Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

BSNL New Recharge Plan 164 Days Validity1
రూ.1000లోపు రీఛార్జ్.. 164 రోజుల వ్యాలిడిటీ!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన కొత్త ప్లాన్ ప్రకారం.. 997 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు.. అపరిమిత కాలింగ్స్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు పంపుకోవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఈ నెల చివరి వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుంది.More days, same price! BSNL Validity Bonus Offer ₹997 plan now gives 164 days instead of 150 days.Plan detail:* Cost: ₹997* Validity: 164 Days (Bonus included!)* Data: 2GB/Day* Calls: UnlimitedDon't miss out—this limited-time bonus till March 31, 2026.Recharge… pic.twitter.com/225a4Cb04P— BSNL India (@BSNLCorporate) March 22, 2026

India Set to Become a Wealthy Nation by 2047 Washington Examiner2
2047 నాటికి సంపన్న దేశంగా భారత్: అమెరికన్ మ్యాగజైన్ సంచలన రిపోర్ట్!

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2047 నాటికి.. సంపన్న దేశంగా మారుతుందని అమెరికా మ్యాగజైన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' నివేదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వాషింగ్టన్ ఎగ్జామినర్ ప్రకారం.. గత రెండు దశాబ్దాలుగా దేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2003 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. సగటు వార్షిక వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 20 ఏళ్లపాటు ఇదే ఊపు కొనసాగితే తలసరి జీడీపీ 15,000 డాలర్లు దాటేస్తుంది. ఇంతటి స్థిరమైన వృద్ధి సాధించడం వల్ల భారత్.. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసిన మధ్య ఆదాయ ట్రాప్‌ను (మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్) దాటేయగలదు.భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన విధానాలు, జనాభా, పెరుగుతున్న టెక్నాలజీ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది. ఇండియాలో 28 సంవత్సరాలు మధ్య వయసున్న వారు.. యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాల కంటే ఎక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశంలో యువకులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ జనాభా ధోరణి బలమైన దేశీయ మార్కెట్‌కు మద్దతునిస్తుందని, తద్వారా వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదించింది.ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి.. విధాన రూపకర్తలు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు వేగవంతమవుతున్నాయి. మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసులను బలోపేతం చేసి, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది.నిరంతర పెట్టుబడులు, కార్మిక శక్తిని విస్తరించడం, సాంకేతికతను స్వీకరించడం ద్వారా దేశాలు అధిక - ఆదాయ హోదాకు మారగలవని చారిత్రక ధోరణులు చూపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు భారతదేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది.వికసిత భారత్ - మోదీ కలభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల. ఈ లక్ష్యం ద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో శక్తివంతంగా మార్చడం ప్రధాన ఉద్దేశ్యం.వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చేయడం. గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాలి. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం.మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడం వంటివి కూడా ఇందులో ప్రధాన లక్ష్యాలు.ఇదీ చదవండి: బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..

Woman Earning Rs 2 5 Lakh Says She Was Happiest At Rs 150003
రూ. 15వేలు జీతంలో ఆనందం.. రూ. 2.5లక్షల్లో అసంతృప్తి!

జీతం ఎక్కువ వచ్చే జాబ్ చేస్తే.. సంతోషంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అది ఏ మాత్రం నిజం కాదంటూ, వచ్చే జీతానికి సంతోషానికి సంబంధం ఉండదని ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''నాకు నిజంగా ఆనందం కలిగింది.. నెలకు 15,000 రూపాయల జీతం పొందిన సమయంలోనే. కానీ ఇప్పుడు నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ, సంతృప్తి తగ్గిపోయింది'' అని ఎక్స్ యూజర్ సాక్షి వెల్లడించారు. ఇది డబ్బు ఎక్కువ కావడం వల్ల కాదు, ఇతరుల జీవన స్థితులతో తనను పోల్చుకోవడం వల్ల ఏర్పడిన అసంతృప్తి అని ఆమె పేర్కొన్నారు.ఉద్యోగం వదిలిన తర్వాత కొన్ని నెలలు జీతం లేకపోవడం వల్ల ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా, అది నిజాన్ని గ్రహింపజేసింది. నిజమైన సంతోషం అంటే ఎక్కువ జీతం పొందడంలో కాదు, మనం నిజంగా ఇష్టపడే పని చేయడంలో ఉందని. ఇప్పుడు నేను ఇతరుల గురించి ఆలోచించకుండా పనిచేస్తాను. ఆమె అభిప్రాయం ప్రకారం, “పెద్ద జీతం లేదా తక్కువ జీతం కాదు, జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నావో అనేది ముఖ్యం.At a salary of:15K per month, I was the happiest.150K per month, I felt it was less - I deserved more.250K per month, I felt I was doing well, but after seeing others, it again felt less.I realised it was never about the salary.It was the comparison that created…— Sakshi (@Sakshi50038) March 20, 2026

Skoda Kushaq Facelift Launched Know The Details Here4
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది: ధర ఎంతంటే?

స్కోడా కంపెనీ.. అప్‌డేటెడ్ కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ లేటెస్ట్ మిడ్-సైజ్ ఎస్యూవీ డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లలో గణనీయమైన అప్‌గ్రేడ్‌లను పొందింది. అదే సమయంలో కంపెనీ సేఫ్టీకి కూడా ప్రాధాన్యత కల్పించింది.హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే.. కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌.. క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో అనే ఐదు ట్రిమ్‌లలో 1.0 TSI, 1.5 TSI టర్బో పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది.కుషాక్ ఫేస్‌లిఫ్ట్ 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌ కూడా పొందింది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ మౌంట్‌లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.మెకానికల్ పరంగా.. అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే, మునుపటి 6-స్పీడ్ యూనిట్ స్థానంలో 1.0-లీటర్ TSI ఇంజిన్‌తో కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం. ఈ ఇంజిన్ 115bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. 1.5-లీటర్ TSI ఇంజన్ 147bhp, 250Nm టార్క్ అందిస్తుంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యూనిట్ ఉంటుంది. మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఇప్పుడు దీనికి వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

Will the Price of Gold Fall Drastically Expert Openion5
బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..

ఎప్పుడైనా ప్రపంచ యుద్దాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఈ సమయంలో బంగారం, వెండి వంటి లోహాలకు విలువ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం.. గోల్డ్, సిల్వర్ రేటు దీనికి విరుద్ధంగా ఉంది.అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం జరుగుతున్నా సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణం.. డాలర్ విలువ బలపడటమే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో.. ఆ సమయంలో పసిడికి డిమాండ్ కొంత తగ్గుతుంది. అంతే కాకుండా.. బంగారం రేటు పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తారు. కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు పతనమవుతాయి.వారం రోజుల్లో రూ.13 వేలు డౌన్!బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.బంగారం ధరలు తగ్గుతాయా?బంగారం ధరలు తగ్గుతాయా? అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుదల, తగ్గుదల అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల మాదిరిగానే.. ధరలు తగ్గితే, గోల్డ్ రేటు పతనమవుతుందని చెప్పవచ్చు. కానీ కియోసాకి వంటి నిపుణులు బంగారం ధర పెరుగుతుందనే చెబుతున్నారు.

Stay Cool This Summer with Smart Gadgets6
హీట్‌కు హాట్ సొల్యూషన్: ఇదిగో కూల్ గ్యాడ్జెట్లు!

వేసవి వచ్చిందంటే బయట అడుగు పెడితే చాలు, సూర్యుడు తన వేడి గాలిని ముఖంపై కొడుతూ ‘ఇంట్లోనే ఉండు’ అని హెచ్చరిస్తూనే ఉంటాడు. కాని, టెక్నాలజీ తెచ్చిన ఈ చిన్న గ్యాడ్జెట్లు, సూర్యుడు తన వేడి ఎంత పెరిగినా ‘ఊఫ్‌’ నుంచి ‘ఆహా!’గా మార్చేస్తాయి.ఫోనుకి బుజ్జి ఏసీ!సమ్మర్‌లో గేమ్స్‌ ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు మీ ఫోన్‌ వేడి పెనంలా మారిపోతుందా? అయితే మీ ఫోన్ చల్లబరచడానికి వచ్చేసింది ఈ మొబైల్‌ కూలింగ్‌ ప్యాడ్‌! ఇది మామూలు ఫ్యాన్‌ కాదు, ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్‌ టెక్నాలజీ మీ ఫోన్‌ టెంపరేచర్‌ను కేవలం సెకన్లలోనే తగ్గించేస్తుంది. అంటే బయట ఎండలు మండిపోతున్నా, మీ ఫోన్‌ మాత్రం వింటర్‌ వాతావరణంలో ఉన్నట్టే చిల్‌ అవుతుంది! దీనికి ఉన్న ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫోన్‌ ఎంత చల్లగా ఉందో ఎప్పటికప్పుడు చూపిస్తుంది. పైగా ఇందులోని మ్యాగ్నెట్‌ ఫీచర్‌ వల్ల ఫోన్‌ వెనుక సులభంగా అతుక్కుపోతుంది, మీరు గంటల తరబడి గేమింగ్‌ చేసినా లేదా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసినా ఫోన్‌ హ్యాంగ్‌ అవ్వదు, బ్యాటరీ కూడా వేడెక్కదు. ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌.. ఏదైనా సరే, సెట్‌ అయిపోతుంది. ధర రూ. 700 మాత్రమే!మ్యాజిక్‌ గ్లాసెస్‌!ఫోన్‌ చూసి చూసి మీ కళ్లు ‘ఫ్రై’ అయిపోతున్నాయా? బయటకి వెళ్దామంటే సూర్యుడు సెగలతో సినిమా చూపిస్తున్నాడా? ఇలా ఒకేసారి కళ్లకు రక్షణ, మైండ్‌కి రిలాక్సేషన్‌ ఇచ్చేందుకు వచ్చేసింది ఈ స్మార్ట్‌ బ్లూటూత్‌ గ్లాసెస్‌! ఇందులో ఇన్‌–బిల్ట్‌ స్పీకర్లు కూడా ఉన్నాయి. అంటే మీరు కళ్లజోడు పెట్టుకుంటే చాలు, పక్కన ఎవరికీ వినిపించకుండా మీ చెవుల్లో మ్యూజిక్‌ వినిపిస్తుంది.ఫోన్‌ తీయకుండానే కాల్స్‌ కూడా మాట్లేడేయొచ్చు. సాంగ్స్‌ మార్చుకోవచ్చు. ఇక ఇందులో ఉన్న ఫోటోక్రోమిక్‌ లెన్సులు ఇంట్లో ఉన్నప్పుడు బ్లూ లైట్‌ నుంచి, అదే అడుగు బయట పెట్టగానే సెకన్లలో కూలింగ్‌ గ్లాసెస్‌లా మారి కళ్లకు రక్షణ ఇస్తాయి. పైగా వర్షం పడినా, చెమట పట్టినా ఏమీ కాకుండా దీనికి వాటర్‌ రెసిస్టెన్స్ కూడా ఉంది. ధర రూ. 1,200 మాత్రమే!మంచు కురిపించే గొడుగు!బయట ఎండలు మండిపోతుంటే.. గొడుగు పట్టుకున్నా సెగలు తగులుతూ చిరాగ్గా ఉందా? అయితే మీ పర్సనల్‌ ఏసీలాంటి ఈ బీఎన్‌ఎఫ్‌ సన్‌ అంబ్రెల్లాని చూస్తే మీరు ఫిదా అయిపోతారు! దీని లోపల ఒక బుజ్జి ఫ్యాన్‌ ఉండటమే కాకుండా, ఇది చల్లని నీటిని మంచులా చల్లుతుంది. అంటే ఎండలో వెళ్తున్నా, మీ గొడుగు కింద ఒక చిన్న మంచువాన కురుస్తుంది. కేవలం నాలుగు ఏఏ బ్యాటరీలు ఉంటే చాలు.. గాలికి తిరగబడని విండ్‌ప్రూఫ్‌ డిజైన్‌తో, అటు గాలిని.. ఇటు మంచు జల్లులను మీకు అందిస్తుంది. ఫ్రెండ్స్‌కి గిఫ్ట్‌ ఇవ్వడానికి కూడా ఇది ఒక అదిరిపోయే ఆప్షన్‌. ధర రూ. 5,900.

Advertisement
Advertisement
Advertisement