గుడ్ ఫ్రైడే సందర్భంగా వైఎస్ జగన్ సందేశం
సాక్షి, తాడేపల్లి: గుడ్ ఫ్రైడే సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశం ఇచ్చారు. ‘‘మానవాళి కోసం జీసస్ మహాత్యాగం చేశారు. కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు....మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్ ఇచ్చిన సందేశాలు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.వైఎస్ జగన్ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలువైఎస్ జగన్ను క్రైస్తవ మత పెద్దలు కలిశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా జగన్కు ఆశీర్వాదాలు ఇచ్చారు. మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలంటూ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, బొల్లవరపు జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్, ఆర్చ్ బిషప్ ఎన్జెఎస్డి రాజు -ఇండియన్ క్రిస్టియన్ మిషన్, బిషప్ సంజీవరావు - బైబిల్ మిషన్, బిషప్ సైమన్ సీజర్ - మెట్రోపాలిటన్ చర్చెస్, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఓసీ పేరుతో సజ్జల భార్గవ్రెడ్డిని ఎందుకు వేధిస్తున్నారు?
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం పూర్వ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్రెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసిన వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఎల్ఓసీ పేరుతో పిటిషనర్ను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించింది. కేసుల పేరుతో పౌరులను అనవసరంగా వేధింపులకు గురి చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవని స్పష్టం చేసింది. బాధితులు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు అన్న విషయాలతో సంబంధం లేకుండా తాము ప్రాథమిక హక్కులను కాపాడుతామని స్పష్టం చేసింది. ధిక్కార స్వరాలను సహించేదే లేదు.. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసిన ఎల్ఓసీని చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్రెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో పాటు, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న డీజీపీ, సీఐడీ సహా పలు జిల్లాల ఎస్పీలను కౌంటర్లు దాఖలు చేయాలని గత నెల 18వ తేదీన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్.. అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐడీ ఎస్పీ మినహా మరెవరూ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఓసీ కోరింది ఎవరు? ఎందుకు కోరారు? ఏ కేసులో కోరారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తే, ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయకుండా ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ఆక్షేపించారు. డీజీపీనే కౌంటర్ వేయనప్పుడు.. ఎస్పీలు ఎలా వేస్తారు? అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారంటూ జస్టిస్ దేవానంద్ మండిపడ్డారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు వెనుకాడటం లేదన్నారు. డీజీపీనే కౌంటర్ వేయలేదని, అలాంటప్పుడు ఎస్పీలు కౌంటర్లు వేస్తారని ఎలా ఆశించగలమని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీజీపీతో సహా అందరినీ కోర్టుకు పిలిస్తేనే పరిస్థితులు చక్కబడేలా ఉన్నాయన్నారు. సీఐడీ ఎస్పీ ప్రతివాదిగా ఉంటే, సీఐడీ ఇన్స్పెక్టర్ కౌంటర్లు దాఖలు చేయడాన్ని సైతం న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. భార్గవ్రెడ్డికి ఎల్ఓసీ జారీ చేసిన వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను, రాష్ట్ర డీజీపీ, సీఐడీ ఎస్పీ, విజయవాడ, పల్నాడు, వైఎస్సార్ కడప, తూర్పు గోదావరి, శ్రీసత్యసాయి, గుంటూరు, అన్నమయ్య, ఏలూరు, బాపట్ల జిల్లాల ఎస్పీలను ఆదేశిస్తూ.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. తదుపరి విచారణకు కౌంటర్లు దాఖలు చేయకుంటే, డీజీపీతో సహా ఎస్పీలందరూ కోర్టు ముందు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. పరస్పర విరుద్ధ వైఖరులపై అసంతృప్తి విచారణ సమయంలో భార్గవ్రెడ్డి తరఫు న్యాయవాది యల్లారెడ్డి స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదు చేశారన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ దాఖలు చేసిన కౌంటర్లో భార్గవ్రెడ్డిపై ఎల్ఓసీ జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను తాము కోరలేదని పేర్కొన్నారని తెలిపారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, అలా అయితే ఎవరు కోరితే ఎల్ఓసీ జారీ చేశారని ఇమ్మిగ్రేషన్ అధికారుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయను ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐడీ అదనపు డీజీ కోరితేనే భార్గవ్రెడ్డిపై ఎల్ఓసీ జారీ చేశామని అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని, వాటిన్నింటినీ కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచుతామని చెప్పారు. అయితే ఎల్ఓసీ జారీ చేయాలని తామెవ్వరినీ కోరలేదని ఎస్పీ తరఫు న్యాయవాది, అలాగే సీఐడీ అదనపు డీజీ తరఫు న్యాయవాది పాణిని సోమయాజి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరస్పర విరుద్ధ వైఖరులపై జస్టిస్ దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు ఇలాంటి నాటకాలు ఆడతారనే అందరి కౌంటర్లకు ఆదేశించామని పేర్కొన్నారు. అధికారుల ధిక్కార స్వరానికి ముగింపు పలికే సమయం వచి్చందన్న న్యాయమూర్తి, తద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతామని స్పష్టం చేశారు.
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో విజయం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.పాడ్యమి ఉ.7.20 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: చిత్త సా.6.18 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: రా.12.21 నుండి 2.04 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.11 వరకు తదుపరి ప.12.26 నుండి 1.17 వరకు, అమృత ఘడియలు: ప.11.30 నుండి 1.12 వరకు.సూర్యోదయం : 5.58సూర్యాస్తమయం : 6.09రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూలం.వృషభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ప్రముఖుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.మిథునం.... మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.కర్కాటకం... పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. దైవదర్శనాలు.సింహం.... పనులు విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణఒత్తిడులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ చాటుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.కన్య.... మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.తుల.... పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వృశ్చికం.... వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. దూరప్రయాణాలు.ధనుస్సు.... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.మకరం.... పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.కుంభం... పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.మీనం.... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. మిత్రులతో మాటపట్టింపులు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. దైవదర్శనాలు.
ఎండ కన్నా డేంజర్.. తేమ తాపం
దేశంలో మనకు తెలియకుండానే మన మనుగడకు ప్రమాదకరమైన స్థాయికి దగ్గరగా ఉన్న అధిక ఉష్ణోగ్రతలను ఇప్పటికే అనుభవిస్తున్నామా? హీట్ వేవ్ (వడగాడ్పుల) ముప్పును లెక్కగట్టేటప్పుడు ఒక్క ఉష్ణోగ్రతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ప్రమాదకరమైన వేడి ముప్పును ముందుగా తెలుసుకోలేకపోతున్నామా?అధిక ఉష్ణోగ్రతతోపాటు అప్పటి గాలిలో సాపేక్ష తేమ (రిలేటివ్ హ్యుమిడిటీ) శాతాన్ని కూడా కలిపి లెక్కించటం ప్రారంభించాలి. వాస్తవికమైన మనం ఫీలయ్యే వేడి ముప్పు తీవ్రతను ముందుగా గుర్తించటానికి, సహాయక చర్యల సన్నద్ధతను పెంచుకోవటానికి ఇది అవసరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్వెట్–బల్బ్ ఉష్ణోగ్రత అంటే? ఉష్ణోగ్రతతోపాటు గాలిలో సాపేక్ష తేమను కూడా పరిగణనలోకి తీసుకోవటాన్ని వెట్–బల్బ్ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు. వేడి ఒత్తిడి అంచనాలో ఉష్ణోగ్రతతోపాటు గాలిలో తేమను కలపటం ఎందుకు అంటే.. వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చెమట పడుతుంది. వేడిని తట్టుకునే ప్రక్రియలో చెమట శరీరానికి ఉపయోగపడుతుంది. చర్మంపై నుంచి చెమట ఎంతగా ఆవిరైపోతోందనే దానిపై ఈ ప్రక్రియ ఎంత సమర్థవంతంగా జరుగుతోందనేది ఆధారపడి ఉంటుంది.గాలిలో అధిక తేమ ఉన్న పరిస్థితిలో, శరీరం సహజ శీతలీకరణ యంత్రాంగానికి అంతరాయం కలుగుతుంది. చెమట ఆవిరి కానప్పుడు, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది తీవ్రమైతే అలసట, వడదెబ్బ తగులుతాయి. తీవ్రమైన సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. వేడి, తేమ వల్ల కలిగే ఈ మిశ్రమ ఒత్తిడిని వెట్–బల్బ్ ఉష్ణోగ్రత ద్వారా అంచనా వేస్తారు. వాతావరణ ప్రజారోగ్య స్థితిగతుల అంచనాల్లో ఇదొక కీలకమైన కొలమానమైనా, మన దేశంలో ఇంకా తక్కువగానే ఉపయోగిస్తున్నారు. ఉష్ణోగ్రత కన్నా తేమే ముఖ్యంకేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.నాయర్ రాజీవన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఇలా అన్నారు.. ‘ప్రస్తుతం మనం తేమ ప్రభావాలపై తగినంత శ్రద్ధ పెట్టటం లేదు. కానీ మన ఆరోగ్యంపై ప్రభావం విషయానికి వస్తే, పెరుగుతున్న ఉష్ణోగ్రతతోపాటు తేమ కూడా అంతే ముఖ్యమైనది లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది’. ‘డ్రై హీట్’ ఒక్కటే ప్రామాణికమా? ⇒ భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్దేశించే ప్రాథమిక ప్రమాణాల ప్రకారం.. మైదాన ప్రాంతాల్లో 40 (కొండ ప్రాంతాల్లో 30, కోస్తా తీర ప్రాంతాల్లో 37) డిగ్రీల సెల్సియస్ దాటితేనే ప్రస్తుతం వడగాడ్పు (హీట్వేవ్స్)ను అధికారికంగా ప్రకటిస్తున్నారు. ⇒ ఈ స్థాయి కన్నా 4.5–6.4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగితే ‘వడగాడ్పు’రోజుగా, 6.4 డిగ్రీల కన్నా పెరిగితే ‘తీవ్ర వడగాడ్పు’రోజుగా ప్రకటిస్తున్నారు. ⇒ అయితే, ఉష్ణోగ్రతతోపాటు గాలిలోని సాపేక్ష తేమను ప్రాథమిక ప్రమాణంగా ఐఎండీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. హీట్వేవ్స్ ప్రకటనకు సాపేక్ష తేమను ఐఎండీ ప్రాథమిక ప్రమాణంగా కాకుండా సెకండరీ విషయంగానే పరిగణించటం వల్ల ఈ ముప్పు ప్రాణాంతకంగా మారుతోంది. దీన్ని ‘డ్రై హీట్’ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు.⇒ పగటి ఉష్ణోగ్రత ఐఎండీ ప్రమాదకరమని భావించినంత పెరగనప్పుడు కూడా, గాలిలోని అధిక సాపేక్ష తేమ వల్ల, ప్రజలు ప్రమాదకరమైన వడగాడ్పుల ముప్పును అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉన్నా, వృద్ధులు, పిల్లలతోపాటు ఆరుబయట పనిచేసే వారు వడదెబ్బకు గురవుతున్నారు. ⇒ గాలిలో తేమ శాతం సాధారణంగా ఎక్కువగా ఉండే కోస్తా తీర ప్రాంతాల్లో, కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగర, పట్టణ ప్రాంతాల్లో వాతావరణ మార్పు నేపథ్యంలో ఈ ముప్పు పెరుగుతోంది. హీట్ స్ట్రోక్ మరణాలు ఎక్కువ కావటానికి ఇదొక ముఖ్య కారణంగా చెబుతున్నారు. ⇒ వడగాడ్పుల ప్రభావం ప్రజలపై ఉన్నా, అధికారికంగా ప్రకటించనందున, ప్రభుత్వ యంత్రాంగంలో, ప్రజల్లో సంసిద్ధత, అప్రమత్తత లోపిస్తోంది. నివారించదగిన వడగాడ్పు మరణాల రేటు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ అంతేకాదు, బాధితులకు వైద్య సహాయంలో, సహాయక చర్యల్లో, వడగాడ్పు మృతులకు పరిహారం చెల్లింపుల్లోనూ ఇది ప్రతిబంధకంగా మారుతోంది. డ్రై హీట్ పద్ధతికి బదులు వెట్–బల్బ్ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతిని అనుసరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.
నవ జంట బతుకులో కల్లోలం
కేకేఆర్ ఓడినా ఆ ఒక్కడు గెలిచాడు!
పాకిస్తానీలకు సర్కార్ ఝలక్.. పెట్రోల్ ధర భారీగా పెంపు
ఆ ప్రమాదం పొంచి ఉంది.. ఐరాస హెచ్చరిక
న్యాయం అడిగిన అబలపై నడిరోడ్డుపై దాడి
సెలవులకు ముందు అరెస్ట్ పరిపాటిగా మారింది
పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి..
మూలవాసులకు ఎస్టీ కేటగిరీ
మార్పునకు దగ్గరి దారి భవానీపూర్
ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదు
'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు
కేరళలో ఎస్పీ బాలు విగ్రహం.. చరణ్ భావోద్వేగం
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
ఏటా 2 ఉచిత సిలిండర్లు - కేరళ బీజేపీ మేనిఫెస్టో
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మీరు మాత్రం మా భుజాలపై మోయించని పార్టీనే లేదనుకుంటా సార్!!
టీమిండియాలోకి వచ్చేస్తాడు.. భయంగా ఉంది: పాక్ మాజీ క్రికెటర్
హైదరాబాద్లో వైన్ షాపులు బంద్
ఇంగ్లండ్కు గుడ్బై..! జింబాబ్వేకు ఆడనున్న సామ్ కర్రాన్?
మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది?
టీమిండియా కెప్టెన్గా శ్రేయస్..! ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ?
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
హైదరాబాద్లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
సాక్షి కార్టూన్ 01-04-2026
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గిందోచ్!!
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..
నవ జంట బతుకులో కల్లోలం
కేకేఆర్ ఓడినా ఆ ఒక్కడు గెలిచాడు!
పాకిస్తానీలకు సర్కార్ ఝలక్.. పెట్రోల్ ధర భారీగా పెంపు
ఆ ప్రమాదం పొంచి ఉంది.. ఐరాస హెచ్చరిక
న్యాయం అడిగిన అబలపై నడిరోడ్డుపై దాడి
సెలవులకు ముందు అరెస్ట్ పరిపాటిగా మారింది
పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి..
మూలవాసులకు ఎస్టీ కేటగిరీ
మార్పునకు దగ్గరి దారి భవానీపూర్
ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదు
'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు
కేరళలో ఎస్పీ బాలు విగ్రహం.. చరణ్ భావోద్వేగం
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
ఏటా 2 ఉచిత సిలిండర్లు - కేరళ బీజేపీ మేనిఫెస్టో
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మీరు మాత్రం మా భుజాలపై మోయించని పార్టీనే లేదనుకుంటా సార్!!
టీమిండియాలోకి వచ్చేస్తాడు.. భయంగా ఉంది: పాక్ మాజీ క్రికెటర్
హైదరాబాద్లో వైన్ షాపులు బంద్
ఇంగ్లండ్కు గుడ్బై..! జింబాబ్వేకు ఆడనున్న సామ్ కర్రాన్?
మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది?
టీమిండియా కెప్టెన్గా శ్రేయస్..! ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ?
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
హైదరాబాద్లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
సాక్షి కార్టూన్ 01-04-2026
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గిందోచ్!!
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..
ఫొటోలు
ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)
ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)
హైదరాబాద్లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర (ఫోటోలు)
మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)
రూటు మార్చిన శృతి హాసన్.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)
సినీ కెరీర్.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్ (ఫోటోలు)
తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)
దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)
వామ్మో ఎండలు.. (ఫొటోలు)
డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్ జగన్ (ఫొటోలు)
సినిమా
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడవుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్లో శర్వానంద్ బైకర్ రిలీజ్ కానుంది. దీంతో పాటు సంగీత్ శోభన్ కొత్త సినిమా రాకాస థియేటర్లలో సందడి చేయనుంది. వీటితో పాటు సముద్రఖని కార్మేని సెల్వం ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిలో బైకర్ మూవీపై ఆడియన్స్లో బజ్ క్రియేట్ అయింది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ మృత్యుంజయ్ ఈ ఫ్రైడే ఓటీటీలో సందడి చేయనుంది. మరో తెలుగు సినిమా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని కూడా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియన్స్ విషయానికొస్తే ఈ రెండు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, సిరీస్లు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫిక్స్..మృత్యుంజయ్-(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03బ్లడ్హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా- సీజన్-2-(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03అమెజాన్ ప్రైమ్..మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 03జియో హాట్స్టార్..ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03జీ5..బాబ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03ఆపీల్ టీవీ ప్లస్..యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03సన్ నెక్ట్స్..వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03సోనీ లివ్సితారే జమీన్ పర్(బాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 03
రాయలసీమలో రణబలి షూటింగ్.. వీడియో వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న హిస్టారికల్ యాక్షన్ మూవీ రణబలి. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని నంద్యాల జిల్లాలో జరుగుతోంది.తాజాగా ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ గుర్రంపై వస్తున్న వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ముండమోపి నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..రాప్పా సంపుదువ్ కానీ..' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ వింటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగానే తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో ఎక్కువ శాతం రాయలసీమ ప్రాంతంలో తెరెకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. Proper Rayalaseema Dialogues &Proper Rayalaseema Houses.నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..Mass 💥 #RanaBali pic.twitter.com/UCPAarktV6— low battery🪫 (@low__battery287) April 2, 2026
దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగు సినిమాల రికార్డ్స్ కష్టమే..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. మొదటి వారంలో వెయ్యి కోట్లు దాటేసిన ఈ సినిమా.. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ఈ మూవీ రిలీజై రెండు వారాలు పూర్తయింది. ఈ సినిమా 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.ఈ లెక్కన చూస్తే రెండో వారంలో వసూళ్ల పరందా దురంధర్-2 వెనకపడినట్లే తెలుస్తోంది. దురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్ మూవీ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా కాస్తా జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారమైతే రూ.1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.వసూళ్లు ఇలాగే కొనసాగితే పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ దాటడం కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కానుండడం దురంధర్ వసూళ్లపై ప్రభావం పడనుంది. ఈ సీక్వెల్గా ఆడియన్స్లో క్రేజ్ ఉన్నప్పటికీ రెండో వారానికి వచ్చేసరికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్లో సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.
ఆ విధానం రద్దు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం..!
తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న రెంటల్ విధానానికి స్వస్తి పలికారు. మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శించాలని నగరంలోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఏప్రిల్ 3 నుంచే ఇది అమల్లోకి రానుందని ప్రకటించారు. ఎగ్జిబిటర్లకు రెవెన్యూ షేర్ ఇలా.. సినిమా ప్రదర్శితమైన తొలివారం 60 శాతం, రెండోవారం 50 శాతం, మూడోవారం 40 శాతం. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది.ఇప్పటికే 23 మంది ఎగ్జిబిటర్లు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను సంప్రదించార. తెలంగాణలోని పలువురు అగ్ర శ్రేణి డిస్ట్రిబ్యూటర్లతో చర్చించారు. వారి థియేటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్నాయని అన్నారు. వాటిలో ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు. అయితే ఈ థియేటర్ల నిర్వహణ చాలా భారంగా మారిందన్నారు. ప్రస్తుత అద్దె విధానంతో నెట్టుకు రావడం కష్టసాధ్యమైందని వెల్లడించారు.పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తామన్న తమ ప్రపోజల్ను డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారని చెప్పారు. శశిధర్ రెడ్డి మాత్రమే నిర్మాతలు, ఇతర భాగస్వాములతో మరింత చర్చించి అభిప్రాయం చెబుతామన్నారని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్లలో సినిమాలను కేవలం శాతం ప్రాతిపదికనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. ఇది దశల వారీగా జరుగుతుందని అని ఫిల్మ్ ఛాంబర్ తన ప్రకటనలో పేర్కొంది.
క్రీడలు
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ ఖాతాలో రెండో ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఫుట్బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్)లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో రెండో ‘డ్రా’ చేరింది. షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్తో జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. శ్రీనిధి జట్టు గోల్కీపర్ కమల్జీత్ సింగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో హెడ్ కోచ్ కార్లోస్ వాజ్ పింటో శ్రీనిధి తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. నానాటో లూయిస్, వాన్లాన్రెమ్డికా జట్టులోకి వచ్చారు. ఆట 11వ నిమిషంలో శ్రీనిధి కెపె్టన్ డేవిడ్ కాస్టనెడా కొట్టిన షాట్ను షిల్లాంగ్ గోల్కీపర్ రింబాయ్ అడ్డుకున్నాడు. చివర్లో 86వ నిమిషంలో పౌలో సెజార్ హెడర్ను మరోసారి రింబాయ్ నిలువరించాడు. మ్యాచ్ ‘డ్రా’ కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు ఆరు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో ఓడిపోయింది. 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. డైమండ్ హార్బర్ ఫుట్బాల్ క్లబ్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్ను హైదరాబాద్లో ఈనెల ఐదో తేదీన ఐజ్వాల్ ఎఫ్సీ జట్టుతో ఆడుతుంది.
‘మేం మోసగాళ్లలా కనిపిస్తున్నామా’
పెయియా (సైప్రస్): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఆటగాళ్లు ‘మోసాలకు’ పాల్పడకుండా ఉండేందుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తీసుకుంటున్న అతి జాగ్రత్తలపై అమెరికా గ్రాండ్మాస్టర్ హికారు నకమురా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తమను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’కు చెందిన వ్యక్తుల్లా చూస్తున్నారని అతను ధ్వజమెత్తాడు. క్యాండిడేట్స్ టోర్నీ పురుషుల విభాగంలో పాల్గొంటున్న ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్లలో నకమురా ఒకడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచే ఆటగాడు ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ చాంపియన్షిప్ పోరులో ప్రస్తుత విజేత గుకేశ్ దొమ్మరాజుతో తలపడతాడు. సైప్రస్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆటగాళ్లు ఎలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు ‘ఫిడే’ పలు జాగ్రత్తలు తీసుకుంది. మెటల్ డిటెక్టర్లతో పాటు ఈసారి మరిన్ని కొత్త తరహా స్కానర్లను టోర్నీ జరిగే వేదికపై ఏర్పాటు చేసింది. ఈ తరహా అతి జాగ్రత్త నకమురాకు ఆగ్రహం తెప్పించింది. ‘అసలు ఆటగాళ్లు గేమ్ ఆడుతూ మోసం చేయడానికి ప్రయత్నిస్తారనే ఆలోచనే పనికిమాలినదని అని నా నమ్మకం. కొందరు ఆటగాళ్లే ఇలాంటి ఏర్పాటు కావాలని అడిగారని విన్నాను. ఇది పూర్తిగా అర్థరహితం. గేమ్కు ముందు గేమ్ తర్వాత కూడా వారు మమ్మల్ని స్కాన్ చేస్తున్నారు. మెటల్ డిటెక్టర్లే కాకుండా వేరుగా ప్రత్యేక స్కానర్లూ ఉన్నాయి. మేమేమైనా ఇరాన్లో పని చేస్తున్న ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఏజెంట్లమా? ఫిడే వాస్తవంలోకి రావాలి. మేం చెస్ ప్లేయర్లం మాత్రమే’ అని నకమురా వ్యాఖ్యానించాడు. అసలు ఈ తరహా ఏర్పాటు చేయడానికి సరైన కారణం కూడా లేదని ఈ అమెరికా గ్రాండ్మాస్టర్ అభిప్రాయపడ్డాడు. ‘ఆటగాళ్ల మోసం గురించి అతి చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఏదో ఒక చిన్న ఓపెన్ టోర్నీ అంటే ఏమైనా అనుకోవచ్చు. అక్కడంటే స్కానర్లవంటివి ఉండవు. కానీ ఇంత పెద్ద టోర్నీలో ఆటగాళ్లంతా ఒకే చోట ఉన్నారు. కెమెరాలు ఉన్నాయి. ఆర్బిటర్స్ ప్రతీ ఒక్కరినీ చూస్తున్నారు. ఎవరో ఒకరు లోపలి నుంచే సహాయం అందిస్తే తప్ప తప్పుడు పనులు చేయడానికి చాన్స్ ఉండదు’ అని నకమురా వివరించాడు. యుద్ధ వాతావరణం మధ్య సైప్రస్లో జరుగుతున్న ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలతో భారత క్రీడాకారిణి కోనేరు హంపి తప్పుకోగా... టోర్నీ ఆరంభానికి ముందు నకమురా కూడా బహిరంగంగా తన ఆందోళనను వ్యక్తం చేశాడు.
రూ.10.23 లక్షలకు ఒక్క టికెట్
జ్యూరిక్: గతంలో తల తాకట్టు పెట్టి అయినా ఫుట్బాల్ వీరాభిమానులు ప్రపంచకప్ టికెట్లు కొని మ్యాచ్ల్ని ప్రత్యక్షంగా తిలకించేవారు. ఇప్పుడైతే ఏకంగా ఇల్లే తాకట్టు పెట్టాలేమో! ఎందుకంటే యావత్ ప్రపంచాన్నే ఫుట్బాల్ ఫీవర్తో ఊపేసే ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర అక్షరాలా రూ. 10,23,212. అమెరికా కరెన్సీలో 10,990 డాలర్లు. ఈ మొత్తంతో కేవలం 90 నిమిషాల టైటిల్ పోరును చూస్తారు. మన దేశంలో ఈ మొత్తంతో ఏడున్నర (75 గ్రాముల) తులాల బంగారు ఆభరణాల్ని కొనేయొచ్చు. ఫుట్బాలా... మజాకా! త్వరలో అమెరికా, మెక్సికో, కెనడా వేదికలపై ప్రపంచకప్ ఫుట్బాల్ సంగ్రామం జరుగనుంది. ఇందులో భాగంగా రెండో కేటగిరీ, మూడో కేటగిరీ టికెట్ల ధరల్ని ‘ఫిఫా’ ఖరారు చేసింది. మొదట గతేడాది డిసెంబర్లో ‘డ్రా’ విడుదల చేసిన సందర్భంలో తొలి దశలో 8680 డాలర్ల (రూ.8 లక్షలు) ధరతో కొన్ని టికెట్లను విక్రయించారు. టోర్నీ దగ్గర పడుతుండటంతో ఫుట్బాల్ క్రేజీ ప్రపంచకప్ను క్యాష్ చేసుకునే పనిలో ‘ఫిఫా’ పడింది. ఇందులో భాగంగా కేటగిరీ–2 టికెట్లను తొలి దశలో 5575 డాలర్ల (రూ.5.20 లక్షలు)కు విక్రయించగా... ఇప్పుడు 7380 డాలర్ల (రూ.6.87 లక్షలు)కు పెంచేసింది. కేటగిరీ–3 టికెట్ల ధరలు అప్పుడు 4185 డాలర్లు (రూ.3.90 లక్షలు) ఉంటే... ఇప్పుడు 5785 డాలర్ల (రూ.5.38 లక్షలు)కు హెచ్చింపు చేసింది. ఈ టికెట్లను కొనేందుకు అభిమానులు ‘ఫిఫా’ వెబ్సైట్ను గమనిస్తూ ఉండాలని, సేల్ విండో తెరవగానే నిమిషాల్లోనే అమ్ముడయ్యే అవకాశముందని ‘ఫిఫా’ తెలిపింది. మెగా ఈవెంట్లో గ్రూప్ దశలో 72 మ్యాచ్లు ఉండగా... బుధవారం 17 మ్యాచ్లకు సంబంధించిన టికెట్లనే అందుబాటులో ఉంచింది. నాకౌట్ దశ పోటీల టికెట్లు పై జాబితాలో లేవు. జూన్ 12న పరాగ్వే–అమెరికా మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రీమియం ధర టికెట్లన్నీ అమ్ముడుపోగా... కేవలం 2735 డాలర్ల (రూ.2.54 లక్షల) టికెట్లు కొన్ని మిగిలున్నాయి. అయితే జూన్ 19న ఆ్రస్టేలియా, అమెరికా మధ్య జరిగే మ్యాచ్ కోసం ఒక్క టికెట్ కూడా లేదు. అన్ని కేటగిరీల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్మడయ్యాయి. అమెరికాలో 11 వేదికలు, మెక్సికోలో 3, కెనడాలో 2 వేదికల్లో సాకర్ సంగ్రామం జరుగుతుంది.
గోల్ఫ్తో ఎంతో ప్రయోజనం: యువీ
న్యూఢిల్లీ: గోల్ఫ్ ఆడటం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీమిండియా తరఫున టి20, వన్డే ప్రపంచకప్లు నెగ్గిన ఈ ఆల్రౌండర్... క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గోల్ఫ్పై దృష్టి పెట్టాడు. క్రికెట్ కెరీర్కు ముందే గోల్ఫ్ ఆడి ఉంటే ఇంకా ఎంతో ప్రయోజనం చేకూరేదని... ఇప్పటికైనా యువ ఆటగాళ్లు క్రికెట్తో పాటు గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తే సేద తీరడంతో పాటు ఒత్తిడి దూరమవుతుందని యువీ హితవు పలికాడు. ప్రస్తుతం యువరాజ్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్)కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. గురువారం ఐజీపీఎల్ 10 ఫ్రాంచైజీల జెర్సీ ఆవిష్కరణలో యువరాజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... ‘క్రికెటర్లు క్రికెట్తో పాటు గోల్ఫ్ కూడా ఆడాలి. నేను ముందే ఈ పని చేయాల్సింది. అది నాకు క్రికెట్లో చాలా సహాయపడి ఉండేది. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు చిన్నప్పటి నుంచే గోల్ఫ్ ఆడుతారు. కానీ మనదేశంలో గోల్ఫ్ను కేవలం ఉన్నత వర్గాల క్రీడగా పరిగణిస్తారు. ఈ వైఖరిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. గోల్ఫ్ను పాఠశాల స్థాయికి తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతీ క్రీడను ప్రయత్నించాలని భావిస్తున్నాం.మనదేశంలో క్రికెట్ అతిపెద్ద ఆట అని నాకు తెలుసు. కానీ గోల్ఫ్ కూడా ఉత్తేజకరమైన క్రీడే. అందరూ దీన్ని ప్రయత్నించాలి. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్గా ఇతర క్రీడలకు కూడా నా వంతు సాయం చేయాలనుకుంటున్నా. ఐజీపీఎల్ లీగ్ గోల్ఫ్కు మరింత ప్రచారం కల్పిస్తోంది. దీని ద్వారా ఈ ఆట ఎక్కువ మందికి చేరువవుతుంది. ఇప్పుడు టీవీల్లో చూసే పిల్లలు... భవిష్యత్తులో గోల్ఫ్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారు’ అని పేర్కొన్నాడు.
న్యూస్ పాడ్కాస్ట్
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చ...
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా...మొత్తం 10 బిల్లులకు ఆమోదం
ఆంధప్రదేశ్లో ప్రభుత్వ ‘రియల్’ దందా.. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ పందేరం
ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ డ్రామా.. రాజధాని, ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే కూటమి సర్కారు పన్నాగం...
మనమంతా ‘టీమ్ ఇండియా’గా కలిసి పనిచేద్దాం... ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
పశ్చిమాసియాలో ఇక భీకర యుద్ధమే.. చర్చలపై అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిష్టంభన... హార్మూజ్పై పట్టు బిగించిన ఇరాన్
ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
రాజధాని మాస్టర్ ప్లాన్లో లోపం... ఆంధ్రప్రదేశ్ ఖజానాపై ఒక వెయ్యి 472 కోట్ల రూపాయలకుపైగా భారం
బిజినెస్
భారతి ఎయిర్టెల్ రికార్డ్.. 65 కోట్ల యూజర్స్!
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది వినియోగదారుల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో చందాదారుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ టెలికాం కంపెనీ.. భారతదేశంలో మాత్రమే కాకుండా, ఆఫ్రికా అంతటా బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. GSMA ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. ఒక్క ఇండియాలో ఎయిర్టెల్కు 368 మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ద్వారా అనుసంధానించి 13 మిలియన్ల గృహాలు, దాని డిజిటల్ టీవీ సేవలను ఉపయోగించే 15 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.Bharti Airtel, the world’s second largest telecom operator by customer base, has crossed 650 million customers globally.— Bharti Airtel (@airtelnews) April 2, 2026ఆఫ్రికాలో.. ఎయిర్టెల్ ఆఫ్రికా 14 దేశాలలో 179 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ ప్రాంతంలో కంపెనీ హై-స్పీడ్ డేటా, వాయిస్ సేవలు, మొబైల్ మనీ పరిష్కారాలను అందిస్తుండగా, 52 మిలియన్లకు పైగా వినియోగదారులు దీని ఆర్థిక సేవల ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉన్నారు.ఎయిర్టెల్ సాధించిన ఈ విజయాన్ని గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. 65 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడం ఒక పెద్ద బాధ్యత. కొత్త ఆవిష్కరణలు, విశ్వసనీయమైన సేవల ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై కంపెనీ దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. టెలికాం పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడమే ఎయిర్టెల్ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!
చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఇదేబాటలో దిగ్గజ సంస్థ ఒరాకిల్ కూడా అడుగులువేసింది. ఈ ప్రభావం ఏకంగా 30వేలమంది ఎంప్లాయిస్ మీద పడుతుంది. ఇందులో 12000 ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వారికి లభించే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒరాకిల్ తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు చెందినవారు ఉన్నారు. లేఆఫ్స్ ప్రక్రియలో అనేక మంది ఉద్యోగులు ఒక్కసారిగా తమ సిస్టమ్ యాక్సెస్ కోల్పోయి, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జాబ్ కోల్పోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు రెడ్దిట్ ద్వారా వెల్లడించారు. ఇందులోనే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కూడా వివరించారు.''కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల ప్రాథమిక జీతం చెల్లిస్తారు. అదనంగా.. వాడని సెలవుల మొత్తాన్ని నగదుగా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగి తొలగింపు సమయంలో నోటీస్ పీరియడ్కు బదులుగా ఒక నెల జీతం కూడా అందజేస్తారు. ఉద్యోగి అర్హత ఉన్నట్లయితే గ్రాచ్యుటీ కూడా లభిస్తుంది. ఇంకా.. తొలగింపు తేదీ వరకు ఉన్న పెండింగ్ జీతం కూడా పూర్తిగా చెల్లిస్తారు'' అని ఒక ఉద్యోగి పేర్కొన్నారు.కంపెనీ నుండి రెండు నెలల అదనపు ఎక్స్గ్రేషియా (ప్రత్యేక పరిహారం) కూడా లభిస్తుంది. అయితే.. ఈ మొత్తం పొందడానికి ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం అనే ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన షరతుగా కనిపిస్తోంది. అలాగే సుమారు రూ.20,000 వరకు ఇన్సూరెన్స్, ఒక నెల గార్డెనింగ్ లీవ్ జీతం లేదా దానికి సమానమైన పరిహారం కూడా ఇవ్వనున్నట్లు మరికొందరు ఉద్యోగులు వెల్లడించారు.ఇదీ చదవండి: ప్రాపర్టీ అమ్మేసిన బాలీవుడ్ నటుడు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఇంకా పూర్తిగా వెనక్కిరాని పెద్ద నోట్లు!
చలామణీలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో దాదాపు 98.45 శాతం వెనక్కి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. 2023 మే 19న ప్రకటించిన ఈ నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పుడు రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు చలామణీలో ఉండగా 2026 మార్చి 31 నాటికి ఇది రూ. 5,501 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆర్బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసుల్లో పెద్ద నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. అలాగే తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇండియా పోస్ట్ ద్వారా కూడా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించవచ్చు.
ఉత్తర కొరియా కిమ్ ‘దొంగ ప్రయాణం’!
ఉత్తర కొరియా ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి సోషల్ మీడియాలో ఒక పాత కథనం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. చిన్నతనంలో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరుడితో కలిసి జపాన్లోని ప్రసిద్ధ 'టోక్యో డిస్నీల్యాండ్'ను సందర్శించడానికి నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించారనే వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం, 1991 మే నెలలో అప్పటికి కేవలం ఎనిమిదేళ్ల వయసున్న కిమ్ జోంగ్ ఉన్, తన సోదరుడు కిమ్ జోంగ్ చుల్తో కలిసి జపాన్లోకి అడుగుపెట్టారు. వీరు తమ గుర్తింపును దాచిపెట్టి, బ్రెజిలియన్ పాస్పోర్ట్లను ఉపయోగించి ఈ ప్రయాణం చేసినట్లు సమాచారం. కిమ్ జోంగ్ ఉన్ 'జోసెఫ్ ప్వాగ్' అనే మారుపేరుతో ఈ పత్రాలను సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.బ్రెజిల్ పాస్పోర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు?కిమ్ కుటుంబం బ్రెజిలియన్ పాస్పోర్ట్లను ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్రెజిల్లో విభిన్న జాతుల ప్రజలు నివసిస్తారు. కాబట్టి, తూర్పు ఆసియా దేశాలకు చెందిన వారు బ్రెజిలియన్ పౌరులుగా చలామణి అవ్వడం సులభం. దీనివల్ల విమానాశ్రయాల్లో భద్రతా అధికారులకు అనుమానం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.ఈ సోదరులిద్దరితో పాటు దాదాపు 10 మంది ఉత్తర కొరియా అధికారుల బృందం కూడా జపాన్లో పర్యటించినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జపాన్లో ఉన్న వీరు, టోక్యో డిస్నీల్యాండ్ను పలుమార్లు సందర్శించి అక్కడ గడిపినట్లు యోమియురి షింబున్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు గతంలోనే నివేదించాయి. ఆ సమయంలో జపాన్ భద్రతా అధికారులు వీరిని గుర్తించడంలో విఫలమయ్యారు. వారు దేశం విడిచి వెళ్లిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.సవతి సోదరుడికి తప్పని ఇబ్బందులుకిమ్ జోంగ్ ఉన్ ఈ పర్యటనను విజయవంతంగా ముగించినప్పటికీ, 2001లో ఇదే తరహా ప్రయత్నం చేసిన ఆయన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ మాత్రం అడ్డంగా దొరికిపోయారు. డొమినికన్ రిపబ్లిక్ నకిలీ పాస్పోర్ట్తో టోక్యో డిస్నీల్యాండ్కు వెళ్లే ప్రయత్నంలో నరిటా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని దేశం నుండి బహిష్కరించారు.ఈ సంఘటన వల్లనే కిమ్ జోంగ్ నామ్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వద్ద నమ్మకాన్ని కోల్పోయారని, ఫలితంగా ఉత్తర కొరియా తదుపరి వారసుడిగా కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వార్త, ఉత్తర కొరియా పాలకుల వ్యక్తిగత జీవితం, వారి రహస్య పర్యటనలపై మరోసారి చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by im just culture (@imjustculture)
ఫ్యామిలీ
‘డాడీ’ అని పిలుస్తున్న పిల్లలు… కానీ చట్టం ఒప్పుకోదా..?
ఆమె తన మొదటి భర్తతో హిందూ వివాహ చట్టం ద్వారా 2015లో విడాకులు పొందిన తర్వాత నేను ఆమెను 2016లో వివాహం చేసుకున్నాను. ఆమెకు మొదటి వివాహం ద్వారా ఒక అబ్బాయి, ఇద్దరు కవల అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిని తండ్రి తన సంరక్షణలోకి తీసుకున్నాడు కానీ అమ్మాయిల బాధ్యత ఏనాడూ పట్టించుకోలేదు. ఇద్దరు అమ్మాయిలు 2015 నుండి నా భార్యతోనే ఉంటున్నారు. ప్రస్తుతం వారికి 12 సంవత్సరాలు. నేను వారిని నా పిల్లల్లాగే చూసుకుంటున్నాను. నన్ను వాళ్ళు ‘డాడీ’ అని పిలుస్తారు. అందువల్ల ఇంక నాకు మళ్ళీ పిల్లలు వద్దు అని నిర్ణయించుకున్నాను. నా భార్య గతంలో తన మాజీ భర్త నుండి తీవ్రమైన గృహహింసకు గురైంది, ముఖ్యంగా కవల పిల్లలకు (అమ్మాయిలకు) జన్మనిచ్చిన కారణంగా. ఇద్దరు అమ్మాయిలను నేను చట్టపరంగా దత్తత తీసుకుని, నా ఇంటిపేరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతని నుంచి దత్తతకు అనుమతి పొందడం అసాధ్యం. నా మీద కూడా కక్షధోరణి ఉంటుంది. తండ్రి అనుమతి లేకుండా దత్తత తీసుకోవడం సాధ్యమా? సాధ్యం కాకపోతే, ఏ చట్టపరమైన మార్గాలు ఉన్నాయి?– మచ్చా అనికేత్, విశాఖపట్నం ముందుగా మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కంటేనే సంతానం కాదు – ప్రేమానురాగాలకు పేగుబంధమే అవసరం లేదు అని నిరూపించారు. మీరు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం.మీ సమస్యలోని సున్నితత్వాన్ని , భావోద్వేగాలను అర్థం చేసుకోగలను. భారతదేశంలో, పైగా హిందూ చట్టాలలో పిల్లల తల్లి/తండ్రి బతికే ఉంటే, సాధారణంగా ఏ ఒక్కరి అనుమతి లేకుండా దత్తత సాధ్యం కాదు. మీ కేసులో కూడా తండ్రి అనుమతి కావాలి.ఎందుకంటే...1. దత్తత తీసుకున్న తర్వాత జన్మనిచ్చిన తండ్రి హక్కులు పూర్తిగా ముగుస్తాయి.2. మీరు చట్టపరంగా తండ్రిగా మారతారు.3. ఆస్తి, వారసత్వ హక్కులు మారతాయి.ఈ పరిస్థితుల్లో తండ్రి అనుమతి లేకుండా కోర్టు దత్తతకు అనుమతించాలి అంటే ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.1. తండ్రి పిల్లలను ఉద్దేశపూర్వకంగా వదిలేశారా?2. పిల్లలను ఇన్ని సంవత్సరాలుగా చూసుకున్నారా లేదా – కనీసం వారి బాగోగులు పట్టించుకున్నారా లేదా?3. తండ్రి హింసాత్మకంగా లేదా పిల్లల పోషణకు అనర్హుడిగా ఉన్నారా?4. పిల్లలకు అతని వల్ల హానికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా?ఈ అంశాలను కోర్టు మాత్రమే నిర్ణయించగలదు – మీ సొంత నిర్ణయాలు చెల్లవు. ముందుగా కస్టడీ/గార్డియన్షిప్ పొందడం కోసం మీ భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి. పిల్లలు 2015 నుండి తనతోనే ఉన్నారని. తండ్రి బాధ్యతలు నిర్వర్తించలేదని / హింస (ఆర్థిక, మానసిక, శారీరక) చేశాడని, పైన తెలిపిన అంశాలకు ΄ాల్పడ్డాడు అని నిరూపించాలి.ఆ తర్వాత మీరు దత్తత కోసం కోర్టులో పిటిషన్ వేయవచ్చు. అందులోనే తండ్రి అనుమతి అవసరం లేదని కూడా కోర్టును అభ్యర్థించవచ్చు. పిల్లలు 12 సంవత్సరాలు ఉన్నందున కోర్టు వారి అభి్ర΄ాయం అడగవచ్చు. వారు మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు, జన్మనిచ్చిన తండ్రిపై వారికి ఎటువంటి ప్రేమ లేదు అంటే అది మీకు బలమైన అంశంగా మారుతుంది. చట్టపరంగా దత్తత తీసుకోకుండా సర్టిఫికెట్లలో ఎటువంటి మార్పులు చేయకండి. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తల ఎత్తవచ్చు. మీ దగ్గరలోని మంచి లాయర్ గారిని కలవండి. మీ భార్యకు తన మాజీ భర్తకు జరిగిన కోర్టు వివాదాలు, పత్రాలు, ఒప్పందాలు ఏవైనా ఉంటే తీసుకుని వెళ్ళండి. మాజీ భర్త తన పిల్లలను ఏనాడు పట్టించుకోలేదు అని చెప్పడానికి ఆధారాలు సేకరిస్తే మరీ మంచిది.
పిల్లలను అలా పెంచాలి..! న్యూరో సెంటిస్ట్ పేరెంటింగ్ టిప్స్
పిల్లల పెంపకంపై చాలామంది నిపుణులు, ప్రముఖులు అమూల్యమైన సలహాలు అందించడం తెలిసిందే. కానీ తాజాగా దీనిపై న్యూరో సైంటిస్ట్ ఆసక్తికరమైన సలహాలు సూచనలందించారు. పిల్లను అలా పెంచితేనే ప్రయోజకులవుతారని నమ్మకంగా చెప్పారు. సిస్టమేటిక్వేలో పెంచడం కాదు..ఛాలెంజ్లను ఎదుర్కొనే ధీరుల్లా పెంచడం ఎలాగో సవివరంగా వివరించారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.అమెరికాకు చెందిన న్యూరోసైంటిస్ట్, వ్యవస్థాపకురాలు వివియెన్ మింగ్ నేటి విద్యావ్యవస్థ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రూపుదిద్దుకునే భవిష్యత్తుకు అనుగుణంగా పెంచడం లేదని అన్నారు. చాలా పాఠశాలలు ఇప్పటికీ బట్టిపట్టడం, పరీక్ష స్కోర్లపైనే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. అయితే వీటన్నింటిని ఐఏ ఇప్పటికే వేగవంతంగా సమర్థవంతంగా చేయగలదని అన్నారు. తమ పిల్లలు భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా మారాలనకునే తల్లిదండ్రులు ఈ మూడు చిట్కాలను ఫాలో అవ్వాలని అన్నారు. అలాగే వారిని రోబోట్ ప్రూఫ్గా ఎలా పెంచాలో కూడా తెలిపారు. ఆమె దీనిని వేలాదిమంది పరిశోధన చేసి మరి చెబుతున్నారు. లోతైన పరిశోధనలకు మూలం తప్పిదాలే అని అన్నారు. వైఫల్యాలను అంగీకరించే విద్యార్థులు స్ట్రాంగ్గా తయావుతారని, పైగా బలమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోగలరని అన్నారు.హార్వర్డ్ ఎఫెక్ట్..అంటే ఊహకందని ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టిచడం అని చెప్పారు. పిల్లల్లో దాగున్న విభిన్న ఆసక్తులను అన్వేషించాలి, ప్రశ్నలు అడగాలి, ముగింపు లేని సమస్యలపై పనిచేసేలా చేయాలి. అది వాళ్లను జ్ఞానాన్ని సముపార్జించేలా చేసి సామర్థ్యాలను పెంపొందించేలా చేస్తుందని అన్నారు.ఏఐ కంటే జీనియస్గా..ఇక పిల్లలు ఏఐని సాధనంగా ఉపయోగించాలి కానీ, ఆలోచనలకు ప్రత్యామ్నాయంగా కాదని అన్నారు. ఫీడ్బ్యాక్ కోసం ఉపయోగించొచ్చు కానీ, ముందుగా మాత్రం వారి స్వంత ఆలోచనలను పెంపొదించుకోవాలని అన్నారు. తాను 30 ఏళ్లుగా మెషిన్ లెర్నింగ్తో ఆడుకుంటున్నాను అయితే లార్జ్ లెర్నింగ్ మోడల్స్ (LLMలు) నిరంతర సహచరుడిగా ఉండే ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న ఈతరానికి కష్టమైనది దానికే వదిలేయాలన్న బలహీనతగా ఎక్కువగా ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. అందుకే పిల్లలను ఐఏకి మించిన నైఫుణ్యలను అందిపుచ్చుకునేలా పెంచాలి. అంటే వారిలో..సృజనాత్మకత: పిల్లలకు సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, వారు కొత్త ఆలోచనలు, పరిష్కారాలను కనుగొనేలా చేయడంభావోద్వేగ నైపుణ్యాలు: ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సహాయం చేయడం, సానుభూతి చూపించడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.సామాజిక నైపుణ్యాలు: పిల్లలు ఇతరులతో ఎలా మాట్లాడాలో, సంబంధాలు ఎలా నిర్మించాలో నేర్చుకోవడం.సమస్యలు పరిష్కరించే సామర్థ్యం: సాంకేతికతను ఉపయోగించి సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్చుకోవడం.ఈ విధంగా, పిల్లలు రోబోట్స్ చేయలేని పనులను చేసేలా పెంచితే..భవిష్యత్తులో మరింత విలువైన వ్యక్తులుగా, గొప్ప ప్రయోజకులుగా మారతారని చెబుతున్నారు న్యూరో సైంటిస్ట్ మింగ్.(చదవండి: గాయనికి 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్'..! ఎందువల్ల వస్తుందంటే..)
గాయనికి 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్'..! ఎందువల్ల వస్తుందంటే..
ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ కెనడియన్ పాప్ గాయని సెలిన్ డియోన్ తన గాత్ర నైపుణ్యం, ఉద్వేగభరితమైన మ్యూజిక్ ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. 'టైటానిక్' చిత్రంలోని 'మై హార్ట్ విల్ గో ఆన్' పాటతో పాటు 90ల నాటి అనేక అంతర్జాతీయ హిట్లకు ప్రసిద్ధి చెందింది. అంత ప్రసిద్ధి గాంచిన గాయని 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' అనే అరుదైన వ్యాధి బారినపడింది. దాంతో సంగీతానికి గత కొంతకాలంగా పూర్తిగా విరామం ఇచ్చేశారామె. మళ్లీ ఇన్నేళ్లకు తన 58వ పుట్టిన రోజు నేపథ్యంలో మ్యూజిక్ లైవ్ షోలలో పాల్గొననుట్లు అభిమానులతో పంచుకుంది. సెలిన్ని కెరీర్కి దూరమయ్యేలా చేసిన అరుదైన 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' వ్యాధి అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..గాయని సెలిన్ డియోన్కు డిసెంబర్ 2022లో స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో ఆమె గతకొలంగా లైవ్షోలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె లైవ్షో వేదికపైకి తిరిగి రావడానికి సంసిద్ధంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లా డిఫెన్స్ ఎరీనాలో 10 రాత్రుల పాటు ప్రదర్శనలు ఇవ్వనుంది. ఇలా మళ్లీ పూర్తి స్థాయిలో కోలుకుని యథావిధిగా తన కెరీర్ని కొనసాగిచడాన్ని తన జీవితంలోని అత్యుత్తమమైన బహుమతిగా అభివర్ణించింది. మార్చి 2020లో అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన చివరి లైవ్ షో అనంతరం డియోన్ మళ్లీ తొలిసారిగా వేదికపైకి పునరాగమనం చేయనుండటం విశేషం. ఇక డియోన్ ఈ అరుదైన వ్యాది తన గొంతు కదలికలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. తన అభిమానులు, శ్రేయాభిలాషుల మద్దతతులో పూర్తి స్థాయిలో కోలుకున్నానని, అందుకు అందరికి కృతజ్ఞతలు అని పేర్కొంది. ఇంతకీ ఆమె ఎదుర్కొన్న అరుదైన వ్యాధి 'స్టిఫ్-పర్సన్ సిండ్రోమ్'అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అంటే ?స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ (SPS) అనేది ఒక అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ రుగ్మత. ఇది మొండెం, పొత్తికడుపులో కండరాల బిగుతుకు కారణమవుతుంది. కాలక్రమేణ ఈ పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా. దీని కారణంగా సంబంధిత రోగులు కాళ్లు, ఇంతర కండరాల్లో బిగువు, ఒక విధమైన నొప్పులను అనుభవిస్తారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు సాధారణ కదలికలు కష్టతరమవుతాయట. ముఖ్యంగా నడవడం కష్టంగా మారిపోతుందట.లక్షణాలు దీనిలో రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి:కండరాల బిగుతుఈ వ్యాధిలో కనిపించే తొలి సంకేతం ఇదే. ముఖ్యంగా మొండెం భాగంలో - అంటే పొట్ట, ఛాతీ, వీపులో మొదలవుతుంది. ఇది నిరంతర బిగుతుగా లేదా నొప్పితో కూడిన బాధగా అనిపిస్తుందట. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఈ బిగుతు రావచ్చు, పోవచ్చు. ఇది తీవ్రమవుతున్న కొద్దీ, చేతులు, కాళ్ళను కూడా ప్రభావితం చేయవచ్చు.కండరాల నొప్పులు (స్పాజమ్స్)ఇవి ఆకస్మికంగా, బాధాకరంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఒక భాగాన్ని లేదా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ నొప్పులు కొన్ని సెకన్లు, నిమిషాలు లేదా కొన్నిసార్లు గంటల పాటు కూడా ఉండవచ్చు.లక్షణాలను ప్రేరేపించే అంశాలుబిగ్గరగా లేదా ఊహించని శబ్దాలుశారీరక స్పర్శఉష్ణోగ్రతలో మార్పులు (ముఖ్యంగా చలి)ఒత్తిడితో కూడిన పరిస్థితులుమొత్తం మీద, ఈ పరిస్థితి కాలక్రమేణా కదలికలను కష్టతరం చేస్తుంది, మంచానికే పరిమితమయ్యేలా చేస్తుంది కూడా.కారణాలు :ఇది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి (Autoimmune disorder), అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున స్వంత నాడీ కణాలపై దాడి చేస్తుంది.చాలా మంది రోగులలో గ్లుటామిక్ యాసిడ్ డెకార్బాక్సిలేస్ (GAD) యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి.నిర్ధారణఈ వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్షలు (GAD యాంటీబాడీ టెస్ట్), EMG (Electromyography) ఉపయోగిస్తారు. చికిత్స, నిర్వహణ:దీనికి కచ్చితమైన చికిత్స లేనప్పటికీ, లక్షణాలను నిర్వహించవచ్చు. ముందుగా కండరాలను సడలించడానికి డయాజెపామ్ (Valium) లేదా బాక్లోఫెన్ (Baclofen) వంటి మందులు ఉపయోగిస్తారు.ఇమ్యునోథెరపీ: IVIG (Intravenous Immunoglobulin) చికిత్స తరచుగా మొదటి ప్రాముఖ్యతగా చేస్తుంటారు వైద్యులు. వాటితోపాటు ఫిజియోథెరపీ, ఇతర వ్యాయామాలు కదలికను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నిజానికి ఈ వ్యాధి స్త్రీలలో, ముఖ్యంగా 40-50 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు చల్లుతారో తెలుసా..!)
నాటి నర్స్.. నేటి ఆరోగ్య మంత్రి
ఢిల్లీలోని ఎయిమ్స్లో... నర్సుగా శిక్షణ పొందిన నిశా మెహతా. నేడు నేపాల్ ఆరోగ్య మంత్రి అయ్యారు. ఆమె పరిచయం.రాజకీయాలలోకి వచ్చిన డాక్టర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖా మంత్రులుగా పని చేయడం చూశాం. అయితే నేపాల్లో ఒక నర్సు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. మార్చి 27న ప్రధాని బాలేంద్ర షా మంత్రి వర్గంలో నర్స్ నిశా మెహతా ఆరోగ్యశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఒక విశేషమైతే ఆమెకు భారత్తో అనుబంధం ఉండటం మరో విశేషం.ఎయిమ్స్లో చదువుకునినేపాల్లోని కోషిప్రాంతానికి చెందిన 39 ఏళ్ల నిశా మెహతా ఢిల్లీలోని ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ చదివారు. ఆ తర్వాత గ్వాలియర్ యూనివర్సిటీలో నర్సింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తమ పూర్వవిద్యార్థిని నేపాల్ ఆరోగ్యమంత్రిగా ఎదగడం తమ సంస్థకే కాకుండా, మొత్తం నర్సింగ్ వృత్తికే ఘనతగా మారిందని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.మెహతా చురుకైన వ్యక్తి అని, బహుముఖ ప్రజ్ఞ గల విద్యార్థిని అని ఆమె చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లతా వెంకటేశన్ తెలిపారు. మెహతా విద్యార్థి దశలో రాజకీయంగా చురుకుగా లేనప్పటికీ నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటూ, ఆమె ఒక విశేషమైన వ్యక్తిగా కనిపించేవారని కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజు వత్సా గుర్తు చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక నేపాల్ తిరిగి వెళ్లిన నిశా అక్కడి ధారణ్లోని బి.పి.కోయిరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో క్లినికల్ నర్స్గా పని చేశారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆవిర్భావం నుంచి పని చేయడం మొదలుపెట్టారు. 2022 ఎన్నికలలో పదవికి కొద్దిదూరంలో ఆగిపోయినా ఈసారి కేంద్రమంత్రి కాగలిగారు.నర్స్గా సామాన్యుల సమస్యలను దగ్గరి నుంచి చూడటం వల్ల జాతీయ స్థాయిలో ఆమె చేయనున్న హెల్త్ పాలసీలపై అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ల విషయంలో ఆమె గట్టి మార్పు తేనున్నారని భావిస్తున్నారు.
అంతర్జాతీయం
ఎ‘వరెస్ట్’ స్కామ్: టూరిస్టులకు ‘విషం’ ఇచ్చి..
ఖాట్మండు: ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించాలని ఎంతో ఆశగా వచ్చే పర్యాటకులు తీవ్రమైన వంచనకు గురవుతున్నారు. కొందరు గైడ్లు, హెలికాప్టర్ సంస్థలు కలిసి, పర్యాటకుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. పర్యాటకులకు తెలియకుండా వారి ఆహారంలో విషం కలిపి, ఆపై అత్యవసర రెస్క్యూ పేరుతో సుమారు 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 167 కోట్లు) ఇన్సూరెన్స్ స్కామ్కు పాల్పడిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే...నేపాల్లో ట్రెకింగ్ చేసే పర్యాటకుల భోజనంలో గైడ్లు ఉద్దేశపూర్వకంగా ‘బేకింగ్ సోడా’ కలుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీనివల్ల పర్యాటకులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు అవుతాయి. ఇది చూసి పర్యాటకులు తమకు ‘ఆల్టిట్యూడ్ సిక్నెస్’ (ఎత్తైన ప్రాంతాల్లో వచ్చే అనారోగ్యం) వచ్చిందని భ్రమపడతారు. వెంటనే గైడ్లు వారిని భయపెట్టి, అత్యవసరంగా హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించాలని ఒత్తిడి చేస్తారు.వందల కోట్ల దోపిడీ ఇలా..ఈ కుట్రలో ట్రెకింగ్ ఏజెన్సీలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, ఆస్పత్రులు ఒక మాఫియాగా ఏర్పడ్డాయి. పర్యాటకులకు చికిత్స చేసినట్లు దొంగ పత్రాలు సృష్టించి, అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కేటుగాళ్లు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి నేపాల్ పోలీసులు ఇప్పటివరకు 32 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో హెలికాప్టర్ కంపెనీ యజమానులు, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్లు కూడా ఉన్నారు. నిందితుల నుంచి 11.3 మిలియన్ డాలర్ల జరిమానా వసూలు చేయాలని ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. నేపాల్ టూరిజం రంగంలో ఇలాంటి స్కామ్లు పెరిగిపోతుండటంతో, ఇప్పటికే పలు అంతర్జాతీయ బీమా సంస్థలు నేపాల్ ట్రెక్కర్లకు కవరేజీ ఇవ్వడం నిలిపివేశాయి. ఇది కూడా చదవండి: భక్తిలో భారతావని: రాష్ట్రానికో రీతిలో హనుమజ్జయంతి
‘ఇవే మా లక్ష్యాలు.. పవర్ఫుల్ స్పీచ్లో ట్రంప్ చెప్పారు’
వాషింగ్టన్: ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ తమ దేశ లక్ష్యాలను స్పష్టంగా తెలిపిందని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఆ లక్ష్యాలు.. ‘ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాలను నాశనం చేయడం, వారి నౌకాదళాన్ని నాశనం చేయడం, వారి వైమానిక దళాన్ని నాశనం చేయడం, ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోకుండా అవకాశాలను నాశనం చేయడం’ అని అన్నారు.“మా అధ్యక్షుడి నాయకత్వం ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపుతోంది. అదే.. అమెరికా తన ప్రజలను, తన ప్రయోజనాలను రక్షించుకుంటుంది. అమెరికా తన శక్తి ద్వారా శాంతి కొనసాగేలా చేస్తుంది” అని రుబియో పేర్కొన్నారు.కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇరాన్తో చేసుకున్న ఒప్పందం అమలులో ఉంటే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండాపోయేదని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. 1.7 బిలియన్ డాలర్లను గత అధ్యక్షుడు ఒబామా ఇరాన్కు ఇచ్చారని తెలిపారు. ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధ సంపద ఉందని, ఆ దేశాన్ని అణ్వాయుధ దేశంగా మారనివ్వనని అన్నారు. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే తన లక్ష్యమని చెప్పారు.డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో ఇచ్చిన స్పీచ్ను స్వయంగా వినడానికి పలువురు ప్రముఖులు రావడం గమనార్హం. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ తో పాటు విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, పలువురు ఉన్నతస్థాయి సైనికాధికారులు వచ్చారు. ట్రంప్ స్పీచ్ను ప్రపంచం ఆసక్తికరంగా విన్నది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న దానిపై మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. మరో రెండు-మూడు వారాలు దాడులు కొనసాగుతాయని చెప్పారు.
చందమామ దిశగా.. దూసుకెళ్లిన ఆర్టీమిస్–2
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుదూర గ్రహాలను అందుకునేందుకు జాబిల్లిని కేంద్రంగా చేసుకోవాలన్న లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టీమిస్–2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములతో కూడిన, 32 అంతస్తుల ఎత్తైన, ‘స్పేస్ లాంచ్ సిస్టమ్’తో కూడిన ‘ఓరియన్’ రాకెట్.. నింగిలోకి దూసుకుపోయింది.ఇక, ‘ఓరియన్’ రాకెట్.. చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి, దాన్ని చుట్టి రానుంది. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు పది రోజులపాటు రాకెట్లోనే ప్రయాణించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో చందమామపైకి మానవులను పంపించే మార్గం సుగమం అవుతుంది. ఈ ఈ ప్రయోగం ద్వారా అమెరికా, కెనడా వ్యోమగాములు రెయిడ్ వైస్మ్యాన్(కమాండర్), విక్టర్ గ్లోవర్(పైలట్), క్రిస్టినా కూచ్(మహిళా మిషన్ స్పెషలిస్ట్), జెరిమీ హాన్సెన్లు చందమామ సమీప కక్ష్యలోకి వెళ్లి వస్తారు. ఈ మొత్తం యాత్ర 8 అంకె ఆకృతిలో సాగనుంది. మొత్తం 10 రోజుల యాత్ర తర్వాత వీళ్లు ప్రయాణించే క్యాప్సూల్ పసిఫిక్ మహా సముద్రజలాల్లో పడిపోనుంది. ఈ ప్రయోగంలో చందమామపై వ్యోమగాముల ల్యాండింగ్ ఉండబోదు.Liftoff.The Artemis II mission launched from @NASAKennedy at 6:35pm ET (2235 UTC), propelling four astronauts on a journey around the Moon.Artemis II will pave the way for future Moon landings, as well as the next giant leap — astronauts on Mars. pic.twitter.com/ENQA4RTqAc— NASA (@NASA) April 1, 2026రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాక తొలిరోజు వీళ్లు భూకక్ష్యలో తిరిగి తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం మొదలెడతారు. కేవలం చందమామను వ్యోమగాములు దాదాపు 7,600 కిలోమీటర్ల ఎత్తు నుంచి పరిశీలించి తిరిగొస్తారు. ఆర్టీమిస్2 ప్రయోగంలో వ్యోమగాములు తమ రక్షణ కోసం ఓరియాన్ సంస్థ తయారుచేసిన ‘ఇంటిగ్రిటీ’క్యాప్సూల్లో పయనించారు. ఇది వ్యోమగాములు తిరుగుప్రయాణంలో గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచ్చినా వాళ్లకు ఎలాంటి హాని కల్గకుండా రక్షణనిస్తుంది. వాస్తవానికి ఆర్టిమిస్–2 ప్రయోగం ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. కానీ రాకెట్ నుంచి హైడ్రోజన్ ఇంధనం లీకేజీ కారణంగా ప్రయోగం వాయిదాపడింది. తర్వాత సమస్యను పరిష్కరించినా హీలియం పీడనవ్యవస్థ విఫలమవడంతో ప్రయోగం మళ్లీ వాయిదాపడింది. ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. 🚨🇺🇸 This animation reveals NASA’s full Artemis II flight path, a nearly 685,000-mile journey that traces a giant figure-eight from Earth, swings far around the Moon’s far side.pic.twitter.com/GiIj9QQJkF https://t.co/RRRn3UhXuY— Mario Nawfal (@MarioNawfal) April 1, 2026
ఇండోనేషియా: 7.4 తీవ్రతతో భారీ భూకంపం
జకార్తా: ఇండోనేషియాలో మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తూర్పు ఇండోనేషియాలోని టెర్నేట్ నగరం సమీపంలో ఉత్తర మొలుక్కా సముద్రంలో గురువారం సంభవించిన భారీ భూకంపం పెను ప్రకంపనలు సృష్టించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్సీఎస్) వెల్లడించింది. 🚨🇮🇩#BREAKING | NEWS ⚠️Watch as a building violently shakes with objects falling onto the ground after a major 7.8⚡️Magnitude Earthquake has struck in Indonesia a tsunami warning was issued for Malaysia🇲🇾 and the Philippines🇵🇭 pic.twitter.com/wGGaTlRUJe— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) April 1, 2026సముద్ర మట్టానికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీపంలోని ద్వీపాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలోని ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాలకు సునామీ ముప్పు పొంచి ఉందని అమెరికా సునామీ హెచ్చరికల విభాగం హెచ్చరించింది. సముద్ర అలలు సాధారణ స్థాయి కంటే 0.3 మీటర్ల నుంచి ఒక మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. టెర్నేట్, టిడోర్ తదితర నగరాల్లో స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని (ఎవాక్యూషన్) సూచించింది. భూకంప ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నట్లు స్థానిక 'మెట్రో టీవీ' దృశ్యాలను ప్రసారం చేసింది. అయితే, ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక సమాచారం అందలేదు. జపాన్, గ్వామ్, పాపువా న్యూగినియా, తైవాన్ తీరాల్లోనూ స్వల్ప స్థాయిలోఅలలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి.
జాతీయం
ఎండ కన్నా డేంజర్.. తేమ తాపం
దేశంలో మనకు తెలియకుండానే మన మనుగడకు ప్రమాదకరమైన స్థాయికి దగ్గరగా ఉన్న అధిక ఉష్ణోగ్రతలను ఇప్పటికే అనుభవిస్తున్నామా? హీట్ వేవ్ (వడగాడ్పుల) ముప్పును లెక్కగట్టేటప్పుడు ఒక్క ఉష్ణోగ్రతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ప్రమాదకరమైన వేడి ముప్పును ముందుగా తెలుసుకోలేకపోతున్నామా?అధిక ఉష్ణోగ్రతతోపాటు అప్పటి గాలిలో సాపేక్ష తేమ (రిలేటివ్ హ్యుమిడిటీ) శాతాన్ని కూడా కలిపి లెక్కించటం ప్రారంభించాలి. వాస్తవికమైన మనం ఫీలయ్యే వేడి ముప్పు తీవ్రతను ముందుగా గుర్తించటానికి, సహాయక చర్యల సన్నద్ధతను పెంచుకోవటానికి ఇది అవసరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్వెట్–బల్బ్ ఉష్ణోగ్రత అంటే? ఉష్ణోగ్రతతోపాటు గాలిలో సాపేక్ష తేమను కూడా పరిగణనలోకి తీసుకోవటాన్ని వెట్–బల్బ్ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు. వేడి ఒత్తిడి అంచనాలో ఉష్ణోగ్రతతోపాటు గాలిలో తేమను కలపటం ఎందుకు అంటే.. వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చెమట పడుతుంది. వేడిని తట్టుకునే ప్రక్రియలో చెమట శరీరానికి ఉపయోగపడుతుంది. చర్మంపై నుంచి చెమట ఎంతగా ఆవిరైపోతోందనే దానిపై ఈ ప్రక్రియ ఎంత సమర్థవంతంగా జరుగుతోందనేది ఆధారపడి ఉంటుంది.గాలిలో అధిక తేమ ఉన్న పరిస్థితిలో, శరీరం సహజ శీతలీకరణ యంత్రాంగానికి అంతరాయం కలుగుతుంది. చెమట ఆవిరి కానప్పుడు, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది తీవ్రమైతే అలసట, వడదెబ్బ తగులుతాయి. తీవ్రమైన సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. వేడి, తేమ వల్ల కలిగే ఈ మిశ్రమ ఒత్తిడిని వెట్–బల్బ్ ఉష్ణోగ్రత ద్వారా అంచనా వేస్తారు. వాతావరణ ప్రజారోగ్య స్థితిగతుల అంచనాల్లో ఇదొక కీలకమైన కొలమానమైనా, మన దేశంలో ఇంకా తక్కువగానే ఉపయోగిస్తున్నారు. ఉష్ణోగ్రత కన్నా తేమే ముఖ్యంకేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.నాయర్ రాజీవన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఇలా అన్నారు.. ‘ప్రస్తుతం మనం తేమ ప్రభావాలపై తగినంత శ్రద్ధ పెట్టటం లేదు. కానీ మన ఆరోగ్యంపై ప్రభావం విషయానికి వస్తే, పెరుగుతున్న ఉష్ణోగ్రతతోపాటు తేమ కూడా అంతే ముఖ్యమైనది లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది’. ‘డ్రై హీట్’ ఒక్కటే ప్రామాణికమా? ⇒ భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్దేశించే ప్రాథమిక ప్రమాణాల ప్రకారం.. మైదాన ప్రాంతాల్లో 40 (కొండ ప్రాంతాల్లో 30, కోస్తా తీర ప్రాంతాల్లో 37) డిగ్రీల సెల్సియస్ దాటితేనే ప్రస్తుతం వడగాడ్పు (హీట్వేవ్స్)ను అధికారికంగా ప్రకటిస్తున్నారు. ⇒ ఈ స్థాయి కన్నా 4.5–6.4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగితే ‘వడగాడ్పు’రోజుగా, 6.4 డిగ్రీల కన్నా పెరిగితే ‘తీవ్ర వడగాడ్పు’రోజుగా ప్రకటిస్తున్నారు. ⇒ అయితే, ఉష్ణోగ్రతతోపాటు గాలిలోని సాపేక్ష తేమను ప్రాథమిక ప్రమాణంగా ఐఎండీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. హీట్వేవ్స్ ప్రకటనకు సాపేక్ష తేమను ఐఎండీ ప్రాథమిక ప్రమాణంగా కాకుండా సెకండరీ విషయంగానే పరిగణించటం వల్ల ఈ ముప్పు ప్రాణాంతకంగా మారుతోంది. దీన్ని ‘డ్రై హీట్’ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు.⇒ పగటి ఉష్ణోగ్రత ఐఎండీ ప్రమాదకరమని భావించినంత పెరగనప్పుడు కూడా, గాలిలోని అధిక సాపేక్ష తేమ వల్ల, ప్రజలు ప్రమాదకరమైన వడగాడ్పుల ముప్పును అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉన్నా, వృద్ధులు, పిల్లలతోపాటు ఆరుబయట పనిచేసే వారు వడదెబ్బకు గురవుతున్నారు. ⇒ గాలిలో తేమ శాతం సాధారణంగా ఎక్కువగా ఉండే కోస్తా తీర ప్రాంతాల్లో, కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగర, పట్టణ ప్రాంతాల్లో వాతావరణ మార్పు నేపథ్యంలో ఈ ముప్పు పెరుగుతోంది. హీట్ స్ట్రోక్ మరణాలు ఎక్కువ కావటానికి ఇదొక ముఖ్య కారణంగా చెబుతున్నారు. ⇒ వడగాడ్పుల ప్రభావం ప్రజలపై ఉన్నా, అధికారికంగా ప్రకటించనందున, ప్రభుత్వ యంత్రాంగంలో, ప్రజల్లో సంసిద్ధత, అప్రమత్తత లోపిస్తోంది. నివారించదగిన వడగాడ్పు మరణాల రేటు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ అంతేకాదు, బాధితులకు వైద్య సహాయంలో, సహాయక చర్యల్లో, వడగాడ్పు మృతులకు పరిహారం చెల్లింపుల్లోనూ ఇది ప్రతిబంధకంగా మారుతోంది. డ్రై హీట్ పద్ధతికి బదులు వెట్–బల్బ్ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతిని అనుసరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.
పెద్దల సభలో తెలంగాణ పంచాయితీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026పై జరిగిన చర్చలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివిధ అంశాలపై పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఆ వ్యాఖ్యలు అభ్యంతకరం: కేఆర్ సురేశ్రెడ్డి ‘కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ’కేంద్ర జలశక్తి మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించి క్షమాపణ చెప్పాలని, లేకుంటే సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సురేశ్రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే మేడిగడ్డ బరాజ్లోని రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు, ఐటీఐఆర్ కారి డార్, స్టీల్ ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీలతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన రూ.900 కోట్ల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్, కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కిషన్రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘భద్రాచలం గ్రామాలను ఏపీలో కలపడం కాంగ్రెస్ రూపొందించిన విభజన చట్టంలోనే ఉంది. అప్పట్లో సోనియాగాం«దీతో డిన్నర్ చేసి, ఆమె కాళ్లు పట్టుకున్న కేసీఆర్.. అప్పుడెందుకు ఆ గ్రామాల గురించి అడగలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? కేంద్రం నుంచి పైసా తీసుకోలేదని చెబుతున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కేసీఆర్ దుబాయ్లో నోట్లు ఏమైనా ముద్రించారా? అది కేసీఆర్ ఇంట్లో డబ్బు కాదు, ప్రజల డబ్బు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిపోయింది. ఎన్నికల ముందు కాళేశ్వరంపై విచారణ జరిపి కేసీఆర్ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు ఆ పనిచేయడం లేదు’అని కిషన్రెడ్డి ప్రశి్నంచారు. అది ఎలాగూ అమరావతే ఎంపీ రేణుకాచౌదరి పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా ’కమ్మ’రావతి అంటూ రాజధాని అమరావతి పేరు చుట్టూ సాగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. ‘అది ఎలాగూ అమరావతే. నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను.. ’పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి.. పెట్టు పేరు!’అని నేనే అన్నాను. వారికి (కేంద్రానికి) అంత ధైర్యం ఉంటే, చెప్పింది అమలు చేసే సాహసం కూడా చేయమనండి. ఇది కేవలం ఒక కాస్మెటిక్ టచ్ (కంటితుడుపు చర్య) మాత్రమే.’అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టాన్ని కేవలం తన మిత్రపక్షాలకు (కూటమికి) మేలు చేసేందుకే వాడుకుంటోంది. అదే చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది’అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భద్రాచలం సరిహద్దుల్లోని ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి: ఎంపీ వద్దిరాజు సూపర్బజార్ (కొత్తగూడెం): ఆంధ్రప్రదేశ్ విభజన సమయాన భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలను ఏపీలో విలీనం చేశారని, ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామనేది మొదటి నుంచి తమ పార్టీ విధానమని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, గిరిజన యూనివర్సిటీకి మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి మంత్రి కిషన్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
పీఎం మోదీ, ఆర్మీ అఫీషియల్స్ మీటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే?
దేశం మొత్తం నిద్రలో ఉన్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్తో మూడు గంటలపాటు జరిగిన గోప్య సమావేశం దేశ భద్రతా పరిస్థితులపై దృష్టి సారించింది. దోవల్ రూపొందించిన "రెడ్ ఫైల్"లో అమెరికా–పాకిస్థాన్ రహస్య ఒప్పందం, ఇరాన్పై దాడుల ప్రణాళిక, భారత్ను యుద్ధంలోకి లాగే ప్రయత్నాలపై కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు పూరీ జగన్నాథ, అమృత్సర్ స్వర్ణ దేవాలయం, ఉజ్జయిని మహాకాళి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం, సరిహద్దుల్లో NOTAM జారీ చేయడం వంటి పరిణామాలు దేశం ఒక పెద్ద "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని సంకేతాలు ఇస్తున్నాయి. అమెరికా–పాకిస్థాన్ ఒప్పందం ఇరాన్తో ఘర్షణకు దారితీస్తే, పాకిస్థాన్ ఈ పరిస్థితిని భారత్పై ఒత్తిడి పెంచడానికి వాడుకోవచ్చనే ఆందోళనలతో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ విశ్లేషణ వీడియోను క్లిక్ చేయండి.
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
ఢిల్లీలోని సౌత్ బ్లాక్.. రాత్రి సమయం. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా కనిపించే మీటింగ్లు కావు ఇవి. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్రనేతలతో పాటు, ఒక వ్యక్తి అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయనే భారత జేమ్స్ బాండ్ – అజిత్ దోవల్! అసలు ఏం జరుగుతోంది? భారత్ మరో మహా యుద్ధానికి సిద్ధమవుతోందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. NSA అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ కవచం. రా (RAW) , ఎన్ఐఏ (NIA) ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి, ఆయన ఒక 'రిస్క్ అసెస్మెంట్ ఫైల్' రూపొందించారు. దీనినే 'రెడ్ ఫైల్' అని పిలుస్తారు. సాధారణంగా ప్రపంచ నేతలెవరైనా 30 నుండి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. కానీ మోదీ, దోవల్తో ఏకంగా మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చించారంటే, అది చమురు ధరల గురించో, ఆర్థిక స్థితిగతుల గురించో కాదని ఇక్కడ స్పష్టమవుతోంది. అమెరికా , పాకిస్థాన్లు కలిసి భారత్ను ఇబ్బంది పెట్టడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కింది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్ తోపాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) గంటల తరబడి గడుపుతున్నారు. మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరీ జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహాకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే, భారత్ ఏదో భారీ "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్థాన్ తన గాలి సరిహద్దులను (Air Space) అప్పగించబోతోంది. ఒకవేళ పాకిస్థాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకెళ్తే, ఇరాన్ ఖచ్చితంగా పాకిస్థాన్పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! పాకిస్థాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ను యుద్ధంలోకి లాగాలని చూస్తోంది. భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో 'నోటామ్' (NOTAM) జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏం జరగొచ్చనేదానికి ఇది సంకేతం.మరోవైపు, పీఓకే (PoK) సరిహద్దుల్లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ ,పాకిస్థాన్ కలిసి భారత్ను "టూ ఫ్రంట్ వార్" (రెండు వైపుల నుండి యుద్ధం) లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే ఈ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, ఎస్-400, రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్థాన్ను ఎలా దెబ్బకొట్టాలి? ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి? అనే వ్యూహంలో ఉంది. శతృవు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత వార్-రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహా-సంగ్రామంలో భారత్ పైచేయి సాధిస్తుందా? మోదీ, దోవల్ వ్యూహం పాకిస్థాన్ను కోలుకోలేని దెబ్బ తీయబోతోందా? అనే చర్చ అంతర్జాతీయ మీడియాలో మొదలైంది.
ఎన్ఆర్ఐ
న్యూయార్క్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
అమెరికాలో ఘనంగా మహిళా దినోత్సవం
అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శివరాత్రితో పాటు మహిళా దినోత్సవం రెండు వేడుకలను కలిపి నైటా సంబరాలను అద్వితీయంగా జరిపారు. న్యూయర్క్, న్యూజెర్సీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ కన్సర్ట్ అందరినీ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ&టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాల ఫెర్మార్మెన్స్లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్లు ఆహా అనిపించాయి. నైటా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల సమాహారంతో రూపొందించిన ప్రత్యేక నైటా సంబరాల సావనీర్-2026ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, వితరణశీలి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా న్యూయార్క్ వేదికగా నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేక సందేశాలు పంపారు. అమెరికాలో స్థిరపడినా పుట్టినప్రాంత పండగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగిస్తున్నామని, వేడుకల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహకరించిన అందరికీ నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ హరిచరణ బొబ్బిలి, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ సౌమ్య శ్రీ, ఇతర కార్యకవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.(చదవండి: లండన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్కి. భోపాల్లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)
క్రైమ్
5 ఏళ్ల ప్రేమ, పెళ్లైన నెలకే ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కట్నం కోరలకు మరో యువతి బలైపోయింది. హైదరాబాద్లోని సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ ప్రాంతంలో, ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త వేధించాడన్న ఆరోపణలతో, బిహార్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇషితా యాదవ్ తనువు చాలించింది. పోలీసుల వివరాల ప్రకారం,బుధవారం సాయంత్రం, ఇషితా యాదవ్ తన అపార్ట్మెంట్లోని హాలులో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను ఆ స్థితిలో చూసిన ఆమె భర్త, నీరజ్ భన్సల్, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇషితా ,నీరజ్ 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. ఇషితా స్వస్థలం బిహార్ కాగా, నీరజ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాట్నాలో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం, వీరిద్దరూ హైదరాబాద్కు మకాం మార్చారు.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం, నీరజ్ అదనపు కట్నం కోసం ఇషితాను వేధించడం, ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో పాటు, తాను ఇటీవల ప్రారంభించిన ఒక స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఆమె కుటుంబాన్ని డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఇషితా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్
పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఒక వివాహ వేడుక రసాభాసగా మారిపోయింది. స్వల్ప వివాదానికే అతిథులు రెచ్చిపోయారు. ఇది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి సమయంలో నిందితులు ఇంట్లోని వస్తువులను, నగదును కూడా ఎత్తుకుపోవడం కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటాయ్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానిక నివాసి మహేష్ జాతవ్ వివాహం జరుగుతుండగా, వేడుకలో తమకు మద్యం సరఫరా చేయాలని అతిథులు గొడవకు దిగారు. దీంతో వివాదం చెలరేగింది. మందు పోస్తావా, డబ్బులు ఇస్తావా అంటూ నానా యాగీ చేశారు. దీనికి వరుడు నిరాకరించడంతో వివాదం మరింత ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. మద్యం ఇవ్వలేదని ఆగ్రహించిన అతిథుల బృందం, వధూవరులతో పాటు, కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసి నట్లు నగర పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ యాదవ్ విలేకరులకు తెలిపారు. ఈ ఘర్షణలో వరుడి కుటుంబానికి చెందిన కొందరు సభ్యులు గాయపడ్డారు. ఈ సమయంలో కొన్ని విలువైన వస్తువులు, నగలు దొంగిలించిన ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.STORY | Guests attack bride, groom after not being served liquor at wedding in MP villageUpset at not being served liquor, a group of guests at a wedding in Madhya Pradesh's Gwalior district allegedly assaulted the bride, groom and their family members, police said.READ |… pic.twitter.com/PnRKy5cfnm— Press Trust of India (@PTI_News) April 2, 2026ఇదీ చదవండి : ఇపుడా పని..క్యాబ్ బుక్ చేసినంత ఈజీ : ఆనంద్ మహీంద్ర ట్వీట్ వరుడి తల్లి ఆరోపణలుపెళ్లింటికి తమ వధువు చేరుకున్న తర్వాత కొన్ని ఆచారాలు జరుగుతుండగా, కొందరు పొరుగువారు అక్కడికి వచ్చి మద్యం కోసం తన కుమారుడిని డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారని వరుడి తల్లి షీలా విలేకరులకు తెలిపారు. మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ పొరుగువారు వరుడితో సహా తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. తాము జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, తనపై, తన భర్తపై , వధువుపై కూడా దాడి చేశారని జాతవ్ తల్లి ఆరోపించారు.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతం
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. 11 నెలల తన బిడ్డ ప్రమాదవశాత్తు నీటి బకెట్లో మునిగి చనిపోయిన కొద్ది నిమిషాలకే, 29 ఏళ్ల మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.సాఫ్ట్వేర్ నిపుణురాలైన ప్రతిభ తన బిడ్డతో ఇంట్లో ఉండగా, ఆమె భర్త మహంతేష్ పనిలో ఉన్నారు. ప్రతిభ తన బిడ్డ అగస్త్యను బట్టలు తీసుకోవడానికి టెర్రస్పైకి వెళ్లింది. ఆమె తన పనిలో ఉండగా, పాకుతూ వెళ్లిన బిడ్డ ప్రమాదవశాత్తు నీటితో నిండిన బకెట్లో పడిపోయింది. ప్రతిభ ఇది గమనించేసరికి, తన బిడ్డ బకెట్లో ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె, మొదల మణికట్టు కోసుకుని, కొన్ని మాత్రలు మింగి, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో, మహంతేష్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తలుపు లోపలి నుండి గడియ పెట్టి ఉండటాన్ని గమనించాడు. వారి వద్ద ఉన్న అదనపు తాళంచెవితో అతను ఇంట్లోకి ప్రవేశించి చూడగా, తన భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ప్రతిభ రాసిన ఆత్మహత్య లేఖను చూశాడు. తన తప్పిదం వల్లే బిడ్డ చనిపోయిందని ప్రతిభ తన సూసైడ్ లేఖలో పేర్కొంది. దీంతో 15 మాత్రల ఖాళీ స్ట్రిప్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తన బిడ్డ మరణానికి తానే 'బాధ్యురాలినని' సూసైడ్లో ఆమె పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. గత నాలుగేళ్లుగా ఆ కుటుంబం అద్దె ఫ్లాట్లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
ముత్తూట్ ఫైనాన్స్ వద్ద టెన్షన్.. ఖాతాదారుల గుండెల్లో రైళ్లు
అన్నమయ్య జిల్లా: రాయచోటిలోని ముత్తూట్ ఫైనా న్స్ బ్యాంకు మేనేజర్ ఖాతాదారుల బంగారు నగలతో వెళ్లిపోయారన్న ప్రచారం బంగారు పె ట్టిన ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించా యి. ఖాతాదారులు బుధవారం ఉదయం బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. మేనేజర్ వచ్చేవరకు బ్యాంకు తాళాలను తెరవడానికి వీ లులేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయా న్ని తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఖాతాదారులకు సర్దిచెప్పి అనుమానాలు ఉంటే బ్యాంకు తెరిచిన తరువాత నివృత్తి చేసుకోవాలని, నగలు చూపించకపోతే అనంతరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఖాతాదారులు బ్యాంకును ఓపెన్ చేయడానికి సమ్మతించారు. ముత్తూట్ ఫైనాన్స్ ఖాతాల్లో సిబ్బంది చేతివాటం లేదా భారీ దోపిడీల వల్ల కస్టమర్ల బంగారం అపహరణకు గురైన సంఘటనలు ఖాతాదారుల్లో భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల మధ్య తరగతి, ఆపై వర్గాల ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సంబేపల్లి మండలం, గున్నికుంట్ల గ్రామం, కత్తివాండ్లపల్లికి చెందిన ఉమా మహేశ్వర్ రెడ్డి 128 గ్రాముల బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి రూ. 11.36 లక్షల మొత్తం రుణంగా పొందారు. రెన్యువల్ నిమిత్తం బ్యాంకు మేనేజర్కు 073170 నంబరు ఉన్న ఖాళీ చెక్కును అందజేశానన్నారు. ఈ చెక్కుతో గోల్డ్లోన్కు జమ చేయకుండా మేనేజర్ పసుపులేటి నరేష్ తన భార్య చిన్నమనేని లక్ష్మీదేవి పేరున రూ. 9,50,000లు డ్రా చేసినట్లు బ్యాంకు ఎదుట మీడియాకు వివరించారు. రెండు రోజులుగా బ్యాంకుకు రాకుండా ఖాతాదారులకు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారన్నారు. బ్యాంకులో జరిగిన అవకతవకలపై బ్యాంక్ మేనేజర్ నరేష్ను ఫోన్ ద్వారా వివరణ కోరగా ఉమా మహేశ్వర్ రెడ్డి తన దగ్గర వ్యక్తిగతంగా రూ. 6 లక్షల వరకు అప్పుగా తీసుకున్నారన్నారు. ఆ అప్పుకు సంబంధించిన వడ్డీ మొత్తం కలిపి చెక్కు ద్వారా మాకు జమ చేశారని తెలిపారు. బ్యాంకులో గోల్డ్ ద్వారా రుణం పొందిన డబ్బులకు, నాకు చెల్లించిన డబ్బులకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రెండు రోజులుగా తాను వ్యక్తిగత కారణాలు వల్ల సెలవుల్లో ఉన్నానని తెలిపారు. ఈ సమయంలో ఉమా మహేశ్వర్ బుధవారం కొంతమందితో బ్యాంకు దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఇదే విషయం ఖాతాదారుల్లో గందరగోళాన్ని నెలకొల్పిన సంఘటనపై రాయచోటి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.ముత్తూట్, మణప్పురం ఇతర ఫైనాన్స్ బ్యాంకుల్లో బంగారు నగలు తాకట్టు పెట్టిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పెట్టిన నగలను తిరిగి పొందటానికి ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలతో రుణాలు తీసుకొని ప్రైవేట్ బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ముత్తూట్ బ్యాంకులో వచ్చిన ఆరోపణలపై భీతిల్లిన ఖాతాదారులు బుధవారం ఒక్కరోజు రూ. 40 లక్షలు చెల్లించి బంగారాన్ని పొందినట్లు సమాచారం.
వీడియోలు
పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
రికార్డు స్థాయిలో ఏపీలో మద్యం వినియోగం
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!
మచిలీపట్నంలో హైటెన్షన్.. జనసేన నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన టాటా సుమో
అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా
నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..
అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు
వైఎస్ జగన్ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు


