ప్రధాన వార్తలు
ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా?
ఉమాంగ్ యాప్ గురించి చాలా మందికి తెలుసు. కానీ అందులో ఏకంగా 2400 కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని, అవి చాలా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్ యాప్ను యూజర్లకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. కొత్త సర్వీసులు ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే 2400 సేవలను అందిస్తోంది. ఇప్పుడు యూజర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఉన్నచోటనే తమకు కావలసిన సేవలను పొందవచ్చు.ఉమాంగ్ యాప్ వేలాది కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సేవలను ఒకే వేదికపైకి చేర్చి, మల్టిపుల్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. 2026 నాటికి ఈ యాప్ గూగుల్ ప్లేలో 100 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను, లక్షలాది మంది రిజిస్ట్రేషన్ వినియోగదారులను, బిలియన్ల కొద్దీ సంచిత లావాదేవీలను కలిగి ఉంది.UMANG యాప్ ఆండ్రాయిడ్, iOS, వెబ్, SMS, KaiOS ద్వారా ఫీచర్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఇది బహుళ భాషలకు, బయోమెట్రిక్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇది సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. గ్యాస్ బుకింగ్, ఈపీఎఫ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నో సేవలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) సంయుక్తంగా డిజిటల్ ఇండియా చొరవ కింద 2017లో UMANG యాప్ను (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) ప్రారంభించాయి. ఆ తరువాత వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్ఫారమ్గా UMANG ప్లాట్ఫామ్ అభివృద్ధి చెందింది. ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!
బ్యాంక్ హాలిడేస్: ఐదు రోజుల్లో నాలుగు రోజులు సెలవు!
మార్చి నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇది ఆర్ధిక లావాదేవీలు జరిపేవాళ్లకు కొంత నిరాశను కలిగించింది. ఆర్థిక లావాదేవీల పరంగా ఎంతో కీలకమైన మార్చినెలలో ఇలా వరుస సెలవులు రావడం వల్ల ఏదైనా పెండింగ్ పడే అవకాశం ఉందేమో అని చాలామంది భావిస్తున్నారు.➤మార్చి 27:శ్రీరామనవమి కారణంగా బ్యాంకులకు సెలవు. ప్రత్యేకించి మిజోరం,మహారాష్ట్ర,కర్ణాటక,తమిళనాడు,ఉత్తరాఖాండ్,రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్,చంఢీఘర్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్,ముంబై, నాగ్పూర్,జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.➤ మార్చి 28: నాలుగో శనివారం సాధారణ సెలవుదినం కావడంతో, భారతదేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం.➤ మార్చి 29: ఆదివారం సెలవుదినం కావడంతో.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు క్లోజ్ అవుతాయి.➤ మార్చి 31: మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని బ్యాంకులు పనిచేయవు.అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు.
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి ఎంతంటే?
భారత్కు మెరుగైన వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) 7.1 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. పూర్వపు అంచనా కంటే 0.20 శాతం అధికం కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సైతం గతంలో పేర్కొన్న అంచనాలతో పోల్చితే 0.4 శాతం పెంచి 7.6 శాతం వృద్ధి నమోదవుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది.ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొంది. అయితే మధ్యప్రాచ్యంలో ఘర్షణ వాతావరణం కారణంగా అధిక ఇంధన ధరలు ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడి కలిగించొచ్చని అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరమైన అనిశ్చితులు కారణంగా ఏర్పడే రిస్కులు భారత్పై ప్రభావం చూపించొచ్చని (కమోడిటీ ధరలు, ఎగుమతులు, పెట్టుబడుల రాకపై) పేర్కొంది.చమురు ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగితే భారత్లో విక్రయ ధరలు సైతం పెరుగుతాయని అంచనా వేసింది. అయితే ధరల పెరుగుదల భారాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులపై మోపే అవకాశం లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం 2026–27లో 4.3 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. అధిక చమురు ధరలు వాణిజ్యలోటు పెరిగేందుకు కారణం కావొచ్చంటూ.. సేవల ఎగుమతుల రూపంలో మిగులు ఈ లోటును పరిమితం చేస్తుందని వివరించింది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు చేయకుండా, స్థిరంగా కొనసాగించొచ్చని అంచనా వేసింది.చమురు ధరల సెగలు.. జూన్ త్రైమాసికంలో బ్రెంట్ బ్యారెల్కు సగటున 92 డాలర్ల స్థాయిలో, 2026లో సగటున 80 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే జూన్ త్రైమాసికంలో బ్రెంట్ చమురు బ్యారెల్కు 185 డాలర్ల స్థాయికి, 2026 వ్యాప్తంగా 130 డాలర్ల స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదని తెలిపింది.
హీరో విడా KKR ఎడిషన్: దీని స్పెషాలిటీ ఏంటంటే?
హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగమైన విడా.. కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో తన భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని, నైట్స్ అన్ప్లగ్డ్ 3.0 ఈవెంట్లో VX2 ప్లస్ KKR లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది సాధారణ విడా కంటే భిన్నంగా నైట్ పర్పుల్, గోల్డ్ కలర్ పొందింది.KKR సాధించిన మూడు ఛాంపియన్షిప్ విజయాలకు ప్రతీకగా మూడు యాక్సెంట్ మార్కులను ఈ బైకులో చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో కూడిన ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ హెడ్ల్యాంప్, ముందు - వెనుక భాగాలలో ప్రత్యేకమైన ఎల్ఈడీ డీఆర్ఎల్ పొందుతుంది.VX2 ప్లస్ KKR లిమిటెడ్ డిజైన్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి ఇందులో అదే 3.4kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది పూర్తి ఛార్జ్పై 142 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఎంపిక చేసిన విడా డీలర్షిప్లలో అందుబాటులో ఉంటుంది. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
నకిలీ ట్రేడింగ్ యాప్లకు సెబీ చెక్
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రక్షణే ధ్యేయంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరో ముందడుగు వేసింది. దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేస్తూ గూగుల్ ప్లే స్టోర్లోని స్టాక్ ట్రేడింగ్ యాప్ల కోసం ‘వెరిఫైడ్’ లేబుల్ను సెబీ అధికారికంగా ప్రారంభించింది. ఈ నూతన వ్యవస్థ ద్వారా రిటైల్ పెట్టుబడిదారులు నిజమైన, మోసపూరిత యాప్ల మధ్య తేడాను సులభంగా గుర్తించే అవకాశం లభించనుంది.ముంచుకొస్తున్న ముప్పుఇటీవల కాలంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల పేర్లను, లోగోలను పోలి ఉండేలా నకిలీ యాప్లను సృష్టించి పెట్టుబడిదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు భారీగా పెరుగుతున్నాయి. ‘ఈ అక్రమ యాప్లు అచ్చం ఒరిజినల్ ప్లాట్ఫారమ్ల వలె కనిపిస్తూ తమ డబ్బు నియంత్రిత మార్కెట్కే వెళ్తోందని పెట్టుబడిదారులు నమ్మేలా చేస్తున్నాయి. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు తీవ్ర ముప్పు’ అని సెబీ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సవాలును ఎదుర్కోవడానికి సెబీ గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల యాప్లకు మాత్రమే ‘వెరిఫైడ్ బ్యాడ్జ్’ గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం 600కి పైగా స్టాక్ ట్రేడింగ్ యాప్లను ఇప్పటికే వెరిఫై చేసినట్లు రెగ్యులేటర్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇతర ఆర్థిక మధ్యవర్తుల (Intermediaries) యాప్లకు కూడా ఈ ఫీచర్ను విస్తరించనున్నారు.‘ఫిన్ఫ్లుయెన్సర్ల’పై నిఘాఈ సందర్భంగా సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సలహాలిచ్చే ఫిన్ఫ్లుయెన్సర్లను ఏరిపారేయడానికి కృత్రిమ మేధ సాధనాలను వాడాలని గూగుల్ను కోరినట్లు తెలిపారు. ‘డిజిటల్ ప్రపంచంలో సమాజానికి సమస్యగా మారుతున్న వ్యవస్థలను రూపుమాపడానికి చట్టాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాల్సి ఉంది’ అని పాండే చెప్పారు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ ఎక్కడెంత వాడుతున్నారంటే..పెట్టుబడిదారులు ఎలా మోసపోతున్నారు?సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా అసాధారణ లాభాలు వస్తాయని ఆశ చూపుతారు.సెబీ బ్రోకర్ను పోలి ఉండే నకిలీ యాప్ లింక్ పంపి డౌన్లోడ్ చేయిస్తారు.యాప్లో గ్రాఫ్లు, లాభాలు కనిపిస్తున్నా వాస్తవానికి ఆ డబ్బు నిందితుల ఖాతాలకు మళ్లుతుంది.పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించే సమయానికి స్కామర్లు అదృశ్యమవుతారు.
గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!
2026 ప్రారంభంలో భారీగా పెరిగిన వెండి, క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ ముందుకు సాగింది. మూడు నెలల కాలంలో ఏకంగా 44 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి సమయంలో వెండి కొనాలా?, ఇంకొంత కాలం వేచి చూడాలా? అని చాలామందికి అనుమానం కలిగింది. ఈ కథనంలో మీ అనుమానాలకు సమాధానం చూసేద్దాం.జనవరి 2026లో రూ.4.20 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. నేటికి (మార్చి 26) రూ.2.60 లక్షల వద్దకు చేరింది. అంటే మూడు నెలలు ఇంకా గడవక ముందే సిల్వర్ రేటు రూ.1.60 లక్షలు తగ్గింది. సాధారణంగా.. ధరలు 20 శాతం కంటే తగ్గితే లేదా నష్టపోతే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఇప్పుడు వెండి పరిస్థితి ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు.వెండి ధరలు తగ్గడానికి కారణం?సిల్వర్ ధరలు ఇంతలా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాలర్ విలువ బలపడటం అనే చెప్పాలి. ఇది కాకుండా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల సరఫరా అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండవచ్చని అంచనాలు కూడా వెండి ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయి.నిపుణుల అభిప్రాయంక్రమంగా తగ్గిన వెండి ధరలు మెల్లగా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే.. ఇప్పుడున్న ధరలు చాలా తక్కువ. కాబట్టి వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని కొందరు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకొంతకాలం వేచి ఉండటం మంచిదని మరికొందరు చెబుతున్నారు.పెట్టుబడిదారులకు సూచనలుబంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. అది ఆభరణాలుగా కొనుగోలు చేస్తారా?, బిస్కెట్స్, కడ్డీల రూపంలో కొనుగోలు చేస్తారా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి అనేది మీ సొంత నిర్ణయం. అవసరమైన నమ్మకమైన నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: రూ.3 లక్షలకి ఆర్డర్ పెడితే.. వాషింగ్ పౌడర్ వచ్చింది!
కార్పొరేట్
బ్యాంక్ హాలిడేస్: ఐదు రోజుల్లో నాలుగు రోజులు సెలవు!
హెచ్డీఎఫ్సీపై ఆరోపణలు.. రంగంలోకి న్యాయ సంస్థ
‘ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగమే’
గ్యాస్ చార్జీలు వసూలు చేస్తే.. ప్రభుత్వం వార్నింగ్
మెటా లేఆఫ్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు?
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
గ్యాస్ బుకింగ్ టైమ్లో మార్పు.. కేంద్రం క్లారిటీ
12 శాతం వరకు పెరగనున్న ఏసీల రేట్లు
రూ.3 లక్షలకి ఆర్డర్ పెడితే.. వాషింగ్ పౌడర్ వచ్చింది!
టెలికాం కంపెనీల నయా దోపిడీ.. రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు
ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీయించాలి!!
దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న భ...
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లు మాత్రం డీలా
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగ...
ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కద...
దేశాల్లో పెట్రోల్ మంటలు.. దారుణంగా ధరలు!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్...
సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిన్నటి న...
మరో ఐదు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
దశాబ్దాల కాలం నాటి ‘ఆదాయపు పన్ను చట్టం 1961’ మరికొ...
త్వరలో బీటీ పత్తి విత్తనాల గరిష్ట ధరల ప్రకటన!
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పనులు ప్రారంభం కానున్న నే...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఇంధన భద్రతకు ‘సౌర’ భరోసా
ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్లో మారుతున్న పరిణామాలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ ఎంత సున్నితమైందో మరోసారి గుర్తుచేశాయి. శిలాజ ఇంధనాల దిగుమతులపై భారీగా ఆధారపడే భారతదేశం వంటి దేశానికి ఇంధన భద్రత అనేది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక ప్రాధాన్యత. ఈ నేపథ్యంలో సౌరశక్తి వినియోగాన్ని గరిష్ట స్థాయికి చేర్చుకోవడమే మన ముందున్న ఏకైక మార్గం.దశాబ్ద కాలంలో ఇలా..గడిచిన పదేళ్లలో భారత్ సౌరశక్తి రంగంలో అసాధారణ వృద్ధిని సాధించింది. భారీ సోలార్ పార్కులు, రూఫ్-టాప్ ఇన్స్టాలేషన్ల ద్వారా దేశీయ సోలార్ పవర్ సామర్థ్యం 130 గిగావాట్లకు చేరుకుంది. అయితే, సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఆ విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించడంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.భారీ ప్రాజెక్టులు.. వికేంద్రీకృత వ్యవస్థభారీ సోలార్ ప్లాంట్లు (ఎల్ఎస్ఎస్) తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వాటికి ప్రధాన అడ్డంకి ట్రాన్స్మిషన్ (సరఫరా) వ్యవస్థ. మారుమూల ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను నగరాలకు చేరవేయడానికి భారీ వ్యయంతో కూడిన కారిడార్లు అవసరం. దీనివల్ల విద్యుత్ నష్టాలు పెరగడం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆలస్యం కారణంగా విద్యుత్ తరలింపు నిలిచిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘పీఎం సూర్య ఘర్’ వంటి పథకాలు గృహ వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యుత్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడే వినియోగిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్పై ఒత్తిడి తగ్గుతుంది.గ్రిడ్ నిర్వహణలో సాంకేతిక ఇబ్బందులుసాధారణంగా విద్యుత్ గ్రిడ్లు ఒకే దిశలో (పవర్ ప్లాంట్ నుంచి వినియోగదారుడికి) ప్రవహించేలా రూపొందించబడ్డాయి. కానీ రూఫ్-టాప్ సోలార్ వల్ల విద్యుత్ రెండు వైపులా ప్రవహిస్తుంది. దీనివల్ల గ్రిడ్ అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉంది. సంపన్న వినియోగదారులు సోలార్ వైపు మళ్లడంతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రాష్ట్రాలు అదనపు ఛార్జీలు విధిస్తూ సోలార్ వినియోగాన్ని పరోక్షంగా నిరుత్సాహపరుస్తున్నాయనే వాదనలున్నాయి.సవాళ్లు - పరిష్కారాలుసౌర విద్యుత్ ఉత్పత్తి మధ్యాహ్నం వేళలో గరిష్టంగా ఉంటుంది, కానీ ఆ సమయంలో గృహాల్లో వినియోగం తక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో డిమాండ్ పెరిగినప్పుడు సౌర ఉత్పత్తి ఉండదు. దీనినే అంతర్జాతీయంగా ‘డక్ కర్వ్’ సమస్య అంటారు. దీనిని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పగటిపూట మిగిలిన విద్యుత్ను భద్రపరిచి రాత్రి వేళల్లో వాడుకోవాలి. విద్యుత్ సమృద్ధిగా ఉన్న సమయంలో రేట్లు తగ్గించి వినియోగదారులను ఆ సమయంలోనే ఎక్కువ విద్యుత్ వాడేలా ప్రోత్సహించాలి.సరికొత్త వ్యూహం.. సోలార్, ఈవీ అనుసంధానంప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత. ప్రభుత్వం పీఎం-డ్రైవ్ పథకం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించాలని చూస్తోంది. సగటున ఒక ఇంటిపై ఉండే 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ నుంచి వచ్చే మిగులు విద్యుత్ తక్కువగా ఉండొచ్చు. కానీ ఒక అపార్ట్మెంట్ లేదా కాలనీలోని ఇళ్లన్నీ కలిపి ఆ మిగులు విద్యుత్ను అక్కడే ఉండే పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు మళ్లించవచ్చు.తూత్తుకుడిలోని వీవోసీ పోర్ట్ ఇప్పటికే ఈ నమూనాను విజయవంతంగా అమలు చేస్తోంది. స్థానిక సౌర విద్యుత్ను అక్కడే ఈవీ వినియోగానికి అనుసంధానించడం ద్వారా భారీగా ఖర్చు తగ్గించుకున్నారు. భారతదేశ ఇంధన భవిష్యత్తు సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల అనుసంధానంలోనే ఉంది. డిస్కంలు సోలార్ను ఒక ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా భావించి స్మార్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. అప్పుడే నిజమైన ఇంధన స్వయంసమృద్ధిని సాధించగలం.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?
రూ.1000లోపు రీఛార్జ్.. 164 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన కొత్త ప్లాన్ ప్రకారం.. 997 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు.. అపరిమిత కాలింగ్స్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఈ నెల చివరి వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుంది.More days, same price! BSNL Validity Bonus Offer ₹997 plan now gives 164 days instead of 150 days.Plan detail:* Cost: ₹997* Validity: 164 Days (Bonus included!)* Data: 2GB/Day* Calls: UnlimitedDon't miss out—this limited-time bonus till March 31, 2026.Recharge… pic.twitter.com/225a4Cb04P— BSNL India (@BSNLCorporate) March 22, 2026
హీట్కు హాట్ సొల్యూషన్: ఇదిగో కూల్ గ్యాడ్జెట్లు!
వేసవి వచ్చిందంటే బయట అడుగు పెడితే చాలు, సూర్యుడు తన వేడి గాలిని ముఖంపై కొడుతూ ‘ఇంట్లోనే ఉండు’ అని హెచ్చరిస్తూనే ఉంటాడు. కాని, టెక్నాలజీ తెచ్చిన ఈ చిన్న గ్యాడ్జెట్లు, సూర్యుడు తన వేడి ఎంత పెరిగినా ‘ఊఫ్’ నుంచి ‘ఆహా!’గా మార్చేస్తాయి.ఫోనుకి బుజ్జి ఏసీ!సమ్మర్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు మీ ఫోన్ వేడి పెనంలా మారిపోతుందా? అయితే మీ ఫోన్ చల్లబరచడానికి వచ్చేసింది ఈ మొబైల్ కూలింగ్ ప్యాడ్! ఇది మామూలు ఫ్యాన్ కాదు, ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ మీ ఫోన్ టెంపరేచర్ను కేవలం సెకన్లలోనే తగ్గించేస్తుంది. అంటే బయట ఎండలు మండిపోతున్నా, మీ ఫోన్ మాత్రం వింటర్ వాతావరణంలో ఉన్నట్టే చిల్ అవుతుంది! దీనికి ఉన్న ఎల్ఈడీ డిస్ప్లే ఫోన్ ఎంత చల్లగా ఉందో ఎప్పటికప్పుడు చూపిస్తుంది. పైగా ఇందులోని మ్యాగ్నెట్ ఫీచర్ వల్ల ఫోన్ వెనుక సులభంగా అతుక్కుపోతుంది, మీరు గంటల తరబడి గేమింగ్ చేసినా లేదా లైవ్ స్ట్రీమింగ్ చేసినా ఫోన్ హ్యాంగ్ అవ్వదు, బ్యాటరీ కూడా వేడెక్కదు. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్.. ఏదైనా సరే, సెట్ అయిపోతుంది. ధర రూ. 700 మాత్రమే!మ్యాజిక్ గ్లాసెస్!ఫోన్ చూసి చూసి మీ కళ్లు ‘ఫ్రై’ అయిపోతున్నాయా? బయటకి వెళ్దామంటే సూర్యుడు సెగలతో సినిమా చూపిస్తున్నాడా? ఇలా ఒకేసారి కళ్లకు రక్షణ, మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చేందుకు వచ్చేసింది ఈ స్మార్ట్ బ్లూటూత్ గ్లాసెస్! ఇందులో ఇన్–బిల్ట్ స్పీకర్లు కూడా ఉన్నాయి. అంటే మీరు కళ్లజోడు పెట్టుకుంటే చాలు, పక్కన ఎవరికీ వినిపించకుండా మీ చెవుల్లో మ్యూజిక్ వినిపిస్తుంది.ఫోన్ తీయకుండానే కాల్స్ కూడా మాట్లేడేయొచ్చు. సాంగ్స్ మార్చుకోవచ్చు. ఇక ఇందులో ఉన్న ఫోటోక్రోమిక్ లెన్సులు ఇంట్లో ఉన్నప్పుడు బ్లూ లైట్ నుంచి, అదే అడుగు బయట పెట్టగానే సెకన్లలో కూలింగ్ గ్లాసెస్లా మారి కళ్లకు రక్షణ ఇస్తాయి. పైగా వర్షం పడినా, చెమట పట్టినా ఏమీ కాకుండా దీనికి వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ధర రూ. 1,200 మాత్రమే!మంచు కురిపించే గొడుగు!బయట ఎండలు మండిపోతుంటే.. గొడుగు పట్టుకున్నా సెగలు తగులుతూ చిరాగ్గా ఉందా? అయితే మీ పర్సనల్ ఏసీలాంటి ఈ బీఎన్ఎఫ్ సన్ అంబ్రెల్లాని చూస్తే మీరు ఫిదా అయిపోతారు! దీని లోపల ఒక బుజ్జి ఫ్యాన్ ఉండటమే కాకుండా, ఇది చల్లని నీటిని మంచులా చల్లుతుంది. అంటే ఎండలో వెళ్తున్నా, మీ గొడుగు కింద ఒక చిన్న మంచువాన కురుస్తుంది. కేవలం నాలుగు ఏఏ బ్యాటరీలు ఉంటే చాలు.. గాలికి తిరగబడని విండ్ప్రూఫ్ డిజైన్తో, అటు గాలిని.. ఇటు మంచు జల్లులను మీకు అందిస్తుంది. ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇది ఒక అదిరిపోయే ఆప్షన్. ధర రూ. 5,900.
ఉద్యోగులకు ఏఐ ట్రైనింగ్.. పియర్సన్తో టీసీఎస్ జట్టు
ముంబై: గ్లోబల్ లెర్నింగ్ సర్వీసుల సంస్థ పియర్సన్తో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) జట్టు కట్టింది. కృత్రిమ మేథతో సిబ్బందికి శిక్షణనిచ్చి, వారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడంలో కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఏఐ ఆధారిత లెర్నింగ్ ప్రోడక్టులు, సర్వీసులను రూపొందిస్తాయి.నియామకాల్లో, సిబ్బంది అభివృద్ధి ప్రోగ్రాంలలో అభ్యర్ధుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియలో పియర్సన్కి చెందిన వెర్సాంట్ ఇంగ్లీష్ ప్రొఫీషియెన్సీ విధానాన్ని టీసీఎస్ ఉపయోగించనుంది. మరోవైపు అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసులను డిజిటలీకరించే దిశగా ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ సంస్థ అమెడ్యూస్తో టీసీఎస్ చేతులు కలిపింది.మరోవైపు, ఐటీ ఇన్ఫ్రా, డేటా సెంటర్లు, ఇతరత్రా టెక్నాలజీల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ, టీసీఎస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
పర్సనల్ ఫైనాన్స్
ఇక ఫింగర్ప్రింట్తోనే పేమెంట్స్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన అనుబంధ సంస్థ ‘ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్’ (NBSL) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఇకపై భీమ్ యాప్ ద్వారా చేసే యూపీఐ (UPI) లావాదేవీలకు పిన్ అవసరం లేకుండా, కేవలం వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్తో నగదు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఫీచర్ ముఖ్యాంశాలురూ. 5,000 వరకు పరిమితి: వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లోని బయోమెట్రిక్ ఫీచర్ను ఉపయోగించి గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.పిన్ ఎంట్రీతో పనిలేదు: తరచూ పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల పేమెంట్స్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపుతుంది.అధిక భద్రత: పిన్ షేరింగ్ వంటి రిస్క్లను తగ్గించి, వ్యక్తిగత గుర్తింపు ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇది మరింత సురక్షితం.రూ. 5,000 దాటితే: అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు భద్రతా కారణాల దృష్ట్యా యధావిధిగా యూపీఐ పిన్ తప్పనిసరి.యాక్టివేట్ చేసుకునే విధానంభీమ్ యాప్లో ఈ కొత్త ఫీచర్ను యాక్టివేట్ కోవడానికి ఈ కింది దశలను అనుసరించండి..భీమ్ (BHIM) యాప్ ఓపెన్ చేయండి.ప్రొఫైల్ (Profile) విభాగానికి వెళ్లండి.మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.యాక్టివేట్ బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్స్ (Activate Biometric Transactions)పై క్లిక్ చేయండి.ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్ఫారమ్లలో బయోమెట్రిక్ సదుపాయం ఉన్న అన్ని స్మార్ట్ఫోన్లకు అందుబాటులో ఉంది.
జియో.. జెరోధా.. కొత్త మ్యూచువల్ ఫండ్లు
జెరోధా మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 50:50 ఇండెక్స్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ 23న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ను కేదార్నాథ్ మిరాజ్కార్ నిర్వహించనున్నారు. ఈ ఫండ్ అధిక రిస్క్ కిందకు వస్తుంది.నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 50:50 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక సూచీ రాబడులే ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా ఉంటాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడుల ద్వారా మెరుగైన సంపద సృష్టించుకోవాలని భావించే ఇన్వస్టర్లకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఈ నెల 24న ప్రారంభమై, ఏప్రిల్ 7న ముగుస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బీఎస్ఈ 100 ఇండెక్స్ (టీఆర్ఐ) ఈ పథకం పనితీరుకు ప్రామాణికం.తన్వి కచేరియా, సాహిల్ చౌదరి ఈ పథకానికి మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. డైరెక్ట్ప్లాన్ (మధ్యవర్తుల ప్రమేయం లేని), గ్రోత్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్క్యాప్ కంపెనీల్లో 80–100 శాతం వరకు, 0–20 శాతం మేర ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.
తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక ప్రణాళికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్లో వివరించారు.నిర్లక్ష్యం.. నిశ్శబ్ద శత్రువు!తన కుటుంబ సభ్యురాలితో జరిగిన ఒక చర్చను ఉదహరిస్తూ.. "చాలా మంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించడం లేదు" అని కియోసాకి (Robert Kiyosaki) ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉండి, ఎటువంటి పొదుపు లేకుండా, ఇప్పటికీ పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. చాలామంది "ఏం పర్వాలేదు.. సంతోషంగా ఉంటే చాలు (Don't worry, be happy)" అనే ధోరణిలో ఉండటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.యువతకు విలువైన హెచ్చరికఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చని, దాన్ని ఎదుర్కోవడానికి యువతకు ఉన్న అతిపెద్ద ఆస్తి "సమయం" అని ఆయన గుర్తు చేశారు. సమయం, ఆరోగ్యం.. ఇవే మనిషికి ఉన్న గొప్ప ఆస్తులు. వీటిని వృథా చేయకుండా పెట్టుబడిగా మార్చుకోవాలి.తాను 28 ఏళ్ల వయస్సులో ఇల్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. కానీ ఆ వయస్సులో తాను నేర్చుకున్న పాఠాలే నేటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయని ఆయన వివరించారు.ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరం!ప్రపంచ దేశాల్లో ముద్రిస్తున్న 'నకిలీ కరెన్సీ' (ఫేక్ మనీ), పెరుగుతున్న జాతీయ అప్పులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలను విస్మరించడం తెలివైన పని కాదని కియోసాకి హెచ్చరించారు. వయస్సు పెరిగే కొద్దీ కొత్తగా సంపాదించే సామర్థ్యం తగ్గుతుందని, అందుకే యువత తమ సమయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు.(ఇది చదివారా 👉పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్)"వయస్సును, మీకు ఉన్న సమయాన్ని గౌరవించండి. ఆరోగ్యం, యవ్వనం ఉన్నప్పుడే సరైన ఆర్థిక పునాదులు వేసుకోకపోతే, రిటైర్మెంట్ సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు" అన్నది కియోసాకి మాటల సారాంశం.DON’T WORRY….BE HAPPY. I was talking to a family member about the national debt, the war, printing fake money, inflation, and possible crash of the stock market. She got angry and said to not talk about money, the world economy, and possible global depression. She was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 23, 2026
బ్యాంకు సెలవులు.. వారంలో 4 రోజులు క్లోజ్!
మీరు ఈ వారంలో బ్యాంకు పనులు ఏవైనా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. వివిధ పండుగలు మరియు వారాంతపు సెలవుల కారణంగా మార్చి 26 నుండి మార్చి 29 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగ, వారాంతపు సెలవుల కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.సెలవుల వివరాలు ఇవే...మార్చి 26 (గురువారం): శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బ్యాంకులు మూసిఉంటాయి.మార్చి 27 (శుక్రవారం): తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి సెలవు పాటించనున్నారు.మార్చి 28 (శనివారం): ఇది నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.మార్చి 29 (ఆదివారం): సాధారణ సెలవు దినం.నెల ఆఖరిలో మరో సెలవు: మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా మెజారిటీ రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటివి) బ్యాంకులు మూతపడతాయి.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.ఏటీఎం (ATM) సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా UPI, NEFT, RTGS లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.ఇతర సేవలు: ఫిక్స్డ్ డిపాజిట్లు తెరవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులను ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు.మార్చి నెలాఖరు కావడంతో అకౌంట్ క్లోజింగ్ పనులు కూడా ఉంటాయి. కాబట్టి, అత్యవసర బ్యాంకింగ్ పనులు ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం.


