Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Long live the Republic by Vardhelli Murali1
లాంగ్‌ లివ్‌ ద రిపబ్లిక్‌

డెబ్బయ్‌ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్‌ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్‌ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్‌ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్‌కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్‌కు చేర్చిన టీమ్‌ క్యాప్టెన్‌ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్‌ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్‌ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్‌ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్‌ అంబేడ్కర్‌ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్‌అండ్‌ బ్యాలెన్సెస్‌లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్‌తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్‌ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్‌ స్టూవర్ట్‌ మిల్‌ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్‌ అంబేడ్కర్‌ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్‌ ది స్టేట్‌’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్‌ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్‌ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్‌టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్‌ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్‌ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్‌బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్‌బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్‌టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు గవర్నర్‌ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్‌ హార్స్‌’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్‌లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్‌ నేషన్‌ ఒన్‌ ఎలక్షన్‌’ (ఓఎన్‌ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్‌ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్‌లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్‌ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్‌ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్‌ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Chandrababu Strange Response To Davos Failure2
ప్లేటు ఫిరాయించిన చంద్రబాబు.. ‘దావోస్‌’ వైఫల్యంపై కవరింగ్‌

సాక్షి, విజయవాడ: దావోస్(Davos) వైఫల్యంపై సీఎం చంద్రబాబు(Chandrababu) బుకాయింపులకు దిగారు. దావోస్‌లో అసలు ఎంవోయూలు చేసుకోరంటూ వింత సమాధానం ఇచ్చారు. దావోస్ వెళితే పెట్టుబడులు (Investments) వస్తాయన్నది ఓ భ్రమ అంటూ చంద్రబాబు భాష్యం చెప్పారు. దావోస్‌లో అసలు ఎంవోయూలు చేసుకోవాల్సిన పనిలేదంటూ కవరింగ్ ఇచ్చారు. దావోస్ వెళ్లేముందు పెట్టుబడుల కోసమేనంటూ టీడీపీ, ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.గతంలో దావోస్‌నే ఏపీకి తెస్తానంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ అక్కడ ఆయన టీమ్ ఘోర వైఫల్యం చెందింది. దీంతో దావోస్‌లో ఏపీకి ఘోర అవమానమే మిగిలింది. జీరో ఎంవోయులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తిరిగొచ్చారు. తీవ్రంగా విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు ప్లేటు ఫిరాయించేశారు.‘‘దావోస్ అంటే ఒక మిత్ ఉంది. ఎన్ని ఎంవోయూలు చేశారు.. ఎంత డబ్బులొచ్చాయన్నది ఓ మిత్. ఇక్కడుండే ఎంవోయూలు అక్కడ చేసుకునే పనిలేదు. దావోస్ కేవలం నెట్ వర్క్‌ ప్లేస్ మాత్రమే. ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: దావోస్ తుస్.. పవన్ ఫుల్ ఖుష్!దావోస్‌ పర్యటనకు ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఎటువంటి పెట్టుబడుల ఒప్పందాలు లేకుండా ఏపీ బృందం రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. రిలయన్స్, ఎల్‌ అండ్‌ టీ, అమెజాన్, వర్థన్‌ లిథియం, జేఎస్‌డబ్ల్యూ, టాటా తదితర దిగ్గజ సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.తెలంగాణ ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని, నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని, 1995 నుంచి దావోస్‌కు వెళుతున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు. మైక్రోసాఫ్ట్‌ నుంచి వైదొలిగి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్‌గేట్స్‌తో సమావేశమై ఆ ఫోటోను ఎల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అసలు మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులకు, బిల్‌గేట్స్‌కు ఇప్పుడు సంబంధం లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ పత్రికలు బాకాలూదాయి.ఇదీ చదవండి: చంద్రబాబు దావోస్‌ పర్యటన.. దారి ఖర్చులు 'దండగ'!

Weekly Horoscope Telugu 25-01-2025 To 01-02-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు తీరి లాభాలబాటలో పడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి.వృషభం...అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు. ఆత్మస్థైర్యం, పట్టుదలతో ముందుకు సాగండి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. నిర్ణయాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు వాయిదా వేస్తారు. కుటుంబబాధ్యతలపై కొంత విముఖత చూపుతారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. చిన్ననాటి మిత్రుల కలయిక. తెలుపు, పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మిథునం....మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయినా పట్టుదలతో అధిగమిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారంపై చర్చలు జరుపుతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి అనుకోని సన్మానాలు, రివార్డులు దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.కర్కాటకం...అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు విజయాలు చేకూరతాయి. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉండి రుణాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యతిరేకులు కూడా మీకు సహకరించడం విశేషం. వాహనయోగం. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.సింహం....ముఖ్య వ్యవహారాలు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ పుంజుకుంటుంది. సన్నిహితులు, బంధువులతో ముఖ్యమైన విషయాలపై ^è ర్చిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో తగినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.కన్య.....ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా సర్దుబాటు చేసుకుంటారు.∙పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు మన్నిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సానుకూల వాతావరణం. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు మిశ్రమంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.తుల....ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నిర్వíß స్తారు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన,వస్తులాభాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. నీలం, తెలుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...ఎంత శ్రమకోర్చినా అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు సైతం ఒత్తిడులు పెంచుతారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కాస్త ఊరటనిస్తుంది. విద్యార్థులు అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాల విషయంలో అప్రమత్తంగా మెలగండి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. కళారంగం వారికి గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.ధనుస్సు...ఎంతటి పనైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.మకరం...పనులు కొంత మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. ఎరుపు, గులాబీ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.కుంభం...ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. మీపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మీనం...పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సేవాకార్యక్రమాలను చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

Sakshi Guest Column On India Constitutional implementation4
రాజ్యాంగ అమలులో చిత్తశుద్ధి ఉందా?

దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి చర్చలు తుది రూపంలోకి వస్తున్న తరుణంలోనే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేశారు. బి.ఆర్‌. అంబేడ్కర్‌ ముసాయిదా కమిటి చైర్మన్‌గా, బాబూ రాజేంద్ర ప్రసాద్‌ అధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ రాజ్యాంగ రచనా కమిటీలకు నిష్ణాతులు సేవలందించారు. వీరి కృషి ఫలితంగా రూపొందిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26 నాడు రాజ్యాంగ సభ ఆమోదించింది. నాటి రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు, 486 పైగా అధిక రణలు). చివరకు 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే 2025 జనవరి 26 నాటికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లన్నమాట! ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో దేశం పరిపాలనా పరంగా, జనాభా పరంగా, సంస్థాగతంగా, సాంకేతికంగా చాలా ప్రగతిని సాధించిందని చెప్పగలం. కానీ ఆ అభివృద్ధి అన్ని రంగాల్లో ఆశించిన స్థాయిలో జరగకపోవడం, రాజ్యాంగంలో పేర్కొన్నట్లు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ కాకపోవడం బాధాకరం. రాజ్యాంగ ప్రవేశికలో లేని ‘సామ్యవాద’, ‘లౌకిక’ పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేర్చింది. మొత్తం మీద ఇప్పటికి 106 రాజ్యాంగ సవరణలు జరగడం గమనార్హం. ఏ దేశ రాజ్యాంగం అయినా మారుతున్న అవసరా లకు అనుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఆనాడు రాజ్యాంగ సభలో అంబేడ్కరే స్వయంగా ‘ఒకవేళ రాజ్యాంగం విఫలం అయితే ఆ తప్పు రాజ్యాంగానిది కాదు, దానిని అమలు చేసే పాలకులదే’ అన్నారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని చేశారు. కానీ దీన్ని చాలా రాజకీయ పార్టీలు ఎంతగా నీరుగార్చాయో తెలిసిందే కదా! 6–14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ‘విద్యా హక్కు చట్టం’ తెచ్చారు. కానీ అమలును మరచారు. నేటికీ బడి బయట కోట్లాదిమంది పిల్లలు బాలకార్మికులుగా బతుకు తున్నారు. దేశంలో అంతర్గతంగా పెరుగుతున్న కులం, మతం భావాలు విద్వేషాన్ని నింపుతున్నాయి. ఈ మధ్యనే ఫ్యూచర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నివేదికలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో మనదేశం మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది.రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశ సూత్రాలు సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాథమిక హక్కు లదీ దాదాపు అదే స్థితి. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వాలు ఎలా నీరుగారుస్తున్నాయో జైళ్లలో మగ్గుతున్న అనేక మంది హక్కుల కార్యకర్తలూ, ప్రజా ఉద్యమకారులూ, మేధావులను చూస్తే అర్థమవు తుంది. అలాగే అమానవీయమైన అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించినా ఇప్పటికీ గ్రామాల్లో వివక్ష కొన సాగుతూనే ఉంది. ‘రాజ్యాంగం’ మీద కనీస అవగాహన లేనివారు చట్టసభలలో అడుగుపెట్టడం శోచనీయం. ఇక వారు ఎటువంటి చట్టాలు చేస్తారో చెప్పవలసిన పనేముంది! ఒక అందమైన భవంతిని నిర్మించుకొని దానిని సక్రమంగా వాడుకోకపోతే అది త్వరలోనే శిథిల స్థితికి చేరుతుంది. ఈ సూత్రం ఏ దేశ రాజ్యాంగానికైనా వర్తిస్తుంది. ‘భారత ప్రజలమైన మేము దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్నీ, ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ, మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛలనూ, అవకాశాల్లో సమానత్వాన్ని సాధించేందుకు, వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు శాసనం (రాజ్యాంగం రూపంలో) చేసి, ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అని రాజ్యాంగ ప్రవేశికలోనే ఉంది. అంటే ఆనాడు మన లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగానే అది రూపొందించబడింది. కానీ దాని అమలులోనే పాలకులకు చిత్తశుద్ధి కొరవడింది. ఇది గర్హనీయం. డా‘‘ మహ్మద్‌ హసన్‌ వ్యాసకర్త పొలిటికల్‌ సైన్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

Padma Awards Announced By Central Government5
‘పద్మ’ అవార్డు గ్రహీతలు వీరే.. ప్రకటించిన కేంద్రం

సాక్షి,ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం (Republic Day ) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం(జనవరి25) ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్‌, 19 మందిని పద్మ భూషణ్‌, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్‌ రెడ్డిని వైద్య విభాగంలో పద్మ విభూషణ్‌ పురస్కారం దక్కింది. పద్మ విభూషణ్‌ వరించింది వీరికే దువ్వూరి నాగేశ్వర్‌ రెడ్డి (వైద్యం) - తెలంగాణ జస్టిస్‌ జగదీశ్‌ ఖేహర్‌ (రిటైర్డ్‌) (ప్రజా వ్యవహారాలు) - చండీగఢ్‌ కుముదిని రజినీకాంత్‌ లాఖియా (కళలు) - గుజరాత్‌ లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) - కర్ణాటక ఎం.టి.వి.వాసుదేవన్‌ నాయర్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - కేరళ ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) - జపాన్‌ శారదా సిన్హా (కళలు) - బిహార్‌ ‘పద్మభూషణులు’ వీరే..నందమూరి బాలకృష్ణ (కళలు) - ఏ‌పీఎ.సూర్యప్రకాశ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) కర్ణాటక అనంత్‌ నాగ్‌ (కళలు) - కర్ణాటకబిబేక్‌ దెబ్రాయ్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - ఎన్‌సీటీ ఢిల్లీ జతిన్‌ గోస్వామి (కళలు) - అస్సాం జోస్‌ చాకో పెరియప్పురం (వైద్యం) - కేరళ కైలాశ్‌ నాథ్‌ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) - ఎన్‌సీటీ ఢిల్లీ మనోహర్‌ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) - తమిళనాడుపీఆర్‌ శ్రీజేశ్‌ (క్రీడలు) - కేరళ పంకజ్‌ పటేల్‌ (వాణిజ్యం, పరిశ్రమలు) - గుజరాత్‌ పంకజ్‌ ఉదాస్‌ (మరణానంతరం) (కళలు) - మహారాష్ట్ర రామ్‌బహదుర్‌ రాయ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - ఉత్తర్‌ప్రదేశ్‌సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) - ఉత్తర్‌ప్రదేశ్‌ ఎస్‌.అజిత్‌ కుమార్‌ (కళలు) - తమిళనాడుశేఖర్‌ కపూర్‌ (కళలు) - మహారాష్ట్ర శోభన చంద్రకుమార్‌ (కళలు) - తమిళనాడు సుశీల్‌ కుమార్‌ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - బిహార్‌ వినోద్‌ ధామ్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) - అమెరికాపద్మశ్రీ అవార్డు గ్రహీతలు..అద్వైత చరణ్‌ గడనాయక్‌ (కళలు) - ఒడిషా అచ్యుత్‌ రామచంద్ర పలవ్‌ (కళలు) - మహారాష్ట్ర అజయ్‌ వి.భట్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) - అమెరికా అనిల్‌ కుమార్‌ బోరో (సాహిత్యం, విద్య) - అస్సాం అరిజిత్‌ సింగ్‌ (కళలు) - బెంగాల్‌ అరుంధతి భట్టాచార్య (ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ) - మహారాష్ట్ర అరుణోదయ్‌ సాహా (సాహిత్యం, విద్య) - త్రిపుర అర్వింద్‌ శర్మ (సాహిత్యం, విద్య) - కెనడా అశోక్‌కుమార్‌ మహాపాత్ర (వైద్యం) - ఒడిషా అశోక్ అక్ష్మణ్‌ షరఫ్‌ (కళలు) - మహారాష్ట్ర అశుతోష్‌ శర్మ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) - ఉత్తర్‌ప్రదేశ్‌ అశ్విని బిడే దేశ్‌పాండే (కళలు) - మహారాష్ట్ర బైజ్యనాథ్‌ మహారాజ్‌ (ఆధ్యాత్మికం) - రాజస్థాన్‌ బర్రే గాడ్‌ఫ్రే జాన్‌ (కళలు) - ఎన్‌సీటీ ఢిల్లీ బేగమ్‌ బతోల్ (కళలు) - రాజస్థాన్‌భరత్‌ గుప్త్‌ (కళలు) - ఎన్‌సీటీ ఢిల్లీ బేరు సింగ్‌ చౌహాన్‌ (కళలు) - మధ్యప్రదేశ్‌ భీమ్‌సింగ్‌ భవేశ్‌ (సామాజిక సేవ) - బిహార్‌ భీమవ్వ దొడ్డబాలప్ప (కళలు) - కర్ణాటక బుదేంద్ర కుమార్ జైన్‌ (వైద్యం) - మధ్యప్రదేశ్‌ సి.ఎస్‌.వైద్యనాథన్‌ (ప్రజా సంబంధాలు) - ఎన్‌సీటీ ఢిల్లీ చైత్రమ్ దియోచంద్ పవార్‌ (సామాజిక సేవ) - మహారాష్ట్ర చంద్రకాంత్‌ సేత్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - గుజరాత్‌ చంద్రకాంత్‌ సోంపుర (ఆర్కిటెక్చర్‌) - గుజరాత్ చేతన్‌ ఇ చిట్నిస్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) - ఫ్రాన్స్‌ డేవిడ్‌ ఆర్‌ సిమ్లీహ్‌ (సాహిత్యం, విద్య) - మేఘాలయ దుర్గాచరణ్‌ రణ్‌బీర్‌ (కళలు) - ఒడిశా ఫరూక్‌ అహ్మద్‌ మిర్‌ (కళలు) - జమ్ముకశ్మీర్‌ గణేశ్వర్‌ శాస్త్రి ద్రావిడ్‌ (సాహిత్యం, విద్య) - ఉత్తర్‌ప్రదేశ్‌ గీతా ఉపాధ్యాయ్‌ (సాహిత్యం, విద్య)- అస్సాం గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు)- పశ్చిమబెంగాల్‌ గురువయూర్‌ దొరాయ్‌ (కళలు) - తమిళనాడు హర్‌చందన్‌ సింగ్‌ భాఠీ (కళలు) మధ్య ప్రదేశ్ హరిమన్‌ శర్మ (వ్యవసాయం) - హిమాచల్‌ ప్రదేశ్‌ హర్‌జిందర్‌ సింగ్‌ శ్రీనగర్‌ వాలే (కళలు) - పంజాబ్‌ హర్వీందర్‌ సింగ్‌ ( క్రీడలు) -హరియాణా హస్సన్‌ రఘు ( కళలు) - కర్ణాటక హేమంత్‌ కుమార్‌ (వైద్యం) - బిహార్‌ హృదయ్‌ నారాయణ్‌ దీక్షిత్‌ ( సాహిత్యం, విద్య) - ఉత్తర్‌ ప్రదేశ్‌ హ్యూగ్‌ అండ్‌ కొల్లీన్‌ గాంట్జర్‌ (మరణానంతరం) (జర్నలిజం) - ఉత్తరాఖండ్‌ ఇనివలప్పి మని విజయన్‌ (క్రీడలు) - కేరళ జగదీశ్‌ జోషిల ( సాహిత్యం, విద్య) - మధ్య ప్రదేశ్‌ జస్పీందర్‌ నారుల (కళలు) - మహారాష్ట్ర జోనస్‌ మాసెట్టి (ఆధ్యాత్మికం) - బ్రెజిల్‌ మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) - తెలంగాణ కె.ఎల్‌.కృష్ణ (సాహిత్యం, విద్య) - ఏపీ‌ మాడుగుల నాగఫణిశర్మ (కళలు) - ఏపీ‌ మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు) - ఏపీ జోయ్‌నాంచారన్‌ బతారీ (కళలు) - అస్సాం జుమ్దే యోమ్గామ్‌ గామ్లిన్‌ (సామాజిక సేవ) - అరుణాచల్‌ ప్రదేశ్‌ కె.దామోదరన్‌ (పాకశాస్త్రం) - తమిళనాడు కె.ఓమనకుట్టి అమ్మ (కళలు) - కేరళ కిశోర్‌ కునాల్‌ (మరణానంతరం) (పౌర సేవ) - బిహార్‌ ఎల్‌.హాంగ్‌థింగ్‌ (వ్యవసాయం) - నాగాలాండ్‌ లక్ష్మీపతి రామసుబ్బఅయ్యర్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - తమిళనాడు లలిత్‌ కుమార్‌ మంగోత్ర (సాహిత్యం, విద్య) - జమ్మూకశ్మీర్‌ లాలా లోబ్‌జంగ్‌ (మరణానంతరం) (ఆధ్యాత్మికం) - లద్దాఖ్‌ లిబియా లోబో సర్దేశాయ్‌ (సామాజిక సేవ) - గోవా ఎం.డి.శ్రీనివాస్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) - తమిళనాడు మహాబీర్‌ నాయక్‌ (కళలు) - ఝార్ఖండ్‌ మమతా శంకర్‌ (కళలు) - పశ్చిమ బెంగాల్‌ మారుతి భుజంగరావు చితంపల్లి (సాహిత్యం, విద్య) - మహారాష్ట్ర నాగేంద్ర నాథ్‌ రాయ్‌ (సాహిత్యం, విద్య) - పశ్చిమ బెంగాల్‌ నారాయణ్‌ (భులయ్‌ భాయ్‌) (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - ఉత్తర్‌ప్రదేశ్‌ నరేన్‌ గురుంగ్‌ (కళలు) - సిక్కిం నీర్జా భాట్ల (వైద్యం) - ఎన్‌సీటీ ఢిల్లీ నిర్మలా దేవీ (కళలు) - బిహార్‌ నితిన్‌ నొహ్రియా (సాహిత్యం, విద్య) - అమెరికా ఓంకార్‌ సింగ్‌ పహ్వా (వాణిజ్యం, పరిశ్రమలు) - పంజాబ్‌ పి.దచనమూర్తి (కళలు) - పుదుచ్చేరి పాండీ రామ్‌ మందవీ (కళలు) - ఛత్తీస్‌గఢ్‌ పార్మర్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (కళలు) - గుజరాత్‌ పవన్‌ గొయెంక (వాణిజ్యం, పరిశ్రమలు) - పశ్చిమ బెంగాల్‌ ప్రశాంత్‌ ప్రకాశ్‌ (వాణిజ్యం, పరిశ్రమలు) - కర్ణాటక

India beat England by two wickets: Second cricket T20I6
తిలక్‌ తడాఖా

భారత్‌ ముందున్న లక్ష్యం 166. స్కోరేమో 15 ఓవర్లలో 126/7. అంటే ఈ పాటికే అర్థమై ఉంటుంది. మిగిలిందల్లా టెయిలెండర్లే అని! గెలుపు కష్టమని!! కానీ వారితో పాటు ఒకడు మిగిలాడు. అతడే తెలుగు తేజం నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ. 30 బంతుల్లో 40 పరుగులు... ఇది గెలుపు సమీకరణం. సరిజోడు లేకపోయినా, బ్యాటింగ్‌ చేయగలిగే ఆటగాడు కరువైనా... వెన్నుచూపలేదు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌కు తమ సహచరుల్లా తలొంచలేదు. ఆర్చర్‌ 16వ ఓవర్లో 0, 6, 6, 1, 4, 2లతో 19 పరుగులొచ్చాయి. ఇందులో 2 సిక్స్‌లు, 1 పరుగు తిలకే చేశాడు.ఇక 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఇది భారత్‌ను ఊరించింది. కానీ ఆదిల్‌ రషీద్‌ 17వ ఓవర్లో 1 పరుగిచ్చి అర్ష్దీప్‌ను అవుట్‌ చేయడంతో మళ్లీ టెన్షన్‌... టెన్షన్‌... అప్పుడు రవి బిష్ణోయ్‌ (5 బంతుల్లో 9 నాటౌట్‌; 2 ఫోర్లు) ఆపద్భాంధవుడిలా వచ్చాడు. అతనిది సింగిల్‌ డిజిట్‌ స్కోరే కావొచ్చు. కానీ తిలక్‌తో అమూల్యమైన, అబేధ్యమైన విజయానికి ఆ పరుగులు, ఆ భాగస్వామ్యమే (తొమ్మిదో వికెట్‌కు 20 పరుగులు) టీమిండియాను గెలిపించింది. సిరీస్‌లో 2–0తో పైచేయి సాధించేలా చేసింది. చెన్నై: ఓపెనర్ల దూకుడు లేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ జోరు కనిపించలేదు. హార్దిక్‌ పాండ్యా అనుభవం కలిసిరాలేదు. కానీ... ఇన్ని ప్రతికూలతల మధ్య భారత్‌ రెండో టి20లో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. కారణం ఒకేఒక్కడు తిలక్‌ వర్మ. అసలు ఆశలే లేని చోట... స్పెషలిస్టు బ్యాటర్లే కరువైన వేళ... పరుగుల వేటలో గెలుపుబాట పరిచాడు. 20వ ఓవర్‌ రెండో బంతికి బౌండరీతో విన్నింగ్‌షాట్‌ కొట్టేదాకా క్రీజులో కడదాకా నిలిచి భారత్‌ను గట్టెక్కించాడు. ఆఖరిదాకా విజయం కోసం పట్టుబిగించిన ఇంగ్లండ్‌ చివరకు 2 వికెట్ల తేడాతో భారత్‌ చేతిలో పరాజయం పాలైంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెపె్టన్‌ జోస్‌ బట్లర్‌ (30 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బ్రైడన్‌ కార్స్‌ (17 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. అక్షర్, వరుణ్‌ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తిలక్‌ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. మెరిపించిన బట్లర్, కార్స్‌ ఆరంభంలోనే ఓపెనింగ్‌ జోడీ సాల్ట్‌ (4)ను అర్ష్దీప్, డకెట్‌ (3)ను సుందర్‌ పెవిలియన్‌ చేర్చారు. సొంత ప్రేక్షకుల మధ్య తొలి ఓవర్‌ (ఇన్నింగ్స్‌ 4వ) వేసేందుకు దిగిన సుందర్‌ తొలి బంతికే డకెట్‌ను బోల్తాకొట్టించాడు. హ్యారీ బ్రూక్‌ (13), లివింగ్‌స్టోన్‌ (13)లను వరుణ్, అక్షర్‌ కుదురుకోనివ్వలేదు. చెప్పుకోదగిన భాగస్వామ్యం లేకపోయినా... ధాటైన ఇన్నింగ్స్‌ ఏ ఒక్కరు ఆడలేకపోయినా... ఇంగ్లండ్‌ ఆఖరుకొచ్చే సరికి పుంజుకుంది. కెపె్టన్‌ బట్లర్‌ మెరుపులతో స్కోరు మోస్తరుగా సాగిపోగా... అరంగేట్రం హీరో జేమీ స్మిత్‌ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కార్స్‌ల వేగంతో స్కోరు వేగం పెరిగింది. అర్ష్దీప్, పాండ్యా, సుందర్, అభిషేక్‌లకు తలా ఒక వికెట్‌ దక్కింది. తిలక్‌... అంతా తానై... ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లాగే మనకూ మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు అభిషేక్‌ (12)కు మార్క్‌ వుడ్, సామ్సన్‌ (5)కు ఆర్చర్‌ చెక్‌ పెట్టారు. తిలక్‌ వర్మ అడపాదడపా మెరుపులతో భారత్‌ స్కోరు 50 దాటింది. కానీ ఈ దశలో కెపె్టన్‌ సూర్యకుమార్‌ (12), ధ్రువ్‌ జురేల్‌ (4), హార్దిక్‌ పాండ్యా (7)లు స్వల్పవ్యవధిలో అదికూడా 10 ఓవర్లలోపే అవుటవడం భారత్‌ ఇన్నింగ్స్‌కు పెద్దకుదుపు... 9.1 ఓవర్లు 78/5 స్కోరు! గెలుపు చాలా దూరంలో ఉంటే మిగిలిన స్పెషలిస్టు బ్యాటర్‌ తిలక్‌ వర్మ ఒక్కడే! సుందర్, అక్షర్‌ పటేల్‌ (2) బ్యాటింగ్‌ చేయగలరు కానీ గెలిపించేదాకా నిలుస్తారా అన్న సందేహాలు భారత శిబిరాన్ని, స్టేడియంలోని ప్రేక్షకుల్ని కలవరపెట్టాయి. ఊహించినట్లే వారిద్దరు కలవరపెట్టే నిష్క్రమించారు. ఈ దశలో తిలక్‌వర్మ గెలిచేదాకా బాధ్యతను భుజానవేసుకొని విజయమాల భారత జట్టు మెడలో వేశాడు.స్కోరు వివరాలు ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) సుందర్‌ (బి) అర్ష్దీప్‌ 4; డకెట్‌ (సి) జురేల్‌ (బి) సుందర్‌ 3; బట్లర్‌ (సి) తిలక్‌ వర్మ (బి) అక్షర్‌ 45; బ్రూక్‌ (బి) వరుణ్‌ 13; లివింగ్‌స్టోన్‌ (సి) సబ్‌–హర్షిత్‌ (బి) అక్షర్‌ 13; స్మిత్‌ (సి) తిలక్‌ వర్మ (బి) అభిõÙక్‌ 22; ఓవర్టన్‌ (బి) వరుణ్‌ 5; కార్స్‌ (రనౌట్‌) 31; ఆర్చర్‌ (నాటౌట్‌) 12; రషీద్‌ (సి) సామ్సన్‌ (బి) పాండ్యా 10; మార్క్‌ వుడ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–6, 2–26, 3–59, 4–77, 5–90, 6–104, 7–136, 8–137, 9–157. బౌలింగ్‌: అర్ష్దీప్‌ 4–0–40–1, హార్దిక్‌ పాండ్యా 2–0–6–1, వాషింగ్టన్‌ సుందర్‌ 1–0–9–1, అక్షర్‌ 4–0–32–2, రవి బిష్ణోయ్‌ 4–0–27–0, వరుణ్‌ 4–0–38–2, అభిషేక్ 1–0–12–1. భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) కార్స్‌ (బి) ఆర్చర్‌ 5; అభిõÙక్‌ (ఎల్బీ) (బి) వుడ్‌ 12; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 72; సూర్యకుమార్‌ (బి) కార్స్‌ 12; జురేల్‌ (సి) సబ్‌–రేహన్‌ (బి) కార్స్‌ 4; పాండ్యా (సి) సాల్ట్‌ (బి) ఓవర్టన్‌ 7; సుందర్‌ (బి) కార్స్‌ 26; అక్షర్‌ (సి) డకెట్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 2; అర్ష్దీప్‌ (సి) ఆర్చర్‌ (బి) రషీద్‌ 6; బిష్ణోయ్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–15, 2–19, 3–58, 4–66, 5–78, 6–116, 7–126, 8–146. బౌలింగ్‌: జోఫ్రా ఆర్చర్‌ 4–0–60–1, మార్క్‌ వుడ్‌ 3–0–28–1, కార్స్‌ 4–0–29–3, ఆదిల్‌ రషీద్‌ 4–0–14–1, ఓవర్టన్‌ 2.2–0–20–1, లివింగ్‌స్టోన్‌ 2–0–14–1.

Ram Gopal Varma Gives Clarity on Syndicate Movie Cast7
సిండికేట్‌లో వెంకీమామ, బిగ్‌బీ, ఫహద్‌..? ఆర్జీవీ ఏమన్నారంటే?

ఒకప్పుడు ట్రెండ్‌ సెట్‌ చేసే సినిమాలు తీసిన రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) రానురానూ గతి తప్పాడు. చౌకబారు సినిమాలు తీసుకుంటూ పోయాడు. కానీ ఈ మధ్యే వర్మకు తను చేసిన తప్పు అర్థమైంది. సత్య సినిమా (Satya Movie) రీరిలీజ్‌ సందర్భంగా తన సినిమాను తనే మరోసారి చూసుకున్నాడు. అంత అద్భుతాన్ని తెరకెక్కించిన తాను ఆ స్థాయి సినిమాలు ఎందుకు చేయలేకపోయానని బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు.మాటిచ్చి కొత్త సినిమా ప్రకటించిన వర్మఇకమీదట సత్యలాంటి కంటెంట్‌ ఉన్న సినిమాలే చేస్తానని మాటిచ్చాడు. ఇది నిజమేనా? అని అందరూ అనుమానిస్తున్న సమయంలో ఆర్జీవీ కొత్త మూవీ ప్రకటించాడు. సిండికేట్‌ సినిమా తీయబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. 70వ దశకంలో వీధి రౌడీల గ్యాంగ్స్‌ నుంచి మొదలుకుని ఐసిస్‌ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను భారత్‌ చూసింది. కానీ గత పదిహేనేళ్లలో చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్‌ లేవు. అతి భయంకరమైన జంతువు మనిషేఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు పుట్టుకొస్తే ఎలా ఉంటుందో సిండికేట్‌లో చూపించబోతున్నా అన్నాడు. ఓన్లీ మ్యాన్‌ కెన్‌ బి ద మోస్ట్‌ టెర్రిఫైయింగ్‌ యానిమల్‌ (అత్యంత క్రూరమైన మృగం మనిషి మాత్రమే) అని ఓ ట్యాగ్‌లైన్‌ కూడా జోడించాడు. ఇలా సిండికేట్‌ను ప్రకటించాడో లేదో నెట్టింట రూమర్లు మొదలయ్యాయి. తెలుగు నుంచి వెంకటేశ్‌ దగ్గుబాటి, హిందీ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, మలయాళం నుంచి ఫహద్‌ ఫాజిల్‌ను సెలక్ట్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాలో స్టార్స్‌మనోజ్‌ బాజ్‌పాయ్‌, అనురాగ్‌ కశ్యప్‌ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై వర్మ స్పందించాడు. సిండికేట్‌ సినిమాలో భాగం కాబోయే నటీనటుల గురించి వస్తున్న ప్రచారమంతా ఫేక్‌. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని వివరాలు చెప్తాను అని ట్వీట్‌ చేశాడు. There are all kinds of speculations going around the casting of SYNDICATE film which are all completely FALSE ..Will share the details when ready— Ram Gopal Varma (@RGVzoomin) January 25, 2025 చదవండి: ప్రియుడితో ఆరెంజ్‌ హీరోయిన్‌ 'రోకా'.. పెళ్లెప్పుడంటే?

Padma Vibhushan for Suzuki Motors Ex CEO Osamu Suzuki8
ఒసాము సుజుకికి పద్మవిభూషణ్

దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమాలలో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.భారత ఆటోమొబైల్‌ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసిన జపనీస్‌ వ్యాపారవేత్త 'ఒసాము సుజుకీ' (Osamu Suzuki)కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్‌ (Padma Vibhushan) పురస్కారాన్ని ప్రకటించింది. చిన్న-కార్ల స్పెషలిస్ట్ సుజుకి మోటార్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌గా అభివృద్ధి చేసిన ఒసాము సుజుకికి మరణానంతరం ఈ అవార్డ్‌ ప్రకటించడం గమనార్హం. అసాధారణమైన, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అలాగే ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్‌ అరుంధతి భట్టాచార్యకు (Arundhati Bhattacharya) పద్మశ్రీ అవార్డ్‌ లభించింది.ఒసాము సుజుకీ గత డిసెంబర్‌లో 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. భారత్‌లో ఆటోమొబైల్‌ కంపెనీ ఏర్పాటుకు ఏ ఒక్క విదేశీ సంస్థ ముందుకురాని రోజుల్లో.. ఆర్థిక వ్యవస్థను గ్లోబలైజేషన్‌కు ద్వారాలు తెరవక ముందే, లైసెన్స్‌ రాజ్‌ కాలంలో ఒసాము సుజుకీ తీసుకున్న నిర్ణయం దేశ పారిశ్రామిక రంగంలో చిరస్థాయిలో నిలిచిపోతుంది.జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో (జాయింట్‌ వెంచర్‌) మారుతి ఉద్యోగ్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించింది ఆయనే. 2007లో కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో కంపెనీ పేరు మారుతి సుజుకీగా మారింది.ఆ తర్వాత మెజారిటీ వాటాతో సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ ఏకైక ప్రమోటర్‌గా అవతరించింది. తుదిశ్వాస విడిచే వరకు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఒసాము సేవలు అందించారు. మాలిగ్నెంట్‌ లింఫోమా (కేన్సర్‌లో ఒక రకం) కారణంగా ఈ నెల 25న ఒసాము సుజుకీ మరణించినట్టు సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ శుక్రవారం ప్రకటించింది. ‘‘ఆయన దూరదృష్టి, భవిష్యత్‌పై సానుకూల దృక్పథం, రిస్క్‌ తీసుకునే తత్వం, భారత్‌ పట్ల ప్రగాఢమైన ప్రేమ అనేవి లేకుంటే, భారత ఆటోమొబైల్‌ పరిశ్రమ నేడు ఇంత శక్తివంతంగా మారి ఉండేది కాదు’’అని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎస్‌ఐఎల్‌) చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ వ్యాఖ్యానించారు.నేడు భారత్‌లో లక్షలాది మంది మెరుగైన జీవనం వెనుక ఆయన కృషి ఉందన్నారు. ఆటోమొబైల్‌ రంగం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఒసాము అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర సర్కారు.. 2007లో పద్మభూషణ్‌ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. 1958లో సుజుకీలో చేరిక..1930 జనవరి 30న జన్మించిన ఒసాము సుజుకి, చువో యూనివర్సిటీ, ఫాకుల్టీ ఆఫ్‌ లా నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నారు. 1958లో సుజుకీ మోటార్‌ కంపెనీలోనే చేరారు. 1963లో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1967లో మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు చేపట్టారు. 1978లో ప్రెసిడెంట్‌; సీఈవోగా, 2000 జూన్‌లో సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌కు చైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. ‘‘మారుతి సుజుకీ రూపంలో ఆయన అందించిన అసాధారణ సేవలు భారత ఆటోమొబైల్‌ ముఖచిత్రాన్ని విప్లవాత్మకంగా మార్చడమే కాదు, భారత్‌–జపాన్‌ మధ్య బంధాన్ని బలోపేతం చేశాయి.

Police Investigation Progress In Hyderabad Meerpet Madhavi Case 9
మీర్‌పేట్‌ మాధవి కేసు..దర్యాప్తులో కీలక ముందడుగు

సాక్షి,హైదరాబాద్‌: సంచలనం రేపిన మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. భర్త గురుమూర్తే వెంకట మాధవిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్‌ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. క్లూస్‌ టీమ్‌ ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేశారు. గురుమూర్తిపై బీఎన్‌ఎస్‌(BNS) 101 సెక్షన్‌ పెట్టారు.క్లూస్‌ టీమ్‌ సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. వెంకటమాధవిగా భావిస్తున్న శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపారు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వీటితో మాధవి డీఎన్‌ఏ మ్యాచింగ్‌ కోసమే ఫోరెన్సిక్‌ పరీక్షలకు పోలీసులు నిర్ణయించారు. మరికొన్ని గంటల్లో పోలీసులకు డీఎన్‌ఏ నివేదిక చేరనుంది. డీఎన్‌ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్‌ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్‌ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్‌ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.కేసులో ఈ పురోగతితో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించినట్లయింది. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. డీఎన్‌ఏ పరీక్షలతో కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తున్నారు.

Drone Attack On Hospital In Sudan's Darfur10
సూడాన్‌లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 30 మంది మృతి

ఆఫ్రికాలోని సూడాన్‌లో ఘోరం జరిగింది. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్‌లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 30 మంది మృతి చెందారు. పలువురు గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అత్యవసర సేవలు అందిస్తున్న కేంద్రం ధ్వంసమైంది. 2023 ఏప్రిల్ నుంచి సూడాన్‌‌పై పట్టు కోసం సైన్యం, పారా మిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు పోరు కొనసాగిస్తున్నాయి. అయితే ఏ గ్రూప్ ఈ చర్యకు పాల్పడిందో తెలియాల్సి ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.సూడాన్‌లో పారామిలిటరీ ఫోర్స్‌, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు. 2023 ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి మొదలైన ఈ అంతర్యుద్ధంతో వేల సంఖ్యలో మృతి చెందినట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఆ సంక్షోభాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నాలు ఫలించడం లేదు. సూడాన్‌ ప్రపంచంలోనే పిల్లలో పోషకాహార లోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్‌ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: హమాస్‌ చెర నుంచి మరో నలుగురు బందీల విడుదలకాగా, పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా గత ఏడాది (2024) నిలిచింది. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు.ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్‌ పేర్కొంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం: రాష్ట్రపతి

ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం అని..

title
‘పద్మ’ అవార్డు గ్రహీతలు వీరే.. ప్రకటించిన కేంద్రం

సాక్షి,ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం (Republic Day ) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం(జనవ

title
ఢిల్లీ బీజేపీ తుది మేనిఫెస్టోలో కీలక హామీలివే..

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత మేనిఫెస్టోను &

title
భారత్‌కు ఇండోనేషియా అధ్యక్షుడు.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

ఢిల్లీ: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Prabowo Subi

title
Mahakumbh: కారులో మంటలు.. అగ్నిమాపక దళం అప్రమత్తం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది.

International View all
title
సూడాన్‌లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 30 మంది మృతి

ఆఫ్రికాలోని సూడాన్‌లో ఘోరం జరిగింది. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్‌లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది.

title
చిన్నపిల్లల చేతికి ఫోన్‌ ఇవ్వడం నిషేధం!

పిల్లల చేతిలో స్మార్ట్‌ ఫోన్‌.. ఈ కాలంలో ఇదొక యూనివర్సల్‌ సమస్య.

title
భారత్‌కు ఇండోనేషియా అధ్యక్షుడు.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

ఢిల్లీ: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Prabowo Subi

title
హమాస్‌ చెర నుంచి మరో నలుగురు బందీల విడుదల

గాజా: గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో  భాగంగా నలుగురు మహిళ

title
టిక్‌టాక్‌ యాప్ ఉన్న ఫోన్ రూ.43 కోట్లు?

భారతదేశంలో టిక్‌టాక్‌(TikTok)ను పూర్తిగా నిషేధించినప్పటికీ..

NRI View all
title
రాణాకు మూసుకుపోయిన దారులు.. ఇక భారత్‌కు అప్పగింతే!

వాషింగ్టన్‌: ముంబయి దాడుల కేసు కీలక నిందితుడైన తహవూర్‌ రాణాన

title
ట్రంప్‌ పాలసీ.. భారతీయ అమెరికన్లకు మేలు కూడా!

అగ్రరాజ్యం అధ్యక్షుడి(47)గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్‌ భ

title
Birthright citizenship : ట్రంప్‌ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్‌ఆర్‌ఐలకు భారీ ఊరట

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్‌ (

title
USA: టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది

వాషింగ్టన్‌: మన తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (TTA) అ

title
కాన్సస్‌లో దిగ్విజయంగా నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..

Advertisement
Advertisement