ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
కాఠ్మాండు: నేపాల్లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో ఇల్లు కోల్పోయి సహాయక శిబిరాల్లో తలదాచుకున్న తల్లులు, శిశువులు ఎదుర్కొంటున్న బాధలు వర్ణనాతీతం. వరదల్లో తల్లి నుంచి బిడ్డలు విడిపోవడం, తిరిగి కలిసిన తర్వాత కూడా వారికి సరైన ఆహారం, ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులై తాత్కాలిక శిబిరాల్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రత్యేక అవసరాలు అందడం లేదు. శిశువులకు ప్రత్యేక ఆహారం లేక పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే తినిపించాల్సి వస్తోంది. రద్దీగా ఉన్న శిబిరాల్లో తల్లులు బిడ్డలకు పాలు పట్టించుకోవడానికి కూడా గోప్యత లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు గర్భిణులు ఆసుపత్రులకు చేరుకోవడంలో రహదారులు దెబ్బతినడం, విద్యుత్ అంతరాయం, వైద్య సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లలు దొరికినా ఆహారం లేదు నేపాల్లో వచ్చిన వరదల్లో షర్మిలా శ్రేష్ఠ (33) అనే మహిళ ఇల్లు కొట్టుకుపోయింది. ఆమె కొన్ని రోజుల పాటు తన కుమార్తె నుంచి దూరమైంది. ఇప్పుడు తన కుమార్తెతో తిరిగి కలిసిన ఆమె.. రద్దీగా ఉన్న ఆశ్రయ కేంద్రంలో పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే తన చిన్నారికి తినిపిస్తూ నిస్సహాయంగా చూస్తోంది. 14 నెలల వయసున్న ఆమె కుమార్తె, తన వదినకు చెందిన 18 నెలల కుమారుడితో కలిసి వాయవ్య కాఠ్మాండులోని ఓ తరగతి గది నేలపై నిద్రిస్తోంది. ఆ ఇద్దరు చిన్నారులకు ప్రత్యేకమైన శిశు ఆహారం అందడం లేదు.“శిశువులకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం లేదు. ఆ చిన్నారికి కూడా పెద్దలకు ఇచ్చే గట్టి ఆహారాన్నే తినిపించాల్సి వస్తోంది” అని శ్రేష్ఠ చెప్పారు. వరదల కారణంగా తన కుమార్తె నుంచి విడిపోయిన తర్వాత ఆమెను వెతుక్కుంటూ కొండల మార్గంలో 6 గంటలు నడిచింది. వరదల కారణంగా వారిద్దరూ 2 లేదా 3 రోజుల పాటు విడిపోయారు. “నాకు కావాల్సిందల్లా సురక్షితమైన, సరైన నివాసం. అది ఉంటే కొంత మనశ్శాంతి కలుగుతుంది” అని ఆమె చెప్పింది.గర్భిణులకు ఏదైనా సమస్య వస్తే? ఆగస్టు 26న నేపాల్లో వచ్చిన ఆకస్మిక వరదలు శ్రేష్ఠ వంటి తల్లులకు మరో సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి. పెరుగుతున్న వరద నీటిలోనే కాకుండా, రద్దీగా ఉన్న ఆశ్రయ కేంద్రాల్లో, పిల్లలకు ఆహారం ఇచ్చే సమయంలో, తరగతి గదుల నేలపై, ఆసుపత్రులకు వెళ్లే ప్రమాదకరమైన మార్గాల్లో ఈ సంక్షోభం కొనసాగుతోంది. చిన్నారులు ఆకలితో ఉన్నారు. తల్లులు పిల్లలకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు ఏదైనా సమస్య వస్తే ఆసుపత్రికి చేరుకోగలమా అనే ఆందోళనలో ఉన్నారు.వందలాది మంది నిరాశ్రయులతో నిండిన ఆశ్రయ కేంద్రాల్లో పిల్లలకు పాలు పట్టించడానికి, వారిని ఓదార్చడానికి అవసరమైన ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశం కూడా లేదు. ట్రిశూలిలో తన నవజాత శిశువుకు 3 నెలలుగా పాలిస్తున్న పరివార్ అనే మహిళ ఆగస్టు 26న వరద నీరు ఉద్ధృతంగా రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది.ఇప్పుడు భోటేకోశి-ట్రిశూలి మార్గంలో ఉన్న ఓ ఆశ్రయ కేంద్రంలో ఆమె తన బిడ్డకు పాలు ఇస్తోంది. అక్కడ డజన్ల కొద్దీ అపరిచితులు ఉన్నారు. సమీపంలో పురుషులు సిగరెట్లు తాగుతున్నారు. మద్యం వాసన కూడా వస్తోంది. “అందరం ఒకే చోట ఉన్నాం. అందుకే చాలా కష్టంగా ఉంది. సిగరెట్ పొగ, మద్యం వాసన ఉన్నాయి. బిడ్డ నిద్రపోలేకపోతోంది” అని తన ఇంటిపేరుతో మాత్రమే గుర్తించాలని కోరిన పరివార్ చెప్పింది.వరదల తర్వాత ఆమెకు రొమ్ము పాలు తగ్గిపోయాయి. ఆమె పాలపొడిని ప్రయత్నించింది. అయితే అది శిశువు కడుపుకు ఇబ్బంది కలిగించినట్లు కనిపించింది. దాంతో పాలు తాగిన తర్వాత శిశువు మరింతగా ఏడుస్తోంది. “సురక్షితమైన ప్రదేశం ఉండి, ఇక్కడే బిడ్డకు టీకాలు వేయగలిగితే బాగుంటుంది. మాకు సమయానికి ఆహారం కూడా అందడం లేదు. తినడానికి సరిపడా ఆహారం లభించడం లేదు” అని పరివార్ చెప్పింది.
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీలో మరో భాగోతం బయటపడింది. వైఎస్సార్ జిల్లాలో తప్పుడు కుల ధృవీకరణతో ఉద్యోగం పొందిన రసూల్పై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రసూల్ తప్పుడు కుల దృవీకరణ పెట్టాడని బద్వేలు ఆర్డీవో చంద్ర మోహన్ తేల్చడంతో రసూల్ బండారం బయపడింది. దీనికి సంబంధించిన విచారణ నివేదికను ఆర్డీవో.. కలెక్టర్కు పంపారు.అయితే ఆ నివేదికను కూటమి ప్రభుత్వం తొక్కిపెట్టింది. అయితే ‘సాక్షి’ చేతికి ఆర్డీవో విచారణ రిపోర్ట్ చిక్కింది. నకిలీ కుల ధృవీకరణతో రసూల్ ఉద్యోగం పొందాడని స్పష్టంగా ఆ రిపోర్ట్ తెలియజేస్తున్నది. దీంతో రసూల్ను జిల్లా అధికారులు కాపాడుతున్నారని తెలియవస్తోంది. రసూల్ నకిలీ కుల ధృవీకరణతో తనకు రావాల్సిన ఉద్యోగాన్ని కొట్టేశాడని జమీల్ ఫిర్యాదు చేశారు. 2008, 2012, 2018 డీఎస్సీలలో బీసీ ఈ సరిఫికేట్ రసూల్ పెట్టాడని తేలింది. అయితే 2025 మెగా డీఎస్సీలో మాత్రం తాను ఓసీ ఈడబ్ల్యూఎస్గా రసూల్ నమోదు చేసుకున్నాడు. దీంతో జమీల్ కు రావాల్సిన ఉద్యోగం రసూల్కి దక్కింది.జమీల్ పిర్యాదుపై విచారణకు జిల్లా అధికారులు ఆదేశించారు. విచారణలో స్పష్టంగా తప్పుడు సర్టిఫికెట్ పెట్టాడని రుజువైంది. అయితే తాను ఆర్ధిక స్థితిని తెలిపేందుకే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఇచ్చానని తహసీల్దార్ తెలిపారు. ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ను అక్రమంగా మెగా డీఎస్సీ కి వాడారని ఆర్డీవో చంద్ర మోహన్ నివేదిక తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆర్డీవో చంద్ర మోహన్ ఈ నివేదిక పంపారు. డిసెంబర్ 2025లో నివేదిక సమర్పిచినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఇప్పటికీ సుండుపల్లి మండలంలో రసూల్ ఉద్యోగం చేస్తుండటంతో విద్యార్థులు,స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
సురేఖ ఎపిసోడ్.. కాంగ్రెస్లో రేవంత్ బలపరీక్ష నెగ్గినట్టేనా?
రాజకీయాలలో సరైన వ్యూహం లేకుండా పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన తీరు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ మొత్తం ఉదంతంలో ఆమె రాజకీయంగా నష్టపోయారు. అదే టైమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను కొంతవరకు దెబ్బతీశారు. విపక్షాలకు ఆమె కొన్ని ఆయుధాలు అందించారు. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు పార్టీలో పట్టు ఉందని నిరూపించడానికి శ్రమించాల్సి వచ్చింది.కొండా సురేఖతో గత కొన్ని నెలలుగా రేవంత్కు కారణం ఏమైనా విభేదాలు ఏర్పడ్డాయి. అయినా ఆమెను మంత్రిగా కొనసాగించవలసి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనను పదవి నుంచి తప్పించారని సురేఖ ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉందా, లేదా అన్నది పక్కనబెడితే దాదాపు రెండువారాల పాటు సాగిన ఈ డ్రామా వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పరపతి కొంత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే డైలాగులకు ఈ ఎపిసోడ్ ద్వారా ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ టీడీపీ వాసన వదలుకోలేకపోతున్నారన్న భావన పలువురిలో ఉంది. కాకపోతే పైకి అనడం లేదు.సురేఖ, ఆమె భర్త మురళీ ఉమ్మడి వరంగల్ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. అందువల్లే ఆయా పార్టీలు వారిని ఆదరించక తప్పలేదు. అంతవరకు ఓకే కాని కొండా దంపతులు దానిని సద్వినియోగం చేసుకోవడంలో సఫలం కాలేకపోతున్నారు. 1999లో తొలిసారి శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు వారిది ఘర్షణాత్మక రాజకీయమే. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డితో తప్ప, ఆయా పార్టీల నేతలు పలువురితో గొడవలు ఉండేవి. రెండున్నర దశాబ్దాల తర్వాత, లక్కీగా మంత్రి అయిన తర్వాత కూడా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సఖ్యత లేకపోవడం పెద్ద మైనస్గా కనిపిస్తుంది. పోనీ రాష్ట్ర స్థాయిలో ఎవరితోనైనా అవగాహనతో ఉన్నారా అంటే అదీ కనిపించదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తేడా వచ్చాక, తెలివిగా వేరే ముఖ్యమైన నేతలు, మంత్రుల మద్దతు పొందే యత్నం చేయాలి. కాని వీరు రేవంత్ సోదరులపైన, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితర నేతలు పలువురిపైన ఆరోపణలు గుప్పించారు. దాంతో ఈమెకు అండగా నిలవడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారనిపిస్తుంది. గతంలో కూడా వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్లో ఏర్పడిన పరిణామాలలో తొలుత వైఎస్సార్ కుమారుడు జగన్కు మద్దతుగా ఉన్నా, తదుపరి ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో అనవసర విమర్శలు చేశారు. రోశయ్య క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఆయనను వ్యతిరేకించారు. నిజానికి అప్పట్లో రఘువీరారెడ్డి వంటి వారు కూడా రోశయ్య క్యాబినెట్ లో చేరడానికే ఇష్టపడలేదు. కాని తదుపరి సర్దుకుపోయారు. కొండా సురేఖ మాత్రం అలా వ్యూహాత్మకంగా చేయలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా, మళ్లీ అక్కడే గొడవే అయింది. కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యే, మంత్రి అవ్వడం విశేషమే. రేవంత్తో మొదట సత్సంబంధాలు ఉన్నా, కారణం ఏమిటో కాని తేడా వచ్చింది. ఈమె భర్త కొండా మురళీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్న అసంతృప్తి ఉండవచ్చు. ఇంకేదైనా కావచ్చు. పరకాలలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి తిరిగి టిక్కెట్ ఇస్తామని రేవంత్ ప్రకటించడం వీరికి ఆగ్రహం తెప్పించింది. కొండా కుమార్తె సుస్మిత దానిపై ఒక సభలో తీవ్రమైన భాషలో ప్రసంగం చేయడం, రేవంత్పై ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది. దానికి ముందు ఒఎస్డి కేసులో మంత్రి ఇంటిని సోదా చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఈమె పరుష వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎలాగో రాజీ చేశారు. కాని ఈసారి రేవంత్ సీరియస్గా తీసుకున్నారు.నిజానికి తన కుమార్తె సీఎంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వెంటనే సురేఖ నిలువరించి ఉండాల్సింది. లేదా ఆ వెంటనే ఖండించి ఉండాల్సింది. ఎందువల్లో సురేఖ ఆ పని చేయలేదు. దాంతో వివాదం ముదిరింది. ఎంత కాదన్నా ముఖ్యమంత్రికి ఉండే పవర్ వేరు. ఆమె తన మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని, ఇతరత్రా విమర్శలు చేసినా, ప్రయోజనం ఉండదు. క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇచ్చినప్పుడు సారీ చెబితే అయిపోయేదానికి మంత్రి పదవి పోయేవరకు తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏఐసీసీకి ఇచ్చిన లేఖ బయటపెట్టినా పెద్దగా ప్రకంపన ఏమీ రాలేదు.బహుశా ఆమె భర్త మురళీ ఆమె రాజకీయ ఎదుగలకు, అలాగే పతనానికి కూడా కారణమా అన్న విశ్లేషణ వస్తుంది. దానికి తగినట్లే మురళీ ఇంత జరిగిన తర్వాత మీడియాకు కనిపించేలా మీసం మెలి తిప్పుతూ కన్పించారు. అంటే జనంలో తనకు అంత పట్టు ఉందని చెప్పదలిచి ఉండవచ్చు. కాని వర్తమాన రాజకీయాలలో ఎన్నికలు వచ్చేవరకు అధికారంలో ఉన్నవారిదే పెత్తనం అవుతుంది. ఇవన్ని వారికి అనుభవమే అయినా, ఏ ధైర్యంతో ఇలా చేశారో తెలియదు. వారి ప్లాన్ బి ఏమిటో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతామని సురేఖ ప్రకటించడం కాస్త తెలివైన చర్యగానే కనిపిస్తుంది. సమయం మించిపోయాక రక్షాబంధన్ రాఖీని రేవంత్కు కట్టినా ప్రయోజనం కలగలేదనుకోవాలి.ఇక రేవంత్ వైపు చూస్తే సురేఖ ఇష్యూ మొదలు కాగానే పదవి నుంచి తప్పించి ఉంటే ఆయన పవర్ పుల్ గా ఉన్నారన్న అభిప్రాయం కలిగేది. సురేఖపై కొంతమంది ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడంతో పార్టీలో వివాదాలు రచ్చకెక్కినట్లయింది. అధిష్టానం వద్దే పంచాయతీ జరగడం, ఆ పైన మరికొన్ని రోజులు జాప్యం జరగడంతో రేవంత్ కూడా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందేనన్న అభిప్రాయం కలుగుతుంది. అందువల్లే రేవంత్ హైకమాండ్ను బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ ఆరోపించగలిగారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. సురేఖ రాఖీ కట్టిన తర్వాత రాజీ కుదిరిందేమోనని అనుకున్నారు. కాని రేవంత్ అందుకు సిద్దపడలేదన్నమాట.బీసీ వర్గానికి చెందిన మహిళ సురేఖను పదవినుంచి తప్పించడంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే తుది నిర్ణయం జరిగి ఉంటుంది. ఈ వివాదం తొలుత రేవంత్ వ్యాఖ్యలతోనే ఆరంభమైన సంగతిని కూడా కాంగ్రెస్ క్యాడర్ గుర్తించి ఉంటారు. గతంలో పవర్ ఫుల్ ముఖ్యమంత్రులన్న పేరున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు సైతం బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేసేవారుకాదు. మరో బలమైన నేత చెన్నారెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి పదవి కోల్పోయారు. అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన ఒక మంత్రి విమర్శలు చేసిన వెంటనే పదవి నుంచి తప్పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాటికొండ రాజయ్య, ఈటెల రాజేందర్ లను బర్తరఫ్ చేశారు.కాగా తాను ఎవరికి భయపడనని, స్నేహంగా అడిగితే అన్నీ చేసి పెడతానని రేవంత్ అంటున్నారు. ఇది అచ్చంగా గతంలో కొన్నిసార్లు ఆయన గురువు చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం మాదిరే కనిపిస్తుంది. అయితే చంద్రబాబు ప్రాంతీయ పార్టీ అధినేత కాబట్టి కొంతవరకు చెల్లవచ్చు. అయినా ఆయన అన్నీ అంచనా వేసుకున్నాకే ధైర్యం చేసేవారు. కొన్నిసార్లు ఏమి జరగనట్లు రాజకీయం సాగించేవారు. కాంగ్రెస్లో అది అంత తేలికకాదు. ఎవరికి ఉండే బలం వారికి ఉంటుంది. ప్రస్తుతానికి కర్ణాటకలో మాదిరి ఒక నేత ఎవరూ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడే దశ తెలంగాణలో రాలేదు. అది ఆయనకు కలిసివచ్చే అంశం. అయితే తన కుటుంబ సభ్యులపైన, సన్నిహితులు కొందరిపైన సురేఖ చేసిన ఆరోపణల వల్ల కాంగ్రెస్కు కొంత నష్టం జరుగుతుంది. వాటిపై అసెంబ్లీలో చర్చ జరగాలని విపక్షం పట్టుపట్టవచ్చు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అదొక సమస్య అయ్యే అవకాశం ఉంది. కాగా సౌమ్యుడుగా పేరొందిన చిన్నారెడ్డి అనూహ్యంగా వివాదంలో చిక్కుకుని పదవి పోగొట్టుకోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. బీసీ నేత పదవినే తీసేశారన్న విమర్శ రాకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. ఓవరాల్గా ఈ పరిణామాలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలలో పలచన కావచ్చు. సురేఖ రాజకీయం ముళ్లబాటగా మారే అవకాశం ఉంటుంది. కాగా, రేవంత్ తన పరపతి నిలబెట్టుకున్నప్పటికీ, కొంత డామేజీని భరించక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: విజయసాయి మాట ఎందుకు మార్చారు?
రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ!
లాటరీలో జాక్పాట్ తగలాలి, ఆ మొత్తంతో బంగ్లా,కారు, నగలు ఇలా ఎన్నో రకాల విలాసాలపై ఖర్చుపెట్టాలనే ఆశతోనే సాధారణంగా లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తారు ఎవరైనా కదా..! అలా ఒక దంపతులకు అనూహ్యంగా వేలకోట్ల రూపాయల విలువ చేసే లాటరీ దక్కించుకున్నారు. మరి ఆ ధనాన్ని వారు ఎలా ఖర్చుపెట్టారో తెలుసా? ప్రస్తుతం వీరి కథ వైరల్గా మారింది.స్కై న్యూస్ ప్రకారం 2019లో ఫ్రాన్సెస్, ఆమె భర్త ప్యాడీ కాన్నోలీ పెద్ద మొత్తంలో యూరోమిలియన్స్ (EuroMillions) గెల్చుకున్నారు. ఫ్రాన్సెస్ కాన్నోలీ అనే రిటైర్డ్ టీచర్, సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ , టీచర్, పెద్దమొత్తంలో గెల్చుకున్నదీని ఏకంగా రూ. 1,470 కోట్లు. సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తే ఫ్రాన్సెస్ ఇక్కడే చాలా పెద్దమనసుతో ఆలోచించారు. తమ కుటుంబ అవసరాలు తీరిన తర్వాత, గెలుచుకున్న మొత్తం 115 మిలియన్ల పౌండ్లలో, సగానికి పైగా అంటే రూ. 632.5 కోట్లను ఛారిటీలకు, సంఘాలకు విరాళంగా అందించారు. అందించారు. దీనికోసం ఆమె 'PFC ట్రస్ట్' అనే స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేయడం విశేషంగా నిలుస్తోంది.A Northern Irish National Lottery winner who has given away half of her £115 million winnings has said it is human nature to help others.Frances Connolly has set up a charitable trust to support good causes since winning the enormous EuroMillions jackpot with husband Paddy in… pic.twitter.com/d9UQRdvJXv— The Irish News (@irish_news) September 6, 2026 అంతేకాదు ఇంత సంపద ఉన్నప్పటికీ, వీరు నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్లో నిరాడంబరంగా జీవిస్తున్నారు. విలాసాల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా సెకండ్ హ్యాండ్ వాచీలు, వాడిన కార్లనే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.ఇదీ చదవండి : నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగా గత నెలలో 80 ఏళ్ల వయసులో మరణించిన గాయని, ప్రముఖ సంగీత విద్వాంసురాలు , దాత డాలీ పార్టన్ (Dolly Parton) తన దాతృత్వానికి ఒక 'స్ఫూర్తి' అని ఫ్రాన్సెస్ అభివర్ణించారు. మిడిల్స్బ్రో వెలోడ్రోమ్లో "60 ఫర్ 60 ఛాలెంజ్"లో కూడా పాల్గొంది. "మనకు తగినంత లభించినప్పుడు ఇతరులతో పంచుకోవడం మానవ నైజం" అంటారు ఆమె. తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉన్నప్పుడు, అనవసరంగా డబ్బును తన దగ్గరే ఉంచుకోవడంలో అర్థం లేదని ఆమె పేర్కొన్నారు.ఉత్తర ఐర్లాండ్లో పెరిగిన ఫ్రాన్సెస్, 1990లో హార్ట్ల్పూల్కు మారారు. అక్కడ దాదాపు 25 ఏళ్లకు పైగా నివసిస్తూ సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రస్ట్కు నిధులు సేకరించేందుకు ఏడుగురు అథ్లెట్లు పలు ఛాలెంజ్లలో పాల్గొంటున్నారు. సామాజిక సేవలో చురుగ్గా ఉంటూ, పూర్తి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తన ట్రస్ట్ ద్వారా యువ సంరక్షకులు సరైన విరామం తీసుకోవడానికి వీలుగా విశ్రాంతి కారవాన్ను డొనేట్ చేసింది. ఇంకా ఒంటరిగా ఉండే వృద్ధుల కోసం కొన్ని ప్రాజెక్టులు, డిజిటల్ టెక్నాలజీకి నిధులు సమకూర్చింది .అత్యవసర ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. స్థానిక క్రీడా క్లబ్లలో డీఫిబ్రిలేటర్లను ఏర్పాటు చేసింది.ఈ ట్రస్ట్ తరపున గ్రేట్ నార్త్ రన్లో పాల్గొన బోతున్న పాల్ హెవిట్సన్ తదితరులు సంతోషాన్ని ప్రకటించారు ఇది తమకు ఎంతో స్ఫూర్తి నిచ్చిందన్నారు. ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలు
షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించుకున్న పాక్ కెప్టెన్
భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు చిన్నారులు సహా 11 మంది మృతి
అక్కడ శ్రేయస్ అయ్యర్.. ఇక్కడ శుబ్మన్ గిల్!
రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్ వ్యవసాయం ..! కట్చేస్తే ..
ఆర్ధిక సమస్యల్లో దిగ్గజ కంపెనీ.. ప్రమాదంలో వేలాది ఉద్యోగులు!
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమ
అసెంబ్లీలో సీతక్క కంటతడి.. చలించిపోయిన స్పీకర్
కెవిన్ పీటర్సన్కు కీలక బాధ్యతలు
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సాక్షి కార్టూన్ 07-09-2026
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
జియో రీచార్జ్ ప్లాన్: 200 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్లు!
సాక్షి కార్టూన్: 05-09-2026
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
వాటిని మర్చిపోలేక ఇప్పుడు డీఎస్సీ దెబ్బలతో రియాక్షన్ చూపిస్తున్నారా సార్!
రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇంట్లో బంగారు కడ్డీలు.. లెక్కల్లో లేని కోట్ల నగదు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు
షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించుకున్న పాక్ కెప్టెన్
భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు చిన్నారులు సహా 11 మంది మృతి
అక్కడ శ్రేయస్ అయ్యర్.. ఇక్కడ శుబ్మన్ గిల్!
రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్ వ్యవసాయం ..! కట్చేస్తే ..
ఆర్ధిక సమస్యల్లో దిగ్గజ కంపెనీ.. ప్రమాదంలో వేలాది ఉద్యోగులు!
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమ
అసెంబ్లీలో సీతక్క కంటతడి.. చలించిపోయిన స్పీకర్
కెవిన్ పీటర్సన్కు కీలక బాధ్యతలు
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సాక్షి కార్టూన్ 07-09-2026
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
జియో రీచార్జ్ ప్లాన్: 200 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్లు!
సాక్షి కార్టూన్: 05-09-2026
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
వాటిని మర్చిపోలేక ఇప్పుడు డీఎస్సీ దెబ్బలతో రియాక్షన్ చూపిస్తున్నారా సార్!
రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇంట్లో బంగారు కడ్డీలు.. లెక్కల్లో లేని కోట్ల నగదు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు
ఫొటోలు
‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)
‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సారీలో సారా.. ధురుంధర్ భామ (ఫొటోలు)
పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు
సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు
తెలుగు బిగ్బాస్ సీజన్ 10... కంటెస్టెంట్స్ వీళ్లే (ఫొటోలు)
ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)
నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్ సెలెబ్రెటీలు (ఫోటోలు)
సినిమా
నిర్మాతల సంక్షేమమే మా లక్ష్యం
లక్డీకాపూల్: చిన్న నిర్మాతల సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, త్వరలో ప్రకటిస్తామని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) అధ్యక్షుడు సి. కల్యాణ్ వెల్లడించారు. చిన్న నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో దాదాపు 95 శాతం మంది నిర్మాతలు మద్దతు ఇవ్వడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. నిర్మాతల సంక్షేమమే తమ లక్ష్యం అని, వారికి లోటు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్మాతలందరూ ఒకే తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. గత రెండున్నరేళ్లుగా అందరూ కలిసి ముందుకు రాలేకపోయారని, ఇకపై కలిసి పని చేయాలని సి. కల్యాణ్ అన్నారు. ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో మొత్తం 1,168 ఓట్లకు గాను 643 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సి. కల్యాణ్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా మోహన్ వడ్లపట్ల, కేఎల్ దామోదర్ ప్రసాద్, కోశాధికారిగా చదలవాడ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు కానుమిల్లి, టి. రామసత్యనారాయణ గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పద్మిని నాగులపల్లి, రవిశంకర్ యలమంచిలి, సునీల్ నారంగ్, మోహన్ గౌడ్, కృష్ణప్రసాద్ శివలెంక, డీవీవీ దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, డీఎస్ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు వజ్జా, జె. పుల్లారావు, బాపిరాజు బల్లిపాడు, రామకృష్ణ గౌడ్, నయీమ్ అహ్మద్ ఎస్.కె., కె. నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యారు.
మహేంద్రగిరి వారాహి పెద్ద హిట్ కాబోతోంది
‘‘చిన్నప్పట్నుంచి నేను అమ్మ, నాన్నలతో కొన్ని విషయాలను చెప్పలేకపోయేవాణ్ణి. అలాంటప్పుడు ప్రతి ఫోన్కాల్ సుమంత్ అన్నకే వెళ్లేది. ఒక్కసారి కూడా ఆయన కాదనలేదు. ఈ రోజు నేను ఆయన సినిమా ఫంక్షన్కు వచ్చి, మాట్లాడటం హ్యాపీగా ఉంది. సుమంత్గారు నాకు స్పెషల్ బ్రదర్’’ అని అక్కినేని అఖిల్ అన్నారు. సుమంత్ హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరై, బిగ్ టికెట్ను లాంచ్ చేసిన అఖిల్ మాట్లాడుతూ– ‘‘సిద్ధుగారు హీరోగా సినిమాలు చేస్తూనే, కంటెంట్ ఉన్న ఈ తరహా సినిమాలో కూడా భాగమైనందుకు అభినందిస్తున్నాను. ఈ సినిమా కోసం దర్శకుడు సంతోష్ ప్రాణం పెట్టారు. ‘మహేంద్రగిరి వారాహి’ చాలా పెద్ద హిట్ కాబోతోంది. ఈ సినిమా సక్సెస్మీట్కు నన్ను పిలవాలని అడుగుతున్నాను. ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించిన లక్ష్మణ్, మధుగార్లకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. సుమంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం దాదాపు 150 థియేటర్స్లో వారాహి విగ్రహాలను పెట్టడం జరిగింది. గతంలో ‘అమ్మోరు’ సినిమాకు ఇలా చేశారట. ఈ సినిమా విషయంలో ఎప్పట్నుంచో ఒక డివోషనల్ వైబ్ను ఫీలవుతున్నాను. ఏదో శక్తి మా వెనకాల ఉందనిపిస్తోంది. సెప్టెంబరు 11న మా కష్టార్జితాన్ని థియేటర్స్లో మీరు చూడబోతున్నారు. ఇక ‘లెనిన్’తో తన సత్తా ఏంటో అఖిల్ నిరూపించాడు’’ అని తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘నేను యాక్టర్గా స్ట్రగుల్ అయినప్పట్నుంచి నిర్మాత మధుగారు నాకు తెలుసు. మధుగారి వల్ల ఈ మూవీలో భాగమయ్యాను’’ అని అన్నారు. సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మిన సుమంత్గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలోని రాజేంద్రవర్మ పాత్ర కోసం సిద్ధుగారిని అ్రపోచ్ అయినప్పుడు, ఆయన కథ నచ్చి, చేశారు. ఈ సినిమాతో నిర్మాతలకు ఒక మంచి హిట్ ఇచ్చి, వారి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను’’ అని చెప్పారు. మధు కాలిపు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం సుమంత్గారితో రెండున్నరేళ్లుగా జర్నీ చేస్తున్నాం. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన సిద్ధుకు రుణపడి ఉంటాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ చేశాను’’ అన్నారు బ్రహ్మానందం.
బిగ్బాస్ 10: హాట్ టాపిక్గా నాగార్జున రెమ్యునరేషన్
బిగ్బాస్ షో అనగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికి గుర్తొచ్చే ఏకైన పేరు ‘కింగ్’ నాగార్జున. తెలుగులో ఇప్పటివరకు 9 సీజన్లు పూర్తవ్వగా..మొదటి రెండు తప్ప మిగిలిన సీజన్లన్నింటికీ ఆయనే హోస్ట్గా చేశాడు. తెరపై స్టైలీష్ ఎంట్రీ ఇస్తూనే తనదైన మాటతీరుతో దారితప్పుతున్న ఆటను గాడిలో పెడుతూ..బిగ్బాస్ షోని విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయితే సీజన్ 10కి కొత్త హోస్ట్ వస్తాడని ప్రచారం జరిగినప్పటికీ..మళ్లీ నాగార్జుననే బరిలోకి దింపారు నిర్వాహకులు. దీని కోసం భారీగా పారితోషికం అందించారట. ఇప్పుడు నాగార్జున రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.సీజన్ 3కి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకున్న నాగార్జున.. సీజన్ 9కి వచ్చేసరికి రూ. 35 కోట్ల వరకు తీసుకున్నాడట. తెలుగు బిగ్బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డు నాగార్జునకే దక్కింది. ఇక సీజన్ 10కి వచ్చేసరికి పారితోషికం మరింత పెరిగినట్లు సమాచారం. బిగ్బాస్ 10 కోసం నాగార్జునకి రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులోనే స్పెషల్ ప్రోమోలు, ప్రమోషనల్ షూట్స్ కూడా ఉన్నాయట. దాదాపు 15 వారాల పాటు బిగ్బాస్ షో కొనసాగుతుంది. ఫినాలతో కలిపి మొత్తం 30 రోజుల పాటు నాగార్జున షోలో కనిపిస్తాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పారితోషికం విషయం నిజమే అయితే.. ఒక్కో రోజు రూ. కోటికిపైనే తీసుకుంటున్నల్లు లెక్క. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమే. అసలు పారితోషికం ఎంత అనేది అధికారికంగా ప్రకటించలేరు.కాబట్టి ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు.
Bigg Boss 10: బిగ్బాస్లోకి నిజామాబాద్ కుర్రాడు
ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు.
క్రీడలు
250 రిటైర్డ్ హర్ట్.. చరిత్రలో మూడో బ్యాటర్గా ఇషాన్ కిషన్
సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడికి కుమార్ కుషాగ్రా (101), శికర్ మోహన్ (85), అభిమన్యు ఈశ్వరన్ (72), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45) కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఈస్ట్ జోన్ అతి భారీ స్కోర్ దిశగా సాగుతోంది.రెండో రోజు టీ విరామ సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసింది. మొహమ్మద్ ఖురేషి (6 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. టీ విరామానికి ముందు అనుకూల్ రాయ్ ఔటయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్, చామ మిలింద్ తలో 2 వికెట్లు తీయగా.. షేక్ రషీద్కు ఓ వికెట్ దక్కింది. అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో కదంతొక్కిన ఇషాన్ కిషన్ పలు అరుదైన ఘనతలు సాధించాడు. రామన్ లాంబా (320), అన్షుమన్ గైక్వాడ్ (216), చటేశ్వర్ పుజారా (256), యశస్వి జైస్వాల్ (209) తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్గా, 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో 250 పరుగుల మార్కును తాకిన మూడో బ్యాటర్గా నిలిచాడు.డబుల్ సెంచరీకి ముందే ఇషాన్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 4000 పరుగులు కూడా పూర్తి చేశాడు. 2014లో ఈ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన ఇషాన్.. ఇప్పటివరకు 10 సెంచరీలు, 19 అర్ద సెంచరీలు చేశాడు.కాగా, ప్రస్తుత మ్యాచ్లో ఇషాన్ 250 పరుగుల తర్వాత రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బంతి పొత్తి కడుపులో బలంగా తాకడం వల్ల ఇషాన్ అసౌకర్యానికి గురయ్యాడు. అప్పుడే అతడు రిటైర్డ్ హర్ట్గా వెళ్తాడని అంతా అనుకున్నారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్లో నిలబడిన ఇషాన్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా డబుల్ సెంచరీ, 250 మార్కును కూడా తాకాడు.చదవండి: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్లతో
పాక్ సెలక్టర్ పదవికి రాజీనామా.. టీమిండియాపై ప్రశంసలు!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పీసీబీ పెద్దలు విదేశీ కోచ్ల విషయంలో ఒకలా.. దేశీ కోచ్ల విషయంలో మరోలా వ్యవహరిస్తారని ఆరోపించాడు. ఆటగాళ్లు, కోచ్లు మార్పు విషయంలో పీసీబీ తొందరపాటు చర్యలు తీసుకుంటోందని మండిపడ్డాడు.పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభంఅదే సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం క్రమపద్ధతిలో ముందుకు వెళ్తూ రోజురోజుకీ తమ జట్టును మరింతగా అభివృద్ధి చేసుకుంటోందని మిస్బా ప్రశంసించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిపోగానే.. ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది యాజమాన్యం.అంతేకాదు.. టెస్టు జట్టు హెడ్కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను పదవుల నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను వైట్బాల్ కోచ్ మైక్ హసన్ చేపట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపం చెందిన మిస్బా ఉల్ హక్ పాక్ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకొన్నాడు.వారి విషయంలో మాత్రం ఉదారంగా ఉంటారుఈ క్రమంలో స్థానిక టెలివిజన్ షోలో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్లో విదేశీ కోచ్లు, దేశీ కోచ్లను వేర్వేరుగా చూస్తారు. విదేశీ కోచ్ల పట్ల యాజమాన్యం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంది. అదే దేశీ కోచ్ల విషయంలో మాత్రం ప్రతీ దానికి విమర్శలు వస్తాయి.విదేశీ కోచ్లకు అధికారాలు ఎక్కువే ఇస్తారు. కానీ జవాబుదారీతనంలో మాత్రం వారు వెనుకే ఉంటారు. అదే స్థానిక కోచ్లు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ ప్రతికూల ఫలితాలు వస్తే ఇక తిట్ల వర్షమే. నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తారు కూడా!ఇక ఒకటీ రెండు మ్యాచ్ల తర్వాత ఆటగాళ్లను తొలగించడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. దీని వల్ల ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఒత్తిడిలోనూ రాణించేలా వారికి ఊతం ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తూ మనవాళ్లకు తొందర, హడావుడి ఎక్కువ.టీమిండియాపై ప్రశంసలునిజానికి పాక్ యువ క్రికెటర్లు చాలా మంది ఎక్కువగా వైట్బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. రెడ్బాల్ క్రికెట్ ఆడేలా వారిని ప్రోత్సహించాలి. ఫోర్-డే మ్యాచ్లు మాత్రమే ఉంటే సరిపోదు. దేశీ క్రికెట్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి.90వ దశకం తర్వాత బీసీసీఐ క్రమక్రమంగా జట్టులో మార్పులు చేస్తూ వస్తోంది. లోపాలు సరిచేసుకుంటూ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటోంది. అంతేతప్ప తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదు’’ అని మిస్బా ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.చదవండి: శుబ్మన్ గిల్ మెరుపులు
భారత్తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్-ఉర్-రహ్మాన్ బౌలింగ్లో చెలరేగడంతో బార్బడోస్ ట్రైడెంట్స్ 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా కింగ్స్పై విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్తాన్ జట్టు టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ముజీబ్ ఉర్ రహ్మాన్ ఫామ్లోకి రావడం ఆ జట్టు బలాన్ని పెంచడంతో తనతో జాగ్రత్తగా ఉండాలని భారత బ్యాటర్లకు హెచ్చరికలు పంపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగుల సాధారణ స్కోరు చేసింది. కమిల్ పూరన్ (37) టాప్ స్కోరర్గా నిలవగా, రోస్టన్ చేజ్ (34) పర్వాలేదనిపించాడు. బార్బడోస్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్ 3 వికెట్లు తీయగా, డానియల్ సామ్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ ట్రడెంట్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలుపొందింది. క్వింటన్ డికాక్ (47 నాటౌట్), రివాల్డో క్లార్క్ (36 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించగా, ఓపెనర్లు జాకరీ కార్టర్ (32), బ్రాండన్ కింగ్ (22) రాణించారు. సెయింట్ లూసియా బౌలర్లలో రోస్టన్ చేజ్, జాషువా బిషప్లు చెరొక వికెట్ తీశారు. మూడు వికెట్లతో మెరిసిన ముజీబ్ ఉర్ రహ్మాన్కు "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు దక్కింది.ఇక అఫ్గానిస్తాన్, టీమిండియా మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 13న తొలి టీ20, 15న రెండో టీ20, 17న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి.Two for the price of one! ☝️ Mujeeb ur Rahman gets two in the over!🇧🇧 x 🇱🇨#CPL26 #BTvSLK #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/Mv9ufmSPgq— CPL T20 (@CPL) September 7, 2026Read: క్వార్టర్స్ చేరిన అల్కరాజ్కు ఊహించని షాక్!
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్లతో
చెపాక్ స్టేడియం వేదికగా సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ 270 బంతుల్లో తన రెండో ఫస్ట్క్లాస్ డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 26 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఫస్ట్క్లాస్ క్రికెట్లో కిషన్ అత్యధిక స్కోర్ 273గా ఉంది. రంజీ ట్రోఫీ (2016–17) మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై ఢిల్లీపై అతడు ఈ స్కోర్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.122 ఓవర్లు ముగిసే సరికి ఈస్ట్జోన్ 5 వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో కిషన్(204)తో పాటు అనుకుల్ రాయ్(30) ఉన్నాడు. సౌత్ జోన్ బౌలర్లు ప్రత్యర్ధి బ్యాటర్లను ఔట్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఈస్ట్జోన్కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించారు. అనంతరం ఫస్ట్ డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్(85) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలో ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్.. తనదైన శైలిలో మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కుమార్ కుషాగ్ర (101)తో కలిసి ఐదో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు ఆటలో కుషాగ్ర ఔటైనప్పటికి కిషన్ మాత్రం తన జోరును కొనసాగిస్తున్నాడు.చదవండి: స్మృతి మంధానపై భారత మాజీ క్రికెటర్ విమర్శలు
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
బిజినెస్
కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన పసిడి..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 61 పాయింట్లు తగ్గి 23,836 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 188 పాయింట్లు నష్టపోయి 76,336 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.18బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.12 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.78 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.29 శాతం పడిపోయింది.Today Nifty position 07-09-2026(time: 09:43 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
గిట్టుబాటు ధరలతో రైతన్నకు ఊరట..?
మరికొద్ది రోజుల్లో మండీలకు చేరనున్న ఖరీఫ్ పంటలకు కాస్త మెరుగైన ధరలు లభించేలా కనిపిస్తోంది. ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో మెజారిటీ పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో సమానంగా లేదా అంతకుమించి ధరలు పలుకుతుండటం రైతన్నలకు ఊరటనిస్తోంది. అగ్మార్క్నెట్ డేటా ప్రకారం, ఎంఎస్పీ ప్రకటించిన 14 పంటల్లో మొక్కజొన్న, జొన్న, కంది, మినుములు, సోయాబీన్ సహా తొమ్మిది పంటలు సెప్టెంబర్ 4న సగటున ఎంఎస్పీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగానే అమ్ముడైనట్టు వెల్లడైంది.అయితే, సజ్జ (బజ్రా), పెసర పంటలు మాత్రం వరుసగా 31 శాతం, 13 శాతం మేర ఎంఎస్పీతో పోలస్తే నేల చూపులు చూస్తున్నాయి. వరి విషయంలో ప్రభుత్వ సేకరణ ప్రభావం చూపుతుండగా ఉత్తరప్రదేశ్లో సగటు ధర క్వింటాల్కు రూ.1,965గా ఉంది. ఎంఎస్పీ కంటే ఇది 20.2 శాతం తక్కువ. ఎల్నినో ప్రభావంతో దిగుబడి నష్టాలు నమోదైనప్పటికీ వేరుశనగ, సోయాబీన్ వంటి పంటలు కూడా స్వల్ప నష్టంతోనే నడుస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.మెరుగ్గా ధరలు‘వరి ఉత్పత్తిలో 40 శాతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందున దానికి ఢోకా లేదు. పంట సేకరణ మొదలైతే ధరలు మరింత పుంజుకుంటాయి. నూనె దిగుమతులు ఎక్కువగా ఉన్నా సోయాబీన్ ధర గతేడాదితో పోలిస్తే మెరుగ్గానే ఉంది’ అని వ్యవసాయ శాఖ మాజీ అదనపు కార్యదర్శి ఒకరు అభిప్రాయపడ్డారు. మొక్కజొన్న ధర ప్రస్తుతం ఎక్కువగా ఉన్నా పశుగ్రాసంతో పోటీ మొదలయ్యాక కిందికి దిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.వ్యాపారుల కుమ్మక్కునాఫెడ్ మాజీ అదనపు ఎండీ ఎస్కే సింగ్ మాట్లాడుతూ, ‘సోయాబీన్ ధర ఆకస్మిక పతనం వెనుక కార్టెలైజేషన్ (వ్యాపారుల కుమ్మక్కు) కనిపిస్తోంది. ఇది ఎక్కువ కాలం కొనసాగదు’ అని అన్నారు. మొత్తంగా పెసర తప్ప మిగతా ప్రధాన పంటలన్నీ ఎంఎస్పీకి దగ్గరగానే నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం 3 శాతం, వరి విస్తీర్ణం 4 శాతం మేర తగ్గినట్టు సెప్టెంబర్ 4 నాటి అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: మీ వీధిలోనే ఉన్నారు ఫైనాన్స్ గురువులు
మూలధన ఆస్తులంటే..
మూలధన ఆస్తులు.. వాటి క్రయ విక్రయాలు.. వాటి వెనుక పన్నుభారం తెలుసుకోవాలంటే ఆషామాషీ కాదండోయ్. కొంచెం ఓపిక, శ్రద్ధ, గ్రహించగలిగే శక్తి కావాలి. పాత చట్టం .. కొత్త చట్టంగా మారినా .. ప్రాథమిక అంశాలు మారలేదు. సెక్షన్లు ప్రస్తావించకుండా సారాంశం తెలుసుకుందాం.‘ఒక మూలధన ఆస్తి అమ్మినా, బదిలీ చేసినా ఏర్పడ్డ లాభాలు (చట్టంలో ప్రాఫిట్ / గెయిన్స్ అని ఆంగ్లంలో చెప్పారు) ఆదాయంగా భావించి ‘క్యాపిటల్ గెయిన్స్’ కింద వర్గీకరించి పన్ను విధిస్తారు. ఈ వాక్యం మర్రిచెట్టు విత్తనంలాగా చిన్నగా ఉంది. కానీ ఆ విత్తనం మొక్కగా మారి, శాఖోపశాఖలుగా విస్తరించి, చెట్టుగా మారడం ఎలా జరుగుతుందో ఈ వాక్యం వెనుక వందల సెక్షన్లు, రూల్స్, వివరణలు, జడ్జిమెంట్లు ఉన్నాయి. ఏది క్యాపిటల్ ఆస్తి? ఆస్తి కానిదేమిటి? బదిలీ అంటే ఏమిటి.. ఏది బదిలీ కాదు? ఎన్నో రకాల క్యాపిటల్ ఆస్తులు ఉన్నాయి. తెలుసుకోండి. ఏది క్యాపిటల్ ఆస్తి? ఒక అసెస్సీ చేతిలో ఉన్న ఆస్తి.. వ్యాపారానికి సంబంధించినదైనా.. సొంతానికి సంబంధించినదైనాసెబీ రూల్స్ ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఉన్న సెక్యూరిటీలుసెబీ వారు పేర్కొన్న ఇన్వెస్టుమెంటు నిధుల్లో ఉన్న సెక్యూరిటీలుషెడ్యూల్ ఐఐలో ఉన్న మినహాయింపులకు అర్హత లేని యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలుఈ నాలుగూ క్యాపిటల్ ఆస్తులు. ఇలాగే ఉంటాయి, చట్టాల్లో నిర్వచనాలు. చెప్పదల్చుకున్నది చెప్పలేరు. వారు అనుకున్నది చెప్పడానికి చెప్పాలి కాబట్టి ఎన్నో మార్గాలు వెతుక్కుంటారు. నత్తనడక ముచ్చట్లు లేదా లిటిగేషన్ రాకుండా జాగ్రత్త పడటం.. లేదా ముక్కు ఎక్కడంటే తలచుట్టూ చేతిని తిప్పి చూపించినట్లుగా ఉంటుంది.ఏది క్యాపిటల్ ఆస్తి కాదు?పైన చెప్పి, అలా వదిలి పెట్టారా అంటే అలా చేయలేదు. పైవన్నీ క్యాపిటల్ ఆస్తులు. కాని వాటివీ జాబితా ఇచ్చారు. మినహాయింపులన్న మాట. వ్యాపారంలో ఉంటే స్టాక్లు, స్టోర్స్, ముడిపదార్థాలు (కానీ, సెబీ పేర్కొన్న సెక్యూరిటీలు మినహా)పర్సనల్ అసెట్స్, వ్యక్తిగత చరాస్తులు, దుస్తులు, ఇంటి ఫర్నిచర్, వంట పాత్రలు, వ్యక్తిగత వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు.వీటి అమ్మకాల మీద పన్నుండదు. కానీ అశ్వత్థామ హతః కుంజరః లాగా నగలు, బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలు, రత్నాలు, మాణిక్యాలు, కెంపులు, పురాతన వస్తువులు, చిత్ర లేఖనాలు, డ్రాయింగ్లు, శిల్పాలు, ఏవైనా కళాఖండాలు.. ఇవన్నీ పర్సనల్ అసెట్స్ కావు. ఇవి అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. వ్యవసాయ భూములుగోల్డ్ డిపాజిట్ బాండ్లు (గవర్నమెంటు నోటిఫై) ఇంతవరకు అర్థం చేసుకుందాం. కానీ, కొసమెరుపులాగా, వ్యవసాయ భూముల విషయంలో వ్యవసాయమెంత కష్టమో.. అంత కష్టపడేలా వివరణ ఇచ్చారు. లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం జనాభా సంఖ్య, మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి వైమానిక దూరం ప్రాతిపదికల మీద ఆలోచించారు.మున్సిపాలిటీలో జనాభా సంఖ్య 10,000 కన్నా తక్కువ ఉంటే, భూములన్నీ సాగు జరిగితే వ్యవసాయ భూమి.జనాభా 10,000–1,00,000 ఉంటే వైమానిక దూరం 2 కి.మీ. దాటిన తర్వాత భూమినే వ్యవసాయ భూమి అంటారు.జనాభా 1,00,000–10,00,000 ఉంటే ఈ దూరం 6 కి.మీ. 10,00,000 దాటితే 8 కి.మీ.ఇదీ చదవండి: మీ వీధిలోనే ఉన్నారు ఫైనాన్స్ గురువులుఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటే సరి. ఇవే కాకుండా ఆ భూమి సాగు చేయాలి. వ్యవసాయ శిస్తు చెల్లిస్తుండాలి. ఆదాయాన్ని ఇన్కం ట్యాక్స్ లెక్కల్లో చూపించాలి.
ఫ్యామిలీ
ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం
హిమాలయాల ఒడిలో, మేఘాలకు పైన కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం తుంగ్నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో, సముద్ర మట్టానికి 3,680 మీటర్లు (12,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, శివుడికి అంకితమైన అత్యంత ఎత్తైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది పంచ కేదారాలలో మూడవది, అంటే తృతీయ కేదార్.పౌరాణిక కథ మహాభారత కథతో ఈ ఆలయానికి విడదీయరాని సంబంధం ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ సోదరులను చంపిన పాప పరిహారం కోసం శివుడిని వెతుకుతూ హిమాలయాలకు వచ్చారట. శివుడు వారికి కనిపించకుండా ఎద్దు రూపంలో దాక్కున్నాడని, అప్పుడు ఆయన శరీర భాగాలు ఐదు చోట్ల వెలిశాయనేది పౌరాణిక విశ్వాసం. అందులో చేతులు (బాహువులు) వెలసిన ప్రదేశమే తుంగనాథ్. ఆలయ పునాదిని అర్జునుడు వేశాడని కూడా పురాణ కథనాల్లో చెబుతారు. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా భావిస్తారు.చోప్టా నుంచి మొదలయ్యే ప్రయాణంతుంగనాథ్ ఆలయం కొలువై ఉన్న ప్రదేశం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి ’మినీ స్విట్జర్లాండ్’ అని పిలిచే చో΄్టా నుండి ట్రెక్ చేయాలి. కేవలం 3 కిలోమీటర్ల దూరమే అయినా, నిటారుగా ఉండే ఈ దారిలో రోడోడెండ్రాన్ పూల అడవులు, మంచు కప్పిన హిమాలయ శిఖరాలు కనువిందు చేస్తాయి.ఆలయానికి మరో 1.5 కిలోమీటర్ల దూరంలో చంద్రశిల శిఖరం ఉంది. అక్కడి నుండి నందాదేవి, త్రిశూల్, చౌఖంబా శిఖరాలుం ఇలా 360 డిగ్రీలలో ఎటు తిరిగినా హిమాలయాల దర్శనం అనేది జీవితంలో మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది.ఎప్పుడు వెళ్లాలి?చలికాలంలో అంటే సాధారణంగా నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు కారణంగా ఆలయం మూసివేయబడుతుంది. అప్పుడు ఉత్సవమూర్తిని మక్కుమఠ్కు తరలిస్తారు. దర్శనానికి సాధారణంగా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలం అనుకూలంగా ఉంటుంది. అయితే ఆలయం తెరవడం, మూసివేయడం తేదీలు ప్రతి సంవత్సరం మారవచ్చు.తుంగనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ప్రకతి, ఆధ్యాత్మికత, సాహసం కలిసిన ఒక పవిత్ర యాత్ర. శివుడి నామస్మరణతో ఆ కొండల్లో వేసే ప్రతి అడుగు మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. చదవండి: ధృతరాష్ట్ర కౌగిలి
కులం, మతం లేని న్యాయవాది..! ఏకంగా తొమ్మిదేళ్లు..
ఏదైనా జాబ్కి అప్లై చేయాలన్న, ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయాలన్న కుల ధృవీకరణ పత్రం మస్ట్. కనీసం పెళ్లికైనా అది ఉండాల్సింది. కులం, మత ధృవీకరణ పత్రం ఉన్నట్లే..అవేమి లేకుండా నాస్తికుల్లా ఉండేవాళ్లకి కుల, మత రహిత అధికారిక ధృవీకరణ పత్రం ఉండదు. ఇంత వరకు అలాంటి పత్రాలు ఏ ప్రభుత్వ ఆఫీసులు జారీ చేయలేదు, ఉండవు కూడా. దాన్ని ఒక మహిళ కష్టపడి పోరాడి, తన గోడు వినిపించి మరి మొట్టమొదటిసారిగా కుల మత రహిత ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా పొందింది. కేవలం ఆమె ఎలా జీవించిందో దానికి అనుగుణంగా డాక్యుమెంట్ మాత్రమే కావాలని కోరి మరి సాధించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలించింది ఆమె. ఆ మహిళే తమిళనాడుకు చెందిన ఎం.ఏ స్నేహ. స్నేహకు చిన్నప్పటి నుంచి రెండే రెండు సమాధానాలు ఎదురయ్యేవి. అవేంటంటే..తన కులం, మతం గురించి. తన పేరెంట్స్ ఆ గుర్తింపు ఇవ్వలేదు. ఆమె జనన ధృవీకరణ పత్రంలో గానీ, పాఠశాల రికార్డులలో గానీ వాటి ప్రస్తావన లేనేలేదు. ఆమె చిన్నప్పటి నుంచి అలానే పెరిగింది. ఆమె ప్రస్తుతం తమిళనాడులోని తిరుపత్తూరులో న్యాయవాదిగా పనిచేస్తోంది. అయితే ప్రభుత్వపరమైన పత్రాల వ్యవహారాలు వచ్చినప్పుడూ ఆ వివరాలేమి నింపకుండా ఖాళీగా వదిలేయాల్సి వచ్చేది. కానీ అలా ఫిల్ చేయకుండా వదలడంతో అప్లికేషన్ సబ్మిట్ చేయడం కుదిరేది కాదు. అప్పుడే తను ఎలా జీవించిందో అలా అధికారికంగా ధృవీకరించే పత్రం తప్పనిరి అయ్యింది. తనకు కులంగానీ, మతం గానీ లేదు అని చెప్పేలా అధికారికి పత్రం కావాలంటూ అధికారులు చుట్టూ తిరిగింది. అలా తొమ్మిదేళ్లు పోరాడి ఫిబ్రవరి 5, 2019న, తిరుపత్తూరు తహసీల్దార్ టి.ఎస్. సత్యమూర్తి, స్నేహకు కులం మతలం లేవని పేర్కొంటూ ఒక ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. దాంతో అలాంటి గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్నేహ. ఆమె నేపథ్యం..ఆమె తల్లిదండ్రులు పివి ఆనందకృష్ణన్, మణిమొళి న్యాయవాదులు. వారి ఇంటికి కమ్యూనిస్ట్ మిత్రులు తరుచుగా వచ్చేవారు. అలా స్నేహ, ఆమె సోదరీమణులు పెరిగే క్రమంలో కమ్యూనిజం, హేతువాదం, నాస్తికత్వానికి సంబంధించిన పుస్తకాలను చదివారు. మతం, దేవుడిని గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించడం పిల్లలకు నేర్పించారు. అందువల్ల వాళ్ల స్నేహితులు మీది ఏ కులం అని ప్రశ్నించినప్పుడూ స్నేహ, ఆమె సోదరిమణులు కులం లేదు, మతం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేసేవారు. ఆఖరికి వాళ్ల పేర్లతో తమ జీవన విధానం ఏంటో చూపించేవారు. ఇక్కడ స్నేహ ఇద్దరు సోదరిమణులు పేర్లు ముంతాజ్ సూర్య, జెన్నిఫర్ కాగా, స్నేహ ఆమె భర్త తమిళ ప్రొఫెసర్ కె పార్థిబరాజ దంపతులుకు ముగ్గురు కుమార్తెలు. వాళ్ల పేర్లు విభిన్న మత సంప్రదాయాలు కలిసేలా.. ఆదిరై నస్రీన్, ఆదిల ఐరీన్, ఆరిఫా జెస్సీ అని పెట్టారు. అయితే ఆమెకు న్యాయ పరీక్షల పోటీకి, నోటరీ వంటి వాటిల్లో కుల దృవీకరణ పత్రం ఓ పెద్ద సమస్యగా మారడంతో..అందుకోసం కులంగానీ, మతం గానీ లేని పత్రం కావాలన్నా ఆలోచన మొదలైంది దాని కోసం 2010లో పొందే ప్రయత్నంలో భాగంగా పోరాటం చేసింది. అలా 2019 వరకు పోరాడి ఆ గుర్తింపుని దక్కించుకునేలా కుల మత రహిత ధృవీకరణ పత్రం పొందింది. ఇక్కడ స్నేహ తనను నాస్తికురాలిగా ప్రకటించమని ప్రభుత్వాన్ని కోరలేదు, అలాగే ప్రత్యేక ప్రయోజనాన్ని కూడా అడగలేదు. తాను గడుపుతున్న జీవితమే అధికారక రికార్డులకు సరిపోలాలని ఆమె కోరుకుంది. ఇక స్నేహ కుటుంబం తరతరాలు ఎలాంటి కుల, మత గుర్తింపు లేకుండా జీవించినట్లు తెలిపింది. ఇక ఈ సర్టిఫికెట్ ఆ వాస్తవాన్నే ధృవీకరించే ఒక చట్టపరమైన పత్రమని చెబుతోంది స్నేహ. ఇక ఆమె భర్త పార్థిబరాజు స్వయంగా మతపరమైన కుటుంబంలో పెరిగాడు, కానీ ఆ తర్వాత పెరియార్ బి. ఆర్ అంబేద్కర్ తత్వశాస్త్రలపై ఆసక్తిని పెంచుకుని నాస్తికుడిగా మారారు. మరో విచిత్రం ఏంటంటే..ఆమెకు ఈ సర్టిఫికేట్ ఒకటి వచ్చిందని బహిర్గతం కావడంతో..ఆ పత్రం ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఆమెను సంప్రదించారు. ఆ విషయమై ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయని చెబుతోంది స్నేహ. ఇక తన నిర్ణయం రిజర్వేషన్కు వ్యతిరేకం కాదని, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్కు మద్దతు ఇస్తానని అంటోంది. అలాగే ఇతర హక్కులను హరించడం కాదని కూడా నొక్కి చెప్పిందామె.(చదవండి: మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్న కిరణ్ రెడ్డి)
ధృతరాష్ట్ర కౌగిలి
ఎంతో ఆప్యాయతను, ప్రేమనూ నటిస్తూ, తియ్యగా పలకరిస్తూ లోలోపల తీవ్రహాని తలపెట్టే సందర్భాలను, ప్రమాదకర పరిస్థితులను ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులు పట్టాభిషేకం నిర్వహించుకోవడానికి ముందు తమ పెదనాన్న ధృతరాష్ట్రుని కలవడానికి వెళ్లారు. తన నూరుగురు కుమారులను పాండవులలో రెండోవాడైన భీముడు చంపాడన్న కోపాన్ని లోలోపలే ఉంచుకొని కక్షతో రగిలిపోతున్న ధృతరాష్ట్రుడు పైకి మాత్రం ప్రేమను నటిస్తూ అందరినీ కౌగిలించుకొని ప్రత్యేకంగా భీముడిని తన ఉక్కుకౌగిలిలో బంధించి చంపి వేయాలని భావిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణ పరమాత్మ ఉక్కుతో భీముని విగ్రహాన్ని తయారు చేయిస్తాడు. తనను కలవడానికి వచ్చిన పాండవులను ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకొంటాడు. అయితే ధృతరాష్ట్రుడు ప్రత్యేకంగా భీముడేడి అని అడుగుతున్న సమయంలో శ్రీ కృష్ణ పరమాత్మ భీముడి ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్రుని వద్దకు తీసుకెళ్లగా దానినే భీముడుగా భావిస్తూ ధృతరాష్ట్రుడు తన ఉక్కుకౌగిలిలో బంధించగా ఆ విగ్రహం తుక్కు తుక్కు అయిపోయింది.ధృతరాష్ట్రునికి ఎందుకంత బలం?పుట్టుకతో అంధుడైనా, వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల ధృతరాష్ట్రునికి సుమారు పదివేల ఏనుగుల బలం సిద్ధించింది. తనకున్న బలంతో తన నూరుగురు కొడుకులను చంపిన భీముడిని కౌగిలించుకుని చంపాలన్నది ధృతరాష్ట్రుని ప్రణాళిక. దీనిని గమనించిన శ్రీకృష్ణుడు ఇనుముతో తయారుచేసిన విగ్రహాన్ని ఉంచగా ఆ విగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు కౌగిలించుకొని తన బలాన్నంతా ఉపయోగించి ఇనుప విగ్రహాన్ని నుగ్గు నుగ్గు చేశాడు. దీంతో శ్రీ కృష్ణుని వల్ల భీముడికి ప్రాణాపాయం తప్పింది. అప్పటినుండి ధృతరాష్ట్ర కౌగిలి అనే నానుడి వచ్చింది.– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు
నిర్మల హృదయమే గర్భగుడి
ఒక చిన్న పల్లెటూరి చివరన, ఒక పాత పూరి గుడిసెలో రామయ్య అనే వృద్ధ మట్టి శిల్పి ఉండేవాడు. వయసు పైబడినా ఆయన చేతుల్లో ఏదో ఇంద్రజాలం ఉండేది. ఆయన చేసే మట్టి విగ్రహాలు ప్రాణం ఉన్నట్టుగా ఉండేవి. కానీ రామయ్యకు అహంకారం అంటే ఏమిటో తెలియదు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ భగవంతుడి స్వరూపం గా భావించి, ఎంతో వినయంగా నమస్కరించేవాడు. ఆ ఊరిలోనే భుజంగరావు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. దర్పం, అహంకారం ఆయనకు ఆభరణాలు. తన ఇంట్లో కొత్తగా కట్టించిన పెద్ద పూజామందిరంలో ప్రతిష్టించడానికి ఒక అద్భుతమైన వినాయకుడి విగ్రహం కావాలని రామయ్య దగ్గరకు వచ్చాడు.రామయ్య శిల్పం చెక్కుతుండగా చూసి భుజంగరావు ‘రామయ్యా! నా హోదాకు తగ్గట్టు గా ఈ విగ్రహం ఉండాలి. రంగులు, అలంకరణలు అత్యంత ఖరీదైనవిగా ఉండాలి. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ నా విగ్రహం చూసి ఊరంతా నోరెళ్లబెట్టాలి!’ అన్నాడు. రామయ్య చేతులు జోడించి, వినయంగా తలవంచి... ‘అలాగే బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అన్నాడు. మరుసటి రోజు, రామయ్య విగ్రహాన్ని తయారు చేస్తుండగా... రాజీ అనే ఎనిమిదేళ్ల పేద బాలిక అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో కేవలం ఒక రూపాయి నాణెం ఉంది. ఎంతో ఆశగా రామయ్య వైపు చూస్తూ...‘తాతా! మా అమ్మకు ఒంట్లో అస్సలు బాగోలేదు. మా ఇంట్లో పూజ చేసుకుని, అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుకోవడానికి ఒక చిన్న వినాయకుడి బొమ్మ ఇస్తావా.’ అని అడిగింది. అప్పుడే అక్కడకు వచ్చిన భుజంగరావు అది చూసి ఈసడించుకుంటూ... ‘ఏయ్ పిల్లా! పక్కకు పో. నా పెద్ద విగ్రహం పని పాడు చేయకు. అయినా ఈ నాణేనికి మట్టి కూడా రాదు’ అని గద్దించాడు. కానీ రామయ్య మనస్సు కరిగింది. ఆ అమ్మాయి అమాయకత్వంలో, నిష్కపటమైన ప్రేమలో ఆయనకు సాక్షాత్ ఆ దేవుడే కనిపించాడు. రామయ్య ఎంతో భక్తితో తను చేసిన ఒక చిన్న ముద్దుల వినాయకుడి విగ్రహాన్ని ఆ బాలిక చేతిలో పెట్టాడు. ఆ చిన్నారి కళ్లలో కనిపించిన ఆనందం రామయ్య హృదయాన్ని నింపేసింది.కొన్ని రోజులకు భుజంగరావు పురమాయించిన పెద్ద విగ్రహం తయారైంది. అది నిజంగానే ఎంతో భవ్యంగా, రంగురంగుల ఆభరణాలతో మెరిసిపోతోంది. భుజంగరావు కూలీలతో కలిసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. కానీ విచిత్రం! నలుగురు బలాఢ్యులైన మనుషులు ఆ విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించినా కనీసం అంగుళం కూడా కదపలేకపోయారు.భుజంగరావు కోపంతో ఊగిపోతూ... ‘రామయ్యా! ఏంటిది? ఇందులో ఏమైనా ఇనుము, రాళ్ళు పెట్టి చేశావా? ఎందుకు ఇంత బరువుగా ఉంది?’ అని గద్దించాడు.రామయ్య ఏమాత్రం కలత చెందకుండా, ఎంతో వినమ్రంగా చేతులు జోడించి ‘అహంకారం’, ‘హోదా’ అనే బరువులు కూడా ఇందులో చేరాయి స్వామీ! అహంకారం ఎప్పుడూ మోయలేనంత బరువుగానే ఉంటుంది. ఆ బరువును దేవుడు కూడా ఇష్టపడడు’’ అన్నాడు. ఆ మాటలు భుజంగరావు గుండెల్లో తూటాల్లా పేలాయి. అదే సమయంలో పక్కనే ఉన్న చిన్న గుడిసెలో రాజీ అనే చిన్నారి... రామయ్య ఇచ్చిన చిన్న విగ్రహాన్ని ఎంతో సులువుగా చేతుల్లో పట్టుకుని, భక్తితో పూజ చేయడం ఆయన కంట పడింది. ఆయనలోని గర్వం కరిగిపోయింది. కళ్లల్లో నీళ్లతో, ‘నన్ను క్షమించు రామయ్యా! ఈ రోజు నుంచి నా అహంకారాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను’ నమస్కరించి అన్నాడు. ఆశ్చర్యకరంగా... మరుక్షణమే ఆ విగ్రహం ఎంతో తేలిక గా మారిపోయింది. భుజంగరావుకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. దైవత్వం అనేది బాహ్య ఆడంబరాలలో, డబ్బులో లేదు. అది అంతరంగంలోని వినయం, నిష్కపటత్వం, భక్తిలోనే ఉంటుందని గ్రహించాడు.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి
అంతర్జాతీయం
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
హిమాలయాల్లో ప్రకృతి విలయం సృష్టించిన ప్రతిసారీ అక్కడి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నేపాల్-చైనా సరిహద్దులో సంభవించిన భారీ వరద కూడా అలాంటి ప్రశ్నలనే ముందుకు తెచ్చింది. ఆగస్టు 26న హిమనదం కూలిపోవడంతో వచ్చిన వరదల్లో నేపాల్లోని రసువా ప్రాంతంతోపాటు చైనా వైపున్న గ్యిరాంగ్ సరిహద్దు ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు రద్దీగా ఉండే ఈ సరిహద్దు వాణిజ్య కేంద్రం.. ఇప్పుడు బురద, శిథిలాల కుప్పగా మారింది.ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన గ్యిరాంగ్.. చైనా-నేపాల్ ప్రతిపాదిత రైల్వే మార్గంలో కీలకమైన సరిహద్దు ప్రాంతం. ఇక్కడి నుంచే రైల్వే నేపాల్లోకి ప్రవేశించి, రసువా మీదుగా కాఠ్మాండూకు చేరేలా ప్రణాళిక ఉంది. చైనా ప్రతిపాదించిన ఈ రైల్వేను బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా నుంచి నేపాల్కు నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలకు ఇది కీలకమైన మార్గంగా మారుతుందని అంచనా.అంత ఈజీనా?ఖాట్మాండు-గ్యిరాంగ్ రైల్వే ప్రాజెక్టు సాధారణ రైల్వే మార్గం కాదు. నేపాల్ పరిధిలో సుమారు 72 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మించాల్సి ఉంటుంది. కానీ పర్వత ప్రాంతం కావడంతో ఇందులో దాదాపు 98.5 శాతం మార్గం సొరంగాలు లేదంటే వంతెనల మీదుగానే నిర్మించాల్సి ఉంటుందని ప్రాథమిక అధ్యయనం తేల్చింది. అంటే.. రైల్వే పట్టాలు వేయడం కంటే ముందుగా కొండలను తొలిచి సొరంగాలు నిర్మించాలి. లోతైన లోయలపై భారీ వంతెనలు వేయాలి. ఎత్తుల్లో భారీ తేడాలను అధిగమించాలి. దీనికితోడు ఈ ప్రాంతం భూకంపాలు, కొండచరియలు, రాళ్లు విరిగిపడటం, మట్టి జారిపోవడం వంటి ప్రమాదాలకు లోనయ్యే ప్రాంతం.ప్రాజెక్టుపై 2018లో నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. భౌగోళిక పరిస్థితులు, ఇంజినీరింగ్ సవాళ్లు ఈ రైల్వేకు అతిపెద్ద అడ్డంకులని పేర్కొంది. అప్పట్లో సుమారు 2.75 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.ఏళ్లుగా సాగుతున్న అధ్యయనాలుచైనా-నేపాల్ రైల్వే ఆలోచన కొత్తదేమీ కాదు. 2016లో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2018లో బీఆర్ఐలో భాగమైంది. 2019లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 2022లో పూర్తిస్థాయి సాధ్యాసాధ్యాల అధ్యయనం మొదలైంది. మార్గం, సొరంగాలు, వంతెనలు, స్టేషన్లు, నిర్మాణ వ్యయం, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలపై చైనా సాంకేతిక బృందం పరిశీలనలు చేసింది. తుది నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా? అనేది తేలనుంది.ఇంతలోనే భారీ విపత్తుఇలాంటి సమయంలోనే ఆగస్టు 26న హిమనదం(గ్లేసియర్) కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి నీటితో కలిసి దిగువకు దూసుకొచ్చాయి. నేపాల్లోని రసువా ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. ఆ వరద చైనా వైపు గ్యిరాంగ్ వరకు చేరింది. కీలకమైన సరిహద్దు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఐదు అంతస్తుల కస్టమ్స్ భవనం కూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. తాజా లెక్కల ప్రకారం నేపాల్లో 1,300 మందికి పైగా మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారు. చైనా వైపు గ్యిరాంగ్లో 43 మంది మృతి చెందగా, 519 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఈ విధ్వంసం ఇప్పుడు రైల్వే ప్రాజెక్టుపై కొత్త ఆలోచనలకు కారణమవుతోంది. ఒక భారీ వరదతోనే రహదారులు, వంతెనలు, సరిహద్దు మౌలిక వసతులు ఇలా ధ్వంసమైతే.. ఇదే భూభాగంలో నిర్మించబోయే రైల్వే సొరంగాలు, వంతెనలు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎలా తట్టుకుంటాయి? అనేదే అసలు ప్రశ్న.రైల్వే కంటే ముందు..తాజా విపత్తు నేపథ్యంలో ప్రాజెక్టు మార్గాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. హిమనదాల కదలికలు, వరదల ప్రవాహ మార్గాలు, భూకంప ముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు వంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనాలు అవసరం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవిస్తే రైల్వేకు నష్టం జరగకుండా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, రక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మరోవైపు గ్యిరాంగ్ ప్రాంతం చైనా-నేపాల్ వాణిజ్యానికి కీలకమైన మార్గం. తాజా విపత్తుతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైల్వే నిర్మాణానికి ముందే అక్కడి మౌలిక వసతులను ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మార్చాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.బీఆర్ఐ అటకెక్కినట్లేనా?అయితే తాజా వరదలతో చైనా బీఆర్ఐ మొత్తం ఆగిపోయిందని చెప్పలేం. కానీ చైనా-నేపాల్ అనుసంధానానికి కీలకంగా భావిస్తున్న ఈ రైల్వే ప్రాజెక్టుకు మాత్రం ప్రకృతి పెద్ద పరీక్ష పెట్టింది. నిర్మాణం ఇంకా మొదలుకాకపోవడం ఒక రకంగా ప్రాజెక్టుకు అవకాశం కూడా. ఇప్పుడు ఎదురైన విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుని మార్గం, డిజైన్, భద్రతా ప్రమాణాలను మార్చుకునే అవకాశం చైనాకు ఉంది.హిమాలయాల్లో బీఆర్ఐ రైల్వేను ముందుకు తీసుకెళ్లడం అనుకున్నంత సులభం కాదని తాజా ప్రకృతి విపత్తు గట్టిగా చాటిచెబుతోంది. ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందా? మార్గంలో మార్పులు వస్తాయా? లేదంటే ప్రకృతి సవాళ్లను అధిగమించేలా భారీ ఇంజినీరింగ్ పరిష్కారాలతో చైనా ముందుకెళ్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: యుద్దం ఎఫెక్ట్.. బూతు కంటెంట్తో మరీ ఇంత దిగజారాలా?
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
మెక్సికో: మతపరమైన వేడుకల్లో బాణసంచా సామగ్రికి నిప్పంటుకుని పేలుడు సంభవించిన ఘటనలో 10 మంది మృతిచెందగా, మరో 64 మంది గాయపడ్డారు. మెక్సికోలోని తేమాస్కాల్సింగో పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.శనివారం రాత్రి తేమాస్కాల్సింగోలోని ‘నుయెస్ట్రా సెనోరా డె లా లూజ్’ చర్చి సమీపంలో ఈ పేలుడు జరిగింది. మతపరమైన వేడుకల్లో భాగంగా బాణసంచా ప్రదర్శనను వీక్షించేందుకు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చిన వీడియోల్లో శిథిలాల మధ్య ప్రాణాలతో ఉన్నవారి కోసం స్థానికులు గాలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.తేమాస్కాల్సింగో పట్టణ జనాభా సుమారు 66,000. ఇది మెక్సికో సిటీకి వాయవ్య దిశలో సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మెక్సికో రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. మెక్సికోలో మతపరమైన వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో బాణసంచా వినియోగం సాధారణం. ఇలాంటి వేడుకల సమయంలో పేలుడు ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. నాలుగేళ్ల క్రితం హిడాల్గో రాష్ట్రంలోని హ్యూహుట్లా మున్సిపాలిటీ పరిధిలోని ఓ గ్రామంలో బాణసంచా కారణంగా సంభవించిన భారీ పేలుడులో 17 మంది గాయపడ్డారు.ఇది కూడా చడవండి: కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
ఉక్రెయిన్ సంచలన నిర్ణయం.. పోర్నోగ్రఫీకి చట్టబద్ధత?
రష్యాతో యుద్ధం.. భారీగా ఖర్చులు.. ఆయుధాలు, డ్రోన్ల కోసం నిధుల కొరత.. ఇలాంటి పరిస్థితులతో ఉక్రెయిన్ సతమతమవుతోంది. దీంతో, ఉక్రెయిన్ ఓ సంచలన ఆలోచనకు తెరతీసింది. ఇప్పటివరకు నిషేధంగా ఉన్న పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేసి.. అదే రంగం నుంచి పన్నులు వసూలు చేసి యుద్ధానికి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏటా కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరడంతో పాటు.. వేలాది డ్రోన్ల కొనుగోలుకు ఆ డబ్బును ఉపయోగించే అవకాశం ఉందని ఉక్రెయిన్ ఎంపీలు చెబుతున్నారు. వాల్స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏటా సుమారు 25 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.210 కోట్లకు పైగా) పన్ను ఆదాయం సమకూరే అవకాశం ఉంది.ఉక్రెయిన్ పార్లమెంట్ ఆర్థిక కమిటీ చైర్మన్ యారోస్లావ్ జెలెజ్ నియాక్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. పోర్నోగ్రఫీ పరిశ్రమను చట్టబద్ధ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా వచ్చే పన్ను ఆదాయంతో 30వేల వరకు డ్రోన్లను కొనుగోలు చేయవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో పోర్నోగ్రఫీని తయారు చేయడం, కలిగి ఉండటం, పంపిణీ చేయడం చట్టవిరుద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, నిషేధం ఉన్నప్పటికీ అడల్ట్ కంటెంట్ పరిశ్రమ భారీగా కొనసాగుతోంది. అవినీతి పోలీసుల అండతో ఈ వ్యాపారం నడుస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.🇺🇦🔞 Ukraine Wants to Become a Global Porn Powerhouse to Fund the WarAccording to the Wall Street Journal, Ukraine is moving toward fully legalizing porn production, webcam work and prostitution as authorities look for new sources of wartime revenue.The bill has already… pic.twitter.com/pnVMzH2U1W— dana (@dana916) September 6, 2026పన్ను చెల్లింపులు ఇలా.. ఇదే సమయంలో ప్రభుత్వం అడల్ట్ కంటెంట్ క్రియేటర్ల నుంచి పన్నులు వసూలు చేయడం ప్రారంభించడంతో కొత్త సమస్య తలెత్తింది. ఆదాయాన్ని ప్రకటించిన కొందరిపై పన్ను ఎగవేతతో పాటు పోర్నోగ్రఫీ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. పన్నులు చెల్లించకపోతే పన్ను నేరాలు.. చెల్లిస్తే పోర్నోగ్రఫీ చట్టం కింద కేసులు. ఇది విషాదకరమైన పరిస్థితి అని జెలెజ్ నియాక్ వ్యాఖ్యానించారు.2023లో సుమారు 7,900 మంది ఉక్రెయిన్ పౌరులు OnlyFans ద్వారా 131 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే, ఆదాయాన్ని ప్రకటించిన కొందరు క్రియేటర్ల ఇళ్లపై పోలీసులు దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. OnlyFans క్రియేటర్ స్విత్లానా డ్వోర్నికోవా ఇంటిపై పోలీసులు దాడి చేసి 20 వేల డాలర్ల నగదు, ల్యాప్టాప్, హార్డ్డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారని ఆమె ఆరోపించింది. కేసును ముగించేందుకు లంచం ఇవ్వాలని పోలీసులు సూచించారని కూడా ఆమె పేర్కొంది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కొందరు క్రియేటర్లు ఉక్రెయిన్ను విడిచిపెట్టి ఇతర యూరప్ దేశాలకు వెళ్లినట్లు సమాచారం.కొత్త ఆదాయ మార్గం.. ఈ వ్యవహారంపై అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ వెబ్సైట్లో పిటిషన్ కూడా దాఖలు చేసింది. తాను దాదాపు 9 లక్షల డాలర్ల పన్నులు చెల్లించినప్పటికీ నేరస్తురాలిగా చూడటం సరికాదని ఆమె వాదించింది. ఈ పిటిషన్కు వారం రోజుల్లోనే 25 వేలకు పైగా సంతకాలు వచ్చినట్లు జర్నల్ తెలిపింది. దీంతో పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేసే ప్రతిపాదనపై పార్లమెంట్లో చర్చకు మార్గం సుగమమైంది. బిల్లు ఆమోదం పొందితే.. యుద్ధ సమయంలో కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టించడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న చట్టపరమైన గందరగోళానికి తెరపడే అవకాశం ఉందని ప్రతిపాదకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పుతిన్కు బిగ్ షాక్.. ఇలా జరిగిందేంటి?
ఇలాంటి పనులు ట్రంప్కు మాత్రమే సాధ్యం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే కనిపించింది. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న ఆయన.. తాజాగా ఏకంగా ఇరాన్ మ్యాప్పై తన ముఖాన్ని పెట్టారు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు.. ‘ఇరాన్ ఓ విఫల దేశం’ అంటూ సందేశం ఇచ్చారు. ఆదివారం ట్రూత్ సోషల్లో గంట వ్యవధిలో ఇరాన్కు సంబంధించిన ఏడు పోస్టులు పెట్టిన ట్రంప్.. ఆ దేశంపై అమెరికా ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో చూపించేందుకు మ్యాప్లు, గ్రాఫిక్స్ను ఉపయోగించారు. తాజా పోస్టుల్లో ఒకదానిలో ఇరాన్ మ్యాప్ కనిపించగా.. దానిపై ట్రంప్ ముఖాన్ని ఉంచారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని చెప్పేందుకు ఈ చిత్రాన్ని ఉపయోగించారు. మరో పోస్టులో ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయని పేర్కొన్నారు. ఇరాన్కు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని క్షిపణులతో పేల్చేసినట్లు ఓ పోస్ట్ చేశారు. అలాగే హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ పెరిగిందంటూ మరో గ్రాఫిక్ను పోస్ట్ చేశారు. హర్ముజ్కూ ‘ట్రంప్’ ముద్ర?ట్రంప్ ఇంతటితో ఆగలేదు. వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’ అని పేరు మార్చాలని గతంలో వ్యాఖ్యానించారు. ఆ వెంటనే వైట్హౌజ్ వర్గాలు అదే పేరుతో ఓ మ్యాప్ను రిలీజ్ చేశారు. ఇక ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలమార్గం ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఘర్షణకు ప్రధాన కేంద్రంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకా దిగ్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా చెబుతుండగా.. హర్ముజ్పై తన ప్రభావాన్ని కొనసాగిస్తామని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది. ట్రంప్తో మాములుగా ఉండదుట్రంప్కు ఇలాంటి పనులు కొత్తేం కాదు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా, అలాస్కాలోని ‘డెనాలి’ పేరును ‘మౌంట్ మెకిన్లీ’గా మార్చేందుకు ఏకంగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ వినియోగంలో ఈ పేర్లు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. ఇటీవల మరో అడుగు ముందుకేసి కెనడా లేక్ ఒంటారియోను ‘లేక్ అమెరికా’గా పేరు మార్చాలంటూ యాపిల్ మ్యాప్స్కు ట్రంప్ సూచించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. గూగుల్ ఇప్పటికే అమెరికా వినియోగదారుల కోసం ఆ పేరును చూపించడం ప్రారంభించింది. ట్రంప్ రాజకీయ అస్త్రంట్రంప్ తాజా ఇరాన్ పోస్టులను గమనిస్తే.. మ్యాప్లు కేవలం భౌగోళిక వివరాల కోసం కాకుండా రాజకీయ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే సాధనంగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ మ్యాప్పై తన ముఖం, ‘ఫెయిలింగ్ నేషన్’ అనే వ్యాఖ్య.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై చమురు ఎగుమతులు, కరెన్సీ పతనం, హర్ముజ్ సంక్షోభాన్ని కలిపి చూపించే గ్రాఫిక్స్.. ఇవన్నీ ఒకే సందేశాన్ని బలపరిచేలా ఉన్నాయి. ఇరాన్పై ఆర్థిక, సైనిక ఒత్తిడిని పెంచుతున్న సమయంలో ట్రంప్ సోషల్ మీడియా పోస్టులు కూడా అదే దూకుడును ప్రతిబింబిస్తున్నాయి. అయితే టెహ్రాన్ మాత్రం అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని చెబుతోంది. దీంతో ట్రంప్ తాజా ‘మ్యాప్ పోస్టు’ కూడా అమెరికా-ఇరాన్ ఘర్షణలో మరో రాజకీయ సందేశంగా మారింది.ఇదీ చదవండి: అంతులేని వెతుకులాట!
జాతీయం
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్, హరీష్రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్ఎస్ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్ స్టేట్మెంట్గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..రాహుల్ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్ అయ్యే ఇమేజ్, సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్కు భిన్నంగా.. మరింత క్యాజువల్ లుక్ను ఆయన తన బ్రాండ్గా మార్చుకున్నారు. అదే రాహుల్ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.ఉదయనిధికి టీషర్టే బ్రాండ్!తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది. 2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆయనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారుటీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్ చుడాసమా టీషర్టు, జీన్స్తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.టీషర్టు.. ఇంత పవర్ఫుల్లా?దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్ బ్రాండింగ్. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్మెంట్. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్’కు మరో ఉదాహరణగా నిలిచింది.ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్ సాలిడ్ వార్నింగ్
టీచర్స్డే.. ఐటెం సాంగ్!
టీచర్స్ డే వేడుకల్లో.. అదీ పెద్ద సంఖ్యలో విద్యావేత్తలు, మేధావులు హాజరైన కార్యక్రమంలో అమ్మాయిలు చేసిన ఓ డ్యాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీచర్స్ ఐకాన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటో బ్యాక్గ్రౌండ్లో ఉండగా.. దేశాన్ని ఊపేసిన ఓ ఐటెం సాంగ్కు వాళ్లు హుషారుగా ఊగిపోయారు. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట రచ్చకు కారణమైంది.డెహ్రాడూన్లోని జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెప్టెంబర్ 5న నిర్వహించిన కార్యక్రమం వీడియో ఎక్స్లో వైరల్ అయ్యింది. మొత్తం 46 మంది ఉపాధ్యాయులను సత్కరించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే ఎంచుకున్న పాటపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. డర్టీ పిక్చర్ చిత్రంలోని ‘ఊ లా లా.. ఊ లా లా.. తూ హై మేరీ ఫ్యాంటసీ’ అంటూ ఆ అమ్మాయిలు హుషారుగా స్టెప్పులేశారు. అది చూసి అక్కడే ఉన్న కొందరు కుర్రాళ్లు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే టీచర్స్ డే వేడుకలకు ఇలాంటి పాట సరిపోతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం దీనిపై వస్తున్న విమర్శలను అతిగా స్పందించడం అని కొట్టిపారేస్తున్నారు. కళాశాల కార్యక్రమాల్లో విద్యార్థులు తమకు నచ్చిన పాటలకు సరదాగా డ్యాన్స్ చేయడం సాధారణమేనని, దీనిని సంప్రదాయాలకు వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. యువత వేడుకలను చూసే దృక్పథంలో వచ్చిన మార్పుగా మరికొందరు అభివర్ణిస్తున్నారు.ఈ వీడియో వైరల్ కావడంతో టీచర్స్ డే వేడుకల్లో సంప్రదాయ విలువలకే ప్రాధాన్యమివ్వాలా? లేదంటే విద్యార్థుల ఆధునిక శైలికీ చోటివ్వాలా? అనే చర్చ మొదలైంది. ఒక చిన్న నృత్య ప్రదర్శన కాస్తా సంప్రదాయం, ఆధునికత మధ్య సోషల్ మీడియాలో వాదనకు దారితీసింది.Dr. Sarvepalli Radhakrishnan be like "Thank god, i didn't live long enough to see this"pic.twitter.com/ypB3p27XaH— Keh Ke Peheno (@coolfunnytshirt) September 7, 2026
5 నిమిషాల్లో అమ్ముడైన దీపావళి రైలు టిక్కెట్లు
దీపావళి పండుగను నవంబర్ 8వ తేదీన జరుపుకుంటారు. ఈ సందర్భంగా, నవంబర్ 5వ తేదీన తమ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం రైళ్లుకు ఆదివారం బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున బుకింగ్ కోసం రైల్వే స్టేషన్ల వద్ద భారీగా జనం గుమిగూడారు. ఉదయం 8 గంటలకు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. కన్యాకుమారి ఎక్స్ప్రెస్లోని 2వ తరగతి స్లీపర్ కంపార్ట్మెంట్ కోసం వెయిటింగ్ లిస్ట్లో 33 మంది ఉన్నారు. ఏసీ క్లాసులలో పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి.గురువాయూర్ రైలు టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. తూత్తుకుడి ఎక్స్ప్రెస్ వెయిటింగ్ లిస్ట్ కూడా క్లియర్ చేయబడింది.అనంతపురి, నెల్లై, పుదుచ్చేరి వెళ్లే రైళ్లలో కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. నెల్లై, నాగర్కోయిల్కు వెళ్లే వందే భారత్ రైళ్ల బుకింగ్లు కూడా ముగిశాయి. పర్యాటకులకు అత్యంత రద్దీగా ఉండే రోజులు దీపావళి. ఈక్రమంలో దీపావళి టిక్కెట్లను మొబైల్ ఫోన్లో కూడా అధికసంఖ్యలో బుకింగ్ చేసుకోవటం తో 5 నిమిషాల్లో హాట్ కేక్ లా అమ్ముడైపోయాయి. నవంబర్ 6వ తేదీ వెళ్లే వారు సోమవారం బుక్ చేసుకోవాలని ప్రారంభమవుతాయి, నవంబర్ 7వ తేదీకి బుకింగ్లు మరుసటి రోజు ప్రారంభమవుతాయని రైల్వేఅధికారులు వెల్లడించారు. -తమిళనాడు చదవండి: మిమ్మల్ని క్షమించేది లేదు
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండానే.. ‘మహిళలను అవమానిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొనసాగుతున్న త్రిష వివాదానికి మరింత వేడి పెంచాయి. ఉదయనిధి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలు తాజా వివాదాన్ని ఉద్దేశించేలా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్..‘భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నామో మనం ఆలోచించాలి. మన ప్రజలను, మహిళలను కించపరిచేలా మాట్లాడకూడదు. మన ఇళ్లలో మహిళలు తల్లులు, సోదరీమణులుగా ఉన్నారు. మహిళలను అవమానిస్తే చట్టం చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.రాజకీయ విమర్శ వేరు.. అయితే విజయ్ మాత్రం రాజకీయ విమర్శలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. మహిళలను అవమానించే వ్యాఖ్యలకు ఆ స్వేచ్ఛను అడ్డుపెట్టుకోలేమని స్పష్టం చేశారు. గతంలో అసెంబ్లీలో మాజీ సీఎం జయలలిత ఎదుర్కొన్న అవమానాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపైనా విజయ్ మాట్లాడారు. పోలీసులు కేవలం నేరస్తులను అరెస్టు చేయడానికే పరిమితం కాకూడదని, నేరాలు జరగకుండా ముందే అడ్డుకోవడమే అసలు లక్ష్యమని చెప్పారు. చట్టాన్ని పాటించే వారికి పోలీసులు స్నేహితులుగా.. ఉల్లంఘించే వారికి శత్రువులుగా ఉండాలని పేర్కొన్నారు.TN Assembly: “If anyone talks in a derogatory manner about women, stern action is assured.”- TN CM Vijay, recalls 'humiliation' of former CM Jayalalithaa in the Assembly pic.twitter.com/c7Y6bD1kCo— News Arena India (@NewsArenaIndia) September 7, 2026పోలీసులకు హెచ్చరికలు.. తమ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై నేరాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని విజయ్ తెలిపారు. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. నేరాలను ముందుగానే నిరోధించేందుకు పోలీసులు పనిచేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సైబర్ నేరాలపై కూడా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై కూడా విజయ్ కఠిన వైఖరి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ.. తమ ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు. పోలీసులపై ఆరోపణలు వచ్చినా వారిని కాపాడే ప్రసక్తి లేదని, లాకప్లో జరిగే నేరాలపై పారదర్శక దర్యాప్తు చేపడతామని తెలిపారు.దీంతో త్రిష వివాదం నేపథ్యంలో విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. పేర్లు ప్రస్తావించకుండా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఆగస్టు 3న తంజావూరులో జరిగిన కావేరీ నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్న సమయంలో కొందరు త్రిష పేరును నినాదించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు కావేరీ సమస్యకు మాత్రమే సంబంధించినవని ఉదయనిధి వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఆగస్టు 4న పోలీసులు ఉదయనిధిని అరెస్టు చేసి తంజావూరుకు తీసుకెళ్లారు. అనంతరం అదే రోజు స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. తనపై కేసు నమోదు చేయడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా ఆయన అభివర్ణించారు.
ఎన్ఆర్ఐ
జోహన్నెస్బర్గ్లో వైఎస్సార్ వర్ధంతి.. ప్రత్యేక సేవా కార్యక్రమం
జోహన్నెస్బర్గ్: మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్బర్గ్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్రెడ్డి పెట్లూరు ఆధ్వర్యంలో ఈడెన్వేల్లోని ‘ది లిటిల్ ఈడెన్’లో కార్యక్రమం జరిగింది. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి సంక్షేమం, సహాయార్థం నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో పలువురు పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించారు. సేవా భావం, మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించి, స్వయంగా పాల్గొని విజయవంతం చేసిన నరసింహరెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్రెడ్డి ఏనుముల, హరీష్ గోరంట్ల, శ్రావణి పెట్లూరు, కరుణా బసిరెడ్డి, సుమన్ చిట్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.వైఎస్ రాజశేఖరరెడ్డి సేవా స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడంతో పాటు ఆయన ఆశయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు తెలిపారు.
NRI: తెలుగు భాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలి..
డాలస్, టెక్సస్: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమంలో భాగంగా 95వ అంతర్జాల సమావేశం ‘తెలుగే మన వెలుగు’ అనే అంశంపై నిర్వహించారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలో సలహా కమిటీ ఏర్పాటు చేసి భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. తెలుగు భాషకు విశేష సేవలందించిన ప్రముఖుల జ్ఞాపకాలను భావితరాలకు అందించేందుకు విగ్రహాలు, స్మారక చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఆంగ్ల భాష ప్రాధాన్యతను గుర్తిస్తూనే మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ పరిపాలనలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని, ఆంగ్లంలో వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే తెలుగులోకి అనువదించాలని సూచించారు. కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరిగితే పిల్లలకు భాషపై మంచి పట్టు ఏర్పడుతుందని అన్నారు.ఆచార్య శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ.. ఇతర భాషల పదాలను సులభంగా తనలో కలుపుకునే ప్రత్యేకత తెలుగు భాషకు ఉందన్నారు. తెలుగు భాష వైభవాన్ని అనేక మంది ప్రముఖులు ప్రశంసించారని, భాషను విస్తరించడంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి ప్రతి సంవత్సరం తెలుగు భాషా, కళారత్న పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు. గిడుగు రామమూర్తి మునిమనుమరాలు గిడుగు లక్ష్మీకాంతికృష్ణ మాట్లాడుతూ తన ముత్తాత ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గ్రాంథిక భాష స్థానంలో వ్యవహారిక భాషకు ప్రాధాన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు.ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్కుమార్ మాట్లాడుతూ.. తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చినప్పటికీ కేంద్రం నుంచి తగిన నిధులు సాధించడంలో మరింత కృషి అవసరమన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలకు తెలుగు నేర్పేందుకు ఆధునిక పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. కేవలం మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థులకు భాష ఎంతవరకు అర్థమవుతోందో చూడాలని అన్నారు.సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల మాట్లాడుతూ.. కాలానుగుణంగా తెలుగు భాషలో మార్పులు వస్తున్నాయని, అందరూ కలిసి భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం చేసేందుకు సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.ఇవి కూడా చదవండి: అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
దుబాయ్లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా దుబాయ్లోని బిన్ సనత్ లేబర్ క్యాంప్, సోనాపూర్లో అన్నదాన సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా, ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజా రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, కోటేశ్వర రెడ్డి, నరేష్ చౌదరి, జనార్దన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రమణ రెడ్డి , ఇషాల్ , వెంకట్ రెడ్డి, షరీఫ్, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రియతమ మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా..ఆయన చేసిన సేవలు, అమలు చేసిన కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు. అంతేగాదు వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా.(చదవండి: మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్)
అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది.వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా తదితర రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. Run4Telugu పోటీలను రెండు విభాగాలలో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనబడి ధృవపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాలలో పాల్గొన్న వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేగాదు “తెలుగు నేర్చుకుందాం… తెలుగు మాట్లాడుదాం… తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం” అనే మనబడి సందేశాన్ని అమెరికా వ్యాప్తంగా ధ్వనింపచేసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. (చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)
క్రైమ్
‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’
సూర్యాపేట జిల్లా: వివాహితను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తుండగా.. అతడిపై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన చింతారెడ్డి భాస్కర్రెడ్డి ఏడాది కాలంగా మేళ్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన బేత మౌనిక వెంటపడుతూ ‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎన్నిసార్లు మందలించినా అతడి పద్ధతిలో మార్పు రాలేదు. దీంతో ఈ నెల 4న మౌనిక తన తల్లిగారి ఊరైన బక్కమంతులగూడేనికి వచ్చింది. ఆదివారం ఉదయం తన తల్లిగారింటి ముందు ఆమె వాకిలి ఊడుస్తుండగా భాస్కర్రెడ్డి ఒక్కసారిగా మౌనిక వద్దకు వచ్చి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లడంతో ఆమె కేకలు వేసింది. దీంతో భాస్కర్రెడ్డి కొడవలితో ఆమె కుడిచేతిపై కొట్టి.. ‘నా కోరిక తీర్చు, లేకపోతే నిన్ను చంపేస్తాను, నీ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతాను’అంటూ బెదిరించాడు. భాస్కర్రెడ్డి ఇంటిపై దాడి.. అనంతరం బేత మౌనికతోపాటు బేత రామాంజిరెడ్డి, బోగాల పద్మ, కుందూరు సంధ్య, బోగాల మధుసూదన్రెడ్డి కలిసి భాస్కర్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి కర్రలు, రాడ్లతో అతడిపై దాడిచేసి తల పగులగొట్టారు. దీంతో భాస్కర్రెడ్డిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భాస్కర్రెడ్డి భార్య శివనాగిని మెడలోని నాలుగున్నర తులాల బంగారు గొలుసు కూడా పోయింది. ఇదంతా భాస్కర్రెడ్డి ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. భాస్కర్రెడ్డి తనను లైంగికంగా వేధించడంతోపాటు అతడి భార్య శివనాగిని, కొడుకు మంజూనాథరెడ్డి కూడా అసభ్య పదజాలంతో తనను తిట్టి బెదిరించారని మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత పంచాయితీలు మనసులో పెట్టుకొని తమ ఇంటిపై దాడి చేసి తన భర్త తల పగులగొట్టారని భాస్కర్రెడ్డి భార్య శివనాగిని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. చదవండి: పబ్లో అర్ధరాత్రి ఘర్షణ
పబ్లో అర్ధరాత్రి ఘర్షణ
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒక స్టార్ హోటల్ పబ్లో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒక వర్గంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ సోదరుడు సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్లోని ఎనిమిదో అంతస్థులో ‘కారా కారా’ పేరుతో పబ్ ఉంది. శనివారం రాత్రి దాదాపు 2.10 గంటల ప్రాంతంలో పబ్లో దాదాపు 200 మందికిపైగా ఉన్నారు. అదే సమయంలో పబ్లో గోడకు, టేబుల్కు మధ్యలో ఉన్న అనిల్ కుమార్యాదవ్ సోదరుడు అరవింద్ యాదవ్ (టిల్లు)ను దాటుకొని వెళ్లడానికి మరో యువకుడు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న అరవింద్ యాదవ్ స్నేహితులు యువకుడిపై దాడికి దిగారు. ఇది గమనించిన యువకుడి స్నేహితులు సైతం ఒక్కసారిగా రెచ్చిపోయి అరవింద్తోపాటు అతని స్నేహితులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పబ్లో రణరంగం చోటచేసుకొంది. బీరు సీసాలతో చేతులు, కాళ్లతో దాడికి దిగబడటంతో చుట్టు ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉద్రిక్త వాతవారణం చోటుచేసుకొంది. ఈ గొడవలో ఒక యువతి కింద పడిపోయింది. అదే సమయంలో పబ్లోని బౌన్సర్లు వచ్చి ఇరువర్గాలను అడ్డుకొని అక్కడి నుంచి కిందకు పంపారు. వీరంతా హోటల్ సెల్లార్లోకి చేరుకుని అక్కడా ఘర్షణకు దిగారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల్లో కొందరికి గాయాలయ్యాయి. ఈ దాడుల్లో దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. హోటల్ నిర్వాహకులతోపాటు అక్కడే ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఇరువర్గాలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్లో అద్దాలు పగిలి ఉండటంతోపాటు, బల్లలు, కురీ్చలు దెబ్బతిని ఉండటాన్ని గుర్తించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీల్లో అరవింద్ యాదవ్ టోపీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు పబ్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని విచారిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సమయానికి మించి పబ్ను నడపడంతో మరో కేసు సైతం సుమోటోగా నమోదు చేశారు.
బుల్తో ఫైట్
గత ఏడాది నవంబరులో జరిగిన ‘వారణాసి’ ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్ని గుర్తు చేసుకుంటే... ఆ వేడుకలో మహేశ్బాబు ఒక మెకానికల్ బుల్పై కూర్చుని వేదిక మీదకు వచ్చిన విషయం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... బుల్తో ఫైట్ చేయడానికి మహేశ్బాబు సిద్ధం అవుతున్నారట. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్లో మహేశ్బాబు పాత్రకు సంబంధించిన ఎలివేషన్ షాట్లో బుల్ విజువల్ కూడా కనిపించింది. ఇప్పుడు ఈ ఫైట్ చిత్రీకరణ కోసమే హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ని రూపొందించారని సమాచారం. ఈ ఫైట్ షూట్కి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నారట చిత్రదర్శకుడు రాజమౌళి. ఈ వారంలో ఈ ఫైట్ చిత్రీకరణను ఆరంభించనున్నారని తెలిసింది. ‘వారణాసి’ సినిమాకి హైలైట్స్గా నిలిచేవాటిలో ఈ ఫైట్ది ప్రముఖ స్థానం అని టాక్. ఇక పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్బాబు. ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మట్టి మాఫియాకు యువకుడు బలి
ఏర్పేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద బైక్పై వెళుతున్న ఓ యువకుడిని మట్టి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. శ్రీకాళహస్తి టూటౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తొట్టంబేడు మండలం గుండేలుగుంటకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుబ్బరత్నమ్మ కుమారుడు చంద్రశేఖర్ (25) ఆదివారం బైక్పై శ్రీకాళహస్తికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. పట్టణ సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద ఎదురుగా మట్టి లోడుతో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చంద్రశేఖర్ శ్రీకాళహస్తి ఆలయంలో స్వచ్ఛంద సేవకుడిగా చిన్నపాటి ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉండగా, ట్రాక్టర్కు కనీసం నంబరు ప్లేట్ కూడా లేకపోవడం విశేషం. ప్రమాద విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతుని కుటుంబీకులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అక్కడున్న వారిని ఆరా తీశారు. మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని తీరుతో శ్రీకాళహస్తిలోని ప్రతి గ్రామంలోనూ మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతోందన్నారు. నంబరు ప్లేట్లు లేకుండా ట్రాక్టర్లు నడుపుతుంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిందిపోయి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కాగా.. శ్రీకాళహస్తి మండలం నారాయణపురానికి చెందిన ఉపాధ్యాయుడు కావలి మురళి జూలై 1వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి బైక్పై వస్తుండగా బైపాస్రోడ్డులోని అండర్పాస్ వంతెన వద్ద మట్టి లోడుతో వెళుతున్న ఇదే ట్రాక్టర్ ట్రక్ ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
వీడియోలు
కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్
బైకర్కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్
లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్
సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు
ఎయిర్పోర్టులో నందూస్ కపుల్ను పట్టుకున్న పోలీసులు!
గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?
ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా
కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?
చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు
నేను స్పీకర్ను ఏం అనలేదు తాతా మధు రియాక్షన్

