వీరి వీరి గుమ్మడిపండు... రిలీజ్ ఎప్పుడు?
టాలీవుడ్లో రిలీజ్ డేట్లు తారుమారు అవుతున్న తీరు కొత్తేం కాదు. కానీ ఇటీవలి కాలంలో చాలా సినిమాల రిలీజ్లు వాయిదాలు పడుతున్నాయి. ‘పెద్ది, లెనిన్, మా ఇంటి బంగారం’... ఇలా పలు చిత్రాలు తమ తొలి రిలీజ్ డేట్ను మార్చుకుని, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలే. ఈ కోవలో మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్స్పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సినిమా రిలీజ్ల వాయిదాల పర్వం కొనసాగుతోంది. కొన్ని సినిమాల రిలీజ్లకు ఓటీటీ డీల్స్ అడ్డంకిగా మారితే, మరికొన్ని సినిమాలు వీఎఫ్ఎక్స్ వర్క్స్కి ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్ల వాయిదా పడుతున్నాయి. మరి... ఏ సినిమాల రిలీజ్లు గ్రాఫిక్స్ వల్ల ఆలస్యం అవుతున్నాయి? ఏ సినిమాల రిలీజ్ డేట్లు ఇంకా కన్ఫార్మ్ కావాల్సి ఉంది? అన్న విషయాలపై ఓ లుక్ వేయండి.సత్య లోకానికి దారేది?చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథన్ హీరోయిన్స్గా నటించగా, కునాల్ కపూర్ విలన్ రోల్లో చేశారని తెలిసింది. బాలీవుడ్ కథనాయిక మౌని రాయ్ ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తారు. ఇక ‘విశ్వంభర’ సినిమా గత ఏడాది సంక్రాంతి సందర్భంగానే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది వేసవికి ‘విశ్వంభర’ సినిమా విడుదలవుతుందని ఓ సందర్భంలో యూనిట్ పేర్కొంది. కానీ ఇది సాధ్యం కాలేదు. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది.‘విశ్వంభర’ సినిమా టీజర్ విడుదలైనప్పుడు ఈ సినిమా గురించిన విజువల్స్, గ్రాఫిక్స్ వర్క్స్పై కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో మళ్లీ ఈ తరహా విమర్శలు పునరావృతం కాకూడదని చిత్రయూనిట్ పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ వర్క్స్ను చాలా జాగ్రత్తగా చేస్తోందట. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్నీ ప్లాన్ చేసినట్లుగా సాగితే ఈ సినిమాను అక్టోబరు 16న రిలీజ్ చేయాలన్నది టీమ్ ప్రస్తుత ప్లాన్ అని తెలిసింది.ఇక ఈ చిత్రంలో దొరబాబు అనే పాత్రలో చిరంజీవి, అవని అనే పాత్రలో త్రిష నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ సినిమాను నిర్మించారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఇక పద్నాలుగు లోకాలు దాటి సత్య లోకానికి వెళ్లి అక్కడ్నుంచి హీరోయిన్ను హీరో ఎలా తిరిగి తీసుకు వస్తాడనే అంశం ఆధారంగా ‘విశ్వంభర’ కథనం సాగుతుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ ప్రయాణంలో విశ్వంభర అనే పుస్తకం కథలో కీలకంగా ఉంటుందని తెలిసింది.డిసెంబరులో ఫౌజి దసరాకు విడుదల కావాల్సిన ‘ఫౌజి’ సినిమా డిసెంబరులో రిలీజ్కు సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ అండ్ లవ్స్టోరీ సినిమా ‘ఫౌజి’. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇమాన్వీ ఇస్మాయిల్ ఈ చిత్రంతో హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతుండగా మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీ సిరీస్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ల సమర్పణలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని తెలిసింది. ప్రధాన కథాంశం రజాకార్ల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ కార్యకలా పాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ దేశభక్తి చిత్రంలో హను రాఘవపూడి ప్రస్తావించనున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అలాగే హీరో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ఇక ‘ఫౌజి’ సినిమాను తొలుత ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కానీ ఈ సినిమా షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాక పోవడం,పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్పై టీమ్ మరింత ఫోకస్ పెట్టాలనుకోవడం వంటి కారణాల చేత ఈ సినిమా రిలీజ్ దసరాకు సాధ్యపడలేదట. ఇటీవల ‘ఫౌజి’ చిత్రాన్ని 2026 డిసెంబరు 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా దసరాకు విడుదల కావాల్సిన ‘ఫౌజి’ సినిమా డిసెంబరులో రిలీజ్కు సిద్ధం అవుతోంది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం లేక పోలేదనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తుండటం మరో విశేషం. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.రాకా రాక ఎప్పుడు? ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ లీడ్ రోల్ చేస్తుండగా, జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ స్టూడియోస్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.మేకర్స్ అయితే షూటింగ్ను ఈ ఏడాదే ముగించే పనిలో ఉన్నారని తెలిసింది. కానీ ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే అట్లీ సృష్టించారని, దీంతో వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తి చేసేందుకు చాలా సమయం పడుతుందనే టాక్ తెరపైకి వచ్చింది. అందుకే ‘రాకా’ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ముగిసినా రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు... ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. జడల్ జమానా ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ప్రధాన కథాంశం 1980 కాలం నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని, సుబ్బుగా కయాదు లోహర్, శిఖంజా మాలిక్గా మోహన్బాబు, విక్రమ్ మాలిక్గా రాఘవ్ జుయల్ (బాలీవుడ్ ‘కిల్’ సినిమా ఫేమ్..), బిర్యానిగా సంపూర్ణేష్ బాబు నటిస్తున్నారు. బాబుమోహన్, ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది.ప్రముఖ కథనాయిక కీర్తీ సురేష్ పాల్గొంటుండగా, ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ను యూనిట్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాను తొలుత ఈ ఏడాది మార్చి 26నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ క్వాలిటీ, కంటెంట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని నాని, శ్రీకాంత్ డిసైడ్ కావడంతో ఈ సినిమా రిలీజ్ను ఆగస్టు 21కి వాయిదా వేశారు.ఈ నెల 21న కూడా విడుదల కావడం లేదని, కాంప్రమైజ్ లేకుండాపోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి చేసేందుకు యూనిట్కు మరికొంత సమయం కావాల్సి వచి్చందని, దీంతో ఈ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే ఈ నెల 6న ‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్లో ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.నిధి అన్వేషణ ‘తండేల్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘వృషకర్మ’. ‘విరూ పాక్ష’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మిథికల్ థ్రిల్లర్ సినిమాలో అర్జున్ పాత్రలో నాగచైతన్య, ఆర్కియాలజిస్ట్ దక్షగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, సత్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాను తొలుత ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఈ వేసవిలో ఈ చిత్రం విడుదల కాలేదు.అయితే ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. ఈ సినిమా ప్రధాన కథాంశం ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో సాగుతుందని, కొన్ని మైథాలజీ, హారర్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నాయని తెలిసింది. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇషాన్ సక్సేనా సహ–నిర్మాతగా వ్యవహరిస్తుండగా ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.రణబాలి ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి కలిసి జంటగా నటిస్తున్న సినిమా ‘రణబాలి’. విజయ్ దేవరకొండకు ‘టాక్సీవాలా’ వంటి హిట్ సినిమాను అందించిన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగిన చారిత్రక వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రణబాలిగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా, జయమ్మ పాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు.హాలీవుడ్ నటుడు ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ మూవీలో విలన్ సార్ థియోడర్ హెక్టార్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే వంద రోజులకు పైగా చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ 90 శాతం పూర్తయింది. కాగా, ఈ సినిమాను ఈ ఏడాది సెపె్టంబరు 11న రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ సెప్టెంబరు 11న ‘రణబాలి’ సినిమా విడుదల కాక పోవచ్చని తెలిసింది. తాజాగా హీరోయిన్ రష్మికమందన్నా గాయపడ్డారు. ఆమెకు ఆరు వారాలు వైద్యులు విశ్రాంతి సూచించారు. ఈ ప్రభావం కూడా ‘రణబాలి’ చిత్రంపై పడుతుందని తెలుస్తోంది. మరోవైపు ఈ ఏడాది దీ పావళి సందర్భంగా నవంబరు 6న ‘రణబాలి’ సినిమాను విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట మేకర్స్.అయితే ఈ కొత్త విడుదల తేదీపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. టీ సిరీస్ ఫిల్మ్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అజయ్–అతుల్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’ అనే ఓ పీరియాడికల్ సినిమా తెరకెక్కుతోంది. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి... దీ పావళికి ‘రణబాలి’ విడుదలై, ఆ వెంటనే డిసెంబరులో ‘రౌడీ జనార్ధన’ సినిమా కూడా విడుదలైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏముంటుంది? మరి.. ఇలానే జరుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సెంగోల్ రక్షణ నిఖిల్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఫైనల్గా ఈ ఏడాది ఫిబ్రవరి 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఓ విడుదల తేదీని ప్రకటించారు. కానీ, ఈ సినిమా ఆ తేదీకి కూడా రిలీజ్ కాలేదు. వేసవిలో రిలీజ్ అనే ప్రచారం జరిగినప్పటికీ అదీ జరగలేదు. అంతేకాదు... ఈ చిత్రం రిలీజ్పై ఇప్పటికీ సరైన స్పష్టత రాలేదు. మేకర్స్ అయితే ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.కానీ భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్,పోస్ట్ ప్రోడక్షన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాతే విడుదల తేదీని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమాలో ఓ వారియర్ పాత్రలో నిఖిల్ కనిపిస్తారు. సెంగోల్ అనే ఓ రాజచిహ్నం రక్షణ అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం అని సమాచారం. ఈ సినిమాలో హీరో పాత్రకు తోడుగా ఓ గుర్రం ఉంటుందని తెలిసింది.భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సునీల్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారని, సుబ్బరాజు మరో కీలక పాత్రపోషించారని తెలిసింది. ఇంకా ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.డిసెంబరులో ఏటిగట్టు సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను గత ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ వీలుపడలేదు. తాజాగా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ రిలీజ్ డేట్పై స్పష్టత రాలేదు. బి. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇలా రిలీజ్ డేట్లు ప్రకటించి, ఇంకా విడుదల మార్చుకున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అలాగే షూటింగ్ స్టార్ట్ చేసి ఏడాది పైనా అవుతున్నా రిలీజ్ డేట్లు ఇంకా ఖరారు చేసుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి.– ముసిమి శివాంజనేయులు
కాలం చెరపలేని బంధం నేస్తనిధి
హాట్స్పాట్ అడగకుండానే ఆన్ చేసేవాడు... ఓటీటీ పాస్వర్డ్ లాంగ్ టైమ్ షేర్ చేసేవాడు... బిర్యానీ ఆర్డర్ చేస్తే బిల్ కట్టేవాడు... బ్రేకప్ స్టోరీని వందోసారి చెప్పినా ఓపిగ్గా వినేవాడు... అర్ధరాత్రి ఫోన్ చే సినా సొల్యూషన్ తో రెడీగా ఉండేవాడు.. మెంటల్ పీస్ పోయిన ప్రతిసారీ మందులా పని చేసేవాడు... జీవితంలో లోబ్యాటరీ అనిపించిన ప్రతిసారీ పవర్బ్యాంక్లా నిలిచేవాడు... ఇంట్లో వాళ్లకు తెలియని మన మరో వెర్షన్ మొత్తం తెలిసిన ఏకైక వ్యక్తి... వాడే... మన బెస్ట్ ఫ్రెండ్! జీవితంలో నవ్వులను పెంచి... బాధలను పంచుకుని... ప్రతి జ్ఞాపకాన్ని మరింత అందంగా మార్చిన ప్రతి నేస్తానికి... హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!జీవితంలో కొన్ని బంధాలు పుట్టుకతో వస్తాయి... కొన్ని పెళ్లితో వస్తాయి... కానీ మనమే ఎంచుకునే ఏకైక బంధం – స్నేహం! అయితే, ప్రతి స్నేహానికి ఒక సినిమా ఉంటుంది. మొదటి పరిచయం... మొదటి గొడవ... మొదటి బంక్... మొదటి బర్త్డే సర్ప్రైజ్... మొదటి బ్రేకప్కి ఇచ్చిన ఓదార్పు... మొదటి జాబ్ సెలబ్రేషన్ ... ఏళ్ల తర్వాత కలిసినా... ‘ఇంకా బతికే ఉన్నావా?’ అని ఆటపట్టించడంతోనే మొదలవుతుంది ఈ బంధం. వీరికి మన పుట్టినరోజు అంతగా గుర్తుండదు... కానీ పదేళ్ల క్రితం జరిగిన మన పరువు తీసిన సంఘటన మాత్రం బాగా గుర్తుంటుంది. అది పట్టుకుని మన జీవితాంతం ఆటపట్టిస్తూనే ఉంటాడు. మాటలతో అల్లరి చేయడం, కలిసిన ప్రతిసారి నవ్వుకోవడం... అవసరం వచ్చినప్పుడల్లా అడగకుండానే అండగా నిలవడం... ఇవన్నీ కలిస్తేనే నిజమైన స్నేహం. అందుకే, ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా... ప్రతి స్నేహితుడిలో దాగి ఉండే ఈ సరదా, ఈ భావోద్వేగం, ఈ ప్రత్యేకత గురించి తెలుసుకునేలా ఈ ప్రత్యేక కథనం... ఫ్రెండ్ కోసం... క్యాలెండర్లో ఒక రోజు పుట్టింది!ఆగస్టు మొదటి ఆదివారం అంటే చేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకోవడం, పాత ఫొటోలు స్టేటస్లో పెట్టడం, ‘హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!’ అని ఒకే మెసేజ్ను పది గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం మాత్రమే చాలామందికి తెలుసు. కాని, ఈ రోజు వెనుక ఒక పెద్ద ఆలోచన దాగి ఉందని కొంతమందికే తెలుసు. ఈ కథ మొదలైంది 1930లో. ప్రముఖ హాల్మార్క్ కార్డ్స్ వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ ఒక చిన్న ప్రశ్న వేశారు... ‘జీవితంలో మనల్ని ఎక్కువగా భరించే ఫ్రెండ్స్ కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఎందుకు ఉండకూడదు?’ అని. ఆ ఆలోచన అలా గాల్లో కలిసిపోలేదు.దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, 1958లో పరాగ్వేకు చెందిన డాక్టర్ రామోన్ ఆర్టెమియో బ్రాచో దాన్ని ‘వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రూసేడ్’ ఉద్యమంగా మార్చారు. అలా ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేగా ప్రజాదరణ పొందింది. ఆ సంప్రదాయాన్ని భారత్, అమెరికా, బంగ్లాదేశ్, మలేషియా వంటి దేశాలు కూడా కొనసాగించాయి. ముఖ్యంగా ఆదివారం కావడంతో స్కూల్, కాలేజీ, ఉద్యోగాల ఇబ్బంది లేకుండా స్నేహితులు కలుసుకునేందుకు ఇది అనువుగా మారింది. తర్వాత 2011లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ శాంతి, స్నేహాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో జూలై 30వ తేదీని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించినా... అప్పటికే ప్రజల జీవితాల్లో ఆగస్టు మొదటి ఆదివారం ఒక సంప్రదాయంగా స్థిరపడిపోవడంతో, భారత్ సహా అనేక దేశాలు ఇప్పటికీ అదే రోజున ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నాయి.దేశానికో తీరు సెలబ్రేషన్స్!భారత్లో అయితే చేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టకపోతే ఆ రోజు పూర్తయినట్టే కాదు! అమెరికాలో చిన్న కార్డు, కాఫీ ట్రీట్తో స్నేహాన్ని సెలబ్రేట్ చేస్తే... పరాగ్వేలో ‘సీక్రెట్ ఫ్రెండ్’ ఆటతో ఎవరికీ తెలియకుండా గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తారు. అర్జెంటీనాలో మాత్రం ఆ రోజు మొబైల్ నెట్వర్క్లకే ఊపిరాడనంతగా ఫోన్ కాల్స్, మెసేజ్లతో విష్ చేసుకుంటారు. ఇక ఫిన్ లాండ్, ఎస్టోనియా లాంటి దేశాల్లో స్నేహితులతో కలిసి భోజనం చేయడం, సమయం గడపడానికే పెద్ద ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ఇప్పుడు దాదాపు ప్రపంవ్యాప్తంగా ఫార్వర్డ్ మెసేజ్లు, పాత ఫొటో స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వీడియో కాల్స్, ఆన్ లైన్ గేమింగ్ సెషన్ లతో స్నేహాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు.గ్యాంగ్లోని అరుదైన పాత్రలు!ప్రపంచంలో వింత జీవులు చాలా ఉంటాయి... కానీ వాటిలో అత్యంత అరుదైన జాతి మాత్రం ఫ్రెండ్స్! వీళ్ల పనులకు లాజిక్ ఉండదు... మాటలకు హద్దులు ఉండవు... టైమింగ్కు గడియారం పనిచేయదు. ఇక అల్లరికైతే బ్రేకులు ఉండవు. అయినా వీళ్లు లేకపోతే జీవితం చాలా బోరింగ్ అయిపోతుంది. మరి... మీ ఫ్రెండ్ ఏ కేటగిరీకి చెందుతాడో ఈ సరదా జాబితాలో చూసేయండి!టిఫిన్ టెర్రరిస్ట్!స్కూల్లో లంచ్ బెల్ కొట్టగానే మీ పక్కనే ప్రత్యక్షమయ్యే మొదటి వ్యక్తి ఇతనే! ‘మీ అమ్మ చేసిన ఆలుగడ్డ కూర సూపర్ రా!’ అంటూ తన టిఫిన్ తెరవకముందే మీదే ఖాళీ చేసేవాడు. ఇప్పుడు టిఫిన్ బాక్స్ స్థానంలో స్విగ్గీ, జొమాటో వచ్చినా సరే, ఇతని స్వభావం ఏమాత్రం మారి ఉండదు. ‘నేను ఏమీ తినను!’ అంటూనే మీరు ఆర్డర్ చేసిన బిర్యానీలో సగం తన ప్లేట్లోకి షిప్ట్ చేసుంటాడు. బిల్ గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించడు. మీరు ఆకలిగా ఉన్నా లేకున్నా మీ ఆత్మారాముడితో పాటు తన ఆత్మారాముడిని కూడా సంతోషంగా ఉంచడమే ఈ ఫ్రెండ్ లక్ష్యం!రేపటి రాజుస్కూల్లో ఐదు రూపాయలు... కాలేజీలో యాభై... ఇప్పుడు రెండు వేలైనా, పదివేలైనా ‘రేపు పంపిస్తా’ అనేది వీళ్ల ట్రేడ్మార్క్ డైలాగ్. గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ అన్నీ వాడతాడు... కానీ మీ డబ్బు తిరిగి పంపడానికి మాత్రం నెట్వర్క్ పనిచేయదు! ఆశ్చర్యమేంటంటే... కొత్త ఫోన్ , కొత్త బైక్, వీకెండ్ ట్రిప్ల స్టేటస్లు మాత్రం రెగ్యులర్గా అప్డేట్ అవుతూనే ఉంటాయి. అయితే, ఈ రాజులందరూ ఒకేలా ఉండరు. మీ పది రూపాయలు తిరిగి ఇవ్వడానికి నెలలు పట్టొచ్చు. కానీ మీకు కష్టం వచ్చిందని తెలిసిన పది నిమిషాల్లో మీ ముందు నిలబడతారు. అందుకే కొన్నిసార్లు, వీళ్ల బాకీ డబ్బు కంటే, వీళ్ల తోడు విలువ ఎక్కువ!నడిచే గూగుల్ఈ ఫ్రెండ్కు ప్రపంచం మొత్తం తెలుసు... ఒక్క తన వస్తువులు తప్ప! షేర్ మార్కెట్ నుంచి స్పేస్ టెక్నాలజీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స వరకు... ఏ విషయం అడిగినా ఐదు నిమిషాల్లో క్లాస్ చెప్తాడు. మీ కెరీర్, మీ డైట్, ఏ మొబైల్ కొనాలి, ఏ వెబ్సిరీస్ చూడాలి... అన్నింటికీ రెడీగా సలహాలు ఇస్తాడు. కానీ తన జీవితంలోని చిన్న నుంచి పెద్ద పెద్ద నిర్ణయాలన్నింటికీ మీతోనే చర్చిస్తాడు. ఎందుకంటే... వాటి గురించి ఆలోచించడానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడని వీళ్ల పూర్తి నమ్మకం! ఆ దురదృష్టవంతుడు మీరే అయితే బాధపడకండి.రీల్స్ రాక్షసుడుమీరు ఇన్స్టంట్గా నవ్వాలంటే ఇతనొక్కడే చాలు! ఎందుకంటే, ఈ ఫ్రెండ్ రోజుకు ఇరవై రీల్స్, ముప్పై మీమ్స్, నలభై వీడియోలు ఫార్వర్డ్ చేస్తాడు. కానీ ‘పని ఉంది. రారా!’ అని మెసేజ్ పెడితే మాత్రం రెండు రోజుల తర్వాత ‘సారీ రా... ఇప్పుడే చూశా!’ అని చెప్తాడు. ఆశ్చర్యంగా మీరు పెట్టిన స్టేటస్కు మాత్రం నిమిషానికే కామెంట్ చేస్తాడు. ఒకవేళ ఈ ఫ్రెండ్ ఒక గంట పాటు ఒక్క రీల్ కూడా షేర్ చేయలేదంటే... వెంటనే కాల్ చేయండి! బ్యాటరీ అయిపోయిందో... ఫోన్ పోయిందో... లేక నిజంగానే ఏదైనా సమస్య వచ్చిందో చెక్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ మీదే!క్యాండిడ్ కలెక్టర్!ఒక్క ఫొటో కోసం వంద పోజులు! ఈ ఫ్రెండ్తో బయటకు వెళ్లడం అంటే ట్రిప్ కాదు, ఫొటోషూట్! తినే ముందు ఫొటో.. తాగేముందు ఫొటో.. నవ్వేముందు ఫొటో.. ఆఖరికి మీరు తుమ్మినా... ‘మరోసారి తుమ్ము... వీడియో తీయాలి!’ అంటాడు. అలా టీ చల్లారిపోవచ్చు... ఐస్క్రీమ్ కరిగిపోవచ్చు... కానీ ఫొటో పర్ఫెక్ట్గా రావాలి. యాభై క్లిక్స్ తీసి, నలభై తొమ్మిది డిలీట్ చేసి, చివరికి మీరు కళ్లు మూసుకున్న ఫొటోనే ‘క్యాండిడ్!’ అంటూ పోస్ట్ చేస్తాడు. ఈ ఫ్రెండ్తో చాలా జాగ్రత్త! మీ బాగున్న ఫొటోలు కంటే, బాగాలేని, అన్లిమిటెడ్ ఎంబరాసింగ్ ఫొటో కలెక్షన్ మొత్తం సేఫ్గా ఈ ఫ్రెండ్ దగ్గరే ఉంటుంది.బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్! ఈ ఫ్రెండ్ గడియారం మిగతా ప్రపంచంతో పని చేయదు. అంతా రెడీ అయ్యి, మీరు టీ తాగి, బజ్జీలు తిని, మరోసారి టీ ఆర్డర్ చేసి కాల్ చేసినా, ఇంకా ‘దగ్గర్లోనే ఉన్నా!’ అనే అంటాడు. అయితే, ఇదే ఫ్రెండ్కు మీరు ‘చాలా అర్జెంట్!’ అంటే మాత్రం ఆశ్చర్యపరుస్తూ నిజంగానే మీ ముందు ప్రత్యక్షమవుతాడు. అందుకే... వీళ్ల టైమింగ్ కంటే, కష్టకాలంలో వీళ్ల తోడును మాత్రం కచ్చితంగా నమ్మొచ్చు!కష్టకాల కింగ్!ఈ ఫ్రెండ్ రోజూ ఫోన్ చేయకపోవచ్చు. మెసేజ్లు పెట్టకపోవచ్చు. పుట్టినరోజుకు ఆలస్యంగా విషెస్ చెప్పొచ్చు. కానీ మీకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు మాత్రం వీళ్లదే! ఉద్యోగం పోయినా... ప్రేమ విఫలమైనా... ఇంట్లో గొడవైనా... డబ్బు అవసరమైనా... ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా... అర్ధరాత్రి ఒక కాల్ చేసినా కూడా, మీ సమస్యకు ఏ తీర్పులు చెప్పడు... తప్పులు వెతకడు... ముందుగా మీ పక్కన నిలబడతాడు. జీవితంలో ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరైనా ఉంటే, మీరు ప్రపంచంలోనే అందరికంటే అదృష్టవంతులని అర్థం.మ్యారేజ్తో మిస్సింగ్ ఫ్రెండ్!పెళ్లికి ముందు రోజూ గ్రూప్లో హడావుడి చేసే ఇతను, పెళ్లయ్యాక మొత్తం మెసేజ్లు తగ్గిపోతాయి. కలవడం కొన్నిసార్లు సంవత్సరాలకూ చేరుతుంది. అయితే, ఇక్కడ స్నేహం తగ్గిందని అనుకోవద్దు... జీవితానికి కొత్త బాధ్యతలు చేరాయని మాత్రమే అర్థం. ఇక్కడ మారేది ఫ్రెండ్ కాదు, టైమ్టేబుల్ మాత్రమే! ఎందుకంటే, ఈ ఫ్రెండ్ ఫోన్లో ఐదు నిమిషాలు మాట్లాడుతూనే, ‘ఒక్క నిమిషం రా... బాబు ఏడుస్తున్నాడు!’ అంటూ మల్టీటాస్కింగ్ చేస్తూనే మీతో నవ్వుతుంటాడు. ఇదే అసలు అడల్ట్ ఫ్రెండ్షిప్... కాల్స్ తగ్గినా, కనెక్షన్ మాత్రం ఫుల్ సిగ్నల్లోనే ఉంటుంది!ట్రిప్ ప్లానర్స్!ఫ్రెండ్ వాట్సాప్ గ్రూప్లో అడుగు పెట్టాడంటే చాలు... ‘ఈసారి గోవా పక్కా!’, ‘తర్వాత బాలి!’ అంటూ ప్రపంచ పర్యటన మొదలైపోతుంది. గూగుల్ షీట్స్, బడ్జెట్, హోటళ్లు, చూడాల్సిన ప్రదేశాలు... అన్నీ ఫుల్ డీటెయిల్స్తో రెడీ! కానీ బయలుదేరే రోజు వచ్చేసరికి ‘లీవ్ రాలేదు రా!’, ‘ఈ నెల కాస్త టైట్!’ అంటూ మొదట క్యాన్సిల్ చేసేది కూడా వీళ్లే. చివరికి గోవా ట్రిప్ ప్లాన్ చేసి... దగ్గర్లోని టీ బండి దగ్గరే గ్రూప్ ఫొటో తీసుకుని స్టేటస్ పెడతారు. నిజం చెప్పాలంటే... వీళ్లతో ట్రిప్ కంటే ట్రిప్ ప్లానింగ్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం.వైఫై పెరిగితే... వైబ్ తగ్గిందా? ఒకప్పుడు ఫ్రెండ్ను పిలవాలంటే ఇంటి ముందు నిలబడి ‘ఒరేయ్... బయటికి రా!’ అని అరిస్తే చాలు. లేదంటే ఓ విజిల్ వేస్తే ఐదు నిమిషాల్లో గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. ఇప్పుడు మాత్రం పరిస్థితి రివర్స్! మూడు కాల్స్... ఆరు వాట్సాప్ మెసేజ్లు... రెండు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేసిన తర్వాత కూడా మూడు గంటలకు ‘ఏమైంది రా?’ అనే ఒక రిప్లై పడుతుంది. అయితే, సోషల్ మీడియాను పూర్తిగా తప్పుపట్టలేం.ఏళ్లుగా కనిపించని స్కూల్ ఫ్రెండ్ను మళ్లీ కలిపింది కూడా అదే. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్నేహితుడిని ఒక్క వీడియో కాల్తో పక్కనే కూర్చున్నట్టు మాట్లాడే అవకాశం ఇచ్చింది. పుట్టినరోజులు గుర్తు చేస్తోంది... ఒక మీమ్తో నవ్వులు పంచుతోంది... ఒక స్టేటస్తో పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తోంది. అందుకే టెక్నాలజీ స్నేహాన్ని మార్చలేదు, స్నేహం చేసే విధానాన్ని మాత్రమే అప్డేట్ చేసింది! ఒకప్పుడు ‘రా... గ్రౌండ్కి!’ అనే ఆహ్వానం... ఇప్పుడు ‘రా... వీడియో కాల్లోకి!’ అనేదిగా మారింది. కానీ నిజమైన స్నేహం ఇప్పటికీ వైఫై కంటే స్ట్రాంగ్ కనెక్షనే!ప్రపంచాన్ని కదిలించిన నిజమైన ఫ్రెండ్షిప్ కథలుఫ్రెండ్ కోసం మనం ట్రీట్ ఇస్తాం... బిల్ కడతాం... అవసరమైతే అసైన్ మెంట్ కూడా రాసిపెడతాం! కానీ ప్రపంచంలో కొంతమంది స్నేహితులు మాత్రం తమ స్నేహం కోసం ప్రాణాలనే పణంగా పెట్టారు. ఇవి సినిమా కథలు కాదు... నిజంగా జరిగిన సంఘటనలు.భుజాలపై మోసింది... స్నేహాన్నే!చైనాకు చెందిన చిన్నారి ‘టాంగ్ యుయాన్ ’ తన కండరాల వ్యాధితో వీల్చైర్కే పరిమితమైన సహ విద్యార్థి ‘హి షియాంగ్హాంగ్’కు మూడేళ్ల పాటు ప్రతిరోజూ తోడుగా నిలిచాడు. మెట్లు ఎక్కించడం నుంచి భోజనం చేయించడం వరకు ప్రతి పనిలో భుజం అందించాడు. అతను నిరూపించిన విషయం ఒక్కటే... స్నేహానికి బలం చేతుల్లో కాదు, మనసులో ఉంటుంది.ఎవరెస్ట్ కంటే... ప్రాణమే ఎత్తు!2023లో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకునే సమయంలో నేపాల్కు చెందిన షెర్పా ‘గెల్జే’ మంచులో అపస్మారక స్థితిలో ఉన్న పర్వతారోహకుడిని చూసి తన కలను పక్కన పెట్టాడు. శిఖరాన్ని వదిలేసి అతడిని భుజాన మోసుకుంటూ సురక్షితంగా కిందికి తీసుకొచ్చాడు. రికార్డుల కంటే ప్రాణం విలువైనదని ప్రపంచానికి చాటి చెప్పాడు.ఒక కిడ్నీ... రెండు జీవితాలు!అమెరికాకు చెందిన ‘జేజే’ తన ప్రాణ స్నేహితుడు ‘జే’కు కిడ్నీ దానం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ ఒకరి పెళ్లిలో మరొకరు బెస్ట్మెన్ గా నిలిచారు. కొంతమంది స్నేహితులు గిఫ్ట్లు ఇస్తారు... ఇంకొందరు జీవితాన్నే గిఫ్ట్గా ఇస్తారు.యాభై ఏళ్ల తర్వాత... అదే స్నేహం!అనారోగ్యంతో ఉన్న తన అమ్మమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు మనవడు ‘అనీష్ భగత్’ ఆమె యాభై ఏళ్లుగా దూరమైన చిన్ననాటి స్నేహితురాలిని సోషల్ మీడియా సాయంతో వెతికి మళ్లీ కలిపాడు. ఒక కౌగిలితో యాభై ఏళ్ల దూరం కరిగిపోయింది. స్నేహానికి క్యాలెండర్ ఉండొచ్చు... ఎక్స్పైరీ డేట్ మాత్రం ఉండదు.ఎనభై ఏళ్ల స్నేహం!ఇంగ్లాండ్కు చెందిన కెన్ , ఆర్థర్లు వారి చిన్నప్పటి నుంచి మొదలైన స్నేహాన్ని ఎనభై ఏళ్ల తర్వాత కూడా అలాగే కొనసాగించారు. జీవిత భాగస్వాములను కోల్పోయిన తర్వాత ఒకే కేర్ హోమ్లో ఉంటూ ప్రతిరోజూ కలిసి సమయం గడిపారు. కొన్ని స్నేహాలు వయసుతో ముసలివి కావు... జ్ఞాపకాలతో మరింత అందంగా మారుతాయని నిరూపించారు.స్నేహం వెనుక దాగిన సైంటిఫిక్ నిజాలు!స్నేహితులు ఉంటే నవ్వులు మాత్రమే కాదు... ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచి స్నేహితులు ఉన్నవారిలో ఒత్తిడి, ఒంటరితనం తక్కువగా ఉండటమే కాదు; ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలా మంచి స్నేహితుడు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్ ్సలాంటివాడే! అయితే, అబ్బాయిలు– అమ్మాయిలు స్నేహాన్ని వ్యక్తపరచే తీరు మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది.అబ్బాయిలు...⇒ మాటల కంటే చేతలతోనే స్నేహాన్ని చూపిస్తారు. ⇒ సమస్య వస్తే ముందుగా పరిష్కారం వెతుకుతారు.⇒ ఆటపట్టించడం, అల్లరి చేయడాన్నే అనుబంధంగా భావిస్తారు.⇒ ‘నేనున్నా!’ అని చెప్పడం కంటే... అవసరమైనప్పుడు పక్కన నిలబడటానికే ప్రాధాన్యం ఇస్తారు.అమ్మాయిలు⇒ సంభాషణలతో స్నేహాన్ని మరింత బలపరుస్తారు. సంతోషం, బాధ... రెండింటినీ ముందుగా స్నేహితులతో పంచుకుంటారు.⇒ చిన్న జ్ఞాపకాలు, ప్రత్యేక రోజులను ఎక్కువకాలం గుర్తుంచుకుంటారు.⇒ ‘తిన్నావా?’, ‘ఇంటికి చేరావా?’ వంటి చిన్న శ్రద్ధలతోనే ప్రేమను వ్యక్తం చేస్తారు.చివరగా... స్నేహం అమ్మాయిదైనా... అబ్బాయిదైనా... తీరు మాత్రమే వేరు. స్నేహం మాత్రం ఒకటే. మీరు నవ్వినా... పడిపోయినా... నవ్వుతూ చేయి అందించేవాడే అసలైన స్నేహితుడు!జీవితంలో జీతం పెరుగుతుంది... ఇల్లు పెద్దదవుతుంది... కారు మారుతుంది... కానీ... చిన్నప్పటి స్నేహితుడు మాత్రం రీప్లేస్ అవడు. ఎందుకంటే... స్నేహితులు అంటేనే కాలం కూడా అంతం చేయలేని ఆనందాలు. ∙కొండి దీపిక
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం...ఉత్సాహంగా అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి తరచూ ధనలాభాలు కలిగే సూచనలున్నాయి. వాహనాలు, భూముల కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. ఎంతటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరణ, పురోగతిలో స్వీయనిర్ణయాలు మంచిది. ఉద్యోగాలలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దేవీస్తుతి మంచిది.వృషభం...అన్ని విధాలా విశేషయోగదాయకమైన కాలం. ఆర్థికంగానూ, సామాజికంగానూ బలపడతారు. ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీపై ప్రేమానురాగాలు చూపుతారు. వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అకారణ ఆహారవిహారాదులకు స్వస్తి చెప్పండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరించి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కష్టాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు లక్ష్యసా«దనలో ముందుకు సాగుతారు. వారం మధ్యలో బంధువులతో విభేదాలు. మానసిక ఆందోళన. నీలం, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మిథునం...ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి కావడమే ధ్యేయంగా ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మాటల నైపుణ్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకోవడం సంతోషం కలిగిస్తుంది. సేవాతత్పరతతో కొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం ఉండవచ్చు. శ్రమకు తగిన ఫలితం అందుకోనున్నారు. విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారుల ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.కర్కాటకం...వ్యవహారాలు పూర్తి కావడంలో సోదరులు సహకరిస్తారు. ఒక వ్యక్తి ద్వారా ఊహించని రీతిలో ధనలాభం ఉండవచ్చు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులు సంతోషంగా గడుపుతారు. భూములు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలపై సంప్రదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అన్నివిధాలా అనుకూల సమయం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. గులాబీ, ఎరుపు రంగులు. . విష్ణుధ్యానం చేయండి.సింహం...పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి మరింత ఆదరణ పొందుతారు. ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఒక ప్రధాన సమస్య తీరి ఒడ్డునపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థనీయంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.కన్య...ఆర్థికంగా కొంత ఇబ్బంది నెలకొన్నా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆస్తిలాభ సూచనలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల బారి నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు, వైద్యరంగం వారి సేవలు విస్తృతమవుతాయి. వారం చివరిలో అనారోగ్యం. అనుకోని ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.తుల...అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి విజయం సాధిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. సోదరులు, మిత్రుల ప్రోత్సాహంతో కీలక విషయాలలో ముందడుగు వేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఒక మరపురాని సంఘటన ఎదురుకావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించినస్థాయిలో లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పనిఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.వృశ్చికం..ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిíß తులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు జరిగే సూచనలు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో ఆదరణ మరింత పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆకుపచ్చ, గులాబీ రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.మకరం...ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కష్టానికి తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు ఎదురుకావచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు విధులు చికాకు పరుస్తాయి. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు కొత్త సమస్యలు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. నూతన పరిచయాలు. తెలుపు, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.కుంభం...పరిస్థితులను క్రమేపీ అనుకూలంగా మలచుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలలో చిక్కులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ పరిష్కారమవుతాయి. భూములు కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అత్యంత నేర్పుగా శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు మునుపటి కంటే లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు కొంత పెరుగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. మానసిక అశాంతి. ఎరుపు, పసుపు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.మీనం....ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. భూముల కొనుగోలులో వివాదాలు సర్దుకుంటాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. సంఘంలో కీర్తి గడిస్తారు. ఎన్నడో పోగొట్టుకున్న కొన్ని డాక్యుమెంట్లు తిరిగి లభ్యమవుతాయి. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి.
కాంట్రాక్టు ఒకరిది.. చేసింది మరొకరు
సాక్షి, హైదరాబాద్: మోడల్ సోలార్ విలేజ్ టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేసే పనిని సబ్ కాంట్రాక్టుకు ఇచ్చేసి.. ఒక్కో ఇంటిపై రూ.40 వేల నుంచి రూ.50 వేలు దక్కించుకున్నాయన్న ఆరోపణలున్నాయి. వాస్తవ వ్యయం కంటే ఎక్కువ కోట్ చేసి టెండర్లు దక్కించుకున్నప్పటికీ.. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు ఉందన్న విమర్శలున్నాయి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్న ఇళ్లకు సౌర విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రయోగాత్మకంగా 81 గ్రామాల్లో 40 వేల ఇళ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే... తొలిదశలో 20 వేల ఇళ్లకు ఈ ప్యానెల్స్ను ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచారు.అందులో కేంద్రీయభండార్ సంస్థలు, మరో నాలుగు సంస్థలు టెండర్లలో పాల్గొన్నట్లు టీజీ రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఇందులో 17,500 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతోపాటు, ఇన్వర్టర్లు, మీటరింగ్, గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు ఒక ఇంటిపై రూ.1.36 లక్షలకు టెండర్ కట్టబెట్టారు. టెండర్ దక్కించుకున్న కేంద్రీయ భండార్ సంస్థ స్థానికంగా సబ్ కాంట్రాక్టర్లకు కేవలం రూ. 86 వేలు మాత్రమే చెల్లించడం గమనార్హం. ఇప్పటికే 9వేల ఇళ్లపై ప్యానెల్స్ ఏర్పాటు పూర్తయినట్లు సమాచారం. నాణ్యతపై అనుమానాలు... టెండర్ దక్కించుకున్న సంస్థ మరీ అంత తక్కువకు సబ్ కాంట్రాక్ట్కు అప్పగించడం చూస్తే.. దాని నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సౌర విద్యుత్ ఫలకలు ఒకసారి ఏర్పాటు చేస్తే.. 25 సంత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. మరి సబ్కాంట్రాక్ట్ తీసుకుంటున్న సంస్థలు నాణ్యమైన ఫలకలు ఏర్పాటు చేస్తున్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో ఇంటిపై సౌర విద్యుత్ ఉత్పత్తికి రూ.1.36 లక్షలు వ్యయయ్యే ఈ పథకంలో రూ.60 వేలు కేంద్రం సబ్సిడీగా ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.76 వేలు వెచ్చిస్తూ.. ఉచితంగా అమలు చేస్తోంది. 2 కిలోవాట్ సౌర విద్యుత్తో ప్రతీరోజు 8 నుంచి 10 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి.అంటే నెలకు 240–300 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించుకునే గృహాలకు గృహజ్యోతి కింద ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. సౌర విద్యుత్ను ఈ గృహాలకు అందించడం వల్ల ప్రభుత్వంపై భారం పడకుండా ఉండటమేకాక.. ఆయా గృహ యజమానులకు వినియోగానికిపోగా అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్ను డిస్కమ్లకు విక్రయిస్తే ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని మొదట సీఎం రేవంత్రెడ్డి సొంతూరులో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు... ఈ 81 గ్రామాల్లోని ఇళ్లకు సౌర విద్యుత్ను అందిస్తున్న విధంగానే.. వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 16,078కి పైగా వ్యవసాయ పంపుసెట్లకు (7.5 కిలోవాట్ సామర్థ్యం) సోలార్ ప్యానెళ్లు అమర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో పంపు సెట్కు అయ్యే వ్యయం రూ. 4 లక్షలుగా నిర్ణయించారు. వీటి టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.
వీరి వీరి గుమ్మడిపండు... రిలీజ్ ఎప్పుడు?
రూ.2 వేల కోట్ల బడ్జెట్.. రూ.5 లక్షలకు కక్కుర్తి?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
కాలం చెరపలేని బంధం నేస్తనిధి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. వైసీపీ నేత ఇంటిపై పచ్చమూక దాడి
తెలంగాణ రైజింగ్-2047లో భాగస్వామ్యం అవ్వండి: మంత్రి శ్రీధర్బాబు
కామన్వెల్త్లో బంగారు పంట.. ఒక్కరోజే ఆరు స్వర్ణాలు కైవసం
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్
భద్రాచలం: స్వల్పంగా తగ్గుముఖం పట్టిన గోదావరి
హీరోయిన్ రష్మికా దేవరకొండకు గాయాలు
జియో రీఛార్జ్: ఇవే 28 రోజుల ప్లాన్లు..
స్వర్గంలాంటి అంటార్కిటికాను వదిలేస్తున్న గైడ్లు
స్వపక్షంలో కూడా ఒక ప్రతిపక్షం ఉన్నది సార్!!
... కంగ్రాట్స్ చెప్పడానికొచ్చావా! అది పొగడ్తకాదయ్యా!
మన వాళ్లే సార్! యూత్ని ఆకర్షించడానికి ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు!
మహేశ్ అన్న కొడుకు సినిమా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
ఇదేమి బ్యాటింగ్ బ్రో? అక్కడ కూడా పరువు తీస్తున్నావుగా?
విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
పండంటి కవలలకు జన్మనిచ్చిన స్టార్ కపుల్
జెన్జీ నిరసనలపై మౌనం వీడిన రాఘవ్ చద్దా
సాక్షి కార్టూన్: 01-08-2026
శరీరం మారింది... ఆలోచనలు మారాయి
బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్.. జెన్జీ ఆనందం!
రేషన్ కార్డు E-KYC.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ వేదికలు ఖరారు.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
రామాయణ ట్రైలర్.. సందీప్ రెడ్డి వంగా రివ్యూ
అభిమానులకు క్షమాపణలు చెప్పిన ప్రియాంక.. నెటిజన్స్ ప్రశంసలు
వీరి వీరి గుమ్మడిపండు... రిలీజ్ ఎప్పుడు?
రూ.2 వేల కోట్ల బడ్జెట్.. రూ.5 లక్షలకు కక్కుర్తి?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
కాలం చెరపలేని బంధం నేస్తనిధి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. వైసీపీ నేత ఇంటిపై పచ్చమూక దాడి
తెలంగాణ రైజింగ్-2047లో భాగస్వామ్యం అవ్వండి: మంత్రి శ్రీధర్బాబు
కామన్వెల్త్లో బంగారు పంట.. ఒక్కరోజే ఆరు స్వర్ణాలు కైవసం
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్
భద్రాచలం: స్వల్పంగా తగ్గుముఖం పట్టిన గోదావరి
హీరోయిన్ రష్మికా దేవరకొండకు గాయాలు
జియో రీఛార్జ్: ఇవే 28 రోజుల ప్లాన్లు..
స్వర్గంలాంటి అంటార్కిటికాను వదిలేస్తున్న గైడ్లు
స్వపక్షంలో కూడా ఒక ప్రతిపక్షం ఉన్నది సార్!!
... కంగ్రాట్స్ చెప్పడానికొచ్చావా! అది పొగడ్తకాదయ్యా!
మన వాళ్లే సార్! యూత్ని ఆకర్షించడానికి ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు!
మహేశ్ అన్న కొడుకు సినిమా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
ఇదేమి బ్యాటింగ్ బ్రో? అక్కడ కూడా పరువు తీస్తున్నావుగా?
విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
పండంటి కవలలకు జన్మనిచ్చిన స్టార్ కపుల్
జెన్జీ నిరసనలపై మౌనం వీడిన రాఘవ్ చద్దా
సాక్షి కార్టూన్: 01-08-2026
శరీరం మారింది... ఆలోచనలు మారాయి
బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్.. జెన్జీ ఆనందం!
రేషన్ కార్డు E-KYC.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ వేదికలు ఖరారు.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
రామాయణ ట్రైలర్.. సందీప్ రెడ్డి వంగా రివ్యూ
అభిమానులకు క్షమాపణలు చెప్పిన ప్రియాంక.. నెటిజన్స్ ప్రశంసలు
ఫొటోలు
లండన్ ట్రిప్లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)
మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)
సినిమాలకు పనికొచ్చే ముఖమేనా.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
'రాజా ది రాజా' మూవీ హీరోయిన్ విశాఖ ధిమన్ క్యూట్...(ఫొటోలు)
ఎయిర్పోర్టును తలపించేలా.. కొత్త హంగుల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (ఫొటోలు)
నాడు జగన్ శంకుస్థాపన.. నేడు ‘భోగాపురం’ అందాలు (ఫొటోలు)
గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు (ఫొటోలు)
చుక్కల డ్రస్లో చక్కనమ్మ (ఫొటోలు)
భర్తతో 'జబర్దస్త్' ఫైమా.. హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
బోల్డ్ లుక్స్లో బిగ్ బాస్ ప్రియాంక (ఫొటోలు)
సినిమా
ఓటీటీలో ఇంటెన్స్ ప్రేమకథా సినిమా.. అధికారిక ప్రకటన
ప్రేమకథలు సరిగా తీయాలే గానీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అలా రీసెంట్ టైంలో ఆకట్టుకున్న చిత్రం 'మై వాపస్ ఆవుంగా'. హిందీ భాషలో తీసిన ఈ మూవీ ఇంటెన్స్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించారు. బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అధికారికంగా అప్డేట్ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజే, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. జూన్ 11న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రదర్శితమవుతూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 07వ తేదీ నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.భారత్-పాక్ విభజన జరిగిన టైంలో ఇద్దరు ప్రేమికులు విడిపోతారు. ఏళ్లు గడిచిపోయిన తర్వాత సదరు ప్రేమికుడు.. వృద్ధుడు అవుతాడు. ప్రియురాలిని మళ్లీ కలవాలనే ఇతడి ఆశయాన్ని నెరవేర్చేందుకు మనవడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? చివరకు అనుకున్నది చేశారా లేదా అనేదే మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)
తెలుగులో స్ట్రీమింగ్లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలు అనగానే దాదాపు అందరికీ థ్రిల్లర్ సినిమాలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే మలయాళీ దర్శకులు ఎక్కువగా ఈ జానర్ మూవీస్ తీస్తుంటారు. వీటికి ఓటీటీల్లో అద్భుతమైన ఆదరణ దక్కుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కన్నడం నుంచి థ్రిల్లర్స్ వస్తుంటాయి. అలాంటి ఓ మూవీనే 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం'. చాన్నాళ్ల క్రితమే ఇది ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతి ఏంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు)2021లో రిలీజైన 'సీతారాం బెనోయ్: కేస్ నంబర్ 18' సినిమాకు సీక్వెల్ ఇది. విజయ్ రాఘవేంద్ర హీరో కాగా దేవిప్రసాద్ శెట్టి దర్శకుడు. సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథతో ఈ మూవీని తెరకెక్కించారు. కొన్నాళ్ల క్రితం తొలుత అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కన్నడలో ఆపై హిందీ, తమిళంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు.'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం' విషయానికొస్తే.. మొదటి కేసులో భాగంగా భార్యని పోగొట్టుకొని ఒంటరిగా జీవిస్తుంటాడు పోలీస్ అధికారిక సీతారాం(విజయ్ రాఘవేంద్ర). ఆనెగడ్డ గ్రామంలోనే పనిచేస్తూ ఉంటాడు. అంతా ప్రశాంతంగా ఉందనుకునే టైంలో మళ్లీ వరస హత్యలు కలకలం రేపుతాయి. గుర్తు తెలియని వ్యక్తి కొందరు వ్యక్తుల మెడ, చేతులకు గొలుసులు కట్టి అతి కిరాతకంగా చంపేస్తుంటాడు. దీంతో గ్రామస్థులు హడలిపోతారు. ఈ హత్యల్ని సీతారాం ఇన్వెస్టిగేట్ చేస్తాడు. మరి వీటి వెనుకున్న సైకో కిల్లర్ ఎవరు? అసలెందుకు చేస్తున్నాడు? చివరకు ఈ కిల్లర్ని సీతారాం పట్టుకున్నాడా? లేదా అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)
పెళ్లి కూతురిగా భాగ్యశ్రీ.. అందంగా జాన్వీ
'లెనిన్' షూటింగ్ జ్ఞాపకాలతో భాగ్యశ్రీఫ్రెండ్ పార్టీలో అందంగా జాన్వీ కపూర్ముద్దుగుమ్మలా ముస్తాబైన ఈషా రెబ్బామిల మిల మెరిసిన తారలా గౌరీప్రియముద్దొచ్చేలా సంయుక్త భలే మెరిసిపోతూచుడీదార్లో చూడచక్కగా 'కోర్ట్' శ్రీదేవి View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Vishnu Vardhan (@photosbyvishnu) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Sangeerthana Vipin (@sangeerthanavipin6) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sri devi (@srideviactor)
'లెనిన్'లో లేని క్రేజీ సాంగ్ వీడియో రిలీజ్
అఖిల్కి 'లెనిన్'తో తొలి సక్సెస్ దక్కింది. గత నెలలో రిలీజైన ఈ మూవీకి రూ.100 కోట్ల వసూళ్లు వచ్చాయి. వచ్చే శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కి కూడా రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే రిలీజ్కి ముందు 'సోల్ ఆఫ్ లెనిన్' పేరిట ఓ సాంగ్ని బయటకు వదిలారు. ఇది మూవీలో కూడా ఉంటుందేమోనని అనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. దీనిని ఎడిటింగ్లో తీసేశారు. కానీ ఇప్పుడు పూర్తి వీడియోని యూట్యూబ్లో విడుదల చేశారు.(ఇదీ చదవండి: సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)అఖిల్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన 'లెనిన్' సినిమాకు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. రూరల్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్గా దీన్ని తెరకెక్కించారు. నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరించారు. మహాభారతాన్ని రిఫరెన్స్గా తీసుకుని ఈ మూవీ తీశారు. ఫస్టాప్ రొటీన్గా ఉన్నప్పటికీ సెకండాఫ్లో వరసపెట్టి ట్విస్టులు వస్తూనే ఉంటాయి.(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ)
క్రీడలు
మేరీ కోమ్ స్ఫూర్తి.. కామన్వెల్త్లో పాకిస్తాన్కు తొలి పతకం
భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేరీ కోమ్ ఇచ్చిన స్ఫూర్తి భారత్లో ఎంతోమంది మహిళా బాక్సర్లను పుట్టేలా చేసింది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన స్ఫూర్తి దేశ సరిహద్దులను కూడా దాటి పాకిస్తాన్ను కూడా తాకింది. విషయంలోకి వెళితే పాకిస్తాన్ బాక్సర్ అయిన 22 ఏళ్ల ఫాతిమా జహ్రా కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.తద్వారా కామన్వెల్త్ గేమ్స్లో పతకం సాధించిన తొలి పాకిస్తాన్ బాక్సర్గా ఫాతిమా నిలిచింది. అంతేకాదు ఈ కామన్వెల్త్ గేమ్స్లో ఫాతిమా సాధించిన పతకమే వారికి మొదటిది కావడం గమనార్హం. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న సర్ఘోడాలో పెరిగిన ఫాతిమా భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ను ఆదర్శంగా తీసుకుంది. మేరీ కోమ్ జీవితం ఆధారంగా 2014లో బాలీవుడ్లో తెరకెక్కిన బయోపిక్ అప్పటికి 10 ఏళ్ల వయసు ఉన్న ఫాతిమాపై చెరగని ముద్ర వేసింది. ఆ సినిమాలో మేరీ కోమ్ జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకొని దిగ్గజ బాక్సర్గా పేరు పొందడం ఫాతిమాను బాగా ఆకట్టుకుంది. ఆ క్షణంలోనే తాను కూడా బాక్సర్ కావాలని కలలు కన్నది. అయితే ఫాతిమా బాక్సర్ అయ్యే క్రమంలో సొంత దేశంలో ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. ఫాతిమా కుటుంబం బాక్సింగ్కు వ్యతిరేకంగా ఉండేది. ఆమెను శిక్షణకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ సంవత్సరాల తరబడి ఫాతిమా చేసిన పోరాటం ఆమెపై వ్యతిరేకతను పోగొట్టి మద్దతు పెరిగింది. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ వాళ్ల దేశానికి కామన్వెల్త్ గేమ్స్లో పతకం తీసుకొచ్చి అందరి చేత శెభాష్ అనిపించుకుంది. కాగా పతకం సాధించిన అనంతరం ఫాతిమా మాట్లాడుతూ.. భారతదేశానికి చెందిన మేరీ కోమ్ నాకు స్ఫూర్తి. ఆమె జీవితంపై తీసిన సినిమాను నేను అప్పట్లో ప్రతీరోజు చూసేదాన్ని. నేను బాక్సింగ్ మొదలుపెట్టినప్పుడు ఆ సినిమా చూస్తూ శిక్షణ తీసుకునేదాన్ని. ఆమె అంటే నాకు చాలా గౌరవం. దేవుడి దయవల్ల ఇవాళ ఆమె లాగే మా దేశానికి ఒక పతకం తీసుకొచ్చాను. ఏదో ఒకరోజు ఆమెలానే మా దేశానికి నేను కూడా పేరు ప్రఖ్యతలు తీసుకొస్తానని ఆశిస్తున్నా* అని తెలిపింది.ఇక మేరీకోమ్ ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెచ్యూర్ బాక్సింగ్లో ఆరుసార్లు చాంపియన్గా నిలిచిన మేరీ కోమ్ దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసింది. మేరీకోమ్ తన కెరీర్లో ఆరు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిళ్లు, ఒలింపిక్స్లో కాంస్య పతకం, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు, ఐదు ఆసియా ఛాంపియన్షిప్లను గెలిచి అత్యున్నత శిఖరాన్ని అందుకుంది. More history has been made at the 2026 Commonwealth Games as Fatima Zahra becomes the first women from Pakistan to medal in boxing. 🇵🇰Zahra lost in the semi finals against Marie-Bathoul Al-Ahmadieh, who will go on to face Priya Priya of India in the final. #TimeForWorldBoxing pic.twitter.com/SpSuDpBhVB— World Boxing (@RealWorldBoxing) July 31, 2026చదవండి: సెంట్రల్ జోన్ కెప్టెన్గా పటీదార్.. అందరి కళ్లు అతడిపైనే!
సెంట్రల్ జోన్ కెప్టెన్గా పటీదార్.. అందరి కళ్లు అతడిపైనే!
దులీప్ ట్రోఫీ 2026కు సంబంధించి సెంట్రల్ జోన్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రజత్ పటీదార్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, ఫినిషర్ రింకూ సింగ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు మోయనున్నాడు. 15 మందితో పాటు అమన్దీప్ ఖరె, మయాంక్ మిశ్రా, సౌరబ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయలు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఆగస్టు 23న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఐదు టెస్టులు జరగనున్నాయి. సెంట్రల్ జోన్తో పాటు నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్తో పాటు సౌత్జోన్ ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది. అయితే ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ సారాంశ్ జైన్ కూడా సెంట్రల్ జోన్లో చోటు లభించింది. సారాంశ్తో పాటు ఎస్ఆర్హెచ్ బౌలర్లు జీషన్ అన్సారి, హర్ష్ దూబేలకు కూడా జట్టులో చోటు లభించింది.గతేడాది జరిగిన దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆయేడు ఫైనల్లో సౌత్జోన్ను మట్టికరిపించిన సెంట్రల్ జోన్ను పటీదార్ దశాబ్ద కాలంలో తొలిసారి చాంపియన్గా నిలిపాడు. అంతేకాదు ఆ సీజన్లో 382 పరుగులు చేసిన పటీదార్ ఖాతాలో ఒక సెంచరీ ఉంది. ఈసారి చాంపియన్ హోదాలో సెంట్రల్ జోన్ నేరుగా సెమీఫైనల్ ఆడనుంది. ఆగస్టు 23 నుంచి 26 మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్స్లో ఈస్ట్ జోన్తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్తో వెస్ట్జోన్ తలపడనున్నాయి. ఈ రెండింటిలో గెలిచిన జట్లు సెమీస్లో చాంపియన్ సెంట్రల్ జోన్తో పాటు రన్నరప్ సౌత్జోన్తో ఆడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది.సెంట్రల్ జోన్ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), రింకు సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, అమన్ మొఖాడే, కునాల్ చండేలా, జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్ (వికెట్ కీపర్), యాష్ ఠాకూర్, నాచికేత్ భూటెస్టాండ్ బై ప్లేయర్స్: అమన్దీప్ ఖరే, మయాంక్ మిశ్రా, సౌరభ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయ.సపోర్ట్ స్టాఫ్: నిఖిల్ డోరు - హెడ్ కోచ్, దేశ్రాజ్ చౌహాన్ - ఫిజియో, చంద్రశేఖర్ రావు - వీడియో అసిస్టెంట్, మోహిత్ కుమార్ - మసీర్, మనీష్ ఝా - అసిస్ట్ కోచ్, మయాంక్ అగర్వాల్ - ట్రైనర్, జుఫ్రీ జకేరియా - మేనేజర్.చదవండి: నీరజ్కు చెక్.. ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ చాంపియన్ దాకా
చెత్త ఏరుకునే కుటుంబం నుంచి.. భారత క్రికెటర్గా
అతడిది నిరుపేద కుటుంబం. కుటుంబ పోషణ కోసం అతడి తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటారు. పదమూడు మంది సంతానంలో అతడు ఒకడు. కడుపేద కుటుంబంలో దివ్యాంగుడిగా జన్మించిన అతడి కల మాత్రం పెద్దది.క్రికెటర్గా రాణించాలనే ఆశయంతో ఎన్నో సవాళ్లకు ఎదురునిలిచాడు. తన సంకల్ప బలంతో ఆటంకాలు అధిగమించి భారత దివ్యాంగ క్రికెట్ జట్టు ఓపెనర్ స్థాయికి ఎదిగాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఆగష్టు 5- 19 వరకు జరిగే టీ20 టోర్నమెంట్లో అతడు పాల్గొనబోతున్నాడు.ఇంతకీ అతడు ఎవరంటారా?.. రాజేశ్ కన్నూర్. కర్ణాటకకు చెందిన ఈ 27 ఏళ్ల క్రికెటర్.. మల్టీనేషనల్ టోర్నమెంట్లో భారత్ తరఫున తొలి సెంచరీ బాదిన దివ్యాంగ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. విజయాపురలోని మురికివాడలో జన్మించాడు రాజేశ్. అతడి కుటుంబం గుడిసెలో నివాసం ఉంటుంది. వారి గుడిసెకు విద్యుత్ సౌకర్యం కూడా లేదు.అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, ఆత్మవిశ్వాసంతో క్రికెటర్గా ఎదిగాడు రాజేశ్ కన్నూర్. అయితే, ఆటగాడిగా గుర్తింపు వచ్చినప్పటికీ అతడి ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు. దివ్యాంగ భారత క్రికెట్ మండలి (DCCI) ఇప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో భాగం కాకపోవడమే ఇందుకు కారణం. డీసీసీఐని బీసీసీఐ ఇంతవరకు అనుబంధ సంస్థగా గుర్తించలేదని సమాచారం.కాబట్టి రాజేశ్ కన్నూర్ మ్యాచ్ల కోసం తన సొంతంగా డబ్బులు ఖర్చు చేసి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. స్నేహితులు, ఇతర దాతల సాయంతో అతడు కెరీర్ను నెట్టుకొస్తున్నాడు. ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..పదమూడు మంది సంతానంలో‘‘మా అమ్మానాన్న కాశీబాయి, చిన్నప్ప. విజయపురలో వాళ్లు చెత్తు ఏరుకుంటారు. మేము పదమూడు మందిమి సంతానం. ఏడుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు. పేదరికం కారణంగా నా చదువు పదో తరగతిలోనే ఆగిపోయింది.అయితే, చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలన్న కోరిక నా మనసులో బలంగా నాటుకుపోయింది. కానీ దివ్యాంగుడినైందున నాతో ఎవరూ ఆడేవారు కాదు. గల్లీ క్రికెట్ ఆడుతున్న సమయంలో కొంతమంది స్నేహితులు దివ్యాంగులకు క్రికెట్ కోచింగ్ ఇచ్చే సెంటర్ గురించి చెప్పారు.అదే నా కెరీర్లో టర్నింగ్ పాయింట్అది హుబ్బలిలో ఉంది. 2018లో నేను అక్కడ చేరాను. 2-3 ఏళ్ల పాటు అక్కడే ఆడాను. అయితే, కర్ణాటక దివ్యాంగ జట్టులో చేరిన తర్వాత నా కెరీర్ మలుపు తిరిగింది. కానీ ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు. అంతర్జాతీయ మ్యాచ్ల కోసం ప్రయాణం చేసే సమయంలో నిధులు నేనే సమీకరించుకోవాల్సి వచ్చేది. నేను ఎప్పుడూ రైలులోనే ప్రయాణం చేసేవాడిని.అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం విమానంలో ప్రయాణిస్తా. ఇందుకు నా స్నేహితుడు విశ్వనాథ్ రాథోడ్ సాయం చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడతాను కాబట్టి నాకు ఆదాయం వస్తుందని అంతా అనుకుంటారు. కానీ నేను ఇప్పటికీ సరైన క్రికెట్ కిట్ కొనుక్కోలేకపోయాను.సాధారణ క్రికెట్ మాదిరే ప్రజలు దివ్యాంగ క్రికెట్ను ఆదరించాలి. ప్రభుత్వం కూడా మాకు నిధులు కేటాయిస్తే బాగుంటుంది. కాగా రాజేశ్ కన్నూర్ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై హాఫ్ సెంచరీలు చేశాడు. చదవండి: మంచి సెలక్షన్.. వాషీ కంటే అతడే బెటర్
CWG 2026: షాట్పుట్ భారత్కు డబుల్ ధమాకా.. స్వర్ణం, రజతం సొంతం
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల షాట్పుట్ F57 ఫైనల్లో సోమన్ రాణా స్వర్ణ పతకం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం దక్కించుకున్నాడు. సోమన్ రాణా 13.40 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలువగా.. శుభమ్ జుయాల్ 13.28 మీటర్ల త్రోతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ పతకాలతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి (8 గోల్డ్, 15 సిల్వర్, 7 బ్రాంజ్) చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.కాగా, ఇవాళ ఒక్క రోజే భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు (మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్, మహిళల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా, పారా పురుషుల షాట్పుట్ F57 విభాగంలో సోమన్ రాణా) చేరాయి.ట్రిపుల్ జంప్లోనూ రెండు పతకాలుఇవాళే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలోనూ భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు.రజతంతో సరిపెట్టుకున్న జడుమణిపురుషుల 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ జడుమణి సింగ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో జడుమణి ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ కుంభకోణంపై జెన్జీ వార్...
ఏపీలో డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే...
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అక్రమాలపై విచారణ. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రెండేళ్ల బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం... ‘కాగ్’ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం
ప్రశ్నపత్రాల లీకేజీ దోషులకు పదేళ్ల జైలుశిక్ష.. పది కోట్ల రూపాయల జరిమానా... ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కృష్ణా, గోదావరి డెల్టాలో వరి వేయొద్దని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
చంద్రబాబు సర్కారును నిద్ర లేపుతాం... పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడుతాం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన
ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించిన ప్రతిపక్షాలు..
బిజినెస్
128 కిమీ రేంజ్ అందించే.. విడా కొత్త స్కూటర్!
హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా.. దేశీయ విఫణిలో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్తో కూడిన గో ఎఫ్బీ పేరుతో వీడా విఎక్స్2 సరికొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.1.13 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది కంపెనీకి చెందిన అధికారిక డీలర్షిప్లో అందుబాటులో ఉంటుంది. డెలివరీలు ఆగస్టు 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ కొత్త వేరియంట్ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 128 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది DC ఫాస్ట్ ఛార్జర్తో, 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి 65 నిమిషాలు పడుతుంది. వీఎక్స్2 గో ఎఫ్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్కు 6kW మోటార్ జత చేయబడి ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు.హీరో విడా వీఎక్స్2 గో ఎఫ్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.3 అంగుళాల LCD కన్సోల్ పొందుతుంది. దీనికి టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ సౌకర్యం ఉంది. సీటు కింద ఉండే స్టోరేజ్ సామర్థ్యం 27.2 లీటర్లు. కాబట్టి ఇది అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.
ఐటీ రిటర్న్స్కు భారీ స్పందన..
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు భారీ స్పందన లభించింది. 2026-27 అసెస్మెంట్ ఇయర్ (AY 2026-27) కోసం జూలై 31 నాటికి 5.9 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ITRs) దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. సాధారణంగా ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (HUFs) రిటర్నులు దాఖలుకు గడువు జూలై 31తో ముగిసింది.ఈ సందర్భంగా పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. సకాలంలో రిటర్నులు దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారుల విశ్వాసం, అనుసరణను ప్రతిబింబిస్తోందని పేర్కొంది.ఐటీఆర్-1లో స్వల్ప తగ్గుదలఅందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఐటీఆర్-1 (సహజ్) దాఖలులో గత ఏడాదితో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈసారి సుమారు 3.15 కోట్ల ఐటీఆర్-1లు దాఖలయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి ఈ సంఖ్య సుమారు 3.3 కోట్లుగా ఉంది. మరోవైపు ఐటీఆర్-2 దాఖలులు గత ఏడాది స్థాయికి దగ్గరగా ఉన్నట్లు సమాచారం.కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు సాధారణ ఆదాయంపై రిబేట్ ప్రయోజనం అందుబాటులోకి రావడం ఐటీఆర్-1 దాఖలులపై కొంత ప్రభావం చూపినట్లు నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేని కొంతమంది వ్యక్తులు రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేకపోవడంతో ఫైలింగ్స్లో స్వల్ప మార్పు కనిపించవచ్చు.ఐటీఆర్-3, ఐటీఆర్-4కు ఇంకా గడువుజూలై 31 గడువు అన్ని రకాల పన్ను చెల్లింపుదారులకు వర్తించదు. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే, ఆడిట్ అవసరం లేని అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్-3, ఐటీఆర్-4 దాఖలు గడువు ఆగస్టు 31 వరకు ఉంది. ఆదాయపు పన్ను శాఖ కూడా ఐటీఆర్-4కు ఆగస్టు 31నే గడువుగా పేర్కొంది.ఆడిట్ అవసరమయ్యే కేసులకు వేర్వేరు గడువులు ఉంటాయి. అందువల్ల మొత్తం ఐటీఆర్ ఫైలింగ్స్ సంఖ్య రానున్న వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఎవరికి?ఐటీఆర్-1 (సహజ్) ప్రధానంగా నివాస భారతీయ వ్యక్తులు ఉపయోగించే సరళీకృత రిటర్న్ ఫారం. మొత్తం ఆదాయం రూ.50 లక్షల వరకు ఉండి జీతం/పెన్షన్, ఇంటి ఆస్తి, ఇతర ఆదాయాలు, నిర్దిష్ట పరిమితుల్లో మూలధన లాభాలు, రూ.5,000 వరకు వ్యవసాయ ఆదాయం ఉన్న అర్హత కలిగిన వ్యక్తులు దీనిని దాఖలు చేయవచ్చు.ఐటీఆర్-2 వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం లేని వ్యక్తులు, హెచ్యూఎఫ్లు ఉపయోగించే ఫారం. ఐటీఆర్-1కు అర్హత లేని, అయితే వ్యాపారం/వృత్తి ఆదాయం లేని వ్యక్తులు ఇందులో రిటర్న్ దాఖలు చేస్తారు. ఉదాహరణకు కొన్ని రకాల మూలధన లాభాలు ఉన్నవారికి ఐటీఆర్-2 వర్తిస్తుంది.గడువు దాటితే?జూలై 31లోపు రిటర్న్ దాఖలు చేయలేకపోయిన అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే ఆదాయం రూ.5 లక్షలకు మించితే సాధారణంగా రూ.5,000 వరకు, రూ.5 లక్షలలోపు ఉంటే రూ.1,000 ఆలస్య రుసుము వర్తించవచ్చు. పన్ను బకాయిలపై వడ్డీ కూడా పడే అవకాశం ఉంది. అందువల్ల గడువు ముగిసినా ఇంకా రిటర్న్ దాఖలు చేయాల్సినవారు వీలైనంత త్వరగా బిలేటెడ్ రిటర్న్ సమర్పించడం మంచిది.Thank you, taxpayers! 🙏🇮🇳Over 5.9 Crore ITRs filed for AY 2026–27 by July 31st! Your trust and timely compliance provide the energy that fuels India’s growth.@nsitharamanoffc @officeofPCM @FinMinIndia @PIB_India pic.twitter.com/aShMxcuqOW— Income Tax India (@IncomeTaxIndia) August 1, 2026
వీసా కోసం రూ.19 లక్షల బాండ్.. జాబితాలో 50 దేశాలు!
అమెరికా ప్రభుత్వం.. వీసాలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ప్రయోగాత్మకంగా అమలు చేసిన 'వీసా బాండ్ ప్రోగ్రామ్'ను.. ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ప్రకారం.. కొన్ని దేశాల పౌరులు అమెరికాకు వెళ్లేందుకు బిజినెస్ లేదా టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు, అవసరమైతే 20,000 డాలర్ల (రూ.19 లక్షల కంటే ఎక్కువ) వరకు బాండ్ను సమర్పించాల్సి రావచ్చు.ఈ విధానం ప్రస్తుతం 50 దేశాల పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. వీటిలో ఎక్కువ దేశాలు ఆఫ్రికా ఖండానికి చెందినవే. కాగా.. ఈ జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే.. జాబితాలో ప్రస్తుతం భారత్ పేరు లేదు. భవిష్యత్తులో మరిన్ని దేశాలను చేర్చే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం తెలిపింది.ఈ నిబంధన B-1 (వ్యాపార ప్రయాణం), B-2 (పర్యాటక ప్రయాణం) వీసాలకు వర్తిస్తుంది. వీసా మంజూరు చేసే కాన్సులర్ అధికారి, దరఖాస్తుదారుని వివరాలను పరిశీలించి తరువాత బాండ్ అవసరమా?, కాదా?.. అనే నిర్ణయం తీసుకుంటారు. దీన్నిబట్టి చూస్తే.. ప్రతి ఒక్కరూ బాండ్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా ఉండే వారి సంఖ్యను తగ్గించడమే. గతంలో.. ఈ పథకాన్ని ఒక సంవత్సరం పాటు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు.వీసా బాండ్ కార్యక్రమాన్ని శాశ్వతం చేయడంపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వలస హక్కుల కోసం పనిచేసే సంస్థలు, ఇంత పెద్ద మొత్తంలో బాండ్ చెల్లించడం సాధారణ ప్రజలకు భారంగా మారుతుందని అంటున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను కలవడానికి లేదా పర్యాటకంగా అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఇది అదనపు ఆర్థిక భారం అవుతుందని చెబుతున్నారు. ఇదీ చదవండి: చెప్పిందే జరుగుతోంది.. కియోసాకి హెచ్చరిక!
ఐపీఓ, ఈక్విటీ వైపు తెలుగు రాష్ట్రాల చూపు!
దేశంలోనే సాహసోపేతమైన, చొరవగల వ్యాపార వర్గాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలయంగా ఉన్నాయి. వ్యవసాయం, సంప్రదాయ పరిశ్రమల నుంచి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల వరకు ఈ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. అయితే, గత ఐదేళ్ల ఐపీఓ దరఖాస్తులపై జరిగిన విశ్లేషణను పరిశీలిస్తే.. తెలుగు వారి తదుపరి ఆర్థిక వృద్ధి ప్రయాణం స్టాక్ మార్కెట్లలోనే ఉండబోతోందని స్పష్టమవుతోంది.ప్రైమరీ మార్కెట్లో భాగస్వామ్యందేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, 785 పట్టణాల పరిధిలో నమోదైన 1.83 కోట్ల ఐపీఓ దరఖాస్తుదారులలో.. తెలంగాణ నుంచి 3.99 లక్షలు (2.17%), ఆంధ్రప్రదేశ్ నుంచి 4.41 లక్షలు (2.40%) నమోదయ్యాయి. మొత్తంగా 8.4 లక్షల మంది తెలుగు మదుపరులు ప్రైమరీ మార్కెట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ వంటి చారిత్రాత్మక మార్కెట్ లీడర్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈక్విటీ కల్చర్ మరింత ఎదగడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి.తలసరి దరఖాస్తుదారులను చూస్తే.. జాతీయ సగటు 12,841 కాగా తెలంగాణలో ప్రతి పది లక్షల మందికి 10,490, ఆంధ్రప్రదేశ్లో 8,316 మంది ఉన్నారు. ఇది వీరి ఆకాంక్షలు తక్కువగా ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం కాదు. తెలుగు కుటుంబాల పొదుపు క్రమశిక్షణ చాలా బలమైనది. ఇప్పటివరకు భూమి, బంగారం వంటి సంప్రదాయ ఆస్తులకే ప్రాధాన్యమిచ్చిన వీరు ఇకపై తమ పొదుపులో కొంత భాగాన్ని లిస్టెడ్ ఈక్విటీల వైపు మళ్లించేందుకు బలమైన అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.మౌలిక వసతులు సిద్ధం.. అడ్డంకి లేని ప్రయాణంమదుపు విస్తరణకు కావలసిన డిజిటల్ మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 1.24 కోట్లు, తెలంగాణ నుంచి 61 లక్షల నమోదిత ట్రేడింగ్ ఖాతాలు ఉన్నాయి. ట్రేడింగ్ ఖాతాల లభ్యత సులువైనందున సాధారణ పొదుపుదారులను క్రియాశీల ఈక్విటీ మదుపరులుగా మార్చడం తదుపరి ప్రాథమిక లక్ష్యం కానుంది. రియల్ ఎస్టేట్, బంగారం స్థిరత్వాన్నిస్తాయి. బ్యాంక్ డిపాజిట్లు నమ్మకాన్నిస్తాయి. కానీ ఈక్విటీలు దీర్ఘకాలంలో దేశ వ్యాపార వృద్ధిలో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని, అధిక రాబడిని అందిస్తాయి. సెబీ ప్రోత్సహిస్తున్న సమతుల్య విధానం కూడా ఇదే.ఇదీ చదవండి: స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్!
ఫ్యామిలీ
అరే.. అలా కూడా ఫ్రెండ్షిప్ చేస్తారా?!
ఆగస్టు 2 ఫ్రెండ్షిప్ డే. మనం ఫ్రెండ్షిప్ డే వస్తే ఏం చేస్తాం? ఒక బ్యాండ్ కడతాం లేదా చాక్లెట్ ఇస్తాం. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఫ్రెండ్స్ను గౌరవించడానికి, కొత్త దోస్తులను చేసుకోవడానికి చాలా విచిత్రమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో చూసేద్దామా!కొరియా: ‘కంగారూ’ కౌగిలింతలు! (Kangaroo Hugs)దక్షిణ కొరియాలో పిల్లలు ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి వింత పద్ధతి ఉంది. ఒకరి వెనుక ఒకరు నిలబడి వెనుక ఉన్న దోస్త్ ముందున్న దోస్త్ని కంగారూ తన బిడ్డను పొట్టలో దాచుకున్నట్లు గట్టిగా కౌగిలించుకోవాలి. దీనిని ‘బ్యాక్ హగ్ దోస్తీ’ అంటారు. ఇలా చేస్తే వాళ్ల స్నేహం వందేళ్లు ఉంటుందట!జర్మనీ: ‘లెటర్ బాక్స్’ స్నేహం! సీక్రెట్ లెటర్ బాక్స్)జర్మనీలో స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ వెనుక ఒక ఖాళీ డబ్బాను ‘ఫ్రెండ్షిప్ బాక్స్’గా పెడతారు. ఫ్రెండ్ ఎవరైనా బాగా నచ్చితే ముఖం మీద చెప్పకుండా ఒక చిన్న కాగితం మీద పేరు రాసి ఆ బాక్సులో వేస్తారు. శనివారం రోజు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఎవరికి ఎక్కువ లెటర్స్ వస్తే వారే ఆ వారం క్లాస్ ‘సూపర్ ఫ్రెండ్‘!అర్జెంటీనా: స్కూల్ బంక్!అర్జెంటీనాలో జూలై 20న ఫ్రెండ్షిప్ డే వస్తే పిల్లలెవ్వరూ స్కూల్కి, పెద్దవాళ్లు ఆఫీసులకి వెళ్లరు. ప్రభుత్వం దీనిని అధికారిక సెలవుగా ప్రకటించకపోయినా అందరూ కలిసి ఒకేరోజు బంక్ కొట్టి, రోజంతా పార్కుల్లో ఆటలు ఆడుతూ గడుపుతారు.డెన్మార్క్: ‘కలర్ కోడ్’ దోస్తీ!’డెన్మార్క్ దేశంలో పిల్లలు వేసుకునే బట్టల రంగులను బట్టి వాళ్ల ఫ్రెండ్షిప్ స్టేటస్ తెలిసిపోతుంది. ఒకవేళ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకేరోజు ఒకేరంగు డ్రెస్ వేసుకుని స్కూల్కి వస్తే, వాళ్లు ‘ట్విన్ ఫ్రెండ్స్’ అని అర్థం. ఆ రోజు క్లాస్ టీచర్ వాళ్లను విడదీయకుండా ఒకే బెంచ్లో కూర్చోబెడతారు.
క్లాస్రూంలో ధైర్యం మేరీ క్యూరీ!
అది పోలాండ్ దేశంలోని వార్సా నగరం. అప్పట్లో అక్కడ రష్యా ఆధిపత్యం నడుస్తోంది. పోలిష్ భాష మాట్లాడటం, అక్కడి సంస్కృతిని నేర్చుకోవడంపై రష్యా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ఆ కాలంలో ‘మరియా సలోమియా’ (మేరీ క్యూరీ చిన్నప్పటి పేరు) అనే పదేళ్ల చిన్నారి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది. మరియా క్లాసులో అందరికంటే చాలా తెలివైంది, చురుకైనది. రష్యన్ అధికారులు ఎప్పుడు స్కూల్ను తనిఖీ చేయడానికి వచ్చినా క్లాస్ టీచర్ భయపడుతూ మరియానే పిలిచి ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనేవారు. ఎందుకంటే మరియా రష్యన్ అధికారుల కళ్లల్లోకి కళ్లు పెట్టి, వాళ్ల భాషలోనే తప్పుల్లేకుండా పక్కాగా జవాబులు చెప్పేది. అధికారులు వెళ్ళిపోయాక తన దేశ సంస్కృతిని దూరం చేస్తున్నందుకు క్లాస్ రూమ్లోనే వెక్కి వెక్కి ఏడ్చేది. ఆ కన్నీళ్లు మరియాను బలహీనపరచలేదు, మరింత మొండి పట్టుదలను పెంచాయి. ఆ రోజుల్లో పోలాండ్లో మహిళలకు యూనివర్సిటీలో ప్రవేశం లేకపోవడంతో రహస్యంగా నడిచే ‘ఫ్లయింగ్ యూనివర్సిటీ’(రాత్రి వేళల్లో వేర్వేరు ఇళ్లల్లో దొంగతనంగా నడిచే క్లాసులు)లో చేరి మరియా ప్రాణాలకు తెగించి చదువుకుంది. ట్యూషన్లు చెప్పుకుంటూ డబ్బు దాచుకుని పారిస్ వెళ్లి ఫిజిక్స్, మ్యాథ్స్ చదివింది. ఆ పట్టుదలే ఆమెను ప్రపంచం గర్వించే ‘మేరీ క్యూరీ’గా మార్చింది!
మేజిక్ టోపీ – కోన్ హ్యాట్
పిల్లలూ! ఈ ఫోటోలో అక్క తలపై ఒక టోపీ ఉంది కదా? గొడుగులా, గిన్నెలా ఉంది కదా? దీని పేరు ‘కోన్ హ్యాట్’ లేదా ‘రైస్ హ్యాట్’. వేరు వేరు దేశాల్లో దీనికి వేరు పేర్లు ఉన్నాయి. వియత్నాంలో– ‘నోన్ లా’, చైనాలో– ‘డౌలి’, మయన్మార్లో– ‘ఖమాక్’... మనం దీన్ని ‘గడ్డి టోపీ’ లేదా ‘వర్షపు టోపీ’ అని పిలవచ్చు. ఈ టోపీ స్పెషల్ ఏంటి? వర్షం నుండి కాపాడుతుంది. పైన వెడల్పుగా కోన్ ఆకారంలో ఉండడం వల్ల వర్షపు నీళ్లు ముఖంపై పడవు. ఎండ నుండి కాపాడుతుంది. ఎండలో పని చేసేటప్పుడు ముఖం నల్లగా కాకుండా ఈ టోపీ నీడ ఇస్తుంది. దీన్ని వెదురు, గడ్డి, తాటి ఆకులతో అల్లుతారు. అందుకే తలపై బరువు ఉండదు. ఈ అక్క చూడండి వర్షంలో కోన్ హ్యాట్ పెట్టుకుని హాయిగా సైకిల్ తొక్కుతోంది. చేతిలో గొడుగు పట్టుకోలేదు. ఎందుకంటే టోపీయే ఆమెకు గొడుగు! మనం ఏం నేర్చుకోవాలి? మనుషులు తమకు కావాల్సిన వస్తువులను బుర్రతో ఆలోచించి ప్రకృతి ఇచ్చిన వస్తువులతో తయారు చేసుకుంటారు.
సముద్రపు గుండెల్లో సెగలు డాల్ఫిన్ల సాహసయాత్ర!
నీలి రంగు పసిఫిక్ మహాసముద్రం... అలల పైనుంచి ఎగిరిపడుతూ గుంపులు గుంపులుగా ఈదుకుంటూ వెళ్తున్న వందలాది డాల్ఫిన్లు! 2026 జూలై ఆఖరు వారంలో అమెరికాలోని లాంగ్ బీచ్ (కాలిఫోర్నియా) తీరంలో టూరిస్ట్ బోటుపై ఉన్న జనాలు ఈ అద్భుతాన్ని చూసి కేరింతలు కొట్టారు. కానీ, పైకి ఎంత అందంగా కనిపిస్తున్నా ఆ డాల్ఫిన్ల పరుగు వెనుక సముద్ర గర్భం లో జరుగుతున్న ఒక పెద్ద పోరాటం దాగి ఉంది. సాధారణంగా డాల్ఫిన్లు ఇంత పెద్ద సంఖ్యలో తీరానికి దగ్గరగా రావు. కానీ ప్రస్తుతం సముద్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ‘అక్వేరియం ఆఫ్ ది పసిఫిక్’ శాస్త్రవేత్తల ప్రకారం తీవ్రమైన ఎల్నినో వాతావరణ మార్పులు, సముద్రపు తీవ్ర ఉష్ణ తరంగాలు పసిఫిక్ జీవరాశులను అతలాకుతలం చేస్తున్నాయి. సముద్రం పైభాగం వేడెక్కడంతో డాల్ఫిన్లకు, తిమింగలాలకు, సముద్ర పక్షులకు ఆహారమైన చిన్న చిన్న చేపలు, జీవులు ప్రాణాలు కాపాడుకోవడానికి లోతైన చల్లటి నీటిలోకి వలసపోతున్నాయి. దాంతో తిండి కోసం డాల్ఫిన్లు తమ రూట్ను మార్చి వేటాడాల్సి వస్తోంది. దీనికి తోడు వేడి పెరగడం వల్ల సముద్రంలో ‘టాక్సిక్ ఆల్గల్ బ్లూమ్స్’ (విషపూరిత నాచు) విపరీతంగా పెరిగిపోతోంది. ఇది సముద్రపు నీటిని విషమయం చేస్తోంది. పైకి చూసేవాళ్లకు డాల్ఫిన్ల ఆటలు సరదాగా అనిపించవచ్చు. కానీ నిజానికి అవి వాతావరణ మార్పులతో పోరాడుతూ, తమ మనుగడ కోసం చేస్తున్న సముద్రపు సాహసయాత్ర ఇది!
అంతర్జాతీయం
ఇరాన్ ఉలిక్కిపడేలా.. ట్రంప్, నెతన్యాహు మెగా ఆపరేషన్!
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయి వైమానిక దాడులకు సిద్ధమవుతున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై ఇప్పటివరకు జరగని స్థాయిలో దాడుల ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.ఈ దాడుల్లో ఇరాన్లోని కీలక విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను ఎంచుకున్నట్లు సమాచారం. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యవస్థను కొనసాగించే సామర్థ్యాన్ని బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ఉండొచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ ఆపరేషన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది అనుమతి ఇవ్వలేదని సమాచారం. పెంటగాన్ కూడా లక్ష్యాలపై స్పందించేందుకు నిరాకరించింది.ప్రపంచ మార్కెట్లు సోమవారం ప్రారంభమయ్యేలోపు ఈ ఆపరేషన్ను ముగించాలని అమెరికా వర్గాల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇంధన సరఫరాలపై దాడులు జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ అంశంపై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ను కూడా ఈ ప్రణాళికల్లో భాగస్వామిగా ఉంచినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్తో టెల్ అవీవ్ సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్పై పూర్తి స్థాయి సైనిక చర్యకు తిరిగి వెళ్లే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఓ ఇజ్రాయెల్ అధికారి స్పష్టం చేశారు.ట్రంప్ అధ్యక్షతన క్యాంప్ డేవిడ్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇరాన్పై సైనిక ఎంపికలపై చర్చ జరిగినట్లు సమాచారం. కొందరు అధికారులు ఈ చర్యకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్పై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ చాలా తీవ్రంగా దెబ్బతీస్తాం అనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా లక్ష్యం ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకోవడమేనని వైట్హౌస్ స్పష్టం చేసింది. అధ్యక్షుడి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా అమలు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని పెంటగాన్ పేర్కొంది. టెహ్రాన్ నగర విద్యుత్ సరఫరాను దెబ్బతీయడం వంటి ప్రత్యామ్నాయాలపైనా అమెరికా అధికారులు చర్చించినట్లు సమాచారం.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎలాంటి అమెరికా దాడి జరిగినా ప్రతీకార చర్యలకు సమగ్ర ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్లోని కీలక మౌలిక వసతులు, ప్రాంతీయంగా ఉన్న అమెరికా ఇంధన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించాయి.
వైద్య విద్యపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వైద్య విద్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడేళ్లలో ‘ఆప్టిమస్’ రోబోలు ఇప్పుడున్న బెస్ట్ డాక్టర్ల కన్నా మెరుగైన శస్త్రచికిత్సలు చేయగలని, పెద్దపెద్ద ఆపరేషన్లను కూడా సునాయాసంగా నిర్వహించగలవని వ్యాఖ్యానించారు. అందుకే కొత్తగా వైద్య విద్యలో చేరవద్దని సూచించారు. ఎలాన్ మస్క్ చేసిన తాజా వ్యాఖ్యలు వైద్య రంగంలో టెక్నాలజీ ఆధిపత్యంపై తీవ్ర చర్చకు దారితీశాయి. 2029 నాటికి టెస్లా 'ఆప్టిమస్' (Optimus) హ్యూమరాయిడ్ రోబోట్లు మానవ సర్జన్ను మించిపోతాయని, ఆ తర్వాత కొద్ది కాలానికే వైద్యులను వెనక్కి నెట్టివేస్తాయని ఆయన పేర్కొన్నారు. కేవలం 12 ఏళ్ల సుదీర్ఘ వైద్య విద్య, శిక్షణ అవసరం లేకపోవడం, అలసిపోకుండా పనిచేయడం, అపరిమితంగా విస్తరించే సామర్థ్యం రోబోట్ల సొంతం. ప్రస్తుతం ఉన్న వైద్యుల కొరత, ఆకాశాన్నంటుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే ఈ మార్పు అనివార్యమని మస్క్ అంటున్నారు.అయితే, ఈ మార్పునకు నిర్దేశించిన కాలపరిమితిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఎలాన్ మస్క్ శైలిలో అత్యంత వేగవంతమైన జోస్యం మాత్రమేనని నిపుణులు భావిస్తున్నారు. వైద్య రంగంలో చట్టపరమైన నిబంధనలు, న్యాయపరమైన బాధ్యతలు, రోగుల నమ్మకం వంటి అనేక వాస్తవిక అడ్డంకులు ఉన్నాయి. 2029 నాటికి ఇది సాధ్యం కావడం చాలా దూలభమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భవిష్యత్లో అత్యుత్తమ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని, నేడు దేశాధ్యక్షులకు లభించే వైద్యం కంటే మెరుగైన సంరక్షణ సామాన్యులకు కూడా దక్కే గమ్యస్థానం వైపు మనం పయనిస్తున్నామని స్పష్టమవుతోంది.ఈ సాంప్లికా విప్లవంలో కేవలం మాన్యువల్ సర్జరీలపై ఆధారపడే వైద్యులు వెనుకబడే ప్రమాదం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని, రోబోట్లతో కలిసి పనిచేయడం నేర్చుకున్నవారే భవిష్యత్లో అసలైన విజేతలుగా నిలుస్తారు. వైద్య వృత్తి పూర్తిగా అంతరించిపోకపోయినా, దాని స్వరూపం మాత్రం పూర్తిగా మారిపోనుంది. మనుషుల నైపుణ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా రోబోటిక్స్ కలయికతో వైద్య రంగంలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. 🚨 ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు⚠️"మెడికల్ కాలేజీలో చేరకండి. అది పూర్తిగా నిష్ప్రయోజనం."3 ఏళ్లలో 'ఆప్టిమస్' రోబోలు భూమిపై ఉన్న బెస్ట్ డాక్టర్ల కన్నా మెరుగైన శస్త్రచికిత్సలు చేయగలవు — అది కూడా భారీ స్థాయిలో.#Doctors pic.twitter.com/LXSiOw6NTG— UttarandhraNow (@UttarandhraNow) July 31, 2026
దారి తప్పిన రాకెట్.. మెరుపు వేగంతో చంద్రుడిపై ఢీ
అంతరిక్షంలో దారితప్పిన ఓ భారీ రాకెట్ ఇప్పుడు చంద్రుడివైపు దూసుకెళ్తోంది. గంటకు దాదాపు 8 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. అతి త్వరలోనే చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టనుంది. ఈ అనూహ్య పరిణామాన్ని శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే.. చంద్రుడిపై మానవ నిర్మిత వస్తువు ఢీకొట్టినప్పుడు జరిగే ప్రభావాలను అధ్యయనం చేసేందుకు ఇది అరుదైన అవకాశంగా మారనుంది. అదే సమయంలో భవిష్యత్ అంతరిక్ష యాత్రల్లో రాకెట్ వ్యర్థాల నిర్వహణ, అంతరిక్ష ట్రాఫిక్ నియంత్రణపై కొత్త సవాళ్లను కూడా తెరపైకి తెస్తోంది.స్పేస్ఎక్స్ కిందటి ఏడాది జనవరిలో ప్రయోగించిన రాకెట్లోని అప్పర్ స్టేజ్ (పై భాగం) అదుపు తప్పి అంతరిక్షంలో తిరుగుతూ చంద్రుడి ఢీకొనే మార్గంలోకి వచ్చింది. చంద్రుడిపై ఉన్న ఐన్స్టీన్ క్రేటర్ సమీపంలో ఇది కూలిపోతుందని అంతరిక్ష పరిశీలకుడు బిల్ గ్రే అంచనా వేశారు. భారత కాలమానం ప్రకారం సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ ఢీకొట్టు సమయంలో రాకెట్ వేగం గంటకు 8,700 కిలోమీటర్లు (సెకనుకు సుమారు 2.4 కిలోమీటర్లు) ఉండనుంది. ఇది ధ్వని వేగం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ.అనుకోకుండా.. ఢీచంద్రుడిపై మానవ నిర్మిత వస్తువు అదుపు తప్పి ఢీకొట్టడం ఇది రెండోసారి. అంతకుముందు 2022లో ఓ చైనా రాకెట్ భాగం చంద్రుడి అవతలి వైపున కూలి రెండు భారీ గోతులను సృష్టించింది. తాజాగా జరగనున్న ఈ ఘటన కూడా చంద్రుడిపై అంతరిక్ష వ్యర్థాల ప్రభావంపై మరోసారి చర్చకు దారితీస్తోంది. అయితే ఈ రాకెట్ చంద్రుడిని ఢీకొట్టడం అనుకోకుండా జరుగుతున్న పరిణామమే తప్ప.. ఇది స్పేస్ఎక్స్ ప్రణాళికలో భాగం కాదు. రాకెట్ పైభాగాన్ని సరైన సమయంలో సూర్యుడి కక్ష్యలోకి మళ్లించి ఉంటే ఈ ఢీకొట్టు ప్రమాదాన్ని నివారించవచ్చని అంతరిక్ష నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. అందుకు అవసరమైన నియంత్రణ, ఇంధన సామర్థ్యం లేకపోవడంతో అది అంతరిక్షంలో తేలుతూ చివరకు చంద్రుడి ఢీకొట్టు మార్గంలోకి చేరింది.90 అడుగుల గోతిని తవ్వే అవకాశంఈసారి రాకెట్ చంద్రుడి భూమికి కనిపించే వైపునే ఢీకొట్టనుంది. దాదాపు 4,500 కిలోల బరువున్న ఈ రాకెట్ భాగం ఢీకొట్టడంతో సుమారు 90 అడుగుల వెడల్పు, 16 అడుగుల లోతు ఉన్న గోతిని సృష్టించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఢీకొనే సమయంలో వెలువడే కాంతి మెరుపు ఒక్క క్షణం మాత్రమే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పైకి ఎగిసే దుమ్ము, రాళ్ల మేఘం మాత్రం కొన్ని నిమిషాల పాటు టెలిస్కోపుల ద్వారా కనిపించే అవకాశం ఉంది.చంద్రుడిపై పరిశీలనకు అవకాశంఈ ఘటనను శాస్త్రవేత్తలు ఒక ప్రమాదంగా మాత్రమే కాకుండా పరిశోధన అవకాశంగా చూస్తున్నారు. చంద్రుడిపై మానవ నిర్మిత వస్తువుల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ ఢీకొట్టు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. నాసాకు చెందిన లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ (LRO), దక్షిణ కొరియాకు చెందిన దనూరి లూనార్ ఆర్బిటర్ ఢీకొట్టడానికి ముందు, తర్వాత చంద్రుడి ఉపరితల చిత్రాలను సేకరించనున్నాయి.భవిష్యత్ చంద్ర యాత్రలకు హెచ్చరికచంద్రుడిపై మళ్లీ మానవులు అడుగుపెట్టేందుకు అమెరికా, చైనా వంటి దేశాలు పోటీపడుతున్నాయి. ప్రైవేటు సంస్థలు కూడా చంద్ర యాత్రల్లోకి అడుగుపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్ష వ్యర్థాల నియంత్రణ, రాకెట్ భాగాల కదలికలపై పర్యవేక్షణ మరింత కీలకమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రాకెట్ ఢీకొట్టు ప్రమాదకరం కాకపోయినా.. భవిష్యత్లో చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు పెద్ద సవాలుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాక్ హోంమంత్రి హెచ్చరిక.. మునీర్కు ముప్పు సంకేతమా?
పాకిస్తాన్లో పెరుగుతున్న అసంతృప్తి, యువతలో ఆగ్రహం, కుప్పకూలుతున్న పాలనా వ్యవస్థపై ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఏకంగా అంతర్గత వ్యవహారాల మంత్రే.. నిరాశకు గురైన యువత ఒక్కటైతే దేశాన్ని మార్చగల శక్తి వారికి ఉందని హెచ్చరించడం ఆసక్తికర పరిణామంగా మారింది.ఇస్లామాబాద్లో జరిగిన పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొన్న మొహ్సిన్ నక్వీ, దేశంలోని పాలనా వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, పరిపాలనా వ్యవస్థలో మూలస్థాయి మార్పులు అవసరమని అన్నారు. ‘ఇప్పుడు మనం జీవిస్తున్న వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ విధానంతో సమస్యలను పరిష్కరించలేం. నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టకపోతే పదేళ్ల తర్వాత కూడా ఇవే సమస్యలపై చర్చించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.బొద్దింకలైనా సరే.. ఏకమైతే శక్తే!దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన నక్వీ.. వారికి ఆర్థిక సాయం కంటే ఉద్యోగాలు, ప్రతిభకు గుర్తింపు, న్యాయం ముఖ్యమని అన్నారు. ‘ప్రజలకు కావాల్సింది న్యాయం, ప్రతిభకు విలువ, ఉద్యోగ అవకాశాలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేసిన ఓ వ్యాఖ్య మాత్రం సంచలనంగా మారింది. ‘ఆ యువకుడిని యువత అనండి... బొద్దింక అనండి... ఇంకేదైనా అనండి. కానీ ఆ బొద్దింకలన్నీ ఒక్కటైతే అన్నింటినీ తలకిందులు చేయగలవు’ అని అన్నారు. నక్వీ నేరుగా ఏ నిరసనను ప్రస్తావించకపోయినా, ఇటీవల భారత్లో జరిగిన సీజేఐ (CJP) ఉద్యమం, దాని రాజకీయ ప్రభావాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్తాన్లోనూ యువతలో పెరుగుతున్న నిరాశ, నిరుద్యోగం, అవకాశాల కొరత ఒక పెద్ద ఉద్యమానికి దారితీయవచ్చన్న ఆందోళన ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్ పాత్రపై కూడా నక్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. మునీర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటే దేశ సమస్యలను పరిష్కరించలేవని, రాజకీయ నాయకులు కలిసి పాలనా వ్యవస్థను మార్చకపోతే శాశ్వత ఫలితాలు రావని అన్నారు. ‘రాజకీయ నాయకులు దేశ వ్యవస్థను సరిచేయకపోతే ఫీల్డ్ మార్షల్ చేస్తున్న కృషికి ప్రయోజనం ఉండదు’ అని స్పష్టం చేశారు. మునీర్ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయనని పలుమార్లు చెప్పారని గుర్తుచేసిన నక్వీ, అన్ని రాజకీయ పార్టీలు కలిసి దేశ పరిపాలనను మెరుగుపర్చేందుకు పనిచేయాలని సూచించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నప్పటికీ, వ్యవస్థలో మార్పులు లేకపోతే అది కేవలం సమస్యలపై తాత్కాలిక చర్యలకే పరిమితమవుతుందని అభిప్రాయపడ్డారు.భారీ అప్పులు, బలహీన పాలన, నెమ్మదించిన అధికార యంత్రాంగం, నిరుద్యోగం, ప్రతిభ ఆధారిత అవకాశాల కొరత వంటి సమస్యలు పాకిస్తాన్ను వెంటాడుతున్నాయని నక్వీ పేర్కొన్నారు. వీటికి తాత్కాలిక పరిష్కారాలు కాకుండా వ్యవస్థాగత సంస్కరణలే అవసరమని అన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక కష్టాలు, రాజకీయ విభేదాల మధ్య దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజల అసంతృప్తి ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో పాలక వర్గాల్లోనే చర్చకు వస్తుండటం పాకిస్తాన్ భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తిని పెంచుతోంది.
జాతీయం
బీజేపీకి గుడ్బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్జీ నిరసనల ఎఫెక్ట్తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది.
అస్సాంలో వరద విలయం.. 82 మంది మృతి
దిస్పూర్: అస్సాంలో భారీ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 82కి చేరుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,92,799 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో వరద తీవ్రతఅధికారుల వివరాల ప్రకారం.. అసోంలోని శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, చరైడియో జిల్లాలలో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వాటిలో అత్యధికంగా చరైడియో జిల్లాలో 77,456 మంది, తర్వాతి స్థానాల్లో శివసాగర్లో 63,492 మంది, జోర్హాట్లో 34,067 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు. వరదల ప్రభావితమైన వారి కోసం 54 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని అందులో దాదాపు 13,000 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. మరో 26 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు పనిచేస్తుండగా, వాటి ద్వారా 5,384 మందికి సాయం అందుతోందన్నారు. బాధితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.వరద బాధితులకు ప్రభుత్వ ఊరట వరద పీడిత ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్య ఘర్ పెండింగ్ రాష్ట్ర సబ్సిడీ కింద 9,289 మంది లబ్ధిదారులకు రూ. 41.67 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది. అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDCL) ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా మంగళవారం (ఆగస్టు 4, 2026) నాటికి పూర్తి చేయాలని పవర్ డిపార్ట్మెంట్ను సీఎం ఆదేశించారు. అంతకు ముందు ప్రధాని మాట్లాడుతూ వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లోని వరద బాధితులందరికీ రుణాలు చెల్లించడంలో ఆరు నెలల మారటోరియం వర్తింపజేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు.
పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం నా అదృష్టం: ప్రధాని మోదీ
సాక్షి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని స్పీచ్ను ఎంపీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలుగులో తర్జుమా చేసి ప్రజలకు వినిపించారు.పవిత్రమైన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ పైడితల్లి అమ్మవారికి, సింహాచలం అప్పన్నకు నమస్కరిస్తున్నా. స్వర్ణాంధ్ర విజన్కు ఇవాళ కీలక రోజు. రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టాం. ఇవాళ రెండు రికార్డులు సృష్టించాం. ఒకటి ఎయిర్పోర్ట్.. రెండోది థింసా నృత్యం. 13 వేల మందికిపైగా గిరిజన పిల్లలు ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది. .. ఇది అల్లూరి సీతారామ రాజు నడియాడిన నేల. గిరిజన హక్కుల కోసం ఆయన తన జీవితాన్నిఅంకితం చేశారు. ఇదే భూమిపై ఇవాళ అభివ ల్యాంచ్ప్యాడ్ ప్రారంభమైంది. ఎయిర్పోర్టుల పేర్లను ఒక కుటుంబానికి పరిమితం చేయలేదు. అయోధ్య ఎయిర్పోర్టుకు వాల్మీకి, ఇవాళ అల్లూరి పేరు పెట్టుకున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్పోర్టులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 166కి చేరింది. చిన్న పట్టణాలకు నుంచి నగరాలకు ఎయిర్ సేవలు ఉన్నాయి. ఉడాన్ పథకం వల్ల ఎయిర్పోర్టుల సంఖ్య మాత్రమే పెరగలేదు.. ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ అమృత్సర్ వరకు విస్తరించింది. బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం. ఈ మొత్తం కోస్టల్ ఏరియాను అభివృద్ధి చేస్తున్నాం. మూలపేట, రామయపట్నం పోర్టులను నిర్మిస్తున్నాం. ఐటీ రంగంలో ప్రపంచానికి ఏపీ యువత తమ ట్యాలెంట్ను చూపిస్తున్నారు. ఏపీ యువత దేశానికి కూడా ఉపయోగపడాలి. ఒక్క ఫ్యాక్టరీతో ఏ గ్రోత్సెంటర్ నిర్మితం కాదు. ఇక్కడ గూగుల్ కూడా డేటా సెంటర్ నిర్మిస్తోంది. నక్కపల్లిలో ఫార్మ్ పార్క్ రాబోతోంది. విశాఖను ఇండస్ట్రీయల్ హబ్గా తీర్చిదిద్దుతాం. భోగాపురం విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్త అవకాశాలు వస్తాయి. విమాన రవాణా విస్తరణతో పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ‘ఫ్రంట్ కెమెరా’పై ప్రముఖ నటుడు ఎగతాళి!
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు, షో హోస్ట్ శేఖర్ సుమన్ తన ‘శేఖర్ టునైట్’ టాక్ షో తాజా ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రంట్ కెమెరా వీడియో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఢిల్లీ పోలీసుల లాఠీచార్జి, ‘జెన్-జీ’ భాషపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. 63 ఏళ్ల ఈ నటుడు తనదైన శైలిలో రాజకీయ, సామాజిక పరిణామాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ప్రధాని మోదీ తొలిసారిగా ఫ్రంట్ కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోపై స్పందిస్తూ ‘రావాల్సిన 'అచ్ఛే దిన్ వస్తాయో లేదో కానీ, మంచి రీల్స్ మాత్రం వస్తాయి’ అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ ఉదంతాన్ని ప్రధాని ‘ఘోర పాపం’ అని అభివర్ణించడంపై స్పందిస్తూ, ఆ వేదనను వ్యక్తంచేయడానికి మూడు నెలల సమయం పట్టిందని విమర్శించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధం జెన్-జీ ట్రెండ్స్లోని ‘సిచ్యుయేషన్షిప్’ మాదిరిగా మారిందని, ఎన్నికలప్పుడు లవ్ బాంబింగ్ చేసి, ఆ తర్వాత గోస్టింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇక విద్యార్థుల నిరసనలను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల నినాదమైన 'శాంతి, సేవ, న్యాయం' అనే మూడింటి ఎక్స్పైరీ తేదీ ఆరోజే ముగిసిందని చురకలంటించారు. సుదీర్ఘ ఆందోళనల తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఆయనకు విద్యాశాఖతో పాటు రక్షణ శాఖ బాధ్యతలు కూడా అప్పగించాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘నాన్న జ్ఞాపకం’ చోరీ.. తెచ్చిస్తే రూ. 5 లక్షలు, ఉద్యోగం!
ఎన్ఆర్ఐ
అమెరికాలో నిర్మల్ జిల్లా యువకుడి మృతి
నిర్మల్ జిల్లా : అమెరికాలో చదువు పూర్తయి ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. కానీ విధి చిన్నచూపు చూసింది. గత శనివారం మోటారు సైకిల్పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం అతడిని పుట్టిన రోజునే మృత్యు ఒడికి చేర్చింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన గన్ను శ్రీనివాస్రెడ్డి, విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానందరెడ్డి (24) మూడేళ్ల కిందట అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్కు ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. చదువు పూర్తయి అక్కడే ఉంటూ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మరో మూడు నెలల్లో ఇంటికి వస్తానని, ఆ తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తానని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, గత శనివారం మోటార్సైకిల్పై వెళ్తూ అదుపు తప్పి కారును ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన అతడిని అక్కడి ఆస్పత్రిలో చేరి్పంచారు. నిత్యానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. కుటుంబ సభ్యుల మాటలు వింటే కోలుకుంటాడేమోనని అతడి స్నేహితులు భావించారు. గురువారం అతడి పుట్టిన రోజు కావడంతో ఆస్పత్రికి వచ్చి బాధాతప్త హృదయంతో కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆరోగ్యం విషమించడంతో చనిపోయాడు. శ్రీనివాస్రెడ్డి, విశ్వరూప దంపతులకు కుమారుడు నిత్యానందరెడ్డి, కూతురు ఉన్నారు. అమెరికా వెళ్లి పెద్ద చదువు చదివిన కుమారుడు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశించారు. కానీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు
అమెరికాలో తెలుగు ప్రజల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. తాజాగా ఒత్తిడిని జయించడం ఎలా అనే దానిపై సదస్సు నిర్వహించింది..నాట్స్ టాంపా బే విభాగం ఆద్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. చేంజ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ వక్త కె. గోపాలన్ ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేశారు.. విక్రమ్ నంధ్యాల ఈ సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఒత్తిడిని ముందస్తుగా గుర్తించడం ఎలా? అది ఎన్ని రకాలుగా మనపై ప్రభావం చూపుతుంది? అనే అంశాలను సులభమైన ఉదాహరణలతో గోపాలన్ వివరించారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడకుండా, వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా గోపాలన్ అందించిన ఆచరణాత్మక చిట్కాలు ఈ సదస్సుకు విచ్చేసిన వారిని ఎంతగానో ఆలోచింపజేశాయి. చదువుల్లో, కెరీర్ ప్రారంభంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడిందని యువత సంతోషం వ్యక్తం చేశారు... ఆఫీసు ఒత్తిళ్లను తగ్గించుకుని ప్రశాంతంగా పనిచేయడానికి చక్కటి మార్గాలు దొరికాయని ఉద్యోగులు కొనియాడారు. అమెరికాలో తెలుగు వారి సంక్షేమం కోసం నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల గురించి నాట్స్ నాయకులు రాజేశ్ కండ్రు వివరించారు. తెలుగువారి కోసం ఇలాంటి సదస్సులను నిర్వహించేందుకు అవకాశం కల్పించిన నాట్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడ, డాక్టర్ మల్లికార్జున నంద్యాలను, టాంపా బే టీం నాయకులకు గోపాలన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి టాంపా బే కోర్ టీమ్ సభ్యులు అను కోట, శ్రీనివాస్ మల్లాది, రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, రమేష్ కొల్లి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, సురేష్ బొజ్జా, నవీన్ మేడికొండ, అనిల్ అరెమడ, రవి కాళిదిండి, సంజయ్ కొండ, శిరీష దొడ్డపనేని తదితరుల సమష్టి కృషి ఎంతో ఉంది. అలాగే, కార్యక్రమానికి అంకితభావంతో తమ సహకారం అందించిన మురళీకృష్ణ మేడిచెర్ల, కిషోర్ నారె, శ్రవణ్ కుమార్ నిడిగంటిలకు నాట్స్ టాంపా బే విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.(చదవండి: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు)
అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు
అమెరికా రాజకీయ రంగాన, అత్యంత ప్రతిష్టాత్మకమైన నాయకత్వ శిక్షణా వేదికపై ఒక తెలుగు కుర్రాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. అగ్రరాజ్యం వాషింగ్టన్ డి.సి.లో అత్యంత కఠినమైన వడపోతతో నిర్వహించే "అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్" మాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో మన తెలుగు తేజం క్రిష్ కొర్రపాటి ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వపడేలా చేశాడు.అమెరికాలోని 49 రాష్ట్రాలు మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేవలం 100 మంది హైస్కూల్ సీనియర్ విద్యార్థులను మాత్రమే ఈ బాయ్స్ నేషన్ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. ముందుగా రాష్ట్ర స్థాయి బాయ్స్ స్టేట్ పోటీల్లో సత్తా చాటిన వారు మాత్రమే ఈ జాతీయ స్థాయికి అర్హత సాధిస్తారు. అలా ఎంపికైన యువత ఒక వారం పాటు అమెరికా సెనెట్ తరహాలో మాక్ సమావేశాలు నిర్వహించి, చట్టాల రూపకల్పన, రాజకీయ చర్చల్లో పాల్గొంటారు.ఈ మహాసభల్లో విద్యార్థులు నేషనలిస్ట్స్, ఫెడరలిస్ట్స్ అనే రెండు పార్టీలుగా విడిపోయి తమ వాక్చాతుర్యాన్ని, నాయకత్వ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో తోటి సెనెటర్లందరి మద్దతును కూడగట్టుకుంటూ నార్త్ కరొలినా తరఫున ప్రాతినిధ్యం వహించిన క్రిష్ కొర్రపాటి బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు అర్కాన్సాస్ కు చెందిన సాయర్ రే అధ్యక్షుడిగా ఎన్నికై ఈ నాయకత్వ బృందానికి సారథ్యం వహిస్తున్నారు.తెలుగు వారందరికి గర్వకారణం..అమెరికాలో స్థిరపడిన గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామానికి చెందిన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన క్రిష్ కొర్రపాటి అద్భుతమైన విజయాన్ని సాధించి యావత్ తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచాడు. డాక్టర్ మధు కొర్రపాటి, శిరీష దంపతుల మనవడైన క్రిష్ కొర్రపాటి, డాక్టర్ వినీత్ కొర్రపాటి, స్మితల కుమారుడు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన "బాయ్స్ నేషన్" ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని తెలుగు వారి కీర్తిని అమెరికాలో రెపరెపలాడించాడు. ఈ అరుదైన విజయం ద్వారా క్రిష్ కొర్రపాటి క్యాపిటల్ హిల్ లో ఫెడరల్ అధికారులను కలవడంతో పాటు దేశ అత్యున్నత వేదికలపై తన గళాన్ని వినిపించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.
రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు
అమెరికాలో వైద్య వృత్తిలో ఉంటూ భారతీయ సంతతికి చెందిన వైద్యుడు తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఆసుపత్రిలోని విశ్రాంతి గది (Restroom)లో రహస్యంగా కెమెరా అమర్చి, రికార్డ్ చేసి, పైశాచిక ఆనందం పొందేవాడు. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ కేసులో వైద్యుడికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.నేరస్తుడు అద్వైత్ దేశ్ముఖ్ (Advait Deshmukh) టోలెడో యూనివర్విటీలో ఎండోయూరాలజీ, యూరోలాజిక్ ఆంకాలజీ విభాగంలో మూడో సంవత్సరం మెడికల్ రెసిడెంట్గా పనిచేసేవారు. జూన్ 2025లో ఓహియోలోని ప్రోమెడికా టోలెడో ఆసుపత్రిలోని ఒక యూనిసెక్స్ విశ్రాంతి గదిలో దాచి ఉంచిన ఒక సెల్ఫోన్ను ఒక ఉద్యోగి గుర్తించారు. ఆమె దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ్ముఖ్ దానిని లాక్కొని అది తనదేనని చెప్పాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ప్రోమెడికా, టోలెడో పోలీసు బృందం సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్వీరి విచారణలో ఆ ఫోన్లో 2025 ఫిబ్రవరి - మే మధ్య తీసిన 80కి పైగా ఫోటోలు, వీడియోలు లభించాయి. కనీసం ఆరుగురు బాధితులను పోలీసులు గుర్తించారు. ఇతగాడి పైశాచికం 2018 నుంచే జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయం దేశ్ముఖ్ను సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన మెడికల్ రెసిడెన్సీని రద్దు చేసింది. అయితే అంతర్గత విచారణ అనంతరం రెసిడెన్సీ నియామకాన్ని పునరుద్ధరించ లేదని వెల్లడించింది. కోర్టులో శిక్ష ఖరారయ్యే ముందు దేశ్ముఖ్ బాధితులకు క్షమాపణలు చెప్పాడు.టోలెడో ఆసుపత్రి ఉద్యోగి బాధితుల్లో ఒకరైన లిండ్సే ఈ సంఘటన తనను ఎంత కుంగదీసిందో వివరించారు. తాను ఇప్పటికీ బాత్రూమ్లలో రహస్య కెమెరాల కోసం తనిఖీ చేస్తానని, ఆ చిత్రాలు ఎక్కడికి చేరాయోనన్న ఆందోళనన తనను వెంటాడుతూనే ఉందంటూకోర్టు ముందు ఆవేదన వ్యక్తంచేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఒక అభియోగం, రహస్యంగా వీడియో తీసిన ఏడు అభియోగాలను అంగీకరించిన తర్వాత, దేశ్ముఖ్కు జూన్లో కోర్టు ఈయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రొబేషన్ విధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు 'సెక్స్ అఫెండర్' (లైంగిక నేరస్థుడిగా) నమోదు చేసుకోవాలని, మానసిక ఆరోగ్య చికిత్స పొందాలని ఆదేశించింది.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
క్రైమ్
పిల్లల ప్రాణాలు పోలేదుగా.. చిన్న గీతే కదా! వార్డెన్ సమాధానం
ఆంధ్రప్రదేశ్, విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్ బాష కుమార్తె సోఫియా స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.ఏమైందో ఏమో కానీ అదే హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న మరో విద్యార్థిని గురువారం రాత్రి పడుకున్న సమయంలో బ్లేడుతో సుస్మిత, సోఫియాల గొంతు కోయడానికి ప్రయత్నించింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరికి గొంతు కింద స్వల్ప గాయమైంది. గొంతు కోసిన విద్యార్థినిని వెంటనే హాస్టల్ నుంచి ఇంటికి పంపించేశారు. గాయపడిన విద్యార్థినులను కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. వార్డెన్ కనీసం తల్లిదండ్రులకు కూడా తెలపలేదు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్కు చేరుకుని ప్రిన్సిపాల్, వార్డెన్లపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ వార్డెన్ నల్లమ్మను నిలదీశారు. ఇందుకు వార్డెన్.. ‘మీ పిల్లల ప్రాణాలు పోలేదు కదా ఏదో చిన్న గీత పడిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
మాజీ ప్రియురాలి పేరుతో పచ్చబొట్టు
తమిళనాడు: మాజీ ప్రియురాలి పేరును పచ్చబొట్టు వేసుకున్న భర్తను భార్యతో పాటు ఆమె బంధువులు చితకబాదిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. తేని జిల్లా బోడినాయక్కనూరు ప్రాంతానికి చెందిన వినోద్కుమార్(36) శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య అర్చన, కుమారుడు వున్నారు. ప్రస్తుతం వీరు తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్లో నివాసం వుంటున్నారు. రెండు రోజుల క్రితం వినోద్కుమార్ తన మొదటి ప్రియురాలి పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. విషయాన్ని భార్య అర్చన గుర్తించి అతడితో ఘర్షణపడింది. అనంతరం అర్చన తన అక్క వనతి, భావ శరవణన్, సోదరుడు మహేష్ను పిలిపించింది. వారు వినోద్కుమార్ను చితకబాదారు. తీ వ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు రక్షించి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
సువేందు పీఏ కేసులో బీజేపీ కార్యకర్తల అరెస్ట్!?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణంలో కేసు దర్యాప్తు కొనసాగగా.. తాజాగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలనే సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.అరెస్టైన వారిని సాగర్ సోంకర్, సాహెబ్ సోంకర్గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, గతంలో చంద్రనాథ్ రథ్ టీమ్లో పనిచేసిన వారేనని సీబీఐ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీళ్లు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. హత్యకు ముందు రెక్కీ నిర్వహించడం, దాడికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, షూటర్లతో మాట్లాడుకుని ప్లాన్ చేయడం వీళ్లిద్దరి పనేనని గుర్తించారు. అయితే హత్యకు అసలు కారకులు ఎవరు? కారణం ఏంటి? అనేది ఇంకా తేలాల్సి ఉంది.సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.హత్యకు ముందే వ్యూహం?సీబీఐ దర్యాప్తులో భాగంగా హత్యను పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ముందుగానే షూటర్లను ఎంపిక చేయడం, వారికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఘటనకు ముందు ప్రాంతాన్ని పరిశీలించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది. బీజేపీ కార్యకర్తలే ఎందుకు అనుమానితులు?తాజా పరిణామాల్లో ప్రధాన అంశం.. అరెస్టైన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు కావడం. వీరు ఒకప్పుడు చంద్రనాథ్ రథ్తో కలిసి పనిచేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా వీరికి ప్రత్యర్థి రాజకీయ వర్గాలతో కూడా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజకీయ విభేదాలా? వ్యక్తిగత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం వాళ్లు గతంలో సువేందు టీఎంసీలో ఉన్నప్పుడు.. చంద్రనాథ్ రథ్ టీంలో పని చేశారని అంటున్నారు. అప్పట్లో సువేందు ఆరోపణలు.. చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.కొత్త మలుపు.. అసలు కుట్రదారులు ఎవరు?తాజా అరెస్టులతో చంద్రనాథ్ రథ్ హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు రాజకీయ కుట్ర కోణం, మరోవైపు సొంత వర్గంలో ఉన్న వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం.. కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది.
మూసీ బ్రిడ్జిపై తప్పిన విషాదం!
హైదారాబాద్: భర్తపై కోపంతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి మూసీలో దూకి ఆత్మహత్యకు యత్నించగా సకాలంలో స్పందించిన చైతన్యపురి పోలీసు సిబ్బంది కాపాడారు.వివరాలలోకి వెళ్లితే.....గురువారం సాయంత్రం ఉప్పల్ మూసీ బ్రిడ్జి సమీపంలో ఓ మహిళ, పిల్లలు ఆవేదనగా..అనుమానాస్పదంగా కని్పంచడంతో స్థానికులు వెంటనే డయల్ 100కు కాల్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న చైతన్యపురి మహిళా కానిస్టేబుల్ చంద్రకళ, హోంగార్డు బాలరాజు, హైడ్రా బృందం నాలుగు నిమిషాల్లో అక్కడకు చేరుకుని మహిళతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని కాపాడారు. భర్తపై కోపంతో మహిళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుసుకున్నారు.అనంతరం కౌన్సలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా డయల్ 100కు కాల్ వచి్చన కేవలం నాలుగు నిమిషాల్లో స్పందించిన పోలీసు సిబ్బందిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి అభినందించారు. శుక్రవారం ఈ మేరకు వారికి నగదు బహుమతి, రివార్డు అందజేశారు.
వీడియోలు
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
E 20పై యుద్ధం.. ప్రధాని నివాసం ముట్టడి..?
YSRCP మహిళ నేత అనూష తండ్రికి నివాళులర్పించిన గజ్జల సుధీర్ భార్గవ్
Mountaineer Nirmal Purja: పాక్ మంచు కొండల్లో విషాదం
అగార్కర్ అవుట్.. అశ్విన్ ఇన్ ఇక హిట్ మ్యాన్ ను ఆపేదెవరు
భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ జగన్ దే.. బాబు క్రెడిట్ చోరీని బయటపెట్టిన సజ్జల
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
లోకేష్ను ప్రశ్నించినందుకు వెంకట్రావుపై అక్రమ అరెస్ట్
అసెంబ్లీ సాక్షిగా నీ తల్లిని తిడితే.. సీఎంని చేశావ్.. మోదీకి రాచమల్లు సలహా
RRRపై పెండింగ్ లో ఉన్న CBI కేసుల్లో సాక్ష్యాలను మార్చే ప్లాన్..


