Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Harley Davidson Bike Prices Set to Drop Sharply as Import Duty Hits Zero1
జీరో ట్యాక్స్‌.. భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్‌ బైకుల ధరలు

న్యూఢిల్లీ: భారత్‌–అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుతో యూఎస్‌కు చెందిన ప్రీమియం బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్‌కు భారీ ప్రయోజనం చేకూరనుంది. ట్రేడ్‌ డీల్‌లో భాగంగా 800–1600 సీసీతో పాటు అంతకు మించి ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన అమెరికా మోటార్స్‌సైకిళ్లపై దిగుమతి సుంకం సున్నా(జీరో టాక్స్‌) శాతానికి తగ్గాయి. దీంతో తమ కంపెనీకి భారీ ఊరట లభించిందని హార్లే డేవిడ్సన్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.‘‘ఒప్పందం అమలు రోజు నుంచి మోటార్‌ సైకిళ్లపై ఎలాంటి సుంకాలు ఉండవు. ప్రీమియం బైక్‌ల విభాగంలో భారత్‌ చిన్న మార్కెట్‌ అయినప్పటికీ, ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుంది’’ అన్నారు. హార్లే డేవిడ్సన్‌కు గతేడాదిలోనూ ప్రభుత్వం ఊరట కల్పించింది. 1,600 సీసీ వరకు ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని 50 %నుంచి 40 శాతానికి, 1,600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న కస్టమ్స్‌ డ్యూటీ 50% నుంచి 30 శాతానికి సవరించింది.భారత్‌–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ డీల్‌ 2026 మార్చిలో చట్టబద్దం కానుంది. తాజాగా ట్రేడ్‌ డీల్‌ భాగంగా అమెరికా నుంచి దిగుమతయ్యే 3000 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన పెట్రోల్‌ కార్లు, 2500 సీసీ ఇంజిన్‌ కలిగిన డిజిల్‌ కార్లపై సుంకాలను భారత్‌ తగ్గించింది.

SEBI Proposes Key Regulatory Changes for REITs and InvITs2
రీట్, ఇన్విట్‌ల్లో పెట్టుబడులు.. సెబీ కీలక మార్పులు

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌)ల నియంత్రణల్లో కీలక మార్పులను సెబీ ప్రతిపాదించింది. వీటిల్లో లిక్విడ్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు అనుమతించడం ఇందులో కీలకమైనది. ఇతర పెట్టుబడుల’ కింద 20 శాతం పరిమితికి లోబడి లిక్విడ్‌ ఫండ్స్‌ రీట్‌లు, ఇన్విట్‌లలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.ఇన్విట్‌లు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్‌పీవీలు)ను వాటి రాయితీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగించేందుకు అనుమతించనుంది. ప్రైవేటు ఇన్విట్‌లు తమ ఆస్తుల్లో 10 శాతం వరకు గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సైతం ప్రతిపాదించింది. అలాగే ఇన్విట్‌ల ఆస్తుల విలువలో నికర రుణ భారం 49 శాతం మించినప్పుడు, తాజా రుణాల వినియోగ పరిధినీ విస్తృతం చేయాలన్నది మరో ప్రతిపాదన.ఆస్తుల కొనుగోలు, అభివృద్ధి కోసమే కాకుండా... మూలధన విస్తరణ, ఆస్తుల నిర్వహణ కోసం సైతం ఇన్విట్‌లు తాజా రుణ సమీకరణకు అనుమతించనుంది. ఇందుకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. దీనిపై ఈ నెల 26 వరకు అభిప్రాయాలు తెలియజేయాలని సెబీ కోరింది.

AI to Bring Transformational Changes in Tech Services NASSCOM3
ఏఐతో టెక్‌ సర్వీసుల్లో సరికొత్త మార్పులు

న్యూఢిల్లీ: అధునాతన కృత్రిమ మేథ (ఏఐ) రాకతో దేశీ టెక్నాలజీ సరీ్వసుల రంగంలో విపత్కర పరిణామాలు ఉంటాయన్న ఆందోళనలను ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ తోసిపుచ్చింది. ఇది పరిశ్రమను సరికొత్తగా తీర్చిదిద్దుతుందని పేర్కొంది. దేశీ ఐటీ కంపెనీలు సంక్లిష్టమైన టెక్నాలజీలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తుంటాయని వివరించింది.ఏఐ నుంచి సిసలైన ప్రయోజనాలు పొందాలంటే మనుషులతో కూడా సమన్వయం చేసుకోవడం కీలకంగా ఉంటుందని తెలిపింది. వారికి పరిశ్రమపైన, నిర్దిష్ట వ్యాపారాలపైన లోతైన అవగాహన అవసరమని నాస్కామ్‌ పేర్కొంది. ఏఐని ప్రయోగాత్మకంగా పరీక్షించడం నుంచి భారీ స్థాయిలో వినియోగంలోకి తేవడం వైపు మళ్లించడంలో టెక్నాలజీ సేవల సంస్థలు తోడ్పడతాయని వివరించింది.

Telecom Companies AGR Dues Touch Rs 1 77 Lakh Crore as of FY254
రిలయన్స్‌ జియో రూ. 1,984 కోట్లు బాకీ..

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) నాటికి టెలికం కంపెనీలు సవరించిన స్థూల రాబడిపరంగా (ఏజీఆర్‌) ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలు రూ. 1.77 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపయిన వొడాఫోన్‌ ఐడియా రూ. 89,952 కోట్లు, భారతి గ్రూప్‌ రూ. 51,091 కోట్లు, టాటా గ్రూప్‌ రూ. 20,426 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ. 14,462 కోట్లు, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ రూ. 1,984 కోట్లు కట్టాల్సి ఉంది.పార్లమెంటుకు సమర్పించిన అధికారిక డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వొడాఫోన్‌ ఐడియా కేసులో 2006–2018 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో కట్టాల్సిన బాకీలను రూ. 87,695 కోట్ల స్థాయికి పరిమితం చేసి, చెల్లించేందుకు మరింత గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే.

Open Plot Auctions Fetch Rs 56 Crore for Rajiv Swagruha Corporation 5
స్వగృహ ప్లాట్లకు భలే డిమాండ్‌.. రూ. 56 కోట్లు ఆదాయం

సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టుకు సమీపంలో బహదూర్‌పల్లి, కుర్మల్‌ గూడ ప్రాంతాల్లోని ఓపెన్‌ ప్లాట్ల విక్రయంతో రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్‌ స్వగహ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.పి. గౌతం తెలిపారు. శనివారం బాటసింగారంలో నిర్వహించిన వేలంలో 70 ప్లాట్లను విక్రయించారు. చదరపు గజం కనీస ధర (అప్‌సెట్‌ ప్రైస్‌) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, 43 వేలు, 41 వేలకు కొనుగోలు చేశారు. మొత్తమ్మీద సగటున చదరపు గజానికి రూ.31 వేలకు అమ్ముడు పోయాయి.కాగా.. ఆదివారం తొర్రూర్‌ లేఅవుట్‌లోని 35 ఓపెన్‌ ప్లాట్లకు, బహదూర్‌ పల్లి, కుర్మల్‌ గూడలోని మరో 32 ఓపెన్‌ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్లను లాటరీ ప్రక్రియలో కేటాయించడంతో రాజీవ్‌ స్వగహ కార్పొరేషన్‌కు రూ.11 కోట్ల ఆదాయం సమకూరింది.ఇదీ చదవండి: శంషాబాద్‌కు కొత్త ఫేమ్‌.. ఇక మరో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌!

India US Interim Agreement framework to support MSMEs6
ఎంఎస్‌ఎంఈలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు

న్యూఢిల్లీ: భారత్‌–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈలు)కు అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్‌ వ్యవస్థల్లో అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం తెలిపారు. వ్యాపారాలు, కస్టమర్లపై వ్యయాల భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. ట్రేడ్‌ డీల్‌తో పశుపోషణ, మసాల, ప్రధాన ఆహార ఉత్పత్తులకు పూర్తి రక్షణ కలి్పంచడంతో భారతీయ రైతుల ఆదాయాలు పెరుగుతాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సాంకేతిక సహకారం ద్వారా కృత్రిమ మేధ (ఏఐ), డేటా, డిజిటల్‌ సేవల కేంద్రంగా భారత్‌ స్థానం మరింత సుస్థిరం అవుతుందని సీతారామన్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement
Advertisement