ప్రధాన వార్తలు
నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు!
‘1980వ దశకంలో దేశం విడిచి వెళ్లేటప్పుడు నా మనసులో ఒకటే ప్రశ్న.. మనం ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నాం? కానీ నేడు అదే భారత్ ప్రపంచానికి టాలెంట్ హబ్గా మారింది. ఒకప్పుడు సంస్థను స్థాపించడం గగనమైతే, నేడు అది అత్యంత సులభతరమైంది’ ఇవి ప్రముఖ ఐటీ దిగ్గజం, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యక్తం చేసిన భావాలు. సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న తన జీవిత అనుభవాలు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.నిరాశ నిండిన కాలం అది..శ్రీధర్ వెంబు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, 1989లో తాను ఐఐటీ మద్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పటి పరిస్థితులను వివరించారు. ఆ సమయంలో పంజాబ్, కశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాలు అశాంతితో రగులుతుండేవన్నారు. ‘అప్పట్లో ఐఐటీయన్లు దేశం దాటి వెళ్లడమే ఏకైక మార్గంగా భావించేవారు. నేను దేశాన్ని వదిలి వెళ్తున్నప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడ నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు’ అని ఆయన ఆనాటి సామాజిక, రాజకీయ స్థితిగతులను గుర్తుచేశారు.వృథా అవుతున్న ప్రతిభఇంజినీరింగ్ చదువుతున్నప్పటికీ వెంబు దృష్టి అంతా ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రంపైనే ఉండేది. ‘మనం ఎందుకు పేదవాళ్లం?’ అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆయన దశాబ్దాల పాటు అన్వేషించారు. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘భారతదేశం పేద దేశంగా ఉండటానికి కారణం మనం మన ప్రతిభను భారీ స్థాయిలో వృథా చేయడమే’ అని విశ్లేషించారు. జోహో సంస్థను ఏ గొప్ప నేపథ్యం లేని సామాన్య భారతీయులతోనే నిర్మించామని, అటువంటి ప్రతిభ భారత్లో ప్రతిచోటా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ టాలెంట్ను సరైన దిశలో ఉపయోగిస్తే దేశం అద్భుతమైన సంపదను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సంస్కరణల పర్వం1989 నాటికే తాను సోషలిస్టు విధానాలకు వ్యతిరేకిగా మారానని వెంబు తెలిపారు. 1991 సంక్షోభం సమయంలో విదేశీ మారక నిల్వలు అడుగంటి, ఐఎంఎఫ్ వద్ద బంగారం కుదువ పెట్టాల్సిన దుస్థితి నుంచి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వరకు ఆయన ప్రస్తావించారు. సోవియట్ యూనియన్ పతనం, చైనాలో అశాంతి వంటి అంశాలు తన ఆలోచనా దృక్పథాన్ని మార్చాయని చెప్పారు.In the 1980s, most IITians would go abroad. In 1989, when I graduated from IIT Madras, I remember feeling extremely dejected about our country. Punjab, Kashmir and Assam were all burning. My heart was not in engineering. I was mostly reading books in Economics and Philosophy -…— Sridhar Vembu (@svembu) April 22, 2026నేటి భారతం అవకాశాల గనిప్రస్తుత పరిస్థితులపై ఆయన ప్రశంసలు కురిపించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సంస్థను ప్రారంభించడం చాలా సులభమని, తక్కువ ఖర్చుతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రపంచ స్థాయి కంపెనీలను నిర్మించవచ్చని ఆయన ఉదహరించారు. ‘మనం ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో కూడిన జీవన ప్రమాణాలు ఉన్న చోట నుంచి కూడా కంపెనీలను మొదలు పెట్టవచ్చు. మీ దగ్గర ప్రతిభ ఉంటే భారతదేశంలో ఏదైనా సాధించవచ్చు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ‘బైఅవుట్’!
ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన 51 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలతో టెక్ పరిశ్రమ రూపురేఖలు మారుతున్న తరుణంలో అమెరికాలోని తన సిబ్బంది కోసం మైక్రోసాఫ్ట్ ‘వాలంటరీ బైఅవుట్’ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకుంటూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేసింది.ఏమిటీ బైఅవుట్?సాధారణంగా కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా కొన్ని విభాగాలను మూసివేస్తున్నప్పుడు లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) ప్రకటిస్తాయి. కానీ, బైఅవుట్ అనేది దీనికి భిన్నమైనది. కంపెనీ బలవంతంగా ఉద్యోగం తీసివేయడం కాకుండా, ఉద్యోగులే స్వచ్ఛందంగా తప్పుకునేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడే వారికి ఒకేసారి భారీ నగదు, పొడిగించిన బీమా సదుపాయాలు, పదవీ విరమణ ప్రయోజనాలను ఆఫర్ చేస్తారు. లేఆఫ్స్ వల్ల వచ్చే వ్యతిరేకతను నివారించడానికి ఉద్యోగులకు గౌరవప్రదమైన రీతిలో వీడ్కోలు పలికేందుకు కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి.మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఎవరికి? అర్హతలు ఏమిటి?కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఈ వన్ టైమ్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో దాదాపు 7% మందికి వర్తించనుంది. సీనియర్ డైరెక్టర్ స్థాయి, అంతకంటే తక్కువ కేడర్లోని ఉద్యోగులు దీనికి అర్హులు. ఇన్సెంటివ్ ఆధారిత సేల్స్ విభాగాల్లో ఉన్నవారికి ఈ అవకాశం లేదు. ‘అర్హులైన ఉద్యోగులు తమ భవిష్యత్తు నిర్ణయాలను సొంతంగా, కంపెనీ అందించే ఆఫర్ను తమ ఇష్టపూర్వకంగా పొందేలా ఈ కార్యక్రమం రూపొందించారు’ అని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ పేర్కొన్నారు.అసలు సమస్య ఏమిటి?టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ఏర్పాటుపై భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన వనరులను పాత తరం సాఫ్ట్వేర్ సేవల నుంచి ఏఐ వైపు మళ్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వేగంగా పెరుగుతున్న ఏఐ పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవడానికి శ్రామిక శక్తిని సర్దుబాటు చేస్తున్నారు. ఏఐ ఆటోమేషన్ వల్ల ప్రభావితమయ్యే పాత్రల నుంచి సిబ్బందిని తగ్గించి, కొత్త టెక్నాలజీకి అనుగుణంగా టీమ్స్ను పునర్నిర్మిస్తున్నారు. పనితీరు సమీక్షలను సరళీకృతం చేస్తూనే నైపుణ్యం గలవారిని నిలుపుకోవడానికి స్టాక్ ఆధారిత రివార్డులను ఇస్తున్నారు.జూన్ 2025 నాటికి మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులను కలిగి ఉండగా అందులో 1,25,000 మంది అమెరికాలోనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దఫాలుగా తొలగింపులు చేసిన ఈ కంపెనీ ఇప్పుడు బైఅవుట్ ద్వారా మానవీయ కోణంలో మార్పునకు శ్రీకారం చుట్టింది. ఖర్చుల తగ్గింపుతోపాటు ఏఐ భవిష్యత్తు కోసం ఒక కంపెనీ తనను తాను సిద్ధం చేసుకుంటున్న తీరుకు ఇది నిదర్శనం.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
ఏఐ డేంజర్.. బ్యాంకులకు ఆర్థిక మంత్రి కీలక సూచన
కృత్రిమ మేథ (ఏఐ) సరికొత్త నమూనాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వరంగ బ్యాంక్ల ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ఫైనాన్షియల్ సిస్టమ్లలో లోపాలను ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్ సులభంగా గుర్తించగలదన్న ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.ఎన్నో ఆపరేటింగ్ సిస్టమ్లలో లోపాలను గుర్తించినట్టు ఆంథ్రోపిక్ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ఏఐ రూపంలో ఆర్థిక వ్యవస్థకు వచ్చే రిస్క్లను ఎదుర్కొనే చర్యలు, సైబర్ భద్రతపై ఈ సమావేశంలో లోతుగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ సిస్టమ్లను మరింత పటిష్టంగా మార్చుకునే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సీతారామన్ సూచించినట్టు చెప్పాయి.ఆర్బీఐ, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, బ్యాంక్ల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉల్లంఘనల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే రిస్క్లపై ఆర్థిక శాఖ, ఆర్బీఐ అధ్యయనం చేస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్లు, వెబ్ బ్రౌజర్లలో 27 ఏళ్ల నాటి లోపాలతో సహా వేలాది బగ్స్ను గుర్తించి, వాటిని వినియోగించుకునే విషయంలో మనుషుల కంటే మెరుగ్గా ‘మైథోస్’ ఏఐ మోడల్ రాణించగలదని ఆంథ్రోపిక్ పేర్కొనడం గమనార్హం. దీంతో యూఎస్ ఫెడ్ సహా పలు కేంద్ర బ్యాంక్లు ఏఐ ముప్పులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తుండడం తెలిసిందే.
వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్
మ్యూచువల్ ఫండ్స్ అనగానే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి. అదే సమయంలో కొంత ఆందోళన కనిపిస్తుంది. సరైన ఫండ్ను ఎంచుకోవడానికి మేధావి అయి ఉండాలని, మార్కెట్ గమనాన్ని ప్రతిరోజూ గమనించాలని చాలామంది భావిస్తుంటారు. అయితే, ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే వారెన్ బఫెట్ సిద్ధాంతాలు దీనికి భిన్నంగా ఉంటాయి. 94 ఏళ్ల వయసులోనూ బెర్క్షైర్ హాత్వేను విజయపథంలో నడిపిస్తున్న ఆయన పెట్టుబడి అనేది విజ్ఞానం కంటే కూడా క్రమశిక్షణతో కూడిన వ్యవహారమని నమ్ముతారు. నేటి అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలిచే బఫెట్ సూత్రాలపై ప్రత్యేక కథనం.పెట్టుబడి కాల పరిమితి‘ఒకవేళ స్టాక్ మార్కెట్ పదేళ్లపాటు మూతపడినా మీరు నష్టపోని కంపెనీలనే ఎంచుకోవాలి’ అన్నది బఫెట్ నియమం. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో తరచుగా ఫండ్లను మార్చడం వల్ల చక్రవడ్డీ లాభాన్ని కోల్పోతారు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్ను ఎంచుకుని దానికి దశాబ్దాల పాటు కట్టుబడి ఉండటమే అసలైన విజయం.మేధస్సు కంటే క్రమశిక్షణ ముఖ్యంపెట్టుబడి పెట్టడానికి ఐక్యూ 160 ఉండాల్సిన అవసరం లేదు. కేవలం భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే చాలని బఫెట్ అంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా పెరిగినప్పుడు అత్యాశ చెందకుండా సిప్లను కొనసాగించడమే అత్యుత్తమ వ్యూహం.రోజూ మార్కెట్ను గమనించకండిస్టాక్ మార్కెట్ అనేది అసహనంగా ఉన్న వ్యక్తి నుంచి ఓపికగా ఉన్న వ్యక్తికి డబ్బు బదిలీ చేసే సాధనం అని బఫెట్ నమ్ముతారు. రోజూ మ్యుచువల్ ఫండ్ ఎన్ఏవీని చూడటం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ లక్ష్యం 10 ఏళ్ల తర్వాత అయితే నేటి మార్కెట్ ఒడిదుడుకులు మీకు అనవసరం.భయం, అత్యాశల సమతుల్యతప్రజలందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి.. అందరూ భయపడుతున్నప్పుడు మీరు అత్యాశగా ఉండండి - ఇది బఫెట్ లైఫ్ మంత్రం. మార్కెట్ కుప్పకూలినప్పుడు చాలామంది సిప్లు ఆపేస్తారు. కానీ, అప్పుడే యూనిట్లు తక్కువ ధరకు వస్తాయనే విషయాన్ని బఫెట్ గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో చేసే అదనపు పెట్టుబడి భవిష్యత్తులో అద్భుతమైన సంపదను సృష్టిస్తుంది.తెలియనిచోట పెట్టుబడి వద్దుఏదో ఒక సెక్టోరల్ ఫండ్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్ గత ఏడాది 50% రిటర్న్స్ ఇచ్చిందని అందులో డబ్బులు పోయడం ప్రమాదకరం. ఆ ఫండ్ రిస్క్ ఏంటి? దాని వ్యూహం ఏంటి? అనేది కనీస అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టకూడదు.అంచనాలపై ఆధారపడకండిమార్కెట్ రేపు ఎలా ఉంటుంది? వచ్చే నెల ఎలా ఉంటుంది? అనే అంచనాలు జ్యోతిష్యం లాంటివే తప్ప వాస్తవాలు కావని బఫెట్ అభిప్రాయపడతారు. గత ఆరు నెలల ర్యాంకింగ్ చూసి ఫండ్లను మార్చడం కాకుండా ఫండ్ హౌస్ విశ్వసనీయతను చూసి పెట్టుబడి పెట్టాలని ఆయన సూచిస్తారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
రిలయన్స్తో జతకట్టిన ‘టైమ్’
ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీల వ్యక్తులను గుర్తించడంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘టైమ్’, భారతీయ యువశక్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు సిద్ధమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో తన ప్రతిష్టాత్మక ‘టైమ్ 100 నెక్స్ట్’ ఫ్రాంచైజీని తొలిసారిగా భారత్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ పేరుతో ఈ ఎడిషన్ ప్రారంభం కానుంది. న్యూయార్క్లో గురువారం జరిగిన వార్షిక ‘టైమ్ 100 గాలా' వేదికగా టైమ్ సీఈఓ జెస్సికా సిబ్లీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ ఈమేరకు ప్రకటన చేశారు.ఏమిటీ టైమ్ 100 నెక్స్ట్ ఇండియా?భారతదేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేయగల 100 మంది అసాధారణ యువ నాయకులను ఈ జాబితా ద్వారా టైమ్ ఎడిటర్లు ప్రపంచానికి పరిచయం చేస్తారు. కళలు, సైన్స్, వ్యాపారం, క్రీడలు.. వంటి విభిన్న రంగాల్లో రాణిస్తున్న వారిని ఎంపిక చేస్తారు. కేవలం భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను కూడా ఈ జాబితాలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ జాబితాను ఆన్లైన్లో విడుదల చేయడంతో పాటు డిసెంబర్ 2026లో ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో అట్టహాసంగా నిర్వహించే గాలా ఈవెంట్లో వీరిని సత్కరిస్తారు.భారతీయ ప్రతిభకు ప్రపంచ గుర్తింపుఈ భాగస్వామ్యంపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది భారతీయ యువతకు లభించే గొప్ప గౌరవమని పేర్కొన్నారు. ‘తర్వాతి తరం ప్రతిభను, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా నవ భారతాన్ని నిర్మించేందుకు రిలయన్స్ కట్టుబడి ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ అంశాలను భారత్కు తీసుకురావడం, భారత్లోని అత్యుత్తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడమే మా లక్ష్యం. ఈ క్రమంలో టైమ్తో కలిసి ముంబైలో ఈ వేడుకను నిర్వహించాలనుకోవడం గర్వంగా ఉంది’ అన్నారు. టైమ్ సీఈఓ జెస్సికా సిబ్లీ మాట్లాడుతూ, భారతీయ పరిశ్రమల్లో వస్తున్న మార్పులను, ప్రపంచ పురోగతిని నడిపిస్తున్న నాయకులను గుర్తించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
ఊడిపోతున్న ఉద్యోగం.. ఇదిగో ఇదే వచ్చే పరిహారం
సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (ఫేస్బుక్ మాతృసంస్థ) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ, తన మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం మందిని అంటే దాదాపు 8,000 మందిని తొలగించబోతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో పెట్టుబడులను పెంచడం, సంస్థాగత సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మే 20 నుంచి ప్రక్రియ ప్రారంభం!తాజా నివేదికల ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభం కానుంది. కేవలం ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాకుండా, సంస్థలో ఖాళీగా ఉన్న సుమారు 6,000 ఓపెన్ పొజిషన్ల భర్తీని కూడా మెటా నిలిపివేసింది. జనవరిలో మెటావర్స్ విభాగం (రియాలిటీ ల్యాబ్స్)లో 1,000 మందిని, మార్చిలో సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో మరికొందరిని ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే.అందుకే ఈ మార్పులు!ఓపెన్ ఏఐ (OpenAI), గూగుల్, ఆంత్రోపిక్ వంటి దిగ్గజ సంస్థలతో ఏఐ రంగంలో పోటీ పడటానికి మెటా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీని పునర్వ్యవస్థీకరిస్తోంది. కొన్ని రకాల కాంట్రాక్ట్ పనులను మానవ వనరుల నుండి తొలగించి, వాటి స్థానంలో ఏఐ ఆధారిత టూల్స్ ప్రవేశపెట్టాలని మెటా భావిస్తోంది. తక్కువ మేనేజ్మెంట్ పొరలతో, మరింత వేగంగా పనిచేసేలా సంస్థను తీర్చిదిద్దడమే జుకర్బర్గ్ లక్ష్యంగా కనిపిస్తోంది.తొలగించిన వారికి లభించే ప్రయోజనాలుబాధిత ఉద్యోగులను ఆదుకోవడానికి మెటా భారీ పరిహారాన్ని (Severance Package) ప్రకటించింది. నగదు పరిహారం కింద కనీసం 16 వారాల (4 నెలలు) బేస్ పేను చెల్లిస్తుంది. అలాగే కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల వేతనంగా అందిస్తుంది. దీంతోపాటు సుమారు 18 నెలల వరకు కోబ్రా (COBRA) హెల్త్ కవరేజ్ కొనసాగుతుంది. విదేశీ ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ సాయంతో పాటు, కెరీర్ సర్వీసెస్ (కొత్త ఉద్యోగ వేటలో సాయం) అందించనుంది."ఇది నిజంగా అవాంఛనీయ వార్త అని నాకు తెలుసు. దీనివల్ల ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతారని అర్థం చేసుకోగలను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఇది తప్పనిసరి" అని కంపెనీ అంతర్గత మెమోలో పేర్కొంది.2022-2023 కాలంలో మెటా ఇప్పటికే సుమారు 21,000 మందిని తొలగించింది. ఆ ఏడాదిని 'సామర్థ్యపు సంవత్సరం' (Year of Efficiency)గా జుకర్బర్గ్ అభివర్ణించారు. ప్రస్తుతానికి మెటా ఆర్థికంగా బలంగానే ఉన్నప్పటికీ, ఏఐ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.1.90 లక్షల జీతం.. 4 నెలలే సంబరం!
కార్పొరేట్
నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు!
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ‘బైఅవుట్’!
ఏఐ డేంజర్.. బ్యాంకులకు ఆర్థిక మంత్రి కీలక సూచన
రిలయన్స్తో జతకట్టిన ‘టైమ్’
మస్క్ కంపెనీలో జాబ్ కావాలా?
ఇన్ఫోసిస్ లాభం జూమ్
'పని ఇష్టం లేనప్పుడే.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్'
అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు!
అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు
ఐదేళ్లు.. ఐదు లక్షల కోట్లు
భగ్గుమన్న పశ్చిమాసియా
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్ట...
గోల్డ్ అలర్ట్: బంగారం మళ్లీ ఎంత తగ్గిందంటే..
దేశంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు మళ్లీ ఊరటనిచ్చా...
నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఐటీ షేర్లు విలవిల
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో క...
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ...
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత...
మసులుతున్న భూమి.. మగ్గుతున్న ఆహార వ్యవస్థ!
ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. దాం...
నాలుగేళ్ల తర్వాత గోధుమ రైతులకు గుడ్న్యూస్
దేశ రాజధాని రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. దాదాప...
టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సగటు వే...
ఆటోమొబైల్
టెక్నాలజీ
99.99 శాతం మందికి భవిష్యత్తే లేదు : జాక్మా సంచలన వ్యాఖ్యలు
అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా యువత నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని అత్యంత ప్రతిభావంతులైన కొందరు యువతను ఉద్దేశించి రష్యాలోని లోమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీలో ఆయన చేసిన ప్రసంగం ఇపుడు నెట్టింట ఆందోళనకరంగా మారింది. అయితే భయపడకండి, ఆశాజనకంగా ఉండండి సమస్యల పరిష్కారంలో భాగస్వాములవ్వండి! అంటూ ఒక సవాలును యువత ముందుంచడమే ఆయన వ్యాఖ్యల్లోని అంతరార్థం. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? ఆయన వ్యాఖ్యల అర్థం పరమార్థం ఏంటి?జాక్ మా సందేశంయూనివర్శిటీలోని మేధావులతో జాక్ మాట్లాడుతూ “ప్రపంచంలోని 99.9శాతం మందికి భవిష్యత్తు లేదు” అన్న వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా ఉలిక్కి పడ్డారు. అత్యంత తెలివైన, సమర్థులైన యువత భయానికి, నిరాశకు లొంగిపోతే, ప్రపంచాన్ని రక్షించడానికి ఎవరు ముందుకొస్తారన్న జాక్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘మాస్కో యూనివర్శిటీకి చెందిన మీరు కూడా సమస్యలను పరిష్కరించలేకపోతే, మీరే భయపడితే.. ఇక ప్రపంచంలోని 99.9% మందికి భవిష్యత్తు ఉండదు.” అని అన్నారు. వెంటనే వారికి ముందుకు వెళ్లే మార్గాన్ని కూడా చూపించారు. తెలివైన, సమర్థులైన యువతే భయపడి చేతులు ముడుచుకు కూర్చుంటే, ఇక ప్రపంచాన్ని రక్షించే వారెవరూ ఉండరు. అందుకే సమస్యలొస్తాయని భయపడటం మానేసి, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని పిలుపు నిచ్చారు.సానుకూలంగా ఉండాలని, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ శక్తిని వృథా చేసుకోవద్దని యువ మేధావులకు సూచించారు. భయపడుతూ ఆలోచిస్తూ కూర్చోకుండా, పని మొదలుపెట్టాలని చెప్పారు. ఆందోళన చెందితే, మకో అవకాశమేదీ ఉండదు. భయం నుండి కార్యాచరణకు మారడమే గొప్ప విజయం అని పేర్కొన్నారు. Jack Ma explains why action matters more than worrying about the future pic.twitter.com/zKHPzHJRS1— Mindset Machine (@mindsetmachine) April 16, 2026 నిజానికి ప్రపంచంలోని ప్రతి ఆందోళన ఒక అవకాశమే అన్నారు. యంత్రాల వల్ల ఉద్యోగాలు కోల్పోతామని ప్రజలు భయపడితే, మార్పు గురించి ఆందోళన చెందితే ఫలితం లేదు. నిజానికి అది పూరించాల్సిన ఖాళీ. విద్యావంతులైన, సమర్థులైన యువత చేయాల్సిన పని ఈ ఆందోళనల నుండి దాక్కోవడం కాదు, వాటి వద్దకు నేరుగా వెళ్లి, వాటిని అర్థం చేసుకుని, పరిష్కారాలను గుర్తించడం. కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసుకోవడం. సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించడం మొదలుపెడితే ప్రపంచ భవిష్యత్తును మార్చవచ్చు అని జాక్మా సూచించడం విశేషం.
ప్రపంచంలోనే టాప్ కంపెనీకి కొత్త బాస్
ప్రపంచంలోనే నం 1 టెక్ కంపెనీ యాపిల్ తన నాయకత్వంలో మార్పులు ప్రకటించింది. దశాబ్ద కాలానికిపైగా సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది చివర్లో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన వారసుడిగా ప్రస్తుతం హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగం బాధ్యతలు చూస్తున్న జాన్ టెర్నస్ సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు. అదే సమయంలో యాపిల్ చిప్ డిజైన్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జానీ స్రూజీకి సంస్థ అత్యంత కీలకమైన చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్ బాధ్యతలను అప్పగించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా టిమ్ కుక్సుమారు రెండు దశాబ్దాలుగా యాపిల్లో అంతర్భాగంగా ఉన్న జాన్ టెర్నస్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. టిమ్ కుక్ వారసుడిగా ఆయన ఎంపిక సంస్థ అంతర్గత వారసత్వ ప్రణాళికలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో టెర్నస్ సీఈఓగా బాధ్యతలు చేపడతారు. పదవీ విరమణ తర్వాత కుక్ పూర్తిగా తప్పుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉంటూ దిశానిర్దేశం చేయనున్నారు.హార్డ్వేర్ చీఫ్గా జానీ స్రూజీయాపిల్ చిప్ల సృష్టికర్తగా పేరొందిన జానీ స్రూజీ పాత్ర ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఇప్పటివరకు హార్డ్వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఇకపై చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్ హోదాలో పూర్తిస్థాయి హార్డ్వేర్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. ఈ హోదాలో ఆయన బాధ్యతలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!స్రూజీ పర్యవేక్షణలో ఉండే విభాగాలుసిలికాన్, ప్రాసెసర్లు: ఏ-సిరీస్ (iPhone), ఎం-సిరీస్ (Mac) చిప్ల అభివృద్ధి.డిస్ప్లేలు, కెమెరా సెన్సార్లు, బ్యాటరీ టెక్నాలజీ, స్టోరేజ్ కంట్రోలర్లు.సెల్యులార్ మోడెమ్ల తయారీ, ఇంటిగ్రేషన్.
నెలకు రూ.1.90 లక్షల జీతం.. 4 నెలలే సంబరం!
నెలకు రూ. 1.90 లక్షల భారీ జీతం.. కేవలం నాలుగు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది! ఒక కంపెనీకి అత్యంత కీలకమైన ఉద్యోగి అనిపించుకుని, ఏకంగా 90 శాతం జీతం పెంపు పొందిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సైమన్ ఇంగారి అనే 'ఎక్స్' (ట్విట్టర్) యూజర్ పంచుకున్న ఈ ఉదంతం, రాజీనామా చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే కౌంటర్ ఆఫర్లను నమ్మి వెనక్కి తగ్గితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కళ్లకు కడుతోంది.కథనంలోకి వెళ్తే.. ఒక ఉద్యోగి కొత్త కంపెనీలో మెరుగైన ఆఫర్ రావడంతో తన ప్రస్తుత సంస్థకు రాజీనామా లేఖ సమర్పించాడు. అప్పటి వరకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న అతనికి, కొత్త చోట రూ. 1.70 లక్షల ఆఫర్ వచ్చింది. అయితే, ఆ ఉద్యోగి రాజీనామాతో షాక్ తిన్న హెచ్ఆర్ విభాగం, అతడిని వదులుకోవడం ఇష్టం లేక ఏకంగా రూ. 1.90 లక్షల జీతం ఇస్తామని 'కౌంటర్ ఆఫర్' ఇచ్చింది. కంపెనీ తనను ఇంతలా గుర్తిస్తోందని మురిసిపోయిన సదరు ఉద్యోగి, తన రాజీనామాను వెనక్కి తీసుకుని పాత సంస్థలోనే ఉండిపోయాడు.అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా నాలుగు నెలల తర్వాత కంపెనీ ఆ ఉద్యోగికి ఉద్వాసన పలుకుతూ లేఖ పంపింది. వ్యాపార లాభాలు తగ్గడం వల్ల పునర్నిర్మాణ ప్రక్రియ చేపడుతున్నామని, అందుకే తొలగిస్తున్నామని కంపెనీ కుంటిసాకులు చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతూనే, మరోవైపు కొత్తగా ఒక అసిస్టెంట్ను నియమించుకోవడం గమనార్హం. కేవలం రెండు వారాల్లోనే బాధ్యతలన్నీ అప్పగించి వెళ్లిపోవాలని సీనియర్ మేనేజ్మెంట్ నుండి ఆదేశాలు వచ్చాయని నిర్మొహమాటంగా చెప్పేసింది.ఈ ఉదంతం కార్పొరేట్ ప్రపంచంలోని ఒక చేదు నిజానికి నిదర్శనం. ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే పెంపుదలలు కేవలం తక్షణ ప్రత్యామ్నాయం దొరికే వరకు చేసే తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ పెంపుతో ఉద్యోగిని ఆపి, ఆ లోపు అతని బాధ్యతలను ఇతరులకు బదిలీ చేసే ప్లాన్ ఇందులో దాగి ఉండవచ్చు. అందుకే, ఒక్కసారి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాక, కౌంటర్ ఆఫర్లకు లోబడి వెనక్కి తగ్గడం క్షేమం కాదని ఈ కథనం హెచ్చరిస్తోంది.
పాపులర్ రీచార్జ్ ప్లాన్ రేటు మార్చేసిన ఎయిర్టెల్
ప్రముఖ టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ తన వినియోగదారులకు షాకిచ్చింది. అత్యధిక ఆదరణ పొందిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ధరను సైలెంట్గా పెంచింది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటాను అందించే ప్లాన్ ధరను రూ. 859 నుండి రూ. 899కి సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఈ దీర్ఘకాలిక ప్లాన్ ఇప్పుడు మరింత భారంగా మారింది.ఈ రూ. 899 ప్లాన్ ద్వారా వినియోగదారులకు 84 రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్తో పాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డేటా విషయానికొస్తే, ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా అందుతుంది. అదనపు ప్రయోజనాల కింద అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం (12 నెలలు), స్పామ్ అలర్ట్లు, ఉచిత హలోట్యూన్స్ వంటి రివార్డ్స్ లభిస్తాయి. అయితే, గతంలో ఉన్న క్యాష్బ్యాక్ ప్రయోజనాలతో కూడిన 'రివార్డ్స్ మినీ' సబ్స్క్రిప్షన్ను కంపెనీ తొలగించినట్లు తెలుస్తోంది.ఈ ధర పెంపు పరిమితంగా ఉన్నప్పటికీ, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తన సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడంతో పాటు, వినియోగదారులను క్రమంగా 5G సేవల వైపు మళ్లించేందుకు ఎయిర్టెల్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు కేవలం ఒక ప్లాన్కే పరిమితం కావడంతో, సాధారణ వినియోగదారులపై తక్షణ ప్రభావం తక్కువగానే ఉండవచ్చు.సాధారణంగా టెలికాం రంగంలో భారీ టారిఫ్ పెంపునకు ముందు ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేయడం అరుదు. కాబట్టి, ప్రస్తుతానికి అన్ని ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం లేదని సమాచారం. కాగా, ఎయిర్టెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను కూడా రూ. 4,000 నుండి రూ. 4,999కి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా 84 రోజుల ప్లాన్ ధర పెరగడంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
పర్సనల్ ఫైనాన్స్
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
పెట్టుబడి ప్రపంచంలో 'లెజెండ్'గా పేరొందిన వారెన్ బఫెట్.. కేవలం 11 ఏళ్ల వయస్సులో మూడు షేర్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు రూ. 11 లక్షల కోట్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలిచారు. మరి అతి తక్కువ డబ్బుతో పెట్టుబడి మొదలుపెట్టేవారికి ఆయన ఇచ్చే సలహాలేంటి? సామాన్యులు కూడా బఫెట్ రూట్ లో సంపదను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.చిన్న మొత్తంతోనే శ్రీకారం చుట్టండిచాలామంది తమ దగ్గర లక్షలాది రూపాయలు ఉంటేనే షేర్ మార్కెట్లోకి రావాలని అనుకుంటారు. కానీ బఫెట్ దృష్టిలో ఇది తప్పు. మీ దగ్గర రూ. 500 లేదా రూ. 1000 ఉన్నా సరే, పెట్టుబడిని తక్షణమే ప్రారంభించాలి. "సమయం మీ వైపు ఉంటే, చిన్న మొత్తమే భవిష్యత్తులో కొండంత సంపదగా మారుతుంది" అని ఆయన పదే పదే చెబుతుంటారు.ఇండెక్స్ ఫండ్స్: సామాన్యుల ఆయుధంఏ షేర్ కొనాలి? ఏ కంపెనీ బాగుంటుంది? అన్న అవగాహన లేని వారికి బఫెట్ సూచించే ఉత్తమ మార్గం 'లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్'. కంపెనీలను విశ్లేషించే సమయం, నైపుణ్యం లేని వారికి ఇవి అత్యంత సురక్షితమైనవని ఆయన నమ్ముతారు. అమెరికాలో S&P 500 లాగా, భారత్లో నిఫ్టీ 50 (Nifty 50) వంటి ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు.తెలివితేటలే అసలైన పెట్టుబడితెలివితేటలే అసలైన పెట్టుబడి అని వారెన్ బఫెట్ నమ్ముతారు. అందుకే జ్ఞానం కోసం అనే పుస్తకాలు ఆయన తిరగేస్తుంటారు. ఇప్పటికీ రోజుకు కనీసం 500 పేజీలు చదువుతారు. "అన్నింటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ జ్ఞానం మీద పెట్టేదే" అని ఆయన అంటారు. పెట్టుబడులు పెట్టేవారు కంపెనీల వార్షిక నివేదికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవాలి. బెంజమిన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' వంటి పుస్తకాలు చదవాలని ఆయన సూచిస్తుంటారు.కాంపౌండింగ్ మాయాజాలంబఫెట్ సంపదలో 90 శాతం ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది. దీనికి కారణం 'చక్రవడ్డీ' (Compounding). మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టి, దాన్ని ఎంత కాలం కొనసాగిస్తారో, మీ డబ్బు అంత వేగంగా రెట్టింపు అవుతుంది. అందుకే "పెట్టుబడి పెట్టడానికి నిన్నటి కంటే ఈరోజే సరైన సమయం" అని ఆయన చెబుతారు.కేవలం ఎఫ్డీ(FD)లు, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకుంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. ధనవంతులు కావాలంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనివార్యమని బఫెట్ సిద్ధాంతం చెబుతోంది. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకుని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఎవరైనా ‘కోటీశ్వరులు’ కావచ్చని బఫెట్ సూత్రం నిరూపిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ‘సీనియర్ సిటిజన్లు’
కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్ ప్రకారం కేవలం సీనియర్ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది. 80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్ చెకప్కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది. గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్ సబి్మట్ చేస్తే టీడీఎస్ చేయరు. చేయకపోతే టీడీఎస్ రివకరీ చేసి గవర్నమెంట్ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్ ఇన్కం. ఇప్పుడు దీని లిమిట్ రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే... (ఎ) కేవలం పెన్షన్ ఉండాలి (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్ రికవరీ అయ్యి గవర్నమెంట్ ఖజానాలో జమ అయ్యి ఉండాలి ఈ సదుపాయం కొనసాగుతుంది. ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్ అస్సెస్మెంట్ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. ఫైలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రీ ఫిక్స్డ్ ఫారమ్లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్గా రిటర్ను వేయవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి.
విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్
నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్ను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్ ఫోకస్డ్ టర్మ్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్ ఇన్సూర్డ్తో ప్లాన్ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది.
పింఛను రంగంలో ఎఫ్డీఐ పెంపు!
న్యూఢిల్లీ: పింఛను (పెన్షన్) రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని నూరు శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టం, 2013కు సవరణలతో కూడిన బిల్లును వచ్చే వర్షాకాలం లేదంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం పింఛను రంగంలో 49 శాతం ఎఫ్డీఐకే పరిమితి ఉంది. ప్రభుత్వం ఇటీవలే బీమా రంగంలోనూ ఎఫ్డీఐని నూరు శాతానికి అనుమతించడం తెలిసిందే. అంతకుముందు వరకు 74 శాతం వరకు అనుమతించేవారు. తొలుత 2015లో బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతం పెంచుతూ.. బీమా చట్టం, 1938లో కేంద్ర సర్కారు సవరణలు తీసుకురావడం గమనార్హం.ప్రతిపాదిత పెన్షన్ చట్టం బిల్లులో ఎన్పీఎస్ ట్రస్ట్ను వేరు చేసే సవరణ కూడా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్పీఎస్ను పీఎఫ్ఆర్డీఏ నుంచి వేరు చేసి, 15 మంది సభ్యుల బోర్డు నిర్వహణలో ఉంచనున్నట్టు చెప్పాయి. ఈ బోర్డులో మెజారిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి ఉంటారని పేర్కొన్నాయి.


