ప్రధాన వార్తలు
పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచమంతా ఇరాన్ తీరును నిశితంగా పరిశీలిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్.. తన క్షిపణులను నేరుగా వారిపై ప్రయోగించాల్సింది పోయి, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాల వైపు మళ్లించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇది ఇరాన్ బలహీనతా? లేక వ్యూహాత్మక చర్యలో భాగంగా వేస్తున్న ఒక ఎత్తగడా? అసలు పొరుగు దేశాలే ఇరాన్ టార్గెట్గా ఎందుకు అయ్యాయి? అనే అంశాలు చూద్దాం.మిత్రదేశాల ముసుగులో శత్రు స్థావరాలుఇరాన్ తన క్షిపణులను ఇరుగుపొరుగు దేశాల వైపు మళ్లించడానికి ప్రధాన కారణం.. ఆయా దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు. బహ్రెయిన్, కతార్, కువైట్.. వంటి ప్రాంతాల్లో అమెరికాకు చెందిన భారీ నౌకాదళ, వైమానిక స్థావరాలు ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడుల్లో ఈ స్థావరాలే వేదికలయ్యాయి. దాంతో నేరుగా వాషింగ్టన్పై దాడి చేయలేని ఇరాన్, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్లను లక్ష్యంగా చేసుకుంది.ప్రాంతీయ ఆధిపత్యంగతంలో ఇరాన్ తన పరోక్ష యుద్ధాన్ని (ప్రాక్సీ వార్) హమాస్, హిజ్బుల్లా ద్వారా నడిపించేది. కానీ 2024-25 మధ్య జరిగిన పరిణామాల్లో ఇజ్రాయెల్ ఈ గ్రూపులను తీవ్రంగా దెబ్బతీసింది. సిరియాలో అస్సాద్ ప్రభుత్వం కూలిపోవడం, హిజ్బుల్లా నాయకత్వం తుడిచిపెట్టుకుపోవడంతో ఇరాన్ కొంత బలహీనపడింది. దీంతో తన ఉనికిని చాటుకోవడానికి పొరుగున ఉన్న ఇజ్రాయెల్ అనుకూల దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.ఇంధన మార్కెట్ అతలాకుతలంయుద్ధం కొనసాగితే ఇరాన్ ఆర్థికంగా తట్టుకోవడం కష్టం. అందుకే, గల్ఫ్ దేశాల్లోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోందని అభిప్రాయాలున్నాయి.హోర్ముజ్ జలసంధి మూసివేత: ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని మూసివేయడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలపై ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ ప్లాన్. పొరుగు దేశాలపై దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తే తమ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయనే హెచ్చరికను ఇరాన్ పంపాలని చూస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.అంతర్గత అశాంతి నుంచి దృష్టి మళ్లింపు2026 జనవరి నుంచి ఇరాన్ తీవ్రమైన దేశీయ నిరసనలతో అట్టుడుకుతోంది. ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. బయటి దేశాలపై దాడులు చేయడం ద్వారా జాతీయవాదాన్ని రగిల్చి ప్రజల దృష్టిని అంతర్గత సమస్యల నుంచి మళ్లించాలని ఇరాన్ పాలకులు చూస్తున్నారు.అధికార మార్పు భయంప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్లో పాలన మార్పును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న దాడులు కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాదు, కీలక నాయకత్వంపై కూడా జరుగుతున్నాయి. తమ మనుగడకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఒక గాయపడిన సింహంలా ఇరాన్ తన పక్కనున్న చిన్న దేశాలపై విరుచుకుపడుతోంది. ఇది అమెరికాను చర్చల వైపు మళ్లించే ప్రయత్నం కూడా కావచ్చని కొందరి అభిప్రాయం.
బంగారం ధరల్లో ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఇరాన్ సంక్షోభం.. ఎగుమతులు, దిగుమతులపై నీలినీడలు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటనూనెల విభాగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి, అటు నూనె గింజల దిగుమతులపై.. ఇటు ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.భారతదేశం తన వంటనూనె అవసరాల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్; అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ ఆయిల్; రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ భారత్కు వస్తుంటాయి. అయితే, ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి, సూయజ్ కాలువ గుండానే సాగుతాయి.ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే, ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే రవాణా, బీమా ఖర్చులు పెరిగి అది దేశీయంగా వినియోగదారుడిపై భారం మోపుతుందని అంచనా వేస్తున్నారు.ఎగుమతులపై దెబ్బకేవలం దిగుమతులే కాకుండా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఆయిల్ మీల్స్(నూనె గింజల నుంచి నూనెను తీసేసిన తర్వాత మిగిలే ఉప ఉత్పత్తి ) ఎగుమతులు కూడా ప్రతిష్టంభనను ఎదుర్కోవచ్చు. భారత ఆయిల్ మీల్స్ ఎగుమతుల్లో ఆగ్నేయాసియా వాటా 65% కాగా, పశ్చిమాసియా (గల్ఫ్) 20%, యూరప్ 15% వాటాను కలిగి ఉన్నాయి. యుద్ధం ముదిరితే గల్ఫ్, యూరప్ దేశాలకు జరిగే ఎగుమతుల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంది.క్రూడాయిల్ ధరల పెరుగుదల కేవలం రవాణా ఖర్చులనే కాకుండా గ్లోబల్ బయోఫ్యూయల్ మార్కెట్ ద్వారా వంటనూనెల ధరలను కూడా ప్రభావితం చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువలో వచ్చే మార్పులు కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతాయని అంటున్నాయి.
ఏఐపై అత్యంత భారీ పెట్టుబడులు
ఇటీవల నిర్వహించిన 2026 ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భారీ పెట్టుబడులకు తెరలేచినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఏఐపై కార్పొరేట్ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్సహా అదానీ గ్రూప్, గూగుల్, టాటా, లైట్స్పీడ్ వెంచర్స్ తదితరాలు ఉమ్మడిగా 240 బిలియన్ డాలర్లు(రూ. 21.84 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు కట్టుబాటును ప్రదర్శించాయి. గత నెల 16–21 మధ్య నిర్వహించిన ఏఐ సదస్సు సుమారు 6 లక్షల మంది హాజరైన అతిపెద్ద ఈవెంట్గా నిలుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 100 దేశాల నుంచి ప్రతినిధులు, 20 అంతర్జాతీయ సంస్థలు వీటిలో పాలుపంచుకున్నట్లు వెల్లడించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫౌండేషన్ మోడళ్లు, హార్డ్వేర్, అప్లికేషన్లు తదితర విభాగాలలో 200 బిలియన్ డాలర్లకుపైగా ఏఐ సంబంధిత పెట్టుబడులకు కట్టుబాటు కనిపించినట్లు తెలియజేసింది. దిగ్గజాలు ఇలా..ఏఐ సదస్సులో డైవర్సిఫైడ్ దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏఐ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 110 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు ప్రకటించింది. ఏడేళ్లలో వీటిని వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2035కల్లా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించింది. జనరల్ కేటలిస్ట్ ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్కు కమిట్మెంట్ను ప్రకటించింది. ఈ బాటలో లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమని తెలియజేసింది.గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొత్తగా ఇండియా– యూఎస్ సబ్సీ కేబుల్ మార్గంసహా.. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించారు. వీటిలో విశాఖపట్టణంలోని ఏఐ హబ్ సైతం కలసి ఉంది. ఇక టాటా గ్రూప్ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఓపెన్ఏఐతో భాగస్వామ్యాన్ని ప్రకటించడం గమనార్హం! ఈ సదస్సులో దేశ సావరిన్ కంప్యూట్ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు కీలక ప్రకటన వెలువడింది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన 38,000 జీపీయూలకు జతగా కొద్ది వారాలలో మరో 20,000 జీపీయూలకు తెరతీయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో నేషనల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత పటిష్టంకానుంది. 850 ఎగ్జిబిటర్లతో 10 థిమాటిక్ పెవిలియన్లతో ఏర్పాటైన ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఏఐ ఎగ్జిబిషన్లలో ఒకటిగా నిలిచినట్లు ప్రస్తావించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు
ఇన్వెస్టర్ల రక్షణకు టెక్ ప్రొటెక్షన్
ఇటీవల స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య బలపడుతున్న నేపథ్యంలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పెట్టుబడుల రక్షణకు టెక్ సేవలను అధికంగా వినియోగించనున్నట్లు తెలియజేశారు. వెరసి టెక్నాలజీ ఆధారిత సర్వీసుల ద్వారా ఐపీవో పెట్టుబడులకుముందు జరుగుతున్న మోసాలను నివారించనున్నట్లు తెలియజేశారు. దీంతో రిజిస్టర్ ఇంటర్మీడియరీల జోక్యంలేకుండానే ఇన్వెస్టర్ల పెట్టుబడులు దారి మళ్లుతుండటాన్ని అడ్డుకోనున్నట్లు వెల్లడించారు. సెబీ చైర్మన్గా మార్చి 1కల్లా ఏడాది కాలం పూర్తి చేసుకున్న పాండే పలు అంశాలపై స్పందించారు. నకిలీ యాప్స్ ఎఫెక్ట్మార్కెట్లపట్ల ఆసక్తి చూపుతున్న పలువురు కొత్త ఇన్వెస్టర్లను అత్యధిక రిటర్నుల ఆశ చూపుతూ నకిలీ ట్రేడింగ్ యాప్స్, వాట్సాప్ గ్రూప్లు మోసం చేస్తున్నట్లు పాండే పేర్కొన్నారు. వీటితో మదుపరులను తప్పుదారిపట్టిస్తూ వారి సొమ్మును మోసగాళ్ల వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి ఇన్వెస్టర్లలో అప్రమత్తతను, అవగాహనను పెంచవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ఇష్యూలలో ఇన్వెస్ట్ చేయదలచిన రిటైల్ ఇన్వెస్టర్లను మోసగాళ్లు సెబీ వద్ద రిజిస్టరైన ఇంటర్మీడియరీలకు తెలియకుండానే సొమ్మును దారిమళ్లిస్తున్నట్లు వివరించారు. అత్యున్నత ఆర్జన ఆశచూపి మోసగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇందుకు వాట్సాప్ గ్రూప్లు, నకిలీ యాప్స్, తదితర డిజిటల్ చానళ్ల ద్వారా వలపన్నుతున్నట్లు తెలియజేశారు. ఈ తరహా మోసాలు ఇటీవల అధికమైనట్లు ప్రస్తావించారు. పెట్టుబడులకు దిగేముందు ఆయా సంస్థల గుర్తింపును ధృవీకరించుకునేందుకు సెబీ చెక్ తదితర టూల్స్ను వినియోగించుకోవడం ప్రయోజనకరంకాగలదని ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి పలు చర్యల ద్వారా విస్తారంగా ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచవలసి ఉన్నదని, తద్వారా మాత్రమే సైబర్ మోసాలకు చెక్ పెట్టగలమని వివరించారు.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు
జపాన్ అగ్రి బిజినెస్కు మహీంద్రా టాటా
పోర్ట్ఫోలియో క్రమబద్ధీకరణలో భాగంగా జపనీస్ అగ్రిమెషనరీ బిజినెస్ నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) వెల్లడించింది. వ్యూహాత్మక సమీక్ష ప్రభావంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. జపాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిత్సుబిషీ మహీంద్రా అగ్రికల్చరల్ మెషీనరీ(ఎంఏఎం) బోర్డు వ్యవసాయ రంగ మెషీనరీ బిజినెస్ నుంచి తప్పుకునేందుకు అనుమతించినట్లు తెలియజేసింది.అయితే వీటికి సంబంధించిన విడిభాగాలు, ఉత్పత్తుల వారంటీ సర్వీసులను కొనసాగించనున్నట్లు పేర్కొంది. అక్కడి చట్టాల ప్రకారం ఎంఏఎం మూసివేత, లిక్విడేషన్ ప్రక్రియకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. లాభదాయక స్థితిని సాధించేందుకు పలురకాల వ్యవస్థాగత చర్యలు చేపట్టినప్పటికీ నష్టాలు వాటిల్లుతూనే ఉన్నట్లు వెల్లడించింది.దీంతో బిజినెస్ దీర్ఘకాలిక నిర్వహణ, ఆర్థికంగా కొనసాగగలిగే పరిస్థితులపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాక భవిష్యత్లో నిలకడగా బిజినెస్ను కొనసాగించడం సవాలేనని నిర్ణయానికి వచ్చినట్లు వివరించింది. లిక్విడేషన్ ప్రక్రియ ముగిశాక నష్టాలకు ప్రమోటర్ గ్రూప్ ఫండింగ్ను చేపడుతుందని తెలియజేసింది. వెరసి 2027 తొలి అర్ధభాగంలో అగ్రికల్చరల్ మెషీనరీ తయారీ, అమ్మకాలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు
కార్పొరేట్
బంగారం ఎన్బీఎఫ్సీలకు పండగే!
EPF వడ్డీ యథాతథం.. ఖాతాల్లోకి జమ ఎప్పుడంటే?
విక్రేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్!
ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందా?: PIB హెచ్చరిక
నాడు కట్టుబట్టలతో ప్రయాణం: నేడు దుబాయ్లో వేలమందికి ఉద్యోగం!
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
ట్రావెల్కి హోలీ జోష్
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
టీసీఎస్ కోడ్విటా ఛాంపియన్ 2026 విజేతలు
యస్ బ్యాంక్ ఫారెక్స్ కార్డులతో రూ.2.5 కోట్ల ఫ్రాడ్
బంగారం లాంటి న్యూస్! పసిడి ధరలు రివర్స్!!
దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) ఉపశమనమిచ్చాయి...
1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో క...
పశ్చిమాసియా పైనే మార్కెట్ ఫోకస్
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాలు ఈ వారం దేశీ స్ట...
ఊహకందని స్థాయికి చేరిన బంగారం ధర!
బంగారం తగ్గుతుందని సంబరపడేలోపే.. ఇజ్రాయెల్, ఇరాన్ ...
ద్రవ్యలోటు రూ.9.8 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ...
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గొడవేంటి?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా తెరచాటున సాగుతు...
సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు
భారతీయ వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులకు సమయం ...
రూ.58 వేల కోట్లతో 15 మంది ఆర్థిక నేరగాళ్లు పరారు!
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవాల్సిన బ్యాంక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏఐ ఎంత ఎదిగినా.. భర్తీ చేయలేని పనులు ఇవే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ కొన్ని వృత్తులను, ఉద్యోగాలను భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ప్రకారం.. పిల్లలను చూసుకోవడం, వృద్ధులను సంరక్షించడం, బోధన చేయడం, ప్రకృతిపట్ల ప్రేమతో.. అటవీ రక్షకులుగా పనిచేయడం, దేవాలయంలో భక్తితో నిత్యకార్యాలు నిర్వహించడం వంటివి ఏఐ చేయలేదు. ఇవన్నీ కేవలం డబ్బు సంపాదన కోసం చేసేవి కాదు. ఇవి బాధ్యత, ప్రేమ, నిబద్దత, ఆత్మసంతృప్తి కోసం చేస్తారు.నిజానికి ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి విలువను, విలువలను తగ్గిచలేదు. కొన్ని రంగాల్లో మనిషికంటే గొప్పగా ముందుకు సాగినప్పటికీ, మనిషి ఆలోచనలను అందుకోవడం కష్టం అనే చెప్పాలి. అంతే కాకుండా.. భవిష్యత్తులో సమాజం కూడా ఆర్థిక ప్రమాణాలకన్నా, మనసుకు దగ్గరైన విలువల చుట్టూ తిరిగే విధంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.If our notion of self-worth comes from the economic value we add, or if it comes our intellectual pretense (*cough*), AI may pose a serious challenge to our self-worth.On the other hand no one takes up activities like taking care of children, teaching children, taking care of…— Sridhar Vembu (@svembu) February 27, 2026
ఫోన్ ఛార్జర్కి ఇంత కథ ఉందా!
కొన్ని పరికరాలు పని చేయాలంటే కరెంట్ అవసరం. మరికొన్ని పరికరాలు పనిచేయాలంటే ఛార్జింగ్ అవసరం. ముఖ్యంగా ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్ తప్పనిసరి. మరి ఈ ఛార్జర్ ఎప్పుడు పుట్టిందో తెలుసా?ప్రారంభ కాలంలో ఫోన్ ఛార్జ్ చేయడానికి గంటలకు పైగా పట్టేది. ఇది కూడా 30 నిమిషాలు మాత్రమే నిలిచేది. 1990ల అనంతరం ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత నోకియా, మోటరోలా, శామ్సంగ్ ఫోన్ సంస్థలు ప్రత్యేకమైన ఛార్జర్లు తయారు చేశారు. ఒక ఫోన్కు వాడే ఛార్జర్ మరొక ఫోన్కు వాడే అవకాశం లేకుండా చేశారు. దీంతో ఆయా ఫోన్ల కోసం వినియోగదారులు వేర్వేరు ఛార్జర్లు కొనాల్సి వచ్చేది.ఆ తర్వాత యూఎస్బి (యూనివర్సల్ సీరియల్ బస్) ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్ తయారీ సంస్థలు ఛార్జర్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఛార్జర్లు ప్రామాణికంగా మారాయి. గంటలకొద్దీ ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా తర్వగా ఛార్జింగ్ అందేలా ఛార్జర్లను తయారు చేయడం ప్రారంభమైంది. ఛార్జర్కు వైర్లెస్గా తయారు చేయడానికి 2000 సంవత్సరం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2010లో తయారు చేయగలిగారు. ప్రస్తుతం మార్కెట్లో వైర్లెస్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి.చాలామంది ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతుంటారు. దీనివల్ల కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పడుకునేముందు ఛార్జింగ్ పెట్టి ఉదయం దాకా ఉంచడం కూడా సరైన పని కాదంటున్నారు. దీనివల్ల కరెంట్ షాక్, అగ్నిప్రమాదాలు జరిగాయని అంటున్నారు. ఫోన్లో 100 శాతం ఛార్జింగ్ ఎప్పుడూ పెట్టకూడదని, 90 శాతం కంటే తక్కువ ఉంటే సరిపోతుందని అంటున్నారు.
అలా ఆలోచిస్తేనే ‘రిచ్’ అవుతారు.. కియోసాకీ హెచ్చరిక!
అమెరికా ఫిన్టెక్ దిగ్గజం .. స్క్వేర్, క్యాష్ యాప్లకు చెందిన బ్లాక్ (Block Inc.) కంపెనీ ఊహించని నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని సుమారు 10 వేల మంది ఉద్యోగుల్లో 40 శాతం.. అంటే 4,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని స్వయంగా కంపెనీ సీఈఓ జాక్ డార్సీ (ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు) ఇటీవల ప్రకటన చేశారు. ఇది ఆర్థిక సంక్షోభం వల్ల కాదు, కంపెనీ లాభాలు బాగున్నాయి.. షేర్లు 20-25 శాతం పెరిగాయి. కారణం ఒక్కటే.. కృత్రిమ మేధస్సు (AI)!"ఇంటెలిజెన్స్ టూల్స్ (AI) వాడితే చిన్న టీమ్తోనే ఎక్కువ పని, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇది కంపెనీల నడిపించే విధానాన్నే మార్చేసింది" అని డార్సీ స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రతి ఉద్యోగి కంపెనీకి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినా, ఇప్పుడు వాళ్ల పనిని ఏఐ చేస్తోందని అంగీకరించారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 6 వేల దాటకుండా తగ్గించాలని నిర్ణయించారు.ఈ పరిణామంపై ప్రసిద్ధ ఆర్థిక గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకీ (Robert Kiyosak) ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ శక్తివంతమైన పోస్ట్ చేశారు. "ఏఐ ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తోంది" అంటూ ఆయన హెచ్చరించారు. "ఉద్యోగిలా ఆలోచిస్తే ఏఐ మిమ్మల్ని భర్తీ చేస్తుంది. అదే వ్యాపారవేత్తలా ఆలోచిస్తే, డార్సీలా ఏఐని 'హైర్' చేసుకుని మీరు ధనికులవుతారు" అని స్పష్టంగా చెప్పారు.AI MAKES the RICH RICHER:Jack Dorsey just fired 4400 hundred employees. Not because the company needed the money.Dorsey admitted each employee made his company millions of dollars.Dorsey fired 4400 employee because AI could do their jobs.RICH DAD LESSON:Think like an…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 27, 2026
ఐక్యూ15ఆర్ స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ కొత్తగా 15ఆర్ ఫోన్ను మార్కెట్లో లాంచ్ చేసింది. డిస్కౌంట్లు, ఆఫర్లు పోగా ధర రూ. 40,999 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 3 నుంచి అమెజాన్, ఐక్యూ ఈ-స్టోర్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ మొదలైన వాటిల్లో సేల్ మొదలవుతుంది.ఇందులో 6.59 అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 జెన్ 5, 7600 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ కంప్యూటింగ్ చిప్ క్యూ2, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6.0 తదితర ఫీచర్లు ఉంటాయి. 4 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
పర్సనల్ ఫైనాన్స్
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్... జాగ్రత్తలు
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్ విషయంలో వహించాల్సిన జాగ్రత్తలు గతంలో ఎన్నోసార్లు ఉదాహరణలతో తెలుసుకున్నాము. మన్మథరావు గారి కొడుకు, కోడలిది ప్రేమ వివాహం. తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అతి తెలివితేటలున్న స్నేహితుల సలహా ప్రకారం... ఇద్దరూ వారికొచ్చిన ఇంటి అద్దె అలవెన్సుని మొత్తం మినహాయింపు పొందడానికి అవసరమైనంత మొత్తానికి రశీదులు ఇచ్చి మినహాయింపు పొందుతున్నారు. మన్మథరావు పలుసార్లు వారించినా ఫలితం లేకపోయింది. ఒకే నగరం, ఒకే చోటు ఉంటూ చెరొక రశీదు సబ్మిట్ చేసి నాటకం ఆడుతున్నారు. ఈ దంపతుల్ని మించిపోయాడు వైకుంఠం గారు. పెళ్లి అయిన నాటి నుంచి మామగారి ఇంట్లోనే మకాం. మామగారికి అద్దె చెల్లిస్తున్నట్లు క్లెయిమ్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత మామ చనిపోయారు. వైకుంఠం జీతం పెరిగింది. ఇంటి అద్దె అలవెన్సు పెరిగింది. ఎంత పెరిగిందో.. అంతా, పాతది వెరసి మొత్తానికి ఎంత అద్దె ఉండాలో అంత అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు సబ్మిట్ చేస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ల తర్వాత ఇంత అద్దె పుచ్చుకుంటున్న ఆ సదరు పెద్ద మనిషి ‘ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు’ వేస్తున్నారా లేదా అని ఆరా తీసారు అధికారులు. అడ్రసు పట్టుకొని మామ గారి ఇంటికెళ్లారు. గుమ్మం మీద మామ నేమ్ బోర్డు ఉంది. ఇంటి నెంబరు సరిపోయింది. కానీ అడుగు ముందుకేసి అడిగే సరికి అత్తగారు ప్రత్యక్షం. ‘సుబ్బారావు గారు ఉన్నారా’ అధికారుల ప్రశ్న..! అత్తగారి నోటి నుంచి మాటలు రావడం లేదు పైగా కన్నీళ్లు... ‘ఎవరు బాబు మీరు.. ఆయన చనిపోయిన మూడేళ్లకి తీరుబాటు అయ్యిందా పరామర్శకి’ అన్నారు. ‘అదికాదండీ.. మీ అల్లుడు వైకుంఠం గారు ...’ అన్నారు అధికారులు. ‘ఆయన ఇక్కడెందుకు ఉంటారు. వీధి చివరి ఇల్లు. అధికారులకు అర్థం అయ్యింది పరిస్థితి. మెల్లగా కూపీ లాగారు. అధికారులు నోటీసులిచ్చి పిలిపించారు. అన్నీ ఒప్పుకున్నాడు వైకుంఠం. దొంగ రశీదులు, దొంగ సంతకాలు, దొంగ క్లెయిమ్లు.. అన్నింటిని మించి అద్దె పక్కా ఆదాయంగా డిక్లేర్ చేయకపోవడం... అసెస్సుమెంటు చూశారు. తప్పులన్నీ సవరించారు. పన్ను, వడ్డీ, పెనాల్టీలు 200%... ఆ షాకుతో ఇంటి అవసరం లేకుండా వైకుంఠం డిపార్టుమెంటు వరండాలోనే తిరుగుతున్నారు. బహుశా ఇటువంటి బాపతులు చాలా మంది కనిపించి ఉంటారు డిపార్ట్మెంట్ వారికి... కొత్త రూలు వచ్చింది. ముసాయిదా రూల్స్ ప్రకారం ఇక నుంచి .. అంటే ఏప్రిల్1వతేదీ, 2026 నుంచి ఏడాది అద్దె రూ.1,00,000 దాటితే.. ఫారం 124 ఇవ్వాలి. ఓనర్ పేరు, అడ్రస్, పాన్.. మీకు ఓనర్కి చుట్టరికం ఏమిటి? చుట్టమంటే ... అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా... ఇలాంటి వివరాలు సంపూర్ణంగా సేకరించి ఓనర్ ఆదాయాన్ని ట్రాక్ చేస్తారు. బ్యాంకు అకౌంటుని చెక్ చేస్తారు. ఆ వ్యక్తి ఈ ఆదాయం తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులలో చూపిస్తే సరి.. లేదా కొంప కొల్లేరు అవుతుంది. మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. షరా మామూలే అయితే గోవిందా..! ముందు ఓనర్ గారికి నోటీసులు ఇస్తారు అన్నీ ఆరా తీస్తారు. సక్రమంగా అన్ని డిక్లేర్ చేస్తే సరేసరి.. లేదంటే పన్ను, వడ్డీ 200% పెనాల్టీలు.అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువుకి ఎటువంటి ఆదాయం లేకుండా ఇంటి అద్దె ఆదాయమే అనుకొండి.. రూ.12,00,000 దాకా పన్ను భారం ఉండదు. కావున నిశ్చింతగా ఆ ఇంట్లోనే ఉండండి. బ్యాంకు ద్వారా అద్దె ఇవ్వండి. కాస్త శ్రమ తీసుకొని ఓనర్ చేత రిటర్ను వేయించండి.
టాటా ఏఐజీ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్సిడెంట్ సూపర్ గార్డ్ ప్లస్’ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో సమగ్ర ఆర్థిక రక్షణను అందించే వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ఇదని, దేశంలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. వ్యక్తుల ఆదాయం, అప్పులు, జీవనశైలి రిస్క్లకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.ప్రమాద మరణం, శాశ్వత పాక్షిక, పూర్తి వైకల్యంలో ఏక మొత్తంలో బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అయ్యే ఖర్చులకు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. లోన్ షీల్డ్ (రుణాల కోసం), ఈఎంఐ ప్రొటెక్షన్, పెట్కేర్ పేరుతో ఐచ్ఛిక కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిపై వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ ప్లాన్ను తీసుకోవచ్చు. వేతన జీవులకు ప్రీమియంలో అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
హెల్త్కు సూపర్ టాపప్!
పదేళ్ల కిందట హెల్త్ ఇన్సూరెన్స్ అంటే... లక్ష రూపాయలు చాలు. ఆ మాత్రం కవరేజీ ఉంటే హ్యాపీ. ఇక రెండు లక్షలంటే లగ్జరీకిందే లెక్క. మరిప్పుడు? చాలామంది తమకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు కవరేజీ ఉన్నా సరే ధీమాగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. ఏ పరీక్షల్లో ఏం బయటపడుతుందో తెలియదు. దానికి ఎన్ని లక్షలవుతుందో తెలియదు. ఎందుకంటే జీవనశైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. దానికి తగ్గట్లే అత్యాధునిక హంగులతో కార్పొరేట్ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. ఖర్చు ఏటా 14% చొప్పున పెరుగుతోందన్నది ఒక అంచనా. మరిప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే టాపప్. ఆ వివరాలే ఈ ‘వెల్త్ స్టోరీ’అవసరానికి పనికిరాకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎంత బీమా కవరేజీ ఉన్నదనేది ఇప్పుడు ప్రధానం కాదు. అది ఎంతవరకూ అవసరానికి పనికొస్తుందన్నదే ప్రధానం. చాలామందికి రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల కవరేజీ ఉంటోంది. చాలా సందర్భాల్లో అది సరిపోతుంది. కానీ పెద్ద ప్రమాదం జరిగితేనో, కేన్సర్ వంటి మహమ్మారి చికిత్సలు అవసరమైతేనో అది ఎంతమాత్రం చాలదు. ఎందుకంటే కేన్సర్ చికిత్సకు దాని స్టేజ్ను బట్టి ఆరంభంలో రూ.15 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంటుంది. ఇక వైద్యం ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ఉండటంతో చికిత్సల వ్యయాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 14 శాతంగా ఉంటున్న వైద్య ద్రవ్యోల్బణం మనకు తెలియకుండానే.. మన బీమా రక్షణ కవరేజీ సామర్థ్యాన్ని తినేస్తోంది. గతంలో రూ.3000 ఉన్న ఆసుపత్రి రూమ్ చార్జీ ఇపుడు రూ.6వేలు దాటిపోయింది. ఇపుడు తీసుకున్న రూ.5 లక్షల బీమా ఐదేళ్ల తర్వాత రూ.2.5 లక్షలకు సమానం. కనుక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య బీమానూ సమీక్షించుకోవాలి. ప్రీమియం భారం..? వైద్య చికిత్సల వ్యయాలు, క్లెయిమ్లకు అనుగుణంగా బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తుంటాయి. దీంతో కరోనా తర్వాతి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 50 శాతానికి పైనే పెరిగాయి. అధిక ఆయుర్దాయం, పెరిగిపోతున్న వ్యాధులు, కరోనా విపత్తు అనంతరం ఆరోగ్య సమస్యలతో కంపెనీలపై క్లెయిమ్ల భారం పడడం ఈ పరిస్థితికి కారణం. ఇక వయసును బట్టి ప్రీమియంల పెంపు సహజంగానే చూస్తుంటాం. 35– 40, 45–50, 60 తర్వాత ప్రీమియం ఎంతలేదన్నా 20 శాతం మేర పెరుగుతుంటుంది. కనుక చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు భారీ ప్రీమియంతో ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ (బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్) తీసుకోవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో తక్కువ ప్రీమియానికి అదనపు రక్షణనిచ్చే టాపప్, సూపర్ టాపప్ ప్లాన్ల గురించి, ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయన్నది తప్పకుండా తెలుసుకోవాలి. టాపప్ ప్లాన్లు.. పరిమిత ప్రీమియానికి అదనపు ఆరోగ్య బీమా రక్షణను టాపప్, సూపర్ టాపప్లు అందిస్తుంటాయి. బేస్ పాలసీ కవరేజీని రూ.5 నుంచి రూ.15 లక్షలకు పెంచుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువుంటుంది. కానీ రూ.15 లక్షల సూపర్ టాపప్ ప్రీమియం చాలా తక్కువ. ఇవి బేస్ పాలసీతో అనుసంధానమై పనిచేస్తాయి. ‘డిడక్టబుల్’ (తగ్గించడం) ఇక్కడ కీలకం. టాపప్ అయినా, సూపర్ టాపప్ అయినా కనీస డిడక్టబుల్తో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకున్నారనుకుంటే.. హాస్పిటల్ బిల్లు రూ.5 లక్షల్లోపే ఉంటే టాపప్, సూపర్ టాపప్తో పని ఉండదు. బేస్ పాలసీలోనే క్లెయిమ్ పరిష్కారం అవుతుంది. బిల్లు రూ.5 లక్షలు దాటినప్పుడు ఈ ప్రత్యేక ప్లాన్లు యాక్టివ్గా మారతాయి. అదనపు మొత్తాన్ని అందిస్తాయి. బిల్లు రూ.8 లక్షలు వచి్చందనుకుందాం. అప్పుడు బేస్ పాలసీ రూ.5 లక్షలు, టాపప్ లేదా సూపర్ టాపప్ రూ.3 లక్షలు చెల్లిస్తాయి. రెండూ వేర్వేరు.. ఇక్కడ టాపప్, సూపర్ టాపప్ రెండూ డిడక్టబుల్తో వచ్చినప్పటికీ.. కొంత స్పష్టమైన వైరుధ్యం ఉంది. టాపప్, సూపర్ టాపప్ రెండూ ‘డిడక్టబుల్’ దాటిన సందర్భాల్లో అమల్లోకి వస్తాయి. ఇందులో టాపప్ ప్లాన్ అనేది ఒకసారి ఆసుపత్రిలో చేరినపుడు ఆ క్లెయిమ్ మొత్తం డిడక్టబుల్ మొత్తాన్ని మించినప్పుడే అమలవుతుంది. సూపర్ టాపప్ అలా కాదు. ఒక బిల్లు డిడక్టబుల్ను మించిన సందర్భాల్లోనూ చెల్లింపులు చేస్తుంది. అలాగే, ఒక పాలసీ సంవత్సరంలో విడిగా ఒక్కో బిల్లు డిడక్టబుల్ దాటకుండా.. అన్నీ కలసి డిడక్టబుల్ను మించిన సందర్భంలోనూ చెల్లింపులు చేస్తుంది. పాలసీ కవరేజీబేస్ ప్లాన్ రూ.10 లక్షలు టాపప్ రూ.20 లక్షలు సూపర్ టాపప్ రూ.20 లక్షలు డిడక్టబుల్ రూ.10 లక్షలుఒక ఏడాదిలో క్లెయిమ్లు మొదటి క్లెయిమ్ 4 లక్షలు రెండో క్లెయిమ్ 3.50 లక్షలు మూడో క్లెయిమ్ 4.50 లక్షలు మొత్తం రూ.12 లక్షలు → ఇందులో టాపప్ ప్లాన్ కింద ఎలాంటి చెల్లింపులు రావు. ఎందుకంటే విడిగా ప్రతీ క్లెయిమ్ డిడక్టబుల్ రూ.10 లక్షలుమించలేదు. → సూపర్ టాపప్ ప్లాన్ మాత్రం విడిగా ఒక క్లెయిమ్ అనే కాకుండా, ఒక ఏడాదిలో మొత్తం క్లెయిమ్లు రూ.10 లక్షలు మించినా యాక్టివేట్ అవుతుంది. కనుక రూ.10 లక్షలు డిడక్టబుల్ పోను మిగిలిన రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరారన్న దానితో సంబంధం లేకుండా డిడక్టబుల్ దాటిన తర్వాత నుంచి ఆ పాలసీ సంవత్సరంలో అయ్యే వ్యయాలు అన్నింటికీ పాలసీ గరిష్ట పరిమితి మేరకు చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.20 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే.. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు మించి, రూ.20 లక్షల వరకు పాలసీ నిబంధనల మేరకు చెల్లింపులు అందుకోవచ్చు. → టాపప్లో ఈ ఫీచర్ లేదు. ఏ బిల్లు అయినా డిడక్టబుల్ దాటినప్పుడే యాక్టివేట్ అవుతుంది. → ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాల్లో వైద్యం అవసరమవుతుందో తెలియదు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అన్నది కుటుంబం అంతటికీ ఉద్దేశించినది. ఒక ఏడాదిలో ఒకరు ఆస్పత్రి పాలై బేసిక్ కవరేజీ ఖర్చయిపోయితే, అదే ఏడాది అదే కుటుంబంలో మరొకరికి వైద్యం అవసరం పడొచ్చు. అటువంటప్పుడు సూపర్ టాపప్ ప్లాన్ ఆదుకుంటుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్తులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల కారణంగా ఒకే ఏడాది కుటుంబంలో ఒకరికి మించి వైద్యం అవసరం ఏర్పడొచ్చు. ఏది తీసుకోవాలి..? → వివాహం కాని వారు, ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్తోపాటు టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. → కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకునే వారికి సూపర్ టాపప్ అనుకూలం. → బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్ కంపెనీ నుంచే టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలని లేదు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి కాదు. పాలసీదారులు తమకు నచి్చన సంస్థ నుంచి ఈ రక్షణలను ఎంపిక చేసుకోవచ్చు. → ఒకే కంపెనీ నుంచి బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ ఉంటే క్లెయిమ్లు సాఫీగా పరిష్కారం అవుతాయి. టాపప్–సూపర్ టాపప్ క్లెయిమ్ కోసం పెద్దగా శ్రమ పడక్కర్లేదు. → టాపప్– సూపర్ టాపప్ ప్లాన్ ప్రీమియం తక్కువ కోరుకుంటే, వేర్వేరు కంపెనీల నుంచి ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. → బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ కవరేజీల్లో ఏకరూపత ఉంటే మంచిది.వీటిపై ఫోకస్ చేయండి.. → బీమా కంపెనీ ఆస్పత్రుల నెట్వర్క్ ఎంత బలంగా ఉందో చూడాలి. తాము నివసించే ప్రాంతంలో దాదాపు అన్ని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా కంపెనీ నగదు రహిత ఆస్పత్రుల నెట్వర్క్లో ఉంటే నయం. → ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా.. అదే రోజు చికిత్స తీసుకుని వెళ్లిపోయే (డే కేర్ ప్రొసీజర్స్) చికిత్సలకు (అన్నింటికీ) కవరేజీ ఉన్నాయేమో ధ్రువీకరించుకోవాలి. → ఆస్పత్రిలో చేరడానికి ముందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కువ రోజులకు కవరేజీ ఉండాలి. → అత్యాధునిక రోబోటిక్, లేజర్ సర్జరీలకు పాలసీలో చెల్లింపుల ప్రయోజనాలు ఉంటే మెరుగు. → ముందస్తు వ్యాధులకు కవరేజీ ఎంత వెయిటింగ్ తర్వాత అమల్లోకి వస్తాయో తెలుసుకోవాలి. → ముఖ్యంగా రీసోర్టేషన్ ప్రయోజనం ఉంటే మంచిది. అంటే ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల సమ్ అష్యూర్డ్ మొత్తం ఖర్చయిపోతే.. తిరిగి అంతే మొత్తాన్ని తదుపరి వైద్యానికి బీమా సంస్థ పునరుద్ధరిస్తుంది. → ఎంపిక చేసుకునే పాలసీల ప్రీమియం భరించగలిగే స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. తగినంత కవరేజీ.. → చాలా కుటుంబాలు తమ అవసరాలకు సరిపడా రక్షణను (సమ్ అష్యూర్డ్) ఎంపిక చేసుకోవడం లేదని ఎన్నో సర్వేల్లో తేలింది. మెజారిటీ పాలసీదారుల రక్షణ అవసరానికంటే తక్కువే ఉంటోంది. → కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, వారికి అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? తాము నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో వైద్యానికి అయ్యే వ్యయాల ఆధారంగా కవరేజీని నిర్ణయించుకోవాలన్నది నిపుణుల సూచన. → కనీసం రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్తో బేసిక్ ప్లాన్, రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం సముచితంగా ఉంటుంది. దీనివల్ల నేటి వ్యయాలకే కాకుండా, భవిష్యత్తు వ్యయాలకు సైతం రక్షణను ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది.
జియో ఫైనాన్షియల్ యాప్లో వినూత్న ఫీచర్లు
ముంబై: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా విక్రయించే విధంగా తమ యాప్ను మార్కెట్ప్లేస్ తరహాలో విస్తరిస్తోంది. కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్లాంటి టెక్నాలజీలను పొందుపర్చడంతో వివిధ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తగు సలహాలు, ఫైనాన్షియల్ స్కోర్ మొదలైనవి కూడా ఇవ్వనుంది.ఆర్థిక సేవల పంపిణీని సరికొత్తగా నిర్వచించేలా ఇలాంటి వినూత్న ఫీచర్లను యాప్లో జోడిస్తున్నట్లు జేఎఫ్ఎస్ ఎండీ హితేష్ సేథియా తెలిపారు. యూజర్లు తమ సందేహాలు, అవసరాలను టైప్ చేస్తే వారికి అనువైన ఆర్థిక సాధనాలు, క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటికి గురించి యాప్ సిఫార్సు చేస్తుంది.దాదాపు ఏడాదిగా నిర్వహిస్తున్న యాప్కి ప్రస్తుతం 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు వివరిచారు. 50 క్రెడిట్ కార్డులు, 90 బీమా పథకాలను అందించేందుకు ఆయా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.


