ప్రధాన వార్తలు
దేశంలో తొలిసారి ఇంటింటి ఆదాయ సర్వే..
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జాతీయ గృహ ఆదాయ సర్వే (NHIS) నిర్వహించనున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ప్రకటించింది. 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చి వరకు ఏడాది పాటు ఈ భారీ సర్వే ప్రక్రియ కొనసాగనుంది.రుజువు-ఆధారిత విధాన రూపకల్పనే లక్ష్యంగణాంక విశ్లేషణలో ఇప్పటివరకు ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తూ, వాస్తవిక డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ‘రుజువు-ఆధారిత విధాన రూపకల్పనను బలోపేతం చేసేందుకు, ప్రజల వాస్తవ ఆదాయాలను లెక్కించేందుకు ఈ సర్వే చేపడుతున్నాం’ అని మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.సర్వే ఎలా చేస్తారంటే.. నమూనా సేకరణ శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కుటుంబాలను ఎంపిక చేసి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు, ఖర్చు చేసే విధానాలపై ఈ సర్వే ద్వారా సమగ్ర విశ్లేషణ చేస్తారు. వినియోగదారుల ధరల సూచిక (CPI) సవరణకు, జాతీయ ఖాతాల తయారీకి, పేదరిక నిర్మూలన విశ్లేషణకు ఈ డేటా వెన్నెముకగా నిలుస్తుంది. ‘గృహ ఆదాయాలను నేరుగా సర్వే చేయడం ద్వారా ఆదాయ అసమానతలు, ఉత్పత్తి వనరుల మధ్య ఉన్న వ్యత్యాసాలను లోతుగా విశ్లేషించే అవకాశం కలుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.ప్రపంచ దేశాల సరసన భారత్ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గృహ ఆదాయ డేటాను సేకరిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ విభాగంలో చేరడం ద్వారా ఆర్థిక గణాంకాలలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోనుంది.ఇప్పటికే ముగిసిన 'ప్రీ-టెస్టింగ్'ఈ ప్రతిష్టాత్మక సర్వే కోసం ఐఎంఎఫ్ (IMF) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుర్జిత్ భల్లా నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు, సర్వే ప్రశ్నావళి సామర్థ్యాన్ని పరీక్షించడానికి 2025 ఆగస్టు 4 నుండి 8 వరకు ముందస్తు పరీక్షలు (Pre-testing) నిర్వహించారు.హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు సహా 15 ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఈ ట్రయల్స్ జరిగాయి. ధనిక, పేద వర్గాలను కవర్ చేసేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ క్షేత్రస్థాయి కసరత్తులు పూర్తి చేశారు. ప్రభుత్వం చేపట్టబోయే ఈ సరికొత్త సర్వే ద్వారా సామాజిక-ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!
సాంకేతిక ప్రపంచంలో ఏఐ విప్లవం రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం ఇంటర్నెట్లో చదివే సమాచారంలో సగానికి పైగా కంటెంట్ మనుషులు రాసింది కాదు. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2026 వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.50 ప్లస్ వరకు..కేవలం మూడేళ్ల కాలంలో అంతర్జాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నివేదిక ప్రకారం, 2025 ప్రారంభం నుంచి ఇంటర్నెట్లో కొత్తగా పుట్టుకొస్తున్న కంటెంట్లో 51.72 శాతం వాటా ఏఐ సొంతం చేసుకోగా మానవ మేధస్సుతో సృష్టించిన కంటెంట్ 48.28 శాతానికి పరిమితమైంది.నవంబర్ 2022: చాట్జీపీటీ రాకతో ఏఐ కంటెంట్ ప్రస్థానం దాదాపు సున్నా వద్ద మొదలైంది.2023-24: అధునాతన టూల్స్ అందుబాటులోకి రావడంతో గ్రాఫ్ వేగంగా పెరిగింది.2025-26: మొదటిసారిగా మానవ కంటెంట్ను ఏఐ అధిగమించింది.ఎందుకీ పరుగు?కంపెనీలు, క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు ఏఐ వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒక రచయిత గంటల తరబడి శ్రమించి రాసే వ్యాసాన్ని ఏఐ సెకన్ల వ్యవధిలో సిద్ధం చేస్తోంది. వెబ్సైట్లకు అవసరమైన భారీ సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. పెద్ద సంఖ్యలో కంటెంట్ రైటర్లను నియమించుకోవడం కంటే ఏఐ టూల్స్ వాడటం సంస్థలకు ఆర్థికంగా లాభదాయకంగా మారింది. ముఖ్యంగా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లు, ఎస్ఈఓ పేజీలు, సాధారణ ఈమెయిల్స్ వంటి వాటికి ఇప్పుడు ఏఐకే ప్రాధాన్యత ఇస్తున్నారు.విస్తరిస్తున్న ఏఐ సామ్రాజ్యంకేవలం బ్లాగులకే పరిమితం కాకుండా ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ విస్తరించింది. మార్కెటింగ్ కాపీలు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ల నుంచి ఫేస్బుక్ యాడ్స్ వరకు, కస్టమర్ సపోర్ట్ విభాగంలో రోబోటిక్ మెసేజ్లతోపాటు సహజంగా అనిపించే ఏఐ సమాధానాలు.. ఇలా చాలా వాటికి ఏఐ టూల్స్ వాడుతున్నారు.మానవ మేధస్సు పాత్ర ముగిసినట్లేనా?ఏఐ ఆధిపత్యం పెరిగినప్పటికీ మానవ పర్యవేక్షణ ఇంకా కీలకంగానే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వస్తున్న కంటెంట్లో ఎక్కువ భాగం ఒక మిశ్రమ ప్రక్రియ (హైబ్రిడ్ ప్రాసెస్). ఏఐ ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేస్తే మనుషులు దాన్ని ఎడిట్ చేయడం, వాస్తవాలను తనిఖీ చేయడం, భాషాలోపాలు సరిదిద్దడం వంటి పనులు చేస్తున్నారు. కంటెంట్లో సృజనాత్మకత, భావోద్వేగాల కోసం మనిషి అవసరం ఇంకా ఉందని సాంకేతిక నిపుణుల విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
మాక్ యూజర్ల కోసం పెర్ప్లెక్సిటీ ‘పర్సనల్ కంప్యూటర్’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ‘పెర్ప్లెక్సిటీ’ టెక్ ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేపింది. మాక్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘పర్సనల్ కంప్యూటర్’ అనే సరికొత్త సాఫ్ట్వేర్ను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఇది కంప్యూటర్లోని ఫైళ్లు, అప్లికేషన్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఒక ఏఐ ఏజెంట్ అని కంపెనీ తెలిపింది.మల్టీ-మోడల్ ఆర్కెస్ట్రేషన్ఫిబ్రవరిలో కంపెనీ పరిచయం చేసిన ‘పెర్ప్లెక్సిటీ కంప్యూటర్’ అధునాతన ఆర్కెస్ట్రేషన్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా యూజర్ల పర్సనల్ కంప్యూటర్లలో తీసుకువచ్చారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కంప్యూటర్లోని లోకల్ ఫైల్స్, ఇన్స్టాల్ చేసిన యాప్లు, వెబ్ కంటెంట్ను ఒకే చోట అనుసంధానిస్తుంది. సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఏకకాలంలో మల్టీ ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించుతుంది.మాక్ మినీతో నిరంతర సేవలుఈ సాఫ్ట్వేర్ అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని ‘రిమోట్ యాక్సెస్’ సామర్థ్యం. ఒకవేళ మీరు మాక్ మినీలో ఈ సాఫ్ట్వేర్ను రన్ చేస్తుంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఇంటి బయట ఉన్నప్పుడు కూడా మీ స్మార్ట్ఫోన్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీ కంప్యూటర్లోని పనులను పూర్తి చేయవచ్చు లేదా పర్యవేక్షించవచ్చు.పర్సనల్ కంప్యూటర్ చేసే పనులు ఇవే..ఈ ఏఐ అసిస్టెంట్ కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా క్రియేటివ్ పనులను కూడా చక్కబెడుతుంది.మీ 'టూ-డూ లిస్ట్' సమీక్షించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తుంది. యాపిల్ నోట్స్ లేదా మెసేజెస్ వంటి యాప్లను తెరిచి మీకు కావాల్సిన సమాచారాన్ని పంపడం లేదా నోట్స్ సిద్ధం చేయడం వంటివి చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఫోల్డర్లను క్రమబద్ధీకరించడం, ఫైళ్లకు అర్థవంతమైన పేర్లు పెట్టడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేస్తుంది.మొబైల్ నుంచే వాయిస్ ద్వారా పనులను పూర్తి చేసే వెసులుబాటు ఉంది.భద్రతే ప్రాధాన్యంవినియోగదారుల డేటా భద్రత విషయంలో పెర్ప్లెక్సిటీ కఠినమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ‘పర్సనల్ కంప్యూటర్ అప్లికేషన్ అత్యంత సురక్షితమైన ‘శాండ్బాక్స్’ వాతావరణంలో పనిచేస్తుంది. ఇది చేసే ప్రతి చర్యను యూజర్లు పర్యవేక్షించవచ్చు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మార్పులు చేసే సదుపాయం కూడా ఉంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.ప్రస్తుతానికి ఈ ‘పర్సనల్ కంప్యూటర్’ ఫీచర్ పెర్ప్లెక్సిటీ ప్రో చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వెయిట్లిస్ట్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
దేశంలో నిలిచిన బంగారం, వెండి దిగుమతులు!
దేశీయ బులియన్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారిక అనుమతుల్లో జాప్యం కారణంగా భారతీయ బ్యాంకులు విదేశీ సరఫరాదారుల నుంచి బంగారం, వెండి దిగుమతి ఆర్డర్లను నిలిపివేశాయి. ఇప్పటికే దిగుమతి అయిన టన్నుల కొద్దీ విలువైన లోహాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయాయి. ఈ పరిణామం అటు ఆభరణాల రంగాన్ని, ఇటు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.అసలేం జరిగింది?ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. బంగారం, వెండి దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉన్న బ్యాంకుల జాబితాను ఇందులో పేర్కొంటుంది. గత ఏప్రిల్ 2025లో జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ ప్రారంభంలోనే కొత్త ఉత్తర్వులు వస్తాయని బ్యాంకులు ఆశించినప్పటికీ ఇప్పటివరకు డీజీఎఫ్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం సుమారు 5 టన్నుల బంగారం, 8 టన్నుల వెండి కస్టమ్స్ వద్ద క్లియరెన్స్ కోసం ఉంది.‘మునుపటి సరుకులే క్లియర్ కానప్పుడు కొత్త ఆర్డర్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే బ్యాంకులు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి’ అని ముంబైకి చెందిన ఒక బులియన్ డీలర్ వ్యాఖ్యానించారు.సరఫరా కొరత - అక్షయ తృతీయపై ప్రభావం?ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా, అతిపెద్ద వెండి కొనుగోలుదారుగా ఉన్న భారత్.. తన అవసరాల కోసం పూర్తిగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుత దిగుమతుల నిలిపివేత వల్ల మార్కెట్లో భారీ సరఫరా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా స్పందిస్తూ, ‘త్వరలోనే అక్షయ తృతీయ రాబోతోంది. ఈ సమయంలో దిగుమతులు పునప్రారంభం కాకపోతే మార్కెట్లో ప్రీమియంలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి’ అని కోరారు.వాణిజ్య లోటును తగ్గించే వ్యూహమా?మరోవైపు, ఈ జాప్యం వెనుక ప్రభుత్వం ఆర్థిక వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా కరెన్సీల్లో ఈ ఏడాది రూపాయి బలహీనంగా ఉంది. బంగారం దిగుమతులు తగ్గితే డాలర్లకు డిమాండ్ తగ్గి, రూపాయి విలువ స్థిరపడే అవకాశం ఉంది. ఇరాన్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దీనివల్ల దేశ వాణిజ్య లోటు పెరిగే ప్రమాదం ఉంది. ఈ లోటును సమతుల్యం చేయడానికి విలాస వస్తువులైన బంగారం, వెండి దిగుమతులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నియంత్రిస్తుండవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
29 ఏళ్ల తర్వాత నెట్ఫ్లిక్స్కు బైబై చెప్పిన కోఫౌండర్
ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ను దాదాపు మూడు దశాబ్దాల పాటు అగ్రపథంలో నడిపిన సహ-వ్యవస్థాపకుడు, ప్రస్తుత ఛైర్మన్ రీడ్ హేస్టింగ్స్ (65) తన 29 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆయన సంస్థ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ కీలక పరిణామం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. బలమైన ఆదాయ గణాంకాలు నమోదైనప్పటికీ హేస్టింగ్స్ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తతో సంస్థ షేరు విలువ ఒక్కరోజులో ఏకంగా 9% పడిపోయింది.కీలక సమయంలో వీడ్కోలువార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో కంపెనీ విలీన చర్చలు విఫలమై పోటీ పెరిగిన క్లిష్ట సమయంలో హేస్టింగ్స్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. రాబోయే జూన్ వార్షిక సమావేశంలో ఆయన తిరిగి ఎన్నికలకు నిలబడబోరని, ఇకపై తన సమయాన్ని దాతృత్వ కార్యక్రమాలకు, ఇతర వ్యాపారేతర కార్యకలాపాలకు కేటాయిస్తానని స్పష్టం చేశారు.డీవీడీ అద్దె నుంచి స్ట్రీమింగ్ సామ్రాజ్యం వరకు..1997లో ఒక చిన్న డీవీడీ-బై-మెయిల్ సర్వీస్గా నెట్ఫ్లిక్స్ను ప్రారంభించిన హేస్టింగ్స్ ప్రపంచ వినోద రంగం గమనాన్ని మార్చేశారు. 2011లో ‘క్విక్ స్టార్’ నిర్ణయం వంటి వైఫల్యాలు ఎదురైనా, కొవిడ్ మహమ్మారి వంటి కీలక సమయాల్లో సంస్థను లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన పుస్తకం ‘నో రూల్స్ రూల్స్’లో పేర్కొన్నట్లుగా ఉత్పాదకతతో కూడిన పని సంస్కృతిని ఆయన సృష్టించారు.భవిష్యత్తు లక్ష్యాలుహేస్టింగ్స్ వారసుడు కంపెనీ కో-సీఈఓ గ్రెగ్ పీటర్స్ సంస్థ వృద్ధిపై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక బిలియన్ మంది ప్రేక్షకులను చేరుకునే సామర్థ్యం తమకుందని ఆయన పేర్కొన్నారు. 2026 నాటికి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 3 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. కేవలం సినిమాలు, సిరీస్ లే కాకుండా జపాన్ వరల్డ్ బేస్ బాల్ క్లాసిక్ వంటి ప్రత్యక్ష క్రీడలు, వీడియో పాడ్కాస్ట్లపై సంస్థ దృష్టి పెడుతోంది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
బిగ్ రిలీఫ్.. చల్లబడిన బంగారం ధరల వేడి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
కార్పొరేట్
29 ఏళ్ల తర్వాత నెట్ఫ్లిక్స్కు బైబై చెప్పిన కోఫౌండర్
వేదాంత ఛైర్మన్పై ఎఫ్ఐఆర్ నమోదు
విప్రో బంపర్ బైబ్యాక్!
ఆతిథ్యం, ఎయిర్లైన్స్పై వార్ ఎఫెక్ట్
పీఎఫ్సీలో మెజారిటీ వాటాకు సై
TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!
విప్రో భారీ ఆఫర్: రూ.15,000 కోట్లతో షేర్ల బైబ్యాక్
ఇన్ఫోసిస్కు బ్రాండ్ అంబాసిడర్గా అల్కరాజ్
కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్ఆర్ సైలెంట్!
టీసీఎస్ నాసిక్ కేసు : మరో కీలక నిర్ణయం
ఎన్ఎస్ఈలో రికార్డు స్థాయిలో తగ్గిన యాక్టివ్ ఇన్వెస్టర్లు
స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు, అంతర్జాతీయ భౌగోళి...
బంగారం ధరలు సలసల!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కద...
గోల్డ్ ఈటీఎఫ్లు మెరిశాయ్
న్యూఢిల్లీ: బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గ...
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భ...
ఆటో, టాక్సీ డ్రైవర్లకు అలర్ట్!
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవ...
భారత్ వృద్ధికి... క్రూడ్ కోత!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత...
సామాన్యుడిపై ధరల భారం తప్పదా?
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!
గడిచిన రెండేళ్లుగా ప్రపంచ పారిశ్రామిక, సాంకేతిక రంగాలను సునామీలా చుట్టుముట్టేసిన పదం ‘కృత్రిమ మేధ’ (ఏఐ). డేటా సెంటర్లు, అధునాతన చిప్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) అభివృద్ధి కోసం కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లను వరదలా పారించాయి. అయితే, ఈ ఏఐ విప్లవం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. గతంలో ఉత్సాహంగా పెట్టిన పెట్టుబడులపై ఇన్వెస్టర్లు, కంపెనీల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. అసలు ఇంతటి భారీ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం లభిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను వేధిస్తున్నాయి.పెరుగుతున్న ఉత్కంఠఏఐ రంగంలో మైలురాయిగా భావించే మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఇప్పుడు అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ కలయికగా మొదలైన ఈ బంధం వ్యయ నియంత్రణ వద్దకు వచ్చేసరికి అనిశ్చితి ఎదుర్కొంటోంది. అత్యున్నత స్థాయి ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి, శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు అసాధారణంగా ఉంటోంది. ఒకే మోడల్ను ఒక్కసారి ట్రైన్ చేయడానికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతుండగా రోజువారీ మిలియన్ల కొద్దీ యూజర్ల ప్రశ్నలకు సమాధానమివ్వడం కంపెనీలకు సవాలుగా మారుతుంది. టెక్ దిగ్గజాల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ వ్యయం దీర్ఘకాలంలో భారంగా మారుతుందన్న ఆందోళన మొదలైంది.మౌలిక సదుపాయాలు..ఏఐ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఎన్విడియా, ఏఎండీ వంటి కంపెనీలు ఏటా మరింత శక్తివంతమైన చిప్స్ను విడుదల చేస్తున్నాయి. ఇది సాంకేతిక పురోగతికి శుభసూచకమే అయినా, పెట్టుబడి కోణంలో ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డేటా సెంటర్లు నేటి ఏఐ అవసరాలకు (విద్యుత్, కూలింగ్ వ్యవస్థ) సరిపోవడం లేదు. మౌలిక సదుపాయాలు అనేవి దీర్ఘకాలిక ఆస్తులు. కానీ ఏఐ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వేగంతో మారిపోతోంది. దీనివల్ల భారీ పెట్టుబడులు పెట్టిన ఆస్తులు త్వరగా వాడుకలో లేకుండా పోతున్నాయి.స్కేలింగ్ లాస్ Vs ఎకనామిక్ లాస్ఏఐ అభివృద్ధిలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అది ‘ఎక్కువ డేటా + ఎక్కువ గణన సామర్థ్యం = మెరుగైన ఫలితం’. దీనినే స్కేలింగ్ లాస్ అంటారు. కానీ, ఇప్పుడు ఆర్థిక పరిమితులు ఈ సూత్రాన్ని అడ్డుకుంటున్నాయి. నమూనాలు పెద్దవి అయ్యే కొద్దీ, వాటి పనితీరులో వచ్చే మెరుగుదల తగ్గుతూ ఖర్చు మాత్రం విపరీతంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు మోడల్ కంప్రెషన్, ప్రత్యేక అప్లికేషన్లపై దృష్టి సారిస్తున్నాయి.పెట్టుబడిపై రాబడి ఎప్పుడు?సాంప్రదాయ సాఫ్ట్వేర్ రంగంలో ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే ఎంతమంది వాడుకున్నా అదనపు ఖర్చు నామమాత్రంగానే ఉంటుంది. కానీ ఏఐ అలా కాదు. ప్రతి సెర్చ్, ప్రతి ఇంటరాక్షన్ వెనుక భారీ ఖర్చు ఉంటుంది. దీనిని మానిటైజ్ చేయడం (డబ్బుగా మార్చుకోవడం) ఇంకా ఒక సవాలుగానే ఉంది. సంస్థలకు ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కనిపిస్తుండగా ఖర్చులు మాత్రం తక్షణమే చెల్లించాల్సి వస్తోంది.ఆగిపోని విప్లవంఏఐ విప్లవం ఆగిపోతుందని దీని అర్థం కాదు. కానీ, ఇది ‘అపరిమిత అవకాశాల’ దశ నుంచి ‘పరిమిత ఆప్టిమైజేషన్’ దశకు చేరుకుంటుంది. పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం సాంకేతిక సామర్థ్యాన్ని మాత్రమే చూడటం లేదు, లాభదాయకత కూడా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
Ai+ నోవా 2 అమ్మకాలు ఎప్పుడంటే?
నోవా సిరీస్లో భాగంగా తమ సరికొత్త డివైస్ 'నోవా 2' విక్రయాలు ప్రారంభమైనట్లు Ai+ స్మార్ట్ఫోన్ ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ ఔట్లెట్స్లో అందుబాటులో ఉంటుంది.Ai+ నోవా 2 ధరలు4జీబీ + 64 జీబీ: రూ.8,9996 జీబీ + 128 జీబీ: రూ.10,999మొదటిసారి అప్గ్రేడ్ అవుతున్న లేదా Ai+కి మారుతున్న వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ నోవా 2 ఉండనున్నాయి. ఇది నమ్మకమైన, విశ్వసనీయమైన రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని Ai+ స్మార్ట్ఫోన్ సీఈఓ, నెక్స్ట్ క్వాంటం (NxtQuantum) షిఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మాధవ్ సేథ్ అన్నారు.6000mAh బ్యాటరీతో కూడిన నోవా 2.. స్ట్రీమింగ్, బ్రౌజింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్కు సరిపోయేలా తయారైంది. ఇది నెక్ట్స్ క్వాంటం (NxtQuantum) OSతో కూడిన ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తూ సున్నితమైన, ఆప్టిమైజ్ చేసిన అనుభూతి అందిస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HBM సపోర్ట్తో కూడిన 6.745 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వినియోగదారులు కంటెంట్ను చూస్తున్నా లేదా రోజువారీ పనులు చేస్తున్నా, నోవా 2 స్పష్టమైన విజువల్స్, నిరంతరాయమైన స్క్రోలింగ్ అందిస్తుంది.ఈ స్మార్ట్ఫోన్లో అన్ని రకాల లైటింగ్ పరిస్థితులలోనూ కచ్చితమైన, సహజమైన ఫొటోలు తీయడానికి అనువైన 50MP బ్యాక్ కెమెరా, అలాగే స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP64 రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో కూడిన మెరుగైన నిర్మాణాన్ని నోవా 2 కలిగి ఉంది. ఇది పర్పుల్, గ్రీన్, పింక్, బ్లూ, బ్లాక్ అనే ఐదు విభిన్న రంగులలో లభిస్తుంది.
ఏళ్ల తరబడి ఉన్న యాప్ను నిలిపేసిన మైక్రోసాఫ్ట్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో తక్కువ డేటా, తక్కువ మెమరీతో పనిచేసేలా రూపొందించిన ‘అవుట్లుక్ లైట్’ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026, మే 25వ తేదీ నుంచి ఈ యాప్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ స్పష్టం చేసింది.ఏమిటీ మార్పు? ఎందుకు?ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు, నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్లను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ గతంలో ఈ ‘లైట్’ వెర్షన్ను ప్రవేశపెట్టింది. అయితే, తన మొబైల్ ఈమెయిల్ వ్యూహాన్ని ఏకీకృతం చేయడంలో భాగంగా ఇకపై సింగిల్ ప్లాట్ఫామ్ పైనే దృష్టి సారించాలని కంపెనీ నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ 365 సేవలతో అనుసంధానం, మెరుగైన భద్రతా ఫీచర్లు, వ్యక్తిగత, కార్పొరేట్ వినియోగదారులకు విస్తృతమైన సౌకర్యాలను ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2025 చివరి నుంచే కొత్త డౌన్లోడ్లను నిలిపివేసిన కంపెనీ ఇప్పుడు తుది గడువును ఖరారు చేసింది.వినియోగదారులపై ప్రభావం ఇలా..మే 25 తర్వాత మీ ఫోన్లో యాప్ ఐకాన్ కనిపించినప్పటికీ మెయిల్ బాక్స్ ఓపెన్ కాదు. అంటే, మీరు కొత్త ఈమెయిల్స్ చూడటం, పంపడం లేదా క్యాలెండర్ ఈవెంట్లను నిర్వహించడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్ డేటా అంతా సురక్షితంగా ఉంటుంది. యూజర్లు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రధాన ‘అవుట్లుక్ మొబైల్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.ఇప్పుడేం చేయాలి?అంతరాయం లేని అవుట్లుక్ సర్వీసుల కోసం వినియోగదారులు గడువు ముగిసేలోపే కొన్ని చర్యలు తీసుకోవాలని కంపెనీ సూచించింది. అవుట్లుక్ లైట్ యాప్లోనే అప్గ్రేడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా నేరుగా మెయిన్ యాప్కు వెళ్లవచ్చు. మెయిన్ అవుట్లుక్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పాత మైక్రోసాఫ్ట్ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే సరిపోతుంది. మీ మెయిల్స్, అటాచ్మెంట్లు ఆటోమేటిక్గా సింక్ అవుతాయి. కంపెనీ ఐటీ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు కానీ, తమ ఉద్యోగులు సకాలంలో కొత్త యాప్కు మారేలా అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.సాంకేతికత సర్వీసులు వేగంగా మారుతున్న తరుణంలో ఫీచర్ రిచ్ ప్లాట్ఫామ్ల వైపు మొగ్గు చూపడం ద్వారా యూజర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కాబట్టి, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మెయిన్ యాప్కు మారడం ఉత్తమం.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!
మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా..
సైబర్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఆర్ధిక పరమైన నేరాలకు పాల్పడుతున్నారు. బ్రతికున్న వారి డాక్యుమెంట్స్ అనధికార కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. కొంతకాలం తరువాత అయినా తెలుసుకోవచ్చు. ఒకవేళా చనిపోయినవారి డాక్యుమెంట్స్ ద్వారా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే?..దీనిని దృష్టిలో ఉంచుకుని.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ ఆధార్ డీ యాక్టివేట్ విధానం పరిచయం చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డీయాక్టివేట్ చేయడం ఇలా.. ➤అధికారిక UIDAIలో MyAadhaar పోర్టల్కు వెళ్లండి➤మీ స్వంత ఆధార్ నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయిన తరువాత Report Death of a Family Member అనే ఆప్షన్ ఎంచుకుని.. మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు నమోదు చేయాలి.➤తరువాత డెత్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.➤మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. వివరాలను వెరిఫై చేసిన తర్వాత UIDAI మరణించిన వ్యక్తి ఆధార్ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.Reporting death and deactivation of Aadhaar of a deceased family member helps in preventing the misuse of their Aadhaar.Report death on myAadhaar Portal: https://t.co/4k2YjTw4BM#Aadhaar #UIDAI #ReportDeath #AadhaarDeactivation pic.twitter.com/jELeDN2EIu— Aadhaar (@UIDAI) April 10, 2026
పర్సనల్ ఫైనాన్స్
ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?
ఆరోగ్య బీమా అనేది ఆపద సమయంలో ఆదుకునే ఒక రక్షా కవచం. కానీ, అవసరానికి ఆ కవచం పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి ఖర్చుల కోసం క్లెయిమ్ చేస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక కారణంతో తిరస్కరించడం లేదా సగం డబ్బులే ఇవ్వడం వంటివి సాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారిక గణాంకాలు, నిపుణుల విశ్లేషణతో రూపొందించిన ప్రత్యేక కథనం మీ కోసం..క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడికి ఆరోగ్య బీమా కొండంత అండ. అయితే, క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో పాలసీదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ‘బీమా భరోసా’ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు, 2025 ఆర్థిక సంవత్సరం మొత్తం ఫిర్యాదుల సంఖ్యను మించిపోయాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పోర్టల్లో సుమారు 73,729 ఫిర్యాదులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో దాదాపు 69% ఫిర్యాదులు కేవలం క్లెయిమ్ తిరస్కరణ లేదా జాప్యానికి సంబంధించినవే కావడం గమనార్హం.క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణాలుబీమా సంస్థలు క్లెయిమ్లను తిరస్కరించడానికి నిబంధనలతోపాటు పాలసీదారుల అవగాహన లోపం కూడా ఒక కారణం. క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.ముందస్తు వ్యాధులను చెప్పకపోవడం..పాలసీ తీసుకునేటప్పుడు బీపీ, షుగర్ వంటి పాత జబ్బుల గురించి దాచడం అతిపెద్ద తప్పు. 36 నెలల నిరీక్షణ కాలం (మారటోరియం పీరియడ్) ముగియకముందే ఇలాంటివి బయటపడితే కంపెనీలు క్లెయిమ్ను నేరుగా తిరస్కరిస్తాయి.వెయిటింగ్ పీరియడ్కొత్తగా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు కవరేజీ ఉండదు. సాధారణంగా మొదటి 30 రోజులు (ప్రమాదాలు మినహా) నిర్దిష్ట వ్యాధులకు (హెర్నియా, క్యాటరాక్ట్.. వంటివి) 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోపు క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది.వైద్య అవసరం లేకుండానే ఆసుపత్రిలో చేరికకేవలం డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం లేదా ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం ఉన్న జబ్బులకు ఆసుపత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. కనీసం 24 గంటల ఆసుపత్రి చేరిక తప్పనిసరి (డే కేర్ చికిత్సలు మినహా).కాస్మెటిక్ సర్జరీలు, దంత చికిత్సలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటివి చాలా పాలసీల్లో కవర్ కావు. మీరు పాలసీ తీసుకునే ముందే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.ఆసుపత్రిలో చేరిన 24-48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ విషయంలో డిశ్చార్జ్ అయిన 15-30 రోజుల్లోపు పత్రాలు సమర్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి.పాలసీ కొనే ముందు చెక్ చేయాల్సినవి..పాలసీ డాక్యుమెంట్ అనేది కేవలం కాగితాల కట్ట కాదు, అది ఒక చట్టపరమైన ఒప్పందం. కొనే ముందు కీలక అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి.గది అద్దెపై పరిమితి ఉందో లేదో చూడండి. గది అద్దె పరిమితి మించితే, మొత్తం బిల్లులో కంపెనీ కోత విధిస్తుంది.బిల్లులో కొంత శాతం మీరే చెల్లించాలనే నిబంధన(కో-పేమెంట్) ఉంటే ప్రీమియం తగ్గుతుంది కానీ, క్లెయిమ్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుంది.మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు ఆ బీమా నెట్వర్క్లో ఉన్నాయో లేదో సరిచూసుకోండి.ఒకే ఏడాదిలో ఒకటికంటే ఎక్కువసార్లు అనారోగ్యం పాలైతే బీమా మొత్తం (సమ్ అస్యూర్డ్) తిరిగి రీఛార్జ్ అయ్యే సౌకర్యం ఉందో లేదో చూడండి.ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పే మాటల కంటే పాలసీలోని ‘కీ ఫీచర్స్ డాక్యుమెంట్’ చదవడం ఉత్తమం. ఏదైనా ఫిర్యాదు ఉంటే మొదట బీమా సంస్థకు, అక్కడ పరిష్కారం లభించకపోతే ఐఆర్డీఏఐ ‘బీమా భరోసా’ పోర్టల్ లేదా ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ను ఆశ్రయించవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
దీర్ఘకాలిక ప్రణాళికలకు దక్షిణాది ఓటు
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విషయంలో దక్షిణాది వారు ముందుంటున్నారు. రిటైర్మెంట్ ప్లాన్ల విషయంలో స్పష్టతతో ఉంటున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల మంది ఇందుకు సంబంధించిన ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇఫ్సాస్ ఇండియా భాగస్వామ్యంతో హెచ్డీఎఫ్సీ లైఫ్ నిర్వహించిన రెడీ టు లైఫ్ ఇండెక్స్ సూచీలో దక్షిణాది రెడీనెస్ స్కోరు జాతీయ సగటైన 59కి మించి 60 స్థాయిలో నమోదైంది.ఈ నివేదిక ప్రకారం బీమా భద్రతపై అవగాహన ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. తక్షణ రాబడి ఉండదని, చర్చించడానికి కొంత ఇబ్బందికరమైనదని, ఎటువంటి క్లెయిమ్ తలెత్తకపోతే నిష్ప్రయోజనమనే భావన ఇందుకు కారణమని నివేదికలో వెల్లడైంది. దక్షిణాది వారి పొదుపు ప్రాధాన్యతల్లో పిల్లల చదువు, సొంత ఇల్లు, ఆకస్మిక ప్రణాళికలు మొదలైనవి అగ్రస్థానంలో ఉన్నాయి. అత్యవసర నిధి విషయంలో దక్షిణాది అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ మూడింట ఒక వంతు మంది సదరు నిధి ఒక నెలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళిక, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆరోగ్యం, పదవీ విరమణ వ్యూహాలపై అవగాహన–సన్నద్ధత మధ్య అంతరాలను పూరించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సూచీ సంబంధిత అధ్యయనంలో 25–55 ఏళ్ల వయస్సు గల 1,836 మంది పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇన్వెస్టర్ల మనసంతా ఆ ఇన్వెస్టింగ్పైనే..
ముంబై: పారదర్శకమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఇన్వెస్టింగ్పై మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తమ సంస్థ వివిధ సూచీల ఆధారిత ఫండ్స్ని అందిస్తున్నట్లు వివరించింది.2026 ఫిబ్రవరి 28 నాటికి వీటిలో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 849 కోట్లకు, 100 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 1,983 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2022 జనవరిలో ప్రవేశపెట్టిన నిఫ్టీ నెక్ట్స్ 50 ఫండ్ గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఇవి లార్జ్ క్యాప్ మొదలుకుని వివిధ స్థాయుల్లో మార్కెట్కి ప్రాతినిధ్యం వహించే, భవిష్యత్తులో లీడర్లుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.యాక్టివ్గా మేనేజ్ చేసే ఫండ్స్తో పోలిస్తే, ఇండెక్స్ ఫండ్స్లో హ్యూమన్ ఎర్రర్ (నిర్ణయాల్లో పొరపాట్లు) తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను ఆశించే ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త తరం ఇన్వెస్టర్లు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో (నిర్వహణ వ్యయం) కలిగిన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు.
ఫారమ్ 15 G/H బదులుగా ఫారమ్ 121
కొత్త చట్టం, కొత్త రూల్స్తో ఫారాల నంబర్లు మారడం సహజం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 G/Hలు రెండింటికి బదులుగా ఒకే ఫారమ్ తెచ్చారు. దాని నెంబరు 121గా ఉంది. కొత్త ఫారమ్ ఎందుకు దాఖలు చేయాలి? విషయం పాతదే. మీకు బాగా తెలిసిందే. మీరు సంపాదించిన బ్యాంకు డిపాజిట్లు మీద వడ్డీని ఇతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఇది పన్నుకు గురి అవుతుంది. ఒక ఏడాది ఇటువంటి ఆదాయం రూ.50 వేలు, ఏడాది దాటితే ఈ పరిమితి సీనియర్ సిటిజన్లకు అయితే రూ.1,00,000. బ్యాంకు వాళ్లు దాని మీద టీ.డీ.యస్ రివకరీ చేస్తారు. అందుకని ముందుగా లెక్కలు వేసుకోండి. మీ నికర టాక్స్ బుక్ ఆదాయం 2026–27లో రూ.12,00,000 దాటకపోతే మీకు పన్ను భారం ఏర్పడదు. మీకు ఏర్పడ్డ ఆదాయంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ కూడా ఉండి, మొత్తం ఆదాయం రూ.12,00,000 దాటకపోతే పన్ను భారమే ఉండదు కాబట్టి టీడీఎస్కి గురి కావడం అనవసరం. అందుకని ఈ నెలలోనే 121 ఫారమ్ సబ్మిట్ చేయండి. మీరు బ్యాంకుకి సబ్మిట్ చేయకపోతే బ్యాంకు వారు టీడీఎస్ కట్ చేస్తారు. అందుకని 121 వేయండి.పాత ఫారమ్లు ఇక ఉండవా..? 1.4.2026 నుంచి పాత ఫారమ్లు 15 G/H ఉండవు. రద్దు అయ్యాయి అని అనవచ్చు. గతేడాది వరకు 60 ఏళ్లు దాటిన వారికి ఒక ఫారమ్, దాటని వారికి వేరొక ఫారమ్ అమల్లో ఉండేవి. ఇక నుంచి ఒకే ఫారమ్. దాని నెంబరే 121. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా 121 దాఖలు చేయాలి. టీడీఎస్ ఏ పరిస్థితుల్లో చేస్తారు.. ఫారమ్ 121 దాఖలు చేసినా, చేయకపోయినా డిపాజిట్ హోల్డర్లకి పాన్ లేకపోతే టీడీఎస్ 20% చొప్పున చేస్తారు. పాన్ ఉండి పనిచేయకపోయినా.. ఆధార్తో అనుసంధానం కాకపోయినా 20 % రివకరీ చేస్తారు. బ్యాంకు వడ్డీ రూ.50,000 దాటి, గత రెండు అస్సెస్మెంట్ సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్ను వేయకపోతే టీడీఎస్ 20 శాతం కట్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం ఉంటే .. ఫారమ్ 121 కేవలం పన్ను భారం లేని వారికి మాత్రమే. 87 అ కింద రిబేటు సౌకర్యం/సదుపాయం పొందడానికి క్యాపిటల్ గెయిన్స్ మీద కాకుండా ఏర్పడ్డ ఇతర అన్ని ఆదాయాలకు మాత్రమే. మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఆదాయం ఉంటే ఫారమ్ 121 వేయకూడదు. కింది ఉదాహరణ అర్థం చేసుకోండి .. 2026–27లో మీ ఆదాయం రూ.12,00,000 లోపల ఉంది. ఈ సందర్భంలో పన్ను భారం ఉండదు. రూ.2,00,000 బ్యాంకు వడ్డీ ఇందులో కలిసి ఉండదనుకొండి. 121 ఇచ్చారు. బ్యాంకు వాళ్లు టీడీఎస్ చేయరు. కానీ సంవత్సరాంతంలో మీకొక క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది అనుకోండి. పన్ను భారం ఏర్పడుతుంది. మినహాయింపులు పొందవచ్చు. మినహాయింపులు వద్దనుకుంటే... 87 అ బెనిఫిట్ రద్దు అవుతుంది. అంటే రేట్ల ప్రకారం రూ.12,00,000 మీద క్యాపిటల్ గెయిన్స్ మీద చెల్లించాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఫారమ్ 121 ఇవ్వడం తప్పు అవుతుంది. ఆ తప్పు నుంచి బయట పడాలంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాల్సిందే. అప్పుడు ఫారమ్ 121 ఇవ్వడం సముచితము. రెండు విభిన్న ఆలోచనలు .. ఏ ఆదాయం ఎంత ఉన్నా.. ఫారమ్ 121 ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకు వాళ్లు టీడీఎస్ రికవరీ చేస్తారు. సంవత్సరం చివరన ఆదాయం లెక్కించడం, పన్ను చెల్లించడం.. ఒక వర్గం వాదన ఇది. కాగా మరో వర్గం ఆలోచన ఏమిటంటే ఏ ఆదాయం ఎంత ఉన్నా ఫారమ్ 121 ఇవ్వడం... పన్ను కోత టీడీఎస్ లేకుండా బయటపడటం.. కానీ సంవత్సరాంతంలో ఆదాయం లెక్కించి పన్ను కట్టడం, లేదా రిఫండ్ తెచ్చుకోవడం .. ఇలా కూడా చేయొచ్చు. మీరు ముందుగానే లెక్కలన్నీ వేసి నిర్ణయం తీసుకోండి. ఫారమ్ 121 గురించి సాంకేతిక సమాచారం .. ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్ అ లో అంకెలు మనం నింపాలి. ఫారమ్ ఆ బ్యాంకు వాళ్లు నింపుతారు. అంశాలన్నీ మీకు తెలిసినవే. మొత్తం సంవత్సర ఆదాయం ఎంతో చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్ల ఆదాయపు రిటర్నులు వివరాల ఇవ్వాలి. 121 దాఖలు చేయగానే బ్యాంకు అధికార్లు 26 క్యారెక్టర్లతో అంకెలు/అక్షరాలు కలిపిన నెంబరు ఇస్తారు. ఇందులో బ్యాంకు పేరు, టాన్ నంబరు, ఆర్థిక సంవత్సరం మొదలైనవి ఉంటాయి. ఈ నంబరుతో డిపార్ట్మెంట్ వారు మీ వివరాలన్నింటినీ ట్రాక్ చేస్తారు. దీని వలన దురి్వనియోగం/అనుచితయోగం తగ్గుతుంది. ఈ ఫారమ్లో వివరాలు ఇతర ఫారాలతో లింక్ చేయడం వలన అన్నీ ఫారాల్లోని అంశాలు అప్డేట్ అవుతాయి. తగిన జాగ్రత్త వహించండి.


