Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 26 March 2026 in India1
బంగారం కాస్త కొత్త ధరలు..

దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stop Charging Extra for Gas Govt Warns Hotels and Restaurants2
గ్యాస్‌ చార్జీలు వసూలు చేస్తే.. ప్రభుత్వం వార్నింగ్‌

న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై ఎల్‌పీజీ ఛార్జీలు, గ్యాస్‌ సర్‌చార్జ్, ఫ్యూయల్‌ కాస్ట్‌ రికవరీ పేరుతో ఎలాంటి అదనపు చార్జీలు విధించవద్దని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ విభాగం (సీసీపీఏ) ఆదేశించింది. ఈ తరహా అనుచిత వాణిజ్య విధానాలను అనుసరిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019 కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. హోటళ్లు, రెస్టారెంట్ల మెనూల్లో పేర్కొన్న చార్జీలకు అదనంగా పన్నుల వరకే విధించగలరని స్పష్టం చేసింది.అన్ని రకాల తయారీ వ్యయాలు (ముడి సరుకులు, ఎల్‌పీజీ, విద్యుత్‌ సహా) మెనూ చార్జీల్లో భాగంగానే ఉండాలని, విడిగా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని పేర్కొంది. తాము ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఉల్లంఘనలను గుర్తిస్తే వినియోగారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దేవవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్‌ పేరుతో అదనపు చార్జీలు తీసుకుంటున్నట్టు తన దృష్టికి రావడంతో సీసీపీఏ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా చార్జీలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. చార్జీల బాదుడుపై ఫిర్యాదు అదనపు చార్జీలు వసూలుపై వినియోగదారులు ముందుగా హోటల్‌ను సంప్రదించి వాటిని తొలగించాలని కోరొచ్చని సీసీపీఏ సూచించింది. ఫలితం లేకపోతే 1915కు కాల్‌ చేసి లేదా ఎన్‌సీహెచ్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. అలాగే ఈ–జాగృతి పోర్టల్‌ ద్వారా వినియోగదారుల కమిషన్‌ ముందు ఫిర్యాదు దాఖలు చేయొచ్చని లేదా జిల్లా కలెక్టర్, సీసీపీఏకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

RBI Blocks 61 Million Cyberattack Attempts No Data Breach Reported3
మూడు నెలల్లో 6.1 కోట్ల సైబర్‌ దాడి యత్నాలు

భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెబ్‌సైట్‌పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2025) ఏకంగా 6.1 కోట్లకు పైగా సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు ఆర్‌బీఐ అధికారికంగా వెల్లడించింది. అయితే, అత్యాధునిక రక్షణ వ్యవస్థల కారణంగా ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఎటువంటి డేటా ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.మూడొంతులు పెరిగిన దాడుల తీవ్రతగత ఏడాది కాలంగా ఆర్‌బీఐ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే సైబర్ ముప్పు ఏ స్థాయిలో పొంచి ఉందో అర్థమవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - జూన్ మధ్య 1.9 కోట్లు, జులై - సెప్టెంబర్ మధ్య 3.1 కోట్లు, అక్టోబర్ - డిసెంబర్ మధ్య 6.1 కోట్ల సైబర్‌ దాడి యత్నాలు జరిగాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే దాడుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. దేశ కేంద్ర బ్యాంక్ కావడంతో దీని ప్రాముఖ్యత దృష్ట్యా హ్యాకర్లు నిరంతరం సాఫ్ట్‌వేర్లలో చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న శక్తివంతమైన ఫైర్‌వాల్‌లు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఈ ముప్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.రక్షణ వ్యవస్థలో ఏఐ విప్లవంపెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ తన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌లో కృత్రిమ మేధస్సు సాంకేతికతను అనుసంధానించింది. ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వాసుదేవన్ తెలిపిన వివరాల ప్రకారం.. వెబ్‌సైట్‌లోకి వచ్చే ప్రతి విజిటర్ డేటాను ఏఐ విశ్లేషిస్తుంది. సాధారణ వినియోగదారులకు, హ్యాకర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే బ్లాక్ చేస్తుంది. దాడి తీవ్రరూపం దాల్చకముందే దాని మూలాలను గుర్తించి అడ్డుకుంటుంది.భవిష్యత్తు ప్రణాళికలురాబోయే రోజుల్లో వ్యవస్థలో ఏఐ పాత్రను మరింత విస్తృతం చేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది. కేవలం భద్రతకే పరిమితం కాకుండా.. మోసపూరిత లావాదేవీలను క్షణాల్లో గుర్తించడం. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్ల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఏఐ చాట్‌బాట్‌లను మరింత అభివృద్ధి చేయడం వంటి విధానలు తీసుకురానున్నారు.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?

Indias Job Market to Surge 4 7pc Employment Growth Expected in H1 2026 274
ఏప్రిల్‌ నుంచి ఇక ఉద్యోగాల జాతరే..

ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి అర్ధభాగంలో ఉపాధి ఊపందుకోనున్నట్లు టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ప్రాజెక్ట్స్‌ నివేదిక పేర్కొంది. ఏప్రిల్‌–సెప్టెంబర్‌ కాలంలో ఉద్యోగాలు 4.7 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఈకామర్స్, టెక్‌ స్టార్టప్స్, హెల్త్‌కేర్, ఫార్మా, తయారీ(మ్యాన్యుఫాక్చరింగ్‌) రంగాలు ఊతమివ్వనున్నట్లు ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ రిపోర్ట్‌ పేరుతో విడుదల చేసిన నివేదికలో టీమ్‌లీజ్‌ తెలియజేసింది.భారీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఉపాధి కల్పన కనిపించనున్నట్లు తెలియజేసింది. వీటిలో 74 సంస్థలు విస్తరణ చేపట్టే సంకేతాలిచ్చినట్లు పేర్కొంది. మధ్యస్థాయి సంస్థలు 57 శాతం, చిన్న బిజినెస్‌లు 38 శాతం విస్తరణ యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. వెరసి విస్తరణ ద్వారా ఉపాధి కల్పన విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇటు డిజిటల్, అటు కీలక ఆర్థికవ్యవస్థ సంబంధిత పరిశ్రమల నుంచి ఉద్యోగాలకు డిమాండ్‌ ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఎకానమీ వృద్ధికి కీలకంగా నిలిచే రంగాలలో విద్యుత్, స్టీల్, చమురు గ్యాస్, సిమెంట్, ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టులు తదితరాలున్నాయి. 8.9 శాతం ఎన్‌ఈసీ అత్యధికంగా ఈకామర్స్, టెక్‌ స్టార్టప్‌లు 8.9 శాతం నికర ఎంప్లాయ్‌మెంట్‌ చేంజ్‌(ఎన్‌ఈసీ)కు కారణంకానున్నట్లు టీమ్‌లీజ్‌ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఫార్మాస్యూటికల్స్‌ 7 శాతం, తయారీ, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాలు 6.6 శాతం ఎన్‌ఈసీ సాధించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వచ్చే ఏడాది తొలి ఆరు నెలల్లో 4.7 శాతం ఎన్‌ఈసీ నమోదుకానున్నట్లు అభిప్రాయపడింది. నివేదికను 20 నగరాల నుంచి 23 రంగాలకు చెందిన 1,268 సంస్థల(ఎంప్లాయర్స్‌) అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా రూపొందించింది.ఇందుకు 2025 నవంబర్‌ నుంచి 2026 జనవరి కాలంలో సర్వే చేపట్టింది. దేశీయంగా మానవవనరుల పరిస్థితులు సైక్లికల్‌ డిమాండ్‌ను అనుసరించడంకాకుండా వ్యవస్థాగత, విధానపరమైన అంశాల ఆధారంగా మా ర్పులకు లోనవుతున్నట్లు వివరించింది. కాగా.. శ్రామిక చట్టాల అమలు కారణంగా ఉద్యోగ వ్య యాలు 80% పెరగనున్నట్లు 64 సంస్థలు తెలియజేశాయని, వేతన వ్యవస్థను పునర్‌నిర్వచించడం ప్రభావం చూపనున్నట్లు టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ బాలసుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు.

Meta Plans Major Layoffs Hundreds Cut Across Reality Labs Social Media5
మెటా లేఆఫ్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు?

సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫారమ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన కీలక విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ది ఇన్ఫర్మేషన్’ నివేదిక ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రధానంగా రియాలిటీ ల్యాబ్స్, సోషల్ మీడియా బృందాలు, రిక్రూట్‌మెంట్ విభాగాలపై ప్రభావం చూపనున్నాయి.ఖర్చుల నియంత్రణే లక్ష్యం?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు మెటా చేస్తున్న భారీ పెట్టుబడులే ఈ తొలగింపులకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను మెటా మొత్తం ఖర్చులు 162 బిలియన్ల డాలర్లు నుంచి 169 బిలియన్‌ డాలర్ల మధ్య ఉంటాయని అంచనా. అగ్రశ్రేణి ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు, వారిని నిలుపుకునేందుకు కంపెనీ మిలియన్ల కొద్దీ డాలర్లను వేతనాల రూపంలో వెచ్చిస్తోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తోంది. దాంతో కేవలం టెక్నికల్ విభాగాలే కాకుండా సేల్స్ విభాగంలోని పరిమిత సంఖ్యలో ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఉండనుంది.నిజానికి ఈ ఉద్యోగ కోతలు ఆకస్మికమైనవి కావు. ఈ నెల ప్రారంభంలోనే రాయిటర్స్ ఒక నివేదికలో మెటా తన మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించే ఆలోచనలో ఉందని పేర్కొంది. ఇప్పటికే సీనియర్ నాయకులకు ఈ మేరకు సమాచారం అందిందని, సిబ్బంది తగ్గింపునకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.ఇతర కంపెనీలు ఇలా..అమెజాన్అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో భారీ మార్పులు చేస్తోంది. 2026 ప్రారంభంలోనే సుమారు 16,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో మధ్యస్థాయి మేనేజ్‌మెంట్ హైరార్కీలను తగ్గించి నిర్ణయాధికారాన్ని వేగవంతం చేయాలని సీఈఓ ఆండీ జస్సీ నిర్ణయించారు. దీనివల్ల బ్యూరోక్రసీ తగ్గి ఏఐ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం సులభమవుతుందని వారి భావన.మైక్రోసాఫ్ట్మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ (అజూర్‌), ఏఐ విభాగాలకు పెద్దపీట వేస్తూనే ఇతర విభాగాల్లో కోతలు విధిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పలు విడతల్లో వేలాది మందిని తొలగించింది. డేటా సెంటర్ల నిర్మాణం కోసం మైక్రోసాఫ్ట్ ఏటా దాదాపు 80 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ భారీ పెట్టుబడులను బ్యాలెన్స్ చేయడానికి మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తోంది.గూగుల్గూగుల్ తన అడ్వర్టైజింగ్ సేల్స్, హార్డ్‌వేర్ విభాగాల్లో మార్పులు చేస్తోంది. ఏఐ సహాయంతో పనులను ఆటోమేట్ చేయడం ద్వారా తక్కువ మందితో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఎఫిషియెన్సీ పేరుతో కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తోంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?

Iran War Sends Retail Petrol Prices Soaring Up To 55pc Globally6
దేశాల్లో పెట్రోల్‌ మంటలు.. దారుణంగా ధరలు!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ వనరులకు పట్టుగొమ్మ వంటి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలుయుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ధర ఏకంగా 119 డాలర్లకు చేరుకోవడంతో, చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి పలు దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇతర దేశాల నుంచి సరఫరా మార్గాలను వెతుక్కోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి.ధరల పెంపులో ముందంజలో ఉన్న దేశాలుగ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డేటా ప్రకారం, మార్చి రెండో వారం నాటికి దాదాపు 85 దేశాలు పెట్రోల్ ధరలను భారీగా పెంచాయి. ఫిబ్రవరి 23 నుంచి నమోదైన గణాంకాల ప్రకారం ఇంధన ధరల పెరుగుదల ఇలా ఉంది..దేశంపెరుగుదల శాతంమయన్మార్55.4%ఫిలిప్పీన్స్54.2%కంబోడియా52.8%లెబనాన్28.6%కెనడా25.0%పాకిస్తాన్24.4%చైనా23.2%జపాన్19.6%పొరుగు దేశాలైన పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 1.15 డాలర్లు, శ్రీలంకలో 1.45 డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌లో 0.98 డాలర్లుగా నమోదైంది.ధరలలో ఈ వ్యత్యాసం ఎందుకు?ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు ముడి చమురు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ధరలు మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..పంపిణీ వ్యయం: చమురును శుద్ధి చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చు. ఇది ధరలో చాలా తక్కువ భాగం మాత్రమే.పన్నుల ప్రభావం: ఇంధన ధరలను నిర్ణయించడంలో ఎక్సైజ్ సుంకం (Excise Duty), స్థానిక పన్నులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో దేశం ఒక్కో రకమైన పన్ను విధానాన్ని అనుసరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరల పెరుగుదల సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేస్తోంది.

Advertisement
Advertisement
Advertisement