వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు
(శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి)ప్రతి ఏడాది వచ్చే వినాయకచవితి పర్వదిన శుభసందర్భంగా ప్రతి గృహంలోను, సంస్థల్లోనూ ప్రత్యేకంగా పూజాదికార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పూజలో ఉపయోగించే పూజాద్రవ్యాలతో పాటుగా, స్వామివారిని పూజించే పత్రిది కూడా ప్రథమస్థానం. అందువల్ల ఈ పూజకు సమకూర్చుకోవలసిన అన్ని రకాల పూజాద్రవ్యాలు, పత్రి తదితరాలన్నీ మీకోసారి జ్ఞప్తికి తీసుకురావాలని ఈ క్రింద ఇస్తున్నాం. ఇవి నూతన గృహస్థులకు మరింత ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం.పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడాకుల తోరణాలు, దేవునికి తగిన పీఠము.నైవేద్యం: ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి రకానికి 21 చొప్పున.పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు, ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడంæ శుభఫలదాయకం.గణేశుని పూజ (పూజకు ఏర్పాట్లు)ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన: (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి: (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమఃశ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తువిఘ్నేశ్వరుని వ్రతకల్పముశ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘అగజానన పద్మార్కం గజానన మహర్నిశంఅనేక దన్తం భక్తానాం ఏకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాఃశ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకఃలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననఃవక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజఃషోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపిఃవిద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనంఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి.గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాఃయేతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామంఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జపఃఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య .............. ప్రదేశే .............. – ............. నదీ మధ్యప్రదేశే (మీ ప్రస్తుత నివాస ప్రాంతం ఏ జీవనదుల మధ్య వున్నదో ఆ నదుల పేర్లు చెప్పుకోండి) స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, ఇందువాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధన కనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితఃమూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాఃకుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణఃఅంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాఃగంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ!నర్మదే సింధు కావేరీ జలేస్మిం సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను)గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాంఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పతఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాదనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)స్వామికి పుష్పాలతో పూజ (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను).ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహాశ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)వరసిద్ధి వినాయక పూజా ప్రారంభంస్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా ఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురుధ్యానం: స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...) ప్రాణ ప్రతిష్ఠ: (స్వామి వారికి ప్రాణం పోయుట)ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః‘ పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత‘ మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘పాద్యమ్: స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘అర్ఘ్యమ్: స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ క్రింది చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘ శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సరస్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.) వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధం: (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.అక్షతలు: (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘సిందూరం: శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘మాల్యం: శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘ పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు).సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అధాంగ పూజ: (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి)⇒ ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)⇒ ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక)⇒ ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు)⇒ ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు)⇒ ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు)⇒ ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)⇒ ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి)⇒ ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి)⇒ ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)⇒ ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు)⇒ ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)⇒ ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ)⇒ ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు)⇒ ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం)⇒ ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు)⇒ ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)⇒ ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)⇒ ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు)⇒ ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)⇒ ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్ది)ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు)ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!అఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిశ్రీ గణపతి అష్టోత్తర శతనామావళిఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్తదేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమఃశ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.బిల్వం : శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి.ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు)దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమా సుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి‘‘నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి)ఓమ్ భూర్భువస్సువః ‘ ఓం తత్సవితుర్వరేణ్యంభర్గోదేవస్య ధీమహి ‘ ధియోయనః ప్రచోదయాత్ ‘‘(పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి)ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘శ్రీ గణేష ప్రార్థనతొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‘తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా!తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ ∙∙ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్నిటలాక్షు నగ్రసుతునకుపటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా!ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః నీరాజనమ్ : (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాష్ట్ర్య యాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)మంత్రపుష్పమ్ : (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)గణాధిప నమస్తేస్తుఉమాపుత్రా విఘ్ననాశన‘వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ఏకదంతైక వదన తథా మూషికవాహన‘కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘తన్నోదంతిః ప్రచోదయాత్‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.ఆత్మప్రదక్షిణ నమస్కారమ్ : (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు)ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే‘పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవఃత్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామిప్రార్థన(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి)నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమఃప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘సాష్టాంగ నమస్కారమ్ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితంమయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతిసుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు.(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశంమయా‘ దాసోయమితి మాంమత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి).(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.విఘ్నేశ్వరుని కథా ప్రారంభం(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను.పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనగా, అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను.కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపిస్తుండగా, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను.ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసురగర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. పిదప శివుడు నంది నెక్కి కైలాసమునకు వేగంగా బయలుదేరెను.వినాయకోత్పత్తికైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని చెప్పెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను. అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టి, అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. విఘ్నేశాధిపత్యముఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి యీ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను.‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను. ఆ మంత్ర ప్రభావముతో∙అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వుము’’ అని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు.ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమికి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వెలసివున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలు కూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయి అతడు మృతుండయ్యెను. పార్వతి శోకించుచు చంద్రుని జూచి,‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను. చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది.ఋషీపత్నులకు నీలాపనిందలుఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడెను. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్త ఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు సంతోషించి తమ గృహములకేగి, భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖముగా ఉండిరి.శమంతకోపాఖ్యానముయదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్న దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచిౖయె ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఈ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకము సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను.కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః(తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.)అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను.ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను.ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొనిరి. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు.సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయెను, ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద్వ యుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను.బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను.శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు, నివేదన మొనరింపవలెనని, సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను.అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపాఖ్యానములో శ్రీకృష్ణపరమ్మాత వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహా భక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచుండెను.‘‘మంగళం మహత్’’ చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.– కథ సమాప్తం –పునఃపూజ ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)విఘ్నేశ్వరుని మంగళహారతులుశ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం!నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘సురుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి దానిమ్మపువ్వు గరిక మాచీపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘వాయనదానముశ్లో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా!(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్.(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం)ఇదీ చదవండి: శ్రీనాథ విరచిత వినాయక దండకం
ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు యానాంలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో వేకువజాము నుంచి దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల ధాటికి బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.ముఖ్యంగా బెంజిసర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ స్థాయిలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏలూరు రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనూ శనివారం వేకువజామున భారీ వర్షం కురిసింది. ఉ.8 గంటల వరకు జిల్లాలో సగటున 37.4 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.పి.గన్నవరంలో అత్యధికంగా 60.0 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ పంచాయతీ గంగవరం వద్ద గిరిజనులు నిర్మించుకున్న తాత్కాలిక తూరల వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఒడిశా వైపు వెళ్లే మార్గంలో సుమారు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.ఇదీ చదవండి: చవితి పూట.. ధరల మంట
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం....కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చేపట్టిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు అన్ని విధాలా సానుకూలమైన సమయం. వారం చివరిలో మానసిక వేదన, అనారోగ్య సూచనలు. మిత్ర విరోధాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.వృషభం...పనుల్లో మరింత అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువుల నుండి ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, చాక్లెట్ రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.మిథునం...ముఖ్యమైన వ్యవహారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగాలలో కొంత పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి కొన్ని సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక ఆందోళన. తెలుపు, చాక్లెట్æరంగులు, రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.కర్కాటకం...కొత్త పనులు ప్రారంభించేందుకు అనువైన కాలం. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మీలో మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు తీరి ఒడ్డునపడతారు. రాజకీయవర్గాలకు ఈతిబాధలు తొలగుతాయి. వారం మధ్యలో బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు, గణేశ్ స్తోత్రాలు పఠించండి.సింహం....ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మనస్పర్థలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని వ్యవహారాలు మధ్యలో విరమిస్తారు. విద్యార్థుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగాలలో అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహన, గృహయోగం. నీలం, తెలుపు రంగులు, . గణేశ్ను పూజించండి.కన్య...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాల నుండి గట్టెక్కుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. ఆకుపచ్చ,,లేత గులాబీరంగు, కనకధారా స్తోత్రం పఠించండి.తుల...ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే, సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.వృశ్చికం..ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మనస్పర్థలు తీరి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. గృహం కొనుగోలు యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు సకాలంలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి. వారం చివరిలో మానసిక అశాంతి. అనారోగ్యం. తెలుపు, చాక్లెట్ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులకు వరంగా మారనుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. వారం చివరిలో సోదరులతో కలహాలు. బా«ధ్యతలు పెరుగుతాయి. గులాబీ, పసుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.మకరం...ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగి సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గి కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటన అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, తెలుపురంగులు, శివాలయ దర్శనం మంచిది.కుంభం...అనుకున్న పనులు మరింత వేగవంతంగా సాగుతాయి. మీపై వచ్చిన ఆరోపణల నుండి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు కొన్ని ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నీలం, లేత పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.మీనం...కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. భూ వివాదాల ఎట్టకేలకు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు, సంభాషణలు సాగిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
అమితాబ్ బచ్చన్ (బాలీవుడ్ దిగ్గజం) రాయని డైరీ
రాత్రి 2.34. ఎంతకూ మెలకువ రావటం లేదు! మెలకువ రావటం లేదంటే నిద్రలో ఉన్నట్లనేనా?! నేను కోరుకుంటున్న మెలకువ... నిద్రాణంగా ఉన్న నా జీవితపు మలుపుల్లోంచి నిస్త్రాణగా పడి ఉన్న నా నిరాలోచనల ఏకాంతంలోకి. పాతవన్నీ ప్రవాహంలా మనసులోకి వచ్చి చేరుతున్నాయంటే... బిందెడు తులసి నీళ్లను మంచం పక్కన సిద్ధంగా ఉంచుకోవటమేనా? గొంతెండి ఉన్న దారులను తీర్థపు గుక్కిళ్లతో ఆరారగా తడుపుకుంటూ జీవనావస్థలోకి మళ్లీ మళ్లీ ప్రయాణించి వస్తుండటమేనా? ప్రయాసగా పక్కకు ఒత్తిగిలాను. నీలం రంగు మసక వెలుతురు... తీరని అలసటలా మనసును పూర్తిగా కమ్మేసి ఉంది. వలదనుకోలేని జ్ఞాపకాలు. అంతమూ పొంతనా లేని తలపులు. ఏ జాము అయిందో తెలియదు, మనిషి జీవితకాల జాముల గురించి ఆలోచిస్తున్నాను! అరవై ఏళ్లు రాగానే మనిషిని మనుషులు ఎందుకు ఆనవాలు పట్టటం మానేస్తారు! డెబ్బై దాటగానే ఎందుకు చూపులు చిట్లిస్తారు! ఎనభైల్లో ఎదురుపడితే ఎదురైంది మనిషే కానట్లు ఎందుకు దాటుకుని పోతారు! మనుషులిలా తప్పుకుని పోతున్నప్పుడే తొంభై ఏళ్లు, నూట తొంభై ఏళ్లు బతికి, మనుషులతో మాట కలపాలనిపిస్తుంది నాకు. కోవిడ్తో నేను ముంబై నానావతి ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్నప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి నా మరణాన్ని తీవ్రంగా కాంక్షిస్తూ, ‘‘కనీసం ఈ కోవిడ్తోనైనా నువ్వు చనిపోవాలని కోరుకుంటున్నాను’’ అని సోషల్ మీడియాలో ఒక సంక్షిప్త సందేశం పోస్ట్ చేశాడు! పట్టలేనంత కోపం వచ్చింది నాకు.ఆ వెంటనే ఆలోచిస్తే... కోపం వచ్చినందుకు నవ్వొచ్చింది. నేను చనిపోవాలని కోరుకుంటు న్నాడంటే... నేను బతికున్నానని అతడు అనుకుంటున్నట్లే! అది కదా దీర్ఘాయుష్షు... మనిషి మనసులో మనిషి ఉండటం! ‘కౌన్ బనేగా కరోడ్పతి’ సెట్స్లో ఒకసారి ప్రీతి జింతాను అడిగేశాను... ‘‘నేను ప్రతి సంవత్సరం జనవరి 31న మీకు బర్త్డే విషెస్ చెప్తాను, కానీ మీరు ఒక్కసారి కూడా నాకు రిప్లయ్ ఇవ్వలేదు’’ అని. ‘‘సారీ బచ్చన్ జీ. నంబర్ మారిపోయింది’’ అన్నారు ప్రీతి జింతా! ఒక ఏడాది మే 1న అనుష్క శర్మను ట్విట్టర్లో బహిరంగంగానే అడిగాను, ‘‘మీకు ఎస్ఎంఎస్లో శుభాకాంక్షలు పంపాను. కానీ ఎలాంటి స్పందనా లేదు’’ అని. ‘‘సారీ సర్... చూసుకోలేదు’’ అన్నారు అనుష్క! ‘‘ పర్వాలేదు. నిన్న రాత్రి ఐపీఎల్ గేమ్లో మీరు చాలా కాంతిమంతంగా కనిపించారు’’ అని మళ్లీ శుభాకాంక్షలు పంపాను. సోనమ్ కపూర్ కూడా నన్ను పట్టించు కోలేదు! ‘‘సారూ... నేను అమితాబ్ బచ్చన్ ని. జూన్ 9న నీ పుట్టినరోజుకు విష్ చేశాను. రిప్లయ్ లేదు, కాల్ కూడా చేయలేదు... వెరీ బ్యాడ్!’’ అని మెసేజ్ పెట్టాను. ‘‘సారీ అంకుల్, మీ ఎస్ఎంఎస్ నాకు రీచ్ అయినట్లు లేదు’’ అన్నారు సోనమ్!రణ్వీర్ సింగ్ని, ‘‘హేయ్... అందరికీ థ్యాంక్స్ చెబుతున్నావ్. మరి నేను పంపిన విషెస్ సంగతి ఏంటి? రిప్లయ్ ఎందుకు ఇవ్వలేదు?’’ అని అడిగాను. ‘‘సారీ అమితాబ్ జీ, మీక్కూడా థ్యాంక్యూ చెప్పానే!! మీకు ఆ థ్యాంక్యూ చేరలేదంటే... ఏదో టెక్నికల్ గ్లిచ్ అయుంటుంది’’ అన్నారు రణ్వీర్! సమాధానం సంతృప్తికరంగా ఉండక పోవచ్చు. అసలు ప్రశ్నే సరైనది కాకపోవచ్చు. కానీ, ప్రశ్నలు సమాధానాలు ఉండటమే జీవితం. అడగాల్సిన ప్రశ్నలు, చెప్పాల్సిన సమాధానాలు లేకుండా... నిండు నూరేళ్ల జీవితం కూడా సంపూర్ణం కాలేదు. ప్రశ్న, సమాధానం నిశ్శేషం కానంత వరకు జీవితకాలం అసలు పూరై్తనట్లే కాదు. ‘‘మేల్కొన్నారా?’’ – తెల్లవారు జామునెప్పుడో జయ అడుగుతోంది. ‘‘ఇది కోటి రూపాయల ప్రశ్న దేవీజీ... ఆలోచించాల్సిందే’’ అన్నాను, నిట్టూర్పుగా.
ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు!
తెలంగాణలో గట్టి వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్లో?
గిజా పిరమిడ్లో గణిత రహస్యం.. చంద్రుడితో లింక్?
ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య!
ఒక్కసారే అన్ని కహానీలు ఎందుకు చెప్పార్సార్!!
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
నా భర్త జీవితం సర్వనాశనమైంది : సుమంత్ భార్య
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
బిగ్బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు!
తెలంగాణలో గట్టి వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్లో?
గిజా పిరమిడ్లో గణిత రహస్యం.. చంద్రుడితో లింక్?
ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య!
ఒక్కసారే అన్ని కహానీలు ఎందుకు చెప్పార్సార్!!
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
నా భర్త జీవితం సర్వనాశనమైంది : సుమంత్ భార్య
ఎన్నికల్లో మీకు సరైన లెక్క నేను చెబుతా..
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
అలాగే ఓ బాంబు, నెత్తిన అప్పు కూడా ఇద్దాం సార్!
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
వైభవ్కు చుక్కలు చూపించిన జస్ప్రీత్ బుమ్రా
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
బిగ్బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే?
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఫొటోలు
'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)
విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)
వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)
బేబీ బంప్తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)
'ఎపిక్' షూటింగ్లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)
వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)
సమంత స్టన్నింగ్ లుక్స్ అదుర్స్ (ఫొటోలు)
ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)
‘ది ప్యారడైజ్’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
సినిమా
ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!
బిగ్బాస్ సీజన్-10లో తొలి వీకెండ్ ఎపిసోడ్కు రంగం సిద్ధమైంది. వారమంతా హౌస్లో కంటెస్టెంట్ల ఆటతీరు, గొడవలు, టాస్కులతో సందడి నెలకొనగా.. వీకెండ్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతో మరింత ఆసక్తి పెరగనుంది. కంటెస్టెంట్లు చేసిన తప్పులను ప్రశ్నించడంతో పాటు.. బాగా ఆడినవారిని అభినందిస్తూ నాగార్జున తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయనున్నారు.ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమితఊహించని సర్ప్రైజ్ఈ వారం హౌస్లో అన్ని అంశాల్లోనూ తమ ఆటతో ఆకట్టుకున్న కంటెస్టెంట్లుగా రామ్ప్రసాద్, రోహిత్, వంశీలు నిలిచారు. వారి ఆటతీరును నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాదు.. ఈ ముగ్గురికి ఊహించని సర్ప్రైజ్ కూడా ఇచ్చారు.వారు తాగిన మిల్క్షేక్ గ్లాసులను స్వయంగా నాగార్జున కడగడం ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్లను ప్రోత్సహించేలా ఆయన చేసిన ఈ పని చూసి హౌస్మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. దీంతో తొలి వీకెండ్ ఎపిసోడ్లో రామ్ప్రసాద్, రోహిత్, వంశీలకు నాగార్జున ఇచ్చిన ఈ ప్రత్యేక గౌరవం హైలైట్గా నిలిచింది.
అందుకే ‘శ్రీలత..’పాటను తెలంగాణ ఫోక్ స్టైల్ లో కంపోజ్ చేయలేదు: మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి
‘శ్రీలత..’ పాట కోసం డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే సినిమాలోని కథలో భాగమవుతూ, ప్రమోషన్ కు కూడా ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాం. పాటలో క్యాచీ లిరిక్స్ కూడా కుదిరాయి. ప్రజలు ఈ పాటను ఓన్ చేసుకునేలా ఉండాలని డిజైన్ చేసి ముందే రిలీజ్ చేశాం.ఈ పాటకు ట్యూన్, లిరిక్స్ ఒకే రోజులో ఫైనల్ అయ్యాయి. పాట అందరికీ రీచ్ అవ్వాలనే కంప్లీట్ గా తెలంగాణ ఫోక్ స్టైల్ లో కంపోజ్ చేయలేదు. చరణం మెలొడియస్ గా ఉండేలా ట్యూన్ డిజైన్ చేశాను’ అని అన్నారు సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి. ప్రియదర్శి, ఫోక్ డాన్సర్ నాగదుర్గ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. బన్నీవాస్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘శ్రీలత..’పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, లిరిక్ రైటర్ అలరాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. .సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. 'శ్రీలత..' పాట మా ఫ్యామిలీ మెంబర్స్ కు బాగా నచ్చింది. వాళ్లు ఫోన్స్ చేసి పాట బాగుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మా సాంగ్ కు రెస్పాన్స్ బాగుంది. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్ , ఇద్దరు సింగర్స్ పాడిన విధానం తమను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ పాటలో నేను నటించాను. ఈ ఆలోచన బన్నీ వాస్ గారిది. మీరు ఇన్ని సాంగ్స్ కు మ్యూజిక్ చేశారు. మీరు ఎవరో ప్రేక్షకులకు తెలియాలి కదా అని ఈ సాంగ్ లో నేను కూడా నటించేలా చేశారు. నేను ప్రజలకు తెలియాలి అనే ఆలోచన నాలో కూడా ఉండేది. అందుకే ఒక ప్రైవేట్ సాంగ్ నేనే పర్ ఫార్మ్ చేస్తూ చేయాలని కూడా అనుకున్నాను. పాటలో నటించడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ పాటలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. లిరిక్ రైటర్ అలరాజు అన్న డైరెక్టర్ వంశీరెడ్డి అన్నకు ఫ్రెండ్. నాకు కూడా అలరాజు అన్న తెలుసు. ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో ఐడియా ఉంది. ఈ పాటలో తెలంగాణ వారికి వాడుకలో ఉన్న, సుపరిచితమైన కొన్ని పదాలతో పాట రాశాడు. అవి పాటకు అందాన్ని తీసుకురావడమే కాదు త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా చేశాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటకు కనెక్ట్ అయ్యారు. పాట బాగుందని కాల్ చేసిన చెబుతున్నారు.లిరిక్ రైటర్ అలరాజు మాట్లాడుతూ.. ‘ఈ పాట రాసేప్పుడు డైరెక్టర్ వంశీ రెడ్డి ..‘కథతో సంబంధం లేకుండా ఈ పాట అందరికీ నచ్చేలా ఉండాలి. సినిమా చూశాక ఇంకా శ్రోతలకు కనెక్ట్ కావాలి’అని చెప్పారు. మీరు ఇప్పుడు ఆడియో వింటుంటే నచ్చుతుంది. కానీ సినిమాలో చూసినప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా ఈ పాటను ఇష్టపడతారు. హీరో హీరోయిన్స్ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో వచ్చే సాంగ్ ఇది. శ్రీలత అలకకు కారణం ఏంటి, శ్రీనివాస్ ఏం చెప్పి ఆమెను బుజ్జగించాడు అనే నేపథ్యంతో ఈ సాంగ్ రూపకల్పన చేశారు. రెగ్యులర్ ఎక్స్ ప్రెషన్స్ కాకుండా ఈ పాట సాహిత్యం కొత్తగా రాసేందుకు ప్రయత్నించాను. టైటిల్ రివీల్ చేసేందుకు ముందగానే ఈ పాట ఫైనల్ అయ్యింది. ఈ పాటలోని పదాలను పూర్తిగా ఫోక్ స్టైల్ లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశాను. ఒక పెద్ద మూవీకి వర్క్ చేస్తున్నానే ప్రెషర్ నాపై ఉండేది కానీ వాళ్లు ఇచ్చిన ఇన్ పుట్స్ వల్ల కంఫర్ట్ గా లిరిక్స్ రాశాను. శ్రీలత పాట నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇడుపుకాయితం గీత రచయితగా నా బతుకు మార్చిన కాగితం అనుకుంటాను’ అన్నారు.
నవ్వులు పూయిస్తున్న ‘హ్యాపీ జర్నీ’ ట్రైలర్
అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన్యతనిస్తూ రూపొందుతోంది. ఈ సినిమా సెప్టెంబరు 18న విడుదల కానుంది. ఈమేకు ఈ చిత్రం నుంచి ట్రైలర్ శనివారం విడుదల చేశారు. వయసుతో సంబంధంలేకుండా అన్నపూర్ణమ్మ చేసిన యాక్టింగ్ ఆకట్టుకుంటోది. కామిడీ పంచ్లు కూడా బాగా పేలాయి. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రంల్లో నటిస్తున్నారు.
సినిమాల్లో అవకాశం అంటూ మోసం.. రోడ్డెక్కిన బాధితులు
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్షల్లో వసూలు చేసి మోసానికి ఒడిగట్టిన ఘటన హైదరాబాద్లో కలకలం సృష్టించింది. ఈమేరకు తమకు న్యాయం చేయాలంటూ భాదితులు అంబర్పేట్ శివం రోడ్డులోని సినిమా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంతమేర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.సినిమాలో అవకాశం ఇప్పిస్తామంటూ తమ దగ్గర రూ.లక్షల్లో డబ్బులు వసూళు చేసినట్లు బాధితులు తెలిపారు. తీరా అడిగే సరికి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని వారంతా వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇప్పించాలని వారంతా కోరారు. శివకుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: డీ10 విన్నర్ రాజు పై కేసు.. Victims protest at the residence of film distributor Shivakumar Goud.They alleged that Shivakumar had collected lakhs of rupees from several individuals by promising to secure film offers for them. pic.twitter.com/sQCOa6f0IC— Shakeel Yasar Ullah (@yasarullah) September 12, 2026
క్రీడలు
టి20ల్లో జోరు కొనసాగించేందుకు...
ఒక వైపు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ప్రాధాన్యత నేపథ్యంలో వరుసగా టెస్టు మ్యాచ్లు... ఏడాది కాలంలో వన్డే వరల్డ్ కప్ ఉండటంతో జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై వ్యూహాలు... వీటి మధ్య ఇప్పుడు కాస్త ఆటవిడుపుగా భారత జట్టు టి20 మ్యాచ్లకు సన్నద్ధమైంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టి20 సిరీస్లు ఆడి వచ్చిన భారత్ ఇప్పుడు స్వదేశంలో అఫ్గానిస్తాన్తో పోరుకు సై అంటోంది. అయితే మూడు మ్యాచ్లకు వేదిక భారత రాజధాని అయినా... అధికారికంగా ఈ సిరీస్కు అఫ్గానిస్తాన్ బోర్డు ఆతిథ్యం ఇస్తోంది. న్యూఢిల్లీ: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు ఫిరోజ్షా కోట్లా మైదానంలో తొలి పోరుకు రంగం సిద్ధమైంది. బలాబలాలను బట్టి చూస్తే ప్రత్యర్థికంటే భారత్ అన్ని విధాలా పటిష్టంగా ఉంది. కెప్టెన్గా రెండు సిరీస్లు కోల్పోయిన తర్వాత జింబాబ్వేతో సిరీస్ విజయాన్ని అందుకున్న శ్రేయస్ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. అన్నింటికి మించి హార్దిక్ పాండ్యా మినహా టీమిండియా రెగ్యులర్ ఆటగాళ్లతో పూర్తి స్థాయి జట్టుగా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా గాయంనుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న బుమ్రాపై అందరి దృష్టీ నిలిచింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడు సంచలనాలతో సత్తా చాటిన అఫ్గాన్ టీమ్ ఇక్కడా తమదైన ముద్ర చూపించాలని పట్టుదలగా ఉంది. పలువురు ఐపీఎల్ ఆటగాళ్లు తమ జట్టులో ఉండటం కూడా అఫ్గాన్కు కొంత సానుకూలాంశం. ఈ సిరీస్లో ఆడుతున్న భారత జట్టే జపాన్లో జరిగే ఆసియా క్రీడలకు కూడా వెళుతుంది. రెండో ఓపెనర్ ఎవరు? ఈ సిరీస్లో ఒకే ఒక ప్రశ్న ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ ముందు నిలిచింది. అభిషేక్ శర్మతో పాటు రెండో ఓపెనర్గా సంజు సామ్సన్, వైభవ్ సూర్యవంశీలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్తో సామ్సన్ 2 మ్యాచ్లు, ఇంగ్లండ్పై తొలి మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని తప్పించి వరుసగా మూడు మ్యాచ్లలో వైభవ్ను ఆడించారు. ఆపై చివరి మ్యాచ్కు మళ్లీ సామ్సన్ జట్టులోకి రాగా... జింబాబ్వేతో సామ్సన్ లేకపోవడంతో వైభవ్ మూడు మ్యాచ్లూ ఆడాడు.ఇప్పుడు ఇద్దరు అందుబాటులో ఉన్నారు.దులీప్ ట్రోఫీలో చెలరేగిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఫార్మాట్కు తగినట్లుగా తమ బ్యాటింగ్ శైలిని మార్చుకొని చెలరేగేందుకు ఉత్సాహంగా ఉన్నారు. బ్యాటింగ్పరంగా జింబాబ్వేలో ఆశించిన ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు రెగ్యులర్ పేసర్లతో బరిలోకి దిగనుండగా, పేస్ ఆల్రౌండర్గా నితీశ్కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు. రషీద్పై ఆశలు... భారత గడ్డపై ఆడటం అఫ్గానిస్తాన్ ఆటగాళ్లకు కొత్త కాదు. ఇక్కడి పరిస్థితులపై వారికి మంచి అంచనా ఉంది. ముఖ్యంగా రషీద్ ఖాన్ ఐపీఎల్లో చూపించిన ప్రభావం అసాధారణం. వన్డేల్లో రషీద్ బౌలింగ్లో పదును కనిపించకపోయినా, టి20ల్లో అతను ఎప్పుడైనా ప్రమాదకారి. గుర్బాజ్, నబీ, అజ్మతుల్లా, ముజీబ్, నూర్, నవీన్, ఫారుఖీ వంటి ఐపీఎల్ ఆటగాళ్లతో జట్టు నిండి ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్పై ఉదాసీనత ప్రదర్శిస్తే టీమిండియాకు ఇబ్బంది ఎదురు కావచ్చు. కొత్త కెప్టెన్ ఇబ్రహీమ్ నాయకత్వంలో టీమ్ ఈ సిరీస్కు సిద్ధమైంది.9 భారత్, అఫ్గానిస్తాన్ మధ్య 9 టి20లు జరగ్గా... భారత్ 7 గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా, మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. అఫ్గాన్ ఇప్పటి వరకు ఓడించని పెద్ద జట్లు భారత్ మాత్రమే.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: శ్రేయస్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్/ వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్, అక్షర్, సుందర్, నితీశ్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్. అఫ్గానిస్తాన్: ఇబ్రహీమ్ (కెప్టెన్), గుర్బాజ్, నైబ్, సాదిఖుల్లా, రసూలీ, అజ్మతుల్లా, నబీ, రషీద్, ముజీబ్, నూర్, ఫారూఖీ/ నవీన్.
మహిళల ఆసియాకప్ ఫైనల్లో నేడు శ్రీలంకతో భారత్ ఢీ
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టు... నేడు శ్రీలంకతో ఫైనల్కు సిద్ధమైంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఈ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా... ఎనిమిదో టైటిల్పై గురి పెట్టింది. గత ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకున్న టీమిండియా... ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి... సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. మరోవైపు శ్రీలంక కూడా గ్రూప్ దశలో అన్నీ మ్యాచ్లు నెగ్గి సెమీస్లో పాకిస్తాన్ను ఓడించి ఫైనల్ చేరింది. ఫామ్పరంగా చూసుకుంటే ఈ టోర్నమెంట్లో తొలిసారి భారత జట్టుకు కాస్త ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ రూపంలో భారత జట్టుకు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. స్మృతి ఇప్పటికే ఈ టోర్నీలో ‘శత’క్కొట్టగా... షఫాలీ 168 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతోంది. స్పిన్కు సహకరిస్తున్న దుబాయ్ పిచ్పై ఈ జంట జట్టుకు ఎలాంటి ఆరంభం ఇస్తుందనేదే కీలకం కానుంది. వన్డౌన్లో బ్యాటింగ్ చేస్తున్న ప్రతీకా రావల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా... హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి ఫూల్మాలితో భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లో సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ కీలకం కానుంది. ఈ టోర్నీలో 11 వికెట్లు తీసి శ్రీలంక సారథి చమరి ఆటపట్టుతో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్న దీప్తి ఫైనల్లోనూ రాణించాల్సిన అవసరముంది. ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి తన స్పిన్తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతుండగా... పేసర్లు నందని శర్మ, క్రాంతి గౌడ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే భారత జట్టుకు ఫీల్డింగ్లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు శ్రీలంక జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో సారథి చమరి ఆటపట్టుపైనే ఎక్కువ ఆధారపడుతోంది.
జ్వెరెవ్ X షెల్టన్
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో కొత్త విజేత ఎవరో నేడు తేలనుంది. తొలి టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్న టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 8వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) నేడు జరిగే ఫైనల్ పోరులో తలపడనున్నారు. జ్వెరెవ్ ఫైనల్ చేరడం ఇది రెండో సారి. 2020లో ఆఖరి మెట్టుపై అతని డొమినిక్ థీమ్ చేతిలో ఓడి రన్నరప్గా నిలవగా, షెల్టన్ ఫైనల్కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి, వింబుల్డన్ ఫైనల్లో ఓడిన జ్వెరెవ్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో జ్వెరెవ్ 6–3, 7–6 (9/7), 7–6 (8/6) స్కోరుతో కరెన్ ఖచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. ఆ తర్వాత జరిగిన రెండో సెమీస్లో షెల్టన్ 4–6, 6–3, 6–3, 7–5తో అమెరికాకే చెందిన ఫ్రాన్సిస్ టియాఫోను ఓడించాడు. సెమీస్ మ్యాచ్కు ముందు ఖచనోవ్తో ఆడిన 9 మ్యాచ్లలో 6–3తో ఆధిక్యంలో ఉన్న జ్వెరెన్ ఈ సారి కూడా తన పైచేయిని ప్రదర్శించాడు. తొలి సెట్లో 3–3 తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మరో గేమ్ కూడా అలవోకగా జ్వెరెవ్ ఖాతాలో చేరింది. తర్వాతి రెండు సెట్లలో మాత్రం టాప్ సీడ్కు గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరూ హోరాహోరీగా పోరాడటంతో స్కోరు టైబ్రేక్కు చేరింది. ఈ దశలో ఖచనోవ్ పైచేయి సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయాడు. మూడో సెట్ కూడా దాదాపు ఇదే తరహాలో సాగింది. టైబ్రేక్లో 2–5తో వెనుకబడినా జ్వెరెవ్ పట్టుదలగా తన స్థాయికి తగ్గ ఆటతీరుతో మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. జ్వెరెవ్ 15 ఏస్లతో విరుచుకుపడటం విశేషం. టియాఫోతో జరిగిన రెండో సెమీస్లో షెల్టన్ తొలి సెట్ చేజార్చుకున్నా... కోలుకొని ఆ తర్వాత ప్రత్యర్థిపై చెలరేగుతూ దూసుకుపోయాడు. ఈ సెట్లో ఏకంగా 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన షెల్టన్ సహచర అమెరికన్కు అవకాశం కల్పించాడు. రెండో సెట్లో ఎనిమిదో గేమ్ను బ్రేక్ చేసి ముందంజ వేసిన షెల్టన్ సునాయాసంగా సెట్ను ముగించాడు. మూడో సెట్ కూడా అతని నియంత్రణలోనే సాగింది. ఈ సెట్లోనే అతను 12 విన్నర్స్ కొట్టడం షెల్టన్ ఆధిపత్యాన్ని చూపించింది. 1972 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి నల్లజాతి అమెరికన్గా షెల్టన్ గుర్తింపు పొందాడు. అతను గెలిస్తే ఆండీ రాడిక్ (2003) తర్వాత గ్రాండ్స్లామ్ నెగ్గిన మొదటి అమెరికా ఆటగాడిగా నిలుస్తాడు.
ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్
ఆఫ్ఘనిస్తాన్తో రేపు జరుగబోయే తొలి టీ20కి ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మ్యాచ్కు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాలపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు.దులీప్ ట్రోఫీ ఫైనల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్లు (270, 80) ఆడటం వల్ల ఇషాన్ కొంత అలసటకు గురయ్యాడని, ప్రస్తుతం అతడు సౌకర్యంగానే ఉన్నాడని ఆయన చెప్పాడు. ఇషాన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ స్వల్ప గాయానికి గురయ్యాడు. దీంతో అతడు తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్కు కూడా దూరంగా ఉన్నాడు.ఇషాన్ ఆడకపోతే సంజూకు అవకాశం?ఒకవేళ ఇషాన్ కిషన్ పూర్తిగా కోలుకోకపోతే తొలి టీ20లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు.ఇషాన్ స్థానంలో ఒకవేళ ఆల్రౌండర్ను తీసుకోవాలని భావిస్తే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి టీ20 రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు
న్యూస్ పాడ్కాస్ట్
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
బిజినెస్
ఊహకందని బంగారం ధరలు.. వారం రోజుల్లో ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఊహకందని రీతిలో మారిపోతున్నాయి. ఉదయం భారీగా తగ్గిన రేటు, సాయంత్రానికి పెరిగిపోతోంది. దీంతో పసిడి ప్రియులలో ఒకింత ఆందోళన మొదలైపోయింది. ఈ కథనంలో వారం (సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు) రోజుల్లో బంగారం ధరల్లో జరిగిన మార్పులు ఏమిటి?, ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సెప్టెంబర్ 06న హైదరాబాద్, విజయవాడలలో రూ.1,54,800 వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రేటు, సెప్టెంబర్ 12న రూ.1,54,580 వద్దకు చేరింది. అంటే.. వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ తగ్గుతూ రూ.16 వేలకు చేరువవుతోందని తెలుస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,900 నుంచి రూ.1,41,700 వద్దకు చేరింది.చెన్నైలో గత ఆదివారం (సెప్టెంబర్ 06) రూ.1,54,800 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, శనివారం (సెప్టెంబర్ 12) నాటికి 1,54,580 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 1,41,900 నుంచి రూ.141700 వద్దకు చేరింది. వారం మధ్యలో ధరల్లో చాలా మార్పు వచ్చినప్పటికీ.. వారాంతం నాటికి కొంత పెరిగినట్లు తెలుస్తోంది.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు వచ్చాయి. వారం ప్రారంభంలో రూ.1,54,950 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, వారాంతానికి 1,54,730 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,050 నుంచి రూ.1,41,850 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఒకేరోజు 20 లక్షల ట్రైన్ టికెట్స్ బుకింగ్!
AI రేసులో భారత్.. పెట్టుబడుల్లో భారీ వృద్ధి!
భారతదేశంలో ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. పలు కంపెనీలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. సర్వీస్నౌ విడుదల చేసిన ఎంటర్ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్ 2026 ప్రకారం.. దేశీయ సంస్థల్లో AIపై పెట్టుబడులు ఒక్క సంవత్సరంలోనే 119 శాతం పెరిగాయని తెలుస్తోంది.2027 నాటికి 21.3 శాతం!ప్రస్తుతం ఇండియన్ కంపెనీలు తమ ఐటీ బడ్జెట్లో సగటున 16.6 శాతం ఏఐ కోసం ఖర్చు చేస్తున్నాయి. 2027 నాటికి ఇది 21.3 శాతానికి చేరుతుందని అంచనా. దీనివల్ల భారతదేశం ఏఐ రంగంలో ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది.ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ.. దానిని సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన గవర్నెన్స్ మాత్రం ఆ స్థాయిలో లేదు. భారతదేశంలోని కేవలం 22 శాతం సంస్థలకే ఏఐ టెస్టింగ్, ఆడిటింగ్, రిస్క్ అసెస్మెంట్ వంటి విధానాలు ఉన్నాయి. 54 శాతం సంస్థలు ఏఐ ఏజెంట్ను ఉపయోగిస్తున్నప్పటికీ, కేవలం 11 శాతం మాత్రమే అటానమస్ వర్క్ఫ్లోను అమలు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ వల్ల వచ్చే సమస్యలపై సంస్థలకు ఉన్న ఆందోళనలు. కాబట్టి ఏఐను వేగంగా ఉపయోగించడం మాత్రమే కాకుండా, దాన్ని బాధ్యతాయుతంగా నియంత్రించడం కూడా చాలా అవసరం.ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే..ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే మంచి డేటా, సిస్టమ్స్ అవసరం. అయితే.. భారతీయ సంస్థల్లో ఇది ఇంకా ఒక పెద్ద సవాలుగానే ఉంది. 74 శాతం కంపెనీలు.. డేటా అక్యురసీ, యాక్సెస్, మేనేజ్మెంట్ వంటి వాటిన మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.కాగా మరో 56 శాతం సంస్థలు లెగసీ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ప్రధాన సమస్యగా గుర్తించాయి. కేవలం 18 శాతం కంపెనీలు మాత్రమే విడివిడిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్స్కు భర్తీ చేశాయి. వివిధ విభాగాల డేటా ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకపోతే ఏఐకు పూర్తి సమాచారం అందదు. అందువల్ల ఏఐ అభివృద్ధితో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా బలోపేతం చేయాలి.ప్రభుత్వం చర్యలుఏఐ విషయంలో భారత ప్రభుత్వం కూడా కొన్ని ముఖ్యమైన చర్యలు చేపడుతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ యాక్ట్, డీపీడీపీ రూల్స్, ఏఐ గవర్నెన్స్ గైడ్లైన్స్, ఇండియాఏఐ మిషన్, ఇండియాఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ వంటి కార్యక్రమాలు ఏఐ ఇన్నోవేషన్తో పాటు ప్రైవసీ, సేఫ్టీ, అకౌంటబిలిటీ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తోంది.ఇదే విధంగా సంస్థలు కూడా తమ ఇంటర్నల్ గవర్నెన్స్ సిస్టంను బలపరచాలి. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లకు ఎంతవరకు డేటా, సిస్టమ్స్ యాక్సెస్ ఇవ్వాలి, ఎక్కడ హ్యూమన్ సూపర్ విజన్ అవసరం అనే విషయాలను స్పష్టంగా నిర్ణయించాలి. ఏఐపై ప్రజలకు, సంస్థలకు నమ్మకం ఏర్పడాలంటే ఈ గవర్నెన్స్ చాలా కీలకం. మొత్తం మీద.. భారతదేశం ఏఐలో పెట్టుబడులు పెట్టడంలో వేగంగా ముందుకు సాగుతోంది, కానీ గవర్నెన్స్ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారంలో పెట్టుబడి.. రూ.1 లక్షకు రూ.3.64 లక్షలు!
మొబైల్ డేటాపై పన్నుకు బ్రేక్!
దేశంలో మొబైల్ డేటా వినియోగంపై ప్రత్యేక పన్ను (డేటా టాక్స్) విధించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవడానికి కేంద్ర టెలికాం శాఖ (డాట్) సన్నాహాలు చేస్తోంది. ఈ పన్ను అమలులో ఎదురయ్యే సాంకేతిక చిక్కులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణపై పడే ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం.నేపథ్యం.. ప్రతిపాదనప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో భాగంగా డేటా వినియోగం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు చిన్నారుల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడమే లక్ష్యంగా డేటాపై పన్ను ప్రతిపాదనను పరిశీలించాలని డాట్ని ఆదేశించారు. గిగాబైట్కు(జీబీ) రూ.1 చొప్పున పన్ను విధించే మోడల్ను సెప్టెంబర్ 30 నాటికి రూపొందించాలని తొలుత భావించారు.ఎదురైన సవాళ్లుడేటా పన్ను అమల్లో ప్రాథమికంగా కొన్ని సమస్యలు గుర్తించారు. ప్రతి వినియోగదారుడి డేటా వాడకాన్ని సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. ఒకవేళ రీఛార్జ్ ప్యాక్లపై నేరుగా పన్ను వేస్తే తక్కువగా వినియోగించే వారికి కూడా అదనపు భారం పడుతుంది. యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, ఆరోగ్య సేవలు, ఈ-కామర్స్ వంటి నిత్య జీవితంలో డేటా అత్యవసరంగా మారింది. ఉత్పత్తికి ఉపయోగపడే డేటా, ఎంటర్టైన్మెంట్ డేటాను వేరు చేయడం వీలుపడదు. ఇప్పటికే రీఛార్జ్లపై 18% జీఎస్టీ చెల్లిస్తున్న వినియోగదారులపై మరింత భారం మోపడం డిజిటల్ ఇండియా ఆశయాలకు విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.డేటా వినియోగ గణాంకాలుడాట్ అధికారిక డేటా ప్రకారం, భారతదేశంలో మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2025లోని 229 బిలియన్ జీబీతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం 2026 నాటికి డేటా వినియోగం 24.5% పెరిగి 285 బిలియన్ జీబీకి చేరుకుంది. డిజిటల్ వ్యసనం, చిన్నారుల్లో స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు పన్నులు విధించడం సరికాదని నిపుణులు స్పష్టం చేశారు. వయస్సు నిర్ధారణ ప్రక్రియ, పేరెంటల్ కంట్రోల్స్, కంటెంట్ నియంత్రణ వంటి సాంకేతిక చర్యల ద్వారా మాత్రమే ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ
భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన మరోసారి ఆయన ప్రత్యేక భద్రతా ఏర్పాట్లపై ఆసక్తిని పెంచింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి చేరుకున్న పుతిన్ వెంట భారీ భద్రతా కాన్వాయ్ కూడా వచ్చింది. ఆయన ప్రయాణించే ప్రత్యేక అధ్యక్ష విమానంతో పాటు, అత్యంత భద్రతతో కూడిన ఆరస్ సెనాట్ (Aurus Senat) లిమోసిన్ కూడా విదేశీ పర్యటనలకు తరలించడం రష్యా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థలో కీలక భాగంగా మారింది.ప్రపంచ దేశాల అధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు స్థానికంగా ఏర్పాటు చేసిన అధికారిక వాహనాలను ఉపయోగించడం సాధారణం. అయితే పుతిన్ మాత్రం విదేశీ పర్యటనల్లోనూ తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆరస్ సెనాట్ వాహనాన్నే వినియోగిస్తారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో కూడిన ఈ లిమోసిన్ను అందుకే ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా అభివర్ణిస్తుంటారు.పుతిన్ కారు ప్రత్యేకత ఏంటి?పుతిన్ కాన్వాయ్లో సాధారణంగా భారీ సంఖ్యలో వాహనాలు ఉంటాయి. విదేశీ పర్యటనల సమయంలో మాత్రం ఆయన ప్రయాణించే ఆరస్ సెనాట్కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్, పేలుళ్లను తట్టుకునే సామర్థ్యం వంటి రక్షణ వ్యవస్థలతో ఈ కారును రూపొందించినట్లు తెలుస్తోంది.ఆరస్ సెనాట్ను రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ అభివృద్ధి చేసింది. రష్యన్ స్టేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నామి, సోలర్స్ జేఎస్సీ, యూఏఈకి చెందిన తవాజున్ హోల్డింగ్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రష్యా ప్రభుత్వం దేశీయంగా అత్యాధునిక లగ్జరీ, రక్షణ వాహనాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘కోర్టెజ్’ ప్రాజెక్టులో భాగంగా సెనాట్ రూపొందింది. 2018లో ఈ మోడల్ను పరిచయం చేశారు. దీని డిజైన్కు సోవియట్ కాలం నాటి ZIS-110 లిమోసిన్ నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతారు.ఇంజిన్.. వేగంపుతిన్ ఉపయోగించే ఆరస్ సెనాట్లో 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్, హైబ్రిడ్ వ్యవస్థతో కలిపి పనిచేస్తుంది. ఇది సుమారు 598 హార్స్పవర్, 880 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో ఈ కారు పనిచేస్తుంది.సెనాట్ పొడవు సుమారు 5,630 మిల్లీమీటర్లు, వెడల్పు 2,000 మిల్లీమీటర్లు, ఎత్తు 1,700 మిల్లీమీటర్లుగా ఉంటుంది. గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ లిమోసిన్.. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారు 9 సెకన్లలో చేరగలదని సమాచారం.భద్రతకు పెద్దపీటరష్యా అధ్యక్షుడి కోసం రూపొందించిన ఈ ప్రత్యేక వాహనంలో అత్యున్నత స్థాయి భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ రక్షణతో పాటు పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించినట్లు సమాచారం. యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.భద్రతతో పాటు సౌకర్యాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అధిక నాణ్యత కలిగిన లెదర్, వుడ్ ట్రిమ్, ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థలతో కారు ఇంటీరియర్ను రూపొందించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా ఈ వాహనాన్ని తీర్చిదిద్దినట్లు సమాచారం.మూమూలు ప్రజలూ వాడొచ్చు!ఆరస్ సెనాట్కు సాధారణ పౌరుల కోసం ప్రత్యేక వెర్షన్ కూడా ఉంది. అయితే దీని ఉత్పత్తిని పరిమిత సంఖ్యలోనే చేపడుతున్నట్లు సమాచారం. పౌర వెర్షన్ ధర సుమారు 18 మిలియన్ రూబిళ్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.2.5 కోట్లు.అయితే పుతిన్ ఉపయోగించే ప్రత్యేక అధ్యక్ష వెర్షన్ ధర, రక్షణ స్థాయి వంటి వివరాలు సాధారణంగా బహిరంగంగా వెల్లడించరు.గత ఏడాది చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్తో కలిసి ఇదే ఆరస్ సెనాట్లో ప్రయాణించడం కూడా అప్పట్లో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. దీంతో రష్యా అధ్యక్షుడి ప్రత్యేక లిమోసిన్పై ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆసక్తి పెరిగింది.
ఫ్యామిలీ
విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు
మొట్టమొదటి పూజలందుకోవలసిన దైవం.. వినాయకుడేవిఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడుఆది దంపతులకు మానసపుత్రుడు.. ఓంకార స్వరూపుడు...జ్ఞానానికి, వివేకానికి ప్రతీక.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు..కార్యసిద్ధిని ప్రసాదించే సిద్ధివినాయకుడు..భక్తుల కోరికలను ఆలకించే మన గణపయ్య!ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగాలంటే విఘ్ననాయకుడైన శ్రీగణేశుని అనుగ్రహం కావాల్సిందే. అందుకే దైవారాధనలో, పూజా కార్యక్రమాల్లో, సర్వశుభకార్యాల ప్రారంభంలో తొలి పూజలందుకునే దైవం వినాయకుడే.విఘ్నేశ్వరుని ఆరాధన కేవలం విఘ్నాలను తొలగించమని కోరడం మాత్రమే కాదు. మనలోని అజ్ఞానం, అహంకారం, అసహనం, తొందరపాటు వంటి అంతర్గత విఘ్నాలను తొలగించి, మంచి ఆలోచన, వివేకం, ఏకాగ్రత, ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించడం కూడా.పసుపు గణపతి – పవిత్రతకు ప్రతీకపార్వతీమాత చేతుల మీదుగా పసుపు ముద్దతో అవతరించి, మన ఇళ్లలో ‘‘పసుపు గణపతి’’గా తొలి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్ననివారకుడే కాక, విద్య, బుద్ధి, జ్ఞానాలను ప్రసాదించే జ్ఞానప్రదాతగా కూడా ఆరాధించబడుతున్నాడు.అందుకే, ‘కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ... ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!’ అంటూ మనం గణేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం.వినాయక చవితి – భక్తి, ఆనందాల పర్వదినంభాద్రపద శుద్ధ చవితి అనగానే ప్రతి ఇంటా వినాయక చవితి పండుగ సందడి కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుంది. పండుగల ద్వారా మనం కేవలం ఆచారాలను మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కూడా తరువాత తరాలకు అందిస్తాం. అందుకే పిల్లలను పూజలో భాగస్వాములను చేసి, గణపతి తత్వాన్ని వారికి పరిచయం చేయడం, వినాయకుని కథ చదివించడం లేదా చదివి వినిపించడం ఎంతో ముఖ్యం.వినాయక వ్రతం – మనలోని మంచి గుణాలకు నాంది సకల విఘ్నాలకు అధిపతియైన విఘ్నేశ్వరుడిని భాద్రపద శుద్ధ చవితి పర్వదినాన కుటుంబసమేతంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడాది పొడవునా విజయవంతంగా సాగాలని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని స్వామిని ప్రార్థిస్తాం.అయితే భక్తితో కొలుస్తూ మనం కోరేది కేవలం కోరికల నెరవేర్పు మాత్రమే కాదు, మంచి ఆలోచన ఇవ్వమని.. వివేకంతో నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వమని.. ఎదురయ్యే విఘ్నాలను ధైర్యంగా అధిగమించే శక్తి ఇవ్వమని.. కుటుంబంలో సుఖశాంతులు కలిగించమని.. సమాజంలో ఐకమత్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని.. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.ఇదే వినాయకవ్రతంలో అంతర్లీనంగా ఉన్న పరమార్థం.విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. బుద్ధిని ప్రసాదించే బుద్ధిప్రదాత..విజయాన్ని అందించే సిద్ధివినాయకుడు.. మంగళాలను చేకూర్చే మంగళమూర్తి..శ్రీ గణనాథుని కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... శ్రీ గణేశాయ నమః! శ్రీ సిద్ధివినాయకాయ నమః! శ్రీ విఘ్నేశ్వరాయ నమఃఇదీ చదవండి: వినాయక పూజకు సన్నద్ధత
వినాయక పూజకు సన్నద్ధత
వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటికీ భక్తిశ్రద్ధలతో నిండే పర్వదినం. పూజకు ముందుగా ఇంటిని శుభ్రపరుచుకోవడం, పూజా వేదికను సిద్ధం చేసుకోవడం, పూజకు అవసరమైన ద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్యాలు సమకూర్చుకోవడం మన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి, పరిశుభ్రమైన వస్త్రాన్ని ధరించి పూజకు సిద్ధమవుతాం. ఇంటి ప్రధాన గుమ్మాన్ని మామిడి తోరణాలతో, పుష్పాలతో అలంకరించి, పూజా మండపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతాం. మండపం పైభాగంలో పాలవెల్లి ద్రాక్షలు చేసి మండపం లోపల స్వస్తిక్, పద్మం వంటి శుభచిహ్నాలను లిఖించి, హరిద్రా గణపతి (పసుపు గణపతి), మట్టి వినాయక ప్రతిమలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి, దీపారాధనతో స్వామివారిని ఆహ్వానిస్తాం. పూజ ప్రారంభానికి ముందే అవసరమైన పూజాద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్య సామగ్రితో పాటు పిండివంటలు, ప్రసాదాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల పూజను ప్రశాంతంగా, ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణంగా నిర్వహించుకోవచ్చు. పూజకు చేసే సన్నద్ధత శరీరానికే కాదు.. మనసుకూ.... పరిశుభ్రమైన ఇంటితో పాటు పవిత్రమైన మనసుతో గణనాథుని ఆరాధించినప్పుడే పూజ పరిపూర్ణమవుతుంది. భక్తిశ్రద్ధలతో గణనాథుని కొలిచి, ఆయన అనుగ్రహంతో ప్రతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రారంభిద్దాం..ఇదీ చదవండి: విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు
గణనాథుడికి...ఘనమైన ఆసనం
గణేష్ వేడుకలలో ప్రధానంగా కనిపించేది అలంకరణ. గణనాథుడి ప్రతిమతో పాటు ఆసనం, బ్యాక్గ్రౌండ్, చుట్టూ రంగురంగుల పువ్వులు, కాంతులీనే లైట్లు... కనువిందు చేస్తుంటాయి. మండపాల వద్ద సరే, ఇళ్లలోనూ ఈ విధమైన అలంకరణ సందడి కనిపించాలంటే..?ఎక్కువ హంగామా లేకుండా అలంకరణ ఆకట్టుకునేలా ఉండేలా భిన్నమైన ఆసనాల స్టాండ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈవెంట్ ప్లానర్స్ వీటిని మరింత అందంగా రూపుకట్టి మన ముందుకు తీసుకు వస్తున్నారు. ముత్యాలు, రత్నాలు, జరీ, వెల్వెట్, మిర్రర్ వర్క్ వంటి వాటితో రూపొందించే ఈ ఆసనాలు చిన్న వినాయక విగ్రహాలకు చక్కగా అమరుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో పూజ చేసుకునే వారికి ఇవి ఉపయుక్తం కూడా. అందమైన పువ్వులు... ఆర్టిఫిషియల్ రోజాలు, మల్లెలు, చామంతులు, పచ్చని ఆకులతో తయారు చేసిన ఆసనం వినాయకుడి చుట్టూ పూల వేదికలా కనిపిస్తుంది. పండుగ తర్వాత ఈ ఆసనం సెట్ను స్టోర్ చేసుకుంటే ఇతర పూజ లు లేదా ఇంటి అలంకరణ ల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాలు కానుక గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.స్థలానికి తగ్గట్టు ... ఫ్లాట్లు, అపార్ట్మెంట్లలో స్థలం పరిమితంగా ఉంటుంది. అందుకు తగినట్టు అలంకరణ చేయాలన్నా అందరికీ కుదరదు. అందుకని, చిన్న సైజు ఆసనాలు మార్కెట్లోకి వచ్చాయి. టేబుల్, షెల్ఫ్ లేదా చిన్న పూజా స్థలంలో కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.సంప్రదాయం.. ఆధునికత... గోల్డ్ లేదా కాపర్ ఫినిష్తో ఉండే ఆర్టిఫిషియల్ ఆసనాలు గణేషుడి ప్రతిమకు రాజసాన్ని జోడిస్తాయి. మరోవైపు వుడ్, జూట్, పేస్టెల్ పూలతో రూపొందించిన ఆసనాలు మినిమల్ హోమ్ డెకార్ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. అయితే ఆసనం ఎంచుకునేటప్పుడు విగ్రహం పరిమాణానికి తగిన సైజు ఉండేలా చూసుకోవాలి. ప్రతిమ ఎంత అందంగా ఉన్నా, దానికి తగిన ఆసనం ఆ అలంకరణకు మరింత ప్రత్యేకతను, ఇంటికి స్పెషల్ లుక్ తీసుకొస్తుంది. సులభంగా అలంకరణకృష్ణాష్టమి, గణేష్ చతుర్ధి, వరలక్ష్మి.. వంటి సంప్రదాయ వేడుకలలో ప్రతిమలకు ఈ డెకార్ ఆసనాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పూర్తిగా చేతితో తయారు చేసినవి. సులభంగా అమర్చుకోవచ్చు, విడదీసి స్టోర్ చేసుకోవచ్చు. పండగ శోభ కోసం తయారు చేసిన ఈ అలంకరణలలో పూసలు, లేసులు, కుందన్స్, మఖమల్ క్లాత్తో పాటు ఖరీదైన స్టోన్స్ కూడా ఉపయోగించి డిజైన్ చేస్తున్నాం. – లక్ష్మి సింగ్లా, డెకార్ క్రియేషన్స్ – నిర్మలారెడ్డి
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
‘‘మా ‘అత్తమ్మ’, మా ‘నాన్న’... మా ఇంటికి పిల్లర్స్’’ అంటున్నారు రష్మికా మందన్నా. మామగారిని నాన్న అని పిలుస్తారామె. ‘దేవరకొండ’ ఇంటి కోడలిగా రష్మిక తొలి వినాయక చవితి పండగని జరుపుకోనున్నారు. మరి... పండగ ప్లాన్ ఏంటి? అంటే... ‘‘మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలను కుంటున్నాను’’ అన్నారు రష్మిక. ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన పలు వేడుకల్లో రష్మిక పాల్గొన్నారు. ఇప్పుడు ‘దేవరకొండ రష్మిక’గా పండగ చేసుకోవడం ఓ స్పెషల్ ఫీలింగ్ అన్నారామె. వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ‘దేవరకొండ రష్మిక’ చెప్పిన విశేషాలు...→ మీ ఇంట్లో పండగ ప్లాన్లో ఎవరి భాగం ఎక్కువ?అంతా మా అత్తమ్మే. ఇంట్లో ప్రతిదీ తనే ప్లాన్ చేస్తారు. నేను ఆమె చేసేవన్నీ జస్ట్ అలా ఎంజాయ్ చేస్తాను. నేననే కాదు... ఇంట్లో మేం అందరం బాధ్యత అంతా పూర్తిగా అత్తమ్మకే వదిలేస్తాం. అయితే డైట్ విషయంలో మేమంతా చాలా జాగ్రత్తగా ఉంటాం. బహుశా పండగ రోజు కూడా డైట్ నియమాలను పాటిస్తామేమో. మేం డైట్ పాటించినా, పాటించకపోయినా, ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా... ఇంట్లో ఏమేం చేయాలో అన్నీ మా అత్తమ్మే చూసుకుంటారు. → మీరు, మీ భర్త... మీ ఇద్దరిలో ఎవరికి భక్తి ఎక్కువ? ఇద్దరికీ... నేను ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు వర్క్ మీద వెళ్లేటప్పుడు పూజ చేసుకుని వెళతాను. విజయ్ కూడా చేస్తుంటారు. మేం ఇద్దరం గుడికి కూడా బాగా వెళుతుంటాం. భక్తి తాలూకు ఆ అనుభూతిని ఇద్దరం ఆస్వాదిస్తాం. → పండగకు ఇంటిని అలంకరించే విషయం కూడా మీ అత్తమ్మ చెప్పినట్లేనా? అంతే... ఇంట్లో ఎలాంటి సందడి నెలకొన్నా మా అత్తమ్మకే థ్యాంక్స్ చె΄్పాలి. మా అత్తమ్మ మా ఇంటికి ‘సూర్య రశ్మి’లాంటివారు. ఇంటిని అలంకరించడం, పిండి వంటలు చేయడం నుంచి పూజ చేయడం వరకూ అన్నీ ఆమే చేస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు మేం ఎంజాయ్ చేస్తాం. → మరి... పండగ వేడుకల్లో మీ మామయ్యగారు, మరిది (ఆనంద్ దేవరకొండ) భాగస్వామ్యమో? విజ్జు (విజయ్ దేవరకొండ), నాన్న, నా, ఆనంద్... మా అందరి భాగస్వామ్యం ఈక్వల్గా ఉంటుంది.. అయితే ఇంటి సారథి మాత్రం కచ్చితంగా అత్తమ్మే. మేం నలుగురం ఆమె మాట వింటాం... చెప్పినది చెప్పినట్లు నిజాయితీగా చేస్తాం. ఎందుకంటే మేం మా పనుల్లో మునిగిపోతాం... ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటాం. సో... ఇంట్లో మమ్మల్ని నిలకడగా ఉంచేది మా అత్తమ్మే. అసలు ఆవిడ పనులను ఎంత బాగా చేస్తారంటే... మెచ్చుకోవాలనిపిస్తుంటుంది. అంత బాధ్యతగా ఇంటిని పట్టించుకుంటారు కాబట్టే అత్తమ్మ ఏం చెబితే అది నమ్మి చేసేస్తాం. → ఇప్పుడు దేవరకొండ ఇంటి కోడలిగా పండగలో పాలుపంచుకోబోతున్నారు... ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు ఆ ఇంటి పూజల్లో పాల్గొన్నారా? పండగలప్పుడు, పూజలప్పుడు మా అత్తమ్మ దగ్గరవాళ్లందర్నీ పిలుస్తారు. ఈ ఇంటి ఆనవాయితీ అది. అలా నన్ను కూడా పిలిచేవారు. నన్ను సొంత మనిషిలా అనుకునేవారు. సో... ‘రష్మిక’లా ఈ ఇంటి వేడుకల్లో నేను చాలాసార్లు పాల్గొన్నాను. → ‘మిస్ రష్మిక’గా వెళ్లినప్పుడు ఇప్పుడు ‘మిసెస్ విజయ్’గా ఆ ఇంట్లో ఉంటున్న మీకు కనిపించిన తేడా? నిజాయితీగా చె΄్పాలంటే... ఏ తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదు. ఒప్పుడు ఓ ఫ్రెండ్లా నన్ను ఇంటికి పిలిచేవారు. ఇప్పుడు విజ్జు భార్యగా ఆ ఇంట్లో ఉన్నాను. వ్యక్తులుగా మాలో ఏ మార్పూ లేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే... ఆ కుటుంబ సభ్యురాలిగా ఉండటం అనే అనుభూతి వేరు. ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో దక్కే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం.→ ఎప్పుడైనా వినాయకుడి బొమ్మను గీశారా?నాకు బొమ్మలు గీయడం అస్సలు రాదు, కానీ రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. వినాయకుడి బొమ్మ గీసే అవకాశం ఎప్పుడూ రాలేదు. నాక్కూడా గీయాలనిపించలేదు. ఎందుకంటే నేను ఆ రూపానికి న్యాయం చేయలేనని నా ఫీలింగ్. అందుకే అసలు ప్రయత్నం కూడా చేయకూడదనుకున్నాను. కానీ రెండు సంవత్సరాల క్రితం ఎవరో నన్ను మట్టితో వినాయకుణ్ణి తయారు చేయమని అడిగితే కాదన లేక ప్రయత్నం చేశాను. నాకు చేతనైనంతలో బాగానే చేశాను.→ పెళ్లి వేడుకల్లో మీరు కట్టుకున్న చీరలన్నీ బాగున్నాయి... మరి... పండగ రోజు ఏం ప్లాన్ చేస్తున్నారు? కచ్చితంగా చీర కట్టుకుంటాను. ఈ పండగ జరుపుకోవడానికి వర్క్ నుంచి నాకు కొన్ని గంటలైనా బ్రేక్ దొరికితే బాగుండు అను కుంటున్నాను. ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ మెటీరియల్ శారీ కట్టుకోవాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలా ఉన్నాయి... అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది కట్టుకుంటాను.→ ఇటీవల విజయ్ ‘సీడ్ గణేశా’కి ప్రాధాన్యం ఇవ్వాలంటూ మట్టి వినాయకుడితో దిగిన ఫొటో బయటకు వచ్చింది... అవును... మా ఇంట్లో మేం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం. రాబోయే తరాలకు సుర క్షితమైన పర్యావరణం ఉండాలి కదా. అందుకు మా వంతు కృషి చేస్తాం. అందుకే ‘ఎకో ఫ్రెండ్లీ’ వినాయకుడిని ఇంటికి తీసుకు వస్తున్నాం. మేమే కాదు... అందరం ఎకో ఫ్రెండ్లీగా పండగ చేసుకుందాం.– డి.జి. భవాని
అంతర్జాతీయం
ఏఐ భయాలు నిజమేనా? సిలికాన్ వ్యాలీలో భిన్న వాదనలు!
శాన్ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్లో మానవాళికి తీవ్ర ముప్పుగా మారొచ్చంటూ కొందరు నిపుణులు చేస్తున్న హెచ్చరికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఏఐ వ్యవస్థలు త్వరలోనే మానవులకంటే శక్తిమంతంగా మారి నియంత్రణ తప్పితే మానవాళి ఉనికికే ప్రమాదం ఏర్పడొచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిలికాన్ వ్యాలీలోని పలువురు టెక్ వర్గాలు మాత్రం ఈ హెచ్చరికలను అతిశయోక్తిగా కొట్టిపారేస్తున్నాయి.ప్రతి సెప్టెంబర్లో శాన్ఫ్రాన్సిస్కోలో గోల్డ్మన్ సాక్స్ నిర్వహించే పెట్టుబడిదారుల సదస్సుకు ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులు హాజరవుతుంటారు. ఈసారి కూడా కంపెనీల వృద్ధి, పెట్టుబడులతో పాటు ఏఐ భద్రత, దాని భవిష్యత్ ప్రభావాలపై చర్చ జరిగింది.‘మానవాళిని నాశనం చేయొచ్చు’ఇటీవల ఆంత్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ.. ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు మానవాళి భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆట ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. 27 ఏళ్ల కాక్సన్ గతంలో ఓపెన్ఏఐలో పనిచేశారు. ఏఐ త్వరలోనే మానవులకంటే ఎక్కువ సామర్థ్యాన్ని సాధించి, సైబర్ వ్యవస్థలను కూడా హ్యాక్ చేయగల స్థాయికి చేరుకోవచ్చని హెచ్చరించారు.ఆంత్రోపిక్ టీమ్ లీడ్ ఇవాన్ హ్యూబింగర్ కూడా వచ్చే పదేళ్లలో ఏఐ కారణంగా మానవాళి నశించే అవకాశం 10 శాతానికంటే ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్లో పనిచేసిన పలువురు ఉద్యోగులు కూడా ఏఐ భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేశారు.హెచ్చరికలా.. ప్రచార వ్యూహమా?అయితే ఈ హెచ్చరికలపై సిలికాన్ వ్యాలీలో అందరూ ఏకీభవించడం లేదు. ఏఐ ప్రమాదాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో భయంతో పాటు ఆ సంస్థల ఉత్పత్తులపై ఆసక్తి పెరుగుతుందని కొందరు పెట్టుబడిదారులు, టెక్ వర్గాలు అంటున్నాయి.ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సంస్థలు భారీ విలువలతో స్టాక్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఏఐ సామర్థ్యాలను అత్యంత శక్తిమంతమైనవిగా చూపించేందుకు ఇలాంటి హెచ్చరికలు ఉపయోగపడుతున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ గతంలో ఏఐ కారణంగా ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో సగం వరకు కనుమరుగయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.‘భయపెట్టి పెట్టుబడులు పెంచుతున్నారా?’ఆంత్రోపిక్ నిధుల సమీకరణలో సుమారు 965 బిలియన్ డాలర్ల విలువను సాధించిన నేపథ్యంలో.. సంస్థలు తమ ఏఐ సామర్థ్యాలను చూపించేందుకు మానవాళికి ముప్పు వంటి అంశాలను ప్రచారంలో ఉపయోగిస్తున్నాయా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఆల్టిమీటర్ క్యాపిటల్ అధిపతి బ్రాడ్ గెర్స్ట్నర్ కాక్సన్ వ్యాఖ్యలను అతిశయోక్తిగా అభివర్ణించారు. హగ్గింగ్ ఫేస్ సీఈఓ క్లెమెంట్ డెలాంగ్ కూడా తొలుత ఈ హెచ్చరికలను ప్రశ్నించారు. అయితే ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించి ప్రపంచవ్యాప్తంగా నియంత్రణలు తీసుకురావాలని అమోడీ సూచించడంతో ఆయన వైఖరి కొంత మారింది.ఏఐపై ఆందోళనలు ఎందుకు పెరుగుతున్నాయి?ఆంత్రోపిక్ రూపొందించిన ‘మైథోస్’ వ్యవస్థ కొన్ని హ్యాకింగ్, సైబర్ భద్రతా పనుల్లో మనుషుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. తనను ఉంచిన పరిమిత కంప్యూటర్ వాతావరణం నుంచి స్వయంగా బయటపడే సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించినట్లు తెలిపింది.తమ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి బయో ఆయుధాల తయారీ, సైబర్ గూఢచర్యానికి ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి అడ్డుకున్నామని ఆంత్రోపిక్ పేర్కొంది. దీంతో ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కఠిన నియంత్రణలు అవసరమన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.అమెరికాలో నియంత్రణలు వస్తాయా?అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ సహా పలువురు నేతలు అత్యంత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతున్నారు. ఏఐపై మానవులు నియంత్రణ కోల్పోతే పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా మారొచ్చని సాండర్స్ హెచ్చరించారు.అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఏఐ అభివృద్ధిపై కఠిన ఆంక్షలకు అనుకూలంగా కనిపించడం లేదు. చైనాను మించేందుకు అమెరికా ఏఐ రంగంలో వేగంగా ముందుకు సాగాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.ఆంత్రోపిక్తో ట్రంప్ ప్రభుత్వానికి విభేదాలుఆంత్రోపిక్, ట్రంప్ ప్రభుత్వాల మధ్య ఇటీవల విభేదాలు చోటుచేసుకున్నాయి. అమెరికా సైన్యం తమ ఏఐ మోడళ్లను ఉపయోగించేందుకు విధించిన కొన్ని షరతులను ఆంత్రోపిక్ అంగీకరించకపోవడంతో వైట్హౌస్ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఈ నిర్ణయంపై ఫెడరల్ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.మరోవైపు ఓపెన్ఏఐ మాత్రం ట్రంప్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెబుతోంది. సంస్థ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్మన్ కూడా ప్రభుత్వంతో మంచి భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. ఓపెన్ఏఐ స్టాక్ మార్కెట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, సంస్థ తాజా విలువ సుమారు 852 బిలియన్ డాలర్లుగా ఉంది.పెట్టుబడిదారుల దృష్టి మాత్రం లాభాలపైనే..ఏఐ వల్ల మానవాళికి ముప్పు ఏర్పడొచ్చన్న హెచ్చరికలు, నియంత్రణలపై చర్చలు జరుగుతున్నప్పటికీ.. సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారుల దృష్టి మాత్రం వ్యాపారంపైనే ఉంది.ఆంత్రోపిక్ స్టాక్ మార్కెట్లోకి రావడానికి ముందు సమర్పించబోయే ఎస్-1 పత్రం కోసం ఓ పెట్టుబడిదారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో కంపెనీ ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వివరాలు ఉంటాయి. అయితే ఆయన ప్రధాన ప్రశ్న ఒక్కటే.. ఆంత్రోపిక్ లాభాల్లో ఉందా?ఏఐ వల్ల ప్రపంచం అంతమయ్యే ప్రమాదం ఉందా? అని డీ-మ్యాట్రిక్స్ సీఈఓ సిడ్ షెత్ను అడిగితే.. ఆయన మాత్రం ‘లేదు’ అని సమాధానమిచ్చారు.ఇదీ చదవండి: భారత్కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?
జకీర్ నాయక్ అప్పగింతపై చర్చలు..: మలేషియా ప్రధాని కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ను భారత్కు అప్పగించే అంశం న్యూఢిల్లీలో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. భారత్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జకీర్ నాయక్ అప్పగింత అంశంపై చర్చలు జరిగాయని అన్వర్ ఇబ్రహీం జాతీయ మీడియాకు వెల్లడించారు.ఈ అంశంపై చర్చలను ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గోప్యంగా ఉంచామని ఆయన చెప్పారు. భారత్, మలేషియా మధ్య విశ్వాసం, సంబంధాలను బలోపేతం చేసే అంశాల్లో దీనికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అప్పగింతకు సంబంధించిన డిమాండ్పై కొంత అవగాహన ఉందని, అయితే చట్టబద్ధమైన విధానాన్ని గౌరవిస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్వర్ ఇబ్రహీం చెప్పారు.జాకీర్ నాయక్ 2016లో భారత్లో ఆయనపై, ఆయనకు సంబంధించిన సంస్థలపై దర్యాప్తు ప్రారంభమైన తర్వాత మలేషియాకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన మలేషియాలో శాశ్వత నివాస హోదాతో ఉంటున్నారు. భారత్లో మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసుల్లో ఆయనను నిందితుడిగా పేర్కొన్నారు. భారత్ ఆయనను అప్పగించాలని అధికారికంగా కోరింది. అయితే విశ్వసనీయమైన ఆధారాలు సమర్పిస్తే చట్టబద్ధమైన మార్గాల్లో సహకరిస్తామని మలేషియా చెబుతోంది.
సముద్ర గర్భంలో రష్యా భారీ విధ్వంసకర ప్లాన్.. నాటో తిప్పికొట్టి..
ఆర్కిటిక్ సముద్ర జలాల్లో కీలకమైన సముద్రగర్భ కేబుళ్లను ధ్వంసం చేసేందుకు రష్యా చేపట్టిన రహస్య ప్రయత్నాన్ని నాటో దేశాలు అడ్డుకున్నాయి. కొన్ని నెలల క్రితం స్వాల్బార్డ్ దీవుల సమీపంలో రష్యా జలాంతర్గాములు ఓ రహస్య ఆయుధాన్ని ప్రయోగించేందుకు శిక్షణ తీసుకుంటుండగా బ్రిటన్, నార్వే, అమెరికా సంయుక్తంగా వాటిని గుర్తించి అడ్డుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది.ఈ రహస్య ఆపరేషన్ను రష్యా ప్రధాన సముద్రగర్భ పరిశోధనా విభాగం జీయూజీఐ నిర్వహించినట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. లోతైన సముద్రంలో ప్రయాణించగల చిన్న జలాంతర్గాములను ఉపయోగించి అత్యంత అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఆయుధాన్ని ఎలా ప్రయోగించాలో రష్యా సిబ్బంది పరీక్షించినట్లు చెప్పారు.బ్రిటన్, నార్వే, అమెరికా కలిసి రష్యా నౌకలను సముద్రంలో గుర్తించి ఎదుర్కొన్నాయి. దీంతో రష్యా తన శిక్షణను పూర్తి చేయలేకపోయింది. అనంతరం ఆ నౌకలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాయి. ఈ ఘటనలో ఎలాంటి సముద్రగర్భ కేబుల్ దెబ్బతినలేదు. నాటోతో ఘర్షణ ఏర్పడితే ఆ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో పరీక్షించడమే ఈ శిక్షణ ఉద్దేశమని అధికారులు తెలిపారు.స్వాల్బార్డ్ దీవులను నార్వే ప్రధాన భూభాగంతో కలిపే 2 సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు సుమారు 1,400 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. ఇవి సముద్ర మట్టానికి 2,700 మీటర్ల లోతు వరకు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపగ్రహ భూ కేంద్రంగా ఉన్న స్వాల్సాట్ నుంచి భారీ మొత్తంలో ఉపగ్రహ సమాచారాన్ని ఈ కేబుళ్లు ప్రసారం చేస్తాయి.విధ్వంసక చర్యలను పెంచుతున్న రష్యా ఈ ఘటనతో రష్యా యూరప్లో విధ్వంసక చర్యలను పెంచుతోందన్న పాశ్చాత్య దేశాల ఆందోళనలు మరింత పెరిగాయి. కొంతమంది అమెరికా నిఘా అధికారులు రష్యా నాటో పరస్పర రక్షణ ఒప్పందంలోని ఆర్టికల్ 5ను పరీక్షించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటోలోని ఓ సభ్యదేశంపై తీవ్రమైన దాడి జరిగితే ఇతర సభ్యదేశాలు దాన్ని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే నిబంధనే ఆర్టికల్ 5.రష్యా తన చర్యలతో కేబుళ్లకు ఎలాంటి నష్టం కలిగించలేదని అధికారులు తెలిపారు. బ్రిటన్, నార్వే అధికారులు తమ వద్ద కొత్త సాంకేతికతపై సమాచారం ఉందని మాస్కోకు తెలియజేసినట్లు చెప్పారు. రష్యా దాన్ని ఉపయోగించకుండా వెనక్కి తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు.‘‘మా సంయుక్త చర్య ద్వారా రష్యాకు స్పష్టమైన సందేశం పంపాం. వారు రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించలేరు’’ అని నార్వే రక్షణ మంత్రి టోరె శాండ్విక్ తెలిపారు. కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకునే ఏ ప్రయత్నాన్నైనా గుర్తించి తగిన పరిణామాలు ఎదుర్కొనేలా చేస్తామని రష్యా అధికారులకు స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు.బ్రిటన్, నార్వే ఏప్రిల్లోనే ఆందోళన రష్యా సముద్రగర్భ కార్యకలాపాలపై బ్రిటన్, నార్వే ఏప్రిల్లోనే ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా ప్రధాన సముద్రగర్భ పరిశోధనా విభాగం జీయూజీఐ నార్వే, బ్రిటన్ జలాల్లో రహస్య కార్యకలాపాలకు ప్రయత్నించినట్లు అప్పట్లో వెల్లడించాయి. ఈ విభాగంపై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు విధించాయి. 2022లో జర్మనీకి రష్యా నుంచి సహజ వాయువును సరఫరా చేసే నార్డ్ స్ట్రీమ్ సముద్రగర్భ పైప్లైన్లలో 4లో 3 ధ్వంసమైన తర్వాత నాటో దేశాలు సముద్రగర్భ మౌలిక వసతుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ ఘటనలో ఉక్రెయిన్ ప్రమేయాన్ని ఆ దేశం ఖండించింది. 2023 నుంచి సముద్రగర్భ పైప్లైన్లు, విద్యుత్ కేబుళ్లు, సమాచార కేబుళ్లకు సమీపంలో కొన్ని నౌకలు నెమ్మదిగా ప్రయాణిస్తూ వాటి స్థానాలను గుర్తిస్తున్నట్లు భద్రతా నిపుణులు గుర్తించారు. దీనిని ‘డ్రిఫ్టింగ్’గా పిలుస్తారు.గత ఏడాది ఉత్తర సముద్రంలో ఇలాంటి నౌకల సంఖ్య 52 శాతం పెరిగి 13,079కు చేరింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఈ కార్యకలాపాలు 88 శాతం పెరిగి 18,401 నౌకలకు చేరినట్లు సముద్ర భద్రతా విశ్లేషణ సంస్థ విండ్వార్డ్ తెలిపింది. సముద్రగర్భ మౌలిక వసతులపై విస్తృతంగా సమాచారాన్ని సేకరించడం చట్టవిరుద్ధం కాకపోయినా, ఇంత భారీ స్థాయిలో ప్రాంతాలను గుర్తించడం భవిష్యత్తులో విధ్వంసక చర్యలకు సిద్ధమవుతున్న సంకేతంగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు.ఈ కార్యకలాపాలు, కొన్ని కేబుళ్లపై అనుమానాస్పద జోక్యాల నేపథ్యంలో నాటో గత ఏడాది జనవరిలో బాల్టిక్ సెంట్రీ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది. బ్రిటన్ నేతృత్వంలో నార్డిక్ వార్డెన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. కీలక మౌలిక వసతులపై నిఘా, గస్తీని పెంచడం ఈ కార్యక్రమాల ఉద్దేశం.విద్యుత్, సమాచార ప్రసార కేబుళ్లపై ప్రపంచవ్యాప్తంగా ఆధారపడటం పెరుగుతున్నందున సముద్రగర్భ మౌలిక వసతుల ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. కృత్రిమ మేధ కారణంగా సమాచారంతో పాటు విద్యుత్ అవసరం పెరుగుతుండటంతో ఈ కేబుళ్ల సంఖ్య కూడా ప్రతి ఏడాది పెరుగుతోంది. అయితే యూరప్ ఇప్పటికీ ఈ మౌలిక వసతులపై ముప్పును ఎదుర్కొనే స్థితిలోనే ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.బ్రూకింగ్స్ సంస్థకు చెందిన సీనియర్ పరిశోధకుడు బ్రూస్ జోన్స్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లలో యూరప్ సముద్రగర్భ మౌలిక వసతులపై ఆధారపడటాన్ని భారీగా పెంచుకున్నా, వాటిని రక్షించే సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుందని అన్నారు. పెరుగుతున్న రష్యా ముప్పు నేపథ్యంలో ఇప్పుడు ఆ రక్షణ సామర్థ్యాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు.
భారత్లో పుతిన్-జిన్పింగ్ ‘పవర్’ షో!
ప్రపంచ దేశాల అధినేతలు సదస్సులు, సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రసంగాలకే కాదు.. వాళ్ల ప్రయాణాలు, భద్రత-ఆహార ఏర్పాట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. వెంట తీసుకొచ్చే వస్తువులు, అందుకునే కానుకల వరకు ప్రతీ అంశంపైనా ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న 2026 బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ విషయంలో అంతకు మించిందేదో కనిపిస్తోంది.. ఇద్దరు నేతలు భారత్కు చేరుకున్న తీరు ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీసింది. ఒకవైపు పుతిన్ అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఐఎల్-96-300పీయూలో ఢిల్లీకి వచ్చారు. దీనినే ‘డూమ్స్డే ప్లేన్’, ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ వంటి పేర్లతో పిలుస్తారు. మరోవైపు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్పింగ్ వచ్చారు. గగన ప్రయాణమే కాదు.. ఇటు వీళ్ల కోసం తెచ్చిన ప్రెసిడెన్షియల్ కార్లు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. పుతిన్ కోసం ఔరస్ సెనాట్.. జిన్పింగ్ కోసం సమ్థింగ్ స్పెషల్ హోంగ్చీ ఎన్701 హైలైట్గా నిలిచాయి. ఒకరిది ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా పేరొందితే.. మరొకరి రాజకీయ చరిత్రతో ముడిపడిన ‘రెడ్ ఫ్లాగ్’ బ్రాండ్గా పేరొందాయి.‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’..పుతిన్ ప్రయాణించే విమానం ఐఎల్-96-300పీయూ.. ఎంతో ప్రత్యేకం. అత్యవసర పరిస్థితుల్లోనూ రష్యా అధ్యక్షుడు దేశ సైనిక, ప్రభుత్వ వ్యవస్థలతో సురక్షితంగా కమ్యూనికేట్ చేయగలిగేలా దీన్ని మొబైల్ కమాండ్ సెంటర్గా రూపొందించారు. శాటిలైట్ లింకులు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, రాడార్ జామింగ్ సహా పలు రక్షణ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. అంతేకాదు.. పుతిన్ భారత్కు వచ్చినప్పుడు ఒకే తరహాకు చెందిన రెండు విమానాలు ఒకేసారి ప్రయాణించాయి. అసలు అధ్యక్షుడు ఏ విమానంలో ఉన్నారో గుర్తించడం కష్టమయ్యేలా చేసే ఈ వ్యూహం.. భద్రతలో భాగమే. అందుకే ఐఎల్-96-300పీయూకి ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’, ‘డూమ్స్డే ప్లేన్’ వంటి పేర్లు వచ్చాయి.ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్..ఆకాశంలో ఇంతటి భద్రత ఉంటే.. పుతిన్ నేలపై ప్రయాణించే కారు కూడా అంతే కట్టుదిట్టంగా ఉంటుంది. ఢిల్లీలో పుతిన్ ఉపయోగించిన ఔరస్ సెనాట్ను అందుకే ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా అభివర్ణిస్తారు. బుల్లెట్లు, పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించిన ఈ ఆర్మర్డ్ లిమోసిన్ను రష్యా దేశీయంగా అభివృద్ధి చేసింది. పాశ్చాత్య లగ్జరీ కార్లపై ఆధారపడకుండా.. దేశాధ్యక్షుడి స్థాయికి తగ్గ భద్రతా వాహనాన్ని సొంతంగా తయారు చేసుకోగలిగింది. బ్రిక్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పుతిన్ ఇదే కారులో ప్రయాణించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.జిన్పింగ్ ‘ఎయిర్ చైనా’..ఇక పుతిన్ విమానంతో పోలిస్తే జిన్పింగ్ ప్రయాణించిన విమానం మరో రకమైన ప్రత్యేకతను చూపిస్తుంది. చైనా అధ్యక్షుడు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో భారత్కు చేరుకున్నారు. ఇది పుతిన్ ఐఎల్-96-300పీయూ తరహాలో మొబైల్ కమాండ్ సెంటర్గా రూపొందించిన ప్రత్యేక అధ్యక్ష విమానం కాదు. అయితే దేశాధ్యక్షుడి విదేశీ పర్యటన కావడంతో భద్రత, ప్రోటోకాల్కు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అంటే.. ఒకరి విమానం అత్యంత రహస్య భద్రతా వ్యవస్థలకు ప్రతీక అయితే.. మరొకరి ప్రయాణం చైనా అధికారిక విమానయాన వ్యవస్థను ప్రతిబింబిస్తోంది.‘రెడ్ ఫ్లాగ్’ ఎన్701..విమానం నుంచి రోడ్డుపైకి వస్తే.. జిన్పింగ్ కోసం ఉపయోగించే హోంగ్చీ ఎన్701 మరో ప్రత్యేక ఆకర్షణ. హోంగ్చీ అంటే చైనీస్లో ‘రెడ్ ఫ్లాగ్’.. అంటే ‘ఎర్ర జెండా’ అని అర్థం. చైనా రాజకీయ, అధికార వ్యవస్థతో దశాబ్దాలుగా ముడిపడిన ఈ బ్రాండ్.. దేశ అత్యున్నత నాయకత్వానికి ప్రతీకగా మారింది. జిన్పింగ్ కోసం ఉపయోగించే ఎన్701 సాధారణ హోంగ్చీ కారు కాదు. సుమారు 5.5 మీటర్ల పొడవుండే ఈ ప్రత్యేక లిమోసిన్లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, భారీ ఆర్మర్, బుల్లెట్ ప్రూఫ్ టైర్లు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే దీని పూర్తి సాంకేతిక వివరాలను చైనా అధికారికంగా వెల్లడించలేదు. అందుకే ఎన్701 చుట్టూ ఉన్న ఆసక్తి.. దాని డిజైన్ కంటే, దానిలో దాగి ఉన్న భద్రతా సాంకేతికతపైనే ఎక్కువ.కేవలం ప్రయాణం కాదు.. పవర్ స్టేట్మెంట్!ఈ విమానాలు, కార్లు కేవలం ప్రపంచ నేతలను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే సాధనాలు మాత్రమే కాదు. ఆ విమానాలు, కార్లు ఆయా దేశాల భద్రతా ఏర్పాట్లు, టెక్నాలజీ, సొంత తయారీ సామర్థ్యాన్ని చూపిస్తాయి. బ్రిక్స్ వంటి ప్రపంచ వేదికపై నేతల రాకతో పాటు వారి వెంట వచ్చిన ఈ ‘పవర్ మెషీన్లు’ కూడా తమదైన రీతిలో ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఆకాశంలో భద్రతా కోటలు.. నేలపై కదిలే కోటలు.. మొత్తంగా చూస్తే ఇది కేవలం నేతల ప్రయాణం కాదు.. రష్యా, చైనాల పవర్ స్టేట్మెంట్!.ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టాడు!
జాతీయం
బ్రిక్స్ ఎఫెక్ట్..! దేశ రాజధానిలో హోటళ్లకు ఫుల్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు హోటల్ పరిశ్రమకు భారీ డిమాండ్ను తీసుకొచ్చింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు, దౌత్యవేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో, ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో హోటల్ గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సుమారు 3 వేల గదులు బుక్కయినట్లు సమాచారం. హోటల్ గది అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. రూ.80 వేల నుంచి రూ.2.3 లక్షల దాకాసాధారణ రోజుల్లో ఫైవ్స్టార్ హోటళ్లలో రూ.10వేల నుంచి రూ.18 వేల వరకు ఉండే లగ్జరీ హోటల్ గది అద్దె ప్రస్తుతం రూ.80 వేలు, అంతకంటే ఎక్కువకు చేరినట్లు హాస్పిటాలిటీ రంగ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని ఫైవ్స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో రోజుకు రూ.18వేల నుంచి రూ.25 వేల వరకు అద్దె వసూలు చేసే హోటళ్లు ఇప్పుడు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. హోటల్ ఐటీసీ మౌర్యాలో గదికి 11, 12వ తేదీల్లో కేవలం ఒకే ఒక్క రాత్రికిగాను ఏకంగా రూ.2.30 లక్షల బిల్లు వేయడం గమనార్హం. కొన్ని హోటళ్లలో గదులు పూర్తిగా బుక్ కాగా, మరికొన్ని చోట్ల గదులు అందుబాటులో లేకుండా పోయాయి. సదస్సు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, దాదాపు సెప్టెంబర్ 20 వరకు టారిఫ్లు అధికంగానే ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హోటల్ ‘ఐటీసీ మౌర్య’లో రష్యా అధ్యక్షుడు పుతిన్ బస చేస్తున్న క్రమంలో ఆయన దృష్టిని ఆకర్షించేందుకు వారం రోజుల ముందే దేశంలోని సంపన్న వర్గాలకు చెందిన వారు సైతం ఆ హోటల్లో ప్రైవేటు గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బస చేసిన తాజ్ ప్యాలెస్లోని గదులకూ డిమాండ్ ఆకాశాన్నంటింది.సెంట్రల్ ఢిల్లీకే పరిమితం కాని డిమాండ్బ్రిక్స్ శిఖరాగ్రం ప్రభావం కేవలం సెంట్రల్ ఢిల్లీలోని ఒబెరాయ్, తాజ్ ప్యాలెస్, లీలా ప్యాలెస్ వంటి ఫైవ్స్టార్ హోటళ్లకే పరిమితం కాలేదు. ఏరోసిటీ, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లోని హోటళ్లకూ భారీగా బుకింగ్స్ వచ్చాయి. అనేక హోటళ్లలో గదుల లభ్యత దాదాపు లేనట్లు సమాచారం. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ సభ్యుడు రాజన్ సెహగల్ మాట్లాడుతూ.. బ్రిక్స్ సదస్సు భారత్ ఆతిథ్య, పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించే గొప్ప అవకాశమని అన్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, భారీ ప్రతినిధి బృందాలతో భారత్కు వస్తున్నప్పుడు హోటళ్లలో డిమాండ్ పెరగడం సహజమేనని తెలిపారు. ల్యూటెన్స్ ఢిల్లీతో పాటు ఎన్సీఆర్లోని హోటళ్లు కూడా భారీ బుకింగ్స్తో కళకళలాడుతున్నాయని చెప్పారు.అధినేతల కోసం అత్యున్నత స్థాయి గదులుదేశాధినేతలు, మంత్రులు, సీనియర్ దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు సాధారణంగా హోటళ్లలో అత్యున్నత కేటగిరీ గదులనే ఎంచుకుంటారని కేంద్ర అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో పరిమిత సంఖ్యలో ఉన్న ప్రీమియం గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగి అద్దెలు భారీగా పెరిగాయి. భారత ఆతిథ్యానికి ప్రపంచ వేదికబ్రిక్స్ సదస్సు కేవలం హోటల్ రంగానికి వ్యాపార అవకాశాలను కల్పించడమే కాకుండా.. ప్రపంచానికి భారతీయ సంçస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, సంగీతం, నృత్యాలు, ఆతిథ్యాన్ని పరిచయం చేసేందుకు గొప్ప అవకాశమని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ ఇప్పటికే జీ20, ఏఐ సదస్సు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని గుర్తుచేస్తూ.. బ్రిక్స్ సదస్సుతో కూడా దేశ పర్యాటక రంగానికి మరింత అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని అంటున్నాయి.ప్రాంతీయ వంటకాలు.. సాంస్కృతిక కార్యక్రమాలుబ్రిక్స్ ప్రతినిధులకు మన దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు, వంటకాలను పరిచయం చేస్తున్నట్లు ఢిల్లీ హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ మురళీమణి మీడియాకు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన సంçస్కృతి, ఆహార వైవిధ్యం ఉందని, అందుకు అనుగుణంగా వివిధ రకాల వంటకాలను హోటళ్లలో అందిస్తున్నట్లు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. బడ్జెట్ హోటళ్లలోనూ ప్రాంతీయ వంటకాలను అందించేలా హోటల్ యాజమాన్యాలకు కేంద్రం ముందుగానే సూచనలు చేసినట్లు తెలిసింది.
భారత్ ఇన్నోవేషన్కు ప్రపంచ దేశాలు ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: 18వ ‘బ్రిక్స్’శిఖరాగ్ర సద స్సు వేదికగా భారత్ తన సాంకేతిక, పరిశోధ నా, స్టార్టప్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్లు, ల్యాబొరేట రీలు, రీసెర్చ్ పార్క్ల నుంచి వెలువడిన అత్యాధునిక డీప్టెక్ ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో ‘బ్రిక్స్’లో ప్రదర్శన ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో దేశానికి చెందిన 37 అత్యాధునిక డీప్టెక్ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజారోగ్యం, వైద్యం, పునరుత్పాదక ఇంధనం, సముద్ర సాంకేతికత, విద్యుత్ వాహనాలు, మాతా–శిశు ఆరో గ్యం వంటి విభిన్న రంగాలకు చెందిన సాంకేతిక పరిష్కారాలను ఇందులో ప్రదర్శించారు. వాటిలో ము ఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యవస్థ, నీటిపై ఏర్పాటు చేసే ఫ్లోటింగ్ సోలార్ పీవీ సాంకేతికత, మెరైన్ రోబోటిక్స్, అరుదైన ఖనిజాల అవసరం లేని రేర్ ఎర్త్ ఫ్రీ ఈ–పవర్ట్రెయిన్లు, ఏఐ ఆధారిత తల్లి– గర్భస్థ శిశువు ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ వంటి వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు. భారత్ ఉన్నత విద్యా వ్యవస్థలో రూపుదిద్దు కుంటున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కేంద్రం పే ర్కొంది. దేశంలోని స్టార్టప్లు, ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రయోగ శాలలు, రీసెర్చ్ పార్క్లను ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, విశ్వవిద్యాల యాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వాలు, విదేశాల్లోని భారతీయ పూర్వ విద్యార్థుల నెట్వర్క్తో అనుసంధానం చేయడానికి ఇది ఉపయోగపడనున్నట్లు వేదిక సందర్భంగా కేంద్రం పేర్కొంది. ఈ వేదిక ద్వారా భారత ఆవిష్కర్తలకు కేవలం తమ సాంకేతికతను ప్రదర్శించే అవకాశమే కాకుండా పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాలు, అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశం వంటి అవకాశాలు లభించనున్నాయి.‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరంతో..శుక్ర, శనివారాల్లో జరిగిన ‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరం కార్యక్రమంతో ఈ ప్రదర్శనను అను సంధానం చేశారు. దీంతో ‘బ్రిక్స్’ సభ్య దేశాలకు చెందిన సీఈఓలు, పెట్టుబడి దారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ ప్రతినిధులతో భారతీయ స్టార్టప్లు నేరుగా పరిచయం ఏర్పరుచుకునే అవకాశం లభించింది. బిజినెస్–టు–బిజినెస్(బీ2బీ) సమావేశాలు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, పెట్టుబడి చర్చలు, వ్యాపార సంబంధాల ఏర్పాటు అంశాలకు ఈ వేదిక దోహదపడిందని కేంద్రం పేర్కొంది. భారత్ 2026 ‘బ్రిక్స్’ అధ్యక్షతన నిర్దేశించిన ‘బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబి లిటీ’ అనే థీమ్కు అనుగుణంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. బిక్స్ ఎడ్యుకేషన్ ట్రాక్లో గుర్తించిన ఐదు ప్రాధాన్య రంగాల్లో ఒకటైన ‘పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్లను బలోపేతం చేయడం’ లక్ష్యాన్ని ఈ ప్రదర్శన ముందుకు తీసుకెళ్తుందని కేంద్రం తెలిపింది. 2026లో భారత డీప్టెక్ స్టార్టప్ల కోసం నిర్వహిస్తున్న ప్రధాన ఎక్స్పోజిషన్లలో ఇది రెండోది. తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జూన్ 14 నుంచి 16 వరకు నిర్వహించారు. తాజాగా బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ రెండో ఎడిషన్ ద్వారా భారత ఆవిష్క రణలను ‘బ్రిక్స్’ దేశాల నాయకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల దృష్టికి తీసికెళ్లడం గమనార్హం.ఆవిష్కర్తలతో విద్యాశాఖ మంత్రి ముచ్చటకేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి భారత్ మండపంలోని ఎక్స్ పోజిషన్ను సందర్శించి డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలతో మాట్లా డారు. వివిధ రంగాల్లో భారతీయ యువ ఆవిష్కర్తలు రూపొందించిన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ఆయన పరిశీలించారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని డీప్టెక్ స్టార్టప్లకు అంతర్జాతీయ స్థాయి వేదిక లభిస్తోందని జోషి పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనే ప్రపంచ నాయకుల ముందు భారతీయ స్టార్టప్లు తమ ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ వేదిక ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందని వ్యాఖ్యానించారు.
2 దశాబ్దాల బ్రిక్స్ స్మారక స్టాంప్
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా రెండు స్మారక తపాలా బిళ్లలను పోస్టల్ శాఖ శనివారం విడుదలచేసింది. ఢిల్లీలో 18వ సమావేశంలో ఈ రెండు పోస్టల్ స్టాంప్లను విడుదలచేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు తపాలా బిళ్లలపై ‘బ్రిక్స్: రెండు దశాబ్దాల సహకారం, 2006–2026’ అని ఇంగ్లిష్, హిందీలో ముద్రించారు. పరస్పర విశ్వాసానికి ప్రతీకగా తొలి స్టాంప్ను, భారత్ అధ్యక్షత సమావేశాలు, కూటమి దార్శనికత, లోగోను గుర్తుచేస్తూ మరో స్టాంప్ను విడుదలచేశారు.
ద్విపాత్రాభినయం తప్పదు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాల నూతన అంతర్జాతీయ విపణుల మధ్య సహకారానికి అత్యంత ప్రభావవంతమైన వేదికగా బ్రిక్స్ కూటమి ఎదిగిందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ఆయన ఈ కూటమి దేశాల అగ్రనేతలనుద్దేశించి కీలక ప్రసంగంచేశారు. ‘‘పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపనకు బ్రిక్స్ దేశాలు ద్విపాత్రాభినయం చేయాల్సిందే. ఎందుకంటే పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లోని యుద్ధాలు, మారుతున్న విపరిణామాలతో ఆయా ప్రాంతాల ప్రజలు కష్టాల కడలిలో పడిపోయారు. అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్గుతోంది. ఇకనైనా పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల అగ్రనేతలు ఉమ్మడిగా పోరాడాలి. చరిత్ర గుర్తుంచుకునేలా సరైన పథంలో నడిచి ఈ ప్రాంతాల పురోభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలి’’అని జిన్పింగ్ పిలుపునిచ్చారు. చైనా సైతం పశ్చిమాసియా, గల్ఫ్లో శాంతి,సుస్థిరత కోసం ఈ కూటమితో కలిసి సమష్టిగా కృషిచేస్తుందని స్పష్టంచేశారు. ఆ మనస్తత్వం మానండి.. ‘‘ఇకనైనా బ్రిక్స్ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి మనస్తత్వాన్ని వీడాలి. సభ్య దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం మానుకోవాలి. ఆయా దేశాల సార్వ¿ౌమత్వాలకు భంగం వాటిల్లేలా వ్యవహరించడం వంటి పనులకు చరమగీతం పాడాలి. శత్రుత్వాలకు త్యజించాలి. ఇందుకోసం పరస్పర అవగాహన, విశ్వాసం పెంచుకోవడంపై కూటమి దేశాలు దృష్టిపెట్టాలి. బ్రిక్స్ దేశాలు స్వావలంబన సాధిస్తూనే, దేశీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే సరికొత్త అభిృవృద్ధిబాటల్లో పయనించడం శుభసూచకం. అగ్రదేశాల ఆధిపత్య విధానాలు, కేంద్రీకృత రాజకీయాల విపరిణామాల దుష్పఫలితాలను మనందరం చవిచూస్తున్నాం. దీంతో శాంతి, అభివృద్ధి, భద్రత, సుపరిపాలన అనేవి కష్టమవుతున్నాయి. వీటికి పరిష్కారాలు వెతుకుదాం. కోవిడ్ సంక్షోభాన్ని సమష్టిగా ఎదుర్కొన్నట్లు ఇకమీదటా వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకుందాం’’అని జిన్పింగ్ అన్నారు.
ఎన్ఆర్ఐ
వైఎస్సార్ చెస్ టోర్నమెంట్లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమికల
మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ జర్మనీ విభాగం కన్వీనర్ కృష్ణ తేజా రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో మ్యూనిక్ నగరంలో వైఎస్సార్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతగా నిలిచిన డార్మ్ స్టడ్ అప్లయిడ్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యార్ధి శిబి శ్రీనివాస్ చెమికలకు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగ కోర్డినేటర్ విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల ట్రోఫీని అందజేశారు. జర్మనీ వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి సూర్య చౌదరి నేలకుర్తి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.(చదవండి: జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి)
కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్!
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం పట్టుకుంది. ఈ కేసులో ఓ కువైట్ పౌరుడితో పాటు భారతీయులు సహా 40 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న కొందరు బస్సులు, లారీలను ‘అంగర్’ ప్రాంతంలోని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డీజిల్ చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇలా సేకరించిన డీజిల్ను ఇతర ట్యాంకర్లలోకి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ అక్రమ దందా కోసం ట్యాంకర్లను నెలకు 1,600 కువైటీ దినార్లకు అద్దెకు ఇచ్చింది అరెస్టైన కువైట్ పౌరుడేనని విచారణలో తేలింది. చాలాకాలంగా నిఘా పెట్టిన అధికారులు డీజిల్ చోరీ చేస్తున్న సమయంలో ప్రధాన నిందితులను పట్టుకున్నారు. అనంతరం దొంగిలించిన డీజిల్ కొనుగోలు చేసేందుకు వచ్చిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే, డీజిల్ దొంగతనం, విక్రయం, కొనుగోలులో భాగమైన మొత్తం 41 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ముఠా ఉపయోగించిన 38 ట్రక్కులు, బస్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు, ఆర్థిక నష్టాన్ని అరికట్టడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇవీ చదవండి: లెబనాన్పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్.. 11 మంది మృతి
పౌరసత్వం రద్దయిన వారికి కువైట్ గుడ్న్యూస్
కువైట్ సిటీ: కువైట్లో పౌరసత్వాన్ని కోల్పోయిన వారికి దేశంలో కొనసాగేందుకు కొత్త నివాస అనుమతి నిబంధనను తీసుకురావడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో పౌరసత్వం రద్దు చేసినా లేదా వెనక్కి తీసుకున్నా, కొన్ని షరతులతో గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు కువైట్లో నివసించేందుకు అనుమతి లభించనుంది.పౌరసత్వం కోల్పోయిన తర్వాత తమ పాత విదేశీ పౌరసత్వాన్ని తిరిగి పొందిన వారు లేదా మరో దేశ పౌరసత్వం పొందిన వారు ఈ కొత్త నిబంధన కింద సాధారణ నివాస అనుమతికి అర్హులవుతారు. అయితే ఈ అనుమతి గరిష్ఠంగా 10 సంవత్సరాల కాలానికి మాత్రమే ఉండనుందని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, నివాస అనుమతి మంజూరు చేయడం, దాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు, నియంత్రణలను రెసిడెన్సీ అఫైర్స్ విభాగం డైరెక్టర్ జనరల్ నిర్ణయించనున్నారు. ఈ నిబంధనల ప్రకారం నివాస అనుమతి పొందిన వారు కువైట్లో ఉద్యోగం చేసేందుకు పాటించాల్సిన నిబంధనలను కూడా అధికారులు నిర్ణయించనున్నారు.అలాగే, సవరించిన నిబంధనలను అధికారిక గెజిట్లో ప్రచురించిన తర్వాత ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీంతో పౌరసత్వం కోల్పోయినప్పటికీ ఇతర దేశ పౌరసత్వం పొందిన వారికి కువైట్లో చట్టబద్ధంగా నివసించే అవకాశం లభించనుంది.ఇవి కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!
ప్రయాణికులకు గుడ్న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!
మనామా: బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా లైసెన్స్ పొందిన ట్యాక్సీలు నేరుగా ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించేందుకు అనుమతి లభించింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ సేవలు తాజాగా అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.బహ్రెయిన్, సౌదీ అరేబియా రవాణా అధికారులు పరస్పర సమన్వయంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల పౌరులు, నివాసితులు, పర్యాటకులు ఇకపై సొంత వాహనాలపై ఆధారపడకుండా ట్యాక్సీల ద్వారా నేరుగా ప్రయాణించే అవకాశం ఏర్పడింది. అలాగే, రెండు దేశాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు.అయితే కాజ్వే మీదుగా నడిచే ట్యాక్సీలకు కొన్ని నిబంధనలు విధించారు. నిర్దేశించిన సాంకేతిక, భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించే లైసెన్స్ పొందిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ట్యాక్సీ వాహనం ఐదేళ్లకు మించి పాతది కాకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే, కొత్త సేవలు అందుబాటులోకి రావడంతో కింగ్ ఫహద్ కాజ్వేపై ప్రయాణికుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. దీంతో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం, ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.ఇరు దేశాల మధ్య ట్యాక్సీ రాకపోకలు పెరగడం వల్ల వాణిజ్యం, రిటైల్ వ్యాపారం, పర్యాటకం, ఎగ్జిబిషన్ రంగాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని బహ్రెయిన్ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా సొంత వాహనం లేని వారు బహ్రెయిన్ నుంచి సౌదీకి, అక్కడి నుంచి తిరిగి బహ్రెయిన్కు సులభంగా ప్రయాణించేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది.
క్రైమ్
ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టిన 'డ్రెస్'!
ముంబై: ఇతరుల డ్రెస్ వేసుకోవడం, వారి వస్తువులను వాడుకోవడమంటే కొందరికి చెడ్డ చిరాకు. అలాగే, చెప్పకుండానే ఇతరులు తమ డ్రెస్ను వేసుకోవడాన్ని, వస్తువులు వాడుకోవడాన్ని ఏమాత్రం సహించలేరు. ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఇది ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ఆగ్రహంతో కొట్లాడుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.సూరజ్ శంకర్ ధోలె(26), బాబా సాహెబ్ అలియాస్ సుబోధ్ భీమ్రావ్ వాంఘ్మారేలు గోరెగావ్లోని ఓ పెట్ కేర్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. అయితే, ధోలె తరచుగా వాంఘ్మారే డ్రెస్లు వేసుకోవడం, అతడి వస్తువులను వాడుకోవడం చేస్తున్నాడు. ఇది వాంఘ్మారేకు ఏమాత్రం నచ్చడం లేదు.తన అనుమతి లేకుండానే ధోలె ఇలా చేయడంపై వాంఘ్మారేకు కోపంగా ఉంది. దీనిపై శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో వాంఘ్మారే చేతిలో ధోలె ప్రాణాలు కోల్పోయాడు. ధోలె తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు..పరారీలో ఉన్న వాంఘ్మారే కోసం గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: గుజరాత్కు ఎందుకు తరలించారు?
నాలుగేళ్లుగా ప్రైవేట్ హోటల్స్లో గడిపారు!
హైదరాబాద్: స్నాప్చాట్లో పరిచయం ప్రేమగా మారింది. ఏకాంతంగా నాలుగేళ్లుగా ప్రైవేట్ హోటల్స్లో గడిపారు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తేవడంతో అతను ముఖం చాటేశాడు. ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. నాగాపూర్కు చెందిన యువతి(22) హైదరాబాద్ శాలిబండకు చెందిన యువకుడితో(24) స్నాప్ చాట్ 2022వ సంవత్సరంలో పరిచయమయ్యారు.పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ప్రేమించిన యువకుడి కోసం నాగాపూర్ నుంచి యువతి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుండేది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ రెసిడెన్షియల్లో గదిని అద్దెకు తీసుకొని గడిపేవారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో యువకుడు ముఖం చాటేశాడు. మరొక అమ్మాయిని ప్రేమించానంటూ బాధిత యువతిని మోసం చేశాడు. దీంతో బాధితురాలు గురువారం నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి
నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్
సాక్షి,ముంబై : బాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమీషా పటేల్ తల్లిదండ్రుల చర్చిగేట్ (ముంబై) నివాసం నుండి , బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంటి పనిమనిషే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నటి తల్లి ఆశా పటేల్ ఫిర్యాదు మేరకు నిందితురాలు సీమా ఘాటేను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం జనవరి 2026లో ఒక గాజు చోరీకి గురైంది. దీనిపై సీమాను అనుమానించిన ఆశా పటేల్, తప్పు ఒప్పుకుని, పోయిన ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరారు.అయితే, ఆ గాజును తిరిగి ఇవ్వకపోవడంతో, ఆశా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.దీంతో పాలఘర్కు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటే అనే ఇంటి పనిమనిషిని మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ 5 లక్షలకు పైమాటే. వీటిల్లో డైమండ్గాజులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో గృహ కార్మికురాలిగా పని చేస్తోంది.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్దీనిపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్, పనిమనిషి ఘాటేపై అనుమానం వ్యక్తం చేస్తూ మెరైన్ డ్రైవ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు విరార్లో ఘాటేను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు.నిందితురాలు సీమ నేర చరిత్ర, సహచరులు ప్రాతను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు సెప్టెంబర్ 15 వరకు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!
మంచిర్యాల: పోర్న్ వీడియోలు చూస్తున్న ఐదుగురిపై కేసు!
స్మార్ట్ఫోన్ యుగంలో పోర్నోగ్రఫీ సైట్లతో అశ్లీలత చేతుల్లోకి చేరింది. మైనర్ల నుంచి మొదలుకొని నడివయస్సు వరకు చాలామంది పోర్నోగ్రఫీకి బానిసగా మారుతున్నారు. కొందరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తూ జైలు పాలవుతున్నారు. ఈ ఏడాది మంచిర్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చైల్డ్పోర్నోగ్రఫీ వీడియోలు చూసి, ఇతరులకు షేర్ చేసినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. - మంచిర్యాల జిల్లాఅశ్లీల వెబ్సైట్లపై ప్రత్యేక నిఘా..అశ్లీల వెబ్సైట్లు, టెలిగ్రామ్, సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలపై అమెరికాకు చెందిన యూనైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్సీఎంఈసీ), నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్ర్డన్ అనే ప్రత్యేక విభాగం ప్రత్యేక నిఘా పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై జరిగే అశ్లీల దాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫొటోలు ఎవరు చూస్తున్నారు, ఎవరు షేర్ చేస్తున్నారో గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసులకు సమచారం అందిస్తోంది. స్థానిక పోలీస్స్టేషన్లకు పోర్నోగ్రఫీ వీడియోలు చూసిన, షేర్ చేసిన వారి వివరాలు అందించి కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. చట్ట ప్రకారం ప్రైవేటుగా చూడడం నేరం కాకపోయిన, చూసి ఇతరులకు షేర్ చేయడం ఐటీ యాక్ట్ 67 ప్రకారం నేరమవుతుంది. ఒకవేళ ఆ వీడియోల్లో మైనర్లు ఉంటే అది ఐటీ యాక్ట్ 67–బీ, పోక్సో చట్టం ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.యువత పక్కదారి..విద్యార్థి దశలోనే అరచేతిలో ఉన్న సెల్ఫోన్ వారిని నేరాల్లోకి నెడుతోంది. తాజాగా జిల్లా కేంద్రంలో ఆండాలమ్మ కాలనికి చెందిన ఓ మైనర్ బాలుడు ఫోర్న్ వీడియోలు చూసి మరో మైనర్ బాలికను వేధించినందుకు సదరు బాలిక దగ్గరి బంధువు బాలుడిని మందలించాడు. దీంతో బాలుడు మద్యం మత్తులో మందలించిన వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సెల్ఫోన్లలో లైంగిక, హింసాత్మక ఆంశాలు కౌమర దశలో ఉన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీడియోలు చూస్తే ఎవరికి తెలుస్తుందిలే అన్న భ్రమలో యువత ఉంటున్నారు. కానీ పోర్నోగ్రఫీ వెబ్సైట్లు ఎవరు చూస్తున్నారు.. ఎవరికి షేర్ చేస్తున్నారు.. ఎవరు డౌన్లోడ్ చేస్తున్నారో ఎన్సీఎంఈసీ ఇట్టే పట్టేస్తోంది. తమ పిల్లలు సెల్ఫోన్లో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేయాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.సర్వర్లు బ్లాక్.. పోర్న్ వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు చేర్చి మరో వెబ్సైట్ను ప్రారంభిస్తున్నారు. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉన్నవే కావడంతో వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండడం లేదని ఓ పోలీస్ అధికారి చెప్పడం గమనార్హం.వెంటనే తెలిసిపోతుంది..పోర్నోగ్రఫీ వీడియోలు చూడడం నేరమని తెలియక యువత చూస్తున్నారు. కేంద్రం నుంచి అందించిన సమాచారం ఆధారంగా వీడియోలు చూస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఐదు కేసులు నమోదు కాగా అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. అశ్లీల వెబ్సైట్లపై పూర్తి స్థాయి నిఘా ఉంది.– ప్రమోద్రావు, సీఐ, మంచిర్యాలఇటీవల నమోదైన కేసులు..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్రోడ్కు చెందిన ఓ యువకడు యూట్యూబ్, పోర్న్ వెబ్సైట్లు చూడడమే కాకుండా తనకు తెలిసిన వారికి షేర్ చేశాడు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రెన్ ప్రత్యేక విభాగం స్థానిక పోలీసులకు యువకుడి వివరాలు పంపించి కేసు నమోదుకు ఆదేశించింది. పోలీసులు యువకుడి ఇంటికి వెళ్లి కేసు నమోదు చేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవంతం వాడకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు తరచూ చూస్తుండేవాడు. చూడడమే కాకుండా ఇతరులకు షేర్ చేశాడు. దీంతో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయింటెడ్ చిల్డ్రెన్ ప్రత్యేక విభాగం అతడిని గుర్తించి సదరు యువకుని అడ్రస్తో సహా స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించింది.నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మదీన కాలనీకి చెందిన ఓ వ్యక్తి పిల్లల అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతనిపై ఈనెల 5న కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని(కె) గ్రామానికి చెందిన తౌడు శ్రావణ్ పిల్లల అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోర్న్ ఫొటోలు, వీడియోలు బ్రౌజ్ చేసి డౌన్లోడ్, అప్లోడ్ చేసినందుకు అతడిపై ఈనె 5న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి
వీడియోలు
నాతో పెట్టుకోకు వైభవ్ కు చుక్కలు చూపించిన బుమ్రా
నీకే డబ్బులు పడలేదా.. అందరి ముందు TDP నేత పరువు తీసిన కేతిరెడ్డి
అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారు బాబుపై TJR సుధాకర్ బాబు షాకింగ్ కామెంట్స్
ప్రభుత్వ ఉద్యోగులంటే మీకెందుకు ఇంత చిన్న చూపు
జగన్ వెంట లక్షలాది సైనికులు.. YSRCPని ఎవరూ కదిలించలేరు
ధరణి పేరుతో ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు
లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
50 ఏళ్ల MAPను ఎందుకు మార్చారు? మనం చూసిన వరల్డ్ మ్యాప్ నిజం కాదా?
వైస్ కెప్టెన్ పదవి వచ్చినా హ్యాపీగా లేను.. తిలక్ వర్మ షాకింగ్ కామెంట్స్
భారీగా పెరిగిన బంగారం ధరలు

