బీజేపీ ప్రభంజనం.. ఎన్నికల్లో భారీ విజయం
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. గుజరాత్లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా మరియు పంచాయతీలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల మేరకు అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సాధించింది.గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. పోలింగ్ జరిగిన 15 మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగింటిలో విజయం సాధించి మెజారిటీని నిలబెట్టుకుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లు అయిన మెహసానా, మోర్బి, నడియాడ్, వాపిలలో బీజేపీ విజయాలు సాధించగా, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 15 కార్పొరేషన్లలోని 1,044 సీట్లలో ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 718 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, 88 సీట్లతో ముందుకు సాగుతోంది. మిగతా పార్టీలు ప్రభావం చూపించలేకపోయాయి.అలాగే, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. గుజరాత్లోని 84 మున్సిపాలిటీలలో మొత్తం 2624 స్థానాలు ఉండగా.. అధికార బీజేపీ 575 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. మరో 11 స్థానాల్లో ఇతర పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి.Gujarat Election Update-BJP wins Vapi, Navsari, Porbandar, Ahmedabad, Rajkot and Surendranagar Municipal Corporations.It is also leading in remaining Municipal Corporations.— News Arena India (@NewsArenaIndia) April 28, 2026 అహ్మదాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ సాధించిన 11 స్థానాల్లో ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఖాతాను తెరవలేకపోయింది.సూరత్లో బీజేపీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.వడోదరలో బీజేపీ 76 స్థానాల ఆధిక్యాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ ఐదు స్థానాలో ఆధిక్యంలో ఉంది.రాజ్కోట్లో బీజేపీ 20 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.మోర్బి మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఘన విజయం దిశగా ముందుకెళ్తోంది. ఇక్కడ బీజేపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఇంకా ఖాతాను తెరవలేకపోయింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 52 స్థానాలు ఉన్నాయి.👉ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 26, 27 తేదీలలో 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలలో పోలింగ్ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 66% ఓటింగ్ నమోదు అయ్యింది.Gujarat Local Body Election Result 2026 #Congratulations All @BJP4Gujarat 🪷🎉🌷BJP : Winning in 90% + seatsAll Others (MM Congress, SP, AIMIM, AAP, ABC, XYZ +++) : < 10% seats#GujaratVotesBJP#gujarattrustsbjp *Municipality ( Total Seats 1044 )BJP :- 43*Congress :-… pic.twitter.com/Ph6G8Ie43r— Bharat Sanghvi Jain (@rajamaka) April 28, 2026
ఏపీలో ఇంధన సంక్షోభం.. కూటమి సర్కార్ను తప్పుబట్టిన కేంద్రం
సాక్షి,అమరావతి: ఏపీలో పెట్రోల్ సంక్షోభానికి కూటమి ప్రభుత్వం మరింత ఆజ్యం పోసింది. నాలుగు రోజుల క్రితం ఆయిల్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్ను రిటైల్ బంకుల నుంచి సరఫరా చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. మొత్తం 2 కోట్ల 75 లక్షల 66 వేల లీటర్ల డీజిల్ను సరఫరా చేయాలని నిర్ణయించింది.దీంతో కూటమి సర్కార్ చర్యలతో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై ఏపీ సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను కేంద్ర పెట్రోలియం శాఖ తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం లేఖ రాసింది. ఇది పెట్రోలియం నియమాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది.
‘దేశంలో ఎక్కడా లేని కొరత ఏపీలోనే ఎందుకు?’
ఢిల్లీ: ఢిల్లీ: ఏపీలో పెట్రోల్,డీజిల్ సంక్షోభానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ను వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి కలిశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెట్రో కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని నీరజ్ మిట్టల్ దృష్టికి తీసుకెళ్లారు అవినాష్రెడ్డి. ఏపీలోని పరిస్థితులను చక్కదిద్ది అవసరమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారుఅనంతరం అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ పెట్రోల్, డిజిల్ కొరత దేశంలో ఎక్కడా కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఏపీలో ఎందుకు కొరత ఏర్పడింది?, డిమాండ్కు, సప్లైకి మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయి. 70 శాతం పెట్రోల్ బంకులు కొరత వల్ల పనిచేయడం లేదు. పెట్రోలు 200 రూపాయలకు మించి బైక్లకు పోయడం లేదు. పొరుగు రాష్ట్రంలో ఇలాంటి కొరత ఎక్కడా లేదు. వ్యవసాయ రంగం ఆక్వాకల్చర్ ట్రాన్స్పోర్ట్ తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రజల రోజువారి పనుల పైన తీవ్రమైన అంతరాయం కలిగిస్తుంది. ప్రజల కష్టాలు తీర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం హోర్డర్స్ తో కుమ్మక్కయింది. పలు ఆయిల్ కంపెనీలు కూడా సప్లైని తగ్గించాయి. కమర్షియల్ ఎల్పీజీ రేట్లు పెంచినా, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. ఏపీలోని పరిస్థితులను చక్కదిద్ది అవసరమైన పెట్రోల్ డీజిల్ ఎల్పీజీని అందుబాటులోకి తేవాలి. హోర్డింగు, బ్లాక్ మార్కెటింగ్, ఉద్దేశపూర్వక తగ్గింపు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు.
బండిపై 6 గురు బుడ్డోళ్లు, పేరెంట్స్ను అరెస్ట్ చేయాలి!
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఒక రద్దీ రోడ్డుపై ఆరుగురు చిన్న పిల్లలు ఒకే స్కూటర్పై ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. రోడ్డు భద్రతా నియమాలను దారుణంగా ఉల్లంఘించడమే కాకుండా, మైనర్లు డ్రైవింగ్ చేస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది?శ్రేయాస్ అనే ఎక్స్ యూజర్ ఆఫీసుకి వెళ్తుండగా ఈ దృశ్యాన్ని చూసి, ఫోటోలు తీసి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బెంగళూరు నగర పోలీసులను, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీని ప్రకారం సుమారు 10 నుండి 12 ఏళ్ల లోపు వయసున్న ఆరుగురు మైనర్లు (ఆడ, మగ) పిల్లలు ఒకే స్కూటర్పై కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. రైడర్తో పాటు అందరూ మైనర్లు కావడంతో తీవ్ర ఆందోళన రేపింది. రద్దీగా ఉండే బహిరంగ రహదారిలో ఒక చిన్న బాలుడే స్కూటర్ను నడుపుతున్నాడు. పైగా వీరిలో ఎవరికీ హెల్మెట్లు లేవు. దరిదాపుల్లో పెద్దలెవరూలేరు. ఈ ఘటన ఏప్రిల్ 26 గోరిపాళ్య సమీపంలోని పాదరాయణపుర మెయిన్ రోడ్డుపై జరిగింది. మరోవైపు ఈ ఫిర్యాదుకు స్పందిస్తూ, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఆ పోస్ట్ను గుర్తించి, తదుపరి చర్యల కోసం మగడి రోడ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించి, వాహన యజమానిపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదీ చదవండి: అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్పై కత్తితో దాడి, షాకింగ్ రీజన్?నెటిజన్ల ఆగ్రహంస్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ (KA05JZ9065) స్పష్టంగా కనిపిస్తుండటంతో, నెటిజన్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు వీళ్లకి వాహనం ఇచ్చినందుకు తల్లిదండ్రులను కనీసం వారం రోజుల పాటు జైల్లో పెట్టాలి. వారి నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు తెస్తోందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. "వేసవి సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. ఇంత నిర్లక్ష్యమా?" పెద్దోళ్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. వీళ్లకి కేవలం జరిమానా వేస్తే సరిపోదని మరి కొందరు వ్యాఖ్యానించారు. నోట్ : మైనర్లు వాహనాలు నడపటం వల్ల ఇప్పటికే అనేక ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై మరోసారి హెచ్చరిస్తోంది. చట్టప్రకారం, మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితేవాహన యజమాని లేదా తల్లిదండ్రులకు భారీ జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ వాహనం రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుంది. సదరు మైనర్కు 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత ఉండదు.This is haappend on today 26/04/2026 morning 10:45 am those kid's illegally ridding scooter No. ( KA05JZ9065 ) on location ( Padarayanapura main road near gowripalya on opposite of total engineer auto gas ) new Bridge. please take necessary. @BlrCityPolice @blrcitytraffic pic.twitter.com/S4rrOE8vbD— Shreyas Shreyu (@Shreyas35240282) April 26, 2026
‘బోష్’ మహిళా ఉద్యోగిని అనుమానాస్పద మరణం
భోజనం తర్వాత పుచ్చకాయ తినకూడదా..?
టీ20 ప్రపంచకప్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. సంచలన ఎంపిక
‘ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం’
ధోని వల్లేనా?.. నోర్ముయ్.. ముందు నీ సంగతి చూసుకో!
'నాకు టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా.. లేదంటే'.. అషురెడ్డి ఆడియో వైరల్
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఏపీలో ఇంధన సంక్షోభం.. కూటమి సర్కార్ను తప్పుబట్టిన కేంద్రం
'ఆ 80 హిప్పోలను చంపకండి': అనంత్ అంబానీ లేఖ
మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్
విష్ణుప్రియతో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది
సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు
పవర్ఫుల్ గుడి.. దర్శనం తర్వాత నా లైఫ్ మారిపోయింది: శృతి హాసన్
నేటి నుంచి ఉప్పల్ చౌరస్తా బంద్
డ్రగ్ మాఫియాకు భారీ షాక్.. ముగిసిన ‘డాన్’ శకం?
షాక్ తగిలిన వెంటనే గుడ్న్యూస్.. నువ్వు కేక భజ్జీ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
'నా భర్తకు పదిమందితో ఎఫైర్స్'.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కామెంట్స్
సడన్ ట్విస్ట్.. ఇరాన్లో యుద్ధం సీను మారింది?
బిర్యానీ, పుచ్చకాయ తినే ఆ కుటుంబం చనిపోయిందా?
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
అలా భయపడకూ.. సీఎం కోసం ట్రాఫిక్ జామ్ అయితే ఎండలో మాడి మసయ్యానంతే!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ఉద్యోగయోగం
వ్యూహం మార్చిన ట్రంప్.. IRGCకి తొలి దెబ్బ!
‘వైభవ్పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’
విద్యార్థినిపై టీచర్ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
లోకేశ్ కనిపించడం లేదు
నువ్వేం మనిషివయ్యా సుధీర్.. ‘ఫ్రీ’ కోసం పిల్లలు కంటావా?: మల్లారెడ్డి
‘బోష్’ మహిళా ఉద్యోగిని అనుమానాస్పద మరణం
భోజనం తర్వాత పుచ్చకాయ తినకూడదా..?
టీ20 ప్రపంచకప్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. సంచలన ఎంపిక
‘ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం’
ధోని వల్లేనా?.. నోర్ముయ్.. ముందు నీ సంగతి చూసుకో!
'నాకు టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా.. లేదంటే'.. అషురెడ్డి ఆడియో వైరల్
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఏపీలో ఇంధన సంక్షోభం.. కూటమి సర్కార్ను తప్పుబట్టిన కేంద్రం
'ఆ 80 హిప్పోలను చంపకండి': అనంత్ అంబానీ లేఖ
మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్
విష్ణుప్రియతో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది
సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు
పవర్ఫుల్ గుడి.. దర్శనం తర్వాత నా లైఫ్ మారిపోయింది: శృతి హాసన్
నేటి నుంచి ఉప్పల్ చౌరస్తా బంద్
డ్రగ్ మాఫియాకు భారీ షాక్.. ముగిసిన ‘డాన్’ శకం?
షాక్ తగిలిన వెంటనే గుడ్న్యూస్.. నువ్వు కేక భజ్జీ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
'నా భర్తకు పదిమందితో ఎఫైర్స్'.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కామెంట్స్
సడన్ ట్విస్ట్.. ఇరాన్లో యుద్ధం సీను మారింది?
బిర్యానీ, పుచ్చకాయ తినే ఆ కుటుంబం చనిపోయిందా?
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
అలా భయపడకూ.. సీఎం కోసం ట్రాఫిక్ జామ్ అయితే ఎండలో మాడి మసయ్యానంతే!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ఉద్యోగయోగం
వ్యూహం మార్చిన ట్రంప్.. IRGCకి తొలి దెబ్బ!
‘వైభవ్పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’
విద్యార్థినిపై టీచర్ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
లోకేశ్ కనిపించడం లేదు
నువ్వేం మనిషివయ్యా సుధీర్.. ‘ఫ్రీ’ కోసం పిల్లలు కంటావా?: మల్లారెడ్డి
ఫొటోలు
ఏప్రిల్ గడిచిందిలా.. హీరోయిన్ రీతూవర్మ (ఫొటోలు)
సమంత బర్త్ డే .. స్పెషల్ ఫోటోలు వైరల్
పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు.. బారులు తీరిన వాహనాలు (ఫొటోలు)
‘వదలా’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
రెడ్ శారీలో ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్ (ఫొటోలు)
మెరిసిపోతున్న మానస చౌదరి (ఫొటోలు)
ఏపీకి కూటమి శాపం.. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఇక్కడేందుకు? (ఫొటోలు)
‘ఏక్ దిన్’ మూవీ మ్యూజికల్ ఈవెంట్లో సాయి పల్లవి (ఫొటోలు)
హైదరాబాద్ : ఆకట్టుకున్న ‘సాక్షి’ హ్యాపీ కిడ్స్ ఈవెనింగ్ (ఫొటోలు)
హనీ ఈజ్ ది బెస్ట్.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్ (ఫోటోలు)
సినిమా
గుడ్న్యూస్ తర్వాత తొలిసారి కనిపించిన దీపికా పదుకొణె (వీడియో)
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ దంపతులు ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించారు. అయితే, రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించిన తర్వాత తొలిసారిగా వారు కెమెరా ముందుకు రావడంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించినప్పటికీ ముందుగా ఒప్పుకున్న సినిమాల కోసం ఆమె పనిచేస్తూనే ఉన్నారు.అల్లు అర్జున్- అట్లీ మూవీ రాకాలో దీపికా నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సీన్స్ షూటింగ్ జరుగుతుంది. ఆపై షారుఖ్ ఖాన్ కింగ్ మూవీలోనే భాగమైన దీపికా.. ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్స్లో నటించేందుకు రెడీ అయిపోయిందట. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కోసం షారుక్తో పాటు దీపిక కూడా సెట్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ దంపతులకు 2024లో దువా పదుకొణె సింగ్ అనే కుమార్తె జన్మించగా.. ఇప్పుడు రోండో బిడ్డ వారి జీవితంలోకి రానుంది. గర్భవతిగా ఉన్నప్పటికీ దీపికా సినిమా షూటింగులలో బిజీగా ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. Late-night airport spotting alert! #RanveerSingh and #DeepikaPadukone keep it stylish, comfy, and oh-so-iconic 💼✨#MissMalini pic.twitter.com/uaWuuB1hz1— MissMalini (@MissMalini) April 28, 2026
పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలకు ఒకేరోజు లీకుల షాక్
టాలీవుడ్ అభిమానులు రెండు భారీ బడ్జెట్ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్' ఈ రెండు చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వీడియో క్లిప్ప్ లీక్ అయ్యాయి. దీంతో మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. జూన్ 25న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నామని బుచ్చిబాబు అన్నారు. హైదరాబాద్లో వేసిన ఒక సెట్స్లో పెద్ది ఐటెమ్ సాంగ్ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్, శ్రుతి హాసన్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ షూటింగ్ ప్రదేశం నుంచి లీక్ అయ్యాయి. పెద్ది ఐటెమ్ సాంగ్పై భారీ క్రేజ్ ఉంది. ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్లో...’ అంటూ మహేష్ బాబుతో స్టెప్పులు వేసిన శ్రుతి హాసన్.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి ఐటెమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్లో క్రేజ్ను పెంచారు.నాని 'ది ప్యారడైజ్' నుంచి కూడా ఒక ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఇలా రెండు భారీ సినిమాల నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో అభిమానులలో ఉత్సాహం పెరిగినప్పటికీ, చిత్రనిర్మాతలలో ఆందోళన నెలకొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' ఆగష్టు 21, 2026న రానుంది.
మహిమాన్వితమైన గుడికి విజయ్.. వీడియో వైరల్
తిరుచెందూర్ మురుగన్ (సుబ్రమణ్య స్వామి ఆలయం)ను నటుడు, టీవీకే అధినేత విజయ్ దర్శించుకున్నారు. కొద్దిరోజులుగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయ్ 4న విడుదల కానున్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తిరుచెందూర్ మురుగన్ను విజయ్ దర్శించుకున్నారు. స్వామి ఆయుధం "వేల్" (శక్త్యాయుధము) చేత అందుకున్న విజయ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతారు. అందుకే స్వామి ఆశీస్సుల కోసం విజయ్ వచ్చినట్లు తెలుస్తోంది.తమిళనాడులో ఉన్న మురుగన్ ఆరు నివాసాలలో ఇది రెండవది. తమిళనాడులో అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ఆలయం ఉంది. సుబ్రహ్మణేశ్వర స్వామికి చెందిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపైనే ఉన్నాయి. కానీ, తిరుచెందూర్ మాత్రం సముద్ర తీరంలో కొలువై ఉంటుంది. ఇక్కడి సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని భక్తులు చెబుతారు. తిరుచెందూర్ మురుగన్కు అభిషేకం చేసిన విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే, గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవని నమ్ముతారు. తమిళనాడు నలుమూలల నుంచి తిరుచెందూర్కు చేరుకోవచ్చు. తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మధురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిరంతరం రైలు, బస్సు రవాణా సౌకర్యం ఉంది. #TVKVijay at Tiruchendur Murugan Temple for Vishwaroopa Darshan ❤️🔥💥pic.twitter.com/204nfbypKs— Troll Cinema ( TC ) (@Troll_Cinema) April 28, 2026
హీరోగా యాత్ర.. కుమారుడి ఎంట్రీపై ధనుష్ రియాక్షన్
తమిళ నటుడు ధనుష్ మల్టీ టాలెంటెడ్. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. కథా రచయిత, గీత రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాతగా మెప్పించిన విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజులుగా ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కథనాలు వచ్చాయి. తనను ధనుష్నే లాంచ్ చేయబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఇదే అంశం గురించి ధనుష్ను ప్రశ్నించగా ఆయన స్పందించారు.ధనుష్ కొత్త సినిమా కర.. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. కుమారుడు యాత్ర సినిమాల్లోకి ఎప్పుడొస్తారనే ప్రశ్నపై ఆయన ఇలా స్పందించారు. 'నేను 16ఏళ్లకే సినిమా పరిశ్రమలోకి వచ్చాను. అందుకు కారణం మా కుటుంబ పరిస్థితులే.. ప్రస్తుతం యాత్ర వయసు 19ఏళ్లు. కానీ, వాడు నాకు చిన్నపిల్లోడిలానే కనిపిస్తాడు. రాబోయే రోజుల్లో వాడు ఏమవుతాడనేది నేను చెప్పలేను. సినిమా పరిశ్రమలోకి వస్తాడా అనేది కూడా చెప్పలేను. సమయం ఇంకా ఉంది. వాడు (యాత్ర) తన కెరీర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో దానిని అమలు చేస్తాను.' అని ధనుష్ అన్నారు.
క్రీడలు
‘తుదిజట్టులో దండుగ.. అదృష్టం కోసమే అతడిని ఆడిస్తున్నారు’
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి అదరగొట్టింది. ఐపీఎల్-2026లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. ఆతిథ్య జట్టును 75 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ.. వికెట్ నష్టపోయి కేవలం 39 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.భువీ, హాజిల్వుడ్ విశ్వరూపంతద్వారా ఈ సీజన్లో ఆర్సీబీ ఎనిమిదింట ఆరో విజయం నమోదు చేసింది. ఢిల్లీతో మ్యాచ్లో ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భువీ మూడు ఓవర్లలో కేవలం ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చగా.. హాజిల్వుడ్ 3.3 ఓవర్లలో 12 రన్స్ ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.రొమారియో షెఫర్డ్ మాత్రంమిగిలిన వారిలో రసిఖ్ సలామ్ ధర్, సూయశ్ శర్మ, కృనాల్ పాండ్యా (Krunal Pandya) తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఓవైపు వీళ్లంతా అదరగొడితే.. ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ మాత్రం రెండు ఓవర్లలోనే 21 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.జట్టుకు భారంగాగతేడాది ఆర్సీబీ చాంపియన్గా నిలవడంలో రొమారియో షెఫర్డ్ తన వంతు పాత్ర పోషించాడు. బ్యాట్, బంతితో రాణించి జట్టు తొలిసారి ట్రోఫీ గెలిచేందుకు సాయపడ్డాడు. కానీ ఈ సీజన్లో మాత్రం షెఫర్డ్ తేలిపోతున్నాడు. ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్ ఆడి కేవలం 39 పరుగులు చేసిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్.. కేవలం మూడు వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ రొమారియో షెఫర్డ్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అతడు దండుగ అని.. కేవలం అదృష్టంగా భావించి మాత్రమే తుదిజట్టులో చోటు ఇస్తున్నారని చిక్కా అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో చోటు దండుగఈ మేరకు.. ‘‘ఆర్సీబీ బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉంది. అయితే, అందరిలోకెళ్లా రొమారియో షెఫర్డ్ ఒక్కడే వీక్ లింక్. అసలు ఆర్సీబీ అతడిని తుదిజట్టులో ఎందుకు ఆడిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు.బహుశా అతడిని లక్కీ చార్మ్గా భావిస్తున్నట్లున్నారు. గతేడాది.. తొలిసారిగా ట్రోఫీ గెలిచినపుడు అతడు జట్టులోనే ఉన్నాడు కదా!.. కాబట్టి కేవలం అదృష్టం కోసం మాత్రమే అతడిని ఆడిస్తున్నారు. లేదంటే.. ప్లేయింగ్ ఎలెవన్లో అతడికి చోటే దండుగ’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. కాగా వెస్టిండీస్ స్టార్ రొమారియో షెఫర్డ్ను ఆర్సీబీ రూ. 1.5 కోట్లకు రిటైన్ చేసుకుంది.చదవండి: PSL: డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు!
‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2026 సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైవిధ్యమైన ఆటతో శ్రేయస్ తన ముద్ర ఎప్పుడో వేశాడు. టీమిండియా తరఫున వన్డేల్లో నిలకడగా మారుపేరుగా నిలిచిన శ్రేయస్ టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం అదే టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు అతనొక కెప్టెన్ మాత్రమే కాదు.. బ్యాటర్గా, ఫినిషర్గానూ సత్తా చాటుతూ అన్ని పాత్రలను సమర్థంగా పోషిస్తున్నాడు. అయితే ఈ మార్పు వెనుక తనను చికాకు పెట్టేలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తన మైండ్లో ఉన్నట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఆ వ్యాఖ్యలతో తనను రెచ్చగొట్టారని, జనాలు అనుకుంటున్నది తప్పు అని నిరూపించాలని నిర్ణయించుకున్నట్లు అయ్యర్ తెలిపాడు. జియో హాట్స్టార్ నిర్వహించిన బిలీవ్ కార్యక్రమానికి హాజరైన అయ్యర్ మాట్లాడాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ ను అద్భుతమైన సిక్సర్గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.అయ్యర్ మాట్లాడుతూ.. ‘నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్గా దానిని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నా’ అని తెలిపాడు.ఇక వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా తనపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలపై కూడా అయ్యర్ స్పందించాడు. ‘గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు అన్న మాటలు బాగా వినిపించాయి. అయితే గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో నాకు స్పష్టత ఉంది. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించాను. గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్సెట్ పూర్తిగా మారింది. నా జోన్లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఆడుతున్నా. దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్లోకి రావడం (రిథమ్ను) నేర్చుకున్నాను. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలలో కనిపించే ఆ రిథమ్ను నేను కూడా అలవర్చుకున్నాను’ అని అయ్యర్ తన నిలకడైన ఆటతీరు వెనుక ఉన్న రహస్యాలను వివరించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్ల్లో నెగ్గి 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పంజాబ్ కింగ్స్ మొదట ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోనుంది. ఇక అయ్యర్ ఏడు మ్యాచ్ల్లో 186 స్ట్రైక్రేట్తో 279 పరుగులు సాధించాడు.చదవండి: చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు
PSL: డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు!
ఒకప్పుడు ఐపీఎల్లో స్టార్గా వెలుగొందాడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానుల మనసులో అతడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్నర్ సైతం ఆరెంజ్ ఆర్మీని అంతే ప్రేమించాడు.కెప్టెన్గా 2016లో సన్రైజర్స్కు ట్రోఫీ అందించిన వార్నర్.. ఆ తర్వాత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. క్రమక్రమంగా జట్టులో అతడి స్థానం గల్లంతైంది. బెంచ్కే పరిమితమై వాటర్బాయ్గానూ అతడు సేవలు అందించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆరెంజ్ ఆర్మీకి సోషల్ మీడియా ద్వారా అతడు దగ్గరగానే ఉన్నాడు.తెలుగు పాటలకు రీల్స్ చేస్తూతెలుగు పాటలకు రీల్స్ చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం కూడా చూరగొన్నాడు వార్నర్. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్కు మారిన అతడు.. 2024లో చివరగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో వార్నర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.కరాచీ కింగ్స్ కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించాడు వార్నర్. పీఎస్ఎల్-2026 ఆరంభంలో కరాచీ కింగ్స్ వరుస విజయాలు సాధించినా.. ఆ తర్వాత పరాజయాలతో చతికిలపడింది. ఫలితంగా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.జట్టుగా మనం ఎంతో సాధించాముఈ నేపథ్యంలో జట్టును ఉద్దేశించి వార్నర్ ఉద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ‘‘మనం ఆశించిన ఫలితం రాలేదు. అయితే, ఆట పట్ల మన అంకితభావం, నిబద్ధత నాకు తెలుసు. జట్టుగా మనం ఎంతో సాధించాము.కరాచీ అభిమానులకు ధన్యవాదాలు. మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు. మాకు భద్రత కల్పించిన పోలీసులకూ థాంక్యూ. త్వరలోనే మళ్లీ కలుద్దాం’’ అంటూ కరాచీ కింగ్స్తో దిగిన ఫొటోలను వార్నర్ పంచుకున్నాడు.పీఎస్ఎల్ వదిలేసి ఐపీఎల్కు రాఈ నేపథ్యంలో ఓ భారత నెటిజన్.. ‘‘నువ్వు పీఎస్ఎల్ వదిలేసి ఐపీఎల్లో పునరాగమనం చేయడం మంచిది’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు వార్నర్ ఘాటుగా బదులిచ్చాడు.వార్నర్ రిప్లై వైరల్‘‘ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గట్టిగానే కౌంటర్ ఇచ్చావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు భారత నెటిజన్లు సైతం కౌంటర్లు ఇస్తున్నారు.‘‘ఆటకు స్వస్తి చెప్పిన తర్వాత వార్నర్ ఐపీఎల్ కోచ్గా వస్తాడే కానీ.. పీఎస్ఎల్లో ఉండడు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు కాబట్టే అక్కడ ఉన్నాడు’’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా వార్నర్ ఐపీఎల్లో 184 మ్యాచ్లు ఆడి 6565 పరుగులు చేశాడు.చదవండి: ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు!
బాధపడుతూ కూర్చోలేదు.. తప్పులు రిపీట్ చేయను: ఇషాన్
భారత క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు దూరమైన సమయంలో తాను కుంగిపోలేదన్నాడు. అందుకు బదులు దేశవాళీ టోర్నమెంట్లలో నిలకడగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. రెండున్నరేళ్లుకాగా క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా బీసీసీఐ దాదాపు రెండున్నరేళ్లు ఇషాన్ను పక్కనపెట్టింది. దీంతో జాతీయ జట్టుకు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... ఆ తర్వాత దేశవాళీల్లో భారీగా పరుగులు సాధించాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్గా వ్యవహరించిన ఇషాన్... 500 పైచిలుకు పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాడు. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్నకు ముందు న్యూజిలాండ్తో సిరీస్లో అతడికి అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్రసెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ కివీస్పై సత్తా చాటిన ఇషాన్.. ఆ తర్వాత వరల్డ్కప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు.. టీమిండియా వరుసగా రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకోవడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించిన ఇషాన్ జట్టుకు హ్యాట్రిక్ విజయాలు అందించాడు.ఇక రాజస్తాన్ రాయల్స్తో నివారం జరిగిన మ్యాచ్లో 31 బంతుల్లో 74 పరుగులు చేసిన ఇషాన్ జట్టును గెలిపించాడు. ఇందుకు గానూ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా పునరాగమనంపై స్పందించాడు.బాధపడుతూ కూర్చుంటే ఏమీ రాదు‘నేను భారత జట్టుకు దూరంగా ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదని నాకు నేను సర్ది చెప్పుకున్నా. బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. తిరిగి జట్టులో చోటు దక్కాలంటే పరుగులు సాధించడమే మార్గం. అందుకే ఆటపై దృష్టి పెట్టా. మరింత మెరుగవుతూ నిలకడగా పరుగులు సాధించడం అలవాటు చేసుకున్నా.జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో మరింత అంకితభావంతో ఆడా. ఒక సీజన్లో 300 పరుగులు చేసినా పిలుపు రాకపోతే... 400, 500 ఇలా పరుగుల సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నా. చాన్నాళ్లుగా మూడో స్థానంలో ఆడటం అలవాటైంది. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.చేసిన తప్పులు పునరావృతం కాకుండా... ఒక్కో మ్యాచ్పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నా’ అని ఇషాన్ కిషాన్ పేర్కొన్నాడు. ఇక 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో రెండు సెంచరీలు నమోదు చేసిన వైభవ్పై ఇషాన్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. అతడు బంతిని బాదుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నాడు.చదవండి: ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు!
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీ, తెలంగాణలో ముదురుతున్న ఇంధన సంక్షోభం... బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం... వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దుండగుడి కాల్పులు
వెనుతిరిగిన ఇరాన్, ముందుకు రాని అమెరికా... రెండో విడత ప్రత్యక్ష చర్చలపై వీడని పీటముడి
ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం. నేటి ఉదయం నుంచి రోడ్డెక్కనున్న బస్సులు
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఓటర్లు.. పశ్చిమ బెంగాల్ తొలి విడతలో 92.72 శాతం, తమిళనాడులో 85.14 శాతం ఓటింగ్ నమోదు
రాబోయే రోజులు మనవే.. కష్టాలు చెప్పుకున్న ప్రజలకు భరోసా ఇచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
‘ఉపాధి’పై ఇంత నిర్లక్ష్యమా?. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా... అమెరికా నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న పాపం ప్రతిపక్షాలదే... భ్రూణ హత్యతో పాపం మూటగట్టుకున్నాయి... ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
బిజినెస్
ఎల్పీజీ మార్పులు.. మే 1 నుంచి కొత్త రూల్స్
దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మే 1వ తేదీ నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా ఇంధన ధరలపై పడుతోంది. ధరల పెంపుతో పాటు, మే నెల నుంచి గ్యాస్ బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఅమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ధరల భారాన్ని వినియోగదారులపై గత నెలలోనే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరపై సుమారు రూ. 60పెరిగింది. ఇక కమర్షియల్ వినియోగదారులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఏప్రిల్ 2026 నాటికి ఏకంగా రూ. 196 పెరిగింది. మే 1వ తేదీన చమురు సంస్థలు నిర్వహించే నెలవారీ సమీక్షలో ధరలు మరోసారి సవరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.కొత్త బుకింగ్ నిబంధనలు ఇవే!కేవలం ధరలే కాకుండా, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది.బుకింగ్ గ్యాప్: నగరాల్లో నివసించే వారు ఒక బుకింగ్కు, మరో బుకింగ్కు మధ్య కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.OTP తప్పనిసరి: గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ఆధారిత ప్రామాణీకరణ ఇకపై శాశ్వతం కానుంది. సిలిండర్ల మళ్లింపును అరికట్టేందుకు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.ఆన్లైన్ బుకింగ్: ప్రస్తుతం 98% బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండగా, మే నెల నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయనున్నారు.ఆధార్ ఈ-కేవైసీ ఎవరికి అవసరం?గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీపై (e-KYC) సామాన్యుల్లో ఉన్న గందరగోళానికి అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఆర్థిక సంవత్సరంలో ఏడు రీఫిల్స్ పూర్తయ్యాక, ఎనిమిదో సిలిండర్ నుండి సబ్సిడీ పొందాలంటే ఈ ప్రామాణీకరణ అవసరం. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.
తగ్గుతున్న బంగారం.. మరో గుడ్ న్యూస్
దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. క్రితం రోజున ఉదయం కాస్త పెరిగిన పసిడి ధరలు సాయంత్రానికే తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఈరోజు పుత్తడి ధరలు (Today Gold Rate) మరింతగా తగ్గాయి. అలాగే నేడు వెండి ధరలు (Today Silver Rate) కూడా క్షీణించాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..
నష్టాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 42.80 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 24,049.90 వద్ద ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం ట్రేడింగ్ సెషన్ ను 208.84 పాయింట్లు లేదా 0.27 శాతం తగ్గి 77,094.79 వద్ద ప్రారంభించింది.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.24 శాతం, 0.64 శాతం పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఆఫీసులకు భలే డిమాండ్.. మూడు నెలల్లో కొత్త రికార్డులు
అంతర్జాతీయంగా అనిశ్చితులున్నప్పటికీ భారత ఆఫీస్ మార్కెట్ డిమాండ్కు కొత్త రికార్డులకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో 21.5 మిలియన్ చదరపు అడుగుల స్థూల(ఎస్ఎఫ్టీ) ఆఫీస్ వసతుల (ఆఫీస్ లీజ్/కార్యాలయ స్థలాలు) లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్ 19.5 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగింది.ఇక నికర ఆఫీస్ లీజింగ్ (రెన్యువల్స్ కాకుండా) 7 శాతం పెరిగి 13.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, ముంబై, చెన్నై, కోల్కతా నగరాల డేటా ఆధారంగా ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా విడుదల చేసింది. ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు విదేశీ సంస్థల నుంచి బలమైన డిమాండ్ ఉన్నట్టు తెలిపింది.‘‘భారత్ ఆఫీస్ మార్కెట్ మొదటి త్రైమాసికంలో ఇప్పటి వరకు లేనంతటి బలమైన పనితీరును పనిచేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య ఇది చెప్పుకోతగ్గ పనితీరే. అంతర్జాతీయ సంస్థలు భారతదేశాన్ని వినియోగించుకునే విధానంలో వచి్చన మౌలిక మార్పు ఈ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోంది’’అని జేఎల్ఎల్ ఇండియా ఆఫీస్ లీజింగ్ హెడ్ రాహుల్ అరోరా తెలిపారు. జీసీసీల జోరు.. విదేశీ సంస్థలు ఏర్పాటు చేసిన జీసీసీల లీజింగ్ 43 శాతం పెరిగి 9.8 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది. మొత్తం లీజింగ్లో 45.5 శాతంగా ఉంది. ‘‘ఇవేవీ వ్యూహాత్మక బ్యాక్ ఆఫీస్లు కానేకావు. ఏఐ అభివృద్ధి, డిజిటల్ ఇంజనీరింగ్, ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ఆవిష్కరణల కేంద్రాలు’’అని జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. టాప్–7 నగరాల్లో బెంగళూరు ఆఫీస్ మార్కెట్ మెరుగైన పనితీరు చూపించింది.మార్చి త్రైమాసికంలో స్థూల లీజింగ్ 25 శాతం పెరిగి 5.3 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. మార్చి త్రైమాసికంలో స్థూల లీజింగ్లో 9.2 మిలియన్ ఎస్ఎఫ్టీ దేశీ సంస్థలు తీసుకున్నవే. క్రితం ఏడాది మార్చి క్వార్టర్తో పోల్చితే 5 శాతం పెరిగింది. దేశీ సంస్థలు తీసుకున్న లీజింగ్లోనూ 57.8 శాతం ఫ్లెక్స్ ఆపరేటర్ల రూపంలోనే ఉన్నట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది.
ఫ్యామిలీ
క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు
బరువు తగ్గడం అనేది తరుచుగా కఠినమైన డైట్లు, డిటాక్స్ పద్ధతులు, తీవ్రమైన వ్యాయామాలతో ముడిపడి ఉంటుంది. కొందరు తక్కువ వ్యవధిలో బరువు తగ్గించే షార్ట్కట్లు వెతుక్కుంటారు. కానీ ఇలాంటివి ఏవి అవసరం లేకుండానే స్థిరమైన మార్పులతో బరువు తగ్గగలరని చెబుతున్నారు పుణెకు చెందిన క్లినికల్ ఫార్మసిస్ట్ అండ్ ఆరోగ్య విద్యావేత్త డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా తన రోగులలో ఒకరు ఎలాంటి తీవ్రమైన డైట్ లేదా డిటాక్స్ కార్యక్రమాన్ని పాటించకుండా 8 కిలోలు ఎలా తగ్గగలిగారో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ పేషెంట్ రక్త పరీక్షల్లో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉంది. అతడు చాలా తక్కువగా ఫుడ్ తీసుకుంటున్నా ఇలా ఈ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం అతనిలో భయాన్ని రేకెత్తించి తన వద్దకు వచ్చినట్లు తెలిపారు. అయితే డాక్టర్ దవాయివాలా సమస్య అతను ఎంత తిన్నాడు అనే దానివల్ల కొలెస్ట్రాల్ పెరగదని అంటున్నారు. శరీరమే దీనికి కారణం అన్నారు.అదెలా అంటే..మన శరీరమే కొంత కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఇది మన జీవనానికి ముఖ్యమైన పదార్థం. ఇది కణ త్వచాలు, హార్మోన్లు, విటమిన్ డి కొవ్వును జీర్ణం చేసే పైత్యరస ఆమ్లాలకు ఒక కీలకమైన నిర్మాణ మూలకం. శరీరం సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగినప్పుడు సాధారణంగా అదనపు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అందుకు గల కారణాలు ఏవంటే..సరిగా నిద్రపోకపోవడంవిటమిన్ డి లోపంఇన్సులిన్ నిరోధకతక్రమరహిత భోజనంకనీస శారీరక శ్రమఅందువల్ల సమస్య కొలెస్ట్రాల్ కాదు. ఇది దెబ్బతిన్న జీవనశైలి చక్రానికి సంబంధించిన ఒక లక్షణంకొలెస్ట్రాల్, బరువు తగ్గేలా ఏం చేయాలంటే..అదనపు ఫైబర్ (అవిసె, చియా, నానబెట్టిన ఓట్స్)ఒమేగా-3లుసమతుల్యమైన ఆహారం, ఏదీ మానకూడదుప్రతిరోజూ ఉదయం సూర్యరశ్మి, మెగ్నీషియంవిటమిన్ డి సప్లిమెంట్లుఈ మార్గదర్శక జీవనశైలి మార్పుల ద్వారా, రోగి మొత్తం కొలెస్ట్రాల్ 248 mg/dL నుంయి 187 mg/dLకి తగ్గింది. అతను 8 కిలోల బరువు తగ్గాడు, అతని విటమిన్ డి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి. పైగా అతని నిద్ర మెరుగుపడింది, అతిగా తినడం కూడా ఆపగలిగాడు.ఇందులో ఎలాంటి తీవ్రమైన డైట్లు లేదా జిమ్మిక్కులు లేవు. కేవలం స్థిరమైన, మార్గదర్శక ప్రయత్నం మాత్రమే. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని లేదా బరువును అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నట్లయితే, పోషకాహార నిపుణులు లేదా ఫిట్స్ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు డాక్టర్ దవాయివాలా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Idris Dawaiwala | AHealthyBeat (@ahealthybeat) (చదవండి: గ్లోబల్ మైండ్సెట్ అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..)
శల్య సారథ్యం అంటే..?
మహాభారత సంగ్రామంలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేక శైలి. వారిలో శల్యుడు ఒకరు. ఒకరిపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సాయం చేసే నెపంతో చేతులారా చెడగొట్టడంతోపాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడాన్ని శల్య సారధ్యం అంటారు.శల్యుడు మద్ర దేశానికి అధిపతి, పాండురాజుకు రెండవ భార్య అయిన మాద్రికి సోదరుడు. మాద్రి సంతానమైన నకుల, సహదేవులకు మేనమామ. శల్యుడు అస్త్రవిద్య, గదా యుద్ధం, ముఖ్యంగా రథసారథిగా గొప్ప నేర్పరి. అలాంటి శల్యుడు పాండవుల పక్షాన ఉంటే వారిని గెలవడం కష్టమని గ్రహించిన దుర్యోధనుడు ఒక పథకం పన్నాడు. పాండవులను కలవడానికి వెళుతున్న శల్యుడికి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అక్కడక్కడా పెద్దపెద్ద గుడారాలు వేయిస్తాడు. ఆ గుడారాలు పాండవులవేనని అనుకొన్న శల్యుడు వాటిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి సేవకులు శల్యునికి ఎంతో సాదరంగా ఆహ్వానం పలికి, గౌరవ మర్యాదలు చేసి అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. ఇదంతా పాండవులు తన కోసమే చేశారనుకున్న శల్యుడు విందు ఆరగించి, వెంటనే సేవకునితో తక్షణమే వెళ్లి మీ యజమాని పిలుచుకొని రా... రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నా మద్దతును తెలుపుతానని చెప్పాడు.సేవకులతో పాటు దుర్యోధనుడు రావడంతో ఆశ్చర్యపడ్డ శల్యుడు జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోలేక మహా భారత సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. అనంతరం శిబిరం నుండి బయలుదేరిన శల్యుడు పాండవులను కలుసుకొని జరిగిన సంఘటన వివరించాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడితో మాట్లాడుతూ, కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నప్పటికీ తమకు అభ్యంతరం లేదని, కానీ ఒక సహాయం చేస్తాననే మాట ఇమ్మని శల్యుణ్ణి అడిగాడు. అలాగే, అదేమిటో చెప్పమన్న శల్యుడితో ‘‘రథం తోలడంతో నీకు అద్భుతమైన ప్రతిభ ఉంది కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని రథాన్ని తోలే అవకాశం వస్తే ఆ సమయంలో కర్ణుని అడుగడుగునా అవహేళన చేస్తూ, మానసికంగా, అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాలి’’ అని ధర్మరాజు కోరాడు. అందుకు అంగీకరించాడు శల్యుడు.ఊహించిన విధంగానే మహాభారత సంగ్రామంలో 17వ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యునికి అప్పగించారు. కర్ణుని పరాక్రమాన్ని గమనించిన శల్యుడు అడుగడుగునా కర్ణుని అవహేళన చేస్తూ సూటిపోటి మాటలతో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఒక సమయంలో కర్ణుడు వదిలిన అస్త్రాన్ని అర్జునుని తలపైకి కాకుండా గుండెల వైపు గురి పెట్టమని శల్యుడు సూచిస్తాడు. అప్పటికే శల్యుని పట్ల అపనమ్మకం ఏర్పడ్డ కర్ణుడు అస్త్రాన్ని తలవైపునకే గురిపెట్టడం, అర్జునిని రథ సార థ, జగన్నాటక సూత్ర ధారి అయిన శ్రీ కృష్ణుడు రథాన్ని కిందకు తొక్కడంతో ఎంతో శక్తిమంతమైన అస్త్రం అర్జునుని తలపై నుండి వెళ్ళిపోయి వ్యర్థ మైపోయింది. ఈ లోగా కర్ణుని శాపాలు అన్నీ కలిసి రావటంతో అర్జునుడు విడిచిన అస్త్రంతో కర్ణుడు మరణిస్తాడు. అప్పటి నుండి శల్య సారథ్యం అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది.– సి. ఎన్. మూర్తి,సీనియర్ పాత్రికేయులు
కొండ హారతి
అది శేషాచలం కొండలకు కూత వేటు దూరంలో ఉన్న గ్రామం. ఆ ఊరి అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయికి కేరళ అమ్మాయితో పెళ్ళి జరిగింది. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి.మొదటిసారిగా ఆ అమ్మాయి అత్తగారింటికి కారులో బయల్దేరింది. ఆ ఊర్లో ప్రతి ఇంటి ముందరో, వెనకాలో కొబ్బరిచెట్లు ఉండటం గమనించింది. చిన్నపిల్లలాగా గంతులేస్తూ కారును ఆపమని కోరింది. గబగబా ఒక కొబ్బరిచెట్టు దగ్గరకు వెళ్ళి చేత్తో తడిమి పరవశించిపోయింది. ‘మా కేరళలో లాగా ఇక్కడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. చాలా సంతోషం. ఈ నేల కొబ్బరిచెట్లకు అనుకూలమైనదా’ అని అడిగింది. ఆమెను ఎప్పుడూ అంత ఆనందంగా ఉండటం చూడలేదు భర్త. పక్కనే ఉన్న భర్త ‘అంత అనుకూలమైన నేల కాదు కానీ, మా ఊర్లో ఈ కొబ్బరి చెట్లను పెంచడానికి ఓ కారణం ఉంది. మా నాన్నగారు వేంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాడు. నుదుటిన నామం పెట్టేవాడు. ఆ రోజు ఉదయం శేషాచలం కొండలకి నేతి దీపాల హారతి ఇచ్చే వాడు. దాంతోపాటు కొబ్బరికాయ కూడా కొట్టేవాడు.ఒక్కోసారి, పట్టణం నుంచి కొబ్బరికాయ తెచ్చేది మరిచే వాడు. అలా కొబ్బరికాయ తీసుకురాని రోజు మా అమ్మ చాలా బాధపడేది. ఆ వారమంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండేది.అది గమనించిన మా నాన్న ‘ఇంట్లోనే కొబ్బరి చెట్టు నాటితే ఆ సమస్యనుంచి బయటపడవచ్చు కదా’ అని భావించాడు. అనుకున్నట్లే చేశాడు. ఇది చిన్న ఊరు కాబట్టి, ఒకర్ని చూసి మరొకరు కొబ్బరి చెట్లు నాటడం మొదలయ్యింది. అలాగే ప్రతి శనివారం కొండకి హారతి పట్టి టెంకాయ కొట్టడం అందరి ఇండ్లలోనూ అలవాటుగా మారింది’’ అని చెప్పాడు.‘అలాగా’ అని ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.ఇద్దరూ ఇంటికి వెళ్ళి కాళ్ళూచేతులూ కడుక్కుంటూ ఉండగా– ఇంతలో ఆమె అత్తమామలు పిలవడంతో మిద్దెమీదకు వెళ్ళారు. వారు అప్పటికే నేతి దీప హారతికి అంతా సిద్ధం చేసి ఉన్నారు. పళ్ళెంలో దీపం వెలిగించి కొండకి హారతి ఇచ్చి, టెంకాయ కొట్టి గోవింద నామస్మరణలు చేశారు. ‘ఎంత అదృష్టవంతులు ఇక్కడి వారు, ఆదిశేషుడి రూపంలో ఉన్న శేషాచలం కొండని రోజూ చూసే భాగ్యవంతులు’ అని వారితో పాటు గోవింద నామస్మరణలు చేసింది. దైవభక్తి కల్గిన కోడలు దొరికిందని అత్తమామలు మురిసిపోయారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు
ఆధ్యాత్మికతతో సార్థక జీవనం
జీవిత లక్ష్యం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి విడదీయలేనివి. సాధారణంగా మనం జీవిత లక్ష్యం అంటే లౌకిక విజయాలైన ఉద్యోగం, డబ్బు, హోదా తదితరాలే అనుకుంటాము, కానీ; ఆధ్యాత్మిక లక్ష్యం పరమార్థాన్ని వెతుకుతుంది. లౌకిక లక్ష్యాలు, సౌకర్యాలను ఇస్తాయి, కానీ ఆధ్యాత్మిక లక్ష్యం సంతృప్తిని ఇస్తుంది.బాహ్యంగా ఎంత ఎదిగినా, అంతరంగంలో ఆధ్యాత్మికత లేకపోతే జీవితం అసంపూర్ణంగానే అనిపిస్తుంది. అందుకే, బాహ్య వృద్ధిని అంతర్గత ప్రశాంతతతో ముడిపెట్టడమే నిజమైన జీవిత లక్ష్యం కావాలి. లౌకిక లక్ష్యం నేను ఏమి సాధించాలి?అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. ఇది బయటి ప్రపంచంలో గుర్తింపును ఇస్తుంది. ఆధ్యాత్మిక లక్ష్యం నేను ఎవరు? అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. ఇది అంతరంగంలో శాంతిని, సత్యాన్ని వెతుకుతుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని మరింత అర్థవంతంగా జీవించడం’.మానవ జన్మ అనేది సృష్టిలో అత్యంత శ్రేష్ఠమైనది. సాధారణంగా మనిషి తన జీవితాన్ని ఆహార, నిద్ర, భయ, మైథునాలతోనే గడిపేస్తుంటాడు. కానీ, వీటికి అతీతంగా నేను ఎవరు? నా పుట్టుకకు పరమార్థం ఏమిటి?– అని ఆలోచించడమే ఆధ్యాత్మికతకు తొలి అడుగు. జీవిత లక్ష్యం కేవలం భౌతిక విజయాలకు పరిమితం కాకుండా, ఆధ్యాత్మికతతో మేళవించినప్పుడు మాత్రమే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మానవ జీవితంలో రెండు రకాల ప్రయాణాలు ఉంటాయి. ఒకటి బాహ్య ప్రపంచంలో సాగే ప్రయాణం, రెండోది అంతరంగంలో సాగే అన్వేషణ. చదువు, ఉద్యోగం, సంపాదన, కుటుంబం సామాజిక హోదా. ఇవి శరీరానికి, మనస్సుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తాయి. ఆధ్యాత్మిక లక్ష్యం– మనశ్శాంతి, ఆత్మజ్ఞానం, సార్వత్రిక ప్రేమ. ఆత్మకు ఇచ్చే తృప్తి అందిస్తుంది.భారతీయ సంప్రదాయంలో మోక్షం అనేది అత్యున్నత జీవిత లక్ష్యంగా పరిగణించబడుతుంది. మోక్షం అంటే మరణం తర్వాత వచ్చేది మాత్రమే కాదు., జీవించి ఉండగానే రాగద్వేషాల నుండి, అజ్ఞానం నుండి విముక్తి పొందడం. తనలోని పరమాత్మను గుర్తించి, ప్రకృతితో మమేకమవ్వడమే ఆధ్యాత్మిక ప్రయాణ గమ్యం.. జీవిత లక్ష్యం ఒక అందమైన భవనం అయితే, ఆధ్యాత్మికత అనేది దానికి బలమైన పునాది. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో, ఆధ్యాత్మికత లేని లౌకిక విజయం కూడా అంతే అస్థిరమైనది.బాహ్యవృద్ధిని అంతర్గత ప్రశాంతతతో ముడిపెట్టడమే పరిపూర్ణమైన జీవన విధానం. చేతులు పనిలో ఉండాలి, మనసు భగవంతునిపై (అంతర్గత శాంతిపై) ఉండాలి. ఇదే నిజమైన యోగం. భౌతిక ప్రపంచంలో బాధ్యతలను నెరవేరుస్తూనే, అంతరంగంలో ఆధ్యాత్మిక దీపాన్ని వెలిగించుకున్నప్పుడే మనిషి జీవన యానం ధన్యమవుతుంది.సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే శక్తిని ఆధ్యాత్మికత ఇస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, ఫలితం మీద ఆశ లేకుండా కర్మను ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి తన లక్ష్య సాధనలో అధర్మానికి తావివ్వడు. సత్యం, అహింస, ధర్మం అనే పునాదుల మీద తన విజయాన్ని నిర్మించుకుంటాడు. తన ఎదుగుదల కేవలం తన కోసమే కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం కూడా అని గుర్తించడం ఆధ్యాత్మికత నేర్పే గొప్ప పాఠం.ఆధ్యాత్మికత అంటే సంసారాన్ని వదిలి అడవులకు వెళ్లడం కాదు. మనం చేసే ప్రతి పనిలోనూ దైవత్వాన్ని చూడటం, నిస్వార్థంగా వ్యవహరించడం. అంతటా ఆ పరమాత్మనే ఉన్నాడు అనే భావనను అలవరుచుకోవడమే ఆధ్యాత్మికత సారాంశం. ఇది మనిషిని అహంకారం నుండి విముక్తుడిని చేసి, వినయాన్ని ప్రసాదిస్తుంది. జీవిత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మనిషి అనేక ఒత్తిళ్లకు, ఓటములకు లోనవుతాడు. అటువంటి సమయంలో ఆధ్యాత్మికతఒక దిక్సూచిలా పనిచేస్తుంది:– ఆనంద ‘మైత్రేయ’మ్
అంతర్జాతీయం
నీటి కోసం రెండు కుటుంబాల యుద్ధం
చాద్: భవిష్యత్తులో నీటి కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని విన్నాం. కానీ, ఆఫ్రికా దేశమైన చాద్లో రెండు కుటుంబాల మధ్య యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో కనీసం 42 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో 10 మంది గాయపడ్డారని తెలియజేసింది. పొరుగు దేశం సూడాన్ నుంచి లక్షలాది మంది శరణార్థులు తూర్పు చాద్కు తరలివచ్చారు. ఈ ప్రాంతంలో వనరుల కొరత తీవ్రంగా ఉంది. మంచినీరు దొరకడం కూడా గగనంగా మారింది. సూడాన్ సరిహద్దులో వాది ఫిరా ప్రావిన్స్లోని ఇగోట్ గ్రామంలో శనివారం తాగునీరు పట్టుకొనే విషయంలో రెండు కుటంబాల మధ్య గొడవ మొదలైంది. అది క్రమంగా తీవ్ర ఘర్షణగా మారింది. రెండు కుటుంబాలకు చెందినవారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. చేతికందిన వస్తువులతో ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. రక్తం ఏరులై పారింది. 42 మంది ప్రాణాలు కోల్పోయారు. చాద్లో వనరుల కోసం ఇలాంటి ఘర్షణలు సర్వసాధారణంగా మారిపోయాయి.
పోరు ఆపితే తెరుస్తాం
కైరో/మాస్కో/దుబాయ్: హార్మూజ్ జలసంధిని దిగ్బంధం నుంచి విముక్తి కల్పించి యుద్ధానికి చరమగీతం పాడితే హార్మూజ్ జలసంధి గుండా విదేశీ వాణిజ్యనౌకల రాకపోకలకు మార్గం సుగమం చేస్తామని ఇరాన్ కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది. ఆదివారం ఒమన్ నుంచి పాకిస్తాన్కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు తమ ప్రతిపాదనలకు హెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తెలియజేశారు. వీటిని అమెరికాకు పాక్ అందజేయనుంది. వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విముఖత చూపొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుతిన్తో అరాఘ్చీ భేటీ.. ఇరాన్ మంత్రి అరాఘ్చీ సోమవారం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. తమ సార్వ¿ౌమత్వం కోసం పోరాడుతున్న ఇరానియన్లను ఈ సందర్భంగా పుతిన్ పొగిడారు. తర్వాత పశ్చిమాసియా యుద్ధం, హార్మూజ్ దిగ్బంధం, అమెరికా షరతులు, ఇరాన్ డిమాండ్లు తదితర కీలకాంశాలపై అరాఘ్చీ, పుతిన్ విస్తృతంగా చర్చించుకున్నారని రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్ తెలిపింది. ‘‘పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం రష్యా తన శక్తిమేరకు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్తో వ్యూహాత్మక బంధం బలోపేతానికి కృషిచేస్తాం’’అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టంచేశారు. భారతీయ ట్యాంకర్పై కాల్పులు.. ఒమన్ నుంచి భారత్కు వస్తున్న రసాయనాల ట్యాంకర్ ఎంటీ చిరాన్7పై ఇరాన్ గన్బోట్లు హెచ్చరిస్తూ కాల్పులు జరిపాయి. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన ఈ కాల్పులఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హార్మూజ్కు వాయవ్యంగా ఒమన్కు చెందిన షినాస్ పోర్ట్ సమీప జలాల గుండా నౌక వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నౌకలోని 17 మంది భారతీయనావికులకు ఎలాంటి గాయాలుకాలేదని కేంద్ర షిప్పింగ్, పోర్ట్లు, వాటర్వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రంధావా తెలిపారు.
అటు తిరిగి, ఇటు తిరిగి ఎఫ్బీఐ చీఫ్ మీదికి వచ్చింది!
ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి అమెరికాలో ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అమెరికాలో ఉగ్రవాదం, గూఢచర్యం, అంతర్గత భద్రతా ముప్పులను ఎదుర్కోవడంలో ఎఫ్బీఐ కీలక పాత్ర పోషిస్తుంది. అవినీతి, సైబర్ నేరాలు, మాఫియా, పౌరహక్కుల ఉల్లంఘనలు వంటి 200 కంటే ఎక్కువ రకాల ఫెడరల్ నేరాలను ఎఫ్బీఐ పరిశీలిస్తుంది.సైబర్ దాడులు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ భద్రతా సమస్యలను ఎదుర్కోవడానికి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. రాష్ట్ర, స్థానిక, అంతర్జాతీయ పోలీస్ సంస్థలతో కలిసి పనిచేసి, నేరాల నియంత్రణలో సమన్వయం కల్పిస్తుంది. మొత్తానికి, ఎఫ్బీఐ అమెరికాకు భద్రతా కవచంగా, అలాగే ఫెడరల్ నేరాల పరిశోధన సంస్థగా పనిచేస్తుంది. అటువంటి ఎఫ్బీఐకు చీఫ్ అంటే ఎలా ఉండాలి? ఎంతో సమర్థుడై ఉండాలి. ఏదైనా ముప్పు తలెత్తినప్పుడు ముందు నిలబడి ఎదుర్కోవాలి. కానీ, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి కెమెరాకు దొరికిపోయారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఇటీవల నిర్వహించిన వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాష్ పటేల్ హాయిగా కుర్చీకే అతుక్కుపోయి కూర్చుండిపోయారు.There is a shooting and…The head of the FBI is just hanging out? pic.twitter.com/jrIKMYhHte— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) April 26, 2026దీంతో ఎఫ్బీఐ చీఫ్ పదవిలో కాష్ పటేల్ నిలదొక్కుకోగలరా? వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేళ భద్రతా లోపాలు, నిందితుడి స్టేట్మెంట్ వంటివాటి వల్ల కాష్ పటేల్ పదవి వీడాల్సిందేనా? అన్న ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి తొలగించే వారి లిస్టులో.. కాష్ పటేల్ ఉండవచ్చని ఒక సీనియర్ వైట్హౌస్ అధికారి ఇటీవలే మీడియాకు తెలిపారు. పటేల్ను పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమని, “ఎప్పుడు తొలగిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న?” అని వ్యాఖ్యానించారు. అసలు కాష్ పటేల్ను తొలగిస్తారన్న ప్రచారం చాలా కాలంగా ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు ఆ ప్రచారం మరింతగా పెరగడానికి కారణాలు ఏంటి? మీడియాలో కాష్ పటేల్పై ప్రతికూల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆయన పనితీరుతో పాటు నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలపై విమర్శలు పెరిగాయి. కేబినెట్ కార్యదర్శి దృష్టిలో ఇది మంచిది కాదు. ఇటీవల వాషింగ్టన్ హిల్టన్లో జరిగిన భద్రతా లోపం ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ విషయంలో రాజకీయ చర్చగా మారుతోంది. నిందితుడు రాసిన “ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్” లేఖలో పలువురు ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ, పటేల్ పేరు మాత్రం లేదన్న విషయం తెలిసిందే.కాల్పుల ఘటన తర్వాత ఏం జరిగింది?కాల్పుల ఘటన అనంతరం పలు వీడియోలు ఆన్లైన్లో కనపడ్డాయి. ఒక వీడియోలో నిందితుడు అలెన్ హోటల్లోకి పరుగెత్తాడు. తర్వాత కాల్పుల శబ్దం వినిపించింది. మరో వీడియోల్లో అతిథులు టేబుళ్ల కింద దాక్కోవడం, భద్రత సిబ్బంది వేగంగా కదలడం, అధికారులను బయటకు తరలించడం కనిపించింది.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో కాష్ పటేల్ అయోమయంగా చుట్టూ చూస్తూ కుర్చీలో కూర్చుండిపోయారు. భద్రతా సిబ్బంది అతిథులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వీడియోలో కాష్ పటేల్ అక్కడ ఏమీ జరగనట్లు అటూఇటూ తిరుగుతూ ఫోన్లో మాట్లాడారు. ఆ సమయంలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ప్రజలను బయటకు తీసుకెళ్తుండగా కాష్ పటేల్ ప్రశాంతంగా కనిపించారు.FBI Director Kash Patel seen on his phone, just hanging around outside the venue like a random WHCD attendee trying to figure out how to get an Uber after the incident. pic.twitter.com/28eIcwGUdl— MeidasTouch (@MeidasTouch) April 26, 2026కాష్ పటేల్ ఆ పదవిలో కొనసాగుతారా?వైట్ హౌస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడికి ముందు అలెన్ తన కుటుంబానికి ఒక లేఖ పంపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పత్రంలో తాను “ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్” అని పేర్కొంటూ, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుంటానని తెలిపాడు.అయితే “ప్రభుత్వ అధికారులు (మిస్టర్ పటేల్ మినహా)” అని పేర్కొన్న ఒక వాక్యం ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దాని వెనుక ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఆ పత్రంలో ట్రంప్ వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక అభిప్రాయాలు కూడా ఉన్నాయి.ఈ ఘటనకు ముందు కూడా పటేల్పై పలు భద్రతా అంశాలపై విమర్శలు ఉన్నాయి. 2024 చివర్లో, 2026 మార్చిలో ఆయన వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాలపై ఇరాన్ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడులు జరిగాయని నివేదికలు వెలువడ్డాయి. ఇది సైబర్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. కాష్ పటేల్ వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన వాటిని ఖండించారు. ఈ ఆరోపణలపై ఆయన పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారు.
యూఏఈకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ
అబుదాబి: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేందుకు యూఏఈ చర్యలకు ఉపక్రమించింది. ఇజ్రాయెల్ అందించిన ‘ఐరన్ డోమ్’ను యూఏఈ మోహరించింది. ఇరాన్ నుంచి పెరుగుతున్న డ్రోన్, క్షిపణి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, యూఏఈ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అబ్రహాం ఒప్పందాల తర్వాత రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారం పెంచుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా, యూఏఈలో ఐరన్ డోమ్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 4–70 కిలోమీటర్ల పరిధిలోని రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను అడ్డుకుంటుంది. మిర్ ఇంటర్సెప్టర్ అనే క్షిపణులు లక్ష్యాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తాయి. ఎల్టా సిస్టమ్స్ రాడార్ ద్వారా వచ్చే ముప్పులను గుర్తించి, వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇజ్రాయెల్లో ఈ వ్యవస్థ 90శాతం విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ గత కొన్నేళ్లుగా యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై డ్రోన్ దాడులు జరిపింది. 2025లో యూఏఈపై జరిగిన దాడుల్లో 2,200కి పైగా డ్రోన్లు ఉపయోగించింది. ఈ నేపథ్యంలో యూఏఈలో ఐరన్ డోమ్ను వినియోగంలోకి తెచ్చింది. యూఏఈ ఇప్పటికే అమెరికా నుంచి పాట్రియట్, థాడ్ రక్షణ వ్యవస్థలను పొందింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చేరడంతో యూఏఈ రక్షణ మరింత బలపడనుంది. అమెరికా,ఇజ్రాయెల్,యూఏఈ త్రైపాక్షిక సహకారం ఇరాన్పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్,యూఏఈ,అమెరికా బలమైన కూటమి ఏర్పడుతోంది. తాజా పరిణామంతో యూఏఈలోని చమురు, వాణిజ్య కేంద్రాలు ఇప్పుడు మరింత రక్షణగా ఉండనున్నాయి. ఇరాన్ దాడులు కొనసాగితే, ఐరన్ డోమ్ వ్యవస్థ యూఏఈ భద్రతకు కీలకంగా మారుతుంది. మొత్తం మీద, యూఏఈలో ఐరన్ డోమ్ అమలు కేవలం రక్షణ చర్య మాత్రమే కాదు .. ఇరాన్ ముప్పు పెరుగుతున్న ఈ సమయంలో, యూఏఈ భద్రతా వ్యూహంలో కీలక మలుపేనని నిపుణులు భావిస్తున్నారు.
జాతీయం
డీ-కంపెనీకి గట్టి దెబ్బ
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో నడుస్తున్న నెట్ వర్క్కు గట్టి దెబ్బ తగిలింది. దావూద్ సన్నిహితుడు, డ్రగ్ కింగ్పిన్ సలీం డోలాను టర్కీ(తుర్కీయే) భారత్కు అప్పగించింది. తాజాగా ఇస్తాంబుల్లో అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి డిపోర్ట్ చేసినట్లు సమాచారం. ఇది డీ-కంపెనీపై భారత ప్రభుత్వం చేపట్టిన భారీ అణచివేత చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కొన్ని దశాబ్దాలుగా అండర్వరల్డ్ మాఫియా నడిపిస్తూ అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్, ఆయుధాలు, అక్రమ వ్యాపారాల నెట్వర్క్ను నడిపిస్తూ వచ్చింది. హవాలా లావాదేవీల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తూ వచ్చాడు. ఈ నెట్వర్క్ ద్వారా వచ్చిన సొమ్మును పాకిస్తాన్ ఐఎస్ఐకి కూడా చేరుతుందని భారత ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. 70వ దశకంలో ముంబై బేస్డ్గా ప్రారంభమై.. ఇప్పటికీ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికా రీజియన్లలో క్రైమ్-టెర్రర్ నెట్వర్క్గా కొనసాగుతోంది. అయితే.. దావూద్ అనుచరుడు సలీం డోలా వంటి సహచరులు ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. డోలా దావూద్కు అత్యంత సన్నహితుడిగా తెలుస్తోంది. ఇతని అరెస్టు, భారత్కు డిపోర్ట్ కావడంతో ఈ నెట్వర్క్లోని కీలక లింక్ తెగిపోవడం గ్యారెంటీ అని అధికారులంటున్నారు. తద్వారా దావూద్ ఇబ్రహీం కంపెనీకి గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషిస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ చర్యను ఒక ఘన విజయంగా చెబుతోంది. అంతర్జాతీయ స్థాయిలో నేరగాళ్లను పట్టుకోవడంలో భారత్ తన శక్తిని చూపిందని.. టర్కీతో ఉన్న సహకారం ఈ ఆపరేషన్ విజయానికి దోహదపడిందని ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్ మాఫియాపై పోరాటంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణించింది.
బెంగాల్కు యూపీ ‘సింగం’.. ఊర మాస్ వార్నింగ్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న యూపీకి చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ అబ్జర్వర్ అజయ్ పాల్ శర్మ.. అధికార టీఎంసీ అభ్యర్థికి ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.ఆకతాయి పనులొద్దుఫల్టా నియోజకవర్గంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు.. ఓటర్లను బెదిరిస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో అజయ్ పాల్ శర్మ స్వయంగా రంగంలోకి దిగారు. జహంగీర్ నివాసానికి చేరుకున్న ఆయన, అక్కడ అభ్యర్థి లేకపోవడంతో కుటుంబ సభ్యులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘జహంగీర్కు స్పష్టంగా చెప్పండి.. ప్రజలను బెదిరించినట్లు మళ్లీ ఫిర్యాదులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. ఎవరైనా తప్పుడు పనులకు పాల్పడినా, ఓటర్లను వేధించినా వదిలే ప్రసక్తే లేదు’ అని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.భద్రతపై అనుమానాలు.. ఎస్పీకి నోటీసులుజహంగీర్ ఖాన్ నివాసం వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది వివరాలను కూడా శర్మ ఆరా తీశారు. అక్కడ 14 మంది పశ్చిమ బెంగాల్ పోలీసులు ఉండటాన్ని గమనించిన ఆయన స్థానిక ఎస్పీ నుంచి వివరాలు కోరారు. అయితే, జహంగీర్కు ఉన్న వై-కేటగిరీ భద్రత కింద కేవలం 10 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో మంజూరైన దానికంటే అదనంగా నలుగురు పోలీసులను ఎందుకు మోహరించారనే దానిపై వివరణ కోరుతూ శర్మ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.భగ్గుమన్న టీఎంసీఈ సంఘటనతో బెంగాల్లో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. శర్మ చర్యలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్వాగతిస్తూ.. ‘బెదిరింపుల శకం ముగిసింది, చట్టం తనపని తాను చేసుకుపోతుంది’ అని అన్నారు. మరోవైపు టీఎంసీ తీవ్రస్థాయిలో మండిపడింది. వివాదాస్పద ఎన్కౌంటర్లతో పేరుగాంచిన అధికారిని ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నియమించిందని, ఆయన నిష్పాక్షికతపై అనుమానాలున్నాయని విమర్శించింది.ఇది కూడా చదవండి: Indonesia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి
పోలీసులారా.. ఇదేం పని?
బెంగళూరు: పోలీసులు ఏమైనా చేయగలరు. నిజమైన నేరాలపై విచారణ చేయకుండా ప్రజలను తిప్పించుకుంటారు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓ కేసులో పోలీసుల తీరును తప్పబట్టారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా ఎంకె దొడ్డి పోలీసుస్టేషన్ పరిధిలో 2024లో రెండు పశువులు అదృశ్యమయ్యాయి. రెండేళ్ల తరువాత పశువుల సొంతదారు పక్కింటి వ్యక్తి సహా నలుగురిపై కేసు పెట్టాడు. తమకు సంబంధమే లేదని, ఈ కేసును కొట్టేయాలని మంగళమ్మ అనే నిందితురాలు హైకోర్టులో అర్జీ దాఖలు చేసింది. రెండేళ్ల తరువాత పొరుగింటివారిపై ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. కనీస విచారణ జరపలేదని, ఇది చట్ట ఉల్లంఘన అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పశువులను వెతకటం మానేసి, సమాజంలో జరుగుతున్న తీవ్రమైన, నిజమైన నేరాల వెంటపడాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు మళ్లీ తమ దృష్టికి వస్తే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు.
అందుకే కిరణ్కు నిప్పంటించా!
ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని వెస్ట్రన్ స్టయిల్లో ప్రపోజ్ చేస్తానంటూ కుర్చీకి కట్టేసి మరీ తగలబెట్టి చంపేసింది ఓ ప్రియురాలు. ఈ కేసు దేశవ్యాప్తంగా.. అందునా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో వివాహానికి కిరణ్ ఒప్పుకున్నాడని నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ చెబుతోంది.బెంగళూరులో ప్రియున్ని తన ఇంట్లో కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ నెమ్మదిగా నిజాలు బయటపెడుతోంది. కిరణ్ను తాను చాలా ప్రేమించేదాన్నని, అయితే అతడు మాత్రం శారీరక అవసరాలు తీర్చే వస్తువుగా తనను భావించేవాడని అంటోంది.వారం కిందట(21 ఏప్రిల్) బెంగళూరు శివారులోని బైదరహళ్లి పీఎస్ పరిధిలోని అంజనానగర్లో ఈ దారుణం జరిగింది. తుమకూరుకు చెందిన కిరణ్.. నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ(ప్రేరణ)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత.. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాంట్, షర్ట్ ఊడదీసి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం కాళ్లు, చేతులూ కట్టేసింది.ఆ సమయంలో కిరణ్ కంగారుపడ్డాడు. అయితే.. పాశ్చాత్య దేశాల్లో ఇలాగే చేస్తారని, తానూ అలా వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని (Love Proposal) నమ్మించింది. ఆ వెంటనే కిరోసిన్ పోసి నిప్పటించి తన మొబైల్లో రికార్డు చేసింది. స్థానికులు వచ్చేలోపే హాహాకారాలు చేస్తూ కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూమ్లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె తీరుపై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.నార్త్వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ నేతృత్వంలోని టీం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించింది. తొలుత దూరం పెడుతున్నాడనే అతన్ని హత్య చేసిందని అంతా భావించారు. అయితే.. ‘‘కిరణ్ను తాను ఎంతో ప్రేమించానని.. కానీ, అతను తనను ఎంతో అవమానించేవాడని ప్రేమ పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. ‘కిరణ్ నన్ను శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నాడన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. పెళ్లి చేసుకుందామని అడిగా. ‘నువ్వు కులం తక్కువదానివి.. మా ఇంట్లో ఒప్పుకోరు’ అనేవాడు. ఈ విషయం ప్రేమించినప్పుడు.. కలిసి తిరిగినప్పుడు తెలియదా? అని గట్టిగా నిలదీశా. దీంతో పెద్దల్ని ఒప్పించి ఎలాగోలా వివాహం చేసుకుంటానన్నాడు. అయితే.. పెళ్లి తర్వాత కూడా కేవలం శారీరక అవసరం కోసమే తనతో ఉంటానని చెప్పేవాడు. ఆ మాట నాతోనే కాదు.. అతని స్నేహితుల వద్ద చెబుతూ నన్ను బూతులు తిట్టేవాడు. ఆ విషయం అతని స్నేహితులు రికార్డ్ చేసి పంపారు. నన్ను వాడుకుంటూ నన్నే తిట్టడం, అవమానించడం ఎంతో బాధించింది. భరించలేకపోయా.. అందుకే నిప్పు పెట్టి చంపేశా’’ అని పోలీసుల ముందు ప్రేరణ కన్నీళ్లతో నిజం ఒప్పుకుంది.
ఎన్ఆర్ఐ
న్యూజిల్యాండ్లో ఉగాది సంబరాలు
న్యూజిల్యాండ్లోని తెలుగువారు ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్ నగరంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం వేడుకలను సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను తెలుసుకున్నారు.చిన్నారులు పెద్దలు తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనం చేశారు. ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ సేథి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సామజికసేవలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో సన్మానించారు. చిన్నారులకు, నృత్యకారులకు బహుమతులు అందజేశారు.అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, యాదవ్, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి, కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, మొహమ్మద్ బిలాలోద్దీన్, విజయ్ శ్రీరామ్, రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, శ్రీనివాస్ పందిళ్ల, రవి కుమార్ వట్టం, మారుతి, ఆర్తి, భరత్ జవ్వాజి, మహేందర్ రెడ్డి, నిఖిత తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇంటిపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ..!
అమెరికా అనగానే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. యూఎస్లో అత్యంత సుపరిచితమైన చిహ్నాలలో ఒకటి ఈ స్మారక చిహ్నం. దీన్ని స్వేచ్ఛ, ఆశకు ప్రతీకగా చెబుతుంటారు. అయితే భారత్లోని ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటిపైనే దీన్ని నిర్మించి వార్తల్లో నిలిచాడు. అంతేగాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ ఇల్లు ఓ ఆకర్షణగా మారింది. ఎందుకిలా అంటే..పంజాబ్లోని ఎన్నారై గుర్జీత్ సింగ్ మథారు జలంధర్లోని కిషన్ పురా ప్రాంతంలో తన ఇంటి నాల్గో అంతస్థుపై ఈ ప్రసిద్ధ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఈ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షించేలా హైల్గా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తుంటారట కూడా. రీజన్ ఏంటంటే..గుర్జీత్ సింగ్ న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తరచుగా చూడటం, ప్రతి ఏడాది భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగరం జ్ఞాపకంగా ఏదైనా చేయాలన్న ఆలోచన నుంచి వచ్చిందే ఇది అని అన్నారు. 26 ఏళ్లుగా న్యూయార్క్లోనే నివశిస్తున్న గుర్జీత్ సింగ్కి ప్రతి ఏడాది భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగర జ్ఞాపకం ఉండేలా ఇలా ఆ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఇంటిపై ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఈ నిర్మాణం స్థానిక ఆకర్షణగా మారింది. ఇది ఒకరకంగా విదేశీ జీవితానికి, స్వదేశంలోని తన మూలాలకు ఒక వ్యక్తిగత వారధిని నిర్మించినట్లు కనిపిస్తోంది ఆ కట్టడం. నెటిజన్లు కూడా పంజాబ్లోని ఓ చిన్న సైజ్ న్యూయార్క్ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. VIDEO | Punjab: Gurjeet Singh Matharu, an NRI living in New York for 26 years, has installed a Statue of Liberty replica on the fourth floor of his home in Jalandhar’s Kishanpura area, drawing visitors from nearby and far away.He said the idea came from seeing the Statue of… pic.twitter.com/7PkZaTzJFO— Press Trust of India (@PTI_News) March 21, 2026 (చదవండి: పైలట్ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఏంటో తెలుసా ..!)
టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ
జపాన్లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు. ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
క్రైమ్
పోలీసుస్టేషన్కు వచ్చిన నాగుపాము
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం పోలీస్స్టేషన్లో నాగుపాము హల్చల్ చేసింది. ఎస్సై నరేందర్రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎస్సై సోమవారం పోలీసుస్టేషన్లోని తన గదిలో ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్నాడు. ఎస్సై సీటు వెనుక ఉన్న కిటకిలోంచి గదిలోకి నాగుపాము ప్రవేశిస్తున్న క్రమంలో ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి పాము అని గట్టిగా అరిచాడు. ఎస్సై వెంటనే తన సీటు ముందున్న టేబుల్ పైనుంచి దూకడంతో ప్రమాదం తప్పింది. స్నేక్ క్యాచర్ పోచయ్యను పిలిపించి, పామును పట్టుకున్నారు. మూడు రోజులుగా పోలీస్స్టేషన్ అవరణలో పాము తిరుగుతున్నట్లు తెలిపారు.
పోలీసులారా.. ఇదేం పని?
బెంగళూరు: పోలీసులు ఏమైనా చేయగలరు. నిజమైన నేరాలపై విచారణ చేయకుండా ప్రజలను తిప్పించుకుంటారు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓ కేసులో పోలీసుల తీరును తప్పబట్టారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా ఎంకె దొడ్డి పోలీసుస్టేషన్ పరిధిలో 2024లో రెండు పశువులు అదృశ్యమయ్యాయి. రెండేళ్ల తరువాత పశువుల సొంతదారు పక్కింటి వ్యక్తి సహా నలుగురిపై కేసు పెట్టాడు. తమకు సంబంధమే లేదని, ఈ కేసును కొట్టేయాలని మంగళమ్మ అనే నిందితురాలు హైకోర్టులో అర్జీ దాఖలు చేసింది. రెండేళ్ల తరువాత పొరుగింటివారిపై ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. కనీస విచారణ జరపలేదని, ఇది చట్ట ఉల్లంఘన అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పశువులను వెతకటం మానేసి, సమాజంలో జరుగుతున్న తీవ్రమైన, నిజమైన నేరాల వెంటపడాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు మళ్లీ తమ దృష్టికి వస్తే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు.
అందుకే కిరణ్కు నిప్పంటించా!
ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని వెస్ట్రన్ స్టయిల్లో ప్రపోజ్ చేస్తానంటూ కుర్చీకి కట్టేసి మరీ తగలబెట్టి చంపేసింది ఓ ప్రియురాలు. ఈ కేసు దేశవ్యాప్తంగా.. అందునా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో వివాహానికి కిరణ్ ఒప్పుకున్నాడని నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ చెబుతోంది.బెంగళూరులో ప్రియున్ని తన ఇంట్లో కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ నెమ్మదిగా నిజాలు బయటపెడుతోంది. కిరణ్ను తాను చాలా ప్రేమించేదాన్నని, అయితే అతడు మాత్రం శారీరక అవసరాలు తీర్చే వస్తువుగా తనను భావించేవాడని అంటోంది.వారం కిందట(21 ఏప్రిల్) బెంగళూరు శివారులోని బైదరహళ్లి పీఎస్ పరిధిలోని అంజనానగర్లో ఈ దారుణం జరిగింది. తుమకూరుకు చెందిన కిరణ్.. నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ(ప్రేరణ)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత.. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాంట్, షర్ట్ ఊడదీసి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం కాళ్లు, చేతులూ కట్టేసింది.ఆ సమయంలో కిరణ్ కంగారుపడ్డాడు. అయితే.. పాశ్చాత్య దేశాల్లో ఇలాగే చేస్తారని, తానూ అలా వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని (Love Proposal) నమ్మించింది. ఆ వెంటనే కిరోసిన్ పోసి నిప్పటించి తన మొబైల్లో రికార్డు చేసింది. స్థానికులు వచ్చేలోపే హాహాకారాలు చేస్తూ కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూమ్లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె తీరుపై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.నార్త్వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ నేతృత్వంలోని టీం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించింది. తొలుత దూరం పెడుతున్నాడనే అతన్ని హత్య చేసిందని అంతా భావించారు. అయితే.. ‘‘కిరణ్ను తాను ఎంతో ప్రేమించానని.. కానీ, అతను తనను ఎంతో అవమానించేవాడని ప్రేమ పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. ‘కిరణ్ నన్ను శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నాడన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. పెళ్లి చేసుకుందామని అడిగా. ‘నువ్వు కులం తక్కువదానివి.. మా ఇంట్లో ఒప్పుకోరు’ అనేవాడు. ఈ విషయం ప్రేమించినప్పుడు.. కలిసి తిరిగినప్పుడు తెలియదా? అని గట్టిగా నిలదీశా. దీంతో పెద్దల్ని ఒప్పించి ఎలాగోలా వివాహం చేసుకుంటానన్నాడు. అయితే.. పెళ్లి తర్వాత కూడా కేవలం శారీరక అవసరం కోసమే తనతో ఉంటానని చెప్పేవాడు. ఆ మాట నాతోనే కాదు.. అతని స్నేహితుల వద్ద చెబుతూ నన్ను బూతులు తిట్టేవాడు. ఆ విషయం అతని స్నేహితులు రికార్డ్ చేసి పంపారు. నన్ను వాడుకుంటూ నన్నే తిట్టడం, అవమానించడం ఎంతో బాధించింది. భరించలేకపోయా.. అందుకే నిప్పు పెట్టి చంపేశా’’ అని పోలీసుల ముందు ప్రేరణ కన్నీళ్లతో నిజం ఒప్పుకుంది.
మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు బీకే దిగంత్.. బెంగళూరు మెట్రో చిక్స్ అనే ఇన్స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు.
వీడియోలు
ఊహించని వివాదాల్లో చిక్కుకుంటున్న ముద్దుగుమ్మలు
టీడీపీ హనీ ట్రాప్ సీక్రెట్స్ మొత్తం చెప్పేసిన రంగమ్మ
కొరత లేదు.. కానీ ప్రజలు భయంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు
తుఫాన్ ను అరచేత్తో ఆపే సత్తా ఉన్న నువ్వు... డీజిల్ కొరతను నివారించలేవా?
చంద్రబాబు కాదు.. చేతకాని బాబు బాబుపై మహిళల ఉగ్రరూపం
మే వరకు టైం ఇవ్వు .. డబ్బులు వెనక్కి తిరిగి ఇస్తానన్న అషు రెడ్డి
ఆటోను ఎడ్లబండిపై ఎక్కించి వైఎస్సార్సీపీ వినూత్న నిరసన
మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు..! ప్రభుత్వంపై హరీష్ ఫైర్
శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కోసం 5 కోట్ల...?
హైకోర్టు మెట్లెక్కిన అషు రెడ్డి



