ఓజీ-2కు బ్రేక్.. సుజీత్ ప్లాన్ మారింది
దర్శకుడు సుజీత్ తదుపరి ప్రాజెక్ట్ విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పవన్ కల్యాణ్తో తెరకెక్కనున్న ఓజీ-2 కంటే ముందుగా నాని హీరోగా రూపొందనున్న 'బ్లడీ రోమియో' చిత్రాన్నే సుజీత్ ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.ఓజీ-2 ప్రకటన వెలువడిన తర్వాత నాని-సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్ వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా సుజీత్ కూడా ఓజీ-2 ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టడం, లొకేషన్ల పరిశీలన చేపట్టడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.అయితే తాజా పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. నాని ప్రస్తుతం చేస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో, తదుపరి ప్రాజెక్ట్గా 'బ్లడీ రోమియో'ను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం నాని తన కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.అక్టోబర్ నుంచి 'బ్లడీ రోమియో' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ను ఢిల్లీలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనంతరం లండన్లో కీలకమైన, భారీ షెడ్యూల్ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత దర్శకుడు సుజీత్ పూర్తిస్థాయిలో ఓజీ-2 పనులపై దృష్టి సారించనున్నాడు.
ట్రెండింగ్లో ఉదయ్నిధి.. భార్య కృతికా, పిల్లలను చూశారా? (ఫొటోలు)
అందుకే రూ.11 లక్షల ఉద్యోగానికి గుడ్బై!
మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేయడం అంటే పెద్ద సాహసమే. కానీ కొన్నిసార్లు ఉద్యోగం కంటే.. సొంత వ్యాపారమే ఎక్కువ సంతృప్తిని, మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అలాంటి ఓ యువకుడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఎక్స్(X)లో అంకిత్ పాండే అనే వ్యక్తి తన స్నేహితుడి గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులో ఏడాదికి రూ.11 లక్షల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అతని స్నేహితుడు ప్రమోషన్స్, కార్పొరేట్ జీవితాన్ని పక్కనబెట్టి సొంత ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ తన సొంత స్థలంలోనే ఒక వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభించాడు.ప్రారంభంలో చిన్న స్థాయిలోనే మొదలైనప్పటికీ.. ప్రస్తుతం అతని వ్యాపారం బాగా విస్తరించింది. ఇప్పుడు దాదాపు 300 ఇళ్లు, దుకాణాలకు ప్రతిరోజూ తాగునీటి క్యాన్లను సరఫరా చేస్తున్నాడు. రోజుకు సుమారు 300 క్యాన్లు విక్రయిస్తుండగా, ఒక్కో క్యాన్ను రూ.30కి అమ్ముతున్నాడు.దీంతో రోజుకు దాదాపు రూ.9 వేల ఆదాయం, అంటే నెలకు సుమారు రూ.2.7 లక్షల టర్నోవర్ వస్తోంది. సొంత స్థలం కావడంతో అద్దె భారం లేదు. నీటి శుద్ధి, విద్యుత్ ఖర్చులకు నెలకు సుమారు రూ.15 వేల, రవాణాకు మరో రూ.20 వేల ఖర్చవుతోంది. ఈ ఖర్చులన్నీ తీసేసిన తర్వాత కూడా ప్రతి నెల సుమారు రూ.2.35 లక్షల లాభం మిగులుతోందని అంకిత్ పాండే తెలిపారు. అంటే ఏడాదికి దాదాపు రూ.28.5 లక్షల ఆదాయం వస్తోంది. ఇది ఆయన గతంలో కార్పొరేట్ ఉద్యోగంలో పొందిన వార్షిక జీతం కంటే రెండింతలకు పైగానే ఉంది.My friend quit his ₹11 LPA 9-to-5 job in Bengaluru.Now he earns nearly ₹28 lakh a year from his home.Instead of chasing promotions, he went back home and started a simple water purification business.He installed a water purification plant on his own property and connected… pic.twitter.com/uY3mfTd0d3— Ankit Pandey (@iamankitpande) August 3, 2026ఈ కథను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అంకిత్ పాండే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. విజయమంటే పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయడమే కాదు. ప్రజలకు ప్రతిరోజూ అవసరమయ్యే సమస్యకు పరిష్కారం చూపే వ్యాపారం కూడా అద్భుతమైన అవకాశాలను అందిస్తుందని అన్నారు. చివరగా ఎవరైనా.. ''రూ.11 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఇలాంటి వ్యాపారం చేస్తారా?'' అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.ఈ పోస్టుపై చాలామంది స్పందించారు. ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నందున, స్వచ్ఛమైన తాగునీటికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ రంగంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం ఈ కథ ఒక మంచి సందేశాన్ని ఇస్తోందని అన్నారు. ఉద్యోగ హోదా కంటే, ప్రజలకు అవసరమైన సేవను అందించే వ్యాపారం స్థిరమైన ఆదాయాన్ని అందించగలదని పేర్కొన్నారు.
‘అయ్యా.. నేను ఐఏఎస్ తుకారాం ముండేని!’
ముంబై: భారత పాలనా వ్యవస్థలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగని,అవినీతిపై రాజీలేని పోరాటం చేసే నిప్పులాంటి అధికారులకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు ఐఏఎస్ అధికారి తుకారాం ముండే. తన సుదీర్ఘ కెరీర్లో నిబంధనల అమలు విషయంలో ఎక్కడా తగ్గకపోవడం వల్ల సుమారు 25 సార్లు బదిలీలు ఎదుర్కొన్న ఈ రియల్ లైఫ్ సింగం తాజాగా మహారాష్ట్రలో మరో సంచలనానికి తెరతీశారు. ఏకంగా చట్టాన్ని రక్షించే బాంబే హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్లనే సీల్ చేయించి దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారారు.ఈ ఏడాది మే నెలలో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా తుకారాం ముండే బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవి చేపట్టడమే ఆలస్యం.. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ఆహార కల్తీ ముఠాలపై, అపరిశుభ్ర హోటళ్లపై ఉక్కుపాదం మోపారు. కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 10వేలకంటే ఎక్కువ హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులపై ముండే తన ఎఫ్డీఏ బృందాలతో మెరుపు దాడులు చేయించారు. కోట్ల విలువైన కల్తీ పాలు, నూనెలు, నిషేధిత గుట్కాలను సీజ్ చేయడమే కాకుండా, కనీస పరిశుభ్రత పాటించని వందలాది ప్రసిద్ధ సంస్థల లైసెన్స్లను కూడా తక్షణమే రద్దు చేస్తూ వస్తున్నారు.తుకారాం ముండే తీసుకుంటున్న ఈ మెరుపు చర్యలపై తీవ్రంగా నష్టపోయిన పలువురు పెద్ద పెద్ద వ్యాపారస్థులు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ధర్మాసనం ఎఫ్డీఏ తీరును ప్రశ్నిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. మీరు కేవలం ప్రైవేట్ హోటళ్లు, రెస్టారెంట్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్యాంటీన్లలో కూడా ఇలాగే తనిఖీలు చేస్తున్నారా? చట్టం అందరికీ సమానంగా వర్తించాలి’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.కోర్టు అడిగిన ప్రశ్నకు స్పందనగా, మరుసటి రోజే మహారాష్ట్ర ఎఫ్డీఏ అధికారుల బృందం బాంబే హైకోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించింది. అప్పటికే బాంబే బార్ అసోసియేషన్ తమ ప్రధాన క్యాంటీన్ను స్వచ్ఛందంగా మూసివేసినప్పటికీ, ఎఫ్డీఏ తనిఖీలలో ఆ క్యాంటీన్కు చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ (FSSAI) లేదని వెల్లడైంది. దీనితో నిబంధనల ప్రకారం అధికారులు ఆ క్యాంటీన్కు 'స్టాప్ బిజినెస్' (వ్యాపార నిలిపివేత) నోటీసులు జారీ చేసి, లీగల్గా సీల్ వేశారు.చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపిస్తూ, సరైన లైసెన్స్ , పరిశుభ్రత ప్రమాణాలు పాటించని కారణంగా హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్పై ఈ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. దీనితో పాటు, మహారాష్ట్ర సచివాలయ (మంత్రాలయ) పరిధిలోని ప్రభుత్వ క్యాంటీన్లలో కూడా ఎఫ్డీఏ బృందాలు దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాటికి నోటీసులు జారీ చేసి మూసివేయించాయి.ప్రభుత్వ వ్యవస్థలను సైతం వదలకుండా తుకారాం ముండే తీసుకున్న ఈ మెరుపు నిర్ణయంపై సోషల్ మీడియాలో సామాన్య ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసి 57 సార్లు ట్రాన్స్ఫర్లయిన ఐఏఎస్ అశోక్ ఖేమ్కా నిజమైన వారసుడు తుకారాం ముండే అంటూ మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆయనను కీర్తిస్తున్నారు. ఐఏఎస్ అధికారి తుకారాం ముండే తన 21 ఏళ్ల సర్వీసులో రికార్డు స్థాయిలో మొత్తం 25 సార్లు బదిలీ అయ్యారు.ఆయన 2005 బ్యాంచ్ మహారాష్ట్ర కేడర్ అధికారి. అవినీతిపై రాజీలేని పోరాటం చేయడం, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లే ఆయనకు సగటున ఏడాదికి ఒకసారి కంటే ఎక్కువగానే బదిలీలు జరిగాయి.మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా ఆయనకు దక్కిన బాధ్యత ఆయన కెరీర్లో 25వ పోస్టింగ్.
ఎల్ఐసీ ఆఫర్ సక్సెస్
శాస్త్రీయ శోధనే విశ్వాసానికి పరీక్ష
ఎయిర్టెల్ లాభాల డేటా
మహేష్గౌడ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: హరీష్రావు
ఓజీ-2కు బ్రేక్.. సుజీత్ ప్లాన్ మారింది
సీఎం ప్రజావాణిలో కొత్తగా మీ-సేవా కేంద్రం ఏర్పాటు
ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం
హిందీ మూవీతో రావత్ ఎంట్రీ.. చివరి సినిమా ఇదే..!
సినీ పరిశ్రమలో విషాదం.. ఛత్రపతి విలన్ కన్నుమూత
అందుకే రూ.11 లక్షల ఉద్యోగానికి గుడ్బై!
నెలకు రూ.40 లక్షల భరణం.. అందుకే మేం కోర్టుకెళ్లాం
గోడౌన్ కాద్సార్! ఫిర్యాదుల రూం!
ఇక్కడి పరిశ్రమలను సార్ ఇతర రాష్ట్రాలకు పంపి దేశవ్యాప్తంగా ‘‘సంపద సృష్టిస్తున్నారు’’
లక్షాధికారిని చేసే SBI స్కీమ్..
UPI వాడకం ఆపేశా.. దెబ్బకు నా దశ తిరిగింది
ఈ పాము కనపడితే.. వేగంగా పరిగెత్తినా తప్పించుకోలేరు..
‘దేవి’గా శోభిత.. అదరహో అదితిరావ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
'త్రిషకు సారీ చెప్పాలి.. మరి సంస్కారం ఆయనకు ఉందో లేదో'
జెన్ జీకి తొలి వికెట్.. ‘వైరస్’ అన్న నబీన్కు ఓటుతో బదులు
ఇదీ మన మధ్యతరగతి పిల్లల పరిస్థితి
'నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు'
నో రన్నింగ్, నో కార్డియో..! జస్ట్ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..
ఉదయ్నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్కాంత్
షాకిచ్చిన సూర్య-జ్యోతిక.. ఏఐ కాదు నిజమే
టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?
అభిజీత్ దీప్కే అరెస్ట్కు రంగం సిద్ధం?
ఈ రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
గట్టెక్కిన శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని దాటి 92.04 టీఎంసీలకు చేరిక
ఎల్ఐసీ ఆఫర్ సక్సెస్
శాస్త్రీయ శోధనే విశ్వాసానికి పరీక్ష
ఎయిర్టెల్ లాభాల డేటా
మహేష్గౌడ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: హరీష్రావు
ఓజీ-2కు బ్రేక్.. సుజీత్ ప్లాన్ మారింది
సీఎం ప్రజావాణిలో కొత్తగా మీ-సేవా కేంద్రం ఏర్పాటు
ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం
హిందీ మూవీతో రావత్ ఎంట్రీ.. చివరి సినిమా ఇదే..!
సినీ పరిశ్రమలో విషాదం.. ఛత్రపతి విలన్ కన్నుమూత
అందుకే రూ.11 లక్షల ఉద్యోగానికి గుడ్బై!
నెలకు రూ.40 లక్షల భరణం.. అందుకే మేం కోర్టుకెళ్లాం
గోడౌన్ కాద్సార్! ఫిర్యాదుల రూం!
ఇక్కడి పరిశ్రమలను సార్ ఇతర రాష్ట్రాలకు పంపి దేశవ్యాప్తంగా ‘‘సంపద సృష్టిస్తున్నారు’’
లక్షాధికారిని చేసే SBI స్కీమ్..
UPI వాడకం ఆపేశా.. దెబ్బకు నా దశ తిరిగింది
ఈ పాము కనపడితే.. వేగంగా పరిగెత్తినా తప్పించుకోలేరు..
‘దేవి’గా శోభిత.. అదరహో అదితిరావ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
'త్రిషకు సారీ చెప్పాలి.. మరి సంస్కారం ఆయనకు ఉందో లేదో'
జెన్ జీకి తొలి వికెట్.. ‘వైరస్’ అన్న నబీన్కు ఓటుతో బదులు
ఇదీ మన మధ్యతరగతి పిల్లల పరిస్థితి
'నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు'
నో రన్నింగ్, నో కార్డియో..! జస్ట్ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..
ఉదయ్నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్కాంత్
షాకిచ్చిన సూర్య-జ్యోతిక.. ఏఐ కాదు నిజమే
టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?
అభిజీత్ దీప్కే అరెస్ట్కు రంగం సిద్ధం?
ఈ రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
గట్టెక్కిన శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని దాటి 92.04 టీఎంసీలకు చేరిక
ఫొటోలు
పెద్ది భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ పిక్స్ (ఫొటోలు)
బ్లూ శారీలో హీరోయిన్ అపర్ణ దాస్ బ్యూటీఫుల్ లుక్స్.. ఫోటోలు
సింహాచలం ఆలయంలో సింగర్ మంగ్లీ ప్రత్యేక పూజలు (ఫొటోలు)
వయసుతో పాటు అందమూ పెరుగుతోంది! (ఫొటోలు)
ట్రెండింగ్లో ఉదయ్నిధి.. భార్య కృతికా, పిల్లలను చూశారా? (ఫొటోలు)
హంసలా మెరిసిపోతూ సింగర్ శ్రేయాఘోషల్ (ఫొటోలు)
తెలంగాణ : మంచిర్యాలలో సందడి చేసిన సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)
మాళవిక బర్త్ డే.. అందం ఉంది కానీ అదృష్టమే! (ఫొటోలు)
'అగధ' సినిమా ట్రైలర్ ఆవిష్కరణ ఈవెంట్ (ఫొటోలు)
చూడచక్కని చిన్నది యుక్తి తరేజా (ఫొటోలు)
సినిమా
హిందీ మూవీతో రావత్ ఎంట్రీ.. చివరి సినిమా ఇదే..!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతితో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగులోనే ఎక్కువగా ఫేమస్..హిందీ మూవీ బాఘితో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. ఈ సినిమాలో భిక్షు దాస్ పాత్రలో కనిపించారు. ఇదే ఆయన చివరి సినిమా కావడం విశేషం.
సినీ పరిశ్రమలో విషాదం.. ఛత్రపతి విలన్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్(74) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన క్యాన్సర్తోనూ పోరాడుతున్నారు. చివరికీ ఇవాళ ఇలా కన్నుమూశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జనవరి 21, 1952లో జన్మించిన ప్రదీప్ రావత్.. సినీ ఇండస్ట్రీలో విలన్గా మెప్పించారు. కామెడీ పాత్రలతో పాటు విలన్గానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్లో నితిన్ హీరోగా వచ్చిన సై మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాస్ ఛత్రపతిలో రాజ్ బిహారి పాత్రలో విలన్గా ఆకట్టుకున్నారు. అంతే కాకుండా సూర్య హీరోగా వచ్చిన గజిని మూవీలో విలన్గా రాణించారు. ఈ ఏడాదిలో ఇటీవలే రిలీజైన గాయపడ్డ సింహం చిత్రంలో చివరిసారిగా కనిపించారు.బాఘీతో ఎంట్రీ..హిందీలో బాఘీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో ప్రతినాయక సహాయ పాత్రలతో మరింత గుర్తింపు పొందారు. బి.ఆర్. చోప్రా తెరకెక్కించిన ప్రసిద్ధ టీవీ ధారావాహిక మహాభారత్లో అశ్వత్థామ పాత్ర పోషించారు. సై సినిమాకు విలన్గా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. తెలుగులో లక్ష్మీ, స్టాలిన్, నాయక్, 1: నేనొక్కడినే', సరైనోడు, భద్ర, యోగి, దేశముదురు, అందరివాడు, స్టాలిన్, లగాన్, గజిని లాంటి చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, వీర, అల్లుడు శీను, లయన్, రగడ, బలాదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో మెప్పించారు.
త్రిషపై వివాదాస్పద కామెంట్స్.. నెట్టింట పాత వీడియోలు ట్రెండింగ్..!
కోలీవుడ్లో త్రిష పేరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేయగా బెయిల్పై విడుదలయ్యారు. ఇదే ఇప్పుడు కోలీవుడ్తో పాటు తమిళనాడు షేక్ చేస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో పాత వీడియోలు, ఫోటోలు వైరల్గా మారాయి. రాజకీయాల్లోకి రాకముందు విజయ్, ఉదయ్నిధి స్టాలిన్ పలు వేదికలపై మెరిశారు. పలు సినిమా సక్సెస్ ఈవెంట్లకు హాజరయ్యారు. ఈ వివాదం నేపథ్యంలో గతంలో విజయ్తో ఉన్న స్టాలిన్ ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.2008లో వచ్చిన 'కురువి' చిత్రంలో విజయ్, త్రిష జంటగా నటించారు. ఈ మూవీ ఆడియో రిలీజ్తో పాటు150 రోజుల విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విజయ్, స్టాలిన్, త్రిష ఓకే వేదికపై సందడి చేశారు. దీనికి సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. అప్పట్లో ముగ్గురూ ఒకే వేదికపై ఉన్న వీళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే ట్రెండింగ్ టాపిక్. కాగా.. కురువి చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీకి నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించారు. ఈ సినిమాలో భాగమైనందుకు విజయ్, త్రిషలకు ఉదయనిధి కృతజ్ఞతలు తెలిపారు. కథానాయికగా ఎంపికైనందుకు త్రిషకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పట్లో ఓకే వేదికపై విజయ్, త్రిష, ఉదయనిధిల మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది.Flop aaana #Kuruvi padathuku 150th day success meet celebrate Pannala unaku aaavanumdaa 😹 #Udhayanithi #ThalapathyVijay pic.twitter.com/K1oi5eCJuI— Ãśhïķ (@the_real_ashik) August 4, 2026
టాలీవుడ్ టికెట్ల పంచాయితీ.. ఫిల్మ్ ఛాంబర్ షాకింగ్ నిర్ణయం
టాలీవుడ్లో సినిమా టికెట్ల పంచాయితీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రేట్లు, పర్సంటేజ్ విషయంలో వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని ఆశించారు. కానీ తాజాగా ఆ కమిటీని ఫిల్మ్ ఛాంబర్ రద్దు చేసింది. దీంతో ఈ వివాదం మళ్లీ మొదటికొచ్చింది.తాజాగా నిర్మాత కె ఎల్ నారాయణ అధ్యక్షతన మరో 9 మందితో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. టికెట్ రేట్లు , పర్సెంటేజ్ విధి విధానాలపై చర్చించిన ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది. పాత కమిటీని పూర్తిగా రద్దు చేసిన ఫిల్మ్ ఛాంబర్.. కమిటీ రిపోర్ట్కు ఎలాంటి కాల పరిమితి లేదని ప్రకటించింది. ఈ కొత్త కమిటీతోనైనా ఈ వివాదానికి పరిష్కారం లభిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
క్రీడలు
CWG 2026: పాకిస్థాన్ బాక్సర్ మిస్సింగ్
కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ బాక్సర్ కుద్రతుల్లా (Qudratullah) మిస్ అయినట్లు తెలుస్తోంది. పోటీలు ముగిసిన అనంతరం టీమ్ హోటల్ నుంచి వెళ్లిన అతడు అదృశ్యమైనట్లు సమాచారం. అతని పాస్పోర్ట్ కూడా టీమ్ మేనేజర్ వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే తొలిసారి కాదుఅంతర్జాతీయ టోర్నీల సమయంలో పాకిస్థాన్ బాక్సర్లు అదృశ్యమైన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ బర్మింగ్హామ్లో అదృశ్యమయ్యారు. అప్పట్లోనూ వారి పాస్పోర్టులు మేనేజర్ వద్దే ఉన్నట్లు సమాచారం.2024లో ఇటలీలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ సందర్భంగా ఆసియా గోల్డ్ మెడలిస్ట్ బాక్సర్ జోహైబ్ రషీద్ (పాక్) తన రూమ్మేట్కు చెందిన విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులను తీసుకుని బస్టో అర్సిజియో పట్టణంలో అదృశ్యమైనట్లు ఆరోపణలు వచ్చాయి.ఒక్క పతకంతో సరిపెట్టుకున్న పాక్కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాక్కు ఒకే ఒక పతకం లభించింది. ఈ పోటీల్లో మొత్తం 36 మంది సభ్యులు పాల్గొనగా..మహిళల బాక్సింగ్లో ఫాతిమా జెహ్రా కాంస్య పతకాన్ని సాధించింది.
బీసీసీఐ పెన్షన్ ఎంత.. ఎవరెవరికి వస్తుంది..?
అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ మాజీ క్రికెటర్లకు అందించే పెన్షన్ పథకం మరోసారి చర్చలోకి వచ్చింది. 2004లో ప్రారంభమైన ఈ పథకంలో సుమారు 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, ఇతర అధికారులు ప్రయోజనం పొందుతున్నట్లు సమాచారం.మొదటల్లో కనీసం ఒక టెస్టు మ్యాచ్ ఆడిన మాజీ క్రికెటర్లకు నెలకు రూ.5,000 పెన్షన్ అందించేవారు. 2022లో బీసీసీఐ పెన్షన్ మొత్తాలను భారీగా పెంచింది. దీంతో సుమారు 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, అధికారులు లబ్ది పొందారు.ప్రస్తుతం క్రికెటర్ల నెల పెన్షన్ ఎంత..?25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన పురుష క్రికెటర్లు- రూ.70,000ఇతర మాజీ పురుష టెస్టు క్రికెటర్లు- రూ.60,000మాజీ మహిళా అంతర్జాతీయ క్రికెటర్లు- రూ.52,5002003కు ముందు రిటైరైన ఫస్ట్క్లాస్ క్రికెటర్లు- రూ.45,000ఇతర మాజీ ఫస్ట్క్లాస్ క్రికెటర్లు- రూ.30,000జీవితాంతం వస్తుందా..?అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, పెన్షన్ సాధారణంగా శాశ్వతంగా రద్దు కాదు. అయితే మాజీ క్రికెటర్ లేదా అధికారి బీసీసీఐ లేదా రాష్ట్ర క్రికెట్ సంఘంలో జీతభత్యాలు తీసుకునే పదవిలో చేరితే, ఉదాహరణకు కోచ్, సెలెక్టర్, అడ్మినిస్ట్రేటర్ వంటి బాధ్యతలు చేపడితే, పెన్షన్ చెల్లింపులో తాత్కాలిక విరామం ఉండవచ్చు.పెన్షన్ పొందుతున్న ప్రముఖ క్రికెటర్లు..?పెన్షన్ పొందుతున్న మాజీ క్రికెటర్ల జాబితాను బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. అయితే అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, పెన్షన్ అర్హత ఉన్న ప్రముఖ మాజీ క్రికెటర్లలో ప్రస్తుతం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి వారు ఉంటారు.అజింక్య రహానేకు ఎంత..?రహానే భారత్ తరఫున 85 టెస్టులు ఆడాడు. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అత్యధిక రూ.70,000 నెలవారీ పెన్షన్ బ్రాకెట్కు అర్హత పొందుతాడు.
నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ చానాళ్ల క్రితమే జట్టుకు దూరమయ్యాడు. అయితే 2023 వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం బారిన పడిన షమీ మళ్లీ తిరిగి జట్టులోకి రాలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న షమీ ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో రాణించినప్పటికీ సెలెక్టర్ల నుంచి పిలుపు మాత్రం రాలేదు. తాజాగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో జట్టులో యువ బౌలర్లకే ఎక్కువ అవకాశం ఉంటుందని, వయసు మీద పడిన క్రికెటర్లకు తాము అవకాశాలు ఇవ్వబోమని బాంబు పేల్చాడు. అంతేకాదు షమీ లాంటి సీనియర్ బౌలర్ల సేవలను తాము గుర్తుంచుకుంటామని, వారు చాలా సార్లు జట్టుకు విజయాలు అందించారని తెలిపారు. అగార్కర్ వ్యాఖ్యలు షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్ ఆటగాళ్లకు పరోక్షంగా రిటైరవ్వాలని హింట్ ఇచ్చినట్లుగా అనిపించింది. దీంతో షమీ అంతర్జాతీయ కెరీర్కు దాదాపు ఎండ్కార్డ్ పడినట్లే. ఇటీవలే ఒక మీడియా చానెల్కు షమీ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా మీ ఫెవరెట్ కోచ్ ఎవరు అని ప్రశ్న వేశారు. దీనిపై షమీ స్పందిస్తూ.. ‘ఎవరు బెస్ట్ కోచ్ అనేది పోల్చడం చాలా కష్టం. అయితే నేను గంభీర్ సారథ్యంలో టీమిండియాకు పెద్దగా మ్యాచ్లు ఆడలేదు. ఇక రాహుల్ బాయ్, అనిల్ బాయ్, రవిశాస్త్రిల హయాంలో మంచి క్రికెట్ ఆడాను. కానీ ఈ నలుగురిలో ఒకరిని ఎంపిక చేసుకోమంటే మాత్రం నేను రవిశాస్త్రి బాయ్ నా మొదటి ప్రాధాన్యత. అతడు కోచ్గా ఉన్న సమయంలో నేను స్వేచ్ఛగా ఆడానన్న ఫీలింగ్ వచ్చేది. అంతేకాదు రవి భాయ్ అగ్రెసివ్ ఎంతలా ఉండేదంటే ప్రతీ మ్యాచ్ మేము గెలవడానికే ఆడుతున్నామా అన్నట్లుగా ఉండేది. రవిశాస్త్రి కోచింగ్ను బాగా ఎంజాయ్ చేసేవాడిని’ అని షమీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఆ తర్వాత 2023 వన్డే ప్రపంచకప్లో భారత ప్రదర్శనను మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘‘2023 వన్డే ప్రపంచకప్ నాకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. కానీ నా మైండ్లో కప్ గెలవలేదన్న బాధ మాత్రం అలాగే ఉండిపోయింది. ‘అతను ఇన్ని మ్యాచ్లు ఆడాడు, ఇన్ని వికెట్లు తీశాడు’ అని చూపిస్తూ ఒక రీల్ నా ముందు వచ్చినప్పుడు, నేను ఐసీసీ ఈవెంట్లలో ఆడలేకపోయిన మ్యాచ్లు నా మనసులోకి వస్తాయి. ఇన్నేళ్ల కెరీర్లో ఐసీసీ మెగా టోర్నీల్లో నేను మూడు, నాలుగు లేదా ఐదు మ్యాచ్లు ఆడలేకపోయాను. ఒకవేళ నేను ఇవి ఆడి ఉంటే, ఇవాళ అగ్రస్థానంలో ఉండేవాడిని." అని షమీ చెప్పుకొచ్చాడు.ఇక షమీ తన కెరీర్లోనే అత్యున్నత ప్రదర్శన 2023 వన్డే వరల్డ్కప్లో నమోదు చేశాడు. ఆ టోర్నీలో 24 వికెట్లు తీసిన షమీ వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఏ ఎడిషన్కైనా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులకెక్కాడు. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో టీమిండియా రన్నరప్కే పరిమితమైంది.
‘ఫుడ్ పాయిజన్.. లేదంటే స్వర్ణం గెలిచేవాడిని’
భారత ట్రిపుల్ జంపర్ సెల్వ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అనారోగ్యం బారిన పడకపోయి ఉంటే కామన్వెల్త్ గేమ్స్-2026లో స్వర్ణం గెలిచేవాడినన్నాడు. కాగా తాజాగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో సెల్వ ప్రభు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.గ్లాస్గో వేదికగా ట్రిపుల్ జంప్ మెన్స్ ఫైనల్లో అత్యుత్తమంగా 16.52 మీటర్లు దూకిన సెల్వ ప్రభు మూడో స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన ప్రవీణ్ చిత్రావల్ 16.58 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఇక ఈ విభాగంలో స్కాట్లాండ్ అథ్లెట్ జోర్డాన్ స్కాట్ (16.72 మీటర్లు) పసిడి పతకాన్ని ముద్దాడాడు.ఫుడ్ పాయిజనింగ్ ఈ నేపథ్యంలో సెల్వ ప్రభు పీటీఐతో మాట్లాడుతూ.. పోటీకి ముందు తనకు ఎదురైన చేదు అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు. ‘‘నిజంగా నేను స్వర్ణ పతకం గెలవాలని పట్టుదలగా ఉన్నాను. పోటీ మొదలైనపుడు కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాను. కానీ అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాను.ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇక అంతా అయిపోయిందనే అనుకునే తరుణం. కానీ నేను మానసికంగా చాలా బలవంతుడిని. ఏం జరిగినా మన మంచికే అని ముందుకు సాగాను. అనుకున్నది సాధించగలననే ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాను.నేను ఆరోగ్యంగా ఉండి ఉంటే పసిడి పతకం గెలిచేవాడినే. అయితే, ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఫిట్నెస్పై మరింత దృష్టి పెట్టాలి. ఒక్కసారి నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాని కోసం ఎంతటి కష్టాన్నైనా ఆనందంగా స్వీకరిస్తా.ప్రతి రోజూ మనకొక సవాలేప్రతి ఉదయం సరికొత్తగా మొదలవుతుంది. ప్రతి రోజూ మనకొక సవాలే. ప్రదర్శన రోజురోజుకీ మెరుగుపరచుకోవాలి. అలా అయితే గోల్డ్ గెలవాలన్న లక్ష్యం నెరవేరుతుంది. ఆసియా క్రీడలకు అర్హత సాధించడమే నా ముందున్న తక్షణ లక్ష్యం’’ అని తమిళనాడు అథ్లెట్ సెల్వ ప్రభు చెప్పుకొచ్చాడు. చదవండి: రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్
న్యూస్ పాడ్కాస్ట్
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ కుంభకోణంపై జెన్జీ వార్...
ఏపీలో డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే...
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అక్రమాలపై విచారణ. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రెండేళ్ల బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం... ‘కాగ్’ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం
ప్రశ్నపత్రాల లీకేజీ దోషులకు పదేళ్ల జైలుశిక్ష.. పది కోట్ల రూపాయల జరిమానా... ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
బిజినెస్
E20 పెట్రోల్ సేఫేనా?.. 87 వేల పెట్రోల్ బంకుల్లో తనిఖీలు!
ఇథనాల్ కలిపిన పెట్రోల్ నాణ్యత, కల్తీ అయ్యే అవకాశంపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇంధనంలో కల్తీ లేదా నాణ్యత లోపాలు ఉన్నాయన్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశవ్యాప్తంగా కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ప్రజలకు అందించే పెట్రోల్ నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి దశలో పరీక్షలు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. సాధారణ తనిఖీలతో పాటు.. ఎలాంటి కల్తీ జరగకుండా అదనపు పరీక్షలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించింది.దేశవ్యాప్తంగా ఉన్న 87 వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో.. రోజుకు 8 నుంచి 12 సార్లు నీటి కలయిక ఉందా.. లేదా?, అనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. పెట్రోల్లో కలుషితాలు ఉన్నాయా?, లేదా? అని తెలుసుకోవడానికి 2 వేలకు పైగా ఇంధన నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేవలం రెండు చోట్ల మాత్రమే క్లోరైడ్ కలుషిత సమస్యలు బయటపడగా, వెంటనే ఆ పెట్రోల్ బంకుల్లో విక్రయాలను నిలిపివేసినట్లు కూడా కేంద్రం వెల్లడించింది.తనిఖీలు ఇలా..ఈ20 పెట్రోల్ నాణ్యత అనేది వాహనం ట్యాంక్కు చేరిన తర్వాత మాత్రమే పరిశీలించేది కాదని కేంద్రం తెలిపింది. ఇథనాల్ తయారీ దశ నుంచే నాణ్యత తనిఖీలు ప్రారంభమవుతాయని పేర్కొంది.ముందు ఇథనాల్ నాణ్యతను పరిశీలిస్తారు. డిస్టిలరీల నుంచి వచ్చే ప్రతి బ్యాచ్ ఎథనాల్ BIS ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దాని స్వచ్ఛత కనీసం 99.6 శాతం ఉండటం తప్పనిసరి. ఇథనాల్ను ఆయిల్ కంపెనీల డిపోలకు పంపే సమయంలో నాణ్యత ధ్రువీకరణ పత్రం కూడా అందజేస్తారు.నాణ్యత ప్రమాణాలు పాటించని ఇథనాల్ను.. సరఫరా వ్యవస్థలోకి అనుమతించడం లేదని ప్రభుత్వం తెలిపింది. 2024 జూలై నుంచి 2026 జూన్ మధ్య కాలంలో 302 ట్యాంకర్లలో వచ్చిన దాదాపు 10,500 కిలోలీటర్ల ఇథనాల్ను ప్రమాణాలు సరిపోకపోవడంతో తిరస్కరించారు. ఇందులో స్వచ్ఛత, నీటి శాతం, సాంద్రత వంటి అంశాల్లో లోపాలను గుర్తించారు.ఇథనాల్ నిల్వ, రవాణా సమయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర పదార్థాలతో కలవకుండా.. ప్రత్యేక నిల్వ కేంద్రాల్లో ఉంచుతున్నారు. డిపోలకు చేరిన ప్రతి ట్యాంకర్ నుంచి పైభాగం, కింది భాగం నుంచి నమూనాలు తీసుకుని పరీక్షించిన తర్వాతే ఆమోదిస్తున్నారు.Certain media reports have cited issues of fuel adulteration or contamination. It is hereby clarified that fuel quality is monitored on a regular basis by Oil Marketing Companies. In addition to the advanced and elaborate testing protocols already in place, further checks have… pic.twitter.com/o0fnrnXrCM— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) August 4, 2026
అతిపెద్ద మార్కెట్ క్రాష్ వస్తుందా?.. కియోసాకి చెప్పేది నిజమేనా?
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో చరిత్రలోనే అతిపెద్ద మార్కెట్ క్రాష్ వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీంతో పెట్టుబడిదారుల్లో మరోసారి చర్చ మొదలైంది.ప్రస్తుతం కియోసాకి హెచ్చరిక కంటే.. ఆయన గతంలో చేసిన అంచనాలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. గత కొన్నేళ్లుగా కియోసాకి మార్కెట్ పతనం గురించి పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వాటిలో చాలా వరకు నిజం కాలేదు.ఉదాహరణకు, 2023 నాటికి బిట్కాయిన్ 75 వేల డాలర్లకు చేరుతుందని, 2024 ఆగస్టులో 3.5 లక్షల డాలర్లకు వెళ్తుందని, 2025 చివరికి 5 లక్షల డాలర్లను తాకుతుందని ఆయన అంచనా వేశారు. అయితే ఆ గడువుల్లో ఆ లక్ష్యాలు నెరవేరలేదు.స్టాక్ మార్కెట్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. 2018లో 'చరిత్రలోనే అతిపెద్ద మార్కెట్ పతనం వస్తోంది' అని చెప్పిన తర్వాత, అమెరికా ఎస్అండ్పీ 500 సూచీ దాదాపు 115 శాతం పెరిగింది. అలాగే.. కరోనా సమయంలో 'ఇప్పుడే అసలు పతనం మొదలైంది' అని వ్యాఖ్యానించినా, ఆ తర్వాత ఏడాది మార్కెట్ 50 శాతానికి పైగా లాభపడింది.2020లో అన్నీ కుప్పకూలిపోతాయి, 2021 అక్టోబర్లో భారీ క్రాష్ వస్తుంది, 2022లో ఎవరీథింగ్ బబుల్ ఎవరీథింగ్ క్రాష్గా మారుతుంది, 2024లో క్రాష్ ఇప్పటికే ప్రారంభమైంది అంటూ పలుమార్లు కియోసాకి హెచ్చరించారు. కానీ ఆయా.. సందర్భాల్లో మార్కెట్లు పెద్దగా కుప్పకూలకపోగా.. వృద్ధినే నమోదు చేశాయి.గతాన్ని పరిశీలించిన తరువాత, ఇప్పుడు ఆయన చేసిన 2026 క్రాష్ నిజమేనా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. కొందరు మాత్రం కియోసాకి అంచనాలను పూర్తిగా కొట్టిపారేయలేమని అంటున్నారు. ఎందుకంటే ఆయన తక్షణ మార్కెట్ కదలికల కంటే, అప్పుల భారం, కరెన్సీ విలువ, ఆర్థిక వ్యవస్థలోని దీర్ఘకాలిక సమస్యల గురించి హెచ్చరిస్తుంటారని వారి వాదన. మరోవైపు.. విమర్శకులు మాత్రం గత రికార్డును చూపిస్తూ ఆయన అంచనాలను జాగ్రత్తగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.నిజానికి.. మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే.. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, యుద్ధాలు, ప్రభుత్వ విధానాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అనేక అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అందుకే.. ఒక్కరి అంచనాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం కంటే, పూర్తి సమాచారం సేకరించి, దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రూ.28 వేల కోట్ల సబ్సిడీ.. 50 లక్షల కుటుంబాలకు లబ్ది!అందువల్ల, 2026లో నిజంగానే అతిపెద్ద మార్కెట్ క్రాష్ వస్తుందా? అనే ప్రశ్నకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం లేదు. ఇది కేవలం కియోసాకి వ్యక్తిగత అంచనా మాత్రమే. గతంలో ఆయన చేసిన అనేక అంచనాలు నిజం కాకపోవడంతో, ఈసారి కూడా పెట్టుబడిదారులు ఆశలు లేదా భయాలతో కాకుండా, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకోవడం అవసరం.Robert Kiyosaki just said the biggest crash is coming this 2026But he has a track record of predictions and every single one of them is wrong- Bitcoin will hit 75k by 2023 (never broke 74k)- Bitcoin will hit 350k by August 2024- Bitcoin will hit 500k by end of 2025-… pic.twitter.com/ynJjUhyTMi— StarPlatinum (@StarPlatinum_) August 3, 2026
ఇన్వెస్టర్లకు గుడ్న్యూస్.. పబ్లిక్ ఇష్యూల సందడి!
ముంబై: మళ్లీ ప్రైమరీ మార్కెట్ ఊపందుకుంటోంది. ఈ వారాంతాన రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానుండగా.. మరో కంపెనీ సెబీకి ప్రాథమిక దరఖాస్తు దాఖలు చేసింది. పీఈ దిగ్గజం కేకేఆర్కు పెట్టుబడులున్న లీప్ ఇండియా, మౌలిక రంగ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవో చేపట్టనున్నాయి. వివరాలు చూద్దాం..రూ. 2,480 కోట్లకు రెడీసప్లై చైన్ నిర్వహణ కంపెనీ లీప్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి రూ. 151–159 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభంకానుండగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లు ఆఫర్ చేయనుంది. 11న ముగియనున్న ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 480 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 2,480 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైలర్లు కనీసం 94 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 360 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈ నెల 14న లిస్ట్కానుంది.2013లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా సప్లై చైన్ నిర్వహణ రంగంలో పంచుకోవడం, పునర్వినియోగం(షేర్ అండ్ రీయూజ్) పద్ధతిన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తద్వారా సరఫరా సంబంధ సౌకర్యాలను తాత్కాలిక ప్రాతిపదికన కస్టమర్లు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఫలితంగా కస్టమర్లు తయారీ దగ్గరనుంచి వస్తువుల పంపిణీసహా.. రిటైల్(పీవోఎస్)వరకూ సేవలు సమకూరుస్తోంది. గతేడాది(2025-26) రూ. 747 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 62 కోట్ల నికర లాభం ఆర్జించింది.రూ. 252 కోట్లపై కన్నుప్రధానంగా ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు చేపట్టే ఈపీసీ కంపెనీ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవోకు రూ. 200–212 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభంకానుండగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లు ఆఫర్ చేయనుంది. 11న ముగియనున్న ఐపీవోలో భాగంగా కంపెనీ 95.05 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది.అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ సంస్థ కార్తికేయ కన్స్ట్రక్షన్స్ మరో 23.76 లక్షల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 252 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 150 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. గతేడాది(2025–26) రూ. 345 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 43 కోట్ల నికర లాభం ఆర్జించింది.ఎన్క్యూబ్ ఎథికల్స్ సెబీకి దరఖాస్తుస్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఎన్క్యూబ్ ఎథికల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్ మేహుల్ మధుసూదన్ షా, ప్రస్తుత వాటాదారు ఫ్రంటియర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి.దీంతో ఇష్యూ నిధులు కంపెనీ ప్రమోటర్తోపాటు, ఇన్వెస్టర్ సంస్థకు మాత్రమే చేరనున్నాయి. 1995లో ఏర్పాటైన కంపెనీ ప్రపంచవ్యాప్త ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల ప్లాట్ఫామ్గా సర్వీసులందిస్తోంది. సాంకేతికంగా క్లిష్టతరహా(కాంప్లెక్స్) టాపికల్, ట్రాన్స్డెర్మల్ డోసేజీలను రూపొందిస్తోంది. భారత్సహా.. యూఎస్, యూకే, యూరప్ తదితర రెగ్యులేటెడ్ మార్కెట్లకు ప్రొడక్టులను అందిస్తోంది. గతేడాది(2025–26) రూ. 1,849 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 437 కోట్ల నికర లాభం ఆర్జించింది.
రూ.28 వేల కోట్ల సబ్సిడీ.. 50 లక్షల కుటుంబాలకు లబ్ది!
ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా 50.06 లక్షల గృహాలు లబ్ధి పొందాయి. ప్రారంభం నుంచి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో గణనీయమైన పెరుగుదల కనిపించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేవలం రెండేళ్లలోనే ఈ పథకం పతాకస్థాయిలో ఆదరణ పొందినట్లు పేర్కొంది.పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కోసం.. కేంద్ర ప్రభుత్వం రూ.75,021 కోట్ల భారీ నిధులను కేటాయించింది. అయితే ఈ పథకం అమలు చేయడానికి ముందు పదేళ్లలో.. దేశవ్యాప్తంగా కేవలం 7.94 లక్షల రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు మాత్రమే ఏర్పాటు అయ్యాయి. కానీ ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన రెండేళ్లలోనే 50 లక్షలకు పైగా కుటుంబాలు సోలార్ను స్వీకరించాయి. దీన్నిబట్టి చూస్తే.. ప్రజల్లో అవహగాన పెరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.ఒక్క నెలలోనే 5.06 లక్షలుప్రస్తుతం ప్రతి ఆరు రోజులకు లక్ష మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకంలో చేరుతున్నట్లు సమాచారం. గత తొమ్మిది నెలల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటు వేగం మూడు రెట్లకు పైగా పెరిగింది. ముఖ్యంగా 2026 జూలైలో ఒక్క నెలలోనే 5.06 లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్లు ఏర్పాటు కావడం ఒక కొత్త రికార్డు. రోజుకు సగటున 16 వేలకుపైగా ఇళ్లలో సోలార్ వ్యవస్థలు అమర్చడం ఈ కార్యక్రమం ఎంత వేగంగా ముందుకు సాగుతోందో తెలియజేస్తోంది.ఈ పథకం వల్ల ప్రజలకు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.28,024 కోట్ల సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఫలితంగా సుమారు 19 లక్షల కుటుంబాలు విద్యుత్ బిల్లు లేకుండానే జీవిస్తున్నాయి.అదనపు ఆదాయం కూడా..అంతేకాదు.. అవసరానికి మించి ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు అదనపు ఆదాయం కూడా సంపాదిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కుటుంబాలు కలిపి రూ.421 కోట్ల ఆదాయం పొందగా, ఒక్కో కుటుంబానికి సగటున ఏడాదికి రూ.3,500 వరకు అదనపు ఆదాయం వచ్చింది.ఇదీ చదవండి: UPI యూజర్లకు అలర్ట్.. డబ్బులు పంపే ముందు కొత్త స్టెప్!దరఖాస్తు నుంచి సబ్సిడీ విడుదల వరకు మొత్తం ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆన్లైన్ చేసింది. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా సేవలు పొందుతున్నారు. కాగా.. ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి.A people-powered solar revolution is transforming India. Under Hon'ble PM Shri @narendramodi ji’s @PMSuryaGhar Muft Bijli Yojana, 50 lakh families are harnessing the power of the sun for cleaner energy, lower electricity bills, and a brighter tomorrow. #50LakhPMSuryaGhar pic.twitter.com/dhRgyDvnhI— Ministry of New and Renewable Energy (MNRE) (@mnreindia) August 4, 2026
ఫ్యామిలీ
బిర్యానీ పుట్టింది ఎక్కడ?.. అసలు చరిత్ర ఇదే!
బిర్యానీ.. ఈ పేరు వింటేనే నోరూరుతుంది. సువాసన, మసాలాల దమ్ బిర్యానీ ఘుమఘుమలు గుర్తుకు వస్తాయి. హైదరాబాద్ అనగానే చార్మినార్తో పాటు బిర్యానీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ ఈ అద్భుతమైన వంటకం ఎక్కడ పుట్టింది? హైదరాబాద్లోనే పుట్టిందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇక్కడే లభిస్తుంది.పర్షియాలో మొదలుచరిత్రకారుల ప్రకారం బిర్యానీ అనే పదానికి మూలం పర్షియన్ భాషలో ఉన్నాయి. దీని ప్రకారం బిరియన్ అంటే వేయించడం లేదా ఫ్రై చేయడం, బిరింజ్ అంటే బియ్యం అనే రెండు పదాల నుంచి వచ్చిందని అంటారు. ఈ వంటకం పుట్టుక మాత్రం సుమారు 11 నుంచి 14వ శతాబ్దం మధ్య కాలంలో ఇరాన్ అంటే ఒకప్పటి పర్షియాలో జరిగిందని చెబుతారు. అక్కడ బియ్యం, మాంసం అండ్ సుగంధ ద్రవ్యాలను కలిపి తయారు చేసే వంటకాలు తరువాత కాలంలో బిర్యానీ రూపం తీసుకున్నాయి.భారత్లో ఎంట్రీ ఎప్పుడు అంటే ..?1526లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ తనతో పాటు పర్షియన్ సంస్కతి, భాష, వంటకాలను భారతదేశానికి తీసుకువచ్చాడు. తరువాత హుమాయున్ , అక్బర్ కాలంలో రాజమందిరాల్లోని కిచెన్ బిర్యానీ నెక్స్ట్ లెవల్కి చేరుకుంది. అప్పట్లో బిర్యానీని ప్రధానంగా రాజులు, సైనిక ముఖ్య అధికారులు, రాజభవనాల్లో పని చేసే ముఖ్య సిబ్బందికి మాత్రమే వడ్డించేవారు.ముంతాజ్ మహల్ కథబిర్యానీకి సంబంధించిన మరో కథ బాగా పాపులర్ అయింది. 17వ శతాబ్దంలో మహారాణి ముంతాజ్ మహల్ తన సైనికులు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలతో నిండిన భోజనం తయారు చేయమని రాయల్ కుక్స్కు సూచించిందట. అప్పుడు మాంసం, బియ్యం, నెయ్యి, అనేక సుగంధ ద్రవ్యాలను ఒకటే పాత్రలో వండగా అది బిర్యానీగా పాపులర్ అయిందని చెబుతారు. ఈ కథకు బలమైన చారిత్రాత్మక ఆధారాలు లేవు కానీ ఇది బిర్యానీ గురించి అత్యంత పాపులర్ స్టోరీల్లో ఇది కూడా ఒకటి. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంట్రీ1724లో మొదటి అసఫ్ జాహ్ హైదరాబాద్లో అసఫ్ జాహీ వంశాన్ని స్థాపించాడు. తరువాత పర్షియన్, మొఘల్ వంటకాలతో పాటు తెలుగు వంటకాల్లో రకరకాల ఎక్స్పరిమెంట్స్ ్రపారంభమయ్యాయి. నిజాం కాలంలో దమ్ పద్ధతిలో బిర్యానీ తయారు చేయడం బాగా పాపులరైంది. పెద్ద హండీలో బియ్యం, మాంసం, మసాలాలను ΄÷రలుగా పేర్చి, పిండితో మూసి, తక్కువ మంటపై నెమ్మదిగా ఉడికించే పద్ధతినే దమ్ అని పిలుస్తారు. ఈ పద్ధతి వల్లే హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.భారతదేశంలో ఉన్న బిర్యానీ వెరైటీలుభారతదేశంలో ప్రతి ్రపాంతంలో ఒకో వెరైటీ బిర్యానీ లభిస్తుంది. స్థానికులు తమ అభిరుచి, మసాలాలు, వంట దినుసులు, కల్చర్ను బట్టి బిర్యానీని కస్టమైజ్ చేసుకున్నారు.హైదరాబాద్లో బిర్యానీని దమ్ బిర్యానీ అంటారు. ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో అవధి బిర్యానీ, కలకత్తాలో బంగాళదుంపతో చేసే కలకత్తా బిర్యానీ, తమిళనాడులోని ఆంబూరులో అంబూర్ బిర్యానీ, డిండిగల్లో డిండిగల్ బిర్యానీ, కేరళలోని మలబార్ బిర్యానీ, కశ్మీర్లోని శ్రీనగర్లో కశ్మీరీ బిర్యానీ పాపులర్ అయ్యాయి.దీంతో పాటు అంత పాపులర్ అవ్వక΄ోయినా రుచికరంగా ఉండే మురాదాబాద్ బిర్యానీ వంటి ఎన్నో లోకల్ టచ్ ఉన్న బిర్యానీ ఫ్లేవర్స్ఉన్నాయి.ప్రతి బిర్యానీలో మసాలా, బియ్యం, మాంసంతో అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే స్థానిక వంట విధానాలు, పదార్థాల మార్పుతో రుచి మారుతుంది. ప్రతి బిర్యానీ వెరైటీకి ఒక కథ, చరిత్ర ఉంటుంది.హైదరాబాద్ను బిర్యానీ రాజధాని అని ఎందుకు అంటారు?హైదరాబాద్లో నైజాం సంస్కతి, పర్షియన్ ప్రభావం, తెలుగు రుచులు, స్థానిక సుగంధ ద్రవ్యాల కలయిక బిర్యానీకి ఒక కొత్త గుర్తింపు ఇచ్చింది.నేడు హైదరాబాద్లో వందల సంఖ్యలో హోటళ్లలో బిర్యానీ తయారు చేస్తున్నారు. మన దేశంలోనే కాకుండా అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాల్లో కూడా హైదరాబాద్ బిర్యానీ అనే పేరు ఒక బ్రాండ్గా మారింది.
తొలి లేడీ డిటెక్టివ్..! ఆఖరికి పెళ్లి గురించి కూడా...
మనం టీవీల్లో, సినిమాల్లో.. ట్రెంచ్కోట్ ధరించి, ఆధారాలను వెంబడిస్తూ..నేరస్థులను బయటపెట్టే డిటెక్టివ్లను చూశాం, ఆయా కథలు, నవలలు చదివాం. కానీ మహిళా డిటెక్టివ్ల గురించి వినడం గానీ, తెరపై చూడటం గానీ అత్యంత అరుదు. కానీ ఈమె సమస్యను బట్టి వేషం మారుస్తూ.. ఎన్ని కేసులు పరిష్కరించారో తెలిస్తే షాకవ్వుతారు. మహిళలు అత్యంత అరుదుగా వచ్చే ఈ వృత్తిలో కొనసాగుతూ.. నిలదొక్కుకోవడమే గాక మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక్కోసారి నిజాలను వెలికి తీసినా.. బయటకు చెప్పకుండా..కౌన్సలర్లుగా వ్యవహరిస్తుంటుంది కూడా. ఆ మహిళే..రజనీ పండిట్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిశబ్దంగా తనపని తాను చూసుకుంటూ పోతూ..తన వృత్తిని నిర్మించుకున్నారామె. అలా ఆమె భారతదేశపు తొలి మహిళా ప్రైవేట్ డిటెక్టివ్గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రమాదం అనేది ఆమె ఉద్యోగంలో అంతర్భాగం. రచయిత్రి నటి, రచయిత్రి ఛవి మిట్టల్తో ఒక పాడ్కాస్ట్లో రజనీ మాట్లాడుతూ..తన వృత్తి గురించి ఇలా చెప్పుకొచ్చారు. దాదాపు 40 ఏళ్లుగా దేశవ్యాప్తంగా వేలాది కేసులను చేధించినట్లు తెలిపారు. అయితే తనను తాను స్వతాహాగా డిటెక్టివ్ అవ్వాలని ఎన్నడు అనుకోలేదని చెప్పుకొచ్చారామె. ఆ ఒక్క కేసు ఆమె జీవితాన్నే మార్చేసింది..కాలేజీ రోజుల్లో, ఇంట్లో విలువైన వస్తువులు పదేపదే మాయమవుతుండటంతో ఒక క్లాస్మేట్ సహాయం కోసం ఆమె వద్దకు వచ్చింది. ఎప్పుడూ ఆసక్తిగా ఉంటూ, మనుషులను అర్థం చేసుకోవడంలో నేర్పరి అయిన రజనీ, స్వయంగా ఆ విషయాన్ని పరిశీలించి..చివరికి దొంగను గుర్తించింది. కేవలం ఒక సాధారణ ఆసక్తిగా మొదలైనది నెమ్మదిగా ఒక అసలైన వృత్తిగా మారింది. తాను 1986లో, కేవలం 24 ఏళ్ల వయసులో, సొంత ఏజెన్సీ ‘రజనీ ఇన్వెస్టిగేటివ్ బ్యూరో’ను ప్రారంభించినట్లు తెలిపారు. దీన్నే తర్వాత ‘రజనీ పండిట్ డిటెక్టివ్ సర్వీసెస్’ అని పేరు మార్చారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే పనిజీవితం ప్రారంభమైందని అన్నారు. అందువల్లే పెళ్లి కూడా చేసుకోలేకపోయానని చెప్పారు. కనీసం కుదురుగా కూర్చోని టీవి కూడా చూడలేనని అన్నారామె. ఎందుకంటే పదే పదే ఫోన్ మోగుతూనే ఉంటుందని అన్నారు. కేసుకి అనుగుణంగా మారిపోతా..!ఒక కేసు దర్యాప్తు కోసం తనను తాను పూర్తిగా మార్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండాలని అదే తన విజయాలకి ప్రధాన కారణమని తెలిపారు. ఇన్నేళ్లలో పనిమనిషిగా, వీధి వ్యాపారిగా, అంధురాలిగా, మానసిక అస్థిరత ఉన్న మహిళగా ఇలా ఎన్నో రకాలుగా నటించినట్లు వెల్లడించారు. తాను చేపట్టిన తొలి అత్యంత ప్రమాదకరమైన కేసులో ఒకటి..అనుమానితురాలి ఇంట్లో పనిమనిషిగా నిశసించడం అని చెప్పుకొచ్చారు. జంట హత్యల కేసును ఛేదించడానికి ఆరు నెలల పాటు పనిమనిషిగా మారువేషంలో ఉండి ఆధారాలు సేకరిస్తుండగా..ఒకరోజు కెమెరా క్లిక్ మనడంతో వెంటనే నిందితురాలు తనను అనుమానించడం మొదలు పెట్టిందన్నారు. తను అటాక్ చేసే లోపలే ఆధారాలన్నీ పక్కాగా సేకరించి ఆమెను కటకటాల వెనక్కి పంపినట్లు తెలిపారు. కొన్ని కేసులు పిల్లలు చెడు వ్యసనాలకు సంబంధించినవి, విచ్చినమైన సంబంధాలతో బాధపుడుతున్న కుటుంబాలు వంటి కేసులను కూడా చేధించారు. అలా ఆ క్రమంలో కౌన్సలర్లగా కూడా మారతామని అంటున్నారామె. అయితే వివాహేతర సంబంధాన్ని కోర్టులో నిరూపించడం చాలా కష్టమని చెప్పారు. అందుకే తాము టెడ్డీ బేర్లలో దాచిన స్పై కెమెరాలు, పెన్నులలో అమర్చిన రహస్య కెమెరాలు, బటన్ కెమెరాలు, బల్లల కింద అమర్చిన రహస్య మైక్రోఫోన్లపై ఆధారపడుతుంటామని చెప్పారు. విచిత్రంగా తాను కూడా నేరం నుంచి తప్పించుకోలేకపోయానన్నారు. ఎందుకంటే తన పుస్తకాన్ని తర ప్రమేయం లేకుండానే అక్రమంగా కాపీ చేసి మార్కెట్లో అమ్మారని రజనీ వెల్లడించారు. తన కేసుని పరిష్కరించే ప్రయత్నం చేస్తుండగా..బెదరింపులు కూడా వచ్చాయన్నారు. అయితే తాను న్యాయ మార్గాన్ని ఎంచుకుని గెలిచినట్లు తెలిపారు. ఏ నిజం బయటపెట్టాలో తెలియాలి..రహస్యాలను వెలికి తీసే వృత్తే అయినప్పటికీ..ప్రతి నిజాన్ని బయటపెట్టాల్సిన అవసరం లేదని అంటోందామె. ఎందుకంటే ఆ నిజాన్ని బయటపెడితే కలిగే పరిణామాలపై అవగాహన ఉండాలని నొక్కి చెబుతోంది. ఈ వృత్తి కేవలం దొంగలను, నేరస్తులను పట్టుకోవడమే కాదు, మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడంపై పట్టు అందిస్తుందట. అందువల్ల కొన్ని కేసులు చేధించే క్రమంలో కుటుంబాలను కాపాడేలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని అన్నారు. ఇంతలా తిరుగులేని లేడి డిటెక్టివ్గా ఏకంగా 80 వేలకు పైగా కేసులను చేధించిన మీరు తెరపై మీ పాత్రరె పోషించగలరా అని ప్రశ్నించగా..వెంటనే ఆమె నవ్వుతూ..నటించొచ్చేమో కానీ, నిజ జీవితంలో డిటెక్టివ్గా మారడం అనేది అంత ఈజీ కాదు. అలాగే ఆయా కేసు భావోద్వేగ భారాన్ని మోయడం అంత సులభం కాదని కూడా అన్నారు. ఇవన్నీ పుస్తకాల నుంచో, సినిమాల నుంచో నేర్చుకునేవి కాదని అన్నారామె. చివరగా డిటెక్టివ్గా రాణించాలంటే చక్కటి ధైర్యం, సహనం, సత్యాన్ని కనుగొనే వరకు వదలని పట్టుదల చాలా అవసరమంటూ తన సంభాషణను ముగించారు. (చదవండి: ఐఐటీ స్టూడెంట్ కాదు.. కానీ ఏకంగా రూ..4.8 లక్షలు..! కనీసం బీటెక్ కూడా..)
బుజ్జి.. ఓ దివ్యాంగురాలి స్నేహగీతం
జీవితం ఓ అద్భుత ప్రయాణం.. ఈ పయనంలో మనకు తోడుగా, నీడగా నిలిచే అనుబంధాల్లోకెల్లా స్నేహం అత్యంత మధురమైనది, విలువైనది. రక్తసంబంధం లేకున్నా, ఆత్మ బంధాన్ని పెంచే మనసులతో పెనవేసుకునే ఈ బంధం, సంతోషాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.. కాలంతో పాటు అది మరింత గాఢమవుతుంది. ఈ చిత్రం చూడండి.. ఇక్కడ కనిపిస్తున్న వృద్ధురాలు ఎవరూ లేని ఒక మానసిక వికలాంగురాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లిలో ఉన్న జట్టి నరసింహం ప్రభుత్వ వృద్ధాశ్రమంలో తల దాచుకుంటోంది. ఈమె పేరు నండూరి బాలమణి. మూడేళ్ల క్రితం పెడన రోడ్డులో కుక్కపిల్లతో అనాథగా సంచరిస్తున్న ఈమెను ఓ వ్యక్తి పోలీస్లకు అప్పగించాడు. పోలీసులు ఆమెను ఈ వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆమెతో పాటే ఆ కుక్క కూడా ఆ వృద్ధాశ్రమానికి వలస వచ్చి ఆమెతో పాటే బతుకుతోంది. కుక్కను ‘బుజ్జి’ అంటూ ప్రేమతో పిలుస్తూ అన్నపానాలు ఇస్తుండటంతో పాటు స్నానం సైతం చేయిస్తోంది. వృద్ధాశ్రమంలో ఒకే మంచంపై స్నేహ పూర్వకంగా ఉంటున్న బాలామణి– కుక్కను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్నేహానికి ఏ భేదం ఉండదనే నానుడికి వీరి స్నేహం నిదర్శనంగా నిలుస్తోంది. – మచిలీపట్నం టౌన్
ఐఐటీ స్టూడెంట్ కాదు.. కానీ ఏకంగా రూ..4.8 లక్షలు..!
మనం ఐఐటీ వంటి ఉన్నత విద్యను అభ్యసిస్తేనే మంచి ప్యాకేజీ ఆఫర్లతో ఉద్యోగాలు చేస్తారని అనుకుంటాం. సర్వసాధారణంగా అందరూ ఇలానే భావిస్తారు. బాగా చదివి రాణిస్తే..లక్షల్లో వేతనం అని అందరూ విశ్వసిస్తుంటారు. కానీ అదొక ట్యాగ్ మాత్రమేనని, అంత పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా.. ఆ రేంజ్లో డబ్బులు సంపాదించొచ్చనని ఈ వ్యక్తి నిరూపించాడు.అతడే 22 ఏళ్ల లావణ్య జైన్. ఆయన తాను ఐఐటీ స్టూడెంట్ కాకపోయినా..ఆ రేంజ్లో ఎలా వేతనం ఆర్జిస్తున్నాడో అకౌంట్ స్క్రీన్ షార్ట్లతో సహా సోషల్ మీడియాలో ఎక్స్లో పంచుకున్నారు. తన కాలేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజీ కంటే ఎక్కువ ఆర్జిస్తున్నట్లు తెలిపారు. అలాగే తన బీటెక్ డిగ్రీని కూడా మధ్యలో వదిలేశానని అన్నారు. తన చివరి సెమిస్టర్లో ఇంజనీరింగ్ని వదిలేశానని అన్నారు. పైగా దాన్ని అతడు తన జీవింతంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా పేర్కొనడం విశేషం. తనకు వేర్వేరు మార్గాల్లో ఆదాయ వనరులు ఉన్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆదాయం ఖర్చులకు సరిపోగా, మిగతావి పొదుపు చేస్తున్నట్లు తెలిపారు. ఆ పోస్ట్లో స్క్రీన్షాట్లలో అకౌంట్లో రెండు చెల్లింపు జమ అయినట్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి రూ. 3.74 లక్షలు , మరొకటి రూ. ₹1.12 లక్షలు. రెండూ కలిపి రూ. 4.8 లక్షలు అయ్యాయి. తాను ఒక పక్క పార్ట్టైమ్ కాంట్రాక్టర్గా పనిచేస్తూనే..రనబుల్, కైరోస్ కంప్యూటర్ అండ్ ఫోల్డ్ వంటి స్టార్టప్ల గ్రోత్ అండ్ గో-టు- మార్కెట్(జీటీఎం) విభాగాలలో పనిచేస్తూ..ఇంతలా డబ్బులు ఆర్జిస్తున్నట్లు రాసుకొచ్చారు. ఈ పోస్ట్ గొప్పలు చెప్పుకోవడానికి ఉద్దేశించింది కాదని, ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థ నుంచి పట్టభద్రులైతేనే విజయం సాధ్యమనే భావనను సవాలు చేసేందుకుని ఈ మార్కెటింగ్ నిపుణుడు లావణ్య జైన్ చెప్పారు. ఐఐటీలో చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను అంగీకరిస్తూనే, వృత్తిపరమైన విజయం అనేది చివరికి ఒక వ్యక్తి సాధించే దానిపైనే ఆధారపడి ఉంటుందని వాదిస్తున్నాడు. చివరగా ఆయన ఐఐటీ చేస్తేనే లక్షల్లో వేతనం అనేది కేవలం అపోహేనని, ఉద్యోగంలో ఉన్నతంగా ఎదగాలనే ఆకాంక్ష ఆ రేంజ్లో డబ్బులు ఆర్జించే స్థాయికి తీసుకొస్తుందంటూ తన పోస్ట్ని ముగించారు. ఏదీఏమైన ఈ వ్యక్తి పోస్ట్ కెరీర్ విజయానికి నిజంగా ఉన్నత కాలేజీ డిగ్రీలే ముఖ్యమా? అనే అంశంపై చర్చను లేవనెత్తింది.i’m not even from an IIT. in fact, i dropped out from my btech, majoring in electronics and communications engineering in my final semester. i think it was one of the best decisions of my life. i’m earning more than the highest placement of my college (100k USD) that too working… https://t.co/u09tfQorCd pic.twitter.com/5MKM2W4zaC— Lavanya Jain (lav) (@ilavanyajain) August 2, 2026 (చదవండి: నో రన్నింగ్, నో కార్డియో..! జస్ట్ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..)
అంతర్జాతీయం
డోస్ పెంచిన ఉక్రెయిన్.. రష్యా విలవిల
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు పెంచిందా? నల్ల సముద్ర తీరంలోని రష్యా పర్యాటక ప్రాంతం, ఆక్రమిత క్రిమియాపై వరుస డ్రోన్ దాడులతో కీవ్ తన దాడి సామర్థ్యాన్ని మరోసారి చాటుకుందా? తాజాగా జరిగిన ఈ దాడుల్లో 11 మంది మృతి చెందినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చి జరిగిన ఈ దాడుల వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని మాస్కో ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై కీవ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.రష్యాలోని క్రాస్నొడార్ ప్రాంతంలోని ఆర్కిపో-ఒసిపోవ్కా సముద్ర తీర రిసార్ట్పై సోమవారం జరిగిన డ్రోన్ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులతో కిక్కిరిసిన బీచ్పైకి డ్రోన్ దూసుకురావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో.. సముద్రంలో ఉన్న పర్యాటకులు, తీరంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. డ్రోన్ శకలాలు పడటంతోనే ప్రాణనష్టం జరిగినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు.🇷🇺🇺🇦 A drone has crashed onto a tourist beach in Gelendzhik, Russia, killing at least 3 and injuring 13.Gelendzhik is a prominent resort town located on the northeastern coast of the Black Sea, in Russia’s Krasnodar Territory.The incident occurred during an overnight raid,…— Mario Nawfal (@MarioNawfal) August 3, 2026ఈ డ్రోన్ను రష్యా గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుందా? లేదంటే అది నేరుగా బీచ్ను తాకిందా? అనే అంశంపై స్పష్టత లేదు. సమీపంలో ఉన్న రష్యా నౌకాదళ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్ దారి తప్పిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.క్రిమియాలో మరో నలుగురు మృతిమరోవైపు రష్యా ఆధీనంలోని క్రిమియా ప్రాంతంలో జరిగిన మరో డ్రోన్ దాడిలో నలుగురు మృతి చెందినట్లు అక్కడి రష్యా నియమిత గవర్నర్ సెర్గీ అక్స్యోనోవ్ తెలిపారు. నల్ల సముద్ర తీర ప్రాంతాలు వేసవి కాలంలో రష్యా పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాల్లో దాడులు జరగడం తీవ్ర కలకలం రేపింది.కమాండర్ లక్ష్యంగా.. రెస్టారెంట్లో?ఇదిలా ఉండగా రష్యా రాజధాని మాస్కోలోని ఓ ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్ వద్ద జరిగిన పేలుడు ఘటనపై కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారు. కుద్రిన్స్కయా స్క్వేర్లోని బాల్సీ రోస్సీ రెస్టారెంట్ వద్ద పేలుడు జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఓ మహిళ పేలుడు పదార్థాలతో రెస్టారెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని.. ఆ సమయంలో బాంబు పేలినట్లు వెల్లడించారు.తొలుత ఇది ఉగ్రదాడి అని ప్రకటించిన రష్యా.. ఆ తర్వాత ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని ఆరోపించింది. అయితే కీవ్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ పేలుడు రష్యా ఎయిరోస్పేస్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ అలెగ్జాండర్ చైకోను లక్ష్యంగా చేసుకుని జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన 55వ పుట్టినరోజు వేడుకల కోసం అదే రెస్టారెంట్లో ఉన్నట్లు కొన్ని రష్యా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటన నుంచి జనరల్ చైకో సురక్షితంగా బయటపడ్డారు.ఉక్రెయిన్లోనూ రష్యా దాడులుమరోవైపు ఉక్రెయిన్లోని జపోరిజ్జియా నగరంపై రష్యా వైమానిక దాడులు జరిపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన బాంబు దాడుల్లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు వెల్లడించారు.ఐదో ఏడాదిలోనూ కొనసాగుతున్న యుద్ధంరష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐదో ఏడాదిలోకి ప్రవేశించినా.. ముగింపు సంకేతాలు కనిపించడం లేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు డ్రోన్లు, క్షిపణులతో దాడులు కొనసాగిస్తున్నాయి. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని రష్యా, ఉక్రెయిన్ రెండూ చెబుతున్నప్పటికీ.. తాజా ఘటనల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్ర దశకు తీసుకెళ్తాయా?.. అమెరికా అధ్యక్షుడు మరోసారి జోక్యం చేసుకుంటారా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్పై ట్రంప్ ‘టూ ఆప్షన్స్’ బాంబ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చల విషయంలో ఇరాన్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని.. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం తప్ప మరో మార్గం లేదని అల్టిమేటం జారీ చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ బహిరంగంగా అమెరికాతో చర్చలు జరగడం లేదని చెబుతున్నప్పటికీ, సమస్య పరిష్కారం కోసం చర్చలకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఇరాన్ సృష్టించిన సమస్యకు పరిష్కారం కోసం తాము చర్చలు జరుపుతున్నామని అన్నారు.“ఒకటి ఒప్పందం చేసుకోవడం.. లేదంటే పూర్తిగా లొంగిపోవడం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికప్రపంచంలోని అత్యంత కీలకమైన వాణిజ్య మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి అంశంపైనా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంపై అమెరికా నౌకాదళానికి పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా ఇరాన్కు ఎలాంటి రాకపోకలు జరగవని స్పష్టం చేశారు. “ఒప్పందం కుదిరే వరకు లేదా పూర్తిగా లొంగిపోయే వరకు ఎలాంటి మార్పు ఉండదు” అనే రీతిలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.దాడి నుంచి చర్చల వైపు ట్రంప్ అడుగుఇరాన్పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి చేస్తామని మొన్న హెచ్చరించిన ట్రంప్.. నిన్న ఆ సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్ఫ్ దేశాలు ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నేతల సూచనలతో పాటు దౌత్య మార్గాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సోమవారం ప్రారంభమవుతాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. వాటి వివరాలను వెల్లడించలేదు.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రియాక్షన్ ఇదేఅంతకు ముందు అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ప్రస్తుతం వాషింగ్టన్తో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాము ఒమన్తో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. హర్ముజ్ జలసంధిలో తాత్కాలిక సురక్షిత రాకపోకల ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్కు డీల్ లేదంటే పూర్తిగా లొంగిపోవడం అనే ఆప్షన్లు ఉంచారు. అయితే ట్రంప్ ఫ్రెష్వార్నింగ్పై ఇరాన్ స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్ తన సార్వభౌమత్వంపై రాజీపడబోదనే సంకేతాలు ఇస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెబుతూనే, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్య మార్గాలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే క్షిపణి బెదిరింపులు, సైనిక కదలికలతో వేడెక్కిన పరిస్థితుల్లో.. ట్రంప్ తాజా అల్టిమేటం, ఇరాన్ తిరస్కరణతో తదుపరి పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
మళ్లీ చర్చల వంతు: ట్రంప్
కైరో/వాషింగ్టన్: ఇరాన్ విషయంలో గత కొన్ని వారాలుగా క్షిపణులు, డ్రోన్లకు పనిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మంతనాల కోసం మధ్యవర్తులకు పనిచెప్పారు. యుద్ధంలో మారణహోమం తప్పితే సత్ఫలితాలు ఏమీ ఉండవని, అందుకే చర్చల పర్వానికి తెరతీస్తున్నానని సోమవారం ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుని అధికార విమానం ‘ఎయిర్ఫోర్స్ వన్’లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇరాన్పై కనివినీ ఎరుగని స్థాయిలో దాడులకు సిద్ధమయ్యాం. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఎన్నడూ ఎవరూ చూడని భీకరస్థాయిలో ఇరాన్పై దాడులు చేయాలని నిర్ణయించాం. తీరా రణరంగంలోకి దూకే వేళ పశ్చిమాసియాలో సౌదీ అరేబియాసహా మా మిత్రదేశాలు వద్దు అని వారించాయి. చర్చల మార్గం తెరచే ఉందని గుర్తుచేశాయి. అందుకే మళ్లీ చర్చల మార్గంలో అమెరికా పయనిస్తోంది. చర్చలకు రావాలని ఇరాన్ అధికారులు సైతం ఆహ్వానాలు అందాయి. అందుకే సోమవారం నుంచి మధ్యవర్తుల ద్వారా చర్చలు మొదలుపెడతాం’’అని ట్రంప్ ప్రకటించారు. చర్చలు లేవన్న ఇరాన్ ఇరాన్ సోమవారం ట్రంప్ ప్రకటనకు భిన్నంగా స్పందించింది. ‘‘ఒమన్తో మాత్రమే మేం చర్చలు జరుపుతున్నాం. అది కూడా నౌకల సురక్షిత ప్రయాణ అంశంపై చర్చిస్తున్నాం. అమెరికాతో ప్రస్తుతం సంప్రతింపుల ప్రక్రియ నిలిచిపోయింది’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సోమవారం స్పష్టంచేశారు.
ట్రంప్ వెనక్కి తగ్గేలా.. సౌదీ వ్యూహం
పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పుడు సౌదీ రంగప్రవేశం ఆసక్తిగా మారింది. ఇరాక్లో అమెరికాతో కలిసి ఇరాన్ ప్రాక్సీలపై విరుచుకపడ్డ సౌదీ అంతలోనే.. ఇరాన్పై పెద్దఎత్తున దాడులు చేయవద్దని ట్రంప్కు విజ్ఞప్తి చేసింది. దీనికి తల ఊపిన ట్రంప్ సౌదీ ఎంట్రీతో తాత్కాలికంగా దాడుల ఆలోచన విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే అమెరికాని ఒప్పించేలా సౌదీ మధ్యవర్తిత్వం చేయడంపై ఒక పెద్దకారణం దాగున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ట్రంప్ ఇరాన్కు భారీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరిన్ని దాడులు చేయకుండా నివారించాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) కోరినట్లు అమెరికా అధికారులు తెలిపారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. అయితే దీని వెనుక "క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్థిక ప్రణాళిక 'విజన్ 2030' కారణమని తెలుస్తోంది.రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా బిన్ ఫరాహ్ అల్-షయా మాట్లాడుతూ.. "రాజ్యంలోని విజన్ 2030 అనేది కేవలం ఒక ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు. విభిన్నమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి, అలాగే పెట్టుబడులు, ఇంధనం, లాజిస్టిక్స్, పర్యాటకం ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్గా సౌదీ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఇదొక సమగ్ర జాతీయ ప్రాజెక్ట్" అని పేర్కొన్నారు. ఇరాన్పై ఏవైనా పెద్ద దాడులు జరిగితే గల్ఫ్ ప్రాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని, ఇది తమ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుందని సౌదీ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు.మాజీ యూఎస్ రక్షణ శాఖ అధికారి, మిడిల్ ఈస్ట్ నిపుణురాలు డానా స్ట్రౌల్ మాట్లాడుతూ.. యెమెన్ హూతీ తిరుగుబాటుదారుల ముప్పును తొలగించడానికి కేవలం సైనిక బలప్రయోగం మాత్రమే సరిపోదని సౌదీ అరేబియా చాలా కష్టపడి నేర్చుకుందని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నిసార్లు సైనిక చర్యలు చేపట్టినా హూతీల ముప్పును పూర్తిగా తొలగించలేకపోయాయని, సౌదీ మళ్లీ అటువంటి పెద్ద సంఘర్షణలోకి దిగితే అది 'విజన్ 2030'పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె పేర్కొన్నారు.మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా అధికారులతో చర్చలు జరిపారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేస్తే లేదా అలాంటి దాడులకు ఇతర దేశాలు మద్దతు ఇస్తే ఇరాన్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా యుఎస్ను బుజ్జగించాల్సి వస్తోంది.
జాతీయం
ఉదయ్నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్కాంత్
తమిళనాట ఉదయ్నిధి స్టాలిన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు పలువురు ఉదయ్నిధి వ్యాఖ్యల్ని తప్పుబడుతుంటే.. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్కాంత్ మాత్రం ఆ అరెస్ట్ను ఖండించారు.డీఎంకే నేత, ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్పై పోలీసు చర్యల నేపథ్యంలో మంగళవారం డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్నిధి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొంటూ.. ఆయనకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో రాజకీయ భిన్నాభిప్రాయాలను అరెస్టులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రేమలత విజయకాంత్ అన్నారు. ఒకరి వ్యాఖ్యలను మరో పార్టీ రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. అరెస్టులు పరిష్కారం కాదని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో రాజకీయ వ్యాఖ్యలపై అరెస్టులు చేయడం ప్రజల్లో అసంతృప్తిని, ప్రజాస్వామ్యంపై అనుమానాలను పెంచుతుందని వ్యాఖ్యానించారు.“ఉదయ్నిధి మాట్లాడిన దాంట్లో తప్పు లేదు”ఉదయ్నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ప్రేమలత.. ఆయన మాటల్లో తప్పేమీ లేదని అన్నారు. రాజకీయ వేదికలపై ప్రతిపక్ష నేతలకు తమ అభిప్రాయాలను చెప్పే హక్కు ఉందని స్పష్టం చేశారు. “ఉదయ్నిధికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అందులో అభ్యంతరకరం ఏంటో అర్థం కావడం లేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.నీటి కోసం మేం పోరాడుతుంటే..ఇదే సమయంలో తమిళనాడులోని రాజకీయ పోరాటాలపై కూడా ప్రేమలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై, ముఖ్యంగా కావేరీ జలాల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు నటుడు విజయ్ రాజకీయ పోరాటం చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ.. “మేం నీటి కోసం పోరాడుతుంటే.. నటి కోసం విజయ్ పోరాడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరురాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు అరెస్టులను ఉపయోగించడం సరైన విధానం కాదని ప్రేమలత విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఉన్న హక్కులే ప్రతిపక్షాలకు కూడా ఉంటాయని అన్నారు.అధికార పార్టీ, ముఖ్యమంత్రి తమ అభిప్రాయాలను రాజకీయ వేదికలపై వ్యక్తం చేయవచ్చని.. అదే విధంగా ప్రతిపక్షాలు కూడా తమ వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లే హక్కు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సింది రాజకీయంగానే కానీ.. అరెస్టులతో కాదని స్పష్టం చేశారు.చట్టం అందరికీ సమానంగా ఉండాలిఇటీవల రాణిపేటలో జర్నలిస్టులపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలను ప్రస్తావించిన ప్రేమలత.. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై మాత్రం తక్షణ చర్యలు తీసుకోవడం చట్ట అమలులో సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు ప్రతిపక్ష నేతపై అరెస్టు చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తగదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలని కోరారు. మొత్తంగా.. ఉదయ్నిధి స్టాలిన్ విషయంలో ప్రేమలత విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.
కమల వ్యూహం బెడిసికొట్టింది అక్కడే..!
బిహార్ రాజకీయాల్లో ఓ చిన్న ఉప ఎన్నిక ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకీపూర్లో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. ఇది కేవలం ఓ అభ్యర్థి గెలుపు మాత్రమే కాదు.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారింది. బీజేపీని ఓడించి తీరాలన్న కసి అక్కడి ఓటర్లలో కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కమల వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది? అనేది పరిశీలిస్తే.. పట్నా నగరంలోని బంకీపూర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి బలమైన అడ్డాగా ఉంది. 1995 నుంచి ఈ స్థానంలో కమలం ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. తొలుత నితిన్ నబీన్ తండ్రి నవీన్ చంద్ర సిన్హా.. ఆ తర్వాత నితిన్ నబీన్ వరుస విజయాలతో ఈ సీటును బీజేపీ తన గుప్పిట్లో ఉంచుకుంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి అనూహ్య ఫలితం వెలువడింది.జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పీకేకు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 44,827 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.అక్కడే బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్బంకీపూర్ ఫలితాల్లో బీజేపీ వ్యూహ లోపం ప్రధానంగా అభ్యర్థి ఎంపిక దగ్గరే కనిపించిందనే చర్చ జరుగుతోంది. తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ ‘బంటీ’ చివరి సమయంలో తప్పుకోవడంతో.. పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను రంగంలోకి దించాల్సి వచ్చింది. బీజేపీకి బలమైన పట్టు ఉన్న స్థానంలో చివరి నిమిషంలో మార్పు జరగడం క్యాడర్లో కొంత గందరగోళానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ వ్యతిరేక ఓటును ఒకే వేదికపైకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సహజంగా ఆర్జేడీ వైపు మొగ్గు చూపేవారు. కానీ ఈసారి “బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయం ఎవరు?” అనే లెక్కలో కొంతమంది ఓటర్లు జనసూరాజ్ వైపు మళ్లినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.సంబంధిత వార్త: పీకే దాడికి ముందే బీజేపీ ప్లాన్ మార్చిందా?పీకే ఎంట్రీతో మారిన బిహార్ లెక్కలుఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. రాజకీయ నాయకుడిగా మాత్రం తొలి ప్రయత్నాల్లో పెద్ద విజయాన్ని అందుకోలేకపోయారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జనసూరాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో ఆయన వ్యూహం పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఒక్క నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెట్టి.. స్థానిక అంశాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో ప్రచారం సాగించారు. ఫలితంగా బీజేపీ కంచుకోటనే బద్దలు కొట్టారు. ఈ విజయం జనసూరాజ్కు అసెంబ్లీలో తొలి అడుగు మాత్రమే కాదు.. బిహార్లో మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనే పీకే ప్రయత్నాలకు కొత్త ఊపునిచ్చింది.బీజేపీకి దెబ్బ.. ఆర్జేడీకీ హెచ్చరికబంకీపూర్ ఫలితంలో మరో కీలక అంశం ఆర్జేడీ వెనుకబడటం. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆర్జేడీ.. ఈ ఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీకి కూడా ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ బలంగా నిర్మించిన ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకు ఆర్జేడీకి ప్రధాన బలం. అయితే బీజేపీ వ్యతిరేక ఓటులో కొంత భాగం ఈసారి జనసూరాజ్ వైపు వెళ్లినట్లు కనిపించింది. ఈ ధోరణి కొనసాగితే.. ఆర్జేడీ రాజకీయ ఆధిపత్యానికి కూడా సవాల్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇద్దరిలో కారకులెవరూ?బంకీపూర్ ఓటమి ఇప్పుడు బీజేపీలో అంతర్గత చర్చకు దారితీసింది. బాధ్యత ఎవరిపై వేయాలన్న ప్రశ్నపై నితిన్ నబీన్, సమ్రాట్ చౌదరీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సొంత కుటుంబానికి మూడు దశాబ్దాలుగా పట్టున్న స్థానాన్ని కోల్పోవడం నితిన్ నబీన్కు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అభ్యర్థి ఎంపిక, ప్రచార నిర్వహణ, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో లోపాలే ఓటమికి కారణమయ్యాయనే చర్చ సాగుతోంది.మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమ్రాట్ చౌదరీకి ఇది తొలి పెద్ద రాజకీయ పరీక్ష. ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంలో చౌదరీ నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ ఫలితం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఓ హెచ్చరికగా మారింది.అయితే ఒక్కరిని నిందించడం కంటే.. బంకీపూర్ ఓటమి బీజేపీ ఎన్నికల వ్యూహానికి వచ్చిన పరీక్షగా చూడాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.బంకీపూర్ ఇచ్చిన సంకేతం ఏంటి?బంకీపూర్ ఫలితం కేవలం ఓ ఉప ఎన్నిక తీర్పు కాదు.. బిహార్ రాజకీయాల్లో కొత్త పోటీకి సంకేతం. ఇంతకాలం బీజేపీ–ఆర్జేడీ మధ్య సాగిన పోరులోకి ఇప్పుడు జనసూరాజ్ ప్రత్యామ్నాయ శక్తిగా అడుగుపెట్టింది. బీసీ, అగ్రవర్ణాల ఓట్లు ఆ పార్టీకి మళ్లాయి. కమలానికి ఇది కంచుకోట కోల్పోవడమే కాదు.. బలమైన స్థానాల్లో కూడా ఓటర్ల నాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఫలితం. ఆర్జేడీకి తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవాల్సిన సవాలు ఎదురైంది.ప్రశాంత్ కిషోర్ గెలుపు ఒక్క సీటుతో మొదలైనప్పటికీ.. దీని ప్రభావం రాబోయే బిహార్ రాజకీయ సమీకరణాలపై ఎంతవరకు పడుతుంది? బీజేపీ తన కోటను ఎలా తిరిగి నిర్మించుకుంటుంది? జనసూరాజ్ ఈ విజయాన్ని ఎలా విస్తరిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఉదయనిధి అరెస్టుపై డీఎంకే రియాక్షన్
చెన్నై: డీఎంకే నేత ఉదయనిధి అరెస్టును డీఎంకే ఖండించింది. ఉదయనిధి తన మాటల్లో ఎక్కడా ఎవరి పేరు ప్రస్థావించలేదని అందులో ఎక్కడా తప్పు కనిపించలేదని తెలిపింది. అంతకు ముందు అరెస్ట్ సమయంలో ఉదయనిధి మాట్లాడారు. తాను ఎవరి పేరు ప్రస్థావించలేదని ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటాన్నారు. ఈరోజు తమిళనాడులో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉదయనిధిపై కేసు నమోదైంది.దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఆరుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు.ఏం జరిగిందంటే.. సోమవారం తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన డీఎంకే కార్యక్రమంలో ఉదయ్నిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో.. కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయ్నిధి.. కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా, ‘నీళ్లు’ మాత్రం అక్కడికి వెళ్తాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి డబుల్ మీనింగ్గా చేసిన వ్యాఖ్యలేనని టీవీకే ఆరోపిస్తోంది.
ఉదయ్నిధి స్టాలిన్ అరెస్ట్
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ తమిళగ వెట్రి కగళం పార్టీ ఫిర్యాదు చేయంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టీవీకే నిరసనల నడుమ పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించగా.. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఈ మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టు విచారణ జరపనుంది.మంగళవారం ఉదయం ఉదయనిధి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్ట్ తర్వాత ఆయన్ని తరలించే క్రమంలో డీఎంకే శ్రేణులు పోలీసులకు అడ్డు పడ్డాయి. వాహనాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగాయి. అయినప్పటికి పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో ఉదయ్నిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఎవరి పేరును నేను ప్రస్తావించలేదు. ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటా అని ఆయన అన్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని తరలించినట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే.. సోమవారం తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన డీఎంకే కార్యక్రమంలో ఉదయ్నిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో.. కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయ్నిధి.. కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా, ‘నీళ్లు’ మాత్రం అక్కడికి వెళ్తాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి డబుల్ మీనింగ్గా చేసిన వ్యాఖ్యలేనని టీవీకే ఆరోపిస్తోంది. Udhayanidhi Stalin has landed in controversy after making an alleged double-meaning remark during a Cauvery protest speech when the crowd began chanting "Trisha"The video has gone viral, ruling TVK calls the comment "disgusting" and BJP demands his arrest over the remark. DMK… pic.twitter.com/Ay4S0i9HCv— Nabila Jamal (@nabilajamal_) August 3, 2026కేసు నమోదు.. హైకోర్టులో పిటిషన్ఉదయ్నిధి వ్యాఖ్యల నేపథ్యంలో తంజావూర్ పీఎస్లో టీవీకే ఫిర్యాదు చేసింది. సీఎం విజయ్ను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రావాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం.“బహిరంగ క్షమాపణలు చెప్పాలి”.. ఉదయ్నిధి వ్యాఖ్యలపై టీవీకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. క్షమాఫలు చెప్పే దాకా ఉదయ్నిధి స్టాలిన్ను వదలబోమని అంటున్నారు.ఉదయ్నిధి ఇంటి వద్ద భారీ భద్రత.. ఆ వెంటనే అరెస్ట్టీవీకే నిరసనల నేపథ్యంలో చెన్నైలోని ఉదయ్నిధి స్టాలిన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను పెంచారు. ఆ సమయంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హైడ్రామా నెలకొంది. అయితే ఆ తర్వాతే ఉదయ్నిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మహిళా కమిషన్కు ఫిర్యాదు.. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ (NCW)ను టీవీకే ఆశ్రయించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పళా సెల్వకుమార్ ఫిర్యాదు చేస్తూ.. ఉదయ్నిధి ప్రసంగానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయ్నిధి నుంచి వివరణ కోరాలని, బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని మహిళా కమిషన్ను విజ్ఞప్తి చేశారు. అలాగే సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకునేలా పోలీసులకు సూచించాలని కోరినట్లు టీవీకే వెల్లడించింది.బీజేపీ సైతం డీఎంకేపై ఫైర్ఆ వ్యాఖ్యలు మహిళను(త్రిష) కించపరిచేలా ఉన్నాయని, రాజకీయ నాయకుల స్థాయికి తగవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తమిళనాడు బీజేపీ కూడా స్పందించింది. ఉదయ్నిధి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజా జీవితంలో ఉన్న నేతలు మహిళల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు.రాజకీయ పోరుకు కొత్త అస్త్రంఇప్పటికే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే, డీఎంకే మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో త్రిష ప్రస్తావన వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. టీవీకే ఈ అంశాన్ని మహిళా గౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకుని ముందుకు వెళ్తుండగా.. డీఎంకే లేదా ఉదయ్నిధి స్టాలిన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.
ఎన్ఆర్ఐ
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు)
డల్లాస్లో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం
సాక్షి, అమరావతి: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రముఖ నగరం డల్లాస్లో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. 2019–2024 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్క రణల గురించి వివరించారు. పార్టీ చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాలను వారికి పరిచయం చేశారు. ‘జననన్న కోసం మాట్లాడుదాం.. జగనన్న కోసం రాద్దాం.. జగనన్న కోసం పోస్ట్ చేద్దాం.. జగనన్న కోసం కోడ్ చేద్దాం (డిజిటల్ టూల్స్/ యాప్లు/టెక్ పరిష్కారాలు)..’ అని పార్టీని సాంకేతికంగా మరింత బలోపేతం చేసే కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ పోర్టల్ (www.ysrcpnriwing.org)ను ప్రారంభించారు. జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. పార్టీ కోసం సేవలందించే ఎన్ఆర్ఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు పార్టీ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామంటూ వైఎస్ జగన్ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.
కెనడాలో పంజాబ్కు చెందిన మహిళ దారుణ హత్య
కెనడాలో ఎడ్మింటన్లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్య కలకలం రేపింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.ఎడ్మంటన్ పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలు, జూలై 9న పంజాబ్లోని లుధియానా జిల్లా, సమ్రాలా నివాసి దమన్ ప్రీత్కౌర్ స్పృహలేకుండా, తీవ్ర గాయాలతో పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆగ్నేయ ఎడ్మంటన్లోని సిల్వర్బెర్రీ నివాస ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కౌర్ కన్నుమూసింది. ఇది హత్యేనని పోస్ట్ మార్టంలో నివేదిక ద్వారా ధృవీకరణ అయింది. ఈ కేసులో గత కొన్నాళ్లుగా దమన్ ప్రీత్ కౌర్తో కలిసి నివసిస్తున్న (Live-in Partner) ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రీతీష్ కమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతనే గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వేరే అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. 'సెకండ్ డిగ్రీ మర్డర్' ఆరోపణలు నమోదు చేశారు.మరోవైపు కౌర్ మృతదేహాన్ని భారతదేశంలోని ఆమె స్వగ్రామానికి తరలించడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక GoFundMe క్యాంపెయిన్ ప్రారంభించారు. 20 వేల డాలర్లకు గాను ఇప్పటికే దాదాపు 19వేల డాలర్ల విరాళాలు అందాయి. ఇదీ చదవండి: 150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్లో మానవత్వపు పరిమళాలు
క్రైమ్
మహిళా ఐపీఎస్ అధికారిణి లక్ష్యంగా అభ్యంతరకర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో డీజీపీ హోదాలో పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిణి లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అత్యంత అసభ్యకర, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఖాతాపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా అధికారి పరువుకు భంగం కలిగించేలా, అసభ్య పదజాలంతో పోస్టు చేసినట్లు గుర్తించిన టీజీసీఎస్బీ సైబర్ ప్యాట్రోలింగ్ బృందం స్వయంగా (సుమోటో) ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. టీజీసీఎస్బీ ప్రధాన కార్యాలయంలో సైబర్ ప్యాట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆగస్టు ఒకటిన సైబర్ పర్యవేక్షణలో భాగంగా "IMRANKHAN(@Shailubha 007 పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిపై అత్యంత అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేసిన పోస్టును గుర్తించారు. ఆ పోస్టులోని పదజాలం మహిళా అధికారిని మాత్రమే కాకుండా మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్షాట్లు, యూఆర్ఎల్లు తదితర డిజిటల్ ఆధారాలను భద్రపరిచిన అనంతరం టీజీసీఎస్బీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి అసలు వివరాలు, సబ్స్క్రైబర్ సమాచారం, ఇతర ఎలక్ట్రానిక్ రికార్డులను సంబంధిత సోషల్ మీడియా వేదిక నుంచి సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. పోస్టు చేసిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసు దర్యాప్తును ఇన్స్పెక్టర్ ఎం.రవికుమార్కు అప్పగించారు.
అర నిమిషంలో 27 కత్తిపోట్లు!
పట్టపగలు.. అదీ అందరూ చూస్తుండగానే ఓ పోకిరీ దారుణానికి తెగబడ్డాడు. తనపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ యువతిపై కిరాతానికి పాల్పడ్డాడు. టీచర్పై జరుగుతున్న దాడిని చూసి పిల్లలు, తోటి సిబ్బంది దూరంగా పరిగెత్తగా.. రక్తపు మడుగులో కుప్పకూలి ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.ఫరీదాబాద్ సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్లో 29 ఏళ్ల సంధ్య టీచర్గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం సాధారణంగా పాఠశాలకు వచ్చిన ఆమెను కలవాలంటూ ఓ యువకుడు గేటు వద్దకు వచ్చాడు. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంధ్య బయటకు వెళ్లగా.. అప్పటికే ముసుగు ధరించి ఉన్న నిందితుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు.సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. నిందితుడు పాఠశాల లోపలే కొంతసేపు వేచి చూశాడు. సంధ్య బయటకు రాగానే ఆమెను పట్టుకుని లాగి కత్తితో వరుసగా పొడిచాడు. ముఖం, మెడ, ఛాతి, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. అర నిమిషంలో దాదాపు 20 నుంచి 30 సార్లు కత్తితో దాడి చేసినట్లుప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ అరుపులు విని పాఠశాల నిర్వాహకుడు తేజ్పాల్ అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే నిందితుడు అతడిపై కూడా కత్తితో దాడికి యత్నించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం సంధ్యపై మరోసారి దాడి చేసి బైక్పై పరారయ్యాడు.రెండు గంటల్లో అరెస్ట్ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగాడు. నిందితుడి కోసం గాలించి.. రెండే గంటల్లో అరెస్ట్ చేశాడు. అతన్ని అమిత్(21)గా గుర్తించగా.. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు.వేధింపుల కేసే కారణమా?ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమిత్కు సంధ్యతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆమె మాట్లాడేందుకు ఆసక్తి చూపకపోయినా.. నిందితుడు వెంటపడుతూ వేధించేవాడని తెలుస్తోంది. వేధింపులు ఎక్కువయ్యే సరికి ఈ మధ్యే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు కూడా నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదు తర్వాత అమిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఆమె కేసు వాపసు తీసుకుంది. అయితే ఆ ప్రతీకారంతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పంట పొలాల్లో కానిస్టేబుల్ రాసలీలలు..!
ముస్తాబాద్(సిరిసిల్ల): ఓ మహిళతో కానిస్టేబుల్ రాసలీలలపై జిల్లా పోలీస్ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్, ఓ మహిళతో చనువుగా ఉన్నాడు. సిద్దిపేట జిల్లా రాజక్కపేట శివారులో సదరు మహిళతో కానిస్టేబుల్ సన్నిహితంగా ఉండగా గమనించిన రైతు వీరిని ప్రశ్నించాడు. పంట పొలాల్లో ఈ పాడు పనిలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కానిస్టేబుల్ సదరు రైతును బెదిరించడంతో.. ఆ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో జిల్లా పోలీస్ అధికారులకు చేరడంతో క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. అయితే ఈ వీడియో పక్షం రోజుల క్రితం తీసిందని చర్చ సాగుతోంది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ వివాహేతర సంబంధం కొనసాగించడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉంటు హద్దులు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ముస్తాబాద్ ఠాణాలో గతంలో పనిచేసిన మరో ఇద్దరు కానిస్టేబుళ్ల అక్రమ వ్యవహారాలపై కూడా విచారణ సాగుతున్నట్లు సమాచారం.
అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లు, ప్రైవేట్ ఫొటోలు..!
బెంగళూరు: భర్త వేధింపులను భరించలేక అతనికి విడాకులు ఇచ్చి ప్రశాంతంగా బతుకుదామనుకున్న మహిళకు పీడకలలా మారాడు. వేరుగా జీవిస్తున్న మాజీ భార్యను నానా రకాలుగా వేధిస్తున్న సైకో బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూశాడు. వైట్ఫీల్డ్ నివాసి అయిన మహిళ (36)ను ఆమె మాజీ భర్త నితిన్ గుప్త నానా రకాలుగా సతాయిస్తున్నాడు. వీరికి 2013లో ఢిల్లీలో పెళ్లయింది. అయితే నితిన్ ఆమెకు నరకం చూపించాడు. దీంతో విడాకులు తీసుకుని 2022లో బెంగళూరుకు వచ్చి జీవిస్తోంది. ఆమె ఇంటికి అర్ధరాత్రిళ్లు ఫుడ్ ఆర్డర్ పెట్టడం ప్రారంభించాడు. ఆమె ప్రైవేటు ఫోటోలను ఇంటర్నెట్లో పోస్టు చేశాడు. పలుమార్లు ఇంటికి వచ్చి హత్యాయత్నం చేసినట్టు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
వీడియోలు
బీహార్ ప్రధాన ప్రతిపక్షంగా జనసురాజ్ పార్టీ?
YSR జిల్లాలో జంట హత్యలు
నేను చెప్పకూడదు కానీ TDPలో జరిగేది అదే.. అందుకే రాజీనామా చేశా..
ఎయిరిండియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం
పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు
సంధ్య రాణికి ఇచ్చిపడేసిన పుష్ప శ్రీవాణి
సాయి కృష్ణ కేసును మమ అనిపించారు పొన్నవోలు షాకింగ్ నిజాలు
PK విజయానికి కారణం వాళ్లే.. కొడాలి నాని ఫస్ట్ రియాక్షన్
బాబుకి దిమ్మ తిరిగే షాక్.. YSRCPలో చేరిన టీడీపీ కీలక నేత
బాబుకు 7 ఏళ్లు జైలు శిక్ష ...! కొడాలి నాని మాస్ వార్నింగ్


