ఐఎస్ఐ కుట్రను భగ్నం చేశాం: అమిత్ షా
ఢిల్లీ: ఇటీవల జరిగిన 80వ భారత స్వాతంత్ర్య వేడుకలకు ముందు ఐఎస్ఐ భారీ కుట్రకు ప్లాన్ చేసిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా వెల్లడించారు. అయితే ఆ భారీ కుట్రను నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం భగ్నం చేసి 200 మంది ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ‘స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే మోదీ ప్రభుత్వం, 200 మందికి పైగా ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా ఐఎస్ఐ మద్దతుగల ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్వర్క్ను ధ్వంసం చేసి, దాని విధ్వంసకర దాడుల ప్రణాళికలను భగ్నం చేసింది. ఉగ్రవాదంపై భారత్కు ఉన్న జీరో టాలరెన్స్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తూ, భారత భద్రతా దళాలు 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించి ఈ నెట్వర్క్ను చిన్నాభిన్నం చేశాయి.రాష్ట్ర పోలీసు బలగాలతో రియల్-టైమ్ ఇంటెలిజెన్స్-షేరింగ్ వ్యవస్థను ఉపయోగించి ఆగస్టు 12న సమన్వయంతో కూడిన బహుళ-రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించాం. దీని ఫలితంగా 14 రాష్ట్రాలలో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ (62), హర్యానా (52), ఢిల్లీ (51), పంజాబ్ (44), రాజస్థాన్ (15), మహారాష్ట్ర (8), ఉత్తరాఖండ్ (5), కర్ణాటక, గుజరాత్ మరియు బీహార్ (ఒక్కొక్క రాష్ట్రంలో 3 చొప్పున), మరియు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మరియు కేరళ (ఒక్కొక్క రాష్ట్రంలో 2 చొప్పున) అరెస్టులు చేశాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.Modi govt destroyed the ISI-backed terror group Shahzad Bhatti Network ahead of Independence Day and thwarted its plans for subversive attacks by arresting more than 200 operatives.Indian security forces ripped apart the network by launching coordinated operations across…— Amit Shah (@AmitShah) August 17, 2026
‘22-Aతో రేవంత్ ప్రభుత్వం గందరగోళానికి తెరలేపింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 శాతం ప్రభుత్వం నడుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా రేవంత్ ప్రభుత్వంపై హరీష్ మండిపడ్డారు. ‘లక్షలాది ప్రాపర్టీలు 22-Aలో పెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకొన్న తర్వాత మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు.. ప్రాహిబిటేషన్ లో ఉంది అని చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వం గందరగోళానికి తెరలేపింది. ఎవరి భూమి ప్రాహిబిటేషన్ లో ఉందో తెలియని పరిస్థితి. సీఎం రేవంత్ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉంది. అందుకే తొలగించడానికి హడావుడి చేస్తున్నారు. రాష్ట్రం లో 30 పర్సంటేజ్ ప్రభుత్వం నడుస్తుంది. ప్రాహిబిటేషన్లో నుండి సర్వే నంబర్ తీసివేయాలంటే 30 పర్సంటేజ్ ఆడుతున్నారు. రెవెన్యూలో మీ పని జరగాలంటే. 30 పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అంటున్నారు’ అని హరీష్ విమర్శించారు.సొంతింటి యజమానులకు ‘22–ఏ’ పిడుగు..! Cm రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ప్రోహిబిటెషన్ లో ఉంది..Cm రేవంత్ రెడ్డి ఇల్లు వుండటంతో ఇప్పుడు ప్రోహుబిటేషన్ తీసివేస్తం అంటున్నారు..22ఏ పై విచారణ జరపాలి..ప్రాహిబిటేషన్ పెట్టమని ఆదేశించింది ఎవరు. కారకులు ఎవరు..రాష్ట్రం లో 30 పర్సంటేజ్ ప్రభుత్వం నడుస్తుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి అలా ఉంటే ..సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది
AP: పోలీసు దెబ్బలు తాళలేక యువకుడి మృతి?
కొండకెంగువ: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలీసు దెబ్బలు తాళలేక ఓ యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. సాలూరు వన్టౌన్ పీఎస్లో చిత్ర హింసలకు గురి చేశారని వారు ఆరోపిస్తున్నారు. పీఎస్కు తీసుకెళ్లిన తర్వాత మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో విజయనగరం ఆస్పత్రికి తరలించారు అదే పోలీసులు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీనిపై మణికంఠ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. బంగారం చోరీ కేసులో అనుమానితుడిగా మణికంఠను తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని బంధువులు.అంటున్నారు. పోలీసుల వల్లనే మణికంఠ చనిపోయాడని రామభద్రపురం మండలం కొండ కెంగువ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు బంధువులు.
కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటించిన బీజేపీ
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ తన నూతన జాతీయ కార్యవర్గ బృందాన్ని ప్రకటించింది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు పెద్దపీట వేస్తూ, ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత కల్పించారు.బీజేపీ నూతన జాతీయ టీమ్ను ప్రకటించింది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులను నియమించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురందేశ్వరి సహా 13 మందికి అవకాశం కల్పించింది. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్ను కొనసాగించింది. అలాగే జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మరోసారి బాధ్యతలు అప్పగించింది. సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివ ప్రకాష్, సౌధాన్ సింగ్, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా సునీల్ బన్సల్, వినోద్ తావుడే, విప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పునియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలకు చోటు కల్పించింది.పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా దీపక్ను, మీడియా కన్వీనర్గా అనిల్ బలోనిని నియమించింది. బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ హేమంగు జోషికి బాధ్యతలు అప్పగించింది. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రూప్ కుమారి చౌదరిని నియమించింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమరుపాల్ మౌర్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బన్సీలాల్ గుజర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా శివేష్ కుమార్ రామ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా మన్నన్లాల్ రావత్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా కొన్వార్ బాసిత్ అలీలను నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.నూతన జాతీయ టీమ్లో అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కూర్పు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు.
సీఎం విజయ్కు జైకొట్టిన అన్నామలై.. ఇక TVKలోకేనా?
ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ?
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బిగ్ రిలీఫ్
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ
టిమ్స్ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్
వరల్డ్ ఛాంపియన్షిప్లో ఘనంగా బోణీ కొట్టిన పీవీ సింధు
"మా దారికి అడ్డొస్తే బాంబులతో లేపేస్తా"
బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ
అనంత్ అంబానీ ఔదార్యం.. ఇక్బాల్కు కొత్త ఆశలు!
‘లోకేష్కు దమ్ముంటే డీఎస్సీపై చర్చకు రావాలి’
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
సార్ మీతో తెలుగులో మాట్లాడారా ఏంటి సార్!
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్క్రిస్ట్
'ఇక అతడి రీఎంట్రీ కష్టమే.. అందరూ మర్చిపోండి'
ఫ్యామిలీ పోషణ కోసం చీర, జాకెట్ కట్టుకున్నా: నటుడు
‘రాను బొంబాయికి రాను’.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపచారం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు కారు..
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
సంపద పెంచుకోవాలంటే.. అంకుర్ వారికూ ఆర్ధిక సూత్రాలు!
ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సీఎం విజయ్కు జైకొట్టిన అన్నామలై.. ఇక TVKలోకేనా?
ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ?
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బిగ్ రిలీఫ్
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ
టిమ్స్ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్
వరల్డ్ ఛాంపియన్షిప్లో ఘనంగా బోణీ కొట్టిన పీవీ సింధు
"మా దారికి అడ్డొస్తే బాంబులతో లేపేస్తా"
బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ
అనంత్ అంబానీ ఔదార్యం.. ఇక్బాల్కు కొత్త ఆశలు!
‘లోకేష్కు దమ్ముంటే డీఎస్సీపై చర్చకు రావాలి’
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
సార్ మీతో తెలుగులో మాట్లాడారా ఏంటి సార్!
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్క్రిస్ట్
'ఇక అతడి రీఎంట్రీ కష్టమే.. అందరూ మర్చిపోండి'
ఫ్యామిలీ పోషణ కోసం చీర, జాకెట్ కట్టుకున్నా: నటుడు
‘రాను బొంబాయికి రాను’.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపచారం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు కారు..
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
సంపద పెంచుకోవాలంటే.. అంకుర్ వారికూ ఆర్ధిక సూత్రాలు!
ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఫొటోలు
వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్ (ఫొటోలు)
‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)
విజయవాడ : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు)
హైదరాబాద్ ఉప్పల్లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు)
పద్ధతిగా 'హిట్' సినిమా హీరోయిన్ (ఫొటోలు)
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు)
భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు)
సినిమా
విషాదం.. 36 ఏళ్ల నటి అనుమానాస్పద మృతి!
హాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, గాయని హేడెన్ పానెటెర్ 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఆమె మరణానికి గల కారణాన్ని అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.హేడెన్ పానెటెర్( Hayden Panettiere) మరణవార్త హాలీవుడ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె తండ్రి స్కిప్ పానెటెర్ కుటుంబం తరఫున సంతాప ప్రకటన విడుదల చేశారు. హేడెన్ తమ కుటుంబానికి, ఆమెను అభిమానించే కోట్లాది మందికి ఎంతో ప్రేమను, ఆనందాన్ని అందించిన వ్యక్తి అని పేర్కొంటూ, ఈ విషాద సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరారు.హేడెన్ పానెటెర్ బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించారు. చిన్నతనంలోనే టెలివిజన్ సిరీస్లు, సినిమాల్లో కనిపించిన ఆమెకు యానిమేషన్ చిత్రం 'ఎ బగ్స్ లైఫ్' (A Bug’s Life)లో ‘డాట్’ పాత్రకు వాయిస్ అందించడం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రిమెంబర్ ది టైటాన్స్ (Remember the Titans), డైనోసర్(Dinosaur), ‘స్క్రీమ్ 4’ లాంటి పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది.2006లో వచ్చిన టెలివిజన్ సిరీస్ హీరోస్(Heroes) హేడెన్ కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఇందులో క్లైర్ బెన్నెట్ పాత్రలో ఆమె నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఈ సిరీస్తో ఆమెకు భారీగా అభిమానులు ఏర్పడ్డారు.ఆ తర్వాత నాష్విల్లె(Nashville) సిరీస్లో జూలియట్ బార్న్స్గా ఆమె మరో కీలక పాత్ర పోషించారు. నటనతో పాటు పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాత్రకు ఆమె రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు అందుకున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ స్లీప్వాకర్ (Sleepwalker)లో సారా పాంగ్బోర్న్గా ఆమె కనిపించారు. ఇదే ఆమె చివరి చిత్రం. ‘దిస్ ఈజ్ మీ: ఎ రెకనింగ్’ పేరుతో రాసిన ఆమె ఆత్మకథ ఈ ఏడాదిలోనే విడుదల చేశారు.
ప్రముఖ టిక్టాక్స్టార్ను కాల్చి చంపిన దుండగులు
పాకిస్థాన్కు చెందిన ప్రముఖ టిక్టాక్, సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షంసు బీబీ(28) అలియస్ అయేషా గిలామనా దారుణ హత్యకు గురయ్యారు. ఆగస్టు 14న టాక్సిలా నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. మెడపై బులెట్ తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు కొద్దిసేపటి ముందు కాశి అనే వ్యక్తి ఫోన్చేసి బయటకు రమ్మన్నాడు. దీంతో ఆమె తన 15 ఏళ్ల సోదరితో పాటు సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయటకు వెళ్లారు. ఈ సమయంలో మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అదే సమయంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురికావడంతో ఆమె సోదరి తీవ్రంగా గాయపడింది.డబ్బు లావాదేవీల విషయంలో కౌసర్, జావేద్ అలియాస్ షాహీన్ అనే ఇద్దరితో తన కుమార్తుకి విభేదాలు ఉన్నాయని అయేషా తండ్రి ఫజల్ సాహిబ్ జాదా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా.. టిక్టాక్లో సుమారు 13లక్షల మంది అనుచరులను సంపాదించుకున్న అయేషా అంత్యక్రియలకు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారని వార్తలు వెలువడ్డాయి. దీంతో సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
‘మీకు బీఫ్ నచ్చిందా?’ హీరోయిన్కి షాకింగ్ ప్రశ్న.. రియాక్షన్ ఇదే!
మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న హీరోయిన్ మాళవిక శర్మకు కేరళ మీడియాతో తొలి ఇంటరాక్షన్లో వింత అనుభవం ఎదురైంది. తన తాజా చిత్రం ‘ఖలీఫా: ది ఇంట్రో’ ప్రమోషన్లో భాగంగా కేరళ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్ ఆమెను బీఫ్ గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మాళవిక కొంత అసహనంగా స్పందించినట్లు వీడియోలో కనిపించింది. అయితే ఆమె ప్రశాంతంగానే సమాధానం ఇస్తూ.. తాను వెజిటేరియన్ అని స్పష్టం చేశారు.మహారాష్ట్రకు చెందిన మాళవిక శర్మ తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘నేల టికెట్’, ‘రెడ్’, ‘హరోమ్ హరా’, ‘భీమా’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం మలయాళ చిత్రంతో మరో సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఖలీఫా: ది ఇంట్రో’ చిత్ర బృందంతో కలిసి కేరళలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఇందులో భాగంగా కేరళ మీడియా ప్రతినిధులతో మాళవిక తొలిసారి మాట్లాడారు. మీడియా సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ రిపోర్టర్.. ‘మీకు బీఫ్ నచ్చిందా?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో మాళవిక కొంత ఇబ్బందికి గురైనట్లు వీడియోలో కనిపించింది. అనంతరం ఆమె.. ‘నేను వెజిటేరియన్ను. కాబట్టి బీఫ్ ట్రై చేయలేదు’ అని సమాధానం ఇచ్చారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాళవికను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. సినిమా ప్రమోషన్కు సంబంధించిన విషయాలపై ప్రశ్నలు అడగకుండా, ఆమె వ్యక్తిగత ఆహారపు అలవాట్ల గురించి ఇలాంటి ప్రశ్న అడగడం ఎందుకంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం మీడియా ఇంటరాక్షన్లో ఇలాంటి ప్రశ్నలు ఎదురుకావడం సాధారణమేనని అభిప్రాయపడుతున్నారు.Kerala saaar beef saar 🤧 - Malavika Sharma, from Maharashtra- Acted in Khalifa, a Malayalam movie- Came to do promotion in Kerala- Met Kerala media for the first time- Within 2 minutes, they asked, “Did you like beef?”- She felt irked but replied she’s a vegetarianWill… pic.twitter.com/Zpff0x0Xmu— S Kumar (@SKumararchives) August 17, 2026ఇదిలా ఉంటే, ‘ఖలీఫా: ది ఇంట్రో’తో మాళవిక శర్మ మలయాళ ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోవైపు కన్నడలో ‘బృందావిహారి’ అనే చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో తెలుగు దాటుకుని ఇతర భాషల పరిశ్రమల్లోనూ తన మార్కెట్ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దర్శన్ కేసు: జైలులో నటి పవిత్ర గౌడకు ఊహించని షాక్!
రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ నటి పవిత్ర గౌడకు జైలులో మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆమెను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్కు తరలించినట్లు సమాచారం. ఇద్దరు ఖైదీలు మాత్రమే ఉన్న బ్యారక్లో ఉన్న పవిత్ర గౌడను.. ఏకంగా 16 మంది ఖైదీలు ఉన్న బ్యారక్కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. జైలులో భద్రతా చర్యలను కఠినతరం చేసిన నేపథ్యంలోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్లు సమాచారం.ఇటీవల మాజీ ఎంపీ ప్రజ్జ్వల్ రేవన్న ఉన్న బ్యారక్లో మొబైల్ ఫోన్ లభ్యమైన విషయం తెలిసిందే. ఈ వార్త వైరల్ కావడంతో, జైలు నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్ ఎలా లోపలికి వెళ్లిందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటన తర్వాత జైలులోని ఖైదీల కదలికలపై నిఘాను మరింత పెంచినట్లు తెలుస్తోంది.డీజీపీ అలోక్ కుమార్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును సందర్శించి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. జైలు పరిసరాలు, ఖైదీల బ్యారక్లు, భద్రతా వ్యవస్థను పరిశీలించిన అధికారులు.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటి పవిత్ర గౌడను కూడా మరో బ్యారక్కు తరలించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఇద్దరు ఖైదీలు ఉన్న బ్యారక్లో ఉన్న ఆమెను 16 మంది ఖైదీలు ఉండే బ్యారక్కు మార్చడం చర్చనీయాంశంగా మారింది. అయితే పవిత్ర గౌడను ఈ విధంగా బదిలీ చేయడానికి సంబంధించిన అధికారిక కారణాలు పూర్తిగా వెల్లడికావాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్తో పాటు పవిత్ర గౌడపై కూడా ఆరోపణలు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు సమయంలో వెలుగులోకి వచ్చిన అంశాలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం కేసు న్యాయపరమైన ప్రక్రియలో ఉండగా.. జైలు అధికారులు భద్రత విషయంలో ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
క్రీడలు
రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్ దేవ్ సరసన
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. జడ్డూ తన టెస్ట్ కెరీర్లో 350వ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా టెస్టు క్రికెట్లో 4,000 వేల పరుగులతో పాటు 350 వికెట్లు సాధించిన నాలుగో ఆల్రౌండర్గా జడేజా నిలిచాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు కపిల్ దేవ్(5,248 రన్స్, 434 వికెట్లు), డానియల్ వెట్టోరి(4,531 రన్స్, 362 వికెట్లు), ఇయాన్ బోథమ్ (5,200, 383 వికెట్లు) వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. జడేజా ఇప్పటివరకు టెస్టుల్లో 4,108 పరుగులతో పాటు 350 వికెట్లు సాధించాడు. అదేవిధంగా టెస్టుల్లో 350 వికెట్ల ఘనతను అందుకున్న ఐదో భారత బౌలర్గా జడేజా నిలిచాడు. అనిల్ కుంబ్లే(619), రవిచంద్రన్ అశ్విన్(537), కపిల్ దేవ్(434), హార్బజన్ సింగ్(417) వంటి లెజెండరీ ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా జడ్డూ భాయ్ కొనసాగుతున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం స్పిన్నర్లు వీరే433 - రంగన హెరాత్362 - డేనియల్ వెటోరి350* - రవీంద్ర జడేజా297 - డెరెక్ అండర్వుడ్271 - తైజుల్ ఇస్లాం
IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి
టీమిండియాతో తొలి టెస్టులో శ్రీలంక తిరిగి పుంజుకుంది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్కు దిగిన లంక జట్టు.. 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండో డకౌట్ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేయగలిగాడు. వన్డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్ (4), కమిందు మెండిస్ (14) విఫలం కాగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో 99 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను ఆరో నంబర్ బ్యాటర్ సొనాల్ దినుష, వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ పట్టుదలగా నిలబడి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు.అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రిషభ్ పంత్కు క్యాచ్ ఇవ్వడంతో డిక్విల్లా ఇన్నింగ్స్కు తెరపడింది. మొత్తంగా 115 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. సొనాల్ దినుషతో కలిసి ఆరో వికెట్కు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.ఈ క్రమంలో సొంతగడ్డ మీద టీమిండియాతో టెస్టుల్లో ఆరో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. దినుష సెంచరీ చేసి అవుటయ్యాడు.స్వదేశంలో భారత్తో టెస్టుల్లో ఆరో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన శ్రీలంక జోడీలు1. సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా- 146 పరుగులు2. ఏంజెలో మాథ్యూస్- కుశాల్ పెరీరా- 135 పరుగులు3. దినేశ్ చండిమాల్- లాహిరు తిరిమన్నె- 125 పరుగులు4. మహేళ జయవర్దనె- హషాన్ తిలకరత్నె- 95 పరుగులు5. టీఎల్ దిల్షాన్- ప్రసన్న జయవర్దనె- 91 పరుగులు.
టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డు
శ్రీలంక వికెట్కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా లేకుండానే కెరీర్ను అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు 55 టెస్ట్లు ఆడిన అతడు.. 23 అర్ద సెంచరీల సాయంతో 2837 పరుగులు చేసి జట్టులో కొనసాగుతున్నాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో (తొలి ఇన్నింగ్స్) డిక్వెల్లా మరోసారి సెంచరీకి చేరువలో ఔట్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ స్పెషలిస్ట్ బ్యాటర్ ఇన్ని మ్యాచ్లు ఆడి సెంచరీ లేకుండా మనుగడ సాగించలేదు. డిక్వెల్లాకు మాత్రమే ఇది సాధ్యమైంది.సెంచరీ లేకుండానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ (3154) పేరిట ఉన్నప్పటికీ.. అతడు స్పెషలిస్ట్ బ్యాటర్ కాదు. అతడు తన అత్యుత్తమ లెగ్ స్పిన్ బౌలింగ్కు తోడుగా ఈ పరుగులు సాధించాడు. ఈ రికార్డుకు సంబంధించి వార్న్ తర్వాతి స్థానంలోనే డిక్వెల్లా కొనసాగుతున్నాడు.ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో సెంచరీ లేకుండానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డిక్వెల్లా చలామణి అవుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో మిచెల్ స్టార్క్ (106 టెస్ట్ల్లో (2497) ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. డిక్వెల్లా సెంచరీ చేయకుండానే ఔటైనప్పటికీ శ్రీలంక పరువు కాపాడాడు. సోనల్ దినుషాతో (86 నాటౌట్) కలిసి ఆరో వికెట్కు 146 పరుగులు జోడించి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను డిక్వెల్లా-దినుషా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ ప్రతిఘటించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.ప్రస్తుతం దినుషాకు జతగా ప్రభాత్ జయసూర్య (0) క్రీజ్లో ఉన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 212 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (167) భారీ శతకంతో సత్తా చాటాడు. కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ శ్రీలంకలో పర్యటిస్తుంది.
ఇంగ్లండ్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
సొంతగడ్డపై ఐర్లాండ్ మహిళల జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్కు ఈసీబీ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. ఆమె స్ధానంలో స్టార్ ఆల్రౌండర్ చార్లీ డీన్కు జట్టు బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా డానీ వ్యాట్-హాడ్జ్తో పాటు సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్, అమీ జోన్స్లను వంటి సీనియర్ ప్లేయర్లను సైతం సెలక్టర్లు పక్కన పెట్టారు. వీరి స్ధానంలో గ్రేస్ పాట్స్, కిరా చాత్లీలు, గ్రేస్ పాట్స్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి ఇంగ్లండ్ వన్డే జట్టులో చోటు దక్కింది. అమీ జోన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆలిస్ కాప్సే వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వర్తించనుంది. ఈ మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓటమి తర్వాత ఇంగ్లండ్ మహిళల జట్టుకు ఇదే తొలి వైట్బాల్ సిరీస్ కావడం గమనార్హం.ఐరీష్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టుచార్లీ డీన్ (కెప్టెన్), మైయా బౌచియర్, ఆలిస్ కాప్సే (వికెట్ కీపర్), కిరా చాత్లీ, టిల్లీ కోర్టీన్-కోల్మన్, సోఫియా డన్క్లీ, లారెన్ ఫీలర్, డాని గిబ్సన్, జోడి గ్రెవ్కాక్, ఫ్రేయా కెంప్, రియానా మెక్డొనాల్డ్-గే, చారిస్ పావేలీ, గ్రేస్ పాట్స్, మేడీ విలియర్స్, ఇస్సీ వోంగ్.
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు?
ఇంట్లో పొయ్యి వెలిగించేందుకు కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా ఇల్లు తీసుకున్న వారు, అద్దెకు మారిన కుటుంబాలు, కొత్తగా పెళ్లైన జంటలు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా.. అనేక ప్రాంతాల్లో అవి పెండింగ్లోనే ఉంటున్నాయి. అలా రోజూ వేలల్లో.. ఇప్పటికే లక్షల్లో పేరుకుపోయాయి. ఇవికాకుండా మరికొన్ని దరఖాస్తులు కూడా సిద్ధంగా ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై నెలకొన్న ఒత్తిడి, ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాల ప్రభావంతో ఎల్పీజీ లభ్యతపై అప్రమత్తమైన చమురు సంస్థలు ప్రస్తుతం ఉన్న వినియోగదారుల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో కొత్త డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా మాత్రం కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.యుద్ధ ప్రభావం.. సరఫరాపై అప్రమత్తతభారత్ ఎల్పీజీ అవసరాల్లో గణనీయమైన భాగం దిగుమతుల ద్వారానే తీరుతుంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా సరఫరా మార్గాల్లో ఇబ్బందులు తలెత్తితే దేశీయంగా కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇటీవల ఎల్పీజీ సరఫరాలో ఒత్తిడి ఎదురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు రిఫైనరీలు, చమురు సంస్థలకు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది.దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ రిఫైనరీలు, అప్స్ట్రీమ్ సంస్థలు కలిసి రోజుకు గరిష్ఠంగా 63,810 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని సిద్ధంగా ఉంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్నగర్ రిఫైనరీకి అత్యధిక ఉత్పత్తి లక్ష్యం కేటాయించినట్లు సమాచారం.ప్రస్తుతం దేశంలో రోజువారీ ఎల్పీజీ వినియోగం సుమారు 90 వేల టన్నులకు పైగా ఉంది. ఇందులో దిగుమతుల వాటా ఎక్కువగా ఉండటంతో.. భవిష్యత్లో సరఫరా అంతరాయాలు రాకుండా కేంద్రం నిల్వలు, ఉత్పత్తిపై దృష్టి పెట్టింది.మరి కొత్త కనెక్షన్లు ఆపడం ఎందుకు?ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వంటి సంస్థల డీలర్ల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు సిలిండర్ల సరఫరా సాఫీగా కొనసాగించడం ప్రధాన ప్రాధాన్యతగా మారింది. అందుకే కొత్త డొమెస్టిక్ కనెక్షన్లు, డబుల్ బాటిల్ కనెక్షన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఒక కుటుంబానికి ఒకే గ్యాస్ కనెక్షన్ విధానం అమలుపైనా చమురు సంస్థలు దృష్టి పెడుతున్నాయి. ఒకే చిరునామాలో ఉన్న బహుళ కనెక్షన్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.దరఖాస్తులు వెల్లువలా వస్తే పరిస్థితి ఏంటి?కొత్త కనెక్షన్ల కోసం ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఇళ్లు, అపార్ట్మెంట్లు పెరుగుతుండటం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎల్పీజీ వినియోగం పెరగడంతో దరఖాస్తులు పెండింగ్లో పేరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ‘‘సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే పెండింగ్ దరఖాస్తులను దశలవారీగా పరిష్కరించే అవకాశం ఉంది’’ అని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.ఇలా ఇంకెన్నాళ్లు ?కొత్త కనెక్షన్లు పునఃప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించలేదు. అయితే అంతర్జాతీయ సరఫరా పరిస్థితులు మెరుగుపడి, దేశీయ నిల్వలు స్థిరపడితే కొన్ని వారాల నుంచి ఒకటి రెండు నెలల వ్యవధిలో కొత్త కనెక్షన్ల జారీ ప్రక్రియ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది అన్ని ప్రాంతాలకు ఒకేసారి కాకుండా.. సరఫరా పరిస్థితులు, స్థానిక డిమాండ్ ఆధారంగా దశలవారీగా ఉండొచ్చని చెబుతున్నారు.వినియోగదారులకు సూచనలుకొత్త కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్న వారు తమ సమీప గ్యాస్ ఏజెన్సీలో దరఖాస్తు వివరాలు నిరంతరం తెలుసుకుంటూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు.
పెట్రోల్ పాలసీలో ట్విస్ట్! పాత వాహనాలకు E10 పరిష్కారమా?
దేశంలో పెట్రోల్లో ఇథనాల్ కలపడంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 ఇంధనం వాడుతున్నారు. అయితే.. పాత వాహనాల విషయంలో మాత్రం తక్కువ ఇథనాల్ ఉన్న ఈ10 పెట్రోల్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు.ఇటీవల ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఒక అభిప్రాయ వ్యాసంలో.. నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారితో కలిసి ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరి ప్రకారం.. E20పై చర్చ కేవలం వాహనాల ఇంజిన్కు సమస్య వస్తుందా?, రాదా? అనే దానికే మాత్రమే పరిమితం కాకూడదు. ఇథనాల్ కోసం పంటలు, భూమి, నీటిని ఎక్కువగా ఉపయోగిస్తే భవిష్యత్తులో ఆహారం, ఇంధనం మధ్య పోటీ ఎలా ఉంటుందో.. కూడా తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది.పాత వాహనాలకు E10 ఎందుకు?భారతదేశంలో బీఎస్4 (BS4) ప్రమాణాలకు ముందు.. తయారైన ద్విచక్ర వాహనాల సంఖ్య సుమారు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంది. వీటిలో చాలావరకు కార్బ్యురేటర్తో పనిచేసే వాహనాలే. పాత కార్బ్యురేటర్ వాహనాలు అధిక ఇథనాల్ కలిగిన ఇంధనానికి అనుగుణంగా గాలి, ఇంధన మిశ్రమాన్ని సరిగ్గా సర్దుబాటు చేయలేకపోవచ్చు. అలాగే.. పాత వాహనాల్లోని కొన్ని రబ్బర్ సీల్స్ కూడా ఇథనాల్ను ఎక్కువకాలం తట్టుకోకపోవచ్చు. దీంతో కాలక్రమేణా కొన్ని భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.అయితే.. ఈ వాహనాలను E20కి అనుగుణంగా మార్చడం అసాధ్యం కాదు. అవసరమైన భాగాలను మార్చడం వల్ల ఇది సాధ్యమవుతుంది. కానీ.. దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న వాహనాలన్నింటినీ ఇలా మార్చడానికి చాలా సమయం, ఖర్చు అవుతుంది. అందుకే అప్పటివరకు పాత వాహనాలకు E10ను కూడా అందుబాటులో ఉంచడం ఒక మంచి పరిష్కారం.ప్రభుత్వం ద్రుష్టి ఈ20పైనే!కేంద్ర ప్రభుత్వం మాత్రం E20నే ప్రామాణిక పెట్రోల్గా కొనసాగించాలనే వైఖరిలో ఉంది. ఈ10, ఈ20, సాధారణ పెట్రోల్ ఇలా వేర్వేరు ఇంధనాలను ఒకేసారి అందుబాటులో ఉంచితే నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలకు అదనపు ఖర్చులు, ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.ఇదే సమయంలో ఈ10 కోసం తయారు చేసిన వాహనాల్లో.. ఈ20 వాడితే ఇంధన సామర్థ్యం సుమారు 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. అయితే.. ఈ20 వల్ల ఇంజిన్లకు పెద్దఎత్తున నష్టం జరుగుతోందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని చెబుతోంది.E20 తర్వాత..ప్రస్తుతం ఈ20లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో E27, E30 వంటి అధిక ఇథనాల్ బ్లెండింగ్ వస్తుందా? అనేది ఇప్పుడొక ప్రశ్న.నిజానికి ఇథనాల్ శాతం పెరిగే కొద్దీ.. దాని కోసం అవసరమైన పంటల పరిమాణం కూడా పెరగాలి. ఒక దశలో ఇంధనం కోసం పంటలను ఉపయోగించడం వల్ల ఆహారం కోసం పండించే పంటలు తగ్గిపోవచ్చు. కాబట్టి ఇథనాల్ శాతం ఇంకెత పెంచగలం? అనే దానికంటే.. ఇథనాల్ కోసం ఇంకెంత పంటను మళ్లించగలం? అనే విషయాన్ని గురించి కూడా ఆలోచించాలని నాగేశ్వరన్ అన్నారు.మొక్కజొన్నకు డిమాండ్ఇథనాల్ తయారీలో మొక్కజొన్న పాత్ర కీలకం. ప్రస్తుతం దేశంలో తయారయ్యే ఇథనాల్లో దాదాపు సగం వరకు మొక్కజొన్న నుంచి వస్తోందని నాగేశ్వరన్ పేర్కొన్నారు.మొక్కజొన్నకు ఇథనాల్ పరిశ్రమ నుంచి డిమాండ్ పెరగడంతో.. రైతులు కొంత లాభపడుతున్నారు. కానీ.. ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. మొక్కజొన్న పండించే భూమిలో సోయాబీన్, వేరుశెనగ, ఆవాలు వంటి పంటలను కూడా సాగు చేయవచ్చు. కానీ మొక్కజొన్నకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. ఇతర పంటలకు కేటాయించే భూమి తగ్గుతుంది. ఇది అలాగే కొనసాగితే.. చివరకు ఆహార ఉత్పత్తి, నూనెగింజల సాగుపైనా ప్రభావం చూపవచ్చు. తద్వారా ఆహార కొరత వచ్చే అవకాశం ఉంటుంది.ఇథనాల్ వల్ల ప్రయోజనాలు👉చెరకు రైతులకు లాభాలు👉గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆదాయ మార్గం👉ఇథనాల్కు స్థిరమైన మార్కెట్ కల్పించడం👉చక్కెర మిగులు నిల్వలను తగ్గించడం👉దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంనీటి సమస్యఇథనాల్ విషయంలో మరో ముఖ్యమైన సమస్య నీటి వినియోగం. ముఖ్యంగా చెరకు సాగుకు ఎక్కువ నీరు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నీటి వనరులపై ఒత్తిడి ఉంది. అందుకే ఇథనాల్ కోసం ఎంత చెరకు సాగు చేస్తున్నాం.. అనే దానితో పాటు, దాని కోసం ఎంత నీరు ఉపయోగిస్తున్నామో కూడా చూడాలి.వర్షం ద్వారా సహజంగా పంటలకు అందే నీటితో పాటు నదులు, కాలువలు, బోర్లు, భూగర్భ జలాల నుంచి తీసుకునే నీటిపై కూడా దృష్టి పెట్టాలని నాగేశ్వరన్ సూచిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే.. పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎంత ఉందనే లెక్క మాత్రమే కాకుండా, ఆ ఇథనాల్ తయారు చేయడానికి ఎంత నీరు ఖర్చవుతోంది అనేదీ ముఖ్యం.లాభాలతో పాటు.. నష్టాలను లెక్కించాలిఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇథనాల్ వల్ల వచ్చే ప్రయోజనాలను మాత్రమే చూసి ముందుకు వెళ్లకూడదు. దాని కోసం మనం ఏం కోల్పోతున్నామో కూడా లెక్కించాలి. ఒకసారి రైతులు ఇథనాల్ కోసం ఒక పంటను పెద్దఎత్తున పండించడం మొదలుపెడితే.. దాని ఆధారంగా భూమి, నీటి వినియోగం మారితే.. ఆ నిర్ణయాన్ని తర్వాత వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు. కాబట్టి త్వరగా మార్చుకోగలిగే నిర్ణయాలు ముందుగా తీసుకోవచ్చు. కానీ భూమి, నీరు, పంటల సాగు వంటి వాటిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే నిర్ణయాలను మాత్రం పూర్తిగా అలోచించి, విశ్లేషించిన తర్వాతే తీసుకోవాలని నాగేశ్వరన్ సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వాట్సాప్లో KYC చేస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
వాట్సాప్లో KYC చేస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డ్, ప్రాపర్టీ కొనుగోలు, హోటల్ బుకింగ్ లేదా ఇతర సేవల కోసం పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటి పత్రాలను అడగడం సర్వసాధారణమైపోయింది. అయితే చాలాసార్లు వీటిని వాట్సాప్ ద్వారా పంపండి అని ఏజెంట్ అడిగితే.. ఏ మాత్రం ఆలోచించకుండా పంపిస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.డాక్యుమెంట్స్ పంపిస్తే..మనకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏజెంటుకు లేదా ఇతర వ్యక్తులకు పంపిస్తే ఏం కాదులే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఆ డాక్యుమెంట్ అవతలి వ్యక్తి ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ల్యాప్టాప్లో సేవ్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఆ డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్తాయో.. ఎన్ని కాపీలు తయారవుతాయో కూడా మనకు తెలియదు. వీటిని ఉపయోగించి కొంతమంది మోసాలకు పాల్పడవచ్చు.కొన్నిసార్లు బ్యాంక్ లేదా కంపెనీలకు కేవైసీ అవసరం కావొచ్చు. అలాంటి.. సందర్భంలో ఆ కేవైసీని ఒక ఉద్యోగి తన వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ ద్వారా సేకరిస్తాడు. ఇది కూడా ఒక సమస్యే అనే విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే.. ఆ ఉద్యోగి కంపెనీ మారవచ్చు. లేదా ఉద్యోగం వదిలేయవచ్చు. అలాంటప్పుడు మీ వ్యక్తిగత సమాచారం కంపెనీ అధికారిక వ్యవస్థలో కాకుండా, ఒక వ్యక్తి ఫోనులో ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో మీ పత్రాలను తప్పుడు పనులకు ఉపయోగించే అవకాశం ఉంటుంది.డేటా దుర్వినియోగం అయితే?పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్లో మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఉంటాయి. ఈ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే అనుచిత కాల్స్, మెసేజస్, గుర్తింపు దుర్వినియోగం, ఆర్థిక మోసాలు వంటివి జరగవచ్చు. కాబట్టి వ్యక్తిగత సమాచారం తెలిపే పత్రాల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.DPDP చట్టం మనకు ఏం చెబుతోంది?భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం (Digital Personal Data Protection Act) ప్రకారం.. వ్యక్తిగత డేటాను బాధ్యతగా సేకరించడం, ఉపయోగించడం, నిర్వహించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక సంస్థ మీ వ్యక్తిగత సమాచారం తీసుకుంటే దానికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండాలి, ఆ డేటాను బాధ్యతగా నిర్వహించాలి.భారతదేశంలో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమయంలో మీ వ్యక్తిగా సమాచారం పంపించే ముందు తప్పకుండా ఆలోచించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 వార్షిక నివేదిక ప్రకారం.. రూ. 36,014 కోట్ల విలువైన 23,953 బ్యాంకింగ్ మోసాల కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తోంది.సురక్షితమైన మార్గం ఏమిటి?బ్యాంక్స్, హోటల్స్ లేదా ఇతర కంపెనీలకు కొన్నిసార్లు ఐడెంటిటీ వెరిఫికేషన్ నిజంగానే అవసరం కావొచ్చు. అలాంటప్పుడు మీ డాక్యుమెంట్లను వాట్సాప్ నెంబరుకు పంపించకుండా.. అధికారిక వెబ్సైట్, సెక్యూర్ అప్లోడ్ పోర్టల్ లేదా డిజిటల్ వెరిఫికేషన్ సిస్టం ద్వారా షేర్ చేయడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ డేటాను ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయం మీకు తెలిసి ఉండాలి.
విదేశీ ఆస్తులు.. కనిపిస్తున్నాయి
అవునండి. నిజమే. మనం చెప్పినా చెప్పకపోయినా, ఇప్పుడు మన విదేశీ ఆస్తులు డిపార్టుమెంటువారికి కనిపిస్తున్నాయి. మీరు రెసిడెంటు అసెస్సీ అయితే, మీ విదేశీ ఆస్తులు, ఆ ఆస్తుల మీద ఆదాయం డిక్లేర్ చేయాలి.ఈ మధ్య ఒక స్కీముని ప్రవేశపెట్టారు. అదేమిటంటే ‘చిన్న చిన్న పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమాచారం తెలియజేయడం‘. దీని పేరు Foreign Assets of Small Tax Payers Disclosure Scheme 2026. టూకీగా చెప్పాలంటే FAST ఈ 2026. షార్ట్కట్లో చెప్పినట్లుగా ఫాస్ట్గా దీన్ని అమలు పరుస్తున్నారు. పారదర్శకత పేరుతో వచ్చిన ఈ స్కీము ప్రకారం మీరు పోర్టల్లోకి లాగిన్ అయితే, మీ విదేశీ ఆస్తులు మీకే కనిపిస్తాయి.విదేశాల్లో సంబంధిత అధికారుల నుంచి అధికారికంగా సేకరించిన సమాచారాన్ని య«థాతథంగా ఈ పోర్టల్లో పొందుపరుస్తున్నారు. పదిలపరుస్తున్నారు. ఈ సమాచారం పోర్టల్లో లభ్యమవుతోంది. లాగిన్ తర్వాత ఏఐఎస్ సెక్షన్లోకి వెళ్లి, కాంప్లయెన్స్ పోర్టల్ విండోకి వెళితే సమాచారం ఉంటుంది.2022 సంవత్సరం నుండి.. చాలా మటుకు దేశాల్లో క్యాలెండర్ సంవత్సరాన్నే వారి వారి ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. మనలాగా ఏప్రిల్ నుంచి మార్చి వ్యవధిని కాదు. 2022, 2023, 2024, 2025 క్యాలెండర్ సంవత్సరాలకు సంబంధించిన సమాచారం మొత్తం సదరు పోర్టల్లో పీడీఎఫ్ ఫార్మాట్లో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్లో మీ పాన్ నంబరు, మీ పుట్టిన తేదీ ఉంటాయి.ఏయే సమాచారం ఉంటుంది.. మీ పేరు, చిరునామా, ఈమెయిల్, ఫోన్ నంబరు, పాన్ నంబర్లతో పాటు సీరియల్ నంబరు, దేశం పేరు, వ్యవహారం, విదేశాల్లో బ్యాంకు అకౌంటు నంబరు, ఆ దేశ కరెన్సీ, డివిడెండ్లు, వడ్డీ, బ్యాంకులో డిపాజిట్లు/వసూళ్లు, చెల్లింపులు, ఆ దేశ కరెన్సీ నుంచి మన దేశానికి మార్చిన వివరాలు, విదేశీ బ్యాంకు అకౌంట్లలోని బ్యాలెన్సులు, ఇదంతా వారు సేకరించి, పోర్టల్లో భద్రపర్చారు. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ తర్వాత ఏం చేయాలి.. డౌన్లోడ్ చేయడం పెద్ద విశేషం కాదు. పనంతా ఆ తరువాతే ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గరున్న సమాచారంతో మీరు చెక్ చేసుకోండి. ఈ సమాచారం, ఆ సమాచారంతో సరిపోతే ఓకే. అలా కాకుండా ఏదైనా కారణాన సమాచారం ఒకటి కాకపోతే? కరెక్టు కాకపోతే? తేడాలుంటే.. విశ్లేషించుకోండి. సమాచారం సరైనదా? కాదా? మీకు సంబంధించినదేనా కాదా? సమాచారం పాక్షికంగానే కరెక్టా? ఇలాంటివన్నీ చూసుకోవాలి. సీరియల్ నంబరువారీగా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. 400 అక్షరాలు దాటి ఇవ్వకూడదు. కాబట్టి శోధించి, మదించి, కుదించి ఇవ్వండి. ముందు మీ అభిప్రాయాన్ని అక్నాలెడ్జ్ చేస్తారు. ఆ తర్వాత ఆరా తీస్తారు. మీరు చెప్పినది నిజమయితే వారు తమ తప్పుని దిద్దుకుంటారు. లేదా మీరే సరిదిద్దుకోవాలి.తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఈ సమాచారం చాలా కీలకమైనది. విదేశాల్లో ఉన్న ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తుల జాబితా ఇది. ఆయా ఆస్తుల మీద ఆదాయం ఎంత ఉందో లెక్కిస్తారు. దాన్ని భారత్లో కూడా వచ్చే ఆదాయంతో కలిపి పన్నుభారం లెక్కిస్తారు. దానికి తగ్గట్లు పన్ను విధిస్తారు. అయితే, చాలా దేశాలతో మనకు అగ్రిమెంట్లు ఉన్నాయి. వాటి ప్రకారం డబుల్ ట్యాక్సేషన్ జరగదు. అయితే, ఆ దేశంలో పన్ను చెల్లించినట్లు ధ్రువీకరించాలి. ఏవైనా తేడాలుండి, మనదేశంలో రేటు ఎక్కువ అయితే, ఆ తేడా చెల్లించాలి. నిర్దేశిత ఫారాలు జతపరచాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ’ఖాన్తో గేమ్స్ ఆడకు’లాగా డిపార్టుమెంటుతో గేమ్లాడవద్దు.- డా. కందాళ సత్యనారాయణ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుగమనిక: పన్నుకు సంబంధించిన సందేహాలు ఉంటే business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.
ఫ్యామిలీ
సహదేవుడు.. ఖడ్గ యుద్ధ ప్రవీణుడు
పాండవులలో కనిష్టుడు సహదేవుడు... పాండురాజు రెండో భార్య మాద్రికి అశ్వినీ దేవతల అనుగ్రహంతో జన్మించినవాడు. ద్రోణాచార్యుని శిక్షణ లో ఖడ్గయుద్ధంలో ఎంతో ప్రవీణుడిగా ఆరితేరాడు. అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో ‘తంత్రీపాలుడు’ అనే పేరుతో గోపాలకుడిగా పశు సంరక్షణ చేపట్టాడు.సహదేవునికి భవిష్యత్తులో జరిగే విషయాలు ముందే తెలిసినప్పటికీ, జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ సూచనలతోపాటు చెబితే ఏం జరుగుతుందో అన్న భయం, వ్యక్తిగత భద్రత పట్ల సందేహాలు ఉండడంతో ఏ విషయం చెప్పేవాడు కాదు. బృహస్పతిలా గొప్ప వివేకం కలవాడైనా తనకు తానుగా ఎవరి భవిష్యత్తు చెప్పలేదు. గొప్ప భవిష్యద్దార్శనికుడు అయినా ఇతరులతో పంచుకోలేడు. దీనినే ‘సహదేవ నీతి’ అంటారు.సహదేవుడు అత్యంత తెలివైనవాడు. ధర్మరాజుకు సలహాదారు, ఖడ్గయుద్ధంతోపాటు ఆయుర్వేదం, పశు సంరక్షణలో ప్రవీణుడు. మంచి జ్యోతిష్యవేత్త. అతిముఖ్యంగా కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముహూర్తం పెట్టినవాడు సహదేవుడేనంటారు. అత్యంత సాధుశీలుడు, ధర్మవర్తనుడు, ఓర్పు, సహన స్వభావం కలిగిన వ్యక్తి.కౌరవుల నాశనానికి కారకుడైన శకునిని తాను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన సహదేవుడు మహాభారత యుద్ధంలో 17వ రోజున శకునిని హతమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు.– సి ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు
ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!
ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుకు సంబంధించిన కొత్త అధ్యయనం 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైంది.ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.కలిగే లాభాలు..సాధారణంగా తక్కువ ఆంథోసయనిన్ తీసుకునేవారితో పోలిస్తే, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కనిపించాయి:గుండె జబ్బుల ప్రమాదం 26% తగ్గింది.సాధారణంగా గుండెపోటు అని పిలిచే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం 18% తక్కువగా వుంది.టైప్ 2 మధుమేహం ప్రమాదం 11% తక్కువగా కనిపించింది.గుండె సంబంధిత మరణాల ప్రమాదం 9% తక్కువఅధిక రక్తపోటు ప్రమాదం 8% తక్కువరోజుకు 50 మిల్లీగ్రాముల నుంచి ఆహారంలో ఆంథోసయనిన్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు, రక్తనాళాల పనితీరు, ఇన్సులిన్ సాంద్రతలలో మెరుగుదలలు కనిపించాయని యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షలు నివేదించాయి. ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాల ద్వారా ఈ స్థాయిని సాధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.రోజువారీ భోజనంలో సహజంగా రంగురంగుల పండ్లు , కూరగాయలను విస్తృత శ్రేణిలో చేర్చడం మొత్తం ఆహార నాణ్యతకు మద్దతు ఇస్తుంది. అమెరికా బ్లూబెర్రీలను తాజాగా, గడ్డకట్టించి లేదా ఎండబెట్టి ఆస్వాదించవచ్చు. వాటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, అల్పాహార వంటకాలు, సలాడ్లు, డెజర్ట్లు వంటి వంటకాల్లో సులభంగా చేర్చుకోవచ్చు.అంతేగాదు సులభమైన, ఆచరణీయమైన ఆహారపు మార్పులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు టైప్ 2 మధుమేహం వంటి వాటి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడతాయని ఈ కొత్త పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.
కేన్సర్ పరిశోధకురాలిగా తొలి ట్రాన్స్ జెండర్ మహిళ..!
మూడేళ్ల వయసుకే తల్లిదండ్రులను కోల్పోవడమే కాదు..తన పుట్టుక కూడా ఒక శాపంగా మారింది ఆ చిన్నారికి. తనెందుకు అందరికంటే భిన్నంగా ఉంటున్నా..తనలో ఈ మార్పు అందకానీ గందరగోళంలో సాగింది అతడి బాల్యం. తన శారీరక మార్పుని తప్పుగా చూపిస్తూ సమాజం చేత ఛీత్కారాలు, హేళనలతో బిక్కుబిక్కుమంటూ బతికాడు. కానీ కష్టాల కొలిమిలో అతడకి దారి చూపేది కేవలం చదువు మాత్రమే అని విశ్వసించి మొత్తం దృష్టి దాని మీదే పెట్టాడు. ఉన్నత చదువు కోసం విదేశాల వరకు వెళ్లి..తను అందరిలాంటి వాడిని కాదని తెలుసుకోవడమే గాక తనలాంటి వాళ్లు కూడా ఉన్నారని తెలసుకుని ఇన్నాళ్లు ముసుగులో బతికే ఆ బాలుడు కాస్త అమ్మాయిగా స్వతంగా సగర్వంగా బతకడమే కాదు తనలాంటి వాళ్లకు స్ఫూర్తిగా మారాడు.అతడే సూరి అనే ట్రాన్స్జెండర్. హర్యానాకు చెందిన సూరి మూడేళ్ల వయసుకే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అమ్మమ్మ, అత్తల చెంత పెరిగాడు. తనలోని విభిన్నమైన మార్పు తనకే అర్థంకానీ తరుణంలో సమాజం నుంచి ఎదురవ్వుతున్న చీత్కారాలకు తల్లడిల్లిపోయాడు. తానెంటో తన పరిస్థితి ఏంటో అమ్మమ్మకు, అత్తకు వివరించడంతో..బయటకు ఈ విషయ పొక్కనీయకుండా బాలుడిలానే పెంచారు. ఎన్ని హేళనలు, అవమానాలు వస్తున్నా..చదువే తన గమ్యం, లక్ష్యంగా చదవడం ప్రారంభించాడు. అలా ఉన్నత చదువులు చదివి జర్మనీలో పీహెచ్డీ చేసే స్థాయికి చేరుకున్నాడు. అది కూడా బ్రెయిన్ కేన్సర్పై పీహెచ్డీ పరిశోధన చేస్తున్న తొలి ట్రాన్స్జెండర్గా నిలిచింది. అక్కడకు వెళ్లాకే తనలాంటి ట్రాన్సజెండర్ మహిళలు ఉన్నారని తెలుసుకుని ఇది ఒక లోపం కాదని గుర్తిస్తుంది. వాళ్ల అందరిక కథలు తనలాంటివేనని తెలుసుకుని అలాంటి వాళ్ల కోసం పాటుపడుతోందామె. అప్పటి నుంచే ముసుగు తొలగించి ట్రాన్స్జెండర్ మహిళ స్వేచ్ఛగా బతకడం ప్రారంభించిందామె.(చదవండి: ప్లీజ్ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ మహిళ)
ప్లీజ్ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ మహిళ
సాధారణంగా మనకు నచ్చిన వాళ్లు లేదా మనకు బాగా పరిచయం ఉన్న పొరుగింటి వాళ్లు శాశ్వతంగా వేరోచోటికి వెళ్లిపోతున్నారంటే బాధగా అనిపిస్తుంది. అది సహజం. పైగా ఒకే దేశం, ఒకే జాతికి సులభంగా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా వెళ్లిపోతున్నప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్. కానీ దేశం కానీ దేశంలో భావోద్వేగంగా వీడ్కోలు చెప్పడం అసాధారణం. కానీ అలాంటి భావోద్వేగ సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాను విడిచివెళ్లిపోతున్న భారతీయ జంటకు వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది పొరగునే ఉండే అమెరికన్ మహిళ. ఒక్కక్షణం అది భావోద్వేగ వీడ్కోలుగా మారిపోయింది. విజయ్ కొక్కెరగడ్డ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోని పంచుకున్నారు. డెట్రాయిట్లో విమానాశ్రయానికి బయలుదేరుతుండగా ఈ దృశ్యం చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. ఆ వీడియోలో విజయ్ అమెరికాలోని తన ఇంటి బయట నిలబడి ఉండగా, పోరుగునే ఉండే అమెరికన్ మహిళ వాళ్లను పట్టుకుని భావోద్వగానికి గురవ్వుతుంది. ప్లీజ్ వెళ్లిపోకండి అని కన్నీటిపర్యంతమవుతుంది. అయితే విజయ్ నవ్వి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ వీడియో రికార్డు చేయడం గురించి విజయ్కి తెలియదట. తన స్నేహితుడు తనకి చెప్పకుండానే ఈ వీడ్కోలుని చిత్రీకరించినట్లు వెల్లడించాడు. అతనే తనకు ఈ వీడియో పంపడంతో షేర్ చేసినట్లు తెలిపాడు. ఒక రకంగా ఈ వీడియో తన వద్ద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. ఇది నిజమైన భావోద్వేగాలు, ప్రేమను చూపించిందని పేర్కొంటూ తన పోస్ట్ని ముగించాడు. నిజంగా గ్రేట్ కదూ..పరాయి దేశస్థులైనా..మనలానే వెళ్లిపోతుంటే భావోద్వేగానికి గురవ్వడం గ్రేట్ కదూ..!. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :(చదవండి: తొమ్మిది పదుల వయసులో అథ్లెటిక్గా బామ్మ..! ఆఖరికి వందేళ్ల తర్వాత కూడా..)
అంతర్జాతీయం
డ్రైనేజీ కాల్వలో బంగారు నాణేలు
బ్రస్సెల్స్: బెల్జియంలో మురుగునీటి కాల్వల పునరుద్ధరణ పనులు చేస్తున్న కార్మీకులకు దాదాపు రూ.98 కోట్ల విలువైన బంగారం దొరికింది. రాజధాని బ్రస్సెల్స్లోని సింట్–గిల్లిస్–డెండర్మాండేలో భూగర్భ డ్రైనేజీ పైపుల పునరుద్ధరణ కోసం మురికికాల్వ తవ్వుతుండగా కార్మీకులకు బంగారు నాణేలు కనిపించాయి. చిన్న నాణేలు కావడంతో అంతగా పట్టించుకోలేదు. తవ్వకాలు కొనసాగించగా మరిన్ని బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్న అధికారులు నిధిని బ్రస్సెల్స్లోని ఒక సురక్షిత కేంద్రానికి తరలించారు. నిధి మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిధి దొరికిన స్థలం 19వ శతాబ్దం చివరలో బ్రూవరీ యజమాని థియోఫిలస్ వాన్ అస్చే కోసం నిర్మించిన ఒక గొప్ప విల్లా. నేలమాళిగ గోడ లోపల ఒక సంచిలో ఈ నిధిని భద్రపరిచారు. ఇందులోనే ఇవన్నీ దొరికాయి.
న్యూయార్క్లో స్వాతంత్య్ర వేడుకల్లో గిన్నిస్
న్యూయార్క్: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అమెరికాలోని న్యూయార్క్ ట్రై–స్టేట్ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగాయి. న్యూజెర్సీలోని పర్సిప్పనీ వెటరన్స్ మెమోరియల్ పార్క్లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం, అమెరికా 250వ అవతరణ వార్షికోత్సవం సందర్భంగా అత్యధిక ఫ్లాగ్పోల్స్తో 250 ఆకారాన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ విషయాన్ని భారత కాన్సులేట్ ఎక్స్లో ప్రకటించింది. కార్యక్రమంలో భాగంగా 1,300కు పైగా అమెరికా జెండాలను, వాటి చుట్టూ త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేశారు. న్యూయార్క్ సిటీ భారత సంతతి మేయర్ జొహ్రాన్ మమ్దానీ క్వీన్స్లోని ఫ్లోరల్ పార్క్లో జరిగిన ఇండియా డే పరేడ్లో పాల్గొన్నారు. అనంతరం, మమ్దానీ ఎక్స్లో తనను తాను మొట్టమొదటి భారత–అమెరికన్ న్యూయార్క్ నగర మేయర్గా చెప్పుకుంటూ..‘ఇదొక అద్భుత అనుభవం. ఎన్నటికీ మర్చిపోలేనిది’అని పేర్కొన్నారు. కాగా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సహా పలు ప్రముఖ కట్టడాలు త్రివర్ణ శోభతో మెరిసిపోయాయి. టైమ్స్ స్క్వేర్లో జరిగిన కార్యక్రమంలో భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మూన్ బేస్..స్పేస్ రేస్
దశాబ్దాల కల సాకారానికి రంగం సిద్ధమైందిఆరేళ్లలో జాబిల్లిపై శాశ్వత మానవ ఆవాసం రెడీ గ్రహాంతరాళాల శోధనకు ఇదే నిచ్చెన నాసా, ఇస్రో, జాక్సా, ఈఎస్ఏలు కలిసికట్టుగా రెడీ చేస్తున్న మూన్బేస్ వింతలు విశేషాలు... అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నా సా) జాబిల్లిపై శాశ్వత నివాసం కట్టేందుకు ఉద్దేశించిన ‘మూన్ బేస్’ ప్రాజెక్టులో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భాగస్వామి కానుంది. ఈ రెండు మాత్రమే కాదు యూరోపియన్, జపాన్ అంతరిక్ష సంస్థలు చేయి కలపనున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే నాసా ఆధ్వర్యంలోని ఆర్టీమిస్–3 ప్రాజెక్టులో భాగంగా 2032 నాటికల్లా మూన్ బేస్ సిద్ధమవుతుందని అంచనా. ఈ స్థావరం ద్వారా మనకు ఒనగూరే ప్రయోజనాలు, ఏ దేశం ఏ రకంగా ఈ ప్రాజెక్టు పూర్తికి సాయపడుతుంది? అన్నది ఇక్కడ ఆసక్తికరం. 60, 70 ఏళ్లుగా శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలైతే చేస్తున్నారుగానీ భౌతికంగా చందమామను దాటి వెళ్లింది లేదు. కారణాలు అనేకం. అయితే మూన్బేస్ ఈ పరిస్థితిని మార్చేస్తుందని అంచనా. సౌర కుటుంబం మొత్తమ్మీద మనిషి నివసించేందుకు అవకాశమున్న ఏకైక గ్రహం అంగారకుడిపైకి చేరేందుకు మూన్బేస్ ఆధారం కానుంది. జాబిల్లిపై దొరికే వనరులను సద్వినియోగం చేసుకునేందుకు, తద్వారా ఎప్పటికైనా అంగారక గ్రహంపై అడుగుపెట్టాలన్నది సంకల్పం. ఇందుకు కావాల్సిన టెక్నాలజీలను పరిశీలించేందుకు మూన్బేస్ కీలకం కానుంది. ఎండ కన్ను పడని చోట... మూన్బేస్ను చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో ఏర్పాటు చేయాలని నాసా నిర్ణయించింది. సూర్యుడి వెలుతురు ఏమాత్రం సోకని ఈ ప్రాంతంలో నీటితోపాటు ఆవాసానికి తగిన ఏర్పాట్లు కొన్ని ఉన్నాయని అంచనా. ఇస్రో 2009లో జరిపిన చంద్రయాన్–1 ద్వారా జాబిల్లిపై నీటి ఉనికి నిర్ధారణ కాగా.. 2019 నాటి చంద్రయాన్–2 ద్వారా అక్కడి ఖనిజాలు, నీటి అణువుల గుర్తింపు కొనసాగుతోంది. చంద్రయాన్–2లోని అత్యాధునిక కెమెరాల పుణ్యమా అని ఇప్పుడు మనకు ఆ ప్రాంతపు అత్యంత స్పష్టమైన ఛాయాచిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్టెమిస్–3తో షురూ... 2027లో ప్రారంభమయ్యే ఆర్టెమిస్–3 ద్వారా వ్యోమగాములు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగనున్నారు. ల్యాండర్ వ్యవస్థల పరిశీలనతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. తర్వాత 2028–2030 మధ్య మానవ ఆవాసానికి సంబంధించిన మాడ్యూల్స్, విద్యుత్తు సరఫరాకు కావాల్సిన పవర్ గ్రిడ్ను ఒక్కొక్కటిగా చంద్రునిపైకి చేరుస్తారు. అవసరాల మేరకు వ్యోమగాములు, సరుకులు రవాణా అవుతూంటాయి.ఆవాస ప్రాంతాల మాడ్యూల్స్ బెలూన్ల మాదిరిగా విచ్చుకునేవిగా ఉంటాయి. వీటితోపాటు అక్కడి రేడియోధార్మికత నుంచి రక్షణ కోసం ప్రత్యేక బంకర్లు, ఆహారం పండించుకునేందుకు గ్రీన్హౌస్లు ఏర్పాటు చేస్తారు. నాలుగు కిలోమీటర్ల గొయ్యిలో... జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలోని షాకిల్టన్ క్రేటర్ వద్ద మూన్ బేస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 21 కిలోమీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల లోతు ఉండే భారీ లోయ ఈ షాకిల్టన్ క్రేటర్. అందువల్ల గొయ్యి అంచుల్లో 24 గంటలూ సూర్యరశ్మి సోకుతూ ఉంటుంది. లోపల మాత్రం ఎలాంటి వెలుతురూ ఉండదు. ఈ సహజ నిర్మాణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు నాసా క్రేటర్ అంచుల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోబోటిక్ రోవర్లు కలిగిన పవర్ గ్రిడ్ను ఏర్పాటు చేసి సౌరశక్తిని వినియోగించుకుంటారు. 2032 నాటికి సిద్ధం? ప్రాథమిక అంచనాల ప్రకారం మూన్బేస్ నిర్మాణం 2032 నాటికల్లా పూర్తి కావాలి. 2030 నాటికల్లా వ్యోమగాముల ప్రయాణాలు మొదలవుతాయని అంచనా. స్పేస్–ఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో పరిశోధనశాలలు, ఇతర వాణిజ్య ఏర్పాట్లు చేస్తారు. జాబిల్లిపై దొరికే నీరు, మట్టి నుంచి అవసరమైన ఇంధన వనరులు (హీలియం, ఆక్సిజన్ వంటివి) వెలికితీసే ఇన్–సిటు రిసోర్స్ యూటిలైజేషన్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లాలంటే భూమి పై నుంచి రాకెట్ ఇంధనాన్ని మోసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి విడిపోయినట్లు అంచనాలున్న జాబిల్లిని విస్తృతంగా అధ్యయనం చేయడం ద్వారా భూ వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం సులువు అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యేందుకు కొన్ని అంశాలు కలిసి రావాలి. మొదటిది అంతర్జాతీయ సహకారం. రెండోది ఆర్థిక వనరులు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కిలోగ్రాము బరువును జాబిల్లిపైకి చేర్చేందుకు భారీస్థాయిలో ఖర్చు అవుతుంది. అలాంటిది టన్నులకు టన్నులు అక్కడికి పంపించాలంటే అవసరమైన నిధులు సేకరించడం ఎలా అన్నది ప్రశ్న. –సాక్షి, నేషనల్ డెస్క్
800కు పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
కీవ్: ఉక్రెయిన్ సైన్యం సమారా నగరంలోని రష్యా రాకెట్, అంతరిక్ష కేంద్రంపై ఫ్లామింగో క్షిపణులతో దాడి చేసిందని అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఫ్లామింగో క్షిపణి సుమారు టన్ను పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని, తక్కువ ఎత్తులో 3,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని నివేదికలు తెలిపాయి. రష్యా యుద్ధ విమానాలకు స్థావరంగా ఉన్న సవాస్లేయ్కా సైనిక వైమానిక స్థావరంపై కూడా సైన్యం దాడి చేసిందని జెలెన్స్కీ తెలిపారు. సుదూర దాడుల్లో మంచి ఫలితాలు సాధించినట్లు ఆయన ప్రకటించారు.“మంచి విజయం. మా సరిహద్దు నుంచి దూరం సుమారు 900 కిలోమీటర్లు” అని సమారా దాడి గురించి ఆయన అన్నారు. “ఈ యుద్ధం విషయంలో రష్యాపై మా సుదూర ఆంక్షల ప్రణాళిక అమలవుతోంది. రష్యా యుద్ధ సామర్థ్యం తగ్గించడం ముఖ్యం. శాంతి అవసరం. నిర్దిష్ట స్థావరాలకు స్పష్టమైన నష్టం కలిగించడం ద్వారా ఇది రష్యాలో కనిపించాలి” అని ఆయన అన్నారు.రష్యా నౌకాశ్రయాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తున్న సమయంలో డ్రోన్ ఒకటి లాత్వియా గగనతలంలోకి ప్రవేశించడంతో శుక్రవారం నాటో యుద్ధ విమానాలను అత్యవసరంగా రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు.దీనికి స్పందనగా లిథువేనియా నుంచి 2 ఇటాలియన్ యూరోఫైటర్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఎస్టోనియాలోని ఒక స్థావరం నుంచి 2 టర్కీ ఎఫ్-16 యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించినట్లు నాటో ప్రతినిధి అల్లిసన్ హార్ట్ తెలిపారు.బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్న ఉక్రెయిన్గత 6 నెలలుగా రష్యా భూభాగంలో సుదూర దాడులు చేసేందుకు ఉక్రెయిన్ బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. చాలా దాడులు ఉక్రెయిన్ డ్రోన్లతోనే జరిగినప్పటికీ, బ్రిటిష్ డ్రోన్లు కూడా విజయవంతమైన దాడులు చేశాయని ఉక్రెయిన్ సైనిక వర్గాన్ని ఉటంకిస్తూ ది టైమ్స్ నిన్న నివేదించింది.బ్రిటిష్ డ్రోన్లు మాస్కో సమీపంలోనే కాకుండా యారోస్లావ్, వోల్గోగ్రాడ్ ప్రాంతాల్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేశాయి. బ్రిటిష్ రాయల్ నేవీ పరీక్షించిన న్యాన్ జెట్ ఇంజిన్ డ్రోన్ను రష్యా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ సరిహద్దు నగరం బెల్గొరోడ్ను లక్ష్యంగా చేసుకునేందుకు కూడా ఉపయోగించినట్లు ఆ పత్రిక తెలిపింది.
జాతీయం
భారీ అగ్నిప్రమాదం.. ఇన్కం ట్యాక్స్ భవనంలో మంటలు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుంది. 12 ఫైరింజన్లతో మంటలు ఆర్పే యత్నం చేస్తుంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
సుప్రీంకోర్టులో రాహుల్గాంధీకి భారీ ఊరట
సాక్షి, ఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు హైకోర్టు విచారణను కొనసాగించవద్దని అలహాబాద్ కోర్టుకు.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. సీబీఐ, ఈడీలు హైకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పించరాదని తెలిపింది. ఈ కేసును విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రాహుల్ గాంధీపై నమోదైన పిటిషన్ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం, ఈ ఆరోపణలపై సీబీఐ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించి నివేదికలు సమర్పించాలని, ఈడీ కూడా తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు అంత తీవ్రమైనవి అయితే మీ ఏజెన్సీలు ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నాయని ధర్మాసనం నిలదీసింది. "కోర్టు నుంచి ఆదేశాలు రావాల్సిందేనా? మీ అంతట మీరుగా సుమోటోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదా?" అని జస్టిస్ బాగ్చి దర్యాప్తు అధికారులను ప్రశ్నించారు.కోర్టులో ఇరు పక్షాల వాదనలు.. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ విఘ్నేష్ శిశిర్కు ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని ప్రశ్నించారు. ఇది చట్టబద్ధత లేని, పూర్తిగా కక్షసాధింపు చర్య అని, పిటిషనర్ పదేపదే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సీబీఐ కేవలం ఫిర్యాదును ధృవీకరించడం మించి ఏమీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి. రాజు వాదిస్తూ.. ఇప్పటివరకు ఈ కేసులో తమ పాత్రేమీ లేదని, ఒకవేళ ఫిర్యాదులో గమనించదగ్గ నేరాలు ఉన్నట్లు తేలితే అది చాలా తీవ్రమైన విషయమవుతుందని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీపై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలను ధృవీకరించాలని సీబీఐ, ఈడీలను ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ జూలై 20న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. సీబీఐ సమర్పించిన అఫిడవిట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, దీనిపై వ్యక్తిగతంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది.
చైనా మాంజాతో యువకుడి విషాదం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఘటన!
ఉత్తరప్రదేశ్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున చైనా మాంజాతో ఓ ప్రయాణికుడు ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో చోటుచేసుకుంది. కౌశాంబి పోలీసుల వివరాల ప్రకారం.. నోయిడాలోని అక్బర్పూర్ బెహ్రాంపూర్కు చెందిన రవి రాజ్ తన స్నేహితుడు నరేశ్తో కలిసి మోటార్సైకిల్పై వెళ్తున్నాడు.అయితే, కౌశాంబి పోలీస్స్టేషన్ ఎన్హెచ్-9పై యూపీ గేట్ సమీపంలో వంతెనపై వారు చేరుకోగానే.. గాలిలో వేలాడుతున్న మాంజా అకస్మాత్తుగా అతని మెడకు చుట్టుకుంది. మాంజా పదునుగా ఉండటంతో రవి మెడకు తీవ్ర గాయమై, మెడ ఎముక వరకు తెగింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రవిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన చోటు తీవ్ర గందరగోళం పరిస్థితి ఏర్పడింది. గాయపడిన రవిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా ఇందిరాపురం ఏసీపీ సూర్యబలి మౌర్య తెలిపారు.అయితే, ఈ ప్రమాద ఘటన సుమారు 2 గంటల సమయంలో ఢిల్లీ ఎక్స్ప్రెస్వే సమీపంలో జరిగినట్లుగా, ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మాంజాతో మెడకు తీవ్ర గాయం కావడంతో రవి రక్తమోడుతూ కనిపించగా, అతడి స్నేహితుడు గాయంపై వస్త్రాన్ని ఉంచి రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రవి ఆన్లైన్ డెలివరీ పని చేసేవాడని, అతడి స్వస్థలం బిహార్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో చైనా మాంజా వాడటం నిషేధం ఉన్నప్పటికీ ఈ వినియోగం ఎలా జరుగుతోందనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.ఏసీపీ మాట్లాడుతూ.. పదునైన ఈ మాంజా ద్విచక్ర వాహనదారులు, పాదచారులతో పాటు పక్షులకు కూడా ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. నిషేధిత మాంజాను విక్రయించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ విక్రయాలను అడ్డుకునేలా పర్యవేక్షణ పెంచుతామని వారు తెలిపారు.
మోదీగారూ.. చూడండి ఏం జరిగిందో!
న్యూఢిల్లీ: యూజీసీ-నెట్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. వాటిని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఫల్యాల భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారని ఆరోపించారు. ‘‘మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.‘‘ఏళ్ల తరబడి చదివిన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దరఖాస్తులు, ఫీజులు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు.. అన్నీ మరోసారి చేయాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్టీఏ.. కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. జూన్ 22 నుంచి 30 వరకు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షలను దాదాపు రెండు నెలల తర్వాత రద్దు చేయడంపై ఆయన ప్రశ్నించారు. పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా? అనే అసలు ప్రశ్నకు NTA సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు.Modi ji, look at what your NTA has just done.UGC-NET exams for Sociology, English and Commerce were held between 22 and 30 June. Nearly two months later, NTA has cancelled all three because it set faulty papers and repeated old questions.Thousands of candidates who prepared… https://t.co/TUMhhMhjvL— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2026‘విద్యా వ్యవస్థ కాదు.. వసూళ్ల యంత్రం’దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ఇక విద్యా వ్యవస్థ కాదు.. ఒక ఎక్స్ట్రాక్షన్ మెషీన్గా మారింది. ఇది విద్యార్థుల డబ్బు, సమయం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుంటోంది. కానీ తిరిగి ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు’’ అని విమర్శించారు. పేపర్ లీక్ వ్యవహారాలపై బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం తొలి అడుగు మాత్రమేనని.. NTA నాయకత్వంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.సెప్టెంబర్లో రీటెస్ట్NTA ప్రకారం.. ఇంగ్లిష్, కామర్స్ అభ్యర్థులకు సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్షకు సెప్టెంబర్ 10న రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు అదనపు ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తామని తెలిపింది. నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న NTAపై తాజాగా యూజీసీ-నెట్ రీటెస్ట్ నిర్ణయం మరింత ఒత్తిడి పెంచింది.
ఎన్ఆర్ఐ
‘రాయలసీమకు ఆనాటి నుంచి అన్యాయమే!’
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా, తెలుగు వారికంటూ ప్రత్యేక రాష్ట్రం 1953లోనే ఏర్పడినా... రాయలసీమ ప్రాంతం ఇప్పటికీ ఆర్థిక, జల వనరుల కేటాయింపులోనూ, అభివృద్ధిలోనూ వివక్షకు గురవుతూనే ఉన్నదని సాహిత్య, సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాయలేలిన సీమగా, రతనాలు రాశులుగా పోసి అమ్మిన సీమగా... సాహిత్య చరిత్రలో పేర్కొంటూ వచ్చినప్పటికీ, వాస్తవానికి పాలకుల నిర్లక్ష్యంలో రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగానే నేటికీ కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలోని బాల్టిమోర్లో ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (ఆటా) 19వ ద్వైవార్షిక మహాసభలలో భాగంగా ‘మన రాయలసీమ’ పేరిట ‘రాయలసీమ అవగాహన సదస్సు’ జరిగింది. ఆ సదస్సులో అందరి నోటా ఈ అభిప్రాయం బలంగా వ్యక్తమైంది.ప్రబంధ కవులంతా రాయలసీమ వారే!దాదాపు నాలుగు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడ్డ ఇంజనీరింగ్ నిపుణుడు, ‘ఆటా’ వారి త్రైమాసిక పత్రిక ‘అమెరికా భారతి’ సంపాదకుడు ప్రకాశ్ తిమ్మాపురం అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు ఆవేదన నిండిన మాటలతో, ఆలోచనా స్ఫోరకంగా సాగింది. ఈ ‘రాయలసీమ అవగాహన సదస్సు’ తాలూకు ఉద్దేశాన్నీ, వర్తమాన పరిస్థితుల్లో దీనికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యాన్నీ ప్రకాశ్ తన మాటల్లో ముందుగా ప్రస్తావించారు. సముచితమైన రాయలసీమ డిమాండ్లకు అందరూ నడుం బిగించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద అవార్డు గ్రహీత, సీనియర్ సాహిత్యవేత్త జె.ఎల్. రెడ్డి సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రాంత సాహితీ ప్రముఖుల కృషిని ప్రేక్షకులతో విహంగవీక్షణం చేయించారు. కథ, కవిత్వం, నవల, విమర్శ తదితర ప్రక్రియల్లో రాయలసీమ ప్రాంతం నుంచి సాగిన అపూర్వ కృషిని సాధికారికంగా వివరించారు.సీమ అభివృద్ధికి కట్టుబడ్డ వైఎస్ రాజశేఖరరెడ్డి!అలాగే, ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ అవధాన కవి, సాహితీవేత్త నరాల రామారెడ్డి ప్రసంగిస్తూ, ప్రబంధ సాహిత్యకవుల్లో తెనాలి రామకృష్ణ లాంటి ఒకరిద్దరు మినహా అల్లసాని పెద్దన లాంటి అనేకులు రాయలసీమ వారేనని గుర్తు చేశారు. ఆయన తన విస్తృత సాహితీ అధ్యయనాన్ని పంచుకుంటూ, అనేక పద్య ఉదాహరణలతో, రాయలసీమ ప్రాంతం గొప్పదనాన్ని గుర్తుచేశారు. ప్రబంధ కవుల నుంచి పుట్టపర్తి నారాయణాచార్యుల వరకు ఎందరెందరో ప్రముఖుల రచనల్లోని ప్రత్యేకతను నరాల రామారెడ్డి వివరించారు.ఈ ‘మన రాయలసీమ’ సదస్సు కు ప్రధాన సూత్రధారి, సామాజిక పరిశీలకుడు, ‘ఆటా సాహిత్య విభాగం’ సలహాదారు అయిన జయదేవ్ మెట్టుపల్లి మాట్లాడుతూ, రాయలసీమ వెనుకబాటుకు మూలమైన చరిత్రను వివరించారు. చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాలను పేర్కొన్నారు. రక్షణ ఒప్పందం కోసం నిజామ్ ప్రభువు రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటీషు వారికి ‘సీడెడ్’ (దత్తమండలాలు)గా కట్టబెట్టడం దగ్గర నుంచి 1928లో ‘రాయలసీమ’ అన్న నామకరణం జరగడం మొదలు నేటి దాకా జరిగిన చరిత్రను సంక్షిప్తంగా కళ్ళకు కట్టారు. రాయలసీమ ప్రాంతం నుంచే తెలుగు రాష్ట్రానికి అధిక సంఖ్యలో ముఖ్యమంత్రులు వచ్చినా, రాజకీయ సంఖ్యాబలం కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పని పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉందని గుర్తు చేశారు. ఎంవి రమణారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటివారు కొందరు మాత్రమే కడదాకా రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడ్డారన్నారు.కొన్ని జిల్లాలకు మరింత అన్యాయం!తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన విశ్రాంత ఆచార్యులు దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర ప్రముఖులు పంపిన సందేశాల సారాంశాన్ని సదస్సులో వినిపించారు. అమెరికాలో స్థిరపడ్డ కడప వాసి – సాఫ్ట్ వేర్ రంగ నిపుణుడు చరసాల ప్రసాద్ మాట్లాడుతూ, అనేక అంశాల్లో అనాదిగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆవేదనాభరితంగా ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతంలోనూ కేటాయింపుల్లో కడప లాంటి జిల్లాలు మరింత వివక్షకు గురయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ చారిత్రక ఆధారాలు, గణాంకాలతో ‘కడప జిల్లా అభివృద్ధి – ఆత్మగౌరవం’ పేరిట రచయిత త్రివిక్రమ్ రాసిన పుస్తకంలోని పలు చర్చనీయాంశాలను ప్రసాద్ స్థూలంగా పరిచయం చేశారు. ఒకప్పటి ముఠా తగాదాలను సాకుగా చూపి, నేటికీ రాయలసీమ ప్రాంతాన్ని ఫ్యాక్షనిజానికి మారుపేరుగా రాజకీయ, సినీరంగాల్లో వేస్తున్న ముద్రను తీవ్రంగా ఖండించారు.ప్రొద్దుటూరుకు చెందిన సాహితీ ప్రియుడు సాధు గోపాలకృష్ణ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఉపాధి – ఉద్యోగావకాశాల పరంగా మెరుగుపరచడానికి తమ వంతుగా చేస్తున్న కృషిని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు మరింతగా ముందుకు వస్తే, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు రాయలసీమ నుంచి వలసలు తగ్గి, స్థానికంగా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.తిరుపతికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గిరిధర్ కుమార్ కుప్పాల ప్రసంగిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) నుంచి రైల్వేల వరకు తాను పనిచేసిన ప్రాంతాల్లో రాయలసీమకు ఎలా నష్టం వాటిల్లుతోందో తన స్వీయానుభవం నుంచి విశ్లేషించారు. 1980ల మధ్య నుంచి స్థానికేతరులదే టి.టి.డి.లో ప్రాబల్యం కావడంతో, రాయలసీమ స్థానిక పురోగతి, అవసరాలు, ఆకాంక్షలు నిర్లక్ష్యానికి గురయ్యాయని వివరించారు. అలాగే, రాయలసీమ ప్రాంత రైల్వే లైన్లు కొన్ని ఎన్నో దశాబ్దాల ముందే వచ్చినా, అనేక ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమకు అన్యాయమే జరిగిందన్నారు. కొద్ది జిల్లాలకే కొత్త రైల్వే జోన్లు ఏర్పడుతున్నాయి కానీ, ఎప్పటి నుంచో ప్రజల డిమాండ్ లో ఉన్న బాలాజీ రైల్వే జోన్ ఇప్పటికీ నెరవేరనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పాలకుల మెడలు వండిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఉద్యమం తరహాలో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని, మన వద్ద కూడా మరో రాయలసీమ ఉద్యమం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సభికులందరూ రాయలసీమ పురోభివృద్ధి కోసం ఉద్యమించాల్సిన అవసరంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.కర్నూలు హైకోర్టు కలకు ఇన్నేళ్ళా!ఇక, హైదరాబాద్ నుంచి ‘ఆటా -2026’ సదస్సుగా ప్రత్యేక సాహితీ అతిథిగా హాజరైన ప్రముఖ జర్నలిస్టు – రచయిత డాక్టర్ రెంటాల జయదేవ మాట్లాడుతూ, రాయలసీమలో నీళ్ళకు కరవైనా కన్నీళ్ళకు కరువు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పంటల సేద్యం బరువైనా ప్రేమాభిమానాలను పొరుగువారికి పంచడంలో రాయలసీమకు సాటి లేదని తన స్వీయానుభవాలను పంచుకున్నారు. సాహిత్యంలో పుట్టపర్తి, రాళ్ళపల్లి, సంగీతంలో శ్రీపాద పినాకపాణి, సినీ రంగంలో హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, కెవి రెడ్డి, నాటక రంగంలో సురభి సంస్థ.. ఇలా రాయలసీమ తెలుగుజాతికి అందించిన రతనాలు అనేకమని సభికులకు గుర్తుచేశారు.దాదాపు నూరేళ్ళవుతున్నా అలనాటి ‘శ్రీబాగ్ ఒడంబడిక’ (పెద్దమనుషుల ఒప్పందం) వాగ్దానాలు నేటికీ తీరకపోవడం, కనీసం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు లాంటి కష్టం – ఖర్చు పెద్దగా లేని పనులు సైతం పాలకపక్షాలు నెరవేర్చకపోవడం అన్యాయమని జయదేవ నిరసన వ్యక్తం చేశారు. ఘనమైన చరిత్ర, స్థానిక వనరులు ఉన్నప్పటికీ నేటికీ నిర్లక్ష్యం నీడలోనే మిగిలిపోయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి తోటి తెలుగు ప్రాంతాల న్యాయబద్ధమైన ఉద్యమంలో ఇతర ప్రాంతాల వారు సైతం గళం విప్పి, కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ రకంగా తెలుగు ప్రాంతాలన్నిటి సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలసి కృషి చేద్దామన్నారు.రాయలసీమ అభివృద్ధికి అవసరమైతే మరో ఉద్యమం చేయాలని వక్తలతో పాటు సభికులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద, ‘ఆటా’ వేదికగా, అమెరికా తీరంలో సైతం... రాయలసీమ అభివృద్ధి పట్ల ఆలోచన రేకెత్తించడంలో ఈ ‘మన రాయలసీమ’ అవగాహన సదస్సు సఫలీకృతమైంది. ఆలోచన నుంచి ఆచరణకు అడుగులు వేయడమే ఇక మిగిలింది!- అమెరికా నుంచి రెంటాల జయదేవ
డల్లాస్లో ఘనంగా ఎస్ జానకి సంగీత నివాళి కార్యక్రమం
టెక్సస్: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అపూర్వమైన గానమాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఎస్ జానకి (జానకమ్మ) గారికి సంగీత నివాళిగా శనివారం డల్లాస్లోని తెలుగు కళాభిమానులు ఒక అద్భుతమైన సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.DGIT (Dallas Got India Talent) వ్యవస్థాపకుడు రామన్ వీరంరాజు నాయకత్వంలో, కళావాహిని వ్యవస్థాపకుడు అనంత్ మల్లవరపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం శుభమ్ ఈవెంట్ సెంటర్ – A2B, ఫ్రిస్కోలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాఖ్యాత పరిమళ మార్పాక జానకి గారి సంగీత ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు, ప్రతి గీతానికి ఇచ్చిన చక్కని పరిచయాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి.డల్లాస్ మెట్రోప్లెక్స్లోని పలువురు ప్రతిభావంతులైన గాయనీ, గాయకులు జానకి గారు ఆలపించిన అజరామరమైన గీతాలతో ఆమెకు సంగీతాంజలి ఘటించారు. ప్రేమ, భక్తి, శృంగారం, జానపదం, భావోద్వేగం వంటి విభిన్న భావాలను ప్రతిబింబించే ఆమె చిరస్మరణీయ గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రతి గీతం ముగిసినప్పుడల్లా సభాభవనం కరతాళ ధ్వనులతో మార్మోగింది.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ గాయనిగా శిష్ట్లా జానకి గారి విశిష్ట లక్షణాలను ఒకసారి పరిశీలిస్తే – భావ వ్యక్తీకరణ - పాటలోని ఆనందం, బాధ, ప్రేమ, భక్తి, కోపం, అమాయకత్వం ఇలా ఏ భావాన్నైనా ఆమె గాత్రంలో సహజంగా పలికించగల్గడం; గాత్ర వైవిధ్యం - హాస్యపాత్రల స్వరం, రెండేళ్ళ పసిపాప నుంచి, తొంబై ఏళ్ల వృద్ధురాలి వరకూ ఏ స్వరాన్నైనా అద్భుతంగా పలికించగల అరుదైన సామర్థ్యం; భాషలపై పట్టు - ఏ భాషలో పాట పాడినా, ఆ భాషకు చెందిన వ్యక్తే పాడుతున్నారేమో అనిపించేంత స్పష్టమైన ఉచ్చారణతో పాడడానికి నిరంతర సాధన; సంగీతదర్శకుల అభిరుచికి అనుగుణంగా - శాస్త్రీయ గీతాలు, జానపద గీతాలు, ప్రేమగీతాలు, భక్తిగీతాలు, వేగవంతమైన నృత్యగీతాలు ఇలా ఎలాంటి పాటనైనా సమాన ప్రతిభతో పాడే నైపుణ్యం; వినయం - ఎన్నో వేల పాటలు పాడి, అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నప్పటికీ, తాను నిత్య విద్యార్ధినేనంటూ ఎంతో నిరాడంబరంగా జీవించిన పుణ్యజీవి అన్నారు. 6 దశాబ్దాలపాటు 15 రకాల వివిధ భాషల్లో 50,000 కు పైగా పాటలగా సాగిన గాయనీమణి జానకి గారి గాత్ర జైత్రయాత్ర అజరామరం అంటూ ఘన నివాళులర్పించారు.” డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఎస్. జానకి గారి గానం భారతీయ సంగీతానికి ఒక అపూర్వమైన వరమని, ఆమె పాటలు యుగయుగాల పాటు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయని కొనియాడారు.ఈ సందర్భంగా నిర్వాహకులు రామన్ వీరంరాజు మరియు అనంత్ మల్లవరపు మాట్లాడుతూ - విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరాలకు మన సంగీత, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా భారతీయ కళలను ప్రోత్సహించే మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.అందమైన వేదిక అలంకరణ, అద్భుతమైన సంగీత బృందం, స్థానిక గాయనీ, గాయకుల ప్రతిభ, పరిమళ మార్పాక చక్కని వ్యాఖ్యానం, ప్రేరణాత్మక సందేశాలు, అలాగే బాల గణపవరపు అందించిన నాణ్యమైన ఆడియో సపోర్ట్ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశాయి. కార్యక్రమం ముగింపులో ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో గానకోకిల ఎస్. జానకి గారికి తమ సంగీత ప్రణామాలర్పించారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ విశాలమైన వేదికను అందించడమే కాకుండా, విచ్చేసిన అతిథులు మరియు ప్రేక్షకులకు ఆతిథ్యపూర్వకంగా రుచికరమైన అల్పాహారం అందించి కార్యక్రమ విజయానికి విశేషంగా సహకరించినందుకు A2B (Adyar Anand Bhavan) యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.DGIT (Dallas Got India Talent) మరియు కళావాహిని సంయుక్తంగా నిర్వహించిన ఈ సంగీత నివాళి కార్యక్రమం డల్లాస్ తెలుగు సాంస్కృతిక వేదికపై చిరస్మరణీయమైన సంగీత సంధ్యగా నిలిచి, జానకమ్మ ఆలపించిన అజరామరమైన గీతాల ద్వారా ఆమెకు ఘనమైన సంగీతాంజలి అర్పించిన ఒక విశిష్ట సాంస్కృతిక వేడుకగా చరిత్రలో నిలిచిపోనుంది.
తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) /TCSS యొక్క పదమూడో వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2వ తేదీన స్థానిక కుర్తాళం బోర్డర్, లిటిల్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 65-70 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో ముందుగా పన్నెండో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2025-2026 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు సమ్మయ్య మోలుగూరి, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ పూర్వ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల,కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మోడరేటర్ ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన నీలం సుఖేందర్ గార్లకు కృతజ్ణతలు తెలియజేశారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రస్తుత పదవీకాల అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన నల్ల భాస్కర్ గుప్త, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లు ప్రకటించారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు నల్ల భాస్కర్ తెలిపారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ సారి ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. దీని తోపాటు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి, శ్రీధర్ బండారు గార్లను ప్రకటించి ఎన్నుకోవడం జరిగింది.నూతన కార్యవర్గం కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు నల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్య, సరావేణి విజయ కుమార్ ఉన్నట్టు తెలిపారు.మాజీ అధ్యక్షుడు రమేష్ బాబు గడప, తన పదవీకాలంలో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన అసాధారణ, అద్భుతమైన సేవలను ఏవి (AV) రూపంలో ప్రదర్శించి కార్యనిర్వాహక సభ్యులందరూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. గత పన్నెండు సంవత్సరాలుగా రమేష్ బాబు గడప అందించిన సేవలను పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, నీలం మహేందర్ గార్లు ఘనంగా కొనియాడారు. గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో భాగమై రెండు సార్లు అధ్యక్షుడిగా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ సేవలందించిన దుర్గా ప్రసాద్, సుగుణాకర్ రెడ్డి గార్లకు కార్యనిర్వాహక సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి కార్యనిర్వాహక సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీని ఆస్వాదించారు.(చదవండి: అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్)
హైదరాబాద్కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
క్రైమ్
తెనాలి కోర్టు సంచలన తీర్పు
తెనాలిరూరల్: విడాకుల కోసం పిటిషన్ వేసిన భార్యకు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేయడంతో విడాకులు మంజూరు చేయడంతోపాటు రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి. దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన నాగ సౌజన్యకు 2016 ఏప్రిల్ 22న పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామానికి చెందిన యలవర్తి నాగబ్రహ్మంతో వివాహం జరిగింది. భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని, అతనితో కలిసి జీవించే అవకాశం లేదని, తనకు ప్రాణ హాని ఉందని, విడాకులు ఇప్పించాలని కోరుతూ నాగ సౌజన్య తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో 2023లో పిటిషన్ దాఖలు చేసింది. 2024లో తన భార్యను కాపురానికి పంపుతూ ఆదేశించాలని నాగబ్రహ్మం ఇదే కోర్టులో పిటిషన్ వేశాడు. రెండు పిటిషన్లపై లోక్ అదాలత్లో రాజీ పడి విడాకులు పొందే విధంగా కోర్టు నుంచి అనుమతులు పొందారు. హడావిడి చేసి తనతో సంతకాలు పెట్టించుకున్నారని, లోక్అదాలత్లో రాజీని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసి, తెనాలి కోర్టులోని రెండు పిటిషన్లలో ప్రొసీడింగ్స్ జరగకుండా స్టే ఇవ్వాలని కోరగా హైకోర్టు స్టే ఇవ్వలేదు. రెండు పిటిషన్లను కలిపి విచారించిన తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ (సీనియర్ డివిజన్) న్యాయమూర్తి, నాగ సౌజన్య దాఖలు చేసిన విడాకులు పిటిషన్ను అనుమతించి విడాకులు మంజూరు చేశారు. నాగబ్రహ్మం దాఖలు పిటిషన్ను కొట్టివేశారు. భార్యను మానసిక వేధింపులకు గురిచేయడమే కాకుండా విలువైన కోర్టు సమయాన్ని కూడా వృథా చేసినందుకుగాను రూ.లక్ష నష్టపరిహారం నాగ సౌజన్యకు చెల్లించాలని భర్తను ఆదేశిస్తూ న్యాయమూర్తి ఎస్.వెంకటేశ్వరరెడ్డి తెనాలి న్యాయస్థానాల చరిత్రలోనే సంచలమైన తీర్పును ఈ నెల 14న వెలువరించారు.
ఎస్బీఐ ఉద్యోగి అనుమానాస్పద మృతి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం రీజనల్ మేనేజర్గా పనిచేసిన తోటకూర రమణమూర్తి రాజు చేసిన మోసాలకు మరొకరు బలి అయ్యారు. 2023లో గార ఎస్బీఐ మేనేజర్ ఉరిటి స్వప్నప్రియ బలవన్మరణం చెందగా, తాజాగా మరో బాధితుడు నరసన్నపేట మాజీ బ్రాంచి మేనేజర్ శ్రీకర్ ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆర్ఎం చేసిన పాపాలకు ఇప్పటికే ఎంతో మంది బలయ్యారు. బయటికి వచ్చినవి కొన్ని కాగా, వెలుగు చూడనివి మరెన్నో. ఆర్ఎంగా రాజు పనిచేసిన హయాంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రతిష్ట మసకబారడమే కాకుండా ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు సైతం ఇరుక్కున్నారు. గార కేసులో స్వప్నప్రియ బలవన్మరణం.. గార ఎస్బీఐలో తనఖా బంగారం మిస్సింగ్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాటి అక్రమాలు ఆర్ఎం కనుసన్నల్లో జరిగాయన్న వాదనలు ఉన్నాయి. అయినప్పటికీ, బ్యాంకు ఉద్యోగిని స్వప్నప్రియపైనే పూర్తిగా నెట్టేశారు. ఆ అవమానం భరించలేక 2023 నవంబర్ 28న స్వప్నప్రియ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ 29న మరణించింది. నాటి ఆర్ఎం రాజు నవంబర్ 30వ తేదీన 86 సంచుల తనఖా బంగారం పోయాయంటూ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు డిసెంబరు 7న ఏడుగురిని అరెస్టు చేయగా ప్రథమ ముద్దాయిగా ఆత్మహత్య చేసుకున్న స్వప్నప్రియను చేర్చారు. మరో ఉద్యోగి క్యాషియర్తో కలిసి మొత్తం తొమ్మిది మంది నిందితులుగా డిసెంబరు 9న పోలీసులు గుర్తించారు. వాస్తవంగా ఆ ఏడాది సెపె్టంబర్లోనే సెంట్రల్ ఆడిట్ జరిగింది. అందులో ఎటువంటి తేడాలేనట్లు చూపించారు. పోలీసుల విచారణలో మాత్రం 14 నెలలుగా స్వప్నప్రియ ద్వారా ఈ తతంగం జరిగినట్లు చెప్పారు. దీన్నిబట్టి అక్కడ ఏం గోల్మాల్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. క్యాషియర్ సురేష్పై స్వప్నప్రియకు సంబంధించిన వారే దాడి చేశారంటూ అంతకుముందే గార పీఎస్లో కేసు నమోదు చేయడం.. అది ఫేక్ అని తేలడం జరిగాయి. ఇలా గార తాకట్టు బంగారం మిస్సింగ్ కేసులో ఎంతో మంది ఇరుక్కుపోయారు. దాని వెనక ఆర్ఎం పాత్ర ఉందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. నరసన్నపేట బ్రాంచిలో.. శ్రీకాకుళం ఆర్ఎంగా రాజు పనిచేసిన కాలంలో నరసన్నపేటలో మరో అవినీతి చోటు చేసుకుంది. బినామీ పేర్లతో కొంతమంది పర్సనల్ లోన్లు తీసుకుని రూ.3 కోట్ల వరకు టోకరా వేశారు. వ్యక్తిగత రుణాల కోసం ఉద్యోగులు దరఖాస్తులు చేస్తే.. వాటికి అర్హత లేదని వెనక్కి పంపించేసి, ఆ దరఖాస్తులను, ఉద్యోగులు సమర్పించిన శాలరీ సరి్టఫికెట్లు, మిగిలిన డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని, బ్యాంకు సిబ్బందే లోన్లు తీసేసుకున్నారు. దీంట్లో అప్పట్లో మేనేజర్గా పనిచేసిన శ్రీకర్ను బలి చేశారు. ఆ రూ.3కోట్లు చెల్లించేస్తే కేసుల ఉండవని, లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని భయపెట్టారు. వాస్తవంగా రుణాల మంజూరనేది రీజనల్ మేనేజర్ సంతకం లేకుండా కుదరదు. ఫీల్డ్ ఆఫీసర్ పరిశీలించి రుణం ఇవ్వొచ్చని నిర్ధారించిన తర్వాత రీజినల్ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయడమే బ్రాంచి మేనేజర్ పని. అక్కడ ఓకే చేస్తే రుణం సంబంధిత అకౌంట్లో జమైపోతుంది. కానీ, ఈ మొత్తం వ్యవహారాన్ని బ్రాంచి మేనేజర్ శ్రీకర్ పైకే నెట్టేసి, ఆయన ద్వారా సుమారు రూ.60లక్షలు కట్టించినట్టు వాదనలు ఉన్నాయి. అప్పట్లో శ్రీకర్ ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్న వార్తలు గుప్పుమన్నాయి. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. నరసన్నపేట బ్రాంచిలో ఘటన జరిగిన దగ్గరి నుంచి తీవ్ర మనస్థాపంతో శ్రీకర్ ఉన్నారని బ్యాంకు వర్గాలు చెప్పుకుంటున్నాయి. తాజాగా భీమిలి బీచ్ రోడ్డులోని తిమ్మాపురం తీరంలో అనుమానాస్పదంగా మృతిచెందారు. ఏ–10గా ఆర్ఎం రాజు సుదీర్ఘ విచారణ, స్వప్నప్రియ సోదరుడు కిరణ్ న్యాయపరమైన పోరాటం చేయడంతో పోలీసులు కూడా ఆర్ఎం తోటకూర రమణమూర్తి రాజును ఆలస్యంగానైనా నిందితుడిగా చేర్చక తప్పలేదు. న్యాయం జరిగేవరకు వదలనని కిరణ్ పోరాటం చేయడంతో ఆ కేసులో ఏ–10గా చేర్చారు. ఆ మేరకు కిరణ్కు సమాచారం అందించారు. ఆర్ఎం రాజుపై చర్యలు తీసుకోవాలని స్వప్నప్రియ తల్లి ఏకంగా నిరసనకు కూడా దిగారు. అటు ఎస్పీ, ఇటు జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించడంతో కేసు మూసివేయలేదు. ఇప్పుడా కేసులో ఎ–10గా రాజును చేర్చారు. విచిత్రమేమిటంటే బ్యాంకు అధికారులు చేసిన పాపానికి గార ఎస్బీఐలో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారుల కష్టాలు నేటికీ తీరడం లేదు. అటు ఉద్యోగులే కాదు ఇటు ఖాతాదారులు కూడా నలిగిపోయిన పరిస్థితి చోటు చేసుకుంది.
దారుణం : హనీమూన్లో పీరియడ్స్ వచ్చాయని..!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. వివాహమైన నెల రోజులకే హనీమూన్ సమయంలోనెలసరి వచ్చిందన్న ఆగ్రహంతో తన భర్త తనపై దాడిచేయడంతోపాటు గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆరోపించిన కేసు కలకలం రేపుతోంది.యూపీలోని రామ్ఘర్తాల్ ప్రాంతానికి చెందిన సదరు మహిళ తన ఫిర్యాదులో, ఢిల్లీకి చెందిన తన భర్త నిఖిల్ మిశ్రాపై కేసు నమోదు చేసింది.ఈ ఫిర్యాదు ప్రకారం 2023 మే 30న ఢిల్లీకి చెందిన నిఖిల్ మిశ్రాతో ఈమెకు వివాహమైంది. ఆ తర్వాత జూలై 4న హనీమూన్ కోసం అండమాన్ వెళ్లారు. అక్కడికి వెళ్లాక తీవ్రమైన కడుపునొప్పి, పీరియడ్స్ వచ్చాయి. అధిక రక్తస్రావం జరిగింది. దీంతో రుతుక్రమం గురించి తనకు ముందుగానే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తూ భర్త తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది. అలాగే గొంతు నులమడానికి ప్రయత్నించాడని కూడా చెప్పింది. ఆమెకు రుతుక్రమం (పీరియడ్స్) రావడంతో ఆగ్రహానికి గురైన భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొంది. చివరికి హోటల్ సిబ్బంది ఆమె కేకలు విని రక్షించినట్లు బాధితురాలు తెలిపింది.కట్నం కోసం వేధింపులు పెళ్లిలో కట్నంకోసం వేధించారని కూడా ఫిర్యాదు చేసింది. రూ. 20 లక్షల నగదు, ఒక కారు, రూ. 40 లక్షల విలువైన వస్తువులు కట్నంగా ఇచ్చినప్పటికీ, బ్రాండెడ్ వస్తువులు తీసుకురాలేదని అత్త, ఆడపడుచు మానసికంగా వేధించారని తెలిపింది. అంతేకాదు పెళ్లయిన 45 రోజులకే (జూలై 14, 2023) ఆమెను అత్తవారింటి నుంచి వెళ్లగొట్టారు. సమస్యను పరిష్కరించడానికి వచ్చిన ఆమె తండ్రిని కూడా అవమానించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. ఇప్పటికీ కట్నంగా ఇచ్చిన వస్తువులను తిరిగి ఇవ్వలేదని, తన భర్త ఇంకా తనకు బెదిరింపు సందేశాలు పంపుతూనే ఉన్నాడని కూడా ఆమె ఆరోపించింది.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనంమొత్తానికి గోరఖ్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కౌస్తుభ్ జోక్యంతో ఎట్టకేలకు ఆగస్టు 15న భర్త, అత్త మరియు ఆడపడుచుపై FIR నమోదు చేశారు. మిశ్రా, అతని తల్లి సంజు మిశ్రా సోదరి నేహా పాండేలపై సదరు మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 15న ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు రామ్ఘర్తాల్ ఎస్హెచ్ఓ శ్యామ నంద్ రాయ్ తెలిపారు. విచారణలో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్కు బాబా రామ్దేవ్ హెచ్చరిక
రోడ్డు బాలేదు.. బిడ్డ దక్కలేదు
సోంపేట: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని సోంపేట మండలం గొల్లవూరు పంచాయతీ దామోదరపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర రక్తస్రావానికి గురై బిడ్డను కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలివీ.. వ్యాపారరీత్యా భువనేశ్వర్లో ఉంటున్న యజ్జల లోలాక్షి కుటుంబం శుక్రవారం ఏరినమ్మ పూజ నిమిత్తం స్వగ్రామం దామోదరపురం వచ్చారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో గర్భిణి లోలాక్షి తీవ్ర ఇబ్బందులుపడి ఇంటికి చేరుకుంది. అప్పటికే రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలకు ఫోన్చేయగా అధ్వాన రోడ్డు కారణంగా వాహనాలు పాడైపోతున్నాయని, తాము రాలేమని చెప్పారు. చివరికి ఓ వ్యక్తిని అతికష్టంమ్మీద ఒప్పించి సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల సూచనతో అక్కడ నుంచి బరంపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ తల్లీబిడ్డ అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం.. బిడ్డ ప్రాణాలు పోయాయని, తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బాధిత తల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో కనీసం అంబులెన్స్ వాహనం కూడా రాని దుస్థితిలో రోడ్డు ఉన్నందున, ఈ మృతిని ప్రభుత్వ హత్యగా పరిగణనలోకి తీసుకుని బాధితులకు తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
వీడియోలు
దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?
మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్
రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్
సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు
కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?
పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకడంపై YS జగన్ ఫైర్
చింతాడ రవికుమార్ కు బెయిల్
బీజేపీ కొత్త టీమ్ ఇదే..! DK అరుణ, లక్ష్మణకు బిగ్ షాక్
PV సింధుని 384 మంది ఫేక్ వాళ్లతో పోల్చటం సిగ్గుచేటు
తొక్కిసలాటకు ముందు ఉజ్జయిని మహంకాళి ఆలయం డ్రోన్ విజువల్స్


