'అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు': కియోసాకి
ఆర్ధిక విషయాలకు సంబంధించిన విషయాలను, పెట్టుబడులకు సంబంధించిన సమాచారం గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki), తాజాగా బేబీ బూమర్స్ గురించి చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.1974లోనే నేను బేబీ బూమర్ల (1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారిని బేబీ బూమర్స్ అంటారు) పదవీ విరమణ విపత్తు రాబోతోందని ఊహించాను. 2026 చివరి నాటికి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. చాలామంది నిరాశ్రయులవుతారు'' అని కియోసాకి హెచ్చరించారు.ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కాస్త కఠినంగా మారుతున్నాయి. చాలా మంది వృద్ధులు ఉద్యోగాలు కోల్పోయి, సరిపడా పొదుపులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఇది సమాజానికి పెద్ద సవాలు. అందుకే ముందుగానే ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యమని కియోసాకి చెబుతున్నారు.మన మెదడు మనకు ఉన్న గొప్ప ఆస్తి. సరైన జ్ఞానం, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడైనా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. సంపదను సృష్టించడం అంత కష్టం కాదు, సరైన మార్గం తెలుసుకుంటే సరిపోతుంది.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరికకొంతమంది నిపుణులు.. భవిష్యత్తు కోసం బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, అలాగే డిజిటల్ ఆస్తులు అయిన బిట్కాయిన్, ఎథీరియం లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా, అవగాహనతో ముందుకు వెళ్లడం అవసరం అని రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. మొత్తం మీద.. రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించాలంటే ముందుగానే ప్రణాళిక అవసరం అని ఆయన పేర్కొన్నారు.BOMERS RETIREMENT DISASTER:In 1974 I saw the coming of the Baby Boomer Retirement Disaster. In 2026 millions of Boomers will be out of work in trouble financially….many homeless.I wrote two books for the Boomers and their families who wanted to prepare for this time in…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 6, 2026
'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?
సాక్షి, చెన్నై: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (TVK) చారిత్రాత్మక విజయం, పార్టీ అధినేత తరువాత కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (దళపతి విజయ్)కి సంబంధించిన ప్రతీ విషయం నెట్టింట వైరల్గా మారుతోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోయోలా కాలేజ్ కౌంటింగ్ సెంటర్ నుండి అందుకున్న MLAగా గెలిచిన ధృవీకరణ పత్రం వైరల్ అయ్యింది. ఇపుడు విజయ్ పదో తరగతి మార్కుల వివరాలు సోషల్ మీడియాలో సందడిగామారాయి. ఒక సగటు విద్యార్థిగా ప్రారంభమైన విజయ్ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించడమే కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదగడం ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.మరోవైపు గురువారం ఉదయం 11.30 గంటలకు నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే ల మద్దతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ను కలిసేందుకు విజయ్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ ఇంకా రాలేదు.మనీ కంట్రోల్ నివేదిక, నెట్టింట హల్ చల్ చేస్తున్న 10వ తరగతి మార్కుల జాబితా (mark sheet) ప్రకారం చెన్నైలోని విరుగంబాక్కంలోని ఒక ప్రైమ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో విజయ్ చదువు కున్నారు. పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఆయన 1100 మార్కులకు గాను 711 సాధించారు. అంటే మార్కులు 65 శాతం మార్కులొచ్చాయన్నమాట. సబ్జెక్టుల వారీగా మార్కులుతమిళం: 200 మార్కులకు 155 (అత్యధిక మార్కులు)గణితం: 200 మార్కులకు 95.ఇంగ్లీష్: 200/133సైన్స్: 300 /206సోషల్ సైన్స్: 200/122పాఠశాల విద్య అనంతరం చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. సినిమాలపై మక్కువతో మధ్యలోనే కాలేజీ మానేసి నటన వైపు అడుగులు వేశారు. ఆ నిర్ణయమే ఆయన్ని కోలీవుడ్లో సూపర్ స్టార్గా నిలబెట్టింది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ప్రభంజనం దశాబ్దాల ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టి తమిళనాట ఘన విజయం సాధించారు. అత్యధిక మెజారీటీ సాధించిన ఏకైక పార్టీగా టీవీకే పార్టీని నిలబెట్టడం విశేషం. తిరుచిరాపల్లి ఈస్ట్ , పెరంబూర్ నియోజకవర్గాల్లో విజయ్ విజయం సాధించారు.
అల్లు అర్జున్ ఇంటికి పిలిచి తిట్టాడు : నందినిరెడ్డి
తనదైన శైలీలో సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది దర్శకురాలు నందిని రెడ్డి. తొలి సినిమా ‘అలా మొదలైంది’తోనే సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ నూతన దర్శకురాలిగా నంది అవార్డుని సైతం గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు నిరాశ పరిచినా.. ఓ బేబీ మూవీతో మళ్లీ భారీ విజయాన్ని అందుకుంది. అందులో ప్రధాన పాత్రలో నటించిన సమంతతో ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కించింది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. నందినిరెడ్డికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ఆమెను ఘోరంగా తిట్టాడని ఆ వార్త సారంశం. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా నందిని రెడ్డే చెప్పింది. బన్నీ ఎందుకు తిట్టాల్సి వచ్చింది? అసలేం జరిగింది?సినిమా ఫ్లాప్నందినిరెడ్డి దర్శకురాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్లో తన ప్రయాణం కొనసాగించింది. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి… రెండేళ్ల గ్యాప్ తీసుకొని ‘జబర్దస్త్’ అనే మూవీతో ప్రేక్షుకల ముందుకు వచ్చింది. సిద్ధార్థ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రం 2013లో విడుదలై..బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నందిని రెడ్డి కొన్నాళ్ల పాటు ఇంటి నుంచి బయటకే రాలేదట. దాదాపు మూడు నెలల వరకు ఇంట్లోనే ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో నందిని చెప్పింది. బన్నీ తిట్టాడు..అయితే ఈ విషయం తెలిసి అల్లు అర్జున ఆమెని తిట్టాడట. ‘ఓ రోజు అల్లు అర్జున్ ఇంటికి రమ్మని కబురు పంపాడు. నేను ఇంటికి వెళ్లగానే ఘోరంగా తిట్టాడు. ‘ఇచ్చింది ఒకటే ఫ్లాప్ ..దాని కోసం ఇంట్లో ముడుచుకొని కూర్చుంటారా? నెక్ట్స్ సినిమా ప్లాన్ ఏంటి? కథేంటి? అని అడిగితే.. నేను బిత్తరపోయా. అసలు స్టోరీ ఏదైనా రాశావా లేదా అని అడిగాడు. రాశానని చెప్పా. వెళ్లి తీసుకొని రా. వన్లైన ఆర్డర్ తీసుకురా. నాకు నెరేషన్ ఇవ్వు. నా ఓపీనియన్ చెబుతా’ అని అలా ఎంగరేజ్ చేశాడు. బన్నీ నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడూ ఎంగరేజ్ చేస్తుంటాడు’ అని నందిని రెడ్డి చెప్పుకొచ్చింది.
టీవీకే ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో బిగ్ ట్విస్ట్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులోకి ఉంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించడంతో టీవీకే మరో 10 మంది బలం కావాల్సి ఉంది. ఈ క్రమంలో పది మంది కోసం టీవీకే కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, అన్నాడీఎంకే లుకలుకలు మొదలైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి పార్టీలో చీలికలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం.. మరో వర్గం ఇవ్వొద్దని వాదించుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్.. విజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక, తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి లీమా గెలుపొందారు.అయితే, ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే.. విజయ్కు మద్దతు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై నేడు పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతానికి పళనిస్వామి.. ఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమై ఉన్నారు. అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూటమి నుంచి బయటకు వచ్చి పది మంది.. విజయ్కు మద్దతు ఇస్తారా? అనే చర్చ ఊపందుకుంది. నేడు జరగబోయే సమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు.. సీపీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో, వారంతా ఏ నిర్ణయం తీసుకోనున్నారనే సస్పెన్స్ నెలకొంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే మద్దతుపై విజయ్ ఏమాత్రం ఆసక్తిగా లేరనే వార్త కూడా ప్రచారంలో ఉంది. గతంలో జయలలిత టైంలో పలు చేదు అనుభవాలు దృష్ట్యా విజయ్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో ఉంది.
'థియేటర్లు ఇవ్వలేదు.. చిన్న సినిమాలను చంపేస్తున్నారు'
వామ్మో 500 కిలోల మొసలి... ఆరుగుర్ని మింగేసిందా?!
శృంగారంలో అపశృతి.. నాలుక కొరికిన మహిళ..!
ఇక ధోని కెరీర్ ముగిసినట్లే..!
వికటించిన పచ్చపార్టీ కుట్రలు
'అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు': కియోసాకి
500 మందిని తొలగించిన టెక్ కంపెనీ
‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’
సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..
విజయ్ గెలిచాక అన్ఫాలో చేశాడా?.. అసలు నిజమేంటి?
హీరో విజయ్ గెలుపు.. పవన్ కల్యాణ్పై ట్రోల్స్..!
మమతా బెనర్జీ, స్టాలిన్ ఓడింది దానివల్లే..?
ప్రేమజంటకు అంతిమ వీడ్కోలు
75 ఏళ్ల వయసులో ప్రభంజనం, ఎవరీ రంగస్వామి
ఇండియన్స్ నిజంగా గ్రేట్!
చేతులు మారుతున్న ‘ప్రపంచ ఆర్థిక శక్తి’.. కియోసాకి వైరల్ పోస్ట్
పాక్ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్మనీనా!
తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష
తమిళనాట టీవీకే ప్రభంజనం
తమిళనాట తలకిందులైన లెక్కలు
ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా సార్!
విజయ్ సీఎం.. డిప్యూటీ సీఎంగా త్రిష..!
టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నిక
కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
మమతా బెనర్జీ పార్టీని దెబ్బ తీసిన ‘ఎం’
46 దేశాలు పర్యటించా..కానీ భారత్ పర్యటన..!
ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి..
ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనప్రాప్తి
'థియేటర్లు ఇవ్వలేదు.. చిన్న సినిమాలను చంపేస్తున్నారు'
వామ్మో 500 కిలోల మొసలి... ఆరుగుర్ని మింగేసిందా?!
శృంగారంలో అపశృతి.. నాలుక కొరికిన మహిళ..!
ఇక ధోని కెరీర్ ముగిసినట్లే..!
వికటించిన పచ్చపార్టీ కుట్రలు
'అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు': కియోసాకి
500 మందిని తొలగించిన టెక్ కంపెనీ
‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’
సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..
విజయ్ గెలిచాక అన్ఫాలో చేశాడా?.. అసలు నిజమేంటి?
హీరో విజయ్ గెలుపు.. పవన్ కల్యాణ్పై ట్రోల్స్..!
మమతా బెనర్జీ, స్టాలిన్ ఓడింది దానివల్లే..?
ప్రేమజంటకు అంతిమ వీడ్కోలు
75 ఏళ్ల వయసులో ప్రభంజనం, ఎవరీ రంగస్వామి
ఇండియన్స్ నిజంగా గ్రేట్!
చేతులు మారుతున్న ‘ప్రపంచ ఆర్థిక శక్తి’.. కియోసాకి వైరల్ పోస్ట్
పాక్ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్మనీనా!
తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష
తమిళనాట టీవీకే ప్రభంజనం
తమిళనాట తలకిందులైన లెక్కలు
ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా సార్!
విజయ్ సీఎం.. డిప్యూటీ సీఎంగా త్రిష..!
టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నిక
కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
మమతా బెనర్జీ పార్టీని దెబ్బ తీసిన ‘ఎం’
46 దేశాలు పర్యటించా..కానీ భారత్ పర్యటన..!
ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి..
ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనప్రాప్తి
ఫొటోలు
బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
'టీవీకే' విజయ్ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)
తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)
శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)
హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్... ‘జూ’లకాలాటలలో పులి (ఫొటోలు)
సెల్ఫీ విత్ సీఎం విజయ్.. సోషల్ మీడియా షేక్ (ఫొటోలు)
మళ్లీ విజయం వేటలో..ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ (ఫొటోలు)
నిర్మాత ఆర్బీ చౌదరి నిర్మించిన తెలుగు సినిమాలివే (ఫోటోలు)
గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆటిజం చిన్నారులతో మీట్ (ఫోటోలు)
టాలీవుడ్ యాంకర్ అమూల్య నూతన గృహప్రవేశం (ఫొటోలు)
సినిమా
బాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్.. స్పెషలిస్ట్ ఎవరు?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీస్లో ఫ్రాంచైజీ సినిమాలు రూపొందుతున్నాయి. కానీ ఈ ట్రెండ్ బాలీవుడ్లో కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ఫ్రాంచైజీ సినిమాల సీక్వెల్స్తో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం సీక్వెల్ సినిమాలు చేస్తున్న బాలీవుడ్ సీక్వెల్ స్టార్స్ ఎవరు? ఆ సినిమాల ప్రజెంట్ స్టేటస్ ఏంటి? అనే అంశాలపై ఓ లుక్ వేయండి.. ముగ్గురు కాదు... నలుగురు ఇడియట్స్ హిందీ చిత్రం ‘త్రీ ఇడియట్స్’ ఎంతటి బ్లాక్బస్టర్ విజయం సాధించిందో తెలిసిందే. ఆమిర్ ఖాన్ హీరోగా ఆర్. మాధవన్, శర్మాన్ జోషి కీలక పాత్రల్లో రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందిన సెటైరికల్ కామెడీ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘త్రీ ఇడియట్స్’. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అధికారికంగా ప్రకటించారు. ‘త్రీ ఇడియట్స్’ సినిమా కథ సిద్ధమైందని, రాజ్కుమార్ హిరాణి ప్రజెంట్ స్క్రీన్ ప్లే కోసం వర్క్ చేస్తున్నారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమాను సెట్స్కు తీసుకువెళ్తామని ఆమిర్ ఖాన్ తెలిపారు. అలాగే ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ఉన్న కామెడీ ఈ సినిమా సీక్వెల్లోనూ ఉంటుందని, ప్రధాన పాత్రధారులందరూ ఆల్మోస్ట్ ఉంటారని ఆమిర్ పేర్కొన్నారు. అలాగే ‘త్రీ ఇడియట్స్’ కథ ముగిసిన పది సంవత్సరాల తర్వాత నుంచి సీక్వెల్ కథ ప్రారంభం అవుతుందని ఆమిర్ తెలిపారు. కాగా, ‘త్రీ ఇడియట్స్’ సినిమా సీక్వెల్కు ‘ఫోర్ ఇడియట్స్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలోని నాలుగో ప్రధాన పాత్రధారిగా విక్కీ కౌశల్ను ఎంపిక చేసుకున్నారట మేకర్స్. రాజ్కుమార్ హిరాణి డైరెక్షన్లో వచ్చిన గత చిత్రాలు ‘సంజు, డంకీ’ల్లో విక్కీ కౌశల్ కీ రోల్స్ చేశారు. తాజాగా ‘ఫోర్ ఇడియట్స్’ సినిమాలోనూ విక్కీ కౌశల్ నటించనున్నారని, ఆల్రెడీ కథ వినిపించగా, విక్కీ ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. 2027 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. పఠాన్ మళ్లీ వస్తున్నాడు! షారుక్ ఖాన్ కెరీర్లో రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ‘పఠాన్’ చిత్రం కూడా ఒకటి. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం, డింపుల్ క΄ాడియా, అశుతోష్ రాణా ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటించారు. యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2023లో రిలీజై, బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో అప్పట్నుంచే ఈ సినిమా సీక్వెల్ గురించిన వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల దుబాయ్లో జరిగిన ఓ ఈవెంట్లో ‘పఠాన్’ సినిమాకు సీక్వెల్గా ‘పఠాన్ 2’ రాబోతున్నట్లు షారుక్ ఖాన్ పరోక్షంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తోనే ‘కింగ్’ సినిమా చేస్తున్నారు షారుక్. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే ‘పఠాన్’ సినిమాను సెట్స్కు తీసుకుని వెళ్తారా? లేక మరో సినిమా తర్వాత, ‘పఠాన్ 2’ను టేకప్ చేస్తారా? అనేది చూడాలి. త్రిపాత్రాభినయం? బాలీవుడ్లో ‘క్రిష్’ ఫ్రాంచైజీ ఎంతటి సక్సెస్ఫుల్ సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి ‘క్రిష్ 4’ సినిమా రాబోతోంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే... ఈ చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమాకు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఆయన తండ్రి రాకేష్ రోషన్ పర్యవేక్షణ ఉంటుందట. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ నటించిన గత చిత్రం ‘వార్ 2’ బాక్సాఫీస్ అంచనాలు తారుమారు అయ్యాయి. దీంతో ‘క్రిష్ 4’ సినిమా సెట్స్కు వెళ్లడానికి కొంత సమయం పట్టేలా ఉంది. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ ‘క్రిష్ 4’లో హృతిక్ రోషన్ త్రి΄ాత్రాభినయం చేయనున్నారట. ప్రియాంకా చో్ర΄ా మరో లీడ్ రోల్లో నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. 2006లో వచ్చిన ‘క్రిష్’, 2013లో వచ్చిన ‘క్రిష్ 3’ సినిమాల్లో ప్రియాంకా చో్ర΄ా భాగమయ్యారు. మరి... ‘క్రిష్ 4’లో ప్రియాంక నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్తో హృతిక్ రోషన్ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమా చేసిన తర్వాత ‘క్రిష్ 4’ చిత్రాన్ని సెట్స్కు తీసుకుని వెళ్తారా? లేక, ముందే మెగాఫోన్ పడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఖల్ నాయక్ రిటర్న్స్ బలరామ్ భల్లు ప్రసాద్ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘ఖల్ నాయక్’ అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తారు సంజయ్ దత్. ఇప్పుడు ఈ ‘ఖల్ నాయక్’ ప్రస్తావన ఎందుకు అంటే... బలరామ్ భల్లుగా మళ్లీ సిల్వర్ స్క్రీన్పై కనిపించనున్నారు సంజయ్ దత్. అవును... మీరు ఊహించినది నిజమే. ‘ఖల్ నాయక్’ సినిమాకి సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్కు ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘ఖల్ నాయక్’ సినిమాకు సుభాస్ ఘాయ్ దర్శకత్వం వహించగా, ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ చిత్రానికి మాత్రం మరో దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. ఆ దర్శకుడు ఎవరు? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సీక్వెల్ కి మాత్రం సుభాష్ ఘాయ్ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారట అలాగే ‘ఖల్ నాయక్’ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన జాకీ ష్రాఫ్, మాధురి దీక్షిత్ సీక్వెల్లో మాత్రం గెస్ట్ రోల్స్ చేయనున్నారని బాలీవుడ్ సమాచారం. జియో స్టూడియోస్, అక్షా కాంబోజ్, సంజయ్ దత్ నిర్మించనున్న ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ చిత్రం వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. కొత్త డాన్ ఎవరు? బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై డాన్స్ అంటే అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్లు గుర్తొస్తారు. 1978లో వచ్చిన ‘డాన్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించగా, ఆ తర్వాత వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2’ (2011) చిత్రాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించారు. ఇవన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. కాగా ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2 (2011)’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫర్హాన్ అక్తర్ 2023లో ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. రణ్వీర్ సింగ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా అధికారిక అనౌన్స్మెంట్స్ వచ్చింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్కు వెళ్లలేదు. ఈ సినిమా విషయంలో రణ్వీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ల మధ్య అభి్ర΄ాయభేదాలు వచ్చాయనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఈ డిఫరెన్సెస్ సమసి΄ోయి, కొత్త డాన్గా రణ్వీర్సింగ్నే నటిస్తారా? లేక ఈ ప్లేస్ను మరో హీరో భర్తీ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కాస్త ఆలస్యమైనా ‘డాన్ 3’ సినిమా ఉంటుందని, ఇటీవల ఓ సందర్భంలో ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారన్న వార్తలు ఉన్నాయి. ట్రెండీ లవ్స్టోరీ ‘కాక్టెయిల్’ సీక్వెల్ ‘కాక్టెయిల్ 2’ సిద్ధమైంది. ‘కాక్టెయిల్’ సినిమాకు దర్శకత్వం వహించిన హోమి అడజానియానే, ‘కాక్ టెయిల్ 2’ సినిమాకూ దర్శకత్వం వహించారు. కానీ నటీనటులు మారారు. సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటీ ‘కాక్టెయిల్’ సినిమాలో లీడ్ రోల్స్ చేయగా, సీక్వెల్లో మాత్రం షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీ సనన్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. మోడ్రన్ లైఫ్స్టైల్, ట్రెండీ లవ్ రిలేషన్షిప్స్, యూత్ఫుల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. ‘కాక్టెయిల్ 2’ సినిమా మేజర్ షూటింగ్ను విదేశాల్లో చేశారు. ఇటలీలో ఎక్కవ చిత్రీకణ జరగింది. దినేష్ విజన్, లవ్రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది జూన్లో రిలీజ్ కానుంది. ప్రేమ... పెళ్లి... వినోదం వైవాహిక జీవితం సాఫీగా సాగినంతవరకూ అంతా బాగానే ఉంటుంది. అనివార్యమైన సమస్యలు వచ్చినప్పుడు అప్పటివరకూ సంతోషంగా ఉన్న దంపతుల జీవితాలు ఎలాంటి ఇరుకుల్లో పడతాయి? అనే కథాంశంతో రూ΄÷ందిన చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’. ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, వామికా గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. కార్తీక్ ఆర్యన్, అనన్య ΄ాండే, భూమి పెడ్నేకర్ నటించిన తొలి భాగం ‘పతీ పత్నీ ఔర్ వో’ (2019)కి దర్శకత్వం వహించిన ముదస్సర్ అజీజ్ సీక్వెల్ని కూడా తెరకెక్కించారు. నిజానికి 1978లో బీఆర్ చోప్రా దర్శకత్వంలో సంజీవ్ కుమార్, విద్యా సిన్హా, రంజితా కౌర్ ముఖ్య తారలుగా రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘పతీ పత్నీ ఔర్ దో’కి ఈ తొలి భాగం రీమేక్. ఇక... తాజాగా రూపొందిన సీక్వెల్ మార్చి 4న విడుదల కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో కాస్త జాప్యం జరగడంతో వాయిదా వేశారు. ప్రేమ, పెళ్లి, వినోదం నేపథ్యంలో రూ΄÷ందిన ‘పతీ పత్నీ ఔర్ వో దో’ని ఫైనల్లీ మే 15న విడుదల చేయాలనుకుంటున్నారు. సీక్వెల్ స్పెషలిస్ట్ బాలీవుడ్లో సీక్వెల్స్ అంటే అజయ్ దేవగన్ ప్రస్తావన ఉండకుండా ఉండదు. ఎందుకంటే... అజయ్దేవగన్ హీరోగా ఏదో ఒక సీక్వెల్ సినిమా సెట్స్పై ఉంటూనే ఉంటుంది. ‘సింగమ్, గోల్మాల్, ధమాల్, దృశ్యం’... ఈ నాలుగు ఫ్రాంచైజీ సినిమాల్లో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నారు. ‘సింగమ్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన తాజా సినిమా ‘సింగమ్ ఎగైన్’ 2024లో రిలీజైంది. ప్రస్తుతం ‘గోల్ మాల్, దృశ్యం 3’ సినిమాలు సెట్స్పై ఉండగా, ‘ధమాల్ 4’ సినిమా జూలైలో రిలీజ్కు సిద్ధమైంది. ఫుల్ నవ్వుల్తో నాలుగో ధమాల్ 2007లో ఆరంభమైంది నవ్వుల ధమాల్. ఇప్పటివరకూ మూడు దఫాలుగా నవ్వుల ధమాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు నాలుగోసారి ఫుల్ నవ్వుల్తో సిద్ధమైంది. ‘ధమాల్’ (2007) ఫస్ట్ పార్ట్ని స్వీయదర్శకత్వంలో రూపొందించారు ఇంద్రకుమార్. ఆ ఫస్ట్ పార్ట్లో సంజయ్ దత్, రితేష్, దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, ఆశిష్ చౌదరి, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా తదితరులు నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ‘డబుల్ ధమాల్’ (2011)లోనూ సంజయ్ దత్, రితేష్, దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, ఆశిష్ చౌదరి, జావేద్ జాఫ్రీ నటించారు. అలాగే మల్లికా శెరావత్, కంగనా రనౌత్ వంటి తారలు కూడా సీక్వెల్లో యాడ్ అయ్యారు. ఈ చిత్రం కూడా ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే రూ΄÷ంది, నవ్వులు పంచింది. ఆ తర్వాత ఇంకా నవ్విస్తా అంటూ మూడో భాగంగా ‘టోటల్ ధమాల్’ (2019)ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఇంద్రకుమార్. ఈ సీక్వెల్లోనూ రితేష్ దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ నటించారు. కానీ సంజయ్ దత్ నటించలేదు. అజయ్ దేవగణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ మూడో భాగం తారాగణంలో యాడ్ అయ్యారు. ఈ సినిమాకి అజయ్ దేవగన్ ఓ నిర్మాత కూడా. ఇక ఇప్పుడు ‘ధమాల్ 4’ అంటూ నాలుగో ధమాల్ సిద్ధమైంది. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. సంజయ్ దత్, అజయ్ దేవగన్, మాధవన్, రితేష్ దేశ్ముఖ్, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫ్రీ, రవి కిషన్ తదితరులు నటించారు. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ ఫుల్ కామెడీ మూవీని కూడా ఇంద్రకుమారే తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వాస్తవానికి మార్చిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ భారీ అంచనాల నడుమ విడుదలకు (మార్చి 19) సిద్ధమైన నేపథ్యంలో జూన్కి వాయిదా వేశారు. అయితే మరో భారీ సినిమా యశ్ ‘టాక్సిక్’ జూన్ 4న విడుదలకు సిద్ధం కావడంతో మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు ‘టాక్సిక్’ కూడా వాయిదా పడింది. ఫైనల్లీ ‘ధమాల్ 4’ని జూలై 3న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.ఊటీలో గోల్మాల్ ప్రస్తుతం ‘గోల్మాల్ 5’ సినిమా చిత్రీకరణ కోసం అజయ్ దేవగన్ అండ్ గ్యాంగ్ ఊటీలో ఉన్నారు. రోహిత్ శెట్టి డైరెక్షన్లోని ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా, అర్షద్ వార్షి, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ కేము ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ‘గోల్మాల్’ తొలి భాగంలో నటించిన శర్మాన్ జోషి, దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ‘గోల్మాల్ 5’లో భాగం అయ్యారు. ప్రస్తుతం ఊటీలో జరుగుతున్న షూటింగ్లో ΄ాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఈ ‘గోల్మాల్ 5’ సినిమా రిలీజ్ కానుంది.అక్టోబరులో దృశ్యం 3 ‘దృశ్యం’ అనగానే మనకు మలయాళంలో మోహన్లాల్ గుర్తొస్తారు. కానీ బాలీవుడ్ సినిమా లవర్స్కి అజయ్ దేవగన్ గుర్తుకు రావొచ్చు. ఎందుకంటే.. మలయాళ ‘దృశ్యం’ సినిమా ఫ్రాంచైజీ హిందీ రీమేక్స్లో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నారు. ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. మూడో భాగాన్ని అధికారికంగా ప్రకటించి, ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 2న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అభిషేక్ ΄ాతక్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే హిందీ ‘దృశ్యం 2’లో నటించిన అక్షయ్ ఖన్నా ΄ాత్రలో మూడో భాగంలో జయదీప్ కనిపిస్తారట. టబు, శ్రియ శరణ్, రజత్ కపూర్ ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్లు మరోమాట... మలయాళ ‘దృశ్యం 3’ సినిమా మే 21న రిలీజ్ కానుంది. తెలుగు ‘దృశ్యం 3’ మూవీలో వెంకటేశ్, మీనా నటిస్తారు. కానీ తెలుగు వెర్షన్ ఎప్పుడు సెట్స్కు వెళ్తుందనే విషయంపై క్లారిటీ రాలేదు. ఇంకా హారర్ మూవీ ‘సైతాన్’కు సీక్వెల్గా ‘సైతాన్ 2’ సినిమా చేయనున్నట్లుగా అజయ్ దేవగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సీక్వెల్ సినిమాలు చేస్తున్నారు కనుక అజయ్ దేవగన్ను సీక్వెల్ స్పెషలిస్ట్ అని సరదాగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాలతో పాటు కంగనా రనౌత్ ‘క్వీన్ 2’, ‘తుంబాడ్ 2’ వంటి మరికొన్ని హిందీ చిత్రాల సీక్వెల్స్ సెట్స్కు వెళ్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
బర్త్ డే బ్యూటీ.. ట్రెండింగ్ హీరోయిన్ని గుర్తుపట్టారా?
సాధారణంగా సినిమాలు హిట్ అయితే హీరోయిన్లకు క్రేజ్ వస్తుంది. కొన్నిసార్లు ఫలితంతో సంబంధం లేకుండా ఫ్లాప్స్ అందుకున్నా సరే కొందరు బ్యూటీస్ బాగానే గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ల ఈమె ఒకరు. మరో రెండు నెలల్లో ఈ భామ హీరోయిన్గా చేసిన మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)పైన మీసకట్టుతో తలపై కిరీటంతో కనిపిస్తున్న ఈ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ముంబైకి చెందిన ఈమె.. రవితేజ 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీనే ఘోరమైన డిజాస్టర్. అయినా సరే 'కింగ్డమ్', 'కాంత' లాంటి పాన్ ఇండియా మూవీస్లో అవకాశాలు అందుకుంది. కానీ ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. గతేడాది చివరలో వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలుకా' కూడా ఫ్లాప్ అయింది.ప్రస్తుతం భాగ్యశ్రీ చేస్తున్న తెలుగు సినిమా 'లెనిన్' మాత్రమే. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చితం.. జూన్ 26న థియేటర్లలోక రానుంది. ఇది హిట్ కావడం అఖిల్కి ఎంత ముఖ్యమో భాగ్యశ్రీకి కూడా అంతే కీలకం. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే తెలుగులో మరికొన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే పరిస్థితి కష్టమైపోవచ్చు. ఇకపోతే శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'సెయాన్' మూవీతో భాగ్యశ్రీ, తమిళంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఈమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్కి ఊహించని అవకాశం?)
మృణాల్ ఠాకుర్కి ఊహించని అవకాశం?
కొన్ని సినిమాలు అనుకున్న వెంటనే ప్రారంభం కావు. ఎందుకో ఎవరికీ అర్థం కాదు. తెలుగులో అలాంటి ఓ మూవీ ఉంది. నాని, నితిన్, శర్వానంద్ ఇలా పలువురు హీరోలు నటిస్తారని టాక్ వచ్చిన ఆ మూవీలో సాయిపల్లవి, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు లీడ్ రోల్ చేస్తారని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఊహించని విధంగా మృణాల్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ప్రాజెక్ట్ ఎక్కడివరకు వచ్చింది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)స్వతహాగా కమెడియన్ అయినప్పటికీ 'బలగం' మూవీతో దర్శకుడిగా మారిన వేణు బంపర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత 'యల్లమ్మ' పేరుతో ఓ మూవీ చేయాలి. రెండు మూడేళ్ల నుంచి దీని గురించి వినిపిస్తూనే ఉంది. కానీ ఎంతకీ ముందుకు కదలట్లేదు. అసలు ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందా లేదా అని చెప్పలేని పరిస్థితి.తొలుత ఈ సినిమాలో హీరోగా నాని చేస్తాడని రూమర్స్ వచ్చాయి. కానీ అతడు నో చెప్పడంతో నితిన్ లైన్లోకి వచ్చాడు. గతేడాది తన 'తమ్ముడు' మూవీ రిలీజ్ టైంలో జరిగిన ప్రమోషన్లలో నితిన్ దీని గురించి చెప్పాడు. కానీ 'తమ్ముడు' ఘోరమైన డిజాస్టర్ కావడంతో నితిన్ని సైడ్ చేశారు. తర్వాత శర్వానంద్ పేరు వినిపించింది. కట్ చేస్తే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ప్రకటించారు. ఓ వీడియోని కూడా రిలీజ్ చేసి షాకిచ్చారు.హీరో సెట్ అయ్యాడు గానీ హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. తొలుత సాయిపల్లవి అన్నారు. ఆమె సెట్ అవ్వలేదు. తర్వాత కీర్తి సురేశ్ పేరు వినిపించింది. ఈమె కూడా లేదని అన్నారు. తర్వాత ఒకరిద్దరూ ట్రెండింగ్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ పనవ్వలేదు. ఇప్పుడు మృణాల్ ఠాకుర్.. 'యల్లమ్మ'లో హీరోయిన్ అని అంటున్నారు. మరి ఈసారైనా రూమర్స్ నిజం చేస్తారా లేదా అనేది చూడాలి?మృణాల్ తెలుగులో ఫెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. సీతారామం, హాయ్ నాన్న తోపాటు గత నెలలో రిలీజైన 'డెకాయిట్'లోనూ మృణాల్ అదరగొట్టేసింది. ఒకవేళ ఈమె గనుక 'యల్లమ్మ'లో నటిస్తే ఎలా ఉంటుందో చూడాలి?(ఇదీ చదవండి: స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై అట్రాసిటీ కేసు)
తండ్రి మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో (వీడియో)
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బీ చౌదరి మృతి చెందిన విషయం తెలిసిందే. తన పూర్వీకుల ఊరు అయినటువంటి రాజస్థాన్లోని ఉదయ్పూర్ వెళుతుండగా మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. తండ్రి మరణవార్త విని ఆయన కుమారుడు, హీరో జీవా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రోడ్డు ప్రమాదం గురించి తన బంధువులతో ఫోన్లో మాట్లాడుతూ బోరున విలపించాడు. పరామర్శకు వచ్చిన వారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్బీ చౌదరికి నలుగురు కొడుకులు. జీవా అందరి కంటే చిన్నవాడు.పెద్ద కొడుకు జీవన్ తన వ్యాపారాలు చూసుకుంటున్నాడు. రెండో కొడుకు రమేశ్ నటుడుగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు.మూడో కొడుకు సురేశ్ కూడా నిర్మాణ రంగంలోనే ఉన్నాడు. జీవా ఒక్కడే పూర్తిస్థాయి నటుడిగా రాణిస్తున్నాడు. నాన్న అంటే అతనికి చాలా ఇష్టం. పలు సందర్భాల్లో నాన్నే తన రోల్ మోడల్ అని చెప్పాడు. కాగా, ఆర్బీ చౌదరి అంత్యక్రియలు రేపు చెన్నైలో జరుగుతాయి.ராஜஸ்தானில் கார் விப*தில் உயி**ழந்த தயாரிப்பாளர் ஆர்.பி.சௌத்ரி.. தந்தையின் மறைவால் மனமுடைந்து கண்ணீர் விட்டழுத நடிகர் ஜீவா.!#RBChaudary | #Jiiva | #PolimerNews pic.twitter.com/0IM5rugvvP— Polimer News (@polimernews) May 5, 2026
క్రీడలు
ఆ జట్టుకు భారీ షాక్.. ఒక్క మ్యాచ్కే ఐపీఎల్ నుంచి అవుట్?
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్కు ఏది కలిసి రావడం లేదు. వరుస ఓటములతో సతమతమవుతున్న లక్నోకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ మిగిలిన సీజన్కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా ఇంగ్లిష్ చేతి బోటన వేలికి గాయమైంది.దీంతో ఆట మధ్యలోనే అతడు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అయితే ఇంగ్లిష్కు తగిలిన గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జోష్ ఇంగ్లిష్ ఈ ఏడాది సీజన్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.అతడిని గతేడాది వేలంలో రూ. 8.60 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. కానీ అతడు వ్యక్తిగత కారణాల చేత ఫస్ట్ హాఫ్ సీజన్కు అందుబాటులో లేడు. ఇటీవల జట్టుతో కలిసిన జోష్.. ముంబై ఇండియన్స్తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఓపెనర్గా అతడిని ఎల్ఎస్జీ ప్రమోట్ చేసింది. కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అతడు ఔటయ్యాడు. ఇప్పుడు అతడు గాయపడడంతో ఆ స్ధానాన్ని ఆయూశ్ బదోనితో భర్తీ చేసే అవకాశముంది. ఇక ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్.. కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో ఉంది.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
'అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. అది మా అదృష్టం'
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత హోం టీమ్ ఢిల్లీని 155 పరుగులకే కట్టడి చేసిన సీఎస్కే.. అనంతరం లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలో చేధించింది. సీఎస్కే విజయంలో సంజూ శాంసన్(87 నాటౌట్), కార్తీక్ శర్మ(41) మరోసారి కీలక పాత్ర పోషించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు."గత ఏడాది కంటే ఈసారి మా జట్టు బలంగా ఉందని మేము ఆదిలోనే భావించాం. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి కీలక ఆటగాడు రావడంతో మా అన్ని విభాగాలు పటిష్టమయ్యాయి. మా మిడిలార్డర్ బ్యాటింగ్ కూడా బలంగా ఉంది. కార్తీక్ శర్మ యువ ఆటగాళ్లు రాణిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు మా బౌలింగ్ విభాగం నిలకడగా రాణిస్తోంది. అన్షుల్ కాంబోజ్, అకిల్, నూర్, ఓవర్టన్ వంటి బౌలర్లు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్లోనే అన్షుల్ విఫలమయ్యాడు. అందుకు అతడు బాధపడ్డాడు. అతడు బలంగా తిరిగి వస్తాడన్న నమ్మకం మాకు ఉంది. ఇక టోర్నీ ఆరంభంలో కాస్త తడబడ్డాం. మా ఊపును అందుకోవడానికి ఒక్క విజయం అవసరమైంది. మూడు మ్యాచ్ల తర్వాత మాకు మూమెంటమ్ లభించింది. ఆ తర్వాత నుంచి జట్టు మొత్తం సమిష్టిగా రాణించడం మొదలుపెట్టాము. సంజూ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచకప్లో అద్భుత ఫామ్ను కనబరిచిన సంజూ, ఇప్పుడు మా జట్టుకు వెన్నెముకలా మారాడు. అతను జట్టులో ఉండటం మా అదృష్టం. యంగ్ ప్లేయర్ కార్తీక్ శర్మలో కూడా అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిందంటూ ఏమి లేదు. అతడికి భారీ షాట్లతో పాటు స్ట్రైక్ను రొటేట్ చేస్తూ ఆడే సత్తా కూడా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గైక్వాడ్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
నితీష్ రాణా అవుట్ చుట్టూ రచ్చ? రూల్స్ ఏమి చెబుతున్నాయి?
ఐపీఎల్-2026 సీజన్లో మరో వివాదం చెలరేగింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణా ఔటైన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్లు పాథుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన లోకల్ బాయ్ నితీష్ రాణా ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ట్రిక్కీ వికెట్పై రాణా ఆచితూచి ఆడుతూ క్రీజులో పాతుకుపోయేలా కన్పించాడు. ఈ క్రమంలో ఢిల్లీ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్లో మూడో బంతికి స్వీప్ షాట్ ఆడబోయి డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్కు రానా చిక్కాడు. అయితే రాణా బంతిని షాట్ ఆడే క్రమంలో ఒక్కసారిగా వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో నితీష్ క్యాచ్ అవుట్ కాదు హిట్ వికెట్ అయ్యాడని అంతా భావించారు. కానీ రిప్లేలో చూస్తే బలమైన గాలులు కారణంగా బెయిల్స్ కింద పడిపోయినట్లు స్పష్టమైంది. అయితే స్టంప్స్ కింద పడిపోయాయి కాబట్టి బంతిని డెడ్ బాల్గా ప్రకటించాల్సిందని పలువురు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నాయి. ఇంతకి రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి పరిశీలిద్దాం.హిట్ వికెట్ కాదు..బ్యాటర్ షాట్ ఆడే క్రమంలో గానీ, పరుగు తీసే సమయంలో గానీ తన బ్యాట్తో లేదా శరీరంతో బెయిల్స్ను పడగొడితే హిట్ వికెట్గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో రాణా వికెట్లను తాకలేదు కాబట్టి ఇది హిట్ వికెట్ కాదు. మరోవైపు వికెట్ కీపర్ సంజూ శాంసన్ కారణంగా కూడా స్టంప్స్ పడలేదు. కేవలం గాలులు వల్లే స్టంప్స్ కిందపడిపోయాయి.డెడ్ బాల్ ఎప్పుడు ప్రకటిస్తారు?బ్యాటర్ దృష్టి మరల్చే విధంగా ఏదైనా అవాంతరం ఏర్పడినప్పుడు డెడ్బాల్గా అంపైర్గా ప్రకటిస్తారు. ఉదహరణకు బౌలర్ బంతిని వేసే క్రమంలో తన కర్చీఫ్ కింద పడటం లేదా తన చేతితో నాన్స్ట్రైకర్ ఎండ్లో బెయిల్స్ను పడగొడితే డెడ్ బాల్గా పరిగిణిస్తారు.అంతేకాకుండా బంతి డెలివరీ అయ్యే ఆఖరి క్షణంలో బ్యాటర్ పక్కకు తప్పుకొన్న డెడ్ బాల్గా ప్రకటిస్తారు. కానీ రాణా మాత్రం ఎలాంటి ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా షాట్ ఆడాడు. అంతేకాకుండా బౌలర్ బంతిని విసిరిన తర్వాత బెయిల్స్ పడిపోయాయి. అందుకే అంపైర్లు దాన్ని డెడ్ బాల్గా పరిగణించలేదు.When Nitish got Out,Sanju Disturbed The Wicket and bail fell offAny expert please tell will it be Out or not? pic.twitter.com/wUF9r0cODA— Stubbsy³⁰ (@sinha7605) May 5, 2026
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.156 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ బౌలర్లను సంజూ ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్లతో 87 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్కు గాను అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ సీజన్లో ఢిల్లీపై శాంసన్కు ఇది రెండో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కావడం విశేషం.ఇక ఈ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సంజూ సాధించిన రికార్డులు ఇవే👉19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్పై ఒకే సీజన్లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా శాంసన్ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో ఢిల్లీపై ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ కలిపి అతడు 202 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్లలోనూ సంజూ అజేయంగా నిలవడం గమానార్హం.👉అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో ఒకే జట్టుపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పిన తొలి బ్యాటర్గా సంజూ నిలిచాడు. ఈ ఏడాది ఐసీజన్ ఫస్ట్ హాఫ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో శాంసన్,ఆయుశ్ మాత్రేతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.👉ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్లో కార్తీక్ శర్మ (31 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి 3వ వికెట్కు 66 బంతుల్లో 114 పరుగులు అజేయ భాగస్వామ్యాన్ని జోడించాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఢిల్లీపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కానీ అతడు రెండు సీజన్లలో ఈ ఫీట్ సాధించాడు.👉ఒకే సీజన్లో ఒకే ప్రత్యర్థిపై 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్ సంజూనే కావడం విశేషం.చదవండి: హెచ్సీఏ ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా రాయుడు
న్యూస్ పాడ్కాస్ట్
సీఎంగా రాజీనామా ప్రసక్తే లేదు. తెగేసి చెప్పిన మమతా బెనర్జీ
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది.
అందరి చూపు బెంగాల్ పైనే.. పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడే ఓట్ల లెక్కింపు
సింగిల్ బిడ్కే సై.. ఏపీలో అస్మదీయ సంస్థకు పదేళ్లపాటు జీజీహెచ్ల్లో క్యాథ్ల్యాబ్ పీపీపీ సేవల కాంట్రాక్టు
త్వరలోనే పెట్రో బాదుడు..పెట్రోల్, డీజిల్పై లీటర్కు 5 రూపాయల దాకా పెంపు... వంట గ్యాస్ సిలిండర్పై మరో 50 రూపాయలు
అమరావతిలో అలంకరణలకు 3 వేల 338 కోట్ల రూపాయలు... ఏపీలో మరో గోల్మాల్కు రంగం సిద్ధం
పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ... తమిళనాడులో మళ్లీ స్టాలిన్ సర్కార్, కేరళలో కాంగ్రెస్ కూటమికే పట్టం... వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ఇక్కట్లకు కర్మ, కర్మ, క్రియ చంద్రబాబు ప్రభుత్వమే... రిటైల్ బంకుల నుంచి కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన డీజిల్ సరఫరా
ఏపీ, తెలంగాణలో ముదురుతున్న ఇంధన సంక్షోభం... బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం... వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దుండగుడి కాల్పులు
బిజినెస్
ప్రపంచంలోనే నిశ్శబ్ద ప్రాంతం అది..
టెక్ ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుసరించే ప్రశాంతమైన నాయకత్వ శైలి వెనుక ఉన్న రహస్యాన్ని రివీల్ చేశారు. దశాబ్దాల క్రితం హవాయి తీరంలో జరిగిన ఒక స్కూబా డైవింగ్ అనుభవం నేడు ప్రపంచ స్థాయి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఆయనకు ఒక దిశానిర్దేశక సూత్రంగా నిలుస్తున్నట్లు చెప్పారు.అలల గందరగోళం... అడుగున నిశ్శబ్దంచాలా ఏళ్ల క్రితం హవాయి తీరంలో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో పిచాయ్ అనుకోని చిక్కుల్లో పడ్డారు. సముద్రపు ఉపరితలంపై అలలు ఉధృతంగా ఉన్నాయి. నీటిలోకి దిగగానే సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వెనక్కి వెళ్లిపోవాలన్న ఆలోచన ఆయనకు కలిగిందట. అయితే, భయపడకుండా మరింత లోతుకు డైవ్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆయన జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందని ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘సముద్ర ఉపరితలంపై ఉన్న గందరగోళం, అలల వేగం అంతా కొన్ని అడుగుల లోతుకు వెళ్లేసరికి మాయమైపోయింది. అక్కడ అత్యంత ప్రశాంతమైన, నిశ్చలమైన వాతావరణాన్ని అనుభవించాను. ఆ క్షణం ఇంకా నా మదిలో నిక్షిప్తమై ఉంది’ అన్నారు.క్లిష్ట పరిస్థితుల్లో స్పష్టతతరువాతి కాలంలో ఆల్ఫాబెట్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన పిచాయ్ తన నాయకత్వ శైలి గురించి వివరిస్తూ తరచుగా ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటారు. గూగుల్ వంటి అతిపెద్ద సంస్థను నడపడం అంటే.. నిరంతరం మారుతున్న నిబంధనలు, కృత్రిమ మేధస్సు రంగంలో వస్తున్న పెను మార్పులు, ప్రపంచ ప్రభావం చూపే కీలక నిర్ణయాల మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ‘ఉపరితలంపై ఉండే గందరగోళానికి వెంటనే ప్రతిస్పందించడం కంటే, లోతుల్లోకి వెళ్లి స్పష్టతను వెతుక్కోవడం ముఖ్యం’ అని ఆయన విశ్వసిస్తారు. క్లిష్ట సమయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటిస్తూ దీర్ఘకాలిక ఫలితాలపై దృష్టి పెట్టడమే ఉత్తమమైన మార్గమని పిచాయ్ నిరూపించారు.సహకారంతో కూడిన నాయకత్వంసాంకేతిక రంగంలో చాలామంది దిగ్గజాలు దూకుడుగా, ఘర్షణాత్మక శైలిలో నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతుంటారు. కానీ, పిచాయ్ శైలి పూర్తిగా భిన్నమైనది. ఆయన నిర్ణయాల్లో సహకారం, అంతర్గత సమన్వయం స్పష్టంగా కనిపిస్తాయి.ప్రతి సవాలుకు ఆవేశంగా స్పందించడం కంటే, సంక్లిష్ట పరిస్థితుల్లో సమతుల్యతను కోల్పోకుండా ఉండటమే గొప్ప నాయకత్వ లక్షణమని పిచాయ్ భావిస్తారు.తక్షణ ప్రయోజనాల కోసం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయడం ఆల్ఫాబెట్ వృద్ధికి దోహదపడింది.అనిశ్చితి నెలకొన్న సమయంలో నాయకుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మొత్తం సంస్థ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని ఆయన నమ్ముతారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని తగ్గించొచ్చు
దేశ జీడీపీ వృద్ధి రేటు బలంగా ఉండడంతోపాటు స్థిరమైన ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని, నియంత్రిత శ్రేణిని ఆర్బీఐ తగ్గించొచ్చని డిప్యూటీ గవర్నర్ (డీజీ) పూనమ్ గుప్తా తెలిపారు. అంతర్జాతీయ అనుభవాల ఆధారంగా చూస్తే కొంత తక్కువ లక్ష్యాన్ని, మరింత పరిమిత శ్రేణిని నిర్ణయించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ గత ఆరేళ్ల కాలంలో మాదిరి అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఇక మీదటా కొనసాగితే అది సౌలభ్యతను, స్పష్టతను తగ్గించొచ్చన్నారు.ఆర్బీఐతో సంప్రదింపుల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2031 మార్చి 31 వరకు ఐదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా.. ప్రతికూల పరిస్థితుల్లో కనిష్టంగా 2 శాతం, గరిష్టంగా 6 శాతం (ప్లస్, మైనస్ 2 శాతం) మించకుండా చూడాలని నిర్దేశించడం గమనార్హం. ఎన్సీఏఈఆర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఈ లక్ష్యం, పరిమిత శ్రేణిని మార్చడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. ధరల నియంత్రణ, వృద్ధి రేటుపైనే భవిష్యత్తు ద్రవ్యోల్బణం కార్యాచరణ ఆధారపడి ఉంటుందన్నారు. ఇందుకు అంతర్జాతీయ షాక్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.ఆర్బీఐ డీజీగా జైన్ బాధ్యతలు స్వీకరణనలుగురు డీజీలకు పోర్ట్ఫోలియోల కేటాయింపుఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా (డీజీ) రోహిత్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఫారెక్స్, ఫిన్టెక్ సహా 10 విభాగాలను ఆయన పర్యవేక్షించనున్నారు. టి.రవి శంకర్ స్థానంలో జైన్ నియమితులయ్యారు. ఇంతకుముందు వరకు ఆయన ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. మూడేళ్ల కాలానికి డీజీగా జైన్ను ప్రభుత్వం నియమించింది. 1991లో ఆయన ఆర్బీఐలో చేరడం గమనార్హం. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (ఫైనాన్స్), ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఎంకామ్ కోర్సులను పూర్తి చేశారు. అందరిలోకి సీనియర్ డీజీ అయిన స్వామినాథన్ జానకీరామన్ 11 విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఇందులో న్యాయ, డీఐసీజీసీ, తనిఖీ తదితర విభాగాలున్నాయి. అలాగే, సమన్వయ వ్యవహరాలను కూడా ఆయనే చూడనున్నారు. మానిటరీ పాలసీ నిర్వహణ సహా ఆరు విభాగాలను పూనమ్ గుప్తా పర్యేవేక్షిస్తారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
భారత్ వృద్ధికి యుద్ధం బ్రేక్
పశ్చిమాసియా ఘర్షణలతో నౌకల రవాణాకు అటంకాలు, ఇంధన ధరల పెరుగుదల భారత జీడీపీ వృద్ధికి జోరుకు అవరోధాలు కలి్పంచొచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.5 శాతంలోపునకు తగ్గిపోవచ్చని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన ఇంధన సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధితోపాటు భారత్ వృద్ధికీ అతిపెద్ద రిస్క్గా పేర్కొన్నారు. ఒకవేళ సకాలంలో పరిష్కారమైతే అప్పుడు వృద్ధి పుంజుకుంటుందన్నారు. అప్పుడు 6.5–7 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది 6.5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చన్నారు.పశ్చిమాసియా సంక్షోభం పరిష్కారమయ్యేంత వరకు జీడీపీపై, వడ్డీ రేట్లపై ఒక నిర్ణయాత్మక అభిప్రాయానికి రాలేమన్నారు. చమురు ధరలు అధిక స్థాయిల్లో (100 డాలర్లకు పైన) ఉంటే, అది వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందన్నారు. కాకపోతే గత 10–12 ఏళ్లలో ఏవో కొన్ని సందర్భాలను మినహాయిస్తే దాదాపు చమురు ధరలు కనిష్టాల్లోనే ఉన్నాయంటూ.. అది దేశ వృద్ధికి సాయపడినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.6 శాతంగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు..వడ్డీ రేట్లు సమీప కాలంలో కిందకు దిగొచ్చే పరిస్థితుల్లేవని రాజీవ్ మెమానీ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలకు మద్దతుగా లక్ష్యిత చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా రుణసాయం విషయంలో సమస్యలున్నట్టు చెప్పారు. వ్యాపార సులభతర నిర్వహణ, చిన్న తప్పులను నేరాలుగా చూడకపోవడం, న్యాయ సంస్కరణల విషయంలో వేగవంతమైన చర్యలు అవసరమన్నారు. ఈ దిశగా గత 12–18 నెలల్లో పభుత్వం చేసిన కృషిని అభినందించారు. వివాదాల సంఖ్యను సాధ్యమైనంత తగ్గించాలని, పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని మెమానీ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి సీఐఐ సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. వృద్ధి 6.3 శాతమే: ఏడీబీపశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ముఖ్య ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ అంచనా వేశారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకుంటుందన్నారు. 2025–26లో భారత్ జీడీపీ బలంగా 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, 2027–28లో 7.3 శాతానికి పుంజుకుంటుందని.. 2026–27లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఏడీబీ ఏప్రిల్లో అంచనాలు ప్రకటించడం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం ఏప్రిల్ అంచనా కంటే 2.4 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి చేరుకోవచ్చని పార్క్ తెలిపారు. చమురు, గ్యాస్ కోసం దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేశారు.ఎల్నినో ప్రభావంఎల్నినో ప్రభావంపై మాట్లాడుతూ.. భారత్లో సాగుపై ప్రభావం పడినప్పుడల్లా ధరల పరమైన సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో పెద్ద వాటా కలిగి ఉన్నందున, భారత్లో సాగుకు ఇబ్బందులు ఏర్పడితే ప్రపంచ దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోవడం వల్ల రైతులు తక్కువగా వినియోగిస్తారని.. దీంతో దిగుమతి తగ్గి ఆ తర్వాత ఆహార లభ్యత తగ్గుతుందన్నారు. ధరలపై దీని ప్రభావం కచి్చతంగా ఉంటుందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లడం, ఇతర ఇంధన వనరుల దిగుతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం అవసరమన్నారు. అయితే భారత్లో ఎన్నో సంస్కరణలు కొనసాగుతున్నాయంటూ, వృద్ధి అవకాశాలు దీర్ఘకాలానికి ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నట్టు పార్క్ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) మెరుగుపడతాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సాయపడతాయన్నారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
ఏఐ, డ్రోన్లో ముందుంటాం
పేరు మాత్రమే కాదు. బిజినెస్ తీరునే మార్చుకుని ఆధునిక డ్రోన్, క్లౌడ్– ఏఐ సర్వేలెన్స్ రంగాల్లో వడివడిగా అడుగులేస్తున్న మగెలానిక్ క్లౌడ్ది నిన్నటిదాకా స్టోరీనే. ఇపుడు ఆ స్టోరీ కార్యాచరణలోకి వస్తోంది. తాజాగా రైల్వే సహా పలు బ్యాంకింగ్ సంస్థల నుంచి సర్వేలెన్స్ కాంట్రాక్టులు దక్కించుకుంది. డ్రోన్ల తయారీలోకి ప్రవేశించాక డిఫెన్స్ నుంచీ కాంట్రాక్టులు దక్కాయి. తమ ప్రణాళికలు పూర్తిగా ఆచరణలోకి రావటానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చంటున్న కంపెనీ సీఎండీ జోసెఫ్ సుదీర్(జో)తో ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలివీ... (రమణమూర్తి మంథా)మీ బిజినెస్ వర్టికల్స్లో ఆదాయం పరంగా ముందున్నవేంటి?ఇప్పుడైతే స్టాఫింగ్, ఐటీ సేవలనేవి మొదటి వరుసలో నిలుస్తాయి. ఏఐ–ఇన్నోవేషన్పై ఫోకస్ చేస్తుంది. ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ను రూపొందిస్తున్నాం. రెవెన్యూ పరంగా దీనిదిపుడు రెండో స్థానం. డ్రోన్ తయారీలోకి కూడా ప్రవేశించాం. లాజిస్టిక్స్, డిఫెన్స్, కమర్షియల్ సర్వీసుల కోసం కస్టమైజ్డ్ డ్రోన్లను రూపొందిస్తున్నాం. ఇపుడైతే రెవెన్యూలో ఇది చివర్లో ఉంది. కానీ వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ ఆర్డర్ పూర్తిగా మారుతుంది. మరి ఇలా మారటానికి ఇపుడేం చేస్తున్నారు?ఇప్పుడున్న దశలో ఏది ఏ స్థాయిలో అమలవుతోందో పూర్తి వివరాలు చెప్పలేను. కానీ డైరెక్షన్ క్లియర్గా ఉంది. రెవెన్యూ పనితీరు మెరుగుపరుచుకోవటంపై ఫోకస్ పెట్టాం. గడిచిన మూడు త్రైమాసికాలుగా వృద్ధికి ఒక బేస్ను తయారు చేసుకున్నాం. నంబర్స్ మాత్రం ఇపుడు చెప్పలేను. సరే! ఇప్పుడు మీ డ్రోన్ బిజినెస్ ఏ స్థాయిలో ఉంది?దీనికి సంబంధించి 15–20 కోట్ల ఆర్డర్బుక్ ఉంది. ప్రధానంగా లాజిస్టిక్స్ రంగానివే. డిజైన్ నుంచి ఏఐ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, డిప్లాయిమెంట్ వరకూ మేమే చేస్తున్నాం. అవసరాన్ని బట్టి డెలివరీకి 30–45 రోజుల నుంచి మూడు నెలల వరకూ పడుతుంది. డ్రోన్ల తయారీలోకి చాలామంది వస్తున్నారు కదా!. మీ స్పెషాలిటీ ఏంటి?మేం 200 కిలోల వరకూ పేలోడ్ను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్లను తయారు చేస్తున్నాం. అవరోధాల్ని దాటుకుని ఆటో ల్యాండింగ్ కావటం... జీపీఎస్ లేకున్నా లక్ష్యాన్ని చేరటం... ఎల్రక్టానిక్ వార్ఫేర్ను తట్టుకోగలగటం ఈ డ్రోన్ల ప్రత్యేకత. సిగ్నల్ జామ్ అయిన సందర్భాల్లో సైతం ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇంటర్నల్ నేవిగేషన్ వ్యవస్థల్ని ఉపయోగించుకుని పనిచేయటం వీటి స్పెషాలిటీ.మీ రెవెన్యూలో రికరింగ్ ఎక్కువా? లేకుంటే ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్కువా?దాదాపు 70–80 శాతం రెవెన్యూ రికరింగ్ రూపంలోనే వస్తోంది. ఇవన్నీ 3–5 ఏళ్ల దీర్ఘకాలిక కాంట్రాక్టులు. వీటివల్ల స్థిరత్వం వస్తోంది. మీ ఆర్డర్ బుక్, భవిష్యత్ వృద్ధిని వివరంగా చెబుతారా?ఈ మధ్య మేం దాదాపుగా రూ.250 కోట్ల రైల్వే కాంట్రాక్టులు దక్కించుకున్నాం. వీటిలో 10 శాతాన్ని ఇప్పటిదాకా పూర్తిచేశాం. భవిష్యత్ను దీన్నిబట్టే ఊహించొచ్చు. ప్రస్తుత మార్గాల ద్వారా రెవెన్యూలో 20 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.మీ బిజినెస్లో అంతర్జాతీయ వాటా ఎంత?గతేడాది మేం రూ.600 కోట్ల రెవెన్యూ సాధించాం. దీన్లో రూ.400 కోట్లు అంతర్జాతీయ మార్కెట్ల నుంచే వచ్చింది. దీన్లో అత్యధికం అమెరికా నుంచే వచ్చింది. అంతర్జాతీయ క్లయింట్లలో డేటా సెంటర్లు ప్రధానం. వీటికి డేటా ఇంజినీరింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందిస్తున్నాం. మీ వ్యాపారంలో ఏఐ పాత్ర ఎంతవరకూ ఉంది?అన్నిటికీ ఏఐనే ప్రధానం. ఉదాహరణకు.. బ్యాంకింగ్, ఏటీఎంలకు ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ అందిస్తున్నాం. ఆటోమేటెడ్ సర్వేలెన్స్ వ్యవస్థల్లో... రియల్టైమ్లో అలెర్ట్లు పంపటంలో... ఇంప్రూవ్మెంట్లో అన్నింట్లో ఏఐ ఉంటుంది. డ్రోన్స్, ఐటీ, సర్వేలెన్స్ ఇలా మా వెర్టికల్స్ అన్నింటా ఏఐ తప్పనిసరి. మీరు ఈ మధ్య కొన్ని కంపెనీల్ని టేకోవర్ చేశారు కదా? ఫండింగ్ ఎలా?ఎక్కువ భాగం ఫండింగ్ అంతర్గత వనరుల నుంచే సమీకరించుకున్నాం. 2023–24లో మాత్రమే కొంత మూలధనం సమీకరించాం. మొత్తంగా చూస్తే బలమైన క్యాష్ ఫ్లో నుంచే ఫండింగ్ చేస్తున్నాం. ఇటీవల డ్రోన్లకు రూ.60 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.40 కోట్లు, బ్యాంకింగ్– పీఎస్యూ ప్రాజెక్టుల కోసం రూ.100 కోట్లు కేటాయించాం. కంపెనీ వృద్ధికి సంబంధించి ఇన్వెస్టర్లు ఏం ఆశించొచ్చు?గతేడాది 600 కోట్ల రెవెన్యూ ఉంది. ఈ ఏడాది రూ.850 కోట్లకు చేరుకోవచ్చు. వచ్చే ఏడాది వెయ్యి కోట్లు దాటాలని లక్ష్యిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో 30–50 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. సేవల కంపెనీ నుంచి ప్లాట్ఫామ్ ఆధారిత, ఏఐ ఆధారిత వ్యాపారంగా ఎదుగుతున్నాం కనక ఇన్వెస్టర్లు కూడా మంచి వృద్ధిని ఆశించొచ్చు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
ఫ్యామిలీ
సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి మొత్తం 107 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ ఫిట్నెస్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఉండాలంటే..ఆరోగ్యపట్ల ఎలాంటి స్ప్రుహతో వ్యవహరించాలి వంటి వాటి గురించి విజయ్ ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ వెల్లడించారు. ఆయనతో ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవంతోపాటు..ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయంటూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. అంతటి స్టార్డమ్ ఉన్నా..ఆరోగ్యం పట్ల విజయ్ వ్యవహరించే తీరు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దామా..!.సెట్లో విజయ్తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ..ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్..విజయ్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే కాకుండా..తెర వెనుక కూడా చాలా నిబద్దతతో వ్యవహరించే ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయన ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండటమేగాక, అత్యంత నిలకడగా చేస్తుంటారని అన్నారు. ఆయనతో పనిచేయడం ఒక మరుపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆయన ఎంతటి బిజీ షెడ్యూల్లో గడుపుతున్నప్పటికీ..తన ఆరోగ్యాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఎంతటి విరామంలేని స్థితిని కూడా ఆయన చాలా చాకచక్యంగా సమతుల్యం చేసుకుంటారని, అదే ఆయన ప్రత్యేకత అని చెబుతున్నారు. సమయ నిర్వహణ నుంచి శారీరక దృఢత్వం కాపాడుకోవడం, శక్తిమంతమైన ప్రదర్శనలు ఇవ్వడం వరకు ప్రతిదీ నిశబ్దమైన ఏకాగ్రతతో చేస్తారని కుమార్ తెలిపారు. ఎంతటి హడావిడి రాజకీయ ర్యాలీలలోనైనా, ఆయన తన భోజనాన్ని తానే తీసుకువెళ్లేవారని అన్నారు. బయటి ఆహారానికి చాలా దూరంగా ఉంటారని చెప్పారు. ఆయనలో సాధారణ స్థాయిని మించిన క్రమశిక్షణను స్పష్టంగా చూడొచ్చని చెబుతున్నాడు. 51 ఏళ్ల వయసులోనూ యువ హీరోలను తలదన్నేలా ఉండే ఆయన ఫిజిక్కి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే అంటూ పొగడ్తలజల్లు కురిపించారు. అంతేగాదు విజయ్ క్షణం తీరక లేని ఒత్తిడితో కూడిన పరిస్థితిని సైక్లింగ్, జిమ్ సెషన్లు, రన్నింగ్ వంటి మార్గాలతో చిల్ అవుతారని చెప్పుకొచ్చారు. పైగా విజయ్కి ఇప్పటి వరకు మోకాలి లేదా నడుము నొప్పి వంటి సమస్యలు కూడా లేవన్నారు. ముఖ్యంగా విజయ్ వినయం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని, అదే ఆయనకు ఇంతలా ప్రజాదరణ తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని సమాన గౌరవంతో చూస్తారు, అదే అయన మార్క్ని స్పెషల్గా చూపించడమే గాక..విక్టరీకి కేరాఫ్గా నిలిచేలా చేసిందని అంటున్నారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా అంచనాలకు అందని విజయ్ ఘన విజయం యాదృచ్ఛికంగా వచ్చిందికాదని, ఆయన అంకితభావం, ఏకాగ్రత, అభిరుచి ఫలితంగా వచ్చిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. అంతేగాదు క్రమశిక్షణ అనే పునాదిపై నిర్మించబడిన విజయంగా పేర్కొన్నారు. అలాగే ఏ రంగంలోనైనా తూచా తప్పకుండా నిలకడతో వ్యవహరిస్తే..విజయం తథ్యమని అందుకు దళపతి, తమినాడు సీఎం విజయ్నే నిదర్శనమని అన్నారు. (చదవండి: హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..)
పిల్లల పొలం బడి
మీరెప్పుడైనా పచ్చని పంట పొలాల దగ్గరకి వెళ్లారా? వ్యవసాయం గురించి ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగితే... మీలాంటి పిల్లలలో చాలామంది చెప్పే జవాబు...‘వెళ్లలేదు’... ‘తెలియదు’ పాలు ఎక్కడినుంచి వస్తాయి? ఒక అమ్మాయిని ఎవరో అడిగారట... ‘పాలు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని! దానికి ఆ పాప... ‘టెట్రా ప్యాక్లో నుంచి వస్తాయి’ అని చెప్పిందట!ఇది విన్న ఆ పాప తండ్రి కిరుబ శంకర్ ఆశ్చర్యపోయారు. కిరుబ శంకర్ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పుడు ఆయనకు పంటపొలాలు మరో స్కూల్. స్కూల్ అయిపోగానే అక్కడికి పరుగెత్తుకు వెళ్లేవాడు. గొర్రెలతో, మేకలతో ఆడుకునేవాడు. అతడికి చిన్నప్పటి నుంచి వ్యవసాయం గురించి చాలా విషయాలు తెలుసు.వెల్కమ్ టు వక్సాన ఫార్మ్స్మరేమో, మీ తరం పిల్లల విషయానికి వస్తే... చాలా మందికి వ్యవసాయం గురించి బొత్తిగా తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శంకర్ అంకుల్ తమిళనాడులోని రెట్టనై గ్రామంలో మీలాంటి పిల్లల కోసం వ్యవసాయ ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. పద్నాలుగు ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రం (వక్సాన ఫార్మ్స్)లోకి మీరు అడుగుపెడితే వ్యవసాయం గురించి సమస్త విషయాలు తెలుసుకోవచ్చు. ‘వక్సాన’ అంటే పచ్చదనంతో నిండిన సారవంతమైన భూమి అని అర్థం.ఎంచక్కా... విత్తనాలు నాటవచ్చు, పొలం దున్నవచ్చు...‘వక్సాన ఫార్మ్స్’లో పంటలు, రకరకకాల చెట్లు, జంతువులు, కాలువలు... ఎన్నో ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకోవచ్చు. పొలంలోనే మధ్యాహ్నం భోజనం వడ్డిస్తారు. భోజనం తరువాత కొద్దిసేపు విశ్రాంతి. ఆ తరువాత జంతుప్రపంచంలోకి తీసుకువెళతారు. అక్కడ గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటె... మొదలైన వాటితో పాటు బాతులు, హంసలు, టర్కీలు ఉంటాయి.‘జంతువులు, వ్యవసాయం వేరు కాదు’ అంటూ వ్యవసాయ ప్రపంచంలో జంతువుల ప్రాముఖ్యం, కష్టం గురించి తెలియజేస్తారు. మీలాంటి పిల్లలకు ఇప్పుడు ఈ ‘ఫార్మ్ క్యాంప్’ ఫెవరెట్ స్పాట్ అయింది. ఈ ‘ఫార్మ్స్ క్యాంప్’లో మీరు ఒక రోజు పూర్తిగా గడపవచ్చు.పొలం దున్నడం, సాగు కోసం భూమిని ఎలా సిద్ధం చేస్తారో తెలుసుకోవడం, విత్తనాలు నాటడం, కలుపు తీయడం, ట్రాక్టర్ సవారీలు... ఇలా ఎన్నో ఉంటాయి. ఈ పనులన్నీ మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎద్దులను ఉపయోగించి చేసే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కూడా మీకు ఇక్కడ పరిచయం చేస్తారు. ఆధునిక వ్యవసాయానికి, ఒకప్పటికి వ్యవసాయానికి తేడా ఏమిటో వివరంగా చెబుతారు. పిల్లలు వాటికి ఆహారం పెడతారు. వాటి ప్రవర్తనను దగ్గరి నుంచి గమనిస్తారు. పొలం పనులకు అవి ఎలా ఉపయోగపడుతాయో ప్రత్యక్షంగా చూస్తారు.రాత్రి ఆరు బయట భోజనం... ఆ తరువాత కథలుసాయంత్రం కావడానికి ముందు పొలానికి దగ్గరలోని చెరువులో పిల్లలు ఈత కొడతారు. పంపు సెట్ల కింద స్నానం చేస్తారు. పొలాల్లో నడుస్తూ, కూరగాయలు కోసి రాత్రి భోజనానికి ఏమి వండాలో చెబుతారు. తల్లిదండ్రులు, అక్కడ ఉన్నవారితో కలిసి వంట చేస్తారు. రాత్రి భోజనాన్ని ఆరుబయట వడ్డిస్తారు. ఆ తరువాత మంట చుట్టూ చేరి కథలు చెప్పుకుంటారు. ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీలాంటి పిల్లలు రైతు జీవితాన్ని గడపవచ్చు. మీరు ఒకరోజు పొలంలో పనిచేయడం వల్ల వ్యవసాయం గురించి మాత్రమే కాదు పర్యావరణం గురించి కూడా తెలుసుకోవచ్చు. బంబరం, తాయంబాస్, కిట్టి పుల్, ఉరియడిలాంటి సంప్రదాయ గ్రామీణ ఆటలను, వ్యాయామాలను పరిచయం చేస్తారు. ‘పిల్లలు భవిష్యత్లో తల్లిదండ్రులవుతారు. వారు ఇక్కడ పొందిన అనుభవం వారి భవిష్యత్కు బాగా ఉపయోగపడుతుంది’ అంటున్నారు కిరుబ శంకర్.24 గంటలుప్రతి క్యాంపులో పదిమంది పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఫార్మ్క్యాంప్లో ఏప్రిల్, మే నెలలో క్యాంప్లు నిర్వహిస్తారు. మేలో జరిగేవి... 9–10 మే, 16–17 మే, 30–31 మే. కార్యక్రమాలు శనివారం ఉదయం పదిగంటల నుండి ఆదివారం ఉదయం పది గంటల వరకు జరుగుతాయి.vaksanafarms.in/special/summer-camp/– యాకూబ్
నోబెల్ రేసులో 'రియల్లైఫ్ ప్యాడ్మ్యాన్' అరుణాచలం
'ప్యాడ్మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన సామాజిక పారిశ్రామికవేత్త అరుణాచలం మురుగనంతం, 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినీగా ఎంపికయ్యారు. ఆ విషయాన్ని అరుణాచలం స్వయంగా తెలిపారు. అసలు మొదట తాను దీన్ని నమ్మలేకపోయానని అన్నారు. నిజానికి నోబెల్ బహుమతికి, మనమే మన పేరును లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను గానీ పంపడం సాధ్యం కాదన్నారు. అది తప్పనిసరిగా థర్డ్ సోర్స్ ద్వారానే జరుగుతుందని చెప్పారు. పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆసుపత్రి డీన్, అక్కడ పనిచేస్తున్న అమెరికన్ బృందాలు నోబెల్ కోసం నా పేరును ప్రతిపాదించారు... 24 గంటల్లోపే అది ఆమోదించబడినట్లు తెలిపారు. అంతేగాదు ప్రతిష్టాత్మకమైన ఈ నోబెల్ శాంతి బహుమతికి నామినీగా తాను ఎంపిక అయ్యినందుకు ఎంతగానో గర్వపడుతున్నాను అని అరుణాచలం మురుగనంతం పేర్కొన్నారు.అరుణాచలం మురుగనంతం స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు. ఆయన ఒక సామాజిక కార్యకర్త. దేశంలోని గ్రామీణ మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్లను పరిచయం చేశారు. రుతుస్రావం సమయంలో వాడే శానిటరీ న్యాప్కిన్లపై మహిళలకు అవగాహన పెంచేందుకు కృషి చేయడమే గాక దానిపై ఉన్న అపోహలను మహిళల్లో తొలగించేందుకు తన జీవితాన్ని దారబోశారు. అందుకే అరుణాచలం 'ప్యాడ్మ్యాన్'గా పాపులర్ అయ్యారు. కాగా, అరుణాచలం మురుగనంతం చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయన్ను 2016లో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాదు ఆయన జీవితం ఆధారంగా 'ప్యాడ్మ్యాన్' పేరిట బాలీవుడ్ మూవీ కూడా తెరకెక్కింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్ బల్కీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.కాగా, 2026 నోబెల్ శాంతి బహుమతికి 287 మంది అభ్యర్థులు నామినేట్ అయ్యారు. వీరిలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. కాగా 2026 నోబెల్ శాంతి బహుమతిని ఈ ఏడాది అక్టోబరు 9న ప్రకటించనున్నారు. డిసెంబరు 10న ఓస్లాలో ఈ పీజ్ ప్రైజ్ను ప్రదానం చేస్తారు. ఈ నోబెల్ పీజ్ ప్రైజ్ నామినేషన్ల సమర్పణ గడువు ఈ ఏడాది జనవరి 31నే ముగిసింది.#WATCH | Coimbatore, Tamil Nadu | Social entrepreneur Arunachalam Muruganantham, who is famously known as the 'Padman,' has been listed as a nominee for the 2026 Nobel Peace Prize.He says, "I couldn't believe it at first... For the Nobel Prize, you can not submit your name, nor… pic.twitter.com/unHNj0tSrF— ANI (@ANI) May 3, 2026 (చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..)
ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..
MEIL గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన భారతీయ వ్యాపారవేత్త, హైదరాబాదీ సుధా రెడ్డి, న్యూయార్క్లో జరిగే మెట్ గాలా2026లో మెరవనున్నారు. ఆమె మెట్ గాలాలో ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఏడాది మెట్ గాలా సుమారు 400 ప్రత్యేకమైన కళాత్మక వస్తువులతో.. ఏకంగా ఐదువేల ఏళ్ల నాటి శైలిని చాటిచెప్పే 'కాస్ట్యూమ్ ఆర్ట్' ప్రదర్శనను ఇతివృత్తంగా "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" అనే డ్రెస్ కోడ్ను ఎంచుకుంది. ఈ మెట్గాలా కార్యక్రమంలో పాల్గొనే అతిరథమహులంతా తమ దుస్తులను సజీవ కళాఖండాలుగా కనిపించేలా మానవ శరీరం, కళాత్మక వ్యక్తీకరణ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని ప్రతిబింబించాలని ఆశిస్తోంది. గతంలో సుధా ప్రఖ్యాత భారతీయ డిజైనర్లు ఫల్గుణి షేన్ పీకాక్, తరుణ్ తాహిలియాని రూపొందించిన అద్భుతమైన దుస్తులను ధరించారు. ఈ ఏడాది ఫ్యాషన్ను ఒక కళారూపంగా పరిగణించే ఇతివృత్తం నేపథ్యంలో ఆమె సబ్యసాచి ముఖర్జీ లేదా మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖ భారతీయులతో కలిసి పనిచేయనున్నట్లు అంతరంగిక వర్గాల సమాచారం. పారిస్ ఒలింపిక్స్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వంటి అనేక ఉన్నత స్థాయి అంతర్జాతీయ కార్యక్రమాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బిజీగా ఉండే ఆమె ఈ ఏడాది న్యూయార్క్లో జరగనున్న గాలా ఈవెంట్ల్ భారత్కి ప్రాతినిథ్యం వహించనున్నారు.ఇక సుధా అందం, దాతృత్వ పరంగా ఆమెకు సాటిరారెవ్వరూ. ఆమె మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)లో డైరెక్టర్గా ఉన్నారు. అలాగే సుధా రెడ్డి ఫౌండేషన్కు కూడా నాయకత్వం వహిస్తున్నారు, దీని ద్వారా ఆమె స్వచ్ఛంద ప్రాజెక్టులు, సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం వంటివి చేస్తుంటారు.ఆమె ఎవరంటే..సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆమె 2024 మెట్ గాలాలో 200 క్యారెట్లకు పైగా వజ్రాలు ధరించి వార్తల్లో నిలవడమే కాదు రెడ్ కార్పెట్పై తన ఉనికిని చాటిచెప్పేలా ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షించారు.ఆమె పుట్టి పెరిగింది విజయవాడలోనే. 19 ఏళ్లకే కృష్ణారెడ్డిని వివాహం చేసుకున్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం తమ బంధానికి సహాయపడిందని, తామిద్దరూ కలిసే పెరిగామని రెడ్డి గతంలో చెప్పారు.2026, మే 4, సోమవారం నాడు జరగనున్న మెట్ గాలా, ఈ ఈవెంట్లో అత్యధిక తారలు పాల్గొనే కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది సహ-అధ్యక్షులుగా బియాన్స్, నికోల్ కిడ్మన్, వీనస్ విలియమ్స్ ఉండగా, జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ బెజోస్ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక వేడుక,. ఇది కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం. దీనిని ప్రతి ఏడాది మే మొదటి సోమవారం నిర్వహిస్తారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official) (చదవండి: హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..)
అంతర్జాతీయం
అమెరికా KC-135 స్ట్రాటోట్యాంకర్ అదృశ్యం
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధన కేంద్రంగా పనిచేసే బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఆచూకీ గల్లంతయ్యింది.ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ విమానం ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా సంకేతాలు నిలిచిపోయాయి. అదృశ్యానికి ముందు ‘7700’ అనే అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది.విమానాన్ని పర్షియన్ గల్ఫ్ మీదుగా కొనసాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ల్యాండింగ్కు ముందు కొంతసేపు గాలిలో వృత్తాకారంలో తిరిగినట్లు ట్రాకింగ్ డేటా తెలిపింది. అత్యవసర పరిస్థితికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై ఇరాన్ మీడియా సంస్థ ఫార్స్ వార్తా సంస్థ ఈ ఘటనపై నివేదిక ఇచ్చింది. అయితే, అమెరికా విమానం అదృశ్యానికి ఇరాన్ ప్రమేయం ఉందని ఎలాంటి ప్రకటన చేయలేదు.
అటు మోదీ, ఇటు విజయ్.. ప్రపంచ మీడియా ఫిదా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యూయార్క్ నుంచి లండన్ వరకు, ఇస్లామాబాద్ నుంచి ఢాకా వరకు అంతర్జాతీయ మీడియా పత్రికలన్నీ భారత్లో చోటుచేసుకున్న ఈ రాజకీయ పెనుమార్పులనే పతాక శీర్షికలుగా ప్రచురించాయి. తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ‘టీవీకే’ సృష్టించిన రాజకీయ సునామీ సైతం పాశ్చాత్య పత్రికల దృష్టిని ఆకర్షించింది.బెంగాల్లో కమల వికాసం.. బ్రిటన్ మీడియా ఆశ్చర్యంప్రతిపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ను మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకోవడంపై బీబీసీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మోదీ 12 ఏళ్ల పాలనలో తూర్పు భారతావనిలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటని ఆ పత్రిక కొనియాడింది. మరోవైపు ‘ది గార్డియన్’ పత్రిక సైతం ఈ పరిణామం భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషించింది. ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని పేర్కొంది.అమెరికా పత్రికల్లో మోదీ, విజయ్ సంచలనాలుఅమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక బీజేపీ బెంగాల్ గెలుపును ‘చరిత్రాత్మకం’గా అభివర్ణించింది. హిందూ జాతీయవాదులు ప్రతిపక్షాల ప్రధాన కోటను బద్దలు కొట్టారని పేర్కొంది. తమిళనాడులో రాజకీయ ఓనమాలు కూడా తెలియని సినీ నటుడు జోసెఫ్ విజయ్ (టీవీకే).. డీఎంకే లాంటి బలమైన పార్టీలను మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మోదీ మూడో విడత పాలనలో ఈ ఘన విజయాలు ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో విశ్లేషించింది.పాక్, బంగ్లాదేశ్ మీడియాలోనూ..భారత ఎన్నికల ఫలితాల ప్రకంపనలు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలోనూ కనిపించాయి. పాక్ పత్రిక ‘డాన్’.. ప్రతిపక్షాల కోటను జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని పేర్కొంది. ఈ గెలుపు 2029 ఎన్నికల నాటికి మోదీని మరింత శక్తివంతంగా మారుస్తుందని తెలిపింది. అటు బంగ్లాదేశ్ పత్రిక ‘ఢాకా ట్రిబ్యూన్’ సైతం బెంగాల్ ఫలితాలతో పాటు, తమిళనాడులో రాజకీయ ఉద్ధండుడు ఎంకే స్టాలిన్ను వెనక్కి నెట్టి, విజయ్ పార్టీ అఖండ విజయం సాధించడాన్ని రాజకీయ సంచలనంగా వర్ణించింది.ఇది కూడా చదవండి: లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి..
చైనాలో భారీ పేలుడు: 21 మంది మృతి
హునాన్: చైనాలోని హునాన్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. గ్వాండు టౌన్షిప్లోని ‘లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్’కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా, 60 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం
వైట్హౌస్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: వైట్హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వాషింగ్టన్ మాన్యూమెంట్ సమీపంలో తుపాకీతో అనుమానాస్పద వ్యక్తి హల్చల్ చేశాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను చూసిన నిందితుడు కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో అనుమానితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల ఘటనలో ఓ బాలుడు కూడా గాయపడ్డాడు.తుపాకీ కాల్పులు జరగడానికి కొద్ది నిమిషాల ముందు.. వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల గస్తీ తిరుగుతున్న సీక్రెట్ సర్వీస్ అధికారులు,ఏజెంట్లు తుపాకీని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్న ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించారని యూఎస్ఎస్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ మాట్ క్విన్ మీడియా సమావేశంలో చెప్పారు. యూనిఫాంలో ఉన్న సీక్రెట్ సర్వీస్ పోలీసులు ఆ వ్యక్తిని సమీపించగా.. అతను పారిపోతూ అధికారులపై కాల్పులు జరిపారని క్విన్ తెలిపారు. అధికారులు ఎదురుకాల్పులు జరపడంతో ఆ వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి.సదరు వ్యక్తి అంతకుముందు సోమవారం వైట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు మేరీల్యాండ్కు చెందిన శ్వేత జాతీయుడిగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. కాగా, నిందితుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని.. స్వల్ప గాయంతో బయటపడ్డారని డీసీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాన్వాయ్ ఆ ప్రాంతం మీదగా వెళ్ళింది.కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోని ఈస్ట్ రూమ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. అధ్యక్షుడు ట్రంప్కు ఎలాంటి ముప్పు లేదని.. ఈ ఘటనకు వైట్ హౌస్తో సంబంధం ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని క్విన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ జరిగిన హోటల్ వద్ద కాల్పుల ఘటన జరిగిన రెండు వారాల లోపే ఈ రెండో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
జాతీయం
సురేష్ గోపి ఎఫెక్ట్: లక్షల ఓట్లు ఆవిరి?
త్రిస్సూర్: కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘సురేష్ గోపి ఎఫెక్ట్’ రెండేళ్లకే కనుమరుగైంది. 2024లో త్రిస్సూర్లో బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఆ స్టార్ డమ్, 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏకంగా రెండు లక్షల ఓట్ల పతనానికి దారితీసింది. 2024 సాధారణ ఎన్నికల్లో త్రిస్సూర్లో బీజేపీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అంతకు ముందు యూడీఎఫ్ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్కు ఉన్న 93 వేల ఓట్ల మెజారిటీని తలకిందులు చేసి, ఏకంగా 74 వేల పైచిలుకు మెజారిటీతో సురేష్ గోపి విజయం సాధించారు.రాష్ట్రంలో బీజేపీకి ఎదురైన ఎన్నో ఓటముల తర్వాత తన ఇమేజ్తో కేరళ రాజకీయాల్లో సురేష్ గోపి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుని, ఎన్డీఏకు ఘన విజయాన్ని అందించారు. కానీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ‘మంచి రోజులు’ ఎంతో కాలం నిలవలేదు. పదవిలోకి వచ్చిన కొద్ది కాలానికే సురేష్ గోపి ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఆయన నోటి దురుసు, ప్రజలతో వ్యవహరించే తీరు ఓటర్లతో పాటు సొంత పార్టీ వర్గాలను కూడా తీవ్రంగా నిరాశపరిచాయనే ఆరోపణలున్నాయి.గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునేందుకు చేపట్టిన ‘కాలుంక్ డిబేట్’లో సహాయం కోసం వచ్చిన ఓ వృద్ధుడిని ఆయన అవమానించారనే ఆరోపణలు పార్టీకి తీవ్ర నష్టం చేశాయి. అలాగే మధ్యతరగతి విద్యావంతులను ఆకర్షించేందుకు తెచ్చిన ‘ఎస్జీ కాఫీ టైమ్స్’ కార్యక్రమం కూడా పూర్తిగా విఫలమై, ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. తాజా ఎన్నికల గణాంకాలు ఎన్డీఏ పతనానికి అద్దం పడుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో 5,55,007 ఓట్లు (37.8%) సాధించి శిఖరాగ్రాన నిలిచిన బీజేపీ, 2025 స్థానిక సంస్థల ఎన్నికల నాటికి 3,96,808 ఓట్లకు పడిపోయింది. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికలు ముగిసే సరికి ఆ ఓట్ బ్యాంక్ 3,55,757 కి దిగజారింది. అంటే కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా రెండు లక్షల ఓట్లు గల్లంతయ్యాయి.ఇది కూడా చదవండి: బాంబు పేలుళ్లు.. దద్దరిల్లిన జలంధర్, అమృత్సర్
పత్తి దిగుబడి పెంపుకోసం రూ.5,659 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో పత్తి పంట దిగుబడి పెంపుకోసం ఐదేళ్లపాటు అమలయ్యే మిషన్కు రూ.5,695.22 కోట్లు కేటాయించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోది సారథ్యంలో భేటీ అయిన కేబినెట్ 2026–27 నుంచి 2030–31 కాలంలో అమలయ్యే ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’కింద ఈ మొత్తం వెచి్చంచాలని నిర్ణయించింది. దేశంలో పండే పత్తిలో నాణ్యత తగ్గడంతోపాటు దిగబడి క్రమంగా తగ్గిపోతుండటం వంటి సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వెచి్చస్తారంది. వ్యాధులు, చీడపీడలను తట్టుకునే, అధిక దిగుబడులనిచ్చే వంగడాలను అభివృద్ధి పర్చడం, ప్రస్తుతమున్న సాంకేతికతను మరింత విస్తృతం చేయడం ఈ మిషన్ లక్ష్యాలని ప్రభుత్వం తెలిపింది. దీనితో దేశంలోని 32 లక్షల మందికి లబ్ధి కలుగనుందని పేర్కొంది.చెరకు కనీస ధర పెంపు అక్టోబర్ నుంచి మొదలయ్యే 2026–27 సీజన్కుగాను చెరకు కనీస ధరను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ)ని క్వింటాలుకు రూ.10 చొప్పున రూ.365కి పెంచేందుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. తాజాగా ఆమోదించిన ఎఫ్ఆర్పీ 2025–26 సీజన్ ధర క్వింటాల్కు రూ.355 కంటే 2.81 శాతం ఎక్కువని ఆయన వివరించారు. మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతులకు రక్షణగా 10.25 శాతం రికవరీ రేటు ఆధారంగానే క్వింటాలకు ధర రూ.365 ఉంటుందని తెలిపారు. ఇది ప్రస్తుత 2025–26 సీజన్ ధర రూ.355 కంటే 2.81 శాతం అధికమని చెప్పారు. ఒకవేళ రికవరీ రేటు 10.25 శాతం కంటే ప్రతి 0.1 శాతం పెరిగితే, క్వింటాల్కు అదనంగా రూ.3.56 చెల్లిస్తారన్నారు. 9.5 శాతం కంటే తక్కువ రికవరీ ఉన్న మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, వారికి ఎటువంటి కోత విధించకుండా క్వింటాల్కు రూ. 338.30 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. 2026– 27లో చెరకు ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.182 చొప్పున ఉంటుందన్న అంచనా ప్రాతిపదికన ఎఫ్ఆర్పీ100.5 శాతంగా నిర్ణయించామని చెప్పారు. దీనివల్ల రైతులకు అదనంగా రూ.లక్ష కోట్ల మేర లాభం చేకూరనుందని వివరించారు.
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళా వైభవం
ఘనంగా మెట్ గాలా 2026 న్యూఢిల్లీ: ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మెట్ గాలా 2026’వేడుక న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ ఏడాది ‘కాస్ట్యూమ్ ఆర్ట్’థీమ్తో జరిగిన ఈ వేడుకలో, భారతీయ ప్రముఖులు తమ సంప్రదాయ కళా వైభవాన్ని, ఆధునిక ఫ్యాషన్ను జోడించి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. వేడుకలో ప్రత్యేక ఆకర్షణలు గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తుల్లో ఇషా అంబానీ మెరిసిపోయారు. అజంతా కుడ్య చిత్రాల స్ఫూర్తితో రూపొందిన ఈ గౌను, వజ్రాలు, విలువైన రత్నాలతో పొదిగి ఉంది. ఈ దుస్తుల తయారీకి 1,200 గంటల శ్రమ, 50 మందికి పైగా కళాకారులు పనిచేశారు. మెట్ గాలా అరంగేట్రం చేసిన దర్శకుడు కరణ్ జోహార్, ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ పెయింటింగ్స్ స్ఫూర్తితో రూపొందించిన ‘ఫ్రేమ్డ్ ఇన్ ఎటరి్నటీ’కాస్ట్యూమ్ ధరించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ అద్భుతమైన జాకెట్ తయారీకి సుమారు 5,600 గంటల సమయం పట్టింది. హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త సుధా రెడ్డి, 15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.125 కోట్లు) విలువైన చారిత్రక నెక్లెస్తో అందరి దృష్టిని ఆకర్షించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన నేవీ బ్లూ వెల్వెట్ లెహంగా ఆమెకు రాజసాన్ని తెచ్చిపెట్టింది. నటాషా పూనావాలా ‘ఆర్కిడ్ పెక్టోరల్’శిల్పాన్ని ధరించి వినూత్నంగా కనిపించగా, అనన్య బిర్లా స్టెయిన్లెస్ స్టీల్ మాస్్కతో, జైపూర్ రాజవంశీయులు గౌరవి కుమారి, సవాయ్ పద్మనాభ్ సింగ్ సంప్రదాయ దుస్తుల్లో రాజసం ఉట్టిపడేలా మెరిశారు. నేపథ్యం, వివాదాలు మెట్ గాలా అనేది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ నిధుల సేకరణ కోసం ఏటా నిర్వహించే అతిపెద్ద వేడుక. అయితే, ఈ ఏడాది ఈ వేడుక కొంత వివాదానికి కూడా దారి తీసింది. అమెజాన్ సంస్థాధినేత జెఫ్ బెజోస్, ఆయన భార్య లారెన్ బెజోస్ ఈ ఏడాదికి గౌరవ సహాధ్యక్షులుగా, ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి.
బాంబు పేలుళ్లు.. దద్దరిల్లిన జలంధర్, అమృత్సర్
అమృత్సర్: జంట పేలుళ్లతో పంజాబ్ ఉలిక్కిపడింది. మంగళవారం రాత్రి జలంధర్, అమృత్సర్ నగరాల్లో చోటుచేసుకున్న బాంబు పేలుళ్లు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ముఖ్యంగా జలంధర్లోని అత్యంత రద్దీగా ఉండే బీఎస్ఎఫ్ చౌక్ సమీపంలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు స్థానికులను, భద్రతా బలగాలను బెంబేలెత్తించేలా ఉన్నాయి.సీసీటీవీలో రికార్డైన దృశ్యాలుదర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్న సీసీటీవీ ఫుటేజీలో రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక స్కూటర్ సమీపంలోనే ఈ పేలుడు సంభవించినట్లు స్పష్టంగా రికార్డ్ అయ్యింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆ స్కూటర్ను పార్క్ చేసిన కొన్ని క్షణాల్లోనే, భారీ శబ్దంతో పేలుడు జరగడం, శిథిలాలు గాల్లోకి ఎగిరిపడటం ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆ స్కూటర్ను ఎవరు తీసుకువచ్చారు? పేలుడు పదార్థం ఏమిటి? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.అమృత్సర్లో మరో పేలుడుజలంధర్ పేలుడు ఘటనపై పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతుండగానే, అమృత్సర్లో మరో పేలుడు సంభవించడం భద్రతా సంస్థలను ఉరుకులు పరుగులు పెట్టించింది. పరిస్థితుల తీవ్రతను దృష్ట్యా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు, భారీ ఎత్తున పోలీసు బలగాలను ఈ రెండు ప్రాంతాలకు తరలించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.సరిహద్దు రాష్ట్రంలో భద్రతపై ఆందోళనఅతి తక్కువ వ్యవధిలోనే ఇలా వరుసగా పేలుళ్లు జరగడం సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తగా అదనపు భద్రతా బలగాలను మోహరించారు. అయితే, ప్రజలెవరూ భయాందోళనలకు గురికావొద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.దుశ్చర్య వెనుక ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీజలంధర్లోని బీఎస్ఎఫ్ పంజాబ్ హెడ్క్వార్టర్స్ వెలుపల జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత ‘ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ (కేఎల్ఏ) ప్రకటించుకుంది. ఫిబ్రవరిలో గురుదాస్పూర్ జిల్లాలో పంజాబ్ పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాది రంజిత్ సింగ్ మృతికి ప్రతీకారంగానే జలంధర్లో ఐఈడీ పేలుడుకు పాల్పడినట్లు కేఎల్ఏ ఒక లేఖ ద్వారా స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటనను అధికార వర్గాలు తోసిపుచ్చాయి. ఆ ఉగ్రవాద సంస్థ చెప్పిన ప్రాణనష్టం గణాంకాలు అవాస్తవమని స్పష్టం చేశాయి. CCTV footage of the Jalandhar scooty blast outside BSF HQ. https://t.co/qBSvKJL2RO pic.twitter.com/cwCTkgq79V— Elite Predators (@elitepredatorss) May 5, 2026
ఎన్ఆర్ఐ
ఇరాన్లోని భారతీయులకు అత్యవసర హెచ్చరికలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్లోని భారతీయుల కోసం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఇరాన్ను వీడాలంటూ బుధవారం మరో ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా భారతీయులు ఇరాన్ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి రాయబార కార్యాలయం ద్వారా స్పష్టం చేసింది. అయితే ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారానే బయటపడాలని.. ఎలాంటి సమాచారం లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదంటూ అందులో కీలక సూచన చేసింది. మరిన్ని వివరాల కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని చెబుతూ.. +989128109115; +989128109109; +989128109102; +989932179359 హెల్ప్లైన్ నెంబర్లతో పాటు cons.tehran@mea.gov.in మెయిల్ ఐడీని సంప్రదించాలని తెలిపింది. రెండు వారాల యుద్ధ విరమణ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్లు స్పష్టమవుతోంది. ఇంతకు ముందు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఇరాన్లోని భారతీయుల క్షేమసమాచారాలను కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి విదేశాంగ శాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటోంది.
టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
జపాన్లోని టోక్యో నగరం నిషిఓజిమ(Nishiojima) వేదికగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తాజ్ - తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (TAJ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్థానిక తెలుగు ప్రజలు, భారతీయ కమ్యూనిటీ భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులందరూ అత్యంత భక్తితో ఈ పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. పూజా కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేకంగా ప్రసాద వితరణ, సంప్రదాయబద్ధమైన భోజన ఏర్పాట్లు చేశారు. విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ, మన పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ భోజన కార్యక్రమం సాగింది.టోక్యో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారందరూ ఒకచోట చేరి ఈ వేడుకను జరుపుకోవడం విశేషం. మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తాజ్ (TAJ) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సుదూర తీరంలో ఉంటూ శ్రీరామనవమి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించినందుకు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన తాజ్ ప్రతినిధులకు, స్వచ్ఛంద సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ)
ప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు
వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలలో భాగంగా, ఈ పరాభవ నామ సంవత్సర ఉగాదికి వివిధ దేశాల తెలుగు సంస్థలనుండి సాంస్కృతిక కళారంగ విభాగాలలో విభిన్న సేవలు అందిస్తున్నవారికి "వంశీ సీల్వెల్ ప్రవాస భారతీయ ఉగాది పురస్కారాలు" ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందజేశారు.ప్రముఖ సినీ నటులు డా.రాజేంద్ర ప్రసాద్, నటీమణులు సంగీత, మంజుభార్గవి, దర్శకులు రేలంగి నరసింహారావు, సినీకవి వనమాలి,ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, వివిధ రంగాల కళాకారులు కూడా ఈ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలతో వేదికపై సత్కరించారు.వంశీ వేదికపై 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ ప్రధాన కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడికి "సభా భారతి" బిరుదు, సంస్థ సభ్యులైన యడవల్లి శేషు కుమారి శాస్త్రీయ సంగీతంలోనూ, తంగిరాల సౌభాగ్యలక్ష్మి లలిత సంగీత రంగంలోనూ, పావని చిలువేరు సాహిత్య రంగంలోను ఉగాది పురస్కారాలను అందుకోవడం తమకెంతో గర్వకారణమని సింగపూర్ నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ పురస్కార గ్రహీతలను అభినందించారు. యూకే నుండి డా. బాబురావు చౌదరి చాపరాల & భారతి దంపతులు, హాంకాంగ్ నుండి జయ పీసపాటి, ఖతార్ నుండి సాహిత్య జ్యోత్స్న కొలిపాక, యూఏఈ నుండి శ్రీకాంత్ చిత్తర్వు, శ్రీనివాస లింగం, సౌదీ అరేబియా నుండి కొనేరు ఉమామహేశ్వరరావు, అనిల్ కుమార్ కడించెర్ల, అమెరికా నుండి శ్రీనివాస్ గూడూరు, వాణి దిట్టకవి, జయరాం ఎర్రమిల్లి తదితరులు కూడా ఈ పురస్కారాలను అందుకున్నారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డా.కె వి రమణాచారి ఐఏయస్, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం హెడ్ కామేశ్వరి, డా. వంశీ రామరాజు ,ఇతర అతిథుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఘనంగా శంకర నేత్రాలయ 'మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్'
కొలంబస్, ఓహియోలోని హయాట్స్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో శంకర నేత్రాలయ USA “మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది తొలి కార్యక్రమంగా నిర్వహించిన ఈ ఈవెంట్కు దాదాపు 400 మంది కమ్యూనిటీ సభ్యులు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని పేద ప్రజలకు కంటి శస్త్రచికిత్సలు అందించే “అడాప్ట్-ఎ-విలేజ్” ప్రోగ్రామ్కు మద్దతు లభించింది.మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సేవ, కళ, సామాజిక బాధ్యతల సమ్మేళనం స్పష్టంగా కనిపించింది. ప్రారంభ ప్రసంగంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు అమర్ ఏమిరెడ్డి మాట్లాడుతూ, “కొలంబస్ నగరం సేవా భావంలో ముందుంటుంది. ఈ రోజు మనం కలిసి అనేక మందికి కంటి వెలుగు అందించే లక్ష్యంతో ఒకటయ్యాం” అని అన్నారు. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి మాట్లాడుతూ, “సంస్థ వాలంటీర్లకు శక్తినిస్తుంది. కొలంబస్ చాప్టర్ అందిస్తున్న మద్దతు మా సేవా లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్తోంది” అని తెలిపారు.నృత్య ప్రదర్శనల కళా వేదిక ప్రారంభ ప్రసంగాల అనంతరం ట్రినయనీ ఆర్ట్స్, సాయి నృత్య సంగం, మయాజ్ మస్తి డ్యాన్స్ అకాడమీ, శ్రీ వెంకటేశ్వర డ్యాన్స్ ఇనిస్టిట్యూట్, నాట్యాలయం డ్యాన్స్ స్కూల్, సాయి ఆర్ట్ గ్రూప్, స్టైల్ ఎన్ గ్రేస్ వంటి సంస్థల నుంచివచ్చిన కళాకారులు అద్భుత నృత్య ప్రదర్శనలు అందించారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు, సినీ నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమం చివరలో కంటి చూపు ప్రాముఖ్యతను తెలియజేసే నాటిక, రజనీకాంత్ అనంతోజి నేతృత్వంలో జరిగిన గ్రాండ్ ఫినాలే అందరినీ ఆకట్టుకుంది. చెన్నైకు చెందిన ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ గాయకుడు రాము, గాయని అంజనా సౌమ్య తమ మధుర గానంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. భక్తి గీతాలు, ప్రముఖ సినిమాల ఫ్యూజన్ పాటలను సమన్వయంతో ఆలపిస్తూ, నలుపు-తెలుపు యుగం నుంచి రంగుల యుగం వరకు విస్తరించిన సంగీతాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.శంకర నేత్రాలయ USA బ్రాండ్ అంబాసిడర్, బోర్డ్ అడ్వైజర్ ప్రసాద్ రెడ్డి కాటం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, “కంటి చూపును తిరిగి ఇవ్వడం అనేది గౌరవం, ఆశను పునరుద్ధరించే మహత్తర సేవ” అని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కళాకారులు, వాలంటీర్లు, నిర్వాహకులు అందరూ నెలల తరబడి కృషి చేశారు. వేదిక వెనుక పనిచేసిన SNUSA కొలంబస్ టీమ్ ప్రతీ అంశాన్ని సమగ్రంగా ప్రణాళిక చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. సుష్ ఉప్పుటూరి, రోహిత్ మండల ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. ముఖ్యంగా అమర్ ఏమిరెడ్డి, ఆర్కే రెడ్డి, రాజా బొమ్మన నాయకత్వంలోని కొలంబస్ కోర్ టీమ్తో పాటు సుష్ ఉప్పుటూరి, రోహిత్ మండల, రామకృష్ణ కసర్ల, గంగరాజు బేతిన, విజయ్ సుంకాడ్, యెల్లా రెడ్డి చిట్టి, శ్రీని పడాల, వెంకట్ దురిపాల, భూపేష్ మద్దు, శంకర్ రావుల, రంగనాథ్, స్వాతి మద్దు, మహిత మద్దు, నికిత పడాల, శ్రికా దురిపాల, మహేష్ వెలిడండి, రాజ్ ముద్దాన, వినయ్, శరందీప్, వంశీ నిమ్మ, విష్ణు తూముల, శ్యామ్ దుద్దెల, లోహిత్ సాయి బురుగుపల్లి, రిషిత్ బేతిన, కీర్తన్ ముద్దాన తదితర వాలంటీర్లు విశేషంగా సేవలందించారు.స్థానిక కమ్యూనిటీ నాయకులు, సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు అందించారు. అలాగే ట్రెజరర్ మూర్తి రేకపల్లి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు డా. రెడ్డి ఉరిమిండి, ఆది మొర్రెడ్డి, మహిళా కమిటీ చైర్ రేఖా రెడ్డి ప్రత్యేక సహకారం అందించారు. అలాగేఎస్వీ ఆచార్య, డా. సురేంద్రన్, డా. గిరీష్ రావు, సురేష్ కుమార్, త్యాగరాజన్, దీన్ దయాళన్ మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇవిపి శ్యామ్ అప్పాలి, సెక్రటరీ వంశీ కృష్ణ ఎరువారం, పబ్లిసిటీ కమిటీ చైర్ రత్నకుమార్ కవుటూరు, గిరి కోటగిరి, నీలిమ గడ్డమనుగు కలిసి సంయుక్తంగా ఆడియో, వీడియో, మీడియా ప్రచారాన్ని సమర్థంగా నిర్వహించారు. చివరగా ఈ కార్యక్రమం శంకర నేత్రాలయ యూఎస్ఏ సేవా లక్ష్యాన్ని మరింత బలపరచింది.చదవండి: న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
క్రైమ్
హృదయ విదారకం : పట్టాలు దాటుతూండగా!వైరల్ వీడియో
బీహార్లోని పాట్నా పరిధిలోని బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అటు నుంచి శరవేగంగా దూసుకొస్తున్న రైలు. మరోవైపు పట్టాలు దాటుతున్న జనం. అంతే క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటిదాకి తమ చేయి పట్టుఉన్న వారు, కళ్లముందే ఛిద్రం కావడంతో బంధువులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.ఢిల్లీ నుంచి మాల్దాకు వెళ్తున్న ఫరక్కా ఎక్స్ప్రెస్ రైలు ప్లాట్ఫాం నంబర్ 1 వద్దకు వస్తుండగా ఈ దిగ్భ్రాంతి కర ఘటన జరిగింది. బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో అతివేగంగా దూసుకొస్తోంది. ఇంతలో కొంతమంది పట్టాలు దాటడానికి ప్రయత్నించారు. కొంతమంది వేగంగా ముందుకెళ్లిపోగా, ఇద్దరు మహిళలు బ్యాగులతో ప్లాట్ఫారమ్పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ వెనుక బడిపోయారు. అంతే క్షణాల్లో వారు రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయారు. వారి తొందరపాటును గమనించిన ఇద్దరు ప్రయాణికులు సహాయానికి వచ్చారు కానీ వారిని పైకి లాగలేకపోయారు. ఒక వ్యక్తి మహిళల్లో ఒకరిని ప్లాట్ఫారమ్పైకి ఎక్కించే ప్రయత్నంలో కింద పడియాడు. మరొక వ్యక్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. రైలు వారిపై నుండి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. దీంతో ప్లాట్ఫాంపైన ఉన్నవారితో పాటు వీక్షకులు షాక్కు గురయ్యారు. ఈ సంఘటన మే 4వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు జరిగింది. ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి? <मित्रों ये वीडियो देखकर मेरा कलेजा फट गया बख़्तियारपुर रेलवे स्टेशन प्लेटफार्म पार करते समय दो महिलाओं की ट्रेन से कटकर दर्दनाक मौत हो गईयह घटना उस समय घटी जब दिल्ली से मालदा जाने वाली फरक्का एक्सप्रेस प्लेटफार्म नंबर 1 पर आ रही थीउसी समय दो महिलाएं पटरी क्रॉस करके प्लेटफार्म… pic.twitter.com/VRd6sPZ3Je— Jitendra Verma (@jeetusp) May 5, 2026దీంతో కొద్ది సేపు స్టేషన్లో రైలు సేవలు కొద్దిసేపు నిలిపివేశారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.మృతుల వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల బంధువులకు సమాచారం అందించామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జవహర్ లాల్ ధృవీకరించారు. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే! నోట్ : దయచేసి వేగంగా వెళ్లాలనే తొందరలో ప్లాట్ఫాం చేరుకోవడానికి పట్టాలు దాటొద్దు. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. కాస్త నిదానించండి. ఫుట్బ్రిడ్జ్ను ఉపయోగించండి.
భార్య వివాహేతర సంబంధం.. కిరాతకంగా హత్య చేసిన భర్త!
కృష్ణా జిల్లా: భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆమెను అతి కిరాతకంగా ఇనుప రాడ్డుతో మోది హతమార్చిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని గుడివాడ డీఎస్సీ పి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం డీఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. దిమ్మిటి ప్రసన్నకుమారి(30) తన భర్త మురళీ కృష్ణతో వివాదాల కారణంగా భర్తను వదిలేసి మరో వ్యక్తితో పామర్రులో సహజీవనం చేస్తోంది. తనతో కాపురం చేయకుండా కుటుంబ పరువు తీస్తున్నట్లుగా భావించిన మురళీకృష్ణ తన అన్నదమ్ములను వెంట బెట్టుకుని ఈనెల 4వ తేదీ ఉదయం రెండు బైక్లపై పామర్రు వచ్చాడు. ప్రసన్నకుమారి ఉంటున్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఇనుప రాడ్డుతో మోది చంపాడు.అనంతరం నిందితులు అక్కడ నుంచి పారిపోతూ దుస్తులు, ఆమెను చంపడానికి ఉపయోగించిన ఇనుపరాడ్డును గుడివాడ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన పోదలలో పడవేసి వెళ్లి పోయారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి గోళ్ల రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీప్రసన్న కుమారిని తన అల్లుడు మురళీ కృష్ణ, అన్నయ్య రాంబాబు, మరో తమ్ముడు నాగేశ్వరరావు అలియాస్ చంటి తన అన్నయ్య రాంబాబు కుమారుడు మైనర్ అయిన మరో వ్యక్తితో కలిసి తన కుమార్తెను ఇనుప రాడ్డుతో కొట్టి చంపినట్లుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారు.దీనిపై అప్పటి పామర్రు ఇన్ఛార్జి గుడివాడ టూ టౌన్ సీఐ హనీష్ కొంది మంది సాక్షులను విచారించగా తదుపరి పామర్రు సీఐగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ నాగ ప్రసాద్ విచారణను కొనసాగిస్తూ మరి కొందరు సాక్షులను విచారించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పామర్రు నుంచి గుడివాడ వెళ్లే రోడ్డులో కొత్తూరు దాటిన తర్వాత కొడాలి రామేశ్వరరావు మునగతోట పక్కన నిందితులు వారు దాచిన ఇనుప రాడ్డు బట్టలు వెతుకుతుండగా, పామర్రు సీఐ సీహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ కె.శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. ఇనుపరాడ్డు, దుస్తులు, వారు వాడిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను తదుపరి విచారణ కోసం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. నిందితులపై రౌడీ షీట్ తెరుస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పామర్రు సీఐ, ఎస్ఐలను ఆయన అభినందించారు.
వివాహేతర సంబంధానికి చిన్నారి బలి
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): వివాహేతర సంబంధం ముక్కుపచ్చలారని చిన్నారి హత్యకు కారణమైంది. వివాహితతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె 18 నెలల కుమార్తెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి నిదితున్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం, కోనయ్య చెరువు సమీపంలో నివాసం ఉండే తరుణ్ తాపీ పని చేసుకుంటూ భార్య ఆశాజ్వోతి, ఆరేళ్ల కొడుకు, 18 నెలల కూతురు హర్షితతో కలసి నివాసముంటున్నారు. ఈ క్రమంలో భర్త స్నేహితుడైన కనిజం వంశీతో ఆశాజ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. నెల రోజుల క్రితం ఈ విషయం తెలియడంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆశాజ్వోతి హర్షితను తీసుకుని వెళ్లిపోయింది. నగరంలోని వాంబేకాలనీలోని తన పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వంశీతో కలసి విజయవాడ, బీఆరీ్టఎస్ రోడ్డు, రామకోటి మైదానం దగ్గరలోని ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంది. భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన పుట్టింట్లో ఉన్నట్లు చెబుతూ వస్తోంది. గత నెల 24న ఆమె గన్నవరంలోని భర్త ఇంటికి వెళ్ళి తన కొడుకుని కూడా తీసుకు వెళ్లిపోయింది. ఏప్రిల్ 29న పనికి వెళ్లే విషయంలో ఆశాజ్యోతికి వంశీకి మధ్య గొడవ జరిగింది. తీవ్ర కోపానికి గురైన వంశీ ఆడుకుంటున్న చిన్నారి హర్షితను తీవ్రంగా కొట్టాడు. పైకి ఎత్తి బలంగా గోడకేసి కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం వంశీ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆశాజ్వోతి తన భర్తకు ఫోన్ చేసి హర్షిత ఆరోగ్యం బాగోలేదని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని చెప్పింది. అనంతరం వీడియో కాల్ చేసి హర్షిత కదలటం లేదని చెప్పింది. దీంతో తరుణ్ తన సోదరుడిని పంపి వారిని తీసుకురమ్మన్నాడు. అప్పటికే ఆశాజ్యోతి ఆటోలో చిన్నారిని తీసుకుని గన్నవరంలోని ఇంటికి వెళ్ళింది. చిన్నారి ఒంటిపై రక్తపు గాయాలు కనిపించడంతో తరుణ్ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో వంశీ తన చెల్లిని కొట్టి హత్య చేసినట్లు కుమారుడు తెలిపాడు. దీంతో పోలీసులు ఆమెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్ఎన్పురం పోలీసులకు బదిలీ చేశారు. మంగళవారం వంశీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నువ్వంటే నాకిష్టం.. మా ఇంటికి వస్తావా..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘ఎనిమిది సెమిస్టర్లు ఉంటావ్.. నీతో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. నువ్వు మా ఇంటికి వస్తావా.. గోడలకు చెవులు ఉంటాయి.. ఇంటికి వస్తే పూర్తిగా మాట్లాడుతా.. నీతో పరీక్షలు బాగా రాయించాలని.. రూమ్కి ఇన్విజలేటర్గా వచ్చా... నేను నీకు చూపించినా రాయచ్చు కదా.. రాసుకునేలా అవకాశం ఇచ్చా.. ఆ మాత్రం సైకాలజీ కూడా తెలియపోతే ఎలాగే.. నువ్వు వేస్ట్ చేశావ్. నువ్వంటే ఇష్టం.. ఐ వాంట్ యూ. రేపు శ్రీకాకుళం వస్తావా. రేపు ఎన్ని గంటలకు బయల్దేరుతున్నావు. ఆర్టీసీ కాంప్లెక్స్లో రిసీవ్ చేసుకుంటా. నీఫోన్ కోసం వెయిట్ చేస్తా.. నువ్వంటే నాకిష్టం.. నువ్వు వస్తే చెప్తాను. మనమిద్దరం కలిసి ట్రావెల్ చేద్దామని. శ్రీకాకుళం వచ్చాక ఇంటికి తీసుకెళ్తా. అక్కడ ఫేస్ టూ ఫేస్ చెబుతా. జర్నీలో ట్రావెల్ను బట్టి ఇలా ఉండాలి. అలా ఉండాలి అని చెప్పగలను. అది ప్రపోర్షనల్గా కావ చ్చు. పర్సనల్గా కావచ్చు. ఏదైనా కావచ్చు. నన్ను సార్ అని పిలవకే...అండి అని పిలు...’ పాఠాలు చెప్పాల్సిన ఓ అధ్యాపకుడు తన స్టూడెంట్తో జరిపిన సంభాషణ ఇది. అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినికి ఎదురైన చేదు అనుభవమిది.ఎచ్చెర్లలోని బీఆర్ఏయూ ప్రతిష్ట మంటగలిసిపోతోంది. కొందరు అధ్యాపకుల తీరు వల్ల మొత్తం వర్సిటీకే చెడ్డ పేరు వస్తోంది. తల్లిదండ్రుల స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు ఆ వృత్తికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. విద్యార్థినులను వేధిస్తూ, ప్రలోభ పెడుతూ, బెదిరింపులకు సైతం దిగుతున్నారు. తాజాగా అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడు అక్కడ చదువుతున్న ఓ విద్యార్థినితో జరిపిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియా వేదికగా వెలుగు చూసింది. ఈ వర్సిటీలో గతంలోనూ లైబ్రరీ సైన్సులో, లా విభాగంలో, గణిత, తెలుగు విభాగాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.ప్రలోభాలు.. ఆపై వేధింపులుఅంబేడ్కర్ యూనివర్సిటీలోని కొన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉత్తీర్ణత అయ్యేలా చూస్తామని ప్రలోభాలకు గురి చేసి, లోబర్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ ఇంగ్లిష్ (సాఫ్ట్ స్కిల్స్) బోధించే రామారావు అనే అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో లీకై ంది. ఈ విషయాన్ని వర్సిటీ పెద్దలు రాజీ చేశారు. అయినా ఆ అధ్యాపకుడి తీరు మారలేదు. తప్పని పరిస్థితుల్లో ఆ విద్యార్థిని విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ తల్లిదండ్రులు వర్సిటీ వర్గాలకు తెలిసిన వారి ద్వారా తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.గతంలోనూ..వర్సిటీలో తెలుగు, గణితం, న్యాయ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ తరహా ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఉత్తీర్ణత కోసం, మార్కుల కోసం ట్రాప్ చేయడం, వేధింపులకు గురి చేయడం వంటివి జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి ఆడియో రికార్డులు గతంలో కూడా వచ్చినప్పటికీ బయటకు రా కుండా జాగ్రత్త పడ్డారనే వాదనలు ఉ న్నాయి. వర్సిటీలో అధ్యాపకుల మధ్య విభేదాలు ఉండడం వల్ల ఇవి బయటకు వచ్చాయని లేదంటే ఈ ఆడి యో క్లిప్ కూడా బయటకు రాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ అధ్యాపకుడితో ఫోన్ మాట్లాడిన విద్యార్థి పక్కన మరికొందరు ఉన్నట్టు, వారిచ్చే సూచనతో సంభాషణ జరిపినట్టు ఆ ఆడియోలో రికార్డు కావడం గమనార్హం. ఆ అధ్యాపకుడు తాను మాట్లాడింది కొంత అయితే మిగతాది కలిపారని ఆరోపిస్తున్నారు.వర్సిటీలో తెలుగు, ఆంగ్లం, ఎంసీఈ, గణితం, లా విద్యార్థినులు ఇలాంటి వేధింపులకు ఎప్పటికప్పుడు గురవుతున్నారు. రెండు నెలల క్రితం ట్రిపుల్ ఐటీలో వేధింపులపై అమ్మాయిలు చేసిన ఫిర్యాదుకు ప్రత్యేక కమిటీలను వేసి వేధించిన వారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇలాంటి కమిటీలను వేసి వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఫోన్ సంభాషణ చేసిన అధ్యాపకుడిది శ్రీకాకుళం మండలంలోని ఓ గ్రామం. ప్రస్తుతం బలగ వద్ద ఉంటున్నాడు. ఓ ఆల యం ట్రస్టు మెంబర్గా కూడా కొనసాగుతున్నాడు. మాట తెచ్చిన చేటు.. బోధకుడిపై సస్పెన్షన్ వేటుసాక్షి కథనంతో కదిలిన అధికారులువిద్యార్థినితో జరిపిన అసభ్యకర ఫోన్సంభాషణపై ప్రత్యేక కమిటీ విచారణకళంకిత అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్సస్పెన్షన్ చర్యలను ధ్రువీకరించడానికి వెనకడుగుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినితో ఫోన్లో అసభ్యకరంగా సంభాషణ చేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మజ్జి రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన బాగోతంపై విచారణ జరపాలని కూడా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. ‘ప్రలోభాలు...బెదిరింపులు’ శీర్షికన ప్రచురితమైన కథనంతో అధికారులు కదిలారు. ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ ఇంగ్లిష్ (సాఫ్ట్ స్కిల్స్) బోధిస్తున్న మజ్జి రామారావు అనే అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ను సస్పెండ్ చేశారు. ఫోన్ సంభాషణ బయటకు రావడంతో పాటు పత్రికల్లో ప్రచురితం కావడంతో వీసీ కె.ఆర్ రజని ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్యతో పాటు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నవాహిణి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధలతో కూడిన కమిటీ ప్రత్యేక సమావేశమై సస్పెండ్ చేయాలని వీసీకి రిపోర్టు అందజేశారు. దీంతో వీసీ ఆయనను సస్పెండ్ చేయడంతో విచారణకు ఆదేశించినట్టు ఉన్నత విద్యా మండలి ముఖ్య కార్యదర్శికి నివేదిక పంపిచారు. ఈ చర్యలతోనైనా అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యార్థినులపై వేధింపులు ఆగుతాయేమో చూడాలి.అంతా గుట్టుగానే..అసిస్టెంట్ ప్రొఫెసర్పై చర్యలు తీసుకున్న విషయాన్ని యూనివర్సిటీ అధికారులు గుట్టుగా ఉంచారు. సోషల్ మీడియా వేదికగా ఆడియో సంభాషణ హల్చల్ చేసి, యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించిన విషయంపై తీసుకున్న చర్యలను బయటకు వెల్లడించకుండా మౌనంగా వ్యవహరించారు. యూనివర్సిటీ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. సస్పెన్షన్ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. వాస్తవంగా తాజాగా ఘటనలో బాధ్యులైన విద్యార్థిని ఈ వ్యవహారాన్ని గతంలోనే అధికారుల దృష్టికి వచ్చింది. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారే తప్ప చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేశారు. అధ్యాపకుడిపై ఉన్న మమకారం ఏంటో తెలియదు గానీ అప్పట్లో తేలికగా తీసుకున్నారు. ఆ రోజే చర్యలు తీసుకుని ఉంటే యూనివర్సిటీ ప్రతిష్ట మంట గలిసేది కాదు. ఏం జరిగినా గుట్టుగా ఉంచడం ఇక్కడ పరిపాటిగా మారింది.
వీడియోలు
విజయ్ రాజీనామా డిప్యూటీ సీఎంగా త్రిష?
మద్దతు ఇస్తాం.. మంత్రి పదవులు కావాలి..
ఫౌజీ షూటింగ్ కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి!
నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్పుతో... పవన్పై రెచ్చిపోయిన జనసైనికుడు
TVK విజయ్ కు కాంగ్రెస్ మద్దతు
వాడికి 50 కోట్లు ఇస్తే వంటిచెతొ గెలిపిస్తాడు, పంత్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫాన్స్
విజయలో ఉన్నదేంటి..? పవన్ లో లేనిదేంటి..?
లైవ్ లో రేవంత్ పరువు తీసిన కేటీఆర్
నా కూతురు కోసం నువ్వు మాట్లాడావు కాబట్టి చెప్తున్నా..
వైఎస్సార్సీపీ నేత నాగార్జున యాదవ్కు నోటీసులు



