ్జరీ గృహాల సరఫరా పెరుగుతోంది. ప్రస్తుతం మొత్తం ఇళ్ల సప్లయిలో లగ్జరీ యూనిట్ల వాటా 27 శాతంగా ఉంది. 2021లో ఈ విభాగం వాటా 16 శాతంగా ఉండేది. అద్భుతమైన డిజైన్, సౌలభ్యం, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు 14 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది.

Gold and Silver rates on 6th December 2025 in Telugu states4
గుడ్‌న్యూస్‌.. మారిపోయిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు క్షీణించాయి. క్రితం రోజున ఎగిసిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) తగ్గాయి. ఇక వెండి ధరలు మరోసారి క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Hyderabad Real estate Fourth city seeks affordable housing zone5
హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో అఫర్డబుల్‌ జోన్‌..

సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల.. ఎకరం రూ.100 కోట్లు పలుకుతున్న హైదరాబాద్‌లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల సాకారం కావాలంటే ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్‌లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్‌ హౌసింగ్‌(చౌక ధరల ఇళ్లు) తగ్గుముఖం పట్టాయి.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నగరానికి దక్షిణ భాగంలో ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫోర్త్‌ సిటీలో అఫర్డబుల్‌ హౌసింగ్‌కు కూడా ప్రత్యేకంగా జోన్‌ కేటాయించాలని డెవలపర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సంస్థలకు, క్రీడలకు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకు ఎలాగైతే ప్రత్యేకంగా జోన్లను కేటాయిస్తున్నారో.. చౌక గృహాల నిర్మాణాలకు కూడా స్థలాలను కేటాయించాల్సిన ఆవశ్యకత ఉందనేది నిపుణుల అభిప్రాయం.ఆకాశాన్నంటిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు కొనలేని విధంగా తయారైంది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌ ఏర్పడింది. డబ్బు ఉండి, ఇల్లు ఉన్నవారు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. వేతనజీవులు తమ సంపాదనలో 40–45 శాతం అద్దెలకే చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్ములో ఇల్లు, సంసారం గడపడం గగనమైపోయింది. మార్కెట్‌లో గృహ యజమానులు ఎక్కువ, అద్దెదారులు తక్కువగా ఉంటేనే సమత్యులత. లేకపోతే అద్దెలు విపరీతంగా పెరిగి, జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘అఫర్డబుల్‌ హౌసింగ్‌ పాలసీ’ని తీసుకురావడం అత్యవసరం.రీ–డెవలప్‌మెంట్‌ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్‌లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపులతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్‌ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు. అయితే ఈ తగ్గింపులతో ప్రభుత్వానికి ప్రత్యక్ష రాబడి తగ్గినా.. నిర్మాణ సామగ్రి కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరగడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటి వాటితో పరోక్షంగా అంతకు రెట్టింపు ఆదాయమే సమకూరుతుంది.ఫ్యూచర్‌ సిటీలో అఫర్డబుల్‌ జోన్‌.. కో–ఆపరేటివ్‌ సొసైటీ, ఎంప్లాయిస్‌ యూనియన్లుగా ముందుకు రావాలి. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో సామాన్య, మధ్యతరగతికి స్థలాలను కేటాయించాలి. కమ్యూనిటీ లివింగ్‌కు ప్రత్యేకంగా జోన్‌ కేటాయించాలి. ప్రభుత్వ భూములను మ్యాపింగ్‌ చేసి, అఫర్డబుల్‌ హౌసింగ్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక అవసరాలను కల్పిస్తే చాలు.. అందుబాటు ధరల్లో డెవలపర్లకు భూములను అందిస్తే అఫర్డబుల్‌ హౌసింగ్‌లను నిర్మించే వీలుంటుంది. పెరీ అర్బన్‌ ఏరియాలో భూమారి్పడి, కన్వర్షన్ల ప్రక్రియను సులభతరం చేయాలి. అర్హులైన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ, తొలిసారి ఇల్లు కొనుక్కునేవారికి స్టాంప్‌ డ్యూటీలో రాయితీ అందించాలి. అఫర్డబుల్‌ ప్రాజెక్ట్‌లను నిర్మించే డెవలపర్లకు పన్ను రాయితీలను అందజేయాలి.నిర్మాణ అనుమతుల్లో వేగం.. గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలను పాటిస్తూ.. ప్రీ–ప్యాబ్, త్రీడీ ప్రింటింగ్, మాడ్యులర్‌ టెక్నాలజీలతో ఇళ్లను నిర్మిస్తే త్వరితగతిన పూర్తవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్లేస్కూళ్లు, పార్క్‌లు, కమ్యూనిటీ స్పేస్‌లు వంటి సదుపాయాలను అందించాలి. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే మున్సిపల్, ఫైర్, రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్‌మెంటల్‌.. ఇలా 15 విభాగాలు, 170 డెస్క్‌ల ద్వారా వెళ్లాలి. ఇదే అనుమతుల జారీలో జాప్యానికి ప్రధాన కారణం.అలాకాకుండా అన్ని కీలక విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సింగిల్‌ విండో విధానంలో 45 రోజుల్లో అనుమతులు ఇవ్వాలి. రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లకు స్టాంప్‌ డ్యూటీని, మహిళా కస్టమర్లకు ప్రత్యేక రిబేట్‌ను అందించాలి. క్లబ్‌హౌస్, ఎస్టీపీ, డబ్ల్యూటీపీ, లిఫ్ట్‌లు వంటివి కూడా నివాస జీవనంలో భాగమే. అందుకే వీటికి వాణిజ్య విద్యుత్‌ సుంకాల భారం నుంచి మినహాయించాలి.

Lakme Cosmetic Brand Pioneer Simone Tata Dies At 956
‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత

ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్‌ బ్రాండ్‌ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.ముంబైలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ తమ ఎక్స్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లాక్మే బ్రాండ్‌ను భారతదేశంలో ప్రముఖ కాస్మెటిక్ కంపెనీగా అభివృద్ధి చేయడంలో సిమోన్ టాటా కృషిని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సిమోన్‌ టాటా కన్నుమూతపై లాక్మే ఇండియా కూడా సంతాపం తెలియజేసింది. లాక్మే వెనుక దార్శనికురాలిని కోల్పోయామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.టాటా కుటుంబంలో చేరి..సిమోన్ టాటా.. ప్రసిద్ధ టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్ టాటాకు తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు సవతి తల్లి. 1930లో జన్మించిన సిమోన్ డునోయర్ జెనీవాలో పెరిగారు. 1953లో పర్యాటకురాలిగా భారత్ వచ్చిన ఆమె నావల్ హెచ్ టాటాను వివాహమాడి ఇక్కడే స్థిరపడ్డారు. 1962లో టాటా ఆయిల్ మిల్స్‌కు చిన్న అనుబంధ సంస్థగా ఉన్న లాక్మే బోర్డులో చేరారు. అందం లగ్జరీ కాకూడదని, ప్రతి భారతీయ మహిళకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లాక్మే ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేశారు.We mourn the passing of Simone Tata, a truly accomplished woman whose achievements and grace touched so many. Her legacy will continue to inspire generations. May she rest in peace. Our thoughts & prayers are with the Tata family 🙏#SimoneTata pic.twitter.com/y3sHlL7ngJ— Swiss Consulate Mumbai (@SwissCGMumbai) December 5, 2025

Advertisement
Advertisement
Advertisement