Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Maruti Suzuki e Vitara Launched in India1
మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్: ధర ఎంతంటే?

చాలా రోజుల నిరీక్షణ తరువాత మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈవిటారాను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని రూ. 21000 చెల్లించి నెక్సా షోరూమ్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.2025 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి కనిపించిన ఈ కారు ఏడాది తరువాత మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ కారు కొనుగోలుదారులు వెహికల్ & బ్యాటరీ ప్యాక్ రెండింటిపై ఎనిమిది సంవత్సరాల వారంటీ, ఒక సంవత్సరం ఉచిత ఛార్జింగ్ వంటి వాటితో పాటు.. రూ. 50,000 విలువైన ఇన్‌స్టాలేషన్‌తో ఫ్రీ హోమ్ ఛార్జర్ కూడా పొందవచ్చు.మారుతి సుజుకి ఈవిటారా 49 కిలోవాట్ (440 కిమీ), 61 కిలోవాట్ (543 కిమీ) బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు, ఇన్వర్టర్ అండ్ ట్రాన్స్‌మిషన్‌లను అనుసంధానించే కాంపాక్ట్ 3-ఇన్-1 వ్యవస్థను ఉపయోగిస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్, స్నో వంటి నాలుగు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఇందులో ఉంటుంది. ఇది కొంత ఎక్కువ రేంజ్ పొందటానికి అనుమతిస్తుంది.మంచి డిజైన్ కలిగిన ఈ కారు 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే & 10.25-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. వైర్‌లెస్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెగ్మెంట్-లీడింగ్ 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

Jio Aarogya AI Enables Health Screening in Minutes AI Clinic Model Unveiled2
జియో ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026లో.. జియో పెవిలియన్‌ ఎంతో మందికి ఆకట్టుకుంది. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకంగా 'జియో ఆరోగ్య ఏఐ' మరింత ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్. దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చారు.వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఒక వ్యక్తి అద్దం మాదిరిగా ఉన్న ఒక పరికరం ముందు నిలబడితే.. తక్కువ వ్యవధిలోనే వారి కళ్లు, చర్మ రంగు, ముఖ కవళికలు & ఇతర దృశ్య సూచనలను ఆధారంగా తీసుకుని అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత AI సిస్టమ్.. ఈ డేటాను పరిశీలించి ఒక ప్రాథమిక ఆరోగ్య నివేదికను సిద్ధం చేస్తుంది.ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్.దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను… pic.twitter.com/QcblqE5UUF— Sakshi (@SakshiNews) February 17, 2026రోగులు తమ సమస్యలను వాయిస్ AI డాక్టర్‌కు మాటల ద్వారా కూడా వివరించవచ్చు. ఈ వాయిస్ సిస్టమ్ అవసరమైతే మరిన్ని ప్రశ్నలు అడిగి రోగి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ముఖ్యంగా, ఇది అనేక భారతీయ భాషల్లో సంభాషించడం వల్ల భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. దీని ద్వారా గ్రామీణ ప్రజలు సులభంగా తమ ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు.ఏఐ డాక్టర్ రోగుల పరిస్థితిని ముందుగానే గుర్తించి.. అవసరమైతే నిపుణుల వద్దకు రిఫర్ చేస్తుంది. అయితే.. ఈ ఏఐ సిస్టం కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు లేదా చికిత్స అందించదు. దీనిని డిజిటల్ కనెక్టివిటీ ఉన్న ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. పోర్టబుల్ ఎక్స్-రేలు, పోర్టబుల్ ఈసీజీలు వంటి పరికరాలను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Rich Dad Poor Dad Author Robert Kiyosaki About Stock Market Crash3
'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో.. ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటూనే.. భారీ క్రాష్ మొదలైందని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2013లో ప్రచురించిన రిచ్ డాడ్స్ ప్రాఫసీలో.. భవిష్యత్తులో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని హెచ్చరించాను. నేను చెప్పినట్లే.. ఆ పెద్ద ఆర్థిక సంక్షోభం సమీపంలో ఉంది. మార్కెట్ క్రాష్ అనేది కొందరికి ప్రమాదం అయినా.. స్టాక్స్ కొనుగోలు చేయాలని వేచి చూసేవారికి గొప్ప అవకాశం.ఈ సందర్భంగా కియోసాకి.. గోల్డ్, సిల్వర్ గురించి చెబుతూనే బిట్‌కాయిన్, ఎథెరియం గురించి కూడా పేర్కొన్నారు. బిట్‌కాయిన్ విలువ తగ్గిపోతున్నప్పుడు, నేను మరింత కొనుగోలు చేస్తానని అన్నారు. నా దృష్టిలో ఇవే (బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం) నిజమైన ఆస్తులని పేర్కొన్నారు.I Am Warning You: In Rich Dad’s Prophecy published 2013 I warned of the biggest stock market crash in history still coming.That giant crash is now imminent.The good news is those of you who followed my rich dad’s warning and prepared….the coming crash will make you richer…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 17, 2026ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడూ నష్టాలనే కాకుండా.. అవకాశాలను అందిస్తుంది. భయపడే వారు నష్టపోవచ్చు, కానీ ఆర్థిక జ్ఞానం కలిగి, దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం.. తప్పకుండా ధనవంతులు అవుతారు. ఎప్పుడైతే మార్కెట్ నష్టాలను చవి చూస్తుందో.. చాలామంది తమ స్టాక్ అమ్మేయడానికి సిద్ధపడతారు. అలాంటి సమయంలో వాటిని కొనుగోలు చేసేవారు సంపన్నులవుతారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి అనేది ఒక వ్యక్తి ఆర్థిక దృష్టికోణం మాత్రమే. ఇందులో లాభనష్టాలు సహజమే. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరమైతే ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: డేంజర్‌లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా?

CCI Fined Rs 27 Crore To Intel4
ఇంటెల్‌కు రూ.27 కోట్ల జరిమానా!

పోటీని దెబ్బతీసే విధానాలను పాటించినందుకు ఇంటెల్‌ కార్పొరేషన్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) రూ. 27.38 కోట్ల జరిమానా విధించింది. డెస్క్‌టాప్‌లో ఉపయోగించే బాక్స్‌డ్‌ మైక్రోప్రాసెసర్లకు (బీఎంపీ) సంబంధించి భారత్‌కి మాత్రమే పరిమితమయ్యే వారంటీ పాలసీని వర్తింప చేయడం ద్వారా మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కంపెనీ దుర్వినియోగం చేసిందని సీసీఐ పేర్కొంది.చైనా, ఆస్ట్రేలియా, ఇతరత్రా ప్రపంచదేశాల్లో కంపెనీల పాటించే వారంటీ పాలసీలతో పోల్చినప్పుడు భారత్‌లో అమలు చేస్తున్న విధానం వివక్షపూరితమైనదని తెలిపింది. భారత్‌లోని అధీకృత పంపిణీదారు నుంచి కొనుగోలు చేస్తేనే బీఎంపీలకు వారంటీ చెల్లుబాటయ్యేలా, మిగతా ఎక్కడా లేని విధంగా ఇండియాకు మాత్రమే పరిమితమయ్యే విధంగా పాలసీని ఇంటెల్‌ అమలు చేయడం సరికాదంటూ మ్యాట్రిక్స్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ చేసిన ఫిర్యాదుపై సీసీఐ ఈ ఆదేశాలిచ్చింది.

Snapshot latest IPO listings in India5
ఐదు కంపెనీల లిస్టింగ్‌ బాట

రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల కారణంగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతూనే ఉన్నాయి. తాజాగా ఐదు కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఐపీవోల జోరు కొనసాగనుంది. వివరాలు చూద్దాం..కొత్త కేలండర్‌ ఏడాదిలోనూ 2025 బాటలో పబ్లిక్‌ ఇష్యూల జోరు కొనసాగుతోంది. తాజాగా సెబీ ఐదు కంపెనీలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించింది. జాబితాలో విరూపాక్ష ఆర్గానిక్స్, డ్యురోఫ్లెక్స్, ప్రీమియర్‌ ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్, హెక్సాగాన్‌ న్యూట్రిషన్, ఓమ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ చేరాయి. ఈ కంపెనీలన్నీ సెబీకి 2025 సెపె్టంబర్‌– అక్టోబర్‌ కాలంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. కాగా.. 2025లో తొలిసారి దేశీ ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంగా 103 కంపెనీలు రూ. 1.76 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. ఆర్‌అండ్‌డీ ఫార్మాహైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన ఫార్మాస్యూటికల్‌ రంగ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్‌ ఐపీవోకు వస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 740 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అయితే ఐపీవోకు ముందుగా రూ. 148 కోట్ల విలువైన ప్లేస్‌మెంట్‌కు వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 360 కోట్లు సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. మరో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ పరిశోధన– అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) ఆధారిత ఫార్మాస్యూటికల్‌ కంపెనీగా నిలుస్తోంది. సంబంధిత ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీ చేపడుతోంది.పరుపుల తయారీపరుపుల తయారీలో సుప్రసిద్ధమైన డ్యురోఫ్లెక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. దీనిలో భాగంగా రూ. 184 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.25 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ముంబై కంపెనీ 120 సొంత, నిర్వహణా స్టోర్ల ఏర్పాటుకు వెచి్చంచనుంది. అంతేకాకుండా ప్రస్తుత కోకో స్టోర్ల లీజ్, రెంట్, లైసెన్స్‌ ఫీజులతోపాటు తయారీ యూనిట్‌ ఏర్పాటుకు సైతం వినియోగించనుంది. 1963లో ఏర్పాటైన డ్యురోఫ్లెక్స్‌ మార్కెట్‌ వాటా రీత్యా దేశీయంగా పరుపుల తయారీలోని టాప్‌–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఫర్నీచర్‌సహా బెడ్డింగ్‌ సంబంధిత ప్రొడక్టులను సైతం తయారు చేస్తోంది.విస్తరణపై దృష్టివెల్డింగ్‌ కన్జూమబుల్స్‌ పరిశ్రమలో వినియోగించే పౌడర్లు, వైర్ల తయారీ చేపట్టే ప్రీమియర్‌ ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్‌ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 2.25 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు 54 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను హోనడ్, ఖాలాపూర్‌(మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌) వద్ద కొత్తగా వైర్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంతోపాటు.. వాడా, పాల్ఘర్‌(మహారాష్ట్ర)లోగల యూనిట్‌ విస్తరణకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు సైతం వెచ్చించనుంది. వెల్‌నెస్‌ ప్రొడక్టులతోవిభిన్న మైక్రోన్యూట్రియంట్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న హెక్సాగాన్‌ న్యూట్రిషన్‌ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 3.08 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. 1993లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా వివిధ మైక్రోన్యూట్రియంట్‌ ప్రీమిక్స్‌లతోపాటు.. బ్రాండెడ్‌ వెల్‌నెస్, క్లినికల్‌ న్యూట్రిషన్, థరెప్యూటిక్‌ ఫార్ములేషన్స్, వినియోగానికి సిద్ధంగా ఉండే(రెడీ టు యూజ్‌) ఆహారోత్పత్తులను తయారు చేస్తోంది.పెట్టుబడి వ్యయాలకుహైవోల్టేజీ, ఎక్స్‌ట్రా హైవోల్టేజీ విద్యుత్‌ ప్రసార లైన్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసే ఓమ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా 90 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 10 లక్షల షేర్లు ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్లతోపాటు.. భూగర్భ కేబుళ్ల ప్రాజెక్టులు, సమీకృత నిర్వహణా సర్వీసులు తదితర కార్యకలాపాలు సైతం చేపడుతోంది.ఇదీ చదవండి: ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?

Zoho cofounder Sridhar Vembu doesnt believe AI will wipe out jobs6
ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అది మానవ ఉపాధిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్‌ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనల నడుమ, ఈ సాంకేతికతను అర్థం చేసుకునే ప్రక్రియలో తాను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లూయిస్ గరికానో సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక విశ్లేషణాత్మక పోస్ట్‌పై స్పందిస్తూ వెంబు తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆటోమేషన్ అంటే ఉద్యోగం పోవడం కాదుఒక ఉద్యోగంలోని కొన్ని పనులను ఆటోమేట్ చేయడం అంటే, ఆ మొత్తం ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అర్థం కాదని ప్రొఫెసర్ గరికానో తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చాలా ఉద్యోగాల్లో సంక్లిష్టమైన మానవ తీర్పు (హ్యుమన్‌ జడ్జ్‌మెంట్‌), సామాజిక అవగాహన అవసరమని, వీటిని ఏఐ భర్తీ చేయలేదన్నారు. సాఫ్ట్‌వేర్ ఎప్పటికీ ఆ బాధ్యతను తీసుకోలేదని, సంస్థలు మనుషుల అధికారంపైనే ఆధారపడతాయని స్పష్టం చేశారు.శ్రీధర్‌ వెంబు ‘లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్’మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ శ్రీధర్‌ వెంబు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించారు. ‘ముందస్తు అంచనాలకు వెళ్లకుండా అన్ని రకాల వాదనలను (సానుకూల, ప్రతికూల) వినాలి. ప్రారంభంలో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అయితే కొత్త ఆధారాలు లభించినప్పుడు ఆ అభిప్రాయాలను వెంటనే సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాలక్రమేణా అభిప్రాయాలు బలమైన నమ్మకాలుగా మారాలి. కానీ, ఆ నమ్మకంలోకి అహం (ఈగో) చేరకూడదు. అహం కొత్త విషయాలను నేర్చుకోనివ్వదు. కొత్త సాంకేతికతకు సంబంధించి కేవలం నమ్మకం ఉంటే సరిపోదు, దానిపై స్పష్టమైన వైఖరి ఉండాలి’ అన్నారు.‘ఏఐ మా కంపెనీని, ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది’ అని శ్రీధర్‌ వెంబు అన్నారు.The quoted post makes a strong argument that white collar jobs won't go away anytime soon due to AI.In rapidly changing times like this, here is a framework I use:1. Keep an open mind and absorb every kind of information (like the quoted post and the ones that argue the… https://t.co/P0UOemLiXe— Sridhar Vembu (@svembu) February 16, 2026సాంకేతికత పరిష్కరించలేని సమస్యలులండన్‌లో గృహ నిర్మాణ రంగంలోని సమస్యలను ఉదహరిస్తూ కేవలం ఏఐ డాక్యుమెంటేషన్‌ను సిద్ధం చేయగలదు కానీ, రాజకీయ వ్యవస్థను ఒప్పించడం లేదా సామాజిక వివాదాలను పరిష్కరించడం వంటి పనులు చేయలేదని గరికానో పేర్కొన్నారు. ఈ వాదనతో వెంబు ఏకీభవిస్తూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి కామాండ్స్‌ రూపొందించే ముందు ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. మొత్తానికి ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, జవాబుదారీతనం అవసరమైన వైట్ కాలర్ ఉద్యోగాలకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని ఈ టెక్ నిపుణుల విశ్లేషణ సారాంశం.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్‌పై ప్రభావం..

Advertisement
Advertisement
Advertisement