చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనతలు సాధించాడు. ఈ ఫార్మాట్లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా (89 ఇన్నింగ్స్లు) ఈ ఘనత సాధించిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగో రోజు పంత్ (రెండో ఇన్నింగ్స్లో) ఈ మైలురాళ్లను అందుకున్నాడు.గిల్క్రిస్ట్ రికార్డు బద్దలుపంత్కు ముందు టెస్ట్ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ పేరిట ఉండేది. గిల్క్రిస్ట్ 130 ఇన్నింగ్స్ల్లో 100 సిక్సర్లు పూర్తి చేశాడు.100 సిక్సర్లు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్పంత్తో కలిపి టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు నలుగురు బ్యాటర్లు మాత్రమే 100 సిక్సర్ల మార్క్ను అందుకున్నారు.బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) – 138 సిక్సర్లుబ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) – 107 సిక్సర్లుఆడమ్ గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 100 సిక్సర్లురిషబ్ పంత్ (భారత్) – 100 సిక్సర్లుపంత్ ఫిఫ్టిఈ ఇన్నింగ్స్లో పంత్ 69 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్ కారణంగా భారత్ రెండో ఇన్నింగ్స్లో ఓ మోస్తరు స్కోర్ (193 ఆలౌట్) శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ను ఉంచింది.భారత రెండో ఇన్నింగ్స్లో పంత్తో పాటు కేఎల్ రాహుల్ (35), దేవదత్ పడిక్కల్ (44) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 3, లహీరు కుమార 2, కేశర నువంత ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినుష (100) అద్భుత సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. దినుషకు నిరోషన్ డిక్వెల్లా (80) సహకరించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (167) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో జయసూర్య 4, నువంత 3, అశిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం.. ఎటు పోతోంది?
ఒకప్పుడు పాలకులు మతం గురించి పదే,పదేమాట్లాడే వారు కారు.మూఢ విశ్వాసాలను ప్రోత్సహించేవారు కారు. బాణామతి,చేతబడి వంటి వాటిని అరికట్టడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునేవారు. మతం,దైవ భక్తి అన్నవి వ్యక్తిగత విషయాలుగానే భావించేవారు.కాని కాలం మారింది. శాస్త్రీయ దృక్ఫధం స్థానంలో మతాల ప్రస్తావన అధికంగా వస్తోంది. ప్రజలు భక్తిని, మతాన్ని ఆచరించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అలాగే ఆయా ఉత్సవాలలో, మతపరమైన కార్యక్రమాలలో ప్రజలకు ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. కాని ఇప్పుడేం జరుగుతోంది. వాటిని కూడా రాజకీయాలకు వాడుకోవడానికి నేతలు పోటీ పడుతున్నారు.తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే రాజకీయం ఇలా తయారవుతోందేమిటా అన్న ఆవేదన కలుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ బిఆర్ఎస్పై చేతబడుల విమర్శ చేశారు. 'పదేళ్లు అధికారంలో ఉన్నవారు, పాతికేళ్లు తెలంగాణలో రాజకీయం చేసినవారు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ,ప్రజలకు వ్యతిరేకంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చేతబడులు ,అఘోరా పూజలు చేయించడం అత్యంత దుర్మార్గం "అని రేవంత్ వ్యాఖ్యానించారు. బుద్ది సరిగా లేకపోతే ఆ క్షుద్ర పూజలు తిరగబడతాయి అని ,అదే కనుక జరిగితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా అష్టదిగ్భందనం చేస్తాయి అని ఆయన హెచ్చరించారు. 'ఎల్ నిలో ప్రభావంతో రాష్ట్రం ఎండిపోవాలని,కరువు వచ్చి జనాలు అల్లాడిపోవాలని ప్రభుత్వం బదనాం కావాలని అఘోరా పూజలు చేశారు "అని ఆయన ఆరోపించారు. అయితే దేవుడు ,అదృష్టం తమ వైపే ఉన్నాయని, తమ సంకల్పం మంచిది కాబట్టి ఈ సమయంలోను వర్షాలు కురిశాయని రేవంత్ చెప్పారు. తమకు దేవుడి దయ, ప్రజల ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఎందుకు వచ్చింది? కొద్దికాలం క్రితం బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు కర్నాటకలో కొన్ని గుడులను సందర్శించారు. అది ఆయన వ్యక్తిగత స్వేచ్చ. నమ్మకం. కాని కాంగ్రెస్ అధికార ప్రతినిది సామా రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావు క్షుధ్రపూజలు చేయించడానికి గుడులకు వెళ్లారని ఆరోపించారు. దీనిపై హరీష్ రావు మండిపడ్డారు. తాను అలాంటివి చేయలేదని, ఇలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు. అయినా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంలోకి వచ్చి, తన వద్ద ఆధారాలు ఉన్నాయని హరీష్పై మళ్లీ ఆరోపణలు చేశారు. తదుపరి ఏకంగా ముఖ్యమంత్రి రేవంతే ఈ అభియోగం మోపారు. ఇలాంటివి చెబుతున్నారంటే వీటిని వీరు నమ్ముతున్నారనే కదా! వ్యక్తిగతంగా ఎలాంటి విశ్వాసం అయినా పెట్టుకోవచ్చు. కాని ప్రజలలో మాట్లాడడానికి ముందు వీటి ప్రభావం గురించి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో బాణామతి అనే అంధ విశ్వాసం ఉండేది. బాణామతి, చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో కొందరిపై దాడి జరిగేది. కొంతమంది ఈ క్రమంలో హత్యలకు కూడా గురైన సందర్భాలు ఉండేవి.క్షుధ్రపూజలు చేస్తున్నారన్న సందేహంతో నోటిలోని పళ్లు కూడా పీకేసిన కేసులు కూడా నమోదయ్యేవి.హైదరాబాద్ నగరం విస్తృతం అవడం,శాస్త్ర విజ్ఞానం పెంపొందడంతో ఇవి ఇటీవలికాలంలో బాగా తగ్గాయి.ఈ తరుణంలో సి.ఎమ్.స్థానంలో ఉన్నవారు ఈ క్షుద్రపూజల గురించి మాట్లాడడం వల్ల రాజకీయంగా ఆయనకు ఎంత లబ్ది చేకూరుతుందో కాని,ప్రజలలో మాత్రం మూఢ విశ్వాసాలు మరింత పెరగడానికి దోహద పడతాయి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశంలో శాస్త్రీయ దృక్ఫధం పెరగాలని వాంచించారు. ఇందుకోసం ఐఐటి వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలను నెలకొల్పారు. అలా అని ఆయనకు మతపరమైన విశ్వాసాలు లేవని కాదు. తను మరణించిన తర్వాత చితాభస్మాన్ని పవిత్రమైన నదులులో కలపాలని కోరుకున్నారు. తదుపరి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కంప్యూటర్ వినియోగాన్ని ప్రోత్సహించారు.పివి నరసింహారావు ప్రదానిగా ఉన్నప్పుడు చంద్రస్వామి అన్న తాంత్రికుడు చక్రం తిప్పేవారని ప్రచారం జరిగేది. అయినా ఆయన మత విశ్వాసాలు ఎలా ఉన్నా, బాబ్రి మసీదు కూల్చివేసిన ఘటనపై తీవ్రంగా ఆవేదన చెందారు. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో సహా ఆయా ముఖ్యమంత్రులకు కొందరు జ్యోతిష్కులపైన, పండితులపైన నమ్మకాలు ఉండేవి. అయినా వారు ఆ నమ్మకాలను ప్రజలపై రుద్దాలని భావించలేదు. బహిరంగ సభలలో వాటి గురించి పెద్దగా ప్రస్తావన తెచ్చేవారు కారు. భారతీయ జనతా పార్టీ దేశంలో విస్తృతం అయ్యే కొద్ది ఈ మతపరమైన విశ్వాసాలు పెరుగుతూ వచ్చిన మాట నిజమే.కాని అదే పార్టీకి చెందిన కొందరు నేతలు మూడ విశ్వాసాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడేవారు.కరువు పరిస్థితులు ఇప్పుడే కాదు.గతంలో కూడా వచ్చేవి.అప్పుడు కూడా కొందరు ముఖ్యమంత్రులు వరుణ యాగాలు చేయించారు.కొద్ది రోజుల క్రితం రేవంత్ కూడా సాగర్ వద్ద వరుణ యాగం నిర్వహించారు. గత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా సందర్భాలలో యాగాలు, యజ్ఞాలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి వచ్చాక ,మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ వంటివారు స్వామిజీ అని సంభోధించేవారు.అయినా ఎన్.టి.ఆర్.తను నటించిన పలు సినిమాలలో ఈ మూఢ విశ్వాసాలకు , మతం పేరుతో మోసాలు చేసేవారికి వ్యతిరేకంగా పలు సన్నివేశాలు పెట్టేవారు.ప్రభుత్వంలో ఉన్నప్పుడు మతపరమైన అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.అలా అని ఆయనకు దైవం పై నమ్మకం లేదని కాదు.ప్రస్తుత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పెద్దగా మతపరమైన రాజకీయాలు చేసేవారుకారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో ఆ పార్టీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు.రాజకీయంగా తనకు లాభం జరుగుతుందనుకున్నప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకునేవారు. ఒకరకంగా చెప్పాలంటే అవకాశవాద రాజకీయాలు చేయడంలో ఆయనకు సాటి లేరనుకోవవచ్చు. 2019లో ఓటమి ఎదురైన తర్వాత అప్పటి వైసిపి ప్రభుత్వాన్ని ,ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను ఓడించాలంటే మతపరమైన విమర్శలు చేయాలని తలపెట్టేవారు. కొత్త పూజారికి పంగనామాలు ఎక్కువ అన్న సామెత ఉంది. దానికి అనుగుణంగా ఉన్నవి, లేనివి ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎక్కడా సంకోచించలేదన్న అభిప్రాయం ఉంది.2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోరణి మరింతగా పెరిగింది. తిరుమల స్వామివారి ప్రసాదంపై వివాదం సృష్టించి దానిని జగన్ కు ఆపాదించడం వరకు వెళ్లారు.జగన్ ఆలయాలకు వెళ్లడాన్ని కూడా ఆక్షేపించేవరకు వెళ్లి మీ దేవుడు,మా దేవుడు అంటూ వ్యాఖ్యలు చేసే దశకు చేరుకున్నారు.బహిరంగ సభలలో ఇలాంటి ప్రసంగాలు చేయడం అలవాటుగా చేసుకున్నారు. అమరావతి దేవత రాజధాని అంటూ కొత్త నినాదం చేబూని ప్రజలను ఆకర్షించే పనిలో ఉంటున్నారు.రాజధానిలో జరిగే అక్రమాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఇలా మతాన్ని,దేవుడిని అవసరం ఉన్నా,లేకపోయినా ప్రస్తావిస్తున్నారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. ఇక ఈ మధ్య మరో అడుగు ముందుకేసి శ్రీవెంకటేశ్వర స్వామి వద్దకు వర్చువల్ గా వెళ్లానని అంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం సజావుగా సాగాలని ప్రార్ధించానని ఆయన చెబుతున్నారు.ఎల్లో మీడియా గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడానని చెబుతున్నారంటూ ఒక తప్పుడు కధనాన్ని సృష్టించి ప్రచారం చేసింది. ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను మాత్రం పెద్దగా కనిపించకుండా జాగ్రత్తపడడం గమనించదగ్గ అంశం.చివరిగా ఒక మాట చెప్పాలి. ప్రముఖ ఆధాత్మిక వేత్త,ఎపి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు ఒక వ్యాఖ్య చేశారు.రాజు ధర్మాన్ని పాటించకపోతే వర్షాలు కురవవని ఆయన తన ధార్మిక ప్రసంగంలో చెప్పారు. వర్షాలు పడకపోవడానికి ఎల్ నిలో కారణమని నమ్మమంటారా?లేక చాగంటి అభిభాషించినట్లుగా రాజు ధర్మంగా లేకపోవడం వల్లనే అని అనుకోమంటారా?అంటే ముఖ్యమంత్రులు ఏమి చెబుతారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
అసెంబ్లీలోకి సీఎం వస్తే లేచి నిలబడాలా?
సాక్షి, చెన్నై: శాసనసభలోకి సీఎం వచ్చినప్పుడు సభ్యులు గౌరవార్థం లేచి నిలబడటం తప్పనిసరా..? అనే అంశంపై అసెంబ్లీలో కాసేపు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీనిపై స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ స్పందిస్తూ... సీఎం సభలోకి వచ్చినప్పుడు సభ్యులు లేచి నిలబడటం నిర్బంధం ఏమీ కాదన్నారు. అది వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, సభ్యుల హక్కుకు సంబంధించిన అంశం అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. సభలో దేవాదాయ శాఖమంత్రి రమేష్ మాట్లాడుతూ, సీఎం విజయ్ సభలోకి వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించే మర్యాదను ప్రతిపక్ష నాయకుడికి , మాజీ సీఎం ఓ. పన్నీర్సెల్వం నేర్పించాల్సి ఉందని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇందుకు పన్నీరుసెల్వం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.పన్నీర్సెల్వం సమాధానం ఇస్తూ స్పీకర్ సభలోకి వచ్చినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరూ లేచి నిలబడటం కాలక్రమేణా వస్తున్న సాంప్రదాయం అని గుర్తు చేశారు. అయితే, సీఎం నేరుగా తమ స్థానానికి వెళ్లి నమస్కరించి కూర్చోవడం అనవాయితీగా వస్తున్నదన్నారు. తాజా సీఎం విజయ్ సభలోకి వస్తూ అటు... ఇటు ఇరువైపులా తిరిగి నమస్కరిస్తూ వెళ్తున్నారని, ఇది కొత్తగా ఉందన్నారు.. ఒకవేళ సీఎం కోసం లేచి నిలబడాలనే నిబంధనే ఉంటే, ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కూడా నిలబడాలా? అని ప్రశ్నించారు. స్పీకర్ వివరణ.. దీనిపై స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ సమాధానమిస్తూ.. సీఎంగానీ, ప్రతి పక్ష నాయకుడు గానీ సభలోకి వచ్చినప్పుడు సభ్యులు లేచి నిలబడాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ఈ సభ అత్యున్నత సాంప్రదాయం ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు. తమిళుల సంస్కృతి ప్రకారం అలా గౌరవం ఇవ్వడం మంచి పరిణామమేనని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలా వద్దా అనేది సభ్యుల ఇష్టానికే వదిలేస్తున్నానని వివరించారు. 100 రోజుల పాలనపై స్పీకర్ ప్రశంసలు ముందుగా అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం విజయవంతంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. లౌకిక, సామాజిక న్యాయాన్ని కాపాడే సీఎం విజయ్ పాలనలో ఈ 100 రోజులు కేవలం క్యాలెండర్ రోజులు కావు అని, తమిళనాడు చరిత్రలో ఒక చారిత్రక మార్పు అని వ్యాఖ్యలు చేశారు.
మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు తుమాటి మాధవరావు నామినేషన్
అమరావతి: ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స, వైసీపీ ఎమ్మెల్సీలు కూడా అక్కడే ఉన్నారు.మరోవైపు, శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎల్నినోపై చర్చ అసెంబ్లీలో అవసరం లేదా అని, మండలిలోనే కావాల్సి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. రైతాంగం ఎరువులు దొరక్క గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పిందే తామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు పొడిగించాలని చెప్పారు.
త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?
హెచ్-ఫాస్ట్ ఆధ్వర్యంలో దాడులు.. 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం
సచిన్ను దాటేసిన పడిక్కల్
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
రెండో రోజు కూడా ప్రభుత్వం తోకముడిచింది: బొత్స
జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన
15ఏళ్ల తరువాత ‘జిందగీ’ సీక్వెల్పై అప్డేట్
ఇన్వెస్టర్లకు అదిరిపోయే గిఫ్ట్.. లిస్టింగ్ రోజే భారీ లాభాలు!
మ్యాచ్ మధ్యలో అరంగేట్రం చేయనున్న శ్రీలంక ప్లేయర్
ఒడిశాలో వరదల బీభత్సం.. 13 మంది మృతి
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
సార్ మీతో తెలుగులో మాట్లాడారా ఏంటి సార్!
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
బెంగళూరు తీగల్లో స్పైడర్మ్యాన్ బందీ
రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!
కూటమి పాలనలో పోలీసు వాహనాలు కూడా ఇలా తయారయ్యాయి!!
‘రాను బొంబాయికి రాను’.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపచారం
'ఇక అతడి రీఎంట్రీ కష్టమే.. అందరూ మర్చిపోండి'
సంపద పెంచుకోవాలంటే.. అంకుర్ వారికూ ఆర్ధిక సూత్రాలు!
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు కారు..
తండ్రి కుల వ్యవస్థకు వ్యతిరేకం.. అందుకే నా ఇంటిపేరు ‘బచ్చన్’
ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
'పంత్ వల్ల కాలేదు బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం'
బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆటోడ్రైవర్ ఇంట్లో నోట్ల కట్టలు.. 4 బ్యాగుల్లో రూ.3 కోట్లు
ప్రభాస్ తల్లిగా పిలుస్తుంటే ఆనందంగా ఉంది
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?
హెచ్-ఫాస్ట్ ఆధ్వర్యంలో దాడులు.. 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం
సచిన్ను దాటేసిన పడిక్కల్
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
రెండో రోజు కూడా ప్రభుత్వం తోకముడిచింది: బొత్స
జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన
15ఏళ్ల తరువాత ‘జిందగీ’ సీక్వెల్పై అప్డేట్
ఇన్వెస్టర్లకు అదిరిపోయే గిఫ్ట్.. లిస్టింగ్ రోజే భారీ లాభాలు!
మ్యాచ్ మధ్యలో అరంగేట్రం చేయనున్న శ్రీలంక ప్లేయర్
ఒడిశాలో వరదల బీభత్సం.. 13 మంది మృతి
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
సార్ మీతో తెలుగులో మాట్లాడారా ఏంటి సార్!
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
బెంగళూరు తీగల్లో స్పైడర్మ్యాన్ బందీ
రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!
కూటమి పాలనలో పోలీసు వాహనాలు కూడా ఇలా తయారయ్యాయి!!
‘రాను బొంబాయికి రాను’.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపచారం
'ఇక అతడి రీఎంట్రీ కష్టమే.. అందరూ మర్చిపోండి'
సంపద పెంచుకోవాలంటే.. అంకుర్ వారికూ ఆర్ధిక సూత్రాలు!
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు కారు..
తండ్రి కుల వ్యవస్థకు వ్యతిరేకం.. అందుకే నా ఇంటిపేరు ‘బచ్చన్’
ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
'పంత్ వల్ల కాలేదు బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం'
బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆటోడ్రైవర్ ఇంట్లో నోట్ల కట్టలు.. 4 బ్యాగుల్లో రూ.3 కోట్లు
ప్రభాస్ తల్లిగా పిలుస్తుంటే ఆనందంగా ఉంది
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
ఫొటోలు
జెన్జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)
18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)
న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)
కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)
ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)
చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)
వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్ (ఫొటోలు)
‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
‘అమీర్ లోగ్’ని అమితాబ్ చిత్రాలతో పోల్చడం హ్యాపీగా ఉంది: దర్శకుడు
‘‘అమీర్ లోగ్’ చిత్రంలో అన్నిరకాల వాణిజ్య అంశాలుఉన్నాయి. ఈ సినిమా కేవలం యువతకి మాత్రమే కాదు. 13 సంవత్సరాలు దాటిన పిల్లలతో కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ మూవీని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అని దర్శకుడు రమణా రెడ్డి సోమ తెలిపారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ నెల 21న విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో రమణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ–‘‘మాది నల్గొండ జిల్లాలోని రాఘవపురం. 1997లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కి వచ్చాను. జేఎన్టీయూలో ఆర్టిటెక్ట్ చదివాను. మూడేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. ‘అమీర్ లోగ్’ సినిమాని బస్తీలోనే షూట్ చేయాల్సి రావడంతో సింక్ సౌండ్ని వాడాం. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ చాలా బాగా నటించారు. ‘అమీర్ లోగ్’కి రానాగారి సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిత్రాన్ని చూసిన డైరెక్టర్ వీఎన్ ఆదిత్యగారు అమితాబ్గారి ‘ఝుండ్’, రణ్వీర్ సింగ్ ‘గల్లీబాయ్’ చిత్రాలతో పోల్చడం సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు.
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' రిలీజ్ కానుంది. దీనిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది. తండ్రి కూతురు నేపథ్యానికి అయ్యప్ప స్వామి మాల, 41 రోజుల దీక్ష అనే పాయింట్ జోడించి దీన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి? దీనితో పాటు అమీర్ లోగ్, ద రెడ్ బ్యాగ్ అనే చిత్రాలు కూడా రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మరోవైపు ఓటీటీల్లో 19 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో దళపతి విజయ్ 'జన నాయగన్', కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ', ప్యార్ ప్రేమ కల్యాణం అనే సినిమాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటికి తోడుగా వెల్కమ్ టూ ద జంగిల్, టాయ్ స్టోరీ 5 లాంటివి కూడా చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ చిత్రం స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 17 నుంచి 23 వరకు)జీ5జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 21ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ మూవీ) - ఆగస్టు 21నెట్ఫ్లిక్స్ఫ్రీ ఫాల్: ఏ రెకనింగ్ ఫర్ బోయింగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 19హియర్ ద హోల్ టైమ్ (బ్రెజిలియన్ సినిమా) - ఆగస్టు 19ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20బ్లడ్ సాక్రిఫైస్ (స్వీడిష్ సిరీస్) - ఆగస్టు 20ఎస్&ఎక్స్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 20ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 21ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21హాట్స్టార్లాంటర్న్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 17 (స్ట్రీమింగ్ అవుతోంది)వెల్కమ్ టూ ద జంగిల్ (హిందీ సినిమా) - ఆగస్టు 21సోనీ లివ్చెన్నై లవ్ స్టోరీ (తెలుగు సినిమా) - ఆగస్టు 21అమెజాన్ ప్రైమ్టాయ్ స్టోరీ 5 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 18 (రెంట్తో స్ట్రీమింగ్)నోవాక్ జకోవిచ్: ద వోల్ఫ్ ఇన్ వింటర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 20క్లీనప్ కంపెనీ (హిందీ సిరీస్) - ఆగస్టు 21ఆపిల్ టీవీ ప్లస్ద డైనస్టీ: యూకాన్ హస్కీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20లయన్స్ గేట్ ప్లేస్నేక్స్ 5 (చైనీస్ మూవీ) - ఆగస్టు 21మాంచెస్టర్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21స్టిల్ వాటర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)
సినిమా గుమ్మం దాటని దేవయాని వారసురాలు
సినిమా చాలా శక్తివంతమైనది. దాని ప్రభావం ప్రేక్షకులపైనే కాకుండా, చిత్ర రంగంలోని వారిపైనా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా ఇది రంగుల ప్రపంచం. ఒక్కసారి ఎంటర్ అయితే అందులో నుంచి బయటపడటం అసాధ్యమనే చెప్పాలి. విజయపథంలో ఉన్న వారు మరింత ఉన్నత స్థాయి కోసం, విజయాలు లేని వారు దాన్ని అందుకోవడం కోసం నిరంతరం పరితపిస్తూనే ఉంటారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే వారసులు సినిమా గుమ్మం దాటడానికి సుముఖత చూపడం లేదనే చెప్పాలి. చాలా మంది నటీనటులు, దర్శక నిర్మాతల వారసులు ఇక్కడే విజయాలను వెతుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు చిన్న ఉదాహరణ నటి కుష్బూ సుందర్ వారసురాళ్లు. ఈమె ఇద్దరు కూతుళ్లలో ఒకరు కథానాయకిగాను, మరొక నిర్మాత గాను రంగంలోకి దిగారు. ఈ పుట్టింట్లో నటి దేవయాని రాజ్ కుమార్ వారసురాలు చేరారు. దేవయాని ప్రముఖ కథానాయకి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆమె భర్త రాజ్ కుమార్ ప్రముఖ దర్శకుడు అన్నది తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుళ్లు.అందులో పెద్ద కూతురు ఇనియ. రెండవ కూతురు ప్రియాంక. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే రాజ్కుమార్, దేవయాని దంపతులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దారు. అదేవిధంగా వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అయితే వారిద్దరు తల్లిదండ్రుల వారసత్వాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. పెద్ద కూతురు బుల్లి తెరను తన పయనంగా ఎంచుకున్నారు. టీవీ షోలలో పాల్గొంటూ ప్రేక్షకుల్లో పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా సెల్ఫీ రీల్స్ చేస్తూ వైరల్ అవుతున్నారు. ఇక రెండవ కూతురు కథానాయకిగా రంగప్రవేశం చేశారు. నటుడు ప్రశాంత్ హీరోగా నటిస్తున్న రంజన్ ది అడ్వకేట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది తెలుగులో మంచి హిట్ అయిన కోర్టు చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. ఇలా చాలా మంది సినీ వారసులు సినిమా గుమ్మం దాటడం లేదు.
అలాంటి వాళ్లు 'బిగ్బాస్'కి రావొద్దు: నవదీప్
ప్రస్తుతం 'బిగ్బాస్' అగ్నిపరీక్ష షో ప్రసారమవుతోంది. అయితే దీని జడ్జిల్లో ఒకటైన నవదీప్ తనని అవమానించాడని ఉప్పల్ బాలు అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరస పెట్టి వీడియోలు చేస్తున్నాడు. తన చావుకు నవదీప్ కారణమని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో అందరూ బాలుకి సపోర్ట్ చేస్తూ నవదీప్ తీరుని విమర్శిస్తున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు నవదీప్ స్పందించాడు. ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసి అందరి కామెంట్స్కి కౌంటర్ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: 'బిగ్బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు)'బిగ్బాస్ అనేది సమాజాన్ని ప్రభావితం చేసే ఓ షో. 100 మంది రకరకాల మనస్తతత్వాల మధ్య బ్రతుకుతున్నప్పుడు ఆ మాటలని ఎలా తీసుకుంటాం, ఎలా కంట్రోల్ చేసుకుంటామనేదే పాయింట్. దానిని పరీక్షించడానికే మమ్మల్ని జడ్జిలుగా పెట్టారు. వచ్చిన కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్పై ఎలా స్పందిస్తారు అనేది చూసేందుకే వాళ్ల సహనాన్ని పరీక్షిస్తాం. కంటెస్టెంట్ స్పందన ఎలా అయినా ఉండొచ్చు. జడ్జిగా వెళ్లే ముందే నాకు ఆ విషయం తెలుసు. హారర్ సినిమాకు వచ్చి బయపెట్టొద్దు అంటే ఎలా? ఎవరు ఎన్ని మాటలు అన్నా తట్టుకుని నిలబడాలనేదే ఈ కాన్సెప్ట్. 'అగ్నిపరీక్ష' అంటేనే ట్రిగర్ చేయడం. నా లాంటి వాళ్లు ఎన్ని మాట్లాడినా తట్టుకుని నిలబడే శక్తి ఉందా? ఉంటేనే రండి. అగ్నిపరీక్ష డిజైన్ చేసిందే దానికోసం. అలా తట్టుకుని నిలబడేవాళ్లే షోకు రండి లేదంటే రావొద్దు' అని నవదీప్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు: పల్లవి ప్రశాంత్) View this post on Instagram A post shared by Nav Deep 2.0 (@pnavdeep)
క్రీడలు
IND vs SL: భారత్ ఆలౌట్.. శ్రీలంక లక్ష్యం ఎంతంటే?
శ్రీలంకతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు నామమాత్రంగా రాణించారు. ఫలితంగా టీమిండియా 193 పరుగులకే ఆలౌట్ అయింది. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 44 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అర్ధ శతకం (66)తో ఆకట్టుకున్నాడు.శ్రీలంక లక్ష్యం ఎంతంటే?మిగిలిన వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించాడు. అయితే, తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా.. శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్లు ఆడుతోంది.తొలి ఇన్నింగ్స్ ఇలాఈ క్రమంలో గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్కు దిగింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167) సాధించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీలతో అలరించారు. మిగిలిన వారిలో యశస్వి జైస్వాల్ 32, రిషభ్ పంత్ 39 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేసింది.భారీ ఆధిక్యంతో..అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక.. 284 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలా ఒక వికెట్ కూల్చారు.భారత బౌలర్లు లంకను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేయడంతో.. భారత్కు 178 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 193 పరుగులకు ఆలౌట్ అయింది.హాఫ్ సెంచరీతో అదరగొట్టిన పంత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ 35 పరుగులు చేయగలిగాడు. పడిక్కల్ (44), పంత్ (66)రాణించగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ (8), ధ్రువ్ జురెల్ (7), రవీంద్ర జడేజా (9), మానవ్ సుతార్ (9), కుల్దీప్ యాదవ్ (5), ప్రసిద్ కృష్ణ (2) సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశారు.Rishabh Pant walks back after a typically flamboyant half-century. 🚶➡️ Watch #SLvIND, 1st Test | Day 4, LIVE NOW on Sony Sports Network channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/uBBiHTvsS8— Sony Sports Network (@SonySportsNetwk) August 18, 2026శ్రీలంక బౌలర్లలో పేసర్ అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు దక్కించుకున్నాడు. లాహిరు కుమార రెండు, కేశార నువాంత ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. అతడిపై వేటు వేసిన సీఏ
లైవ్ మ్యాచ్లో భయానక ఘటన.. ఐసీయూ బెడ్పై అంపైర్!
ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, న్యూఢిల్లీ టైగర్స్ మధ్య మ్యాచ్లో భయానక సంఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఆశిష్ మీనా వేసిన 18వ ఓవర్లో బ్యాటర్ లక్ష్య థరేజా ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ నేరుగా అంపైర్ ధర్మేశ్ భరద్వాజ్ ముఖాన్ని బలంగా తాకింది. దీంతో అంపైర్ నొప్పితో విలవిల్లాడిపోయారు. అదే సమయంలో తాను కొట్టిన బంతి అంపైర్కు బలంగా తాకడంతో లక్ష్య థరేజా బాధను వ్యక్తం చేశాడు. అయితే తాజా నివేదిక ప్రకారం అంపైర్ భరద్వాజ్ పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే మ్యాచ్లో అంతకముందే అంపైర్ భుజం గాయానికి గురయ్యారు.మ్యాచ్ విషయానికొస్తే ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 36 పరుగుల తేడాతో న్యూఢిల్లీ టైగర్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. మయాంక్ రావత్ (40) టాప్ స్కోరర్గా నిలవగా, వాన్స్ మెహ్రా (35), అర్పిత్ రానా (33) రాణించారు. న్యూఢిల్లీ టైగర్స్ బౌలర్లలో రిషబ్ శర్మ 3 వికెట్లు తీయగా, లక్ష్మణ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూఢిల్లీ టైగర్స్ 19.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హిమ్మత్ సింగ్ (31), లక్ష్య థరేజా (21) పర్వాలేదనిపించారు. ఈస్ట్ ఢిల్లీ బౌలర్లలో ఆశిశ్ మీనా, మయాంక్ యాదవ్లు చెరో 3 వికెట్లు పడగొట్టారు.చదవండి: జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్.. కానీ ఒక కండిషన్!
నీకసలు ఏమైంది?.. బలహీనత మరోసారి బయటపడింది!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 16 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా రెండో ఇన్నింగ్స్లోనూ నిరాశపరిచాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది.ఆ ముగ్గురూ రాణించారుఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (51) అర్ధ శతకాలతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీ (167)తో ఆకట్టుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో గిల్.. 28 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులు చేశాడు.రెండుసార్లూ అతడి చేతిలోనే అవుట్లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 20 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేయగలిగాడు. ఈసారి కూడా ప్రభాత్ జయసూర్య బౌలింగ్లోనే అవుటయ్యాడు. వికెట్ల ముందు దొరికిపోయి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఇలా అయితే కష్టమేఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ బౌలింగ్లోనే రెండుసార్లు అతడు విఫలమయ్యాడని.. గిల్ బలహీనత మరోసారి బయటపడిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గిల్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టకపోతే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా గిల్ చివరగా జూన్లో స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ (126) బాదాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియాకు మంచి ఆధిక్యం లభించింది. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా లంచ్ బ్రేక్ సమయానికి భారత్.. నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. అతడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా
బంగ్లాదేశ్ చేతిలో దారుణ ఓటమి తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ జేక్ వెదర్లాండ్పై వేటు వేసింది. అతడి స్థానంలో రెండో టెస్టుకు మ్యాట్ రెన్షాను ఎంపిక చేసింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్ రెండు మ్యాచ్లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్ వేదికగా తొలి టెస్టు జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లా చారిత్రక విజయం సాధించింది. తిథ్య ఆసీస్ను ఊహించని రీతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా 23 ఏళ్ల తర్వాత తొలిసారి కంగారూ గడ్డపై ఆడిన టెస్టు మ్యాచ్లో బంగ్లా జయభేరి మోగించింది. ఆ ఇద్దరూ విఫలంఇక ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 23 పరుగులు చేసిన వెదర్లాండ్.. రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. రెండుసార్లు బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్లోనే వెదర్లాండ్ అవుటయ్యాడు.ఇక ఇప్పటికి మొత్తంగా ఆరు టెస్టులు ఆడిన వెదర్లాండ్.. కేవలం 224 పరుగులే చేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సగటు కేవలం 20. ఈ నేపథ్యంలో వెదర్లాండ్ను జట్టు నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రెండో టెస్టుకు మ్యాట్ రెన్షాను ఎంపిక చేసింది. 30 ఏళ్ల రెన్షా ఇప్పటికి ఆడిన 14 టెస్టుల్లో కలిపి 645 పరుగులు చేశాడు.లబుషేన్కు మరో అవకాశంకాగా 2023లో చివరిగా ఆసీస్ తరఫున టెస్టు ఆడిన రెన్షా.. వెదర్లాండ్ వైఫల్యం కారణంగా మరో అవకాశం దక్కించుకున్నాడు. ట్రవిస్ హెడ్తో కలిసి ఓపెనర్గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. మార్నస్ లబుషేన్ సైతం బంగ్లాతో తొలి టెస్టులో విఫలమయ్యాడు. ఈ వన్డౌన్ బ్యాటర్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 1, 31 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో లబుషేన్ను కూడా తప్పించాలనే డిమాండ్లు రాగా.. యాజమాన్యం మాత్రం అతడికి మరో అవకాశం ఇచ్చింది. ఇక ఆసీస్- బంగ్లా మధ్య ఆగష్టు 22- 26 మధ్య రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు మెకాయ్ వేదిక.బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మ్యాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్.చదవండి: వర్షం ముప్పు.. భారత్ గెలవాలంటే అదొక్కటే దారి
న్యూస్ పాడ్కాస్ట్
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
బిజినెస్
ఇలా అయితే బంగారం కొనేదెలా?: పెరిగిన ధరలు..
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఇలా అయితే కొనేదెలా అంటూ.. పసిడి కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ అప్డేట్: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:45 గంటలకు సెన్సెక్స్ 249.00 పాయింట్లు లేదా 0.32 శాతం నష్టంతో 77,479.16 వద్ద, నిఫ్టీ 50.70 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,236.95 వద్ద ముందుకు సాగుతున్నాయి.వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. కోల్గేట్-పాల్మోలివ్ (ఇండియా) లిమిటెడ్, లోధా డెవలపర్స్ లిమిటెడ్, బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్పై ప్రత్యేక కమిటీ
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంపై బ్యాంకింగ్ రంగానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్రం త్వరలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం తెలిపారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో, ప్రతిపాదిత కమిటీ పరిశీలించతగిన అంశాల గురించి సమాలోచనలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు అత్యంత కనిష్ట స్థాయికి దిగివచ్చాయని, సంస్కరణలను చేపట్టేందుకు ఇదే సరైన తరుణం కాగలదని ఆమె చెప్పారు. ఆర్థిక స్థిరత్వం, సమ్మిళితత్వం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ భారతదేశపు తదుపరి దశ వృద్ధికి ఊతమిచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని సమగ్రంగా సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
హైరింగ్ పండుగ!
ముంబై: ఈ పండుగ సీజన్లో తాత్కాలిక సిబ్బంది రిక్రూట్మెంట్కి డిమాండ్ జోరుగా ఉండనుంది. ఈసారి వ్యాపార సంస్థలు దాదాపు 2.5–2.7 లక్షల పైచిలుకు నియామకాలు చేపట్టనున్నాయని అంచనా. ప్రధానంగా ఈ–కామర్స్, లాజిస్టిక్స్, క్విక్ కామర్స్, రిటైల్తో పాటు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) తదితర రంగాల సంస్థలు భారీగా రిక్రూట్మెంట్ చేపట్టనున్నాయి. టాలెంట్ కంపెనీ అడెకో ఇండియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది పండుగ సీజన్లో సుమారు 2.16 లక్షల తాత్కాలిక సిబ్బంది నియామకాలు జరగ్గా ఈ ఏడాది హైరింగ్ 15–20 శాతం మేర పెరగనుంది. ‘అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ఈసారి పండుగ సీజన్లో నియామకాలు చేపట్టడంపై వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. దేశీయంగా వినియోగం పెరుగుతుండటమనేది రిటైల్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, వినియోగదారులను ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం ఉండే సంస్థల్లో నియామకాలకు డిమాండ్ నెలకొంది. భౌగోళిక, రాజకీయ పరిణామాలు, ఇంధన ధరలు పెను మార్పులకు లోనవుతుండటం, వ్యాపారపరంగా అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, ఎగుమతుల ఆధారిత పరిశ్రమల్లో అనిశ్చితి కొనసాగుతుండటంలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార సంస్థలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి‘ అని అడెకో ఇండియా డైరెక్టర్ దీపేష్ గుప్తా తెలిపారు. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన వివరాలతో పాటు మార్కెట్ అధ్యయన నివేదికల ఆధారంగా అడెకో ఇండియా ఈ నివేదికను రూపొందించింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఈసారి నియామకాల డిమాండ్లో దాదాపు 45 శాతం వాటా లక్నో, జైపూర్, కోయంబత్తూర్లాంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఉండనుంది. ఆయా మార్కెట్లలో వినియోగం పెరుగుతుండటం, ఈ–కామర్స్ విస్తరిస్తుండటం, సంఘటిత రిటైల్ రంగం వృద్ధి చెందుతుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణంగా నిలవనున్నాయి. → ఇదే సమయంలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్లాంటి ప్రథమ శ్రేణి నగరాల్లో సిబ్బంది కొరత అత్యధికంగా 30 శాతం మేర ఉంటోంది. సిబ్బంది వేగంగా మారిపోతుండటం, గిగ్ వర్క్ వైపు మొగ్గు చూపుతుండటం మొదలైన విషయాల వల్ల నియామకాలు చేపట్టడంలోనూ, ఉన్న ఉద్యోగులు వెళ్లిపోకుండా అట్టే పెట్టుకోవడంలోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. → తాత్కాలిక సిబ్బంది వేతనాలు మెట్రో మార్కెట్లలో 12–15%, ద్వితీయ..తృతీయ శ్రేణి ప్రాంతాల్లో 8–10% మేర పెరగనున్నాయి. → కొత్త కేటగిరీల్లో కాకుండా కీలకమైన కార్యకలాపాల నిర్వహణ విధులను నిర్వహించే సిబ్బందికి డిమాండ్ ఎక్కువగా ఉండనుంది. ఇన్–స్టోర్, బీఎఫ్ఎస్ఐ ఆధారిత హైరింగ్ విషయంలో రిటైల్ సేల్స్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్స్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మొదలైన కొలువులు కీలకంగా ఉంటున్నాయి. అత్యంత వేగంగా ఆర్డర్లను డెలివరీ చేయడం, కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని కలి్పంచడంపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణం. → ఒకే భాషకు పరిమితం కాకుండా పలు భాషలు వచి్చన వారిని తీసుకోవడానికి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి, డిజిటల్ పరిజ్ఞానం కలిగి ఉండి, కస్టమర్లతో సంభాíÙంచగలిగి, కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాలు కలిగి ఉన్న వారికి పెద్దపీట వేస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకోగలగడం, పటిష్టమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలుండటం రిటైల్, లాజిస్టిక్స్, బీఎఫ్ఎస్ఐ, ఈ–కామర్స్లో కొలువులను దక్కించుకునేందుకు అదనపు అర్హతలుగా ఉంటున్నాయి. → సీజనల్గా తీసుకునే వారిలో దాదాపు 25% మంది క్రమంగా దీర్ఘకాలిక ఉద్యోగ విధుల్లోకి మారుతున్నారు. దీన్ని బట్టి చూస్తే దేశీయంగా సంఘటిత రంగ ఉద్యోగాలను దక్కించుకోవాలంటే పండుగ సీజన్ నియామకాలు ఎంట్రీ పాయింట్గా ఉంటున్నాయి. → నియామకాల అవకాశాలు భారీగానే కనిపిస్తున్నప్పటికీ, ప్రతిభావంతుల లభ్యత పెను సవాలుగా ఉంటోంది. పండుగ సీజన్లో ఫ్రంట్లైన్, కార్యకలాపాల నిర్వహణ కొలువులకు సంబంధించి దాదాపు 80 శాతం సంస్థలకు సరైన అభ్యర్ధులు దొరకడం లేదు. కీలకమైన ప్రస్తుత తరుణంలో డిమాండ్–సరఫరా మధ్య 10–15% మేర వ్యత్యాసం ఉండవచ్చని అడెకో అంచనా వేస్తోంది.
ఫ్యామిలీ
పిల్లల గుండెల్లో పిచ్చుక గూళ్లు
నిద్ర లేచి పిచుకల కిచకిచలు వింటూ కాఫీ తాగడం ఒకప్పటి ముచ్చట. నేటి హైరైజ్ అపార్ట్మెంట్లు, గ్లాస్ బిల్డింగులు, సెల్ టవర్ల రేడియేషన్ మధ్య పిచుకలు బెదిరి దూరం జరిగిపోయాయి. తమిళనాడు తన తప్పు తెలుసుకొని విద్యాశాఖను, అక్కడి ‘కూడుగల్ ట్రస్ట్’ను కలిపి ‘ప్రభుత్వ స్కూళ్ల ద్వారా పిచుకల సంరక్షణ’ అనే విప్లవానికి తెరలేపింది. పిచుక గూళ్లు తయారు చేయడం నేర్చుకున్న పిల్లలు చెన్నై, కోయంబత్తూరుల్లో ఉంచిన గూళ్ల వల్ల పిచుకలు తిరిగి వచ్చాయి. మరి మనకు వద్దా పిచుకల సందడి?పిల్లలు పెద్దలను చాలా విషయాల్లో సరి చేస్తున్నారు. పెద్దలు వదిలిపెట్టిన బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు స్కూలు పిల్లలు అదే దారిలో ఉన్నారు. పర్యావరణ, సంరక్షణ బరువును కూడా వారి చిన్ని భుజాలకు ఎత్తుకుంటున్నారు.చెట్టు, పుట్ట, మట్టి, మొలక, పిట్ట, పిచుక... అన్నీ బాగుంటేనే మనం కూడా బాగుంటామని వారికి తెలుసు. అందుకే తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘కూడుగళ్’ ట్రస్ట్ కలిసి ‘పిల్లలూ... పిచుకలు గూళ్లు లేక అవి ఊళ్లు వదిలి వెళుతున్నాయి. బతకలేకపోతున్నాయి. మీరే గూళ్లు తయారు చేసి వేళ్లాడగట్టండి’ అనంటే అలాగే అని రంగంలో దిగారు.దేశంలోనే మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు కలిసి పిల్లలను పిచుకుల కేర్టేకర్లుగా మార్చిన విశేషం ఇది. ఆ ఆలోచన ఫలించింది. కిచకిచలు వినిపిస్తున్నాయి. అవి తుర్రున ఎగురుతున్నాయి. ఇళ్ల కిటికీల్లో వాలి హాయ్ చెబుతున్నాయి.ఇంటికొక గూడుపిచుకలు బతకాలంటే ఇంటికొక గూడు ఉండాలి. కనీసం స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ తన ఇంటి దగ్గర ఒక గూడు వేళ్లాడగడితే? ఇదీ ఆలోచన. అందుకే తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, కృష్ణగిరి, రాణిపేట్ వంటి 10 జిల్లాల్లోని 50 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి, ఈ సీజన్లో స్కూళ్లు తెరిచాక పిచుకగూళ్ల వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. పిల్లలకు చెక్కతో పిచుకల గూళ్లు తయారు చేయడం నేర్పిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కేవలం పక్షులకు ఇళ్లు ఇవ్వడంతోనే ఆగిపోదు. పిల్లలు ఆ గూళ్లను తమ ఇళ్లవద్ద అమర్చిన తర్వాత వాటికి రోజువారీ ఆహారం, నీరు కూడా ఇవ్వాలి. రోజూ ఉదయం, సాయంత్రం గూటి పక్కన సజ్జలు, రాగులు, వరి గింజలు వంటి ధాన్యాలు వేయడం, చిన్న పాత్రలో మంచినీరు అమర్చడం పిల్లల దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇలా గూడుతో పాటు కూడు కూడా దొరకడంతో గత ఐదేళ్లలో తమిళనాడులో 15,000 గూళ్లను పంపిణీ చేసిన జిల్లాల్లో పిచుకల జనాభా ఏకంగా 25 శాతం పెరిగింది. వచ్చే నెలలో పిచుకలను గుర్తించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను లాంచ్ చేయబోతున్నారు. దీని సాయంతో పిల్లలే స్వయంగా ‘పిచుకల గణన’ (Sparrow Census) చేయనున్నారు.బడి నుంచి ప్రకృతిమన విద్యావ్యవస్థలో మార్కులు, ర్యాంకుల గోల ఎక్కువైపోయింది. పిల్లలకు పుస్తకాల్లో పర్యావరణం గురించి పాఠాలు ఉంటాయి కానీ ప్రాక్టికల్ అవగాహన సున్నా. తమిళనాడు చేస్తున్న ఈ ప్రయోగం కేవలం పిచుకలను కాపాడటం మాత్రమే కాదు... గూడును తయారు చేయించి, ఒక ప్రాణికి రోజూ అన్నం పెట్టే బాధ్యతను ఇవ్వడం ద్వారా పిల్లల్లో ‘కరుణ’, ‘సృజనాత్మకత’, ‘బాధ్యత’ అనే గుణాలను నాటుతున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిపై పిల్లవాడికి ఓనర్షిప్ వస్తుంది. పెద్దయ్యాక వాడు పర్యావరణాన్ని నాశనం చేసే పనులు చేయడు. చెట్లను నరకడానికి ఒప్పుకోడు. కాబట్టి మనం ఎయిర్ కండిషన్స్డ్ గదుల్లో కూర్చుని పర్యావరణ ఉపన్యాసాలు ఇవ్వడం కంటే స్కూల్ లెవెల్లోనే ఇలాంటి ‘డు ఇట్ యువర్ సెల్ఫ్’ ప్రాజెక్టులు పెట్టడం వల్ల సమాజంలో శాశ్వత మార్పు వస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో ?హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్ లాంటి నగరాల్లో ఈ రోజు పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా పిచుకలు కనుమరుగైపోతున్నాయి. ప్రతి ఇల్లూ కాంక్రీట్ డబ్బాగా మారిపోవడంతో పిచుకలకు ఆశ్రయం లేకుండా పోయింది. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పిచుకలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి పంటలను నాశనం చేసే చిన్న చిన్న పురుగులను, దోమల లార్వాలను తిని రైతులకు, ప్రజలకు స్నేహితుడిగా మారతాయి. పిచుకలు లేకపోతే పురుగులు పెరుగుతాయి. మన హైదరాబాద్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి హ్యాబిటాట్ బాక్సులను పంపిణీ చేస్తూ నగరంలో పిచుకలను రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇలాంటి ప్రాజెక్టులను అధికారికంగా పాఠశాలల్లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు? మన విద్యాశాఖలు ఇలాంటి ఎన్విరాన్ మెంట్ ప్రాజెక్టులను సిలబస్లో భాగంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మనకూ కావాలి పిచుకలు.. .గృహిణులు, విద్యార్థులు ఏం చేయాలి? పెద్ద పెద్ద బడ్జెట్లు, ప్రభుత్వ నిధుల కోసమే ఎదురు చూడనక్కర్లేదు. చిన్న అడుగు వేయవచ్చు. మీ ఇంటి బాల్కనీల్లో, కిటికీల పక్కన అట్టపెట్టెలు లేదా పాత కొబ్బరి చిప్పలతో గూళ్లను ఏర్పాటు చేయవచ్చు. వాటిల్లో కొద్దిగా బియ్యం గింజలు, సజ్జలు వేసి, ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెడితే చాలు.. పిచుకలు మళ్లీ మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. ఇక విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్లలో గేమ్స్ ఆడటం పక్కన పెట్టి ఇళ్ల చుట్టుపక్కల ఉన్న పక్షులను గమనించడం, వాటికి దాణా వేయడం అలవాటు చేసుకోవాలి. రేపటి తరానికి కేవలం డిజిటల్ స్క్రీన్లపై పిచుక బొమ్మలను చూపించడం కాకుండా వాటి నిజమైన కిచకిచలను బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన ఇళ్లలో, మన మనసుల్లో పిచుకల కోసం కొంచెం స్థలాన్ని కేటాయిద్దాం!
147 కేజీల నుంచి 109 కేజీలకు..! ఆ డైట్తో 38 కేజీలు..
బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం పట్ల క్రమశిక్షణతో కూడిన విధానం అవసరం. కేలరీల లెక్కింపు వ్యాయామం వంటివి బరువు తగ్గేందుకు ఉపకరించేవే. అయితే ఈ కంటెంట్ క్రియేటర్ బరువు తగ్గడానికి ఒక వెరైట్ డైట్ విధానం అనుసరించి ఏకంగా 38 కేజీల బరవు తగ్గాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. తాను భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ కోసం ఆరోగ్యకరమైన తండ్రిగా ఉండాలనే ఉద్దేశ్యంతో బరువు తగ్గానని వెల్లడించారు. మరి ఆయన అనుసరించిన డైట్ విధానం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ జెఫిన్ స్వతహాగా పెద్ద ఫుడ్డీనని అన్నారు. అనారోగ్యకరమైన స్నాక్స్ పట్ల ఉన్న ఇష్టం గురించి కూడా మాట్లాడారు. అలాగు తాను ఏళ్ల తరబడి అధిక బరువుతో పోరాడినట్లు తెలిపారు. తాను 2018లో 35 కిలోలు తగ్గానని, కానీ ప్రతి గ్రాము తిరిగి పెరిగిపోవడాన్ని చూశానని అన్నారు. అయితే 2022లో పెళ్లి కోసం మళ్లా బరువు తగ్గానని చెప్పారు. కానీ హైదరాబాద్కు మారిన తర్వాత ఒత్తిడి పెరిగి మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోయానని పోస్ట్లో రాసుకుకొచ్చారు. తన అధిక బరువు తనకు బాధకరమైన అంశంగా మారిందని అన్నారు. ఇతరులకు ఇచ్చే స్నేహపూర్వక సలహాలు కూడా ఒత్తిడిని పెంచాయని చెప్పారు. గతేడాది ఏకంగా 147 కిలోల అధిక బరువుకి చేరిపోయానని అన్నారు. పైగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా.. తన జీవనశైలి కారణంగా తక్షణ స్ట్రోక్ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అన్నారు. పైగా తన భార్య రిన్సీ తను కలిసి ఒక బిడ్డను కనాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే తాము ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకుని..ఇలా వెయిట్లాస్ జర్నీకి ఉపక్రమించామని అన్నారు. అయితే తమ ఫిట్నెస్ ప్రయాణం ఎలా ప్రారంభమైందో ఇలా పంచుకుంది ఆ జంట. తాము ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(అడపాదడపా ఉపవాసం)ని ఉపయోగించనట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు చిరుతిళ్లకు దూరంగా ఉండాలనే నియమం పెట్టుకున్నామని అన్నారు. అలాగే డైట్లో తన భార్య రోజుకు రెండు పూటల భోజనానికి మారగా, తాను ఒక్క పూట భోజనానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలా ఇప్పుడు తాను 109కిలోలకు చేరానని, ఇప్పటికీ ఆ ఆహార నియమాన్ని, వ్యాయామాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడిక మరింతగా ఆరోగ్యకరమైన బరువు చేరుకోవడమే లక్ష్యంగా తామిద్దరం కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఒమాడ్ డైట్..ఒమాడ్ అంటే ఒకరకమైన ఇంటర్మిటెంట్ పాస్టింగ్. ఇది ఒక వ్యక్తి తీసుకునే కేలరీలను ఒకే భోజనానికి లేదా ఒక గంట వంటి తక్కువ సమయానికి పరిమితం చేస్తారు. అంటే రోజంతా ఒక భోజనం చేసి, ఇతర ఆహార పదార్థాలను తీసుకోకపోవడం లేదా ఒకే భోజనం చేసి, ఉపవాస సమయంలో పరిమిత పరిమాణాంలో ఆహారం తీసుకోవడం వంటివి ఉంటాయి. ఈ ఆహార పద్ధతి కేలరీల లోటుకి దారితీస్తుంది. అంటే శరీరం ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువ కేలరీలను తీసుకుంటుంది. దీనివల్ల సునాయాసంగా బరువు తగ్గొచ్చు అని చెప్పారు. ఈ విధానం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. రక్తంలో చక్కెర, వాపు స్థాయిలు తగ్గడం తోపాటు గుండె జబ్బుల ప్రమాద కారకాలు తగ్గుతాయని అన్నారు. కానీ ఈ ఆహార పద్ధతి పిల్లలు కౌమారదశలో ఉన్నవారికి, వృద్ధులకు, ఆహార సంబంధిత రుగ్మతలు ఉన్నవారికి, గర్భిణీ లేదా పాలిచ్చే మహిళలకు తగినది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అంట్లు తోమే స్థాయి నుంచి..రూ. 160 కోట్ల కంపెనీ నిర్మించే రేంజ్కు..!)
అంట్లు తోమే స్థాయి నుంచి..రూ. 160 కోట్ల కంపెనీ నిర్మించే రేంజ్కు..!
కటిక పేదరికం అందమైన బాల్యం దూరంచేసి చదువు దారిదాపుల్లోకి రానివ్వకుండా చేసింది. కానీ అతడి ఎదుగుదలను ఆపలేకపోయింది. చదువు లేకపోయినా..బతక నేర్చిన తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి..అంట్లు తోమే స్థాయి నుంచి వ్యవస్థాపకుడిగా మారి ఏకంగా 160 కోట్లు విలువ చేసే కంపెనీని నిర్మించే స్థాయికి చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచాడు. అంతేగాదు జీవితం అన్ని ఇవ్వకపోయినా..కష్టపడి సాధించుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు అని చూపించాడు.ఆ వ్యక్తే రాజస్థాన్కు చెందిన విజయ్ వర్మ. రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లా, బిసౌ గ్రామంలో అక్టోబర్ 1978లో జన్మించిన ఆయన బాల్యం కటిక దారిద్యంలో గడించింది. అతనికి పదేళ్లు వచ్చేసరికి తాతయ్య, నానమ్మ ఇద్దరూ చనిపోయారు. ఏడాదిలోపే తండ్రి కూడా చనిపోయారు. మిగిలింది తల్లి ఒక్కత్తే..ఆమెనే ఆరుగురు పిల్లలను పోషించాల్సి ఉంది. అయితే అక్కడ మహిళలు ఎప్పుడూ పొడవాటి ఘూంఘట్లతో గడప దాటి బయటకు రావడం చాలా అరుదు. అందువల్ల నాటి సమాజ ఆంక్షలను ధిక్కరించే అవకాశం లేక అతడి తల్లి ఆరుగురు పిల్లలను పోషించేందుకు ప్రతి రోజు సూర్యోదయానికి ముందే ఇంటి వెనుక ఉన్న అడవిలోకి వెళ్లి ఎండిన ఆకులు, పేడను సేకరించి బదులుగా 30-40 కిలోల పిండిని తెచ్చుకునేదని చెప్పుకొచ్చారు విజయ్ వర్మ. ఇంతలో అన్నయ్య అమ్మకు సాయంగా ఆస్పత్రిలో రెండు రూపాయల జీతానికి కార్మికుల భోజన పెట్టెలు మోసుకెళ్లే పనిలో చేరాడని అన్నారు. అంతా బాగానే సాగుతుంది అనుకుంటుండగా..ఒక ఏడాది తర్వాత మళ్లీ చేతిలో పనుల్లు లేక ఇబ్బందిపడాల్సి వచ్చింది. అప్పుడే తమ కుటుంబానికి తెలిసిన సీతారాం భాయ్ అనే వ్యక్తి మా అన్యయ్యను ముంబై తీసుకువెళ్లి నెలకు రూ. 500లు ఇప్పిస్తానని చెప్పారు. ఆరో తరగతిలో ఉన్నా తాను ఆ మాటలు విని పట్టుబట్టి మరి అన్యయ్య తోపాటు ముంబై వెళ్లినట్లు తెలిపారు. అయితే అక్కడ మురుగు కాలువ దుర్గంధం, దోమల బెడద తట్టుకోలే నరకం చూసి, ఇంటికి వెనుదిరిగి వెళ్లిపోదాం అనుకున్న తరుణంలో పూణే వెళ్లి పరిశుభ్రమైన వాతావరణ చూడమని సలహా ఇవ్వడంతో అక్కడికి పయనమైనట్లు తెలిపారు. అయితే తమకు సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి రూ. 200లు ఇవ్వడంతో ఆ డబ్బులతో తాము రైలు ఎక్కి పూణేకి చేరుకున్నట్లు తెలిపారు. రైలు టికెట్ రూ. 20లు పోగా మిగిలినడబ్బుని ఎవరో ఎత్తుకుపోయిన ఘటన అస్సలు మరవనన్నారు. ఆ సమయంలో టాయిలెట్లు క్లీన్ చేసే ఒక అపరిచితుడు మమ్మల్ని చూసి జాలిపడి మాకు మూడు రోజులు అన్నం పెట్టి..టాయిలెట్ వాడుకునేందుఉ అనుమతించాడని అన్నారు. ఆ తర్వాత తాము అతడి వద్దే 18 రోరజు ఉండి వడా పావ్ అమ్మేవారికి గిన్నెలు కడుగుతూ రూ. 3లు సంపాదించినట్లు తెలిపారు. సరిగ్గా ఆ సమయంలోనిరాధర్ అనే రాజస్థానీ కాంట్రాక్టర్, వర్మ తనసోదరుడికి మంగళా థియేటర్లో రోజుకు రూ. 18 చొప్పున పునరుద్ధరణ పనులు చేసే పనులు అప్పగించడంతో తమ రాత మారినట్లు తెలిపాడు. అయితే విజయ్కి పనిచేసే వయసు తక్కువగా ఉండటంతో ఒక వృద్ధురాలికి ఇసుక జల్లించడంలో సాయం చేయమని చెప్పారు. అయితే ఆమె కంటే మూడు రెట్లు వేగంగా పనిచేయడంతో ఆశ్చర్యపోయిన కాంట్రాక్టర్ తనకు రోజుకు రూ. 8లు చెల్లించినట్లు తెలిపారు. ఆ తర్వాత నెలలో ఒక గదికి మారి రూ. 2లకు ఒక సైకిల్ని అద్దెకు తీసుకుని ఒక భవన నిర్మాణానికి సంబంధించి.. టైల్ ఫ్లోరింగ్ నుంచి ప్లాస్టరింగ్, ఆర్సీసీ వరకు ప్రతి అంశంలో నైపుణ్యం సాధించినట్లు తెలిపారు. ప్రతి నెల 25వ తేదీకి రూ. 90 నుంచి 170 వరకు మనీ ఆర్డర్లను పంపేవాళ్లమని అన్నారు. ఒక ఏడాది తర్వాత టిఫిన్ బాక్సులలో రూ. 65,000 నగదును దాచి మా ఊరికి వెళ్లి..మా ఇంటి వెనుకు ఉన్న పొదలను తొలగించి ఒక గోడను నిర్మించుకోగలిగామని గర్వంగా చెప్పారు.అన్నింటినీ మార్చేసిన ఆ అవకాశందానితో ధైర్యం తెచ్చుకున్న ఆ సోదరులు, సొంతంగా కాంట్రాక్టర్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు విజయ్. ఇందుకోసం తమ గ్రామం నుంచి ఆరుగురు అబ్బాయిలను శిక్షణ కోసం చేర్చుకున్నామని అన్నారు. వారు విమల్ కుమార్ జైన్ అనే ఒక ప్రసిద్ధ బిల్డర్ వద్ద పని చేయాలని ఆశపడ్డారు. మూడు నెలల పాటు, ఆ బిల్డర్ వారిని "కేవలం పిల్లలు" అని కొట్టిపారేశాడు. చివరకు విజయ్ తాము, టైలింగ్, కిచెన్ ప్లాట్ఫారమ్లు, ఆర్సిసి, ప్లాస్టరింగ్ వంటి వాటిలో తనకు నైపుణ్యం ఉందని వాదించి మరి అవకాశం ఇవ్వమని అర్థించాడు. దాంతో ఆ బిల్డర్ 15 రోజుల్లో పూర్తి చేయాల్సిన ఒక శాంపిల్ ఫ్లాట్ను కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేయాలనే అసాధ్యమైన గడువు ఇచ్చాడు, అంతేగాదు పని పూర్తి చేయకపోతే జీతం కూడా ఉండదని హెచ్చరించాడు. కానీ విజయ్ బృందం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రేయింబవళ్లు పనిచేసి మూడు రోజుల్లోనే ఆ పనినని పూర్తి చేసి ఆశ్చర్యపోయేలా చేశారు. వారి వేగం, నాణ్యత చూసి ఆ ఇంజనీర్ కాంట్రాక్టర్ ఏకంగా రూ. 5100 అందజేశారు. అదే తమనుఅన్న పేరుమీద శ్యామ్సుందర్ చీరంజీవ్లాల్జీ కన్స్ట్రక్షన్ అనే కంపెనీని పెట్టే స్ధాయికి తీసుకెళ్లిందని చెప్పుకొచ్చారు. కొద్దిమంది కార్మికులతో మొదలైన ఆ కంపెనీ..చూస్తుండగానే ఏకంగా 350 మందికి పెరిగింది.ఆ తర్వాత కాంట్రాక్టర్ నుంచి వ్యవస్థాపకుడిగా1998 నాటికి, ఆ సంస్థలో సుమారు 850 మంది కార్మికులు పనిచేసేవారు, పైగా రూ. 8 కోట్ల వార్షిక టర్నోవర్ను నమోదు చేసేదని వెల్లడించారు. అయితే ఈ సంఖ్య పెరుగుతూనే ఉండి, 2004-05 నాటికి రూ. 20 కోట్లకు చేరుకుందని చెప్పారు. ఫైవ్-స్టార్ హోటళ్ల లాబీల నుంచి ఫామ్హౌస్ల వరకు, తాము అస్సలు వెనుతిరిగి చూడలేదని తెలిపారు. ఆ తర్వాత ఆయన 2008లో,సొంతంగా సాయి విజయ్ కన్స్ట్రక్షన్ను స్థాపించి, 2011లో దానిని LLPగా లాంఛనప్రాయంగా మార్చారు. 2017లో, ఆ కంపెనీ ఆదాయపు పన్ను విచారణను కూడా ఎదుర్కొన్నప్పటికీ, ఎటువంటి నష్టం లేకుండా బయటపడిందన్నారు. తమ రికార్డులు ఎంత పకడ్బందీగా ఉండేవంటే, దర్యాప్తు అధికారులు కనీసం రూ. 5,000 వ్యత్యాసాలను కూడా కనిపెట్టలేకపోయేవారని గర్వంగా చెప్పారు. ఈనాడు, ఆ కంపెనీ విలువ సుమారు రూ. 160 కోట్లు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయనకు పూణేలో నాలుగు ఇళ్లు, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఒమన్, యెమెన్ వంటి దేశాల్లో ఏకంగా రూ. 730 కోట్ల అంతర్జాతీయ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని అన్నారు. అలాగే తన వద్ద శిక్షణ తీసుకున్న కార్మికులే కొందరు సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఆర్థికపరిస్థితుల దృష్ట్యా కోల్పోయిన చదువుని తిరిగిపోందడం కోసం..30వ ఏట ఓపెన్ స్కూలింగ్ సాయంతో పది పూర్తి చేసి, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా, పీహచ్డీ పూర్తి చేసినట్లు తెలిపారు. అంతేగాదు ఆయన ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలను చెబుతున్నారు. అరగంటగా మొదలయ్యే తన ప్రసంగాలు విద్యార్థుల ప్రోత్సాహంతో రెండు మూడు గంటల వరకు సాగుతాయని చెప్పుకొచ్చారు. అంతేగాదు విజయ్ వర్మ కుమారుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు.ఆయన చెప్పే జీవిత పాఠాలు..తనలాంటి జీవితాన్ని నిర్మించుకోవడానికి ఏం కావాలని అడిగితే, నిజాయితీ, కఠోర శ్రమ, పట్టుదల అని తడుముకోకుండా చెప్పేస్తారు. అంతేగాదు తాము ఎదిగే క్రమంలో ఒక రాత్రి పోలీసులో దాడిలో తీవ్రంగా గాయపడ్డమని అన్నారు. దాంతో తన అన్నయ ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఆ ఘటన తనకు గౌరవనీయమైన వ్యక్తులతో సత్ససంబంధాలు ఏర్పరుచుకోవడం అత్యంత ముఖ్యమని తెలిసొచ్చిందన్నారు. అంతేగాదు విజయ్ అందమైన జీవితాన్ని నిర్మించుకోవడమే కాదు, బాల్యంలో మిస్సైన అభిరుచుల వైపుకి మళ్లుతూ పియానో, మార్వాడీ జానపద గీతాలు వంటివి కూడా నేర్చుకుంటూ..తన బాల్యన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తుంటానని అన్నారు.(చదవండి: చేతితో చిత్రించిన పటచిత్ర చీరలో నీతా అంబానీ అద్భుతమైన లుక్..!)
చేతితో చిత్రించిన పటచిత్ర చీరలో నీతా అంబానీ అద్భుతమైన లుక్..!
దేశంలోని గొప్ప కళా వారసత్వాన్ని చాటిచెప్పే చీరలో నీతా అంబానీ మెరిశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను జరుకునేందుకు ఆమె ఒడిశా హస్తకళా వారసత్వ చీరను ఎంచుకున్నారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) వ్యవస్థాపకురాలు ఎప్పటికప్పుడూ భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రదర్శిస్తూ.. అందర్నీ విస్మయపరుస్తుండే ఆమె ఈసారి ఒడిశా వారసత్వంతో అందర్నీ మంత్ర ముగ్ధుల్ని చేశారామె. నీతా ధరించిన చీరను ప్రత్యేకంగా స్వదేశ్ సంస్థ రూపొందించింది. దీనిపై ప్రఖ్యాత పటచిత్ర కళాకారుడు ప్రశాంత మొహరానా కళాకృతి ఉంది. ఈ కళాకృతిని ఒడిశాలోని రఘురాజ్పూర్కు చెందిన నిపుణులైన నేత కార్మికులు నేసిన టస్సర్ సిల్క్పై చిత్రించడం విశేషం. ఈ చీర ఆ ప్రాంతం ప్రసిద్ధ వస్త్ర, చిత్రకళా సంప్రదాయలను ఒకచోట చేర్చింది. ఆ చీరపై జీవ వృక్షం డిజైన కూడా ఉంది. అది అశ్వత్ధం నుంచి ప్రేరణ పొందిన జీవ వృక్షం. అదే ఈ చీరకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ డిజైన్ సృష్టి, నిరంతరత. జీవరాశి అనుసంధానికి ప్రతీక. ఈ చెట్టు తోపాటు ఆకులు, పక్షులను కూడా విలక్షణమైన పటచిత్ర శైలిలో చిత్రీకరించారు. సింపుల్గా చెప్పాలంటే ఈ చీర ఒడిశా కళా వారసత్వానికి ఒక సజీవ కాన్వాస్గా మారింది. ఈ క్లిష్టమైన కళాకృతి ఎంతో హుందాగా ఉండే ఈ చీరకు గాఢమైన సాంస్కృతిక రూపాన్ని ఇస్తుంది. అదే సమయంలో టస్సర్ సిల్క్ ఒక ప్రకాశవంతమైన ఆధారాన్ని అందిస్తూ, చేతితో వేసిన పెయింటింగ్ వివరాలు ప్రస్ఫుటంగా కనిపించేలా చేస్తుంది. ఈ చీరకు ఎరుపు నలుపు రంగుల అంచు ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్ని జత చేశారు. దీనివల్ల స్టైలింగ్ క్లాసిక్గా ఉంటూ, కళాకృతి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ శారీకి అనుగుణంగా సాంప్రదాయ స్టెప్స్ గొలుసు, స్టేట్మెంట్ చెవిపోగులు, గాజులు, ఉంగరాన్ని జత చేశారు. ఆమె కురులను ఉంగరాల జుట్టు మాదిరిగా వదులుగా వదిలేశారు. ఇక్కడ నీతా అంబానీ స్వాతంత్ర్య దినోత్సవ రూపం సాంప్రదాయ పండుగ దుస్తులకు అతీతంగా, భారతీయ హస్తకళా నైపుణ్యానికి అగ్రస్థానం కల్పిస్తున్నట్లుగా హెలెట్గా నిలిచింది. ఈ చీరతో నీతా పటచిత్ర కళాకారులు, టస్సర్ సిల్క్ని నేసే రషురాజ్పూర్ చేనేత కార్మికులును ఒక చోటచేర్చి ఒడిశా కళాకారుల వైభవాన్ని చాటి చెప్పారామె. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) (చదవండి: Independence Day 2026: ఎర్రకోటపై మోదీ ‘బంధనీ’ సఫా.. చుక్కల వెనుక వేల ఏళ్ల భారతీయ చరిత్ర!)
అంతర్జాతీయం
ఇన్ఫ్లుయెన్సర్ కావడం ఇక ఈజీ కాదు!
సోషల్ మీడియా స్టార్ కావడం.. ఇక సరదా వ్యవహారం కాదు. కంటెంట్ క్రియేషన్ను ఓ ప్రొఫెషన్గా గుర్తిస్తూ ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం ఏకంగా డిగ్రీ కోర్సును ప్రారంభించింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి వేదికలపై కెరీర్ నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ అందించేలా ఈ కోర్సును రూపొందించారు. ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో.. ప్రొఫెనల్ డిగ్రీ మస్ట్ అంటే ఎలా? అనే చర్చ జోరందుకుంది.ఇంటర్నెట్ తెరిస్తే చాలూ.. కంటెంట్ పేరిట బోలెడంత క్రింజ్ కనిపిస్తుంటుంది. అయితే దానికి చెక్ పెట్టాలని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ASU) నిర్ణయించింది. స్వచ్ఛమైన కంటెంట్ క్రియేషన్లో భాగంగా బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. యూనివర్సిటీలోని వాల్టర్ క్రాంకైట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ కోర్సు అందుబాటులోకి వచ్చింది. కేవలం వీడియోలు చేయడం, వైరల్ కావడం కాకుండా.. కంటెంట్ రూపకల్పన, పాడ్కాస్టింగ్, స్టూడియో ప్రొడక్షన్, కెమెరా ముందు ప్రెజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.వైరల్ అయితే చాలు అనుకోవద్దు..ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ భారీగా పెరిగింది. సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించి ఆదాయం పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ‘క్రియేటర్ ఎకానమీ’ కూడా వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇన్ఫ్లుయెన్సర్ జీవితం బయటకు కనిపించినంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం కొత్త కంటెంట్ సృష్టించడం, ప్రేక్షకులతో అనుసంధానం కొనసాగించడం, బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకోవడం, ఆదాయంలో అనిశ్చితిని ఎదుర్కోవడం వంటి సవాళ్లు ఉంటాయని సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్లాట్ఫారమ్లు కంటెంట్ విషయంలో కొత్త(కఠిన) రూల్స్ తెస్తున్న సంగతి తెలిసిందే.డిగ్రీతో స్టార్ అవుతారా?కంటెంట్ క్రియేషన్లో డిగ్రీ చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా స్టార్ కాలేరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరల్ కావడానికి ప్రతిభతో పాటు అదృష్టం, సరైన వ్యూహం, నిరంతర శ్రమ అవసరమని చెబుతున్నారు. అయితే ఈ కోర్సు ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మార్కెటింగ్, వ్యక్తిగత బ్రాండింగ్, నెట్వర్కింగ్ వంటి అంశాల్లో అవగాహన పెరుగుతుందని విశ్వవిద్యాలయం పేర్కొంది. సోషల్ మీడియా రంగంలోనే కాకుండా మీడియా, ప్రకటనలు, డిజిటల్ సంస్థల్లోనూ ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.క్రియేటర్ ఎకానమీకి కొత్త గుర్తింపుఅమెరికాలో కంటెంట్ క్రియేషన్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో బిలియన్ల డాలర్ల ఆదాయం చలామణి అవుతోంది. దీంతో ఇంతకాలం కేవలం ‘టైమ్పాస్’గా భావించిన సోషల్ మీడియా కంటెంట్ సృష్టి.. ఇప్పుడు ఓ అధికారిక కెరీర్ మార్గంగా గుర్తింపు పొందుతోంది. అందుకే ఇకపై ‘ఇన్ఫ్లుయెన్సర్ అవుతా’ అంటే చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదన్న సంకేతాన్ని ఈ డిగ్రీ ఇస్తోంది. అయితే ఫాలోవర్ల సంఖ్య కంటే.. నాణ్యమైన కంటెంట్, సృజనాత్మకత, క్రమశిక్షణే విజయానికి అసలు ఆధారమని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
సౌదీతో పాక్ దోస్తీ ఎఫెక్ట్.. గల్ఫ్లో కొత్త చిచ్చు!
పశ్చిమాసియాలో ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరో కొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కలిసి కుదుర్చుకున్న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒప్పందంపై సంతకాలు జరిగి కొన్ని రోజులే అవుతున్నా.. అప్పుడే దాని ప్రభావం మరో వైపు కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా-యూఏఈ మధ్య దూరం మరింత పెరుగుతోందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.అసలు ఏం జరిగింది?ఆగస్టు 7న పవిత్ర మక్కా నగరంలో సౌదీ యువరాజు, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలోని ప్రధాన సూత్రం ఒక్కటే.. ముగ్గురిలో ఏదో ఒక దేశంపై దాడి జరిగితే.. మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించడం. అంటే.. చమురు సంపదతో బలమైన సౌదీ, అణ్వాయుధ సామర్థ్యం ఉన్న పాకిస్తాన్, నాటోలో రెండో అతిపెద్ద సైనిక బలగం ఉన్న టర్కీ ఒకే రక్షణ గొడుగు కిందకు వచ్చినట్లే అయ్యింది. ఇదే కారణంగా కొందరు నిపుణులు దీనిని ఇప్పటికే ‘ఇస్లామిక్ నాటో’గా పిలవడం మొదలుపెట్టారు.కూటమి ఇంతటితో ఆగదా?మక్కా ఒప్పందం ముగ్గురు దేశాలకే పరిమితం కాదనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈజిప్ట్, ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియా వంటి దేశాలను భవిష్యత్లో కూటమిలోకి తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది. అంటే.. పశ్చిమాసియాలో కొత్త భద్రతా బ్లాక్ రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.‘GCC ఉండగా కొత్త కూటమి ఎందుకు?’సౌదీ నిర్ణయంపై యూఏఈకి చెందిన ప్రముఖ స్వరాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ సభ్యులుగా ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ఇప్పటికే ఉంది. అంతేకాదు.. సభ్య దేశాలపై దాడిని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే సంయుక్త రక్షణ వ్యవస్థ కూడా ఉంది. అలాంటప్పుడు.. గల్ఫ్ వెలుపల ఉన్న టర్కీ, పాకిస్తాన్లతో కలిసి సౌదీ కొత్త రక్షణ కూటమిని ఎందుకు ఏర్పాటు చేసిందన్నది యూఏఈ వర్గాల ప్రశ్న. యూఏఈ రాజకీయ విశ్లేషకుడు, ఆ దేశ అధ్యక్షుడి మాజీ సలహాదారు అబ్దుల్ఖలీఖ్ అబ్దుల్లా కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. గల్ఫ్ దేశాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.సౌదీ కూడా తగ్గలేదు!యూఏఈ నుంచి విమర్శలు రావడంతో సౌదీ వర్గాలు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చాయి. ప్రతి దేశానికీ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకునే హక్కు ఉంది అంటూ సౌదీ యువరాజు అబ్దుల్రహ్మాన్ బిన్ ముసైద్ ప్రశ్నించారు. అంతేకాదు.. సౌదీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న యూఏఈ తన భద్రతా భాగస్వామ్యాలను ఒకసారి చూసుకోవాలని సౌదీ వ్యాఖ్యాతలు సూచించారు.భారత్, ఇజ్రాయెల్ పేర్లు ఎందుకొచ్చాయి?ఇక్కడే ఈ వివాదం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. సౌదీ వ్యాఖ్యాతలు.. యూఏఈ-భారత్ రక్షణ సహకారం, యూఏఈ-ఇజ్రాయెల్ భద్రతా సంబంధాలను ప్రస్తావించారు. యూఏఈ ఇతర దేశాలతో భద్రతా భాగస్వామ్యాలు పెట్టుకోవచ్చు.. కానీ సౌదీ టర్కీ, పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటే మాత్రం ఎందుకు అభ్యంతరం ఎందుకు? అన్నది వారి వాదన. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఉంది. భారత్, యూఏఈ మధ్య సంయుక్త రక్షణ ఒప్పందం లేదు. కానీ ఇరు దేశాల మధ్య చాలాకాలంగా రక్షణ సహకారం కొనసాగుతోంది. 2026 జనవరిలో ఈ సహకారాన్ని మరింత విస్తరించేలా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి కూడా ఇరు దేశాలు రూపకల్పన చేశాయి. ఇజ్రాయెల్తో మాత్రం యూఏఈ 2020లో అబ్రహామ్ ఒప్పందాల ద్వారా సంబంధాలను సాధారణీకరించింది.యెమెన్లోనే అసలు విభేదాల బీజాలు!సౌదీ-యూఏఈ మధ్య విభేదాలు ఇప్పుడే మొదలైనవి కావు. యెమెన్ విషయంలోనే ఇరు దేశాల వ్యూహాలు చాలా కాలంగా వేర్వేరు మార్గాల్లో సాగుతున్నాయి. సౌదీ అరేబియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండగా.. యూఏఈ దక్షిణాది వేర్పాటువాద శక్తులకు మద్దతుగా నిలిచింది. అంటే.. బయటకు మిత్రదేశాలుగానే కనిపిస్తున్నా, కీలకమైన ప్రాంతీయ అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలు వేర్వేరుగా మారుతున్నాయి.ముందు ఏం జరగబోతోంది?మక్కా ఒప్పందం మరిన్ని దేశాలకు విస్తరిస్తే.. మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకవైపు సౌదీ-టర్కీ-పాకిస్థాన్ అక్షం బలపడుతుంటే.. మరోవైపు యూఏఈ తన భారత్, ఇజ్రాయెల్ సహా ఇతర వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. మక్కాలో పుట్టిన ఈ కొత్త రక్షణ కూటమి.. ఇస్లామిక్ ప్రపంచానికి భద్రతా కవచమా? లేక గల్ఫ్లోనే కొత్త విభేదాలకు కారణమా?. రాబోయే రోజుల్లో ఈ సమీకరణం ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి.
నాసాకు వీడ్కోలు పలికిన సీనియర్ వ్యోమగామి..
వాషింగ్టన్: దాదాపు మూడు దశాబ్దాలుగా నాసాలో సేవలందించిన సీనియర్ వ్యోమగామి మైక్ ఫింకె నాసాకు వీడ్కోలు పలికారు. ఆగస్టు-12 బుధవారంతో నాసాలో ఆయన సేవలు ముగిశాయని అమెరికా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. అయితే అంతరిక్ష పరిశోధనలు, అన్వేషణలో తన వంతు పాత్ర కొనసాగిస్తానని ఫింకె తెలిపారు.1996లో నాసా వ్యోమగాముల బృందంలో చేరిన ఫింకె.. తన సుదీర్ఘ కెరీర్లో నాలుగు అంతరిక్ష యాత్రలు చేశారు. మొత్తం 549 రోజులు అంతరిక్షంలో గడిపిన ఆయన.. నాసా వ్యోమగాముల్లో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నారు. అలాగే తొమ్మిది సార్లు స్పేస్వాక్ నిర్వహించారు. ఆయన కెరీర్లో ఎక్కువ సమయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోనే గడిచింది.అంతరిక్ష కేంద్రంలో అకస్మాత్తుగా అస్వస్థత..ఇటీవల ఫింకె చేపట్టిన చివరి అంతరిక్ష యాత్ర మాత్రం అనూహ్య పరిణామాలతో ముగిసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఓ వైద్య సమస్య తలెత్తింది. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయినట్లు ఫింకె స్వయంగా వెల్లడించారు. ఆయన పరిస్థితిని గమనించిన సహచరులు వెంటనే స్పందించారు. కొన్ని సెకన్లలోనే మొత్తం బృందం అప్రమత్తమై వైద్య సహాయం అందించిందని ఆయన తెలిపారు. అయితే ఈ అస్వస్థతకు అసలు కారణం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదని, నాసా మరియు వైద్య పరిశోధకులు దానిపై దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.ముందుగానే భూమికి తిరుగు ప్రయాణంఫింకెతో పాటు స్పేస్ఎక్స్ క్రూ-11లో ఉన్న మరో ముగ్గురు సభ్యులు -నాసా వ్యోమగామి జీనా కార్డ్మన్, జపాన్కు చెందిన కిమియా యుయి, రష్యాకు చెందిన ఒలెగ్ ప్లాటోనోవ్ అనుకున్న సమయం కంటే కొన్ని వారాల ముందుగానే భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రంలో అందుబాటులో లేని అధునాతన వైద్య ఇమేజింగ్ సదుపాయాలను భూమిపై ఉపయోగించేందుకు సిబ్బందిని ముందుగానే వెనక్కి తీసుకురావాలని నిర్ణయించినట్లు నాసా తెలిపింది. ఈ ఘటన కారణంగా అంతరిక్ష కేంద్రంలో సిబ్బంది నిర్వహించాల్సిన ఓ స్పేస్వాక్ను కూడా రద్దు చేశారు. అలాగే, ఆరోగ్య కారణాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సిబ్బంది యాత్రను నాసా ముందుగానే ముగించాల్సిన పరిస్థితతి రావడం ఇదే తొలిసారి.అంతరిక్ష సేవలకు కొనసాగింపు..నాసా నుంచి వైదొలుగుతున్నప్పటికీ అంతరిక్ష అన్వేషణకు తన నిబద్ధత కొనసాగుతుందని ఫింకె పేర్కొన్నారు. భవిష్యత్లో చంద్రుడిపైకి మానవులను తిరిగి పంపడం, అంగారక గ్రహానికి ప్రయాణాలు, సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలు, ఉపగ్రహాల అన్వేషణ వంటి కార్యక్రమాల్లో మానవాళి మరింత ముందుకు సాగుతుందని ఆయన ఆకాంక్షించారు.
బలూచ్లో రక్తపాతం: 8 రోజుల్లో 26 మంది పాక్ సైనికులు హతం!
క్వెట్టా: బలూచిస్థాన్లో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. గత ఎనిమిది రోజుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22 దాడులకు పాల్పడినట్లు ప్రకటించింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైనిక సిబ్బంది, పోలీసులు, కాన్వాయ్లు, ప్రభుత్వ అనుకూల సాయుధ బృందాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ వరుస దాడుల్లో పాకిస్థాన్ సైన్యానికి చెందిన సుమారు 26 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని బీఎల్ఏ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఒక సభ్యుడిని సజీవంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాయి.భద్రతా శిబిరాలు, వంతెనలు, వాణిజ్య వాహనాలను టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిగాయని, ఆర్థిక దిగ్బంధంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామని బీఎల్ఏ తెలిపింది. ఆగస్టు 9న చాగాయ్ ప్రాంతంలో నోక్ చాహ్ సమీపంలో వాణిజ్య వాహనాలను ఆపి తనిఖీ చేయడం ద్వారా దాడులు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 10న ఖారన్ హైవేపై జోమి వద్ద పోలీసులను తాత్కాలికంగా నిర్బంధించి, పేలుడు పదార్థాలతో పోలీస్ పోస్టును ధ్వంసం చేశారు. ఆగస్టు 11న బులేదాలోని సురాప్లో ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా సాయుధ బృందపు స్థావరంపై దాడి జరగగా, దాని నాయకుడు హతమయ్యాడు.అదేవిధంగా కలత్లోని రోడెన్జోలో సైనిక కాన్వాయ్పై ఐఈడీ (ఐఈడీ) దాడిలో 17 మంది జవాన్లు మరణించినట్లు బీఎల్ఏ వెల్లడించింది. ఆగస్టు 13న పంజ్గుర్లో పోలీస్ లైన్పై గ్రెనేడ్ దాడి జరగగా, ఆగస్టు 14న టుర్బత్లో రిమోట్ కంట్రోల్ ఐఈడీ ద్వారా సైనిక కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగస్టు 15న సారాబ్ ప్రాంతంలో రెండు సైనిక పోస్టులను, ఒక వంతెనను పేల్చివేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది.ఇది కూడా చదవండి: ప్రాణాలు తీస్తున్న పసుపు రంగు తాగునీరు!
జాతీయం
తుకారాం ముండేకు బిగ్ షాక్.. జరిమానా
నిబంధనలు పాటించని ఆహార దుకాణాలపై చర్యలు తీసుకోవడం వరకు బాగానే ఉంది.. కానీ నిబంధనలు పాటించిన తర్వాత కూడా లైసెన్స్ పునరుద్ధరించకుండా ఆ వ్యాపారాన్ని అడ్డుకోవం ఎంత వరకు సబబు?. ఈ వ్యవహారాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది అతిగా వ్యవహరించడమేనని పేర్కొంటూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు జరిమానా విధించింది.తుకారాం ముండే మహారాష్ట్రలో ఎఫ్డీఏ దూకుడు చూస్తున్నదే. నిత్యం ఏదో ఒక రెయిడ్తో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారాయన. అయితే.. పుణెలోని ఓ స్వీట్స్ దుకాణం లైసెన్స్ను 98 శాతం నిబంధనలు పాటించినట్లు రీ-ఇన్స్పెక్షన్లో తేలింది. అయినప్పటికీ పునరుద్ధరించకపోవడంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖడ్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లు, తినుబండారాల లైసెన్సులను సస్పెండ్ చేయడం FDA అనుసరిస్తున్న విధానంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ‘వింతైన, విపరీతమైన విధానం’గా అభివర్ణించింది.98 శాతం కంప్లయన్స్ ఉన్నా..పుణెలోని గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్పై ఆహార కలుషితానికి సంబంధించిన ఫిర్యాదు రావడంతో FDA అధికారులు జూన్ 12న తనిఖీలు నిర్వహించారు. దుకాణంలోని పారిశుద్ధ్యం, సిబ్బంది పరిశుభ్రతకు సంబంధించి పలు లోపాలను గుర్తించారు. అదే రోజు దుకాణం లైసెన్స్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దుకాణ యాజమాన్యం FDA కమిషనర్కు అప్పీల్ చేయడంతో పాటు లోపాలను సరిచేసినట్లు పేర్కొంటూ కంప్లయన్స్ రిపోర్ట్ సమర్పించింది.దీనిపై జూలై 13న FDA అధికారులు మరోసారి దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈసారి దుకాణం 98 శాతం నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ లైసెన్స్ సస్పెన్షన్ను ఎత్తివేయలేదు. లైసెన్స్ను పునరుద్ధరించాలని యాజమాన్యం FDAకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో చివరకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది.లక్షల ఆదాయం కోల్పోయామని..లైసెన్స్ సస్పెన్షన్ కారణంగా జూన్లో దుకాణం మూసివేసినప్పటి నుంచి రూ.8.74 లక్షల ఆదాయాన్ని కోల్పోయామని యాజమాన్యం కోర్టుకు తెలిపింది. కేసును విచారించిన ధర్మాసనం దుకాణాన్ని తిరిగి తెరిచి వ్యాపారం చేసుకునేందుకు అనుమతించింది. అంతేకాకుండా దుకాణ యజమానులకు నెల రోజుల్లోగా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర FDAను ఆదేశించింది.‘మీరు హద్దులు దాటుతున్నారు’FDA ఉద్దేశం మంచిదేనని, ఆహార భద్రత విషయంలో ఒక విభాగం కనీసం చర్యలు తీసుకుంటోందని ప్రశంసించిన ధర్మాసనం.. అదే సమయంలో అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. 98 శాతం నిబంధనలు పాటిస్తున్నట్లు రీ-ఇన్స్పెక్షన్లో తేలిన వెంటనే లైసెన్స్ సస్పెన్షన్ను ఎత్తివేయాల్సిందని స్పష్టం చేసింది. అలా చేయకుండా దుకాణాన్ని కొనసాగనివ్వకపోవడం సరికాదని పేర్కొంది.కోర్టు ఉత్తర్వులు పరిశీలిస్తా: FDA కమిషనర్బాంబే హైకోర్టు ఆదేశాలపై మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే స్పందిస్తూ.. ముందుగా కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తానని తెలిపారు. ఆ తర్వాతే స్పందిస్తానన్నారు. FDA చట్టం, నిర్దేశిత విధానాల ప్రకారమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. చట్టం, ప్రక్రియలను అనుసరిస్తూ వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు.
శరీర భాగాలను విక్రయించి సంపాదించవచ్చని.. బాలుడిని చంపి..
భోపాల్: డబ్బు కోసం ఏదైనా చేసే స్థాయికి కొందరు దిగజారుతున్నారు. అత్యాశ, తప్పుడు ఆలోచనలు ఓ బాలుడి ప్రాణాలను బలిగొన్నాయి. భోపాల్లో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. హత్య వెనుక బయటపడిన కారణం మరింత షాకింగ్గా మారింది.భోపాల్లో ఓ మైనర్ బాలుడి హత్య కేసులో ముగ్గురు మైనర్లు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు భయంకర నిజాలు తెలిశాయి. ఆగస్టు 10న ఛోటా తాలాబ్ సమీపంలో బాలుడి మృతదేహం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తు్నారు. పోస్టుమార్టంలో.. కత్తితో పొడిచిన గాయాలు బయటపడ్డాయి.దర్యాప్తులో, నిందితుల్లో ఒకరైన జోహెబ్ ఖాన్ (20) మానవ శరీర భాగాలను విక్రయిస్తే భారీగా డబ్బు సంపాదించవచ్చని ఇతరులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఒక మైనర్కు వీడియో చూపించి ఈ విషయాన్ని మరింత నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ముగ్గురు మైనర్లు, మరో వ్యక్తి కలిసి బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం జోహెబ్ సూచనలతో బాలుడి మర్మాంగాలను తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని కొన్ని రోజులు తమ వద్ద ఉంచుకున్నా, విక్రయించేందుకు మార్గం దొరకక చివరకు పడేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా, వారిలో ముగ్గురూ మైనర్లే కావడం గమనార్హం. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. మొత్తం కుట్రకు జోహెబ్ ఖాన్ ప్రధానంగా పథకం వేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
భార్య మర్మాంగాలకు విద్యుత్ షాక్ ఇచ్చి అతి దారుణంగా..
రాంపూర్: భార్యకు మర్మాంగాలతో పాటు శరీరంలోని పలు భాగాలకు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు భర్త. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదమే ఆ మహిళ దారుణ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు.నస్రీన్ పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరంపై పలు కాలిన గాయాలు ఉన్నట్లు తేలింది. మర్మాంగాలపై కూడా కాలిన గాయాలు ఉండగా, అవి విద్యుత్ షాక్ వల్ల ఏర్పడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుడు ఇస్రార్ నేరాన్ని అంగీకరించాడు. తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో కొంత భాగాన్ని విక్రయించేందుకు భార్య నిరాకరించడంతో ఆమెపై కోపం పెంచుకున్నానని దర్యాప్తు అధికారులకు చెప్పాడు.నస్రీన్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ భూమిని విక్రయిస్తే తమ ఐదుగురు పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆమె భయపడింది. నస్రీన్, ఇస్రార్లకు దాదాపు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.భూమి వివాదం కారణంగా నస్రీన్కు పదేపదే బెదిరింపులు, హింస ఎదురయ్యాయని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన డిమాండ్లకు అంగీకరించకపోతే ఎప్పటికైనా చంపేస్తానని ఇస్రార్ ఆమెను బెదిరించేవాడని వారు తెలిపారు.నస్రీన్ సోదరి హసీన్ జహాన్ మాట్లాడుతూ.. నస్రీన్ ఇటీవల గాయపడినప్పటికీ, ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని తెలిపారు. "ఆమె ఇంటికి పూర్తిగా క్షేమంగా వచ్చింది. కానీ ఆమె ముఖంపై గాయాలు ఉన్నాయి" అని జహాన్ తెలిపారు. తనకు ఏం జరిగిందో నస్రీన్ చెప్పలేదని ఆమె తెలిపారు.రాంపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ సింగ్ మాట్లాడుతూ.. బాధితురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నస్రీన్ హత్యలో ఆమె అత్తింటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించినట్లు చెప్పారు.విద్యుత్ షాక్ల కారణంగా గాయాలు ఏర్పడినట్లు పోస్టుమార్టం నివేదిక నిర్ధారించిందని అధికారి తెలిపారు. "పోస్టుమార్టం నివేదికలో 6 చోట్ల గాయాలు ఉన్నట్లు తేలింది. అందులో విద్యుత్ షాక్ కారణంగా ఏర్పడిన పలు కాలిన గాయాలు ఉన్నాయి. ఆమె మర్మాంగాలపై కూడా విద్యుత్ షాక్ గాయాలు కనిపించాయి" అని సింగ్ తెలిపారు.
శబరిమలలో సినిమా షూటింగ్లు బంద్: కేరళ ప్రభుత్వం
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సాధారణ కమర్షియల్ సినిమాల షూటింగ్కు ఇకపై అనుమతులు ఇవ్వబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. మోహన్లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’ షూటింగ్కు అనుమతి ఇవ్వడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేరళ దేవస్వం మంత్రి కే. మురళీధరన్ ఈ కీలక ప్రకటన చేశారు. శబరిమలను సాధారణ సినిమా షూటింగ్ లొకేషన్గా ఉపయోగించేందుకు అనుమతించబోమని ఆయన తెలిపారు.శబరిమలలో సినిమా షూటింగ్కు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయ్యప్ప స్వామికి సంబంధించిన సినిమాలు, మతపరమైన చిత్రాలకు మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి ఇవ్వవచ్చని పేర్కొన్నారు. సాధారణ కమర్షియల్ సినిమాల షూటింగ్కు మాత్రం అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఆలయాలను సినిమా షూటింగ్ కోసం వినియోగించేందుకు అనుమతించడం సరికాదని అన్నారు.శబరిమలలో షూటింగ్కు సంబంధించిన నిబంధనలను తాను పూర్తిగా పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. ఆలయ పవిత్రత, భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు.మోహన్లాల్ మూవీతో వివాదంఈ వివాదానికి కారణం మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అతిమనోహరం సినిమా. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శబరిమలలోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. పంపా నుంచి సన్నిధానం వరకు కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించి పలు షరతులు విధించినట్లు సమాచారం. శబరిమల లేదా హిందూ మత విశ్వాసాలను ప్రతికూలంగా చూపించకూడదని, షూటింగ్కు అవసరమైన ఇతర శాఖల అనుమతులు కూడా తీసుకోవాలని నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అనుమతుల్లో కీలకమైన అటవీ శాఖ అనుమతి విషయంలో సమస్య ఏర్పడింది. షూటింగ్కు అటవీ శాఖ అనుమతి నిరాకరించడంతో అక్కడ చిత్రీకరణకు బ్రేక్ పడింది. దీంతో అసలు దేవస్వం బోర్డు సాధారణ సినిమాకు అనుమతి ఎలా ఇచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి.ప్రభుత్వ విధానంపై ప్రశ్నలుదేవస్వం బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత.. అటవీ శాఖ దాన్ని తిరస్కరించడంతో వివాదం మరింత ముదిరింది. శబరిమల వంటి అత్యంత సున్నితమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో సినిమా షూటింగ్కు వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకుండా అనుమతులు ఇవ్వడంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సాధారణ కమర్షియల్ సినిమాలకు షూటింగ్ అనుమతులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది.మరో చోటులో షూటింగ్ తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న అతిమనోహరంలో మోహన్లాల్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాలు అలెక్స్, మనోజ్ కే. జయన్, జగదీష్, ఇర్షాద్, సుధీష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం పూర్తయింది. కొచ్చితో పాటు పలు చోట్ల కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మిగిలిన షూటింగ్ను కొచ్చి, శబరిమలతో పాటు హైదరాబాద్, ముంబైలో నిర్వహించాలని చిత్ర బృందం భావించింది. ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే శబరిమలలో షూటింగ్కు అనుమతి నిరాకరణతో చిత్ర బృందం ప్రత్యామ్నాయ లొకేషన్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇంతకు ముందు..గతంలోనూ శబరిమల, పంబా పరిసరాల్లో పలు సినిమాల షూటింగ్ జరిగింది. తమిళ చిత్రం ‘నంబినార్ కేడువతిల్లై’ (1986)లోని ఓ పాటను శబరిమలలోని 18 మెట్ల వద్ద చిత్రీకరించారు. మలయాళంలో ‘స్వామి అయ్యప్పన్’ (1975), ‘మాలికప్పురం’ (2022) వంటి చిత్రాల్లో శబరిమల ప్రాంతాల్లో షూట్ చేశారు. కన్నడ చిత్రం ‘సీజర్’ (2018)లోనూ ఆ పరిసర ప్రాంతాల్లోనే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు.ఆలయ పవిత్రతే కీలకంశబరిమల కేవలం ఒక పర్యాటక ప్రదేశం లేదా సాధారణ షూటింగ్ లొకేషన్ కాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివచ్చే నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సినిమా చిత్రీకరణ వల్ల భక్తుల రాకపోకలు, భద్రత, ఆధ్యాత్మిక వాతావరణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.మోహన్లాల్ సినిమా షూటింగ్ అనుమతి వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో శబరిమలలో కమర్షియల్ సినిమాల షూటింగ్కు దాదాపు తలుపులు మూసేసినట్లయింది. ఇకపై అయ్యప్ప, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ప్రత్యేక అనుమతుల అవకాశముంటుందని కేరళ దేవస్వం మంత్రి స్పష్టం చేశారు.
ఎన్ఆర్ఐ
బాల్టిమోర్లో 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం
బాల్టిమోర్, అమెరికా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు (జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు) అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగిన కార్యక్రమాలకు ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగు ప్రజలతో బాల్టిమోర్ నగరం ఒక మినీ తెలుగు సీమను తలపించింది. తెలుగు భాషాభిమానం, సామాజిక ఐక్యత, ఆర్థిక పురోగతి , భావితరాల చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ మహాసభలను హాజరైన ప్రతినిధులు ‘సూపర్ డూపర్ హిట్’గా అభివర్ణించారు. శోభాయమానమైన గ్రాండ్ బాంక్వెట్తో ప్రారంభమైన ఈ వేడుకలు ఆటా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచాయి.జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత తెచ్చిన రాజకీయ దిగ్గజాలుఈ మహాసభలకు అమెరికా జాతీయ రాజకీయ దిగ్గజాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక శోభను తెచ్చారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ మాట్లాడుతూ మేరీల్యాండ్, అమెరికా సమగ్ర అభివృద్ధిలో తెలుగు ప్రవాసుల పాత్రను కొనియాడారు. సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపారం, పౌర సేవల్లో తెలుగు వారి నిబద్ధతను అభినందించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ తన జీవిత ప్రయాణాన్ని షేర్ చేసుకుంటూ.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా అమెరికన్ సమాజంలో ఉన్నత అవకాశాలను సాధించవచ్చని సూచించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా ఎఫ్. హష్మీ తన హైదరాబాద్ బాల్య జ్ఞాపకాలైన పాతబస్తీ, చార్మినార్, లాడ్ బజార్, హైదరాబాదీ బిర్యానీ, రైలు ప్రయాణాలను గుర్తుచేసుకుని ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేశారు. ప్రవాసులు పౌర, రాజకీయ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రగతి, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రవాస పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని తెలుగు సమాజ ఐక్యతను చాటారు. అమెరికా సాయుధ దళాల్లో వీరోచితంగా సేవలందిస్తున్న తెలుగు మహిళలు, పురుషులను ఈ వేదికపై ఘనంగా సత్కరించడంతో సభ మొత్తం అత్యంత భావోద్వేగానికి గురవడమే కాదు, స్టాండింగ్ ఒవేషన్, కరతాల ధ్వనులతో వేదికను మార్మోగేలా చేశారు.వ్యాపార, సాంస్కృతిక వేడుకలుమూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలతో కన్వెన్షన్ సెంటర్ సభా ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ వేదికలపై కవిత్వం, సాహిత్యం, సినిమా, చరిత్రపై లోతైన చర్చలు జరిగాయి. పారిశ్రామిక వేదికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, వైద్యం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలపై సీనియర్ పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్ వ్యవస్థాపకులు విస్తృతంగా చర్చించారు. రెండవ, మూడవ తరాల తెలుగు-అమెరికన్ యువత కోసం సంస్కృతి, నెట్వర్కింగ్, నాయకత్వ నైపుణ్యాలు,కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఉర్రూతలూగించిన జానపదాలుతెలుగు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న జానపద గీతాలు ఈ వేదికకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, జనార్దన్ పన్నెల బృందం ఆలపించిన తెలంగాణ జానపద గేయాలు చప్పట్లతో మారుమోగించాయి.తారల సందడి.. కీరవాణి స్వర నీరాజనంతెలుగు సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖుల రాకతో వేడుకల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అడివి శేష్, హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్, పూజా హెగ్డే, రీతూ వర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా అభిమానులతో ముచ్చటించారు. యువ నటుడు నవీన్ పోలిశెట్టి తన టైమింగ్ కామెడీ పంచ్ లతో ప్రాంగణాన్ని నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గాయని సునీత, త్రీయరీ, ఆరెంజ్ స్ట్రీట్ బృందాల ప్రదర్శనల అనంతరం... ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ మహాసభలకు 'గ్రాండ్ ఫినాలే'గా నిలిచింది.20వ మహాసభలు డాలస్లో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల, సతీష్ రెడ్డి రామసహాయం మరియు కోర్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వందలాది మంది వాలంటీర్లు భోజనం, రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించి అతిథుల మెప్పు పొందారు.ఈ మహాసభల ముగింపు సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ, 2028లో జరగబోయే 20వ ఆటా మహాసభలకు డాలస్ (టెక్సాస్) నగరం ఆతిథ్యం ఇవ్వబోతోందని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. బాల్టిమోర్ మహాసభలు కేవలం సదస్సులు కాదు.. తెలుగువారి గుర్తింపునకు ఒక గొప్ప వేడుక.. కొత్త అవకాశాలకు వేదిక.. సంస్థలు, వృత్తులు, తరాలకు అతీతమైన ఐక్యతకు శక్తివంతమైన ప్రతీక.. అని తెలిపారు.
గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో సిలికానాంధ్ర మనబడి
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓక్లాండ్లో సిలికానాంధ్ర 25వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన అతిపెద్ద తెలుగు పద్య సమూహ పారాయణం గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 1,712 మంది పాల్గొనగా, వారిలో అధిక సంఖ్యలో సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు ఉండటం విశేషం.పాల్గొన్నవారు సుమతీ శతకం, వేమన శతకం నుంచి ఎంపిక చేసిన 18 పద్యాలను ఏకకాలంలో కంఠస్థంగా పారాయణం చేసి తెలుగు భాషా ప్రావీణ్యాన్ని, తెలుగు సాహిత్యం పట్ల తమ అనుబంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ సమిష్టి పారాయణం ద్వారా తెలుగు భాష, సాహిత్య వైభవం అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రతిధ్వనించింది.ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ప్రెసిడెంట్, డీన్ చామర్తి రాజు మాట్లాడుతూ, గిన్నిస్ ప్రపంచ రికార్డు వేదికపై 1,712 మంది కలిసి తెలుగు పద్యాలను పారాయణం చేయడం మనబడి ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న భాషా సేవకు నిదర్శనమన్నారు. వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల ప్రయాణం మనబడి తరగతి గదిలోనే ప్రారంభమైందని పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు తమ పిల్లలను మనబడిలో చేర్పించి మాతృభాషను నేర్పించాలని, భారతదేశంలోని తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఈ విషయంలో ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (WASC) గుర్తింపు పొందిన ప్రపంచంలోని ఏకైక తెలుగు విద్యాసంస్థగా సిలికానాంధ్ర మనబడి గుర్తింపు పొందిందని సంస్థ తెలిపింది. స్థాపన నుంచి ఇప్పటివరకు 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్పినట్లు వెల్లడించింది.విద్యార్థుల భాషా ప్రావీణ్యాన్ని దశలవారీగా పెంపొందించేలా బాలబడి–1, బాలబడి–2 నుంచి ప్రభాసం వరకు వివిధ స్థాయిల్లో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొంది. తెలుగు భాష, సాహిత్యాల్లో మరింత లోతైన అధ్యయనం కోసం 'ప్రబోధం' పేరుతో ఉన్నత స్థాయి ఐచ్ఛిక కోర్సును కూడా అందిస్తున్నట్లు తెలిపింది. బాలరంజని యాప్ ద్వారా ఇంటరాక్టివ్ అభ్యాసంతో పాటు బాలానందం, తెలుగు మాట్లాట, తెలుగుకి పరుగు, మనతరం వంటి పాఠ్యేతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించింది.ఇదిలా ఉండగా, 2026–27 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు కొనసాగుతున్నాయని సంస్థ ప్రకటించింది. అమెరికా, కెనడాలోని 250కు పైగా కేంద్రాల్లో సెప్టెంబర్ మొదటి వారాంతం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని, తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించే ఈ కార్యక్రమంలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చింది.
H-1B, L-1 వీసాలు.. భారతీయులకు బిగ్ షాక్!
హెచ్-1బీ, ఎల్-1 వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కొత్త వీసాలు, ఉద్యోగ మార్పుల సమయంలో మాత్రమే వసూలు చేస్తున్న అదనపు రుసుమును.. ఇకపై వీసా రెన్యూవల్ (పొడిగింపు) సమయంలోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. అటు పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ నిపుణులను కొనసాగించే కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS), కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) సంస్థలు తాజాగా ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. H-1B, L-1 వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల స్టే పొడిగింపు దరఖాస్తులపైనా అదనపు ఫీజు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రుసుము కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులు లేదంటే ఉద్యోగ మార్పు సమయంలో మాత్రమే వర్తిస్తోంది. అయితే కొత్త ప్రతిపాదన ఆమోదం పొందితే.. అదే కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగుల వీసా పునరుద్ధరణ సమయంలో కూడా సంస్థలు ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు ప్రధానంగా అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు కలిగి ఉండి.. వారిలో కనీసం సగం మంది H-1B లేదా L-1 వీసాలపై పనిచేస్తున్న సంస్థలకు వర్తించే అవకాశం ఉంది.భారతీయులపై ఎందుకు ప్రభావం ఎక్కువ?H-1B వీసా వ్యవస్థలో భారతీయ నిపుణుల వాటా అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్ రంగాల్లో వేలాది మంది భారతీయులు ఈ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమైన H-1B పిటిషన్లలో కొనసాగుతున్న ఉద్యోగాలకు సంబంధించినవి 2.91 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో భారతీయుల వాటా సుమారు 77 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. భారతీయ ఉద్యోగులను కొనసాగించే ఐటీ కంపెనీల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.ఐటీ కంపెనీలపై అదనపు భారంఅమెరికాలో భారీ సంఖ్యలో H-1B ఉద్యోగులను కలిగి ఉన్న టెక్నాలజీ సంస్థలు ఈ మార్పుతో ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అమెజాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు H-1B ఉద్యోగుల విషయంలో ముందంజలో ఉన్నాయి. వీసా పొడిగింపుల సమయంలో అదనపు రుసుము చెల్లించాల్సి వస్తే.. విదేశీ నిపుణులను కొనసాగించడం కంపెనీలకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు.ఎంత ఫీజు?ప్రస్తుతం అర్హత కలిగిన కొన్ని సంస్థలు కొత్త H-1B దరఖాస్తుల సమయంలో సుమారు 4,000 డాలర్లు, L-1 వీసాల కోసం సుమారు 4,500 డాలర్లు వరకు అదనపు రుసుము చెల్లిస్తున్నాయి. ప్రతిపాదిత మార్పు అమల్లోకి వస్తే.. ఇదే భారం వీసా పొడిగింపు దరఖాస్తులకూ వర్తించే అవకాశం ఉంది.ఎందుకీ పెంపు?అమెరికా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ అదనపు రుసుమును 9/11 భద్రతా చర్యల్లో భాగమైన బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ముఖ గుర్తింపు వంటి సాంకేతికతలతో ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణలను పర్యవేక్షించే వ్యవస్థకు నిధులు సమకూర్చడమే లక్ష్యమని తెలిపారు. ఈ ప్రతిపాదన ద్వారా ఏడాదికి సుమారు 157 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది.తుది నిర్ణయం ఎప్పుడంటే..అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నిబంధనగా మారలేదు. అమెరికా పరిపాలన తుది నిబంధనలను విడుదల చేసిన తర్వాతే అమలు తేదీ, పూర్తి వివరాలు స్పష్టమవుతాయి. ఇప్పటికే H-1B వీసా విధానంపై కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజా ప్రతిపాదనతో విదేశీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై మరింత నియంత్రణ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.మొత్తంగా.. H-1B, L-1 వీసాలపై ప్రతిపాదిత కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు, వారిని నియమించుకునే ఐటీ కంపెనీలపై ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది.
‘రాయలసీమకు ఆనాటి నుంచి అన్యాయమే!’
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా, తెలుగు వారికంటూ ప్రత్యేక రాష్ట్రం 1953లోనే ఏర్పడినా... రాయలసీమ ప్రాంతం ఇప్పటికీ ఆర్థిక, జల వనరుల కేటాయింపులోనూ, అభివృద్ధిలోనూ వివక్షకు గురవుతూనే ఉన్నదని సాహిత్య, సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాయలేలిన సీమగా, రతనాలు రాశులుగా పోసి అమ్మిన సీమగా... సాహిత్య చరిత్రలో పేర్కొంటూ వచ్చినప్పటికీ, వాస్తవానికి పాలకుల నిర్లక్ష్యంలో రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగానే నేటికీ కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలోని బాల్టిమోర్లో ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (ఆటా) 19వ ద్వైవార్షిక మహాసభలలో భాగంగా ‘మన రాయలసీమ’ పేరిట ‘రాయలసీమ అవగాహన సదస్సు’ జరిగింది. ఆ సదస్సులో అందరి నోటా ఈ అభిప్రాయం బలంగా వ్యక్తమైంది.ప్రబంధ కవులంతా రాయలసీమ వారే!దాదాపు నాలుగు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడ్డ ఇంజనీరింగ్ నిపుణుడు, ‘ఆటా’ వారి త్రైమాసిక పత్రిక ‘అమెరికా భారతి’ సంపాదకుడు ప్రకాశ్ తిమ్మాపురం అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు ఆవేదన నిండిన మాటలతో, ఆలోచనా స్ఫోరకంగా సాగింది. ఈ ‘రాయలసీమ అవగాహన సదస్సు’ తాలూకు ఉద్దేశాన్నీ, వర్తమాన పరిస్థితుల్లో దీనికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యాన్నీ ప్రకాశ్ తన మాటల్లో ముందుగా ప్రస్తావించారు. సముచితమైన రాయలసీమ డిమాండ్లకు అందరూ నడుం బిగించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద అవార్డు గ్రహీత, సీనియర్ సాహిత్యవేత్త జె.ఎల్. రెడ్డి సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రాంత సాహితీ ప్రముఖుల కృషిని ప్రేక్షకులతో విహంగవీక్షణం చేయించారు. కథ, కవిత్వం, నవల, విమర్శ తదితర ప్రక్రియల్లో రాయలసీమ ప్రాంతం నుంచి సాగిన అపూర్వ కృషిని సాధికారికంగా వివరించారు.సీమ అభివృద్ధికి కట్టుబడ్డ వైఎస్ రాజశేఖరరెడ్డి!అలాగే, ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ అవధాన కవి, సాహితీవేత్త నరాల రామారెడ్డి ప్రసంగిస్తూ, ప్రబంధ సాహిత్యకవుల్లో తెనాలి రామకృష్ణ లాంటి ఒకరిద్దరు మినహా అల్లసాని పెద్దన లాంటి అనేకులు రాయలసీమ వారేనని గుర్తు చేశారు. ఆయన తన విస్తృత సాహితీ అధ్యయనాన్ని పంచుకుంటూ, అనేక పద్య ఉదాహరణలతో, రాయలసీమ ప్రాంతం గొప్పదనాన్ని గుర్తుచేశారు. ప్రబంధ కవుల నుంచి పుట్టపర్తి నారాయణాచార్యుల వరకు ఎందరెందరో ప్రముఖుల రచనల్లోని ప్రత్యేకతను నరాల రామారెడ్డి వివరించారు.ఈ ‘మన రాయలసీమ’ సదస్సు కు ప్రధాన సూత్రధారి, సామాజిక పరిశీలకుడు, ‘ఆటా సాహిత్య విభాగం’ సలహాదారు అయిన జయదేవ్ మెట్టుపల్లి మాట్లాడుతూ, రాయలసీమ వెనుకబాటుకు మూలమైన చరిత్రను వివరించారు. చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాలను పేర్కొన్నారు. రక్షణ ఒప్పందం కోసం నిజామ్ ప్రభువు రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటీషు వారికి ‘సీడెడ్’ (దత్తమండలాలు)గా కట్టబెట్టడం దగ్గర నుంచి 1928లో ‘రాయలసీమ’ అన్న నామకరణం జరగడం మొదలు నేటి దాకా జరిగిన చరిత్రను సంక్షిప్తంగా కళ్ళకు కట్టారు. రాయలసీమ ప్రాంతం నుంచే తెలుగు రాష్ట్రానికి అధిక సంఖ్యలో ముఖ్యమంత్రులు వచ్చినా, రాజకీయ సంఖ్యాబలం కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పని పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉందని గుర్తు చేశారు. ఎంవి రమణారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటివారు కొందరు మాత్రమే కడదాకా రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడ్డారన్నారు.కొన్ని జిల్లాలకు మరింత అన్యాయం!తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన విశ్రాంత ఆచార్యులు దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర ప్రముఖులు పంపిన సందేశాల సారాంశాన్ని సదస్సులో వినిపించారు. అమెరికాలో స్థిరపడ్డ కడప వాసి – సాఫ్ట్ వేర్ రంగ నిపుణుడు చరసాల ప్రసాద్ మాట్లాడుతూ, అనేక అంశాల్లో అనాదిగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆవేదనాభరితంగా ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతంలోనూ కేటాయింపుల్లో కడప లాంటి జిల్లాలు మరింత వివక్షకు గురయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ చారిత్రక ఆధారాలు, గణాంకాలతో ‘కడప జిల్లా అభివృద్ధి – ఆత్మగౌరవం’ పేరిట రచయిత త్రివిక్రమ్ రాసిన పుస్తకంలోని పలు చర్చనీయాంశాలను ప్రసాద్ స్థూలంగా పరిచయం చేశారు. ఒకప్పటి ముఠా తగాదాలను సాకుగా చూపి, నేటికీ రాయలసీమ ప్రాంతాన్ని ఫ్యాక్షనిజానికి మారుపేరుగా రాజకీయ, సినీరంగాల్లో వేస్తున్న ముద్రను తీవ్రంగా ఖండించారు.ప్రొద్దుటూరుకు చెందిన సాహితీ ప్రియుడు సాధు గోపాలకృష్ణ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఉపాధి – ఉద్యోగావకాశాల పరంగా మెరుగుపరచడానికి తమ వంతుగా చేస్తున్న కృషిని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు మరింతగా ముందుకు వస్తే, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు రాయలసీమ నుంచి వలసలు తగ్గి, స్థానికంగా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.తిరుపతికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గిరిధర్ కుమార్ కుప్పాల ప్రసంగిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) నుంచి రైల్వేల వరకు తాను పనిచేసిన ప్రాంతాల్లో రాయలసీమకు ఎలా నష్టం వాటిల్లుతోందో తన స్వీయానుభవం నుంచి విశ్లేషించారు. 1980ల మధ్య నుంచి స్థానికేతరులదే టి.టి.డి.లో ప్రాబల్యం కావడంతో, రాయలసీమ స్థానిక పురోగతి, అవసరాలు, ఆకాంక్షలు నిర్లక్ష్యానికి గురయ్యాయని వివరించారు. అలాగే, రాయలసీమ ప్రాంత రైల్వే లైన్లు కొన్ని ఎన్నో దశాబ్దాల ముందే వచ్చినా, అనేక ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమకు అన్యాయమే జరిగిందన్నారు. కొద్ది జిల్లాలకే కొత్త రైల్వే జోన్లు ఏర్పడుతున్నాయి కానీ, ఎప్పటి నుంచో ప్రజల డిమాండ్ లో ఉన్న బాలాజీ రైల్వే జోన్ ఇప్పటికీ నెరవేరనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పాలకుల మెడలు వండిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఉద్యమం తరహాలో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని, మన వద్ద కూడా మరో రాయలసీమ ఉద్యమం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సభికులందరూ రాయలసీమ పురోభివృద్ధి కోసం ఉద్యమించాల్సిన అవసరంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.కర్నూలు హైకోర్టు కలకు ఇన్నేళ్ళా!ఇక, హైదరాబాద్ నుంచి ‘ఆటా -2026’ సదస్సుగా ప్రత్యేక సాహితీ అతిథిగా హాజరైన ప్రముఖ జర్నలిస్టు – రచయిత డాక్టర్ రెంటాల జయదేవ మాట్లాడుతూ, రాయలసీమలో నీళ్ళకు కరవైనా కన్నీళ్ళకు కరువు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పంటల సేద్యం బరువైనా ప్రేమాభిమానాలను పొరుగువారికి పంచడంలో రాయలసీమకు సాటి లేదని తన స్వీయానుభవాలను పంచుకున్నారు. సాహిత్యంలో పుట్టపర్తి, రాళ్ళపల్లి, సంగీతంలో శ్రీపాద పినాకపాణి, సినీ రంగంలో హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, కెవి రెడ్డి, నాటక రంగంలో సురభి సంస్థ.. ఇలా రాయలసీమ తెలుగుజాతికి అందించిన రతనాలు అనేకమని సభికులకు గుర్తుచేశారు.దాదాపు నూరేళ్ళవుతున్నా అలనాటి ‘శ్రీబాగ్ ఒడంబడిక’ (పెద్దమనుషుల ఒప్పందం) వాగ్దానాలు నేటికీ తీరకపోవడం, కనీసం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు లాంటి కష్టం – ఖర్చు పెద్దగా లేని పనులు సైతం పాలకపక్షాలు నెరవేర్చకపోవడం అన్యాయమని జయదేవ నిరసన వ్యక్తం చేశారు. ఘనమైన చరిత్ర, స్థానిక వనరులు ఉన్నప్పటికీ నేటికీ నిర్లక్ష్యం నీడలోనే మిగిలిపోయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి తోటి తెలుగు ప్రాంతాల న్యాయబద్ధమైన ఉద్యమంలో ఇతర ప్రాంతాల వారు సైతం గళం విప్పి, కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ రకంగా తెలుగు ప్రాంతాలన్నిటి సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలసి కృషి చేద్దామన్నారు.రాయలసీమ అభివృద్ధికి అవసరమైతే మరో ఉద్యమం చేయాలని వక్తలతో పాటు సభికులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద, ‘ఆటా’ వేదికగా, అమెరికా తీరంలో సైతం... రాయలసీమ అభివృద్ధి పట్ల ఆలోచన రేకెత్తించడంలో ఈ ‘మన రాయలసీమ’ అవగాహన సదస్సు సఫలీకృతమైంది. ఆలోచన నుంచి ఆచరణకు అడుగులు వేయడమే ఇక మిగిలింది!- అమెరికా నుంచి రెంటాల జయదేవ
క్రైమ్
‘‘మా శవాలను తీసుకెళ్లండి’’ : భార్యాబిడ్డల్ని హతమార్చి, నావికుడు సూసైడ్
సాక్షి, ముంబై : ముంబైలో విషాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని నావీ నగర్లోని తమ నివాసంలో ఒక ఇండియన్ నావీ నావికుడు (Navy sailor) తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం వచ్చి మా డెడ్బాడీలను తీసుకెళ్లండి అంటూ తల్లికి పంపిన మెసేజ్తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇండియన్ నావీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది.పురాన్మల్ శంభులాల్ మెహ్రా (30) అనే నావికుడు, భార్య ఓమా (28), మూడేళ్ల కుమారుడు యష్, ,రెండు నెలల పసిపాప ఇంట్లోనే మృతిచెంది కనిపించారు. ప్రాథమిక వివరాల ప్రకారం, మెహ్రా మొదట కుటుంబ భార్యాబిడ్డలకు విషం ఇచ్చి ఆ తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు 14 రాత్రి దాదాపు 11 గంటలకు మెహ్రా తన తల్లికి వాట్సాప్లో "వచ్చి మా మృతదేహాలను తీసుకెళ్లండి" అని సందేశం పంపారు. మరుసటి రోజు ఉదయం తల్లి ఆ సందేశం చూసి కంగారుపడి కుమారుడికి ఫోన్ చేసింది. అటు నుంచి సమాధానం రాకపోవడంతో కంగారు పడిన తండ్రి శంభులాల్ మెహ్రా నావీ కంట్రోల్ రూమ్ను అప్రమత్తం చేశారు.వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది వారి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.భార్య బిడ్డలను హత్య చేయడానికి ముందు మెహ్రా తన మరియు తన భార్య మొబైల్ ఫోన్ల డేటాను ఫార్మాట్ (డిలీట్) చేశాడు. ఈ సంచలనాత్మక ఘటనకు ముందు, మెహ్రా తన , తన భార్య మొబైల్ ఫోన్లను ఫార్మాట్ (డేటా తొలగింపు) చేశాడు. దీంతో అధికారులు అయోమయంలో పడ్డారు.తొలగించిన డేటాను రికవర్ చేయడానికి పోలీసులు సైబర్ నిపుణుల సాయం తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి విషపదార్థం ఇచ్చారో తెలుసుకోవడానికి పోలీసులు మెడికల్, ఫోరెన్సిక్ నివేదికల కోసం వేచి చూస్తున్నారు. అలాగే సహోద్యోగులు, పొరుగువారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.కుటుంబ కలహాలే కారణమా? రాజస్థాన్కు చెందిన మెహ్రా తీవ్రమైన కుటుంబ, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని, దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలాగే డిప్రెషన్ సమస్యతో ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని దర్యాప్తులో తేలింది. మృతుల వైద్య, ఫోరెన్సిక్ నివేదికల కోసం వేచి చూస్తున్నారు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం
డిప్యూటీ తహసీల్దార్ సంధ్య ఆత్మహత్య
మహబూబాబాద్: రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతున్న ఓ యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కేఎస్ఎన్ రెడ్డి ఇంటి సమీపంలో అద్దెకు ఉండే దోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్నకుమార్తె దోలి సంధ్య (28) స్థానిక మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వర్తించింది. అనంతరం గ్రూప్-2 రాయగా డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం పొందింది. ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందుతూ ఉద్యోగం చేస్తోంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొంతసేపటికి సంధ్య ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన తల్లి పద్మ చుట్టుపక్కల వారికి, తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చింది. అనంతరం వెంకటేశ్వర్లు పోలీసులకు విషయాన్ని తెలిపారు. సంఘటనా స్థలాన్ని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, క్రైం, టౌన్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, సూరయ్య సందర్శించి సంధ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు అనంతరం ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. మృతురాలు సంధ్య ఇటీవల ఒకే సమయంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు పొందింది.
విశాఖ షీలానగర్లో మృతదేహాల కలకలం!
సాక్షి, విశాఖపట్నం: నగరంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. షీలానగర్ జంక్షన్ వద్ద మట్టికుప్పలో మూడు మృతదేహాలు బయటపడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. లారీలోకి మట్టి ఎత్తి వేస్తుండగా మూడు మృతదేహాలు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.మట్టిని లారీలోకి ఎక్కిస్తున్న సమయంలో కూలీలు మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అవి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతులు ఎవరు, ఎంతకాలం క్రితం మృతి చెందారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మట్టికుప్పను పరిశీలించి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. మృతదేహాల పరిస్థితి, వాటిపై ఉన్న ఆనవాళ్లను పరిశీలించి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.మృతులు ఎవరు? వారు షీలానగర్ ప్రాంతానికి చెందినవారా? మృతదేహాలు మట్టికుప్పలోకి ఎలా వచ్చాయి? ఎవరైనా కావాలనే అక్కడ పడేసి వెళ్లారా? లేక మరేదైనా ఘటనకు సంబంధించినవా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ ప్రియాంక కేసులో మరో మలుపు
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక మృతి ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తునకు తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. దీంతో డాక్టర్ ప్రియాంక కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక ప్రసాదిత్య మాల్ వద్ద ఘటన జరిగిన తేదీ నుంచి విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చే వరకు గడిచిన సమయం ఏమిటి? ఆ మధ్యలో అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఎప్పుడు చేరింది? చేరిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన ఆధారాలను సేకరించనున్నారు. అదేవిధంగా ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీ, మృతురాలి కాల్స్ డేటా, ఆమెతో చివరిగా మాట్లాడిన వ్యక్తులు, నిందితుల కదలికలు, వాహనాల ప్రయాణ వివరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్ట్మార్టం నివేదికతో పాటు ఇప్పటివరకు సేకరించిన ప్రతి ఆధారాన్ని విచారణ అధికారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అసలు పరీక్ష ఇక్కడే.. ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారాన్ని మాత్రమే ధ్రువీకరించడమా? లేకుంటే ఘటనకు ముందు నుంచి, ఘటన జరిగిన సమయం నుంచి, ఆ తర్వాత విషయం వెలుగులోకి వచ్చే వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని స్వతంత్రంగా పరిశీలించడమా? అనేది కీలకం. ఈ విచారణలో ప్రతి అనుమానానికి ఆధారాలతో సమాధానం లభిస్తేనే ప్రజల్లో నెలకొన్న సందేహాలు తొలగుతాయి. ఎవరి తప్పు ఉన్నా బయటపెట్టడం, దర్యాప్తులో ఎక్కడైనా లోపం జరిగి ఉంటే దానిని కూడా స్పష్టంగా వెల్లడించడం ఈ విచారణకు అసలు సవాల్. ఈ విచారణలో భాగంగా కేసు ఫైల్స్ను పాటిల్కు ప్రకాశ్నగర్ పోలీసులు అప్పగించారు.
వీడియోలు
Viral Video: విద్యార్థినుల మధ్య తీవ్ర ఘర్షణ..
మూడు రోజుల్లోనే.. కోట్ల వర్షం కురిపించిన విశ్వనాథ్ అండ్ సన్స్!
పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే ఆస్పత్రికి తరలించండి
ఉక్రెయిన్, రష్యా వార్లోకి బ్రిటిష్ డ్రోన్ల ఎంట్రీ..! నాటో గగనతలంలోకి రష్యన్ డ్రోన్ ?
ఎమ్మా హోమ్ మినిస్టర్... చూసావా మీ పోలీసుల బాగోతం!
కొంచెం తెలివి వచ్చింది అనుకునే లోపే... బుర్రలేనోడిలా మాట్లాడావ్...
కోనసీమలో విషాదం.. జగన్ దిగ్భ్రాంతి!
లోకేష్ కాదు 'లీకేష్"! చర్చకు భయపడి పారిపోయాడు..! పదవులు ఎందుకు?
అసెంబ్లీ అనుకున్నావా.. నీ ఇల్లు అనుకున్నావా? నోటికొచ్చినట్లు మాట్లాడకు చంద్రబాబు
బ్రిడ్జిపై కారు వదిలి.. సూసైడ్ నోట్ లో షాకింగ్ విషయాలు


