అందరినీ వణికించిన బందిపోటు దొంగ గుర్జర్ మృతి.. జైల్లో..
రాజస్థాన్లో అత్యంత భద్రత ఉండే అజ్మేర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న చంబల్కు చెందిన కరుడుగట్టిన బందిపోటు ముఠా నాయకుడు జగన్ గుర్జర్ సోమవారం తన బ్యారక్లో విగతజీవిగా కనిపించాడు. ఇది హత్య అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మృతి విషయాన్ని పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్ అగ్రవాల్ ధ్రువీకరిస్తూ, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.జైలు నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఖైదీలు తమ బ్యారక్లలోనే బంధించి ఉంటారని పోలీసులు తెలిపారు. బ్యారక్లు తెరిచిన తర్వాత సాధారణ తనిఖీల్లో జైలు సిబ్బంది గుర్జర్ మృతదేహాన్ని గుర్తించారు. ఆ సమయంలో అతనితో ఒకే బ్యారక్లో ఉన్న ఖైదీ కూడా అక్కడే ఉన్నాడు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం జైలుకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించి, ఆధారాలను సేకరించింది.గుర్జర్ మృతికి దారితీసిన పరిస్థితులు, హత్యకు కారణం, ఘటన జరిగిన తీరు వంటి అంశాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్జర్తో కలిసి అదే బ్యారక్లో భరత్పూర్కు చెందిన కుల్దీప్ జఘీనా సంచలన హత్య కేసు నిందితుడు విష్ణు ఉన్నాడని అధికారులు తెలిపారు. విష్ణును దర్యాప్తు అధికారులు విచారించారు.జగన్ గుర్జర్ ఎవరు?జగన్ గుర్జర్ చంబల్ ప్రాంతంలో అత్యంత భయంకరమైన దొంగల ముఠా నాయకుల్లో ఒకడు. ధోల్పూర్ డాంగ్ ప్రాంతంలోని లోయల్లో ఎన్నో ఏళ్ల పాటు తన ప్రభావాన్ని కొనసాగించాడు. హత్య, దోపిడీ, దొంగతనం, వసూళ్లు, అపహరణ, ఆయుధాల చట్టం కింద నమోదైన నేరాలు సహా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో అతనిపై 100కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.గుర్జర్ రిజర్వేషన్ ఉద్యమం సమయంలో 2008లో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు చెందిన ధోల్పూర్ ప్యాలెస్ను పేల్చివేస్తానని జగన్ గుర్జర్ బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో అతడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. ఎన్నో ఏళ్ల పాటు పరారీలో ఉన్న గుర్జర్ 2018 ఆగస్టు 19న బయానాలో అప్పటి భరత్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాలిని అగ్రవాల్ ఎదుట లొంగిపోయాడు.
‘భీమ్రావు కాంబ్లేను ఉరితీయండి’.. తీర్పు వెలువరించిన కోర్టు
ముంబై: హత్యకేసులో పూణే జిల్లా ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పసిగుడ్డుపై అమానుషానికి పాల్పడిన నిందితుడు భీమ్రావు కాంబ్లేకు ఉరిశిక్ష విధించింది. కేసు విచారణ సందర్భంగా అరుదైన కేసుల్లో ఒకటిగా.. అత్యంత హేయమైన నేరంగా పరిగణిస్తూ ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని పూణే జిల్లా, భోర్ తాలూకా పరిధిలోని నస్రాపూర్ గ్రామంలో ఈ ఏడాది మే 1న జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూడున్నరేళ్ల పసికందును నిందితుడు కాంబ్లే అపహరించి, అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. ఈ దారుణంపై మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబం నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కోరింది.ఈ ఘటనపై పూణే జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో నిందితుడు నేరం చేసినట్లు తేలడంతో, అతనిపై పోక్సో చట్టం కింద కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.పూణే రూరల్ పోలీస్ విభాగం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ గిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఎస్పీ సందీప్ సింగ్తో పాటు మరో ఆరుగురు సభ్యులు దర్యాప్తు చేపట్టి, కేవలం 15 రోజుల్లోనే 1200 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఇందులో 55 మంది సాక్షులు, కీలక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, మెడికల్ పరీక్షా నివేదికలు, ఫోరెన్సిక్ విశ్లేషణ, మొబైల్ లొకేషన్ డేటా, కాల్ రికార్డులు వంటి సాంకేతిక ఆధారాలను పొందుపరిచారు.ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. ఘటన జరిగిన 55 రోజుల్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. ప్రాసిక్యూషన్ పలు వారాల పాటు వాదనలు వినిపించగా, డిఫెన్స్ తరపు న్యాయవాదులు ఆరోపణలను వ్యతిరేకించారు. అయితే సమర్పించిన సాక్ష్యాధారాలు నిందితుడిని దోషిగా నిర్ధారించడానికి సరిపోతాయని కోర్టు భావించింది.జూన్ 25న నిందితుడిని దోషిగా నిర్ధారించిన తర్వాత, న్యాయమూర్తి శిక్షపై తీర్పును రిజర్వ్ చేసి, ఆ తర్వాతి సోమవారం మరణశిక్షను విధించారు. శిక్షను ఖరారు చేసే సమయంలో న్యాయమూర్తి నేర స్వభావం, బాధితురాలి వయస్సు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.తీర్పు వెలువడినప్పుడు బాధితురాలి కుటుంబం కోర్టులో హాజరైంది. డిఫెన్స్ తరఫున ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. పోక్సో చట్టం కింద మైనర్లకు సంబంధించిన కేసులకు ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, ఈ కేసు రికార్డు సమయంలో ముగిసింది. నిందితుడు అప్పీల్ దాఖలు చేస్తే, బాంబే హైకోర్టు ఈ తీర్పును సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, కాంబ్లే జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు.ఈ కేసు విచారణ అత్యంత వేగంగా పూర్తయిన న్యాయచరిత్రలో ఒకటిగా నిలిచింది. సున్నితమైన కేసు కావడంతో నిందితుణ్ని కెమెరా ద్వారా విచారణ చేపట్టారు.
తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. వరంగల్ సీపీగా శ్వేత, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగా సింధుశర్మ, సీఐడీ ఎస్పీగా చెన్నూరి రూపేష్,వికారాబాద్ అడ్మీన్ ఎస్పీగా రాజేష్ మీరా నియామకమయ్యారు. సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ సీపీగా సన్ప్రీత్ సింగ్, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వై.సాయిశేఖర్, సీఐడీ ఎస్పీలుగా చెన్నూరి రూపేష్, ప్రవీణ్ కుమార్, వికారాబాద్ అడ్మీన్ ఎస్పీగా రాజేష్ మీరా బదిలీ అయ్యారు.గోల్కోండ జోన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా చంద్రమోహన్,ఇంటలిజెన్స్ ఎస్పీగా రామ్ రెడ్డి , హైడ్రా అడిషనల్ కమిషనర్గా ఆనంద్ కుమార్,ఇంటలిజెన్స్ ఎస్పీగా ఇక్బాల్ సిద్దిఖీ మెుత్తంగా 26 మంది అధికారుల బదిలీ జరిగింది.
రూ.7000 కోట్ల బడ్జెట్.. అమల్లోకి 'ఢిల్లీ ఈవీ పాలసీ'!
ఢిల్లీ ప్రభుత్వం 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'ను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇది భారత్లో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి తీసుకున్న అన్ని చర్యలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ విధానం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం అంతర్గత దహన ఇంజిన్ (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) వాహనాలను దశలవారీగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం.ఈ పాలసీకి ప్రభుత్వం సుమారు రూ.7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీని ద్వారా వినియోగదారులు ఈవీలను కొంత తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు.పాలసీ ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్పై 100 శాతం మినహాయింపు లభిస్తుంది. అయితే.. ఈ ప్రయోజనం రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే సాధారణ పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట.ప్రభుత్వం నేరుగా కొనుగోలుదారులకు సబ్సిడీ కూడా అందిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ టూవీలర్లకు రూ.30,000 వరకు, త్రీ-వీలర్లకు రూ.50,000 వరకు, అలాగే చిన్న ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.1,00,000 వరకు సహాయం అందుతుంది.ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.. ICE వాహనాలపై దశలవారీ నిషేధం. ఇందులో భాగంగానే 2027 జనవరి 1 నుంచి ఆటో రిక్షాలు, చిన్న సరకు రవాణా చేసే వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నారు. 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్, డీజిల్, సీఎన్జీ టూవీలర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా రద్దు చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ఢిల్లీలో రోడ్డుపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది.పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. నాలుగు చక్రాల వాహనాలకు రూ.1,00,000, టూవీలర్లకు రూ.10,000, త్రీ వీలర్లకు రూ.25,000 వరకు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది.పెద్ద సరకు రవాణా వాహనాల కోసం ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ట్రక్కులకు కొన్ని నగర ప్రవేశ ఆంక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది. అంతే కాకుండా పాఠశాల వాహనాలను కూడా దశలవారీగా ఈవీలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడం మాత్రమే కాకుండా.. చార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి చేయడానికి కూడా ప్రభుత్వం కావలసిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఢిల్లీ అంతటా 30,000కు పైగా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీని ద్వారా EV వినియోగదారులకు ఛార్జింగ్ సమస్య తగ్గే అవకాశం ఉంది.The Delhi Cabinet has approved the new Delhi EV Policy 2026, a landmark initiative to curb vehicular pollution and accelerate the transition towards clean, sustainable mobility in the national capital.The policy will come into effect on 1 July 2026 and remain in force until 31… pic.twitter.com/mDvXdhVHTN— CMO Delhi (@CMODelhi) June 29, 2026
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
కేప్ వెర్డే కెప్టెన్పై లైంగిక ఆరోపణలు!
అందరినీ వణికించిన బందిపోటు దొంగ గుర్జర్ మృతి.. జైల్లో..
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!
మూడో టెస్ట్లో ఇంగ్లండ్ చిత్తు.. సిరీస్ న్యూజిలాండ్దే
భారీ స్కామ్లకు కూటమి సర్కార్ స్కెచ్
కుళ్లిన గుడ్లతో ఆ పార్టీ నేత మీద దాడి.. ‘ఎగ్ థెరపీ’ అంటూ..
తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీలు
ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
జులైలో బ్యాంక్ హాలిడేస్: 12 రోజులు సెలవు!
నటుడిని వరించిన లాటరీ.. సరదాగా టికెట్స్ కొంటే
టోక్యో: సిగ్నల్ పడలేదు.. ఎర్ర చీర చూసి ఆగిపోయారంతే!
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్లో తెలంగాణ పిల్ల
ప్రజలు మత్తులో ఉంటే పాలన చిత్తుగా ఉన్నా అడిగేవాడు ఉండడు సార్! సంపద సృష్టి ఐడియా అదుర్స్ సార్!!
అమరావతిని అంతర్జాతీయపటంలో చూపిస్తా, క్వాంటం టెక్నాలజీని తెస్తా అని.. వైద్య పరీక్షలకు హైదరాబాద్ వెళ్లడమేంటి సార్!!
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. 'ఇసకపట్నం' కొత్త ట్రైలర్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులు
ఈ రాశి వారికి సన్నిహితులు నుంచి ధనలబ్ధి.. గృహయోగం
పసిడి పరుగు ఆగేలా లేదు: కియోసాకి
నయా ట్రెండ్.. పెట్రోల్+ఎలక్ట్రిక్!
మొన్ననే కలిసి జోకులు వేసుకున్నాం.. నమ్మలేకపోతున్నా : చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
రోచ్ ట్రిపుల్ సెంచరీ
పోన్లెండి సార్! ఏదో రకంగా పబ్లిసిటీ వస్తుందిగా!
ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికుల ఫైర్
ముడి చమురుకు బై బై.. భారత్లోకి జపాన్ మిథేన్ పవర్
అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట
ఆగని పసిడి పరుగులు.. నేడు కొత్త ధరలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
కేప్ వెర్డే కెప్టెన్పై లైంగిక ఆరోపణలు!
అందరినీ వణికించిన బందిపోటు దొంగ గుర్జర్ మృతి.. జైల్లో..
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!
మూడో టెస్ట్లో ఇంగ్లండ్ చిత్తు.. సిరీస్ న్యూజిలాండ్దే
భారీ స్కామ్లకు కూటమి సర్కార్ స్కెచ్
కుళ్లిన గుడ్లతో ఆ పార్టీ నేత మీద దాడి.. ‘ఎగ్ థెరపీ’ అంటూ..
తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీలు
ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
జులైలో బ్యాంక్ హాలిడేస్: 12 రోజులు సెలవు!
నటుడిని వరించిన లాటరీ.. సరదాగా టికెట్స్ కొంటే
టోక్యో: సిగ్నల్ పడలేదు.. ఎర్ర చీర చూసి ఆగిపోయారంతే!
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్లో తెలంగాణ పిల్ల
ప్రజలు మత్తులో ఉంటే పాలన చిత్తుగా ఉన్నా అడిగేవాడు ఉండడు సార్! సంపద సృష్టి ఐడియా అదుర్స్ సార్!!
అమరావతిని అంతర్జాతీయపటంలో చూపిస్తా, క్వాంటం టెక్నాలజీని తెస్తా అని.. వైద్య పరీక్షలకు హైదరాబాద్ వెళ్లడమేంటి సార్!!
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. 'ఇసకపట్నం' కొత్త ట్రైలర్
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులు
ఈ రాశి వారికి సన్నిహితులు నుంచి ధనలబ్ధి.. గృహయోగం
పసిడి పరుగు ఆగేలా లేదు: కియోసాకి
నయా ట్రెండ్.. పెట్రోల్+ఎలక్ట్రిక్!
మొన్ననే కలిసి జోకులు వేసుకున్నాం.. నమ్మలేకపోతున్నా : చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
రోచ్ ట్రిపుల్ సెంచరీ
పోన్లెండి సార్! ఏదో రకంగా పబ్లిసిటీ వస్తుందిగా!
ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికుల ఫైర్
ముడి చమురుకు బై బై.. భారత్లోకి జపాన్ మిథేన్ పవర్
అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట
ఆగని పసిడి పరుగులు.. నేడు కొత్త ధరలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
ఫొటోలు
లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)
ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)
బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్ డే.. తమన్నా సందడి (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)
రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు)
హీరోయిన్ లయ ఫ్యామిలీ టైమ్ (ఫొటోలు)
#RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)
'రాజాసాబ్' బ్యూటీ అమ్మనాన్నని చూశారా? (ఫొటోలు)
హైదరాబాద్ ఈవెంట్లో మెరిసిన హీరోయిన్ అంజలి (ఫొటోలు)
సినిమా
ఒక్క సినిమాతో క్రేజ్.. బుల్లిరాజు పారితోషికం తెలిస్తే షాక్..!
గతేడాది సంక్రాంతికి వస్తున్నాం ఎంతలా హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అలరించారు.ఇదంతా పక్కన పడితే ఈ మూవీతో అందరి కళ్లు తనవైపు తిప్పుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ బుడ్డోడు. ఈ మూవీ తర్వాత రేవంత్ పేరు కాస్తా బుల్లిరాజుగా మారిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది రిలీజైన మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్ చిత్రంతో బుల్లిరాజు మరోసారి అభిమానులను అలరించారు.ఇక ఇటీవలే వెంకీమామ- అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ చిత్రంలోనూ బుల్లిరాజు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వరుసగా ముచ్చటగా మూడోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన బుల్లిరాజు సందడి చేయనున్నారు.స్టార్స్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తోన్న ఈ బుడ్డోడు రెమ్యునరేషన్ గురించి టాక్ నెట్టింట వైరలవుతోంది. మన బుల్లిరాజు ఒక్క రోజుకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని లేటేస్ట్ టాక్. దీంతో ఒక్క సినిమాతో మనోడి రేంజ్ ఎలా మారిపోయిందోనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
విశ్వనాథ్ అండ్ సన్స్.. సింగర్గా సూర్య!
కోలీవుడ్ హీరో సూర్య ఇటీవలే కరుప్పు మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది సమ్మర్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ తర్వాత సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా బయటకొచ్చింది. ఈ చిత్రంలోని ఓ సాంగ్ను స్వయంగా సూర్యనే పాడారు. ఈ పాటకు కేవలం డ్యాన్స్ చేయడమే కాదు.. తన గొంతుతోనే అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా... కెన్ కరుణాస్ లిరిక్స్ అందించారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సూర్య పాడిన ఈ పాట సినిమాకే హైలైట్గా నిలవనుందని తెలిపారు. ఇటీవలే రిలీజైన నేనో బటర్ఫ్లై పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. THE ONE @Suriya_offl sir sings a dance number for #vishwanathandsons …. Written by @KenKarunaas ….. A #Venkyatluri film … @SitharaEnts @vamsi84 …. ❤️❤️❤️😍😍😍 pic.twitter.com/jf7yTKZRI0— G.V.Prakash Kumar (@gvprakash) June 29, 2026
అంత్యక్రియల ప్రదేశాన్ని సర్కస్లా చేసేశారు.. రాధిక అసహనం
రెండు రోజుల క్రితం తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూశారు. ఆయనకు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే అంత్యక్రియల్లో కొందరు కెమెరాలు పట్టుకుని భాగ్యరాజ్కు నివాళి అర్పించేందుకు వచ్చిన సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టారు. నటి రాధిక కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంది. ఆరోజే మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంది. ఆ వీడియో వైరల్ కాగా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తన అసహనాన్ని బయటపెట్టింది.'అంత్యక్రియలనేవి దుఃఖంతో బాధపడుతున్న కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయం. హంగామా చేసేందుకు వ్యూస్ కోసం ప్రయత్నించే వేదిక కాదు. అంతిమ సంస్కారాల టైంలో మీడియాని నిషేధించాల్సిందే' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీన్ని రీట్వీట్ చేసిన రాధిక.. కచ్చితంగా నిషేధం విధించాలి అని రాసుకొచ్చింది. ఇక భాగ్యరాజ్తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది.50 ఏళ్ల స్నేహానికి వీడ్కోలు. ఎక్కడా ఆర్భాటం లేకుండా ప్రతి సందర్భంలోనూ నా కుటుంబానికి అండగా నిలిచారు. నిజంగా ఇది షాకింగ్ వీడ్కోలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు నివాళులు అర్పించాల్సిన ప్రదేశం ఓ సర్కస్ అయిపోయింది. ఇంత కఠినంగా మనం ఎప్పుడూ మారిపోయాం? ప్రభుత్వం, ఇండస్ట్రీ దీనిపై చర్చించాలి. అంత్యక్రియల టైంలో ప్రోటొకాల్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వాళ్లకు, ఆత్మకు గౌరవం ఇవ్వాలి' అని రాధిక తన ఆవేదన వ్యక్తం చేసింది.pic.twitter.com/dE4PWoyHRG— Radikaa Sarathkumar (@realradikaa) June 29, 2026கையெடுத்து கும்பிடறன், TRP வேணாம்னு சினிமால நடிச்சி தரோம் , கொஞ்சம் பிரைவேசி கொடுங்க #Bhagyaraj #Radhika pic.twitter.com/PdbuKivcW1— Behind Talkies (@BehindTalkies) June 27, 2026
'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్.. రిలీజ్ డేట్ ఫిక్స్
తెలుగులో అప్పుడప్పుడు చిన్న సినిమాలే మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో తరుణ్ భాస్కర్ తీసిన 'ఈ నగరానికి ఏమైంది' ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ యూత్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే చాన్నాళ్ల తర్వాత గతేడాది దీనికి సీక్వెల్ మొదలైంది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. అధికారిక ప్రకటన)ఇకపోతే తొలి భాగంలో విశ్వక్ సేన్, అభినవ్, వెంకటేశ్, సుశాంత్, సిమ్రాన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పుడు సీక్వెల్ విషయానికొచ్చేసరికి సుశాంత్ బదులు శ్రీనాథ్ మాగంటి వచ్చి చేరాడు. తొలి పార్ట్ గోవా నేపథ్యంగా తీయగా.. ఈసారి మాత్రం థాయ్ల్యాండ్ బ్యాక్డ్రాప్లో తీశారు. ఈ ఏడాది నవంబర్ 19న థియేటర్లలోకి మూవీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.(ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'.. అయ్యప్ప సాంగ్ రిలీజ్)The gang is back to celebrate where it all began ❤️Celebrating the anniversary of #EeNagaranikiEmaindi with a release date announcement of ENE Repeat💥💥#ENERepeat in cinemas from NOVEMBER 19th, 2026 ✌🏻#8YearsOfENE #ENERepeatOnNov19th#TharunBhascker @VishwakSenActor… pic.twitter.com/Lkwz2VyWho— S Originals (@SOriginals1) June 29, 2026
క్రీడలు
నల్గొండ నైట్స్ హ్యాట్రిక్ విజయం
తెలంగాణ టీ20 లీగ్-2026లో అనురాగ్ నల్గొండ నైట్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్ను 6 వికెట్ల తేడాతో నల్గొండ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగుల నామ మాత్రపు స్కోర్ సాధించింది. పాలమూరు ఇన్నింగ్స్లో కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (55), బుడిది తేజ (50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. నల్గొండ నైట్స్ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ మహమ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నిశాంత్ రెండు, అనికేత్, దివేష్ తలా వికెట్ సాధించారు. అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని నల్గొండ జట్టు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. నల్గొండ మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ బుద్ది(68) అజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఈ విజయంతో నల్గొండ నైట్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.చదవండి: IND vs IRE: భారత్పై ఘన విజయం.. ఐర్లాండ్కు భారీ షాక్
భారత్పై ఘన విజయం.. ఐర్లాండ్కు భారీ షాక్
స్వదేశంలో టీమిండియాపై 2-0 తేడాతో టీ20 సిరీస్ను సొంతం చేసుకుని 24 గంటల తిరగకముందే ఐర్లాండ్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ హెన్రిచ్ మలాన్ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఆరంభం వరకు తన పదవీ కాలం ఉన్నప్పటికి, వన్డే ప్రపంచకప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలాన్ తెలిపారు. కొత్త కోచ్కు జట్టు బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయమని అతడు పేర్కొన్నాడు. గత రెండు వన్డే ప్రపంచకప్లకు అర్హత సాధించలేకపోయిన ఐర్లాండ్ జట్టు, ఈసారి ఎలాగైనా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్లో బరిలోకి దిగాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఐర్లాండ్ 11వ స్ధానంలో ఉంది. ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వేలతో పాటు టాప్-8 స్థానాల్లో ఉన్న జట్లకు మాత్రమే ప్రపంచకప్కు నేరుగా అర్హత లభిస్తుంది. మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయర్స్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఆధ్వర్యంలో జట్టును ప్రపంచకప్కు సిద్ధం చేయాలని ఐర్లాండ్ భావిస్తోంది.కాగా హెన్రిచ్ మలాన్ హయంలో ఐర్లాండ్ ఎన్నో అద్భుత విజయాలను అందించింది. వరుసగా మూడు టీ20 ప్రపంచకప్లకు ఐరీష్ జట్టు క్వాలిఫై అయింది. 2022 టీ20 ప్రపంచకప్లో మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్ను ఓడించి ఐర్లాండ్ సంచలనం సృష్టించింది.అంతేకాకుండా అతడి నేతృత్వంలోనే పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లను కూడా ఐర్లాండ్ మట్టికరిపించింది. ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ టీ20 జట్టు అయిన టీమిండియాను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది.చదవండి: 'వారిని తప్పు పట్టడం సరికాదు.. కానీ ఐర్లాండ్ మాత్రం అద్భుతం'
LA 2028: టీమిండియా అభిమానులకు శుభవార్త!
‘బ్లాక్ సండే’ ఎఫెక్ట్తో విచారంలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్-2028లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పాల్గొనేందుకు మార్గం సుగమమైనట్లే కనిపిస్తోంది. కాగా దాదాపు శతాబ్దకాలం తర్వాత విశ్వక్రీడల్లో క్రికెట్ను చేరుస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆరు జట్ల చొప్పునఈ క్రమంలో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ సందర్భంగా క్రికెట్ రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో జట్ల ఎంపిక, అర్హతకు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (IOC) తాజాగా విధివిధానాలు రూపొందించినట్లు సమాచారం. టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈవెంట్లో పురుషుల, మహిళల క్రికెట్ నుంచి ఆరేసి జట్లు పాల్గొంటాయి.అర్హత ఏమిటి?ఇందులో డిసెంబరు 31, 2026 నాటికి ఉన్న అత్యుత్తమ ర్యాంకింగ్ కలిగిన నాలుగు జట్లను (ఖండాల వారీగా) ఎంపిక చేస్తారు. ప్రస్తుతం పురుషుల క్రికెట్లో ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా అత్యుత్తమంగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ జట్ల అర్హత లాంఛనమే.ఇక ఆతిథ్య అమెరికా మాత్రం ర్యాంకింగ్స్లో కనీసం టాప్-15లో ఉంటేనే అర్హత సాధిస్తుంది. మిగిలిన ఒక స్థానం కోసం.. టాప్-8లో ఉన్న జట్లు ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో తలపడతాయి.పురుషుల క్రికెట్ సంగతి ఇలా ఉంటే.. మహిళల క్రికెట్లో మాత్రం టీ20 ప్రపంచకప్-2026లో ప్రదర్శన ఆధారంగా అర్హ త సాధిస్తాయని తెలుస్తోంది. హయ్యస్ట్ ర్యాంకింగ్ ఉన్న జాతీయ ఒలింపిక్ కమిటీల నుంచి నాలుగు జట్లు అర్హత పొందుతాయి. ఆతిథ్య అమెరికా టాప్-15 ర్యాంకింగ్స్లో ఉంటేనే క్వాలిఫై అవుతుంది. ఇక మరొక్క స్థానం కోసం టాప్-8లో ఉన్న జట్లు ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో తలపడతాయి.బ్లాక్ సండేభారత క్రికెట్ చరిత్రలో ఆదివారం (జూన్ 28, 2026) చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ టీమిండియా ఘోర పరాభవం పాలైంది. రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓడి.. సిరీస్లో 0-2తో క్లీన్స్వీప్ అయింది. తొలిసారి ఐరిష్ జట్టు చేతిలో ఇంతటి ఘోర అవమానం చవిచూసింది.మరోవైపు.. భారత మహిళల జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో.. ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా గత పర్యాయంలోనూ భారత్ సెమీ ఫైనల్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమైంది.
'వారిని తప్పు పట్టడం సరికాదు.. కానీ ఐర్లాండ్ మాత్రం అద్భుతం'
గత రెండేళ్లుగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న టీమిండియాకు పసి కూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. తమ సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ను ఐర్లాండ్ క్లీన్స్వీప్ చేసింది. పాల్ స్టిర్లింగ్, మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, జోష్ లిటిల్ వంటి సీనియర్లు లేనప్పటికి యువ ఆటగాళ్లతో కూడిన ఐరీష్ జట్టు పటిష్టమైన టీమిండియాను రెండు మ్యాచ్లలోనూ చిత్తు చేసింది.ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐర్లాండ్ టూర్లో భారత బ్యాటింగ్ యూనిట్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే ఈ ఘోర పరాభావం తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో నెలకొన్న పరిస్థితి గురుంచి భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెష్కాట్ వివరించాడు. ఈ ఓటమి తామని తీవ్ర నిరాశపరిచందని అతడు చెప్పుకొచ్చాడు."మా ఆటగాళ్లంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇది నిజంగా నమ్మలేని పరిస్థితి. ఈ ఒక్క ఓటమి కారణంగా ఆటగాళ్లను విమర్శించడం సరికాదు. వారంతా వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యులు. అయితే ఈ సిరీస్లో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. ఐర్లాండ్ జట్టు బెసిక్స్ సరిగ్గా పాటించి మాపై విజయం సాధించింది. మా కంటే వారు మెరుగ్గా ఆడారు. ఈ సిరీస్ ఓటమి మాకు చాలా పాఠాలను నేర్పించింది. భారత్ వంటి ఉపఖండ పిచ్లపై ఎలా ఆడాలో మా ఆటగాళ్లకు బాగా తెలుసు. కానీ వేరే దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి తగినట్లుగా ఆడటం నేర్చుకోవాలని ఈ సిరీస్ నిరూపించింది. ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బంతిని స్ట్రెయిట్గా హిట్ చేసే అవకాశమివ్వలేదు. రెండు మ్యాచ్ల్లో మేము కేవలం కేవలం రెండు స్ట్రెయిట్ సిక్సర్లు మాత్రమే. భారత పిచ్లపై దూకుడుగా ఆడే శైలికి మనవాళ్లు అలవాటు పడిపోయారు. రాబోయో ఇంగ్లండ్ పర్యటనలో కూడా భారత్కు ఇలాంటి ఫాస్టెస్ట్ వికెట్లు ఎదురవుతాయి. అక్కడ గెలవాలంటే మనం మరింత తెలివిగా ఆడాల్సి ఉంటుందని" డెష్కాట్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: అతడికే మా మద్దతు.. వైభవ్ ఎదురుచూడాల్సిందే: కోచ్
న్యూస్ పాడ్కాస్ట్
విత్తనం నుంచి బీమా వరకు అన్నింటా సమస్యలే... ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
ఏపీ రాజధానిలో గూండారాజ్... రైతుల ఆహ్వానం మేరకు భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో తెలుగుదేశం మూకల దాడి
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ ‘అప్పుల క్యాలెండర్’ విడుదల... నెలకు 7 వేల 266 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేయబోతున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు. యాప్లో ఓటీపీలు రాక.. వేలిముద్రలు మ్యాచ్ కాక తిప్పలు
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన.. ఇవాళ మహిమాన్విత ఆలయానికి కలశస్థాపన చేయనున్న YSRCP అధినేత..
చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో భీతావహ పాలన... పోలీసులంటేనే ప్రజలు భయపడిపోతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే... గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్డెత్ ఘటనలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం... ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
బిజినెస్
ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు.. ఇవిగో కొత్త ఫండ్స్!
పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే ఇన్వెస్టర్ల కోసం హెచ్డీఎఫ్సీ, జేఎం ఫైనాన్షియల్ కొత్త మ్యూచువల్ ఫండ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆటో రంగంతో పాటు మల్టీ అసెట్ విభాగంలో పెట్టుబడులకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి.హెచ్డీఎఫ్సీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్: దేశ ఎకానమీకి, తయారీ రంగ వృద్ధికి, ఉపాధి కల్పనకు, ఎగుమతులకు ఆటోమొబైల్ పరిశ్రమ దన్నుగా ఉంటోంది. ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడేలా హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ ప్రారంభించింది. ఇది జూలై 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.నిఫ్టీ ఆటో ఇండెక్స్ (టీఆర్ఐ)లోని దిగ్గజ ప్యాసింజర్ వెహికల్స్, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ సంస్థల స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ500 నుంచి ఎంపిక చేసిన 15 స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి.జేఎం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్: ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ తాజాగా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూలై 8న ముగుస్తుంది. ఇది ఈక్విటీలు, ఈక్విటీ సంబంధ సాధనాలు, డెట్..మనీ మార్కెట్ సెక్యూరిటీలు, పసిడి–వెండి సంబంధ సాధనాలు, ఇతరత్రా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా ఒకే ఫండ్ ద్వారా పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు ఉపయోగపడుతుంది.
ఐవెకో కొనుగోలుతో 10 లక్షల వాహనాలు లక్ష్యం!
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అంతర్జాతీయ వాణిజ్య వాహన (కమర్షియల్ వెహికల్స్) మార్కెట్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇటలీకి చెందిన ప్రముఖ ‘ఐవెకో’ కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరిన నేపథ్యంలో.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే వార్షిక అమ్మకాల్లో మిలియన్ (10 లక్షలు) యూనిట్ల మార్కును అధిగమించాలని కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ 29న జరిగిన కంపెనీ రెండో వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి టాటా మోటార్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కొన్ని విషయాలను వెల్లడించారు.కమర్షియల్ వెహికల్ బిజినెస్ ప్రత్యేకంగా విడిపోయి స్వతంత్ర సంస్థగా లిస్ట్ అయిన తర్వాత జరిగిన ఈ సమావేశంలో చంద్రశేఖరన్ ప్రసంగిస్తూ ప్రతిపాదిత ఐవెకో కొనుగోలు టాటా మోటార్స్ అంతర్జాతీయ ఆశయాలకు వేగాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.‘ఐవెకో గ్రూప్ ఏకీకరణతో ప్రాథమికంగానే మా ఉమ్మడి వ్యాపారం 6,00,000 వాహనాల వార్షిక వాల్యూమ్తో ప్రారంభమవుతుంది. రాబోయే సంవత్సరాల్లో 10 లక్షల వాహనాల మార్కును సులభంగా దాటగలము. ఈ వ్యూహాత్మక చర్యతో ప్రపంచవ్యాప్తంగా టాప్-4 అతిపెద్ద కమర్షియల్ వెహికల్ తయారీదారుల సరసన టాటా మోటార్స్ నిలుస్తుంది’ అని ఎన్.చంద్రశేఖరన్ అన్నారు.రెండో త్రైమాసికంలో డీల్ పూర్తిప్రస్తుతం ఈ కొనుగోలుకు సంబంధించి తుది విడత రెగ్యులేటరీ అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ డీల్ పూర్తిగా ముగుస్తుందని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐవెకోకు ఉన్న అధునాతన పవర్ ట్రెయిన్, నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతలపై టాటా మోటార్స్కు పూర్తి పట్టు లభిస్తుంది. తద్వారా కంపెనీ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో మరింత బలోపేతం కానుందని చెప్పారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు
క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అసాధారణ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. గూగుల్లో పిచాయ్తో కలిసి పనిచేసిన అగ్రశ్రేణి టెక్ నిపుణులు, ‘రూబ్రిక్’, ‘గ్లీన్’ సంస్థల సహ వ్యవస్థాపకుడు అరవింద్ జైన్ ఇటీవల ఫార్చ్యూన్ మ్యాగజైన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రపంచం వెర్రి ఆలోచన అని కొట్టిపారేసిన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్ట్ను పిచాయ్ ఎలా విజయతీరాలకు చేర్చారో, ఆయన పనితీరు నుంచి తాను నేర్చుకున్న పాఠాలేమిటో జైన్ వివరించారు.భారతదేశంలోని ఒక చిన్న పట్టణం నుంచి అమెరికాకు వెళ్లిన అరవింద్ జైన్ ప్రారంభంలో గూగుల్లో చేరినప్పుడు తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి లోనైనట్లు అంగీకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన అత్యంత నిపుణులైన సహోద్యోగుల మధ్య తానొక ‘మోసగాడిలా’ (అర్హత లేకపోయినా వచ్చినట్లు) భావించానని చెప్పారు. అయితే, ఆ ప్రతిభావంతుల మధ్య కొందరు మాత్రమే ఎందుకు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్నారనే విషయాన్ని ఆయన గమనించడం ప్రారంభించారు. అలా ఆయన దృష్టిని ఆకర్షించిన అగ్రగామి నాయకుడే సుందర్ పిచాయ్.‘నేను, సుందర్ గూగుల్లో చాలా కాలం కలిసి పని చేశాం. కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరినప్పటి నుంచి సుందర్ నాకు తెలుసు. గూగుల్లో బెస్ట్ స్కూల్స్ నుంచి వచ్చిన ఎందరో మేధావులు ఉన్నా వారందరూ ఉన్నతంగా రాణించలేకపోయారు. అప్పుడే అసలు విజయ సూత్రం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. చాలా కాలం కిందట ఆన్లైన్ బ్రౌజర్ల విభాగం పూర్తిగా మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంలో ఉండేది. అప్పటికే నెట్స్కేప్ వంటి దిగ్గజాలు విఫలమవడంతో గూగుల్ క్రోమ్ ప్రాజెక్టుపై పెద్దగా నమ్మకం లేదు. దాంతో నేను కూడా ఇది చాలా చెడ్డ ఆలోచన అని భావించాను. ఎందుకంటే నేను అంత లోతుగా ఆలోచించలేకపోయాను’ అని జైన్ పేర్కొన్నారు.అప్పట్లో మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ బాల్మర్ సైతం క్రోమ్ను ఒక సాధారణ ‘రౌండింగ్ ఎర్రర్’ (లెక్కలోకి తీసుకోనవసరం లేని పొరపాటు) అని బహిరంగంగా కొట్టిపారేశారు. అందరూ అసాధ్యం అనుకున్నచోటే పిచాయ్ తన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో క్రోమ్ను ముందుకు నడిపారు. ఫలితంగా 2012 నాటికి క్రోమ్ ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్గా అవతరించి ప్రత్యర్థులను వెనక్కి నెట్టింది. ఈ విజయమే ఆగస్టు 2015లో పిచాయ్ గూగుల్ సీఈఓగా ఎదగడానికి బలమైన పునాది వేసింది.పిచాయ్ విజయ సూత్రాలుఅరవింద్ జైన్ విశ్లేషణ ప్రకారం, సుందర్ పిచాయ్ శైలి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవే..కేవలం కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదు, లక్ష్యం పట్ల విపరీతమైన పట్టుదల ఉండాలి.గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ల తరహాలోనే పిచాయ్ మనసులో సాధ్యసాధ్యాలపై ఎలాంటి పరిమితులు లేవు.ప్రతి ఒక్కరూ తెలివితక్కువది, బహుశా వాస్తవాలకు దూరంగా ఉందని భావించే పనిని మనం చేయబోతున్నాం అని నమ్మినప్పుడే మ్యాజిక్ జరుగుతుంది.రూబ్రిక్, గ్లీన్ సంస్థలతో జైన్ సంచలనాలుసుందర్ పిచాయ్ నుంచి నేర్చుకున్న ఈ క్రేజీ థాట్స్ పాఠాలే అరవింద్ జైన్ను తదుపరి కాలంలో ఒక విజయవంతమైన బిలియనీర్గా మార్చాయి. తాను గూగుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జైన్ స్థాపించిన క్లౌడ్ డేటా మేనేజ్మెంట్ కంపెనీ రూబ్రిక్, 2024లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సుమారు 5.6 బిలియన్ డాలర్లతో లిస్ట్ అయింది. అనంతరం ఆయన ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'గ్లీన్' ప్రస్తుతం 7.2 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా దూసుకుపోతోంది.జెన్-జీ నుంచి నిరంతర అభ్యాసంప్రస్తుతం ఇంతటి అంతర్జాతీయ స్థాయి విజయాన్ని అందుకున్నప్పటికీ జైన్ తన సంస్థల్లోని యువతరం(జెన్ జీ) నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపారు. యువత సరికొత్త దృక్పథాలను, వినూత్న ఆలోచనలను తీసుకువస్తుందని, నేటి వేగవంతమైన టెక్ ప్రపంచంలో అప్డేట్గా ఉండటానికి వారి ఆలోచనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు
లీగల్ రివ్యూను ప్రశ్నించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఇటీవలి పరిణామాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజీనామాపై బ్యాంక్ యాజమాన్యం జరిపించిన చట్టపరమైన సమీక్షను బ్యాంక్ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి ప్రశ్నించారు. ఈ సమీక్ష అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందే తప్ప, ఇందులో వాస్తవాలు లేవని ఆరోపించారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.న్యాయ సంస్థల నివేదికపై అసంతృప్తితన రాజీనామా ప్రకటనను సమీక్షించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నియమించిన బాహ్య న్యాయ సంస్థలు (External Law Firms) సమర్పించిన నివేదికను అతాను చక్రవర్తి తప్పుపట్టారు. ఈ నివేదిక కేవలం ‘పరిమిత పరిధి/షరతులతో కూడిన నివేదిక’ అన్నారు. అంతర్గత అధికారుల ఇంటర్వ్యూల నుంచి సేకరించిన కొన్ని అంశాలు, బోర్డు సమావేశాల మినిట్స్పైనే ఈ నివేదిక ప్రధానంగా దృష్టి సారించిందని విమర్శించారు. బ్యాంక్లోని కొన్ని వ్యాపార పద్ధతులకు, తన వ్యక్తిగత విలువలకూ మధ్య వచ్చిన వైరుధ్యం వల్లే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అయితే, న్యాయ సంస్థలు ఈ ప్రాథమికాంశాన్ని వదిలేసి కేవలం కొన్ని అంశాలపైనే దృష్టి పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమీక్ష కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ‘వాడియా గాంధీ’, ‘విల్సన్ సోనీ’ అనే న్యాయ సంస్థలను నియమించినట్లు తెలుస్తోంది.బోర్డు తీరుపై ప్రశ్నలు‘నా నియామకం, రాజీనామా రెండూ కంపెనీల చట్టం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి లోబడే జరిగాయి. అలాంటప్పుడు ఈ సమీక్ష దేనికి? సమీక్ష కోసం న్యాయవాదులను నియమించడానికి గల నిబంధనలు లేదా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఏమిటో చెప్పాలని నేను బోర్డును పదేపదే కోరాను. కానీ, నా అభ్యర్థనలను బోర్డు పట్టించుకోలేదు. ఆ నిబంధనలను నాతో పంచుకోలేదు’ అని అతాను చక్రవర్తి అన్నారు.ఈ చట్టపరమైన నివేదికలను ఆయన అనవసరమైనవిగా కొట్టిపారేశారు. తన పదవీకాలంలో జరిగిన ‘ఏటీ-1 బాండ్ మిస్సెల్లింగ్’ కేసుపై బ్యాంక్ వేగంగానే స్పందించిందని చెప్పారు. అయితే, బోర్డు రూమ్ విషయాలు బోర్డు రూమ్లోనే ఉండాలనే నియమానికి కట్టుబడి తన రాజీనామాకు దారితీసిన నిర్దిష్ట వ్యాపార పద్ధతులు ఏమిటనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.త్వరలో కొత్త ఎండీ, సీఈఓఈ వివాదాల నడుమే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ గవర్నెన్స్ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంకుకు శాశ్వత ఛైర్మన్ నియామకాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీషన్ను తిరిగి నియమించే కసరత్తును ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నూతన ఛైర్మన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది బ్యాంక్ భవిష్యత్తు వ్యూహాలకు ఎంతో కీలకం కానుంది.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు
ఫ్యామిలీ
బస్స్టాపే పాఠశాలగా..!
కొంతమంది నిస్వార్థ సేవకు కేరాఫ్గా ఉంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తూ..నిశబ్దంగా ఉంటారు. వారి సేవ ప్రజలో, మరెవరూ చూసి గుర్తించి చెబితే గానీ తెలియదు. అయినా మంచి పనికి హంగామా, ఆర్భాటాలతో పని ఉండదనిపిస్తుంది అలాంటి వాళ్లను చూస్తే. అచ్చం అలాంటి నిస్వార్థ సేవనే చేసున్నాడో వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోని చూస్తే మానవత్వంపై నమ్మకం వస్తుంది. స్వార్థపూరిత ప్రప్రంచంలో నిస్వార్థం మిణమిణకుమంటూ ఇంకా ఉందని అనిపిస్తుంది. ఆ వీడియోలో గురుగ్రామ్కు చెందిన ఒక వ్యక్తి బస్స్టాప్ వద్ద పేద పిల్లల సముహానికి పాఠాలు చెబుతుంటాడు. ఆ వీడియోలో పిల్లలంతా నేలపై చాప మీద కూర్చొని పుస్తకాలు, నోట్బుక్లతో కనిపించగా, మరొక చిన్నారి బోర్డుపై ఏదో రాస్తూ కనిపిస్తుంది. అలాగే ఉపాధ్యాయుడి కనిపిస్తున్న వ్యక్తి పిల్లల వెనుక నిలబడి వారేవిధంగా నేర్చుకుంటున్నారో నిశితంగా పరిశీలిస్తుండటం చూడొచ్చు. ఈ తతంగం మొత్తం అటుగా వెళ్తున్న కారులోని ఒక ప్రయాణికుడు రికార్డు చూసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి నిస్వార్థమైన పని చూని ముగ్ధుడవ్వడమే కాదు ఆ వ్యక్తిని అభినందించినట్లు తెలిపాడు. అక్కడున్న పిల్లలు కూడా ట్రాఫిక్ని, వాహనాలను ఏమి పట్టించుకోకుండా చదువుపై దృష్టిసారించడం విశేషం. ఇలా బహిరంగ ప్రదేశాన్ని తరగతి గదిగా మార్చి, చదువుకోవడానికి వచ్చే పేద పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మనుసుకు హత్తుకునే ఈ దృశ్యంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తరగతి గది నాలుగు గోడల మధ్యే కాకుండా, ఆరు బయట కూడా విద్యను అభ్యసించవచ్చని ఈ సంఘటన గుర్తుచేస్తుందని చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by The Global Hues (@theglobalhues) (చదవండి: జస్ట్ 24 వారాల్లో 25 కిలోలు తగ్గింది..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..)
జస్ట్ 24 వారాల్లో 25 కిలోలు బరువు ..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..
బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ కఠినమైన ఆహార నియమాలు లేదా తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని కొందరు ఫిట్నెస్ ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. కేవలం నిలకడతో జీవనశైలి మార్పులను అనుసరిస్తే చాలంటున్నారు. తాజాగా మరో ఫిట్నెస్ నిపుణుడు అలా చేసే జస్ట్ ఆరు నెలల్లో 25 కిలోలు పైనే తగ్గి చూపించాడు. తన శరీరాకృతిని స్లిమ్గా మార్చుకోవడానికి సహాయపడిన ఆచరణాత్మక నియామాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అవేంటంటే..ఫిట్నెస్ నిపుణుడు జీషన్అలీ తాను సులభమైన జీవనశైలి మార్పులతోనే 25 కిలోలు పైనే తగ్గానని అన్నారు. కడుపు నిండినట్లు అనిపించకపోవడమే అధికంగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుందని అన్నారు. ఫలితంగా జింక్ ఫుడ్పైకి మనసు మళ్లుతుందని అన్నారు. అందుకోసం తాను జస్ట్ మూడు నియమాలను పాటించానని అన్నారు.నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి..నీరు తాగండి..నిద్ర నీరు రహస్య ఆయుధాలని నొక్కి చెబుతున్నాడు. తాను ప్రతి రాత్రి 10:30 గంటలకల్లా పడుకునేవాడినని, రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగేవాడినని అన్నారు. ఇక్కడ ఎక్కువ నిద్ర, ఎక్కువ నీరు అంటే.. ఎక్కువ శక్తి, తక్కువ ఆకలి అని చెప్పారు. ప్రతిరోజు ఒక దినచర్యను పాటించడం..అంటే నిద్ర, జిమ్, వాకింగ్లకు సమాన ప్రాధాన్యతి ఇస్తూ చేయాలి. ముందుగా ప్లాన్ చేసుకుని అనుసరిస్తే..సవ్యంగా ఉంటుంది లేదంటే ఆ ప్లాన్ కాగితానికే పరిమితం అవుతుందని అంటున్నారు.తగినంత ప్రోటీన్ తీసుకోండి..అతని బరువు తగ్గే ప్రయాణంలో ఆకలిని నియంత్రించడంలో ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు. తాను తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ..ప్రోటీన్ మాత్రం రోజుకి 180–200 గ్రాములకు పరిమితం చేశానని అన్నారు. కండరాలను కాపాడుకోవడానికి, ఆకలి కోరికలు తగ్గించుకోవడానికి, అలాగే జీవక్రియను మెరుగ్గా ఉంచడానికి ఇది ఉపకరిస్తుందని అన్నారు. దీనివల్ల పొట్టకొవ్వు వేగంగా తగ్గుతుందని చెబుతున్నారు. అలా 46 ఏళ్ల వయసులో 24 వారాల్లో తాను 101 కేజీల నుంచి 76 కేజీలకు తగ్గానని చెప్పారు. View this post on Instagram A post shared by Zee Ali - South Asian Health and Fitness Expert (@_zeeali1)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'టైప్రైటర్'తో అద్భుతమైన చిత్రం..! ఆ క్రియేటివిటీకి మాటల్లేవ్ అంతే)
వేరు కాపురం పెడితేనే సంసారానికి వస్తా..!
ఆదోనికి చెందిన దుస్తుల వ్యాపారి రవిచంద్రకు ఇటీవలే వివాహమైంది. వివాహమైన కొన్నాళ్లకే వేరుకాపురం పెట్టాలని భార్య పోరు పెట్టసాగింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి వేరు కాపురం పెట్టేందుకు రవిచంద్రకు ఇష్టం లేదు. అలాగని ప్రేమగా చూసుకునే భార్య మాటను కాదనలేక లోలోపల సతమతమవుతూ నిద్రలేని రాత్రిళ్లు గడపసాగాడు. ఈ క్రమంలో అతనికి యాంగ్జైటీ, డిప్రెషన్ చుట్టుముట్టాయి. చికిత్స నిమిత్తం వైద్యుని వద్దకు అతన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అతని గురించి తెలుసుకున్న డాక్టర్ కుటుంబసభ్యులందరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే రవిచంద్రకు కొన్ని మందులు సూచించి పంపించాడు. కర్నూలు నగరంలోని గణేష్నగర్కు చెందిన శివకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను చేస్తున్న ఉద్యోగంలో ఇస్తున్న లక్ష్యాలు చేరుకోవడానికి అతను నిత్యం శ్రమించేవాడు. లక్ష్యాలను చేరుకునే క్రమంలో అతను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. అది కాస్తా పానిక్ అటాక్గా మారడంతో కుటుంబసభ్యులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పని ఒత్తిడి అన్ని చోట్లా ఉంటుందని, ప్రణాళికతో పని చేసుకుంటే ఏ పనైనా సులభమవుతుందని డాక్టర్ కౌన్సెలింగ్ చేసి పంపించాడు. మానసిక ఒత్తిళ్లతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఒకప్పుడు ఆధునిక జీవితం లేదు. ఖర్చులు తక్కువగా ఉన్నా ఇంట్లో ఒకరు సంపాదించినా కుటుంబమంతా హాయిగా జీవించేది. కానీ ఇప్పుడు ఇంట్లో అందరూ సంపాదించినా ఖర్చులకు సరిపోక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పుడంతా ఆధునిక సమాజం. పక్కవారిని చూసి ఆధునికతను అందుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. పక్కవారితో పోల్చుకోవడంతో దానిని అందుకోలేక ఒత్తిడికి గురవుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీ చికిత్సకు ప్రతి రోజూ 100 నుంచి 120 మంది దాకా వివిధ మానసిక వ్యాధులతో బాధపడే వారు వస్తున్నారు. అందులో 40 శాతం కొత్తవారు ఉంటున్నారు. చికిత్సకు వచ్చిన వారిలో అధిక శాతం బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకునేవారు ఉంటున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స చేసి పంపిస్తున్నారు. ఈ సమయంలో రోగితో మసలుకోవాల్సిన తీరు గురించి కుటుంబసభ్యులకూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు రంగంలోనూ 25 మంది దాకా మానసిక వైద్యులు ఉన్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 150 నుంచి 200 మంది దాకా చికిత్స కోసం వెళ్తున్నారు. వీరే గాక జనరల్ ఫిజీషియన్లు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టుల వద్దకు వెళ్లే వారిలోనూ 20 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడేవారు ఉంటున్నారు. చికిత్సకు వెళ్లేవారిలో 30 శాతం మంది వృద్ధులు, 5 శాతం మంది పిల్లలు ఉండగా మిగిలిన వారిలో యువత, మధ్యవయస్సు వారు ఉంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. నిద్ర పట్టక..నిద్ర సరిపోక! పలు రకాల కారణాలతో మానవుని శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా మెదడులో కలిగే పలు రసాయన చర్యల ఫలితంగా పలు వ్యాధులకు ఆహ్వానం లభిస్తోంది. ఇందులో బీపీ, షుగర్, గుండెజబ్బులు, థైరాయిడ్ ప్రధానమైనవి. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే షుగర్, థైరాయిడ్ సమస్యలున్న వారి శరీరం తీవ్ర ఒడిదుడుగులకు లోనవుతూ ఉంటుంది. ఒక సమస్యను తగ్గించుకుంటే మరో సమస్య లేచి కూర్చుంటుంది. ఈ క్రమంలో ఈ రెండు సమస్యలున్న వారు తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ క్రమంలో సరైన నిద్రపట్టక, నిద్రసరిపోక, వ్యాధులు నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడేవారి సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. ఈ సమస్యలకు మూలం శారీరక శ్రమ లేకపోవడం, నియంత్రణలేని ఆహారం, ఎక్కువసేపు టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లను చూడటమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మానసిక రోగుల సంఖ్య పెరుగుతోంది గతంతో పోలిస్తే ప్రస్తుతం మానసిక జబ్బులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. వివిధ రకాల కారణాలతో మానసిక సమస్యలు అధికం కావడంతో పాటు ఆసుపత్రిలో మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుందన్న అవగాహన ప్రజల్లో పెరిగింది. ఈ కారణంగా మానసిక పరివర్తనలో ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆల్కహాలు, మత్తు పదార్థాలకు అడిక్షన్ అయిన వారు, బెట్టింగ్లకు బానిసైన వారు తమ వద్దకు ఎక్కువగా వస్తున్నారు. అన్ని రకాల మానసిక సమస్యలకు ఇక్కడ చికిత్స అందిస్తున్నాం. –డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, హెచ్ఓడీ, మానసిక జబ్బుల విభాగం, జీజీహెచ్, కర్నూలుయువత..పెడదోవ ఇటీవల కాలంలో యువతలో మానసిక సమస్యలు ఎక్కువైనట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా ఎక్కువ మంది గాంబ్లింగ్, బెట్టింగ్, మొబైల్ నెట్ అడిక్షన్తో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా యువతలో మొబైల్ గేమింగ్ దురలవాటు ఎక్కువైనట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో సొమటోఫామ్ డిజార్డర్ వేధిస్తున్నట్లు వారు గుర్తించారు. వివిధ రకాల ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బు పోగొట్టుకుని, దానివల్ల అప్పులు చేసి, వాటిని తీర్చలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు.
డేటా దండుపాళ్యం.. మీపై స్మార్ట్ నిఘా!
టెక్నాలజీ దూకుడు ఎక్కువయ్యాక ప్రపంచం ‘జగమంత స్మార్ట్ కుటుంబం’ అయిపోయింది. ఇళ్లు, వాకిళ్లు, వంటిళ్లు ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతున్నాయి. ఎయిర్ ఫ్రైయర్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఆఖరికి టూత్బ్రష్లను కూడా ఇంట్లోని నెట్ నడిపిస్తోంది. కానీ, ఈ సౌకర్యాలు, సదుపాయాల వెనుక మనకు తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్కు చెందిన ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ (ఐసీవో), ‘విచ్’ అనే సంస్థ కలిసి ప్రత్యక్షంగా తమ దేశ పౌరులను, పరోక్షంగా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నాయి.ఏమిటా ప్రమాదం?!డీప్ ఫ్రయింగ్, తందూరీ రోస్టింగ్–గ్రిల్లింగ్, రీహీటింగ్, బేకింగ్, బంగాళా దుంపల చిప్స్.. వీటన్నిటి తయారీకి వంటగదుల్లో మనం వినియోగించే ఎయిర్ ఫ్రయర్లు మన లొకేషన్ను ట్రాక్ చేస్తున్నాయని, మన మాటలను రికార్డ్ చేస్తున్నాయని, ఆ సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపుతున్నాయని ఆ మధ్య కొన్ని వార్తలు కలకలం రేపాయి. అయితే అవి కేవలం వార్తలు కావని, వాస్తవాలేనని ఐసీవో, విచ్ ఇప్పుడు నిర్ధారణగా ప్రకటించాయి! అలాగే, మన ఇళ్లల్లో రాత్రింబవళ్లు నడిచే స్మార్ట్ టీవీలు మనం ఎప్పుడు, ఏమి వీక్షిస్తున్నామో గమనిస్తూ మన వ్యక్తిగత వివరాలను ప్రకటనల కంపెనీలకు విక్రయిస్తున్నాయట!బ్రిటన్ లాంటి దేశాల్లోనే మూడింట ఒక వంతు ప్రజలు ఇంతకాలం తమ డేటా ఎలా చోరీ అవుతోందో కనిపెట్టలేకపోయారు. ఇక మన దేశంలోని పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించవచ్చు! భారత్లో ‘డిజిటల్ ఇండియా’ విప్లవం తర్వాత కోట్లాది మంది ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు కనుక మనపై స్పయింగ్కు సహజంగానే ఎక్కువ అవకాశం ఉంటుంది.మాటల్నీ రికార్డు చేస్తుంటాయి!టోస్టర్లు, ఎయిర్ ఫ్రయర్ల వంటి స్మార్ట్ పరికరాలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉండవచ్చని ఐసీవో అప్రమత్తం చేశాక బ్రిటన్ ప్రజల్లో జాగ్రత్త మొదలైంది. అక్కడి జనాభాలో దాదాపు 97 శాతం మంది కనీసం ఒక స్మార్ట్ పరికరం వాడుతుండగా, అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమాచారాన్ని ఆ పరికరాలు వినియోగదారుల నుంచి సేకరిస్తున్నాయని ‘విచ్’ పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నెట్తో పనిచేసే కొన్ని ఎయిర్ ఫ్రయర్లు, ‘ఆన్’ చేయగానే వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ అడుగుతాయి. అంతేకాదు వారి ఫోన్ల ద్వారా ఆడియోను (మాటలను) కూడా రికార్డ్ చేస్తుంటాయి. మరింతగా మెరుగైన సేవల్ని అందించటానికి వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంటామని ఆ గాడ్జెట్లు చెబుతుంటాయి. అయితే అవి, తాము సేకరించిన సమాచారంలో కొంత భాగాన్ని చైనా సర్వర్లకు చేరవేస్తున్నట్లు ‘విచ్’ పరిశోధనలో బహిర్గతం అయింది.దినచర్యల వివరాలు సైతం!!‘విచ్’ బ్రిటన్లోని అతి పెద్ద వినియోగదారుల హక్కుల పరిరక్షక, పర్యవేక్షక స్వతంత్ర సంస్థ. ‘‘మీ ఇంట్లో ఉండే గాడ్జెట్లు అన్నింట్లోకీ స్మార్ట్ టీవీ మరీ ప్రమాదకరంగా మారుతోంది. మీరు ఏ సమయంలో ఏ కార్యక్రమాలు చూస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఇది సేకరిస్తుంది’’ అని విచ్ చెబుతోంది. ‘‘మీకు, మీ కుటుంబ సభ్యులకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి మీ ఇంట్లోని టీవీలు మీ సమాచారాన్ని పూర్తిగాలాగేస్తుంటాయి’’ అని ఐసీవో రెగ్యులేటరీ రిస్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విలయం మాల్కం అంటున్నారు. ‘‘స్మార్ట్ పరికరాలు మన ఆరోగ్యం, మన దినచర్యలు, మన కుటుంబ జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి’’ అని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.స్మార్ట్ పరికరాలను తయారుచేసే కంపెనీలు, డెవలపర్ల కోసం ఐసీవో ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సమయంలోనే ఈ తాజా హెచ్చరిక వెలువడింది. వినియోగదారుల సమాచారాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై కంపెనీలకు ఇందులో కొన్ని నియమాలను పొందుపరిచారు. వినియోగదారుల ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం వంటి కొన్ని సరైన కారణాల కోసం కొంత సమాచారాన్ని సేకరించేందుకు మాత్రమే ఐసీవో అంగీకరించింది. అయితే స్మార్ట్ పరికరాలు వాటికి నిజంగా అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలని, ఆ సమాచారాన్ని ఎలా వాడుతున్నారనేది కూడా స్పష్టంగా చెప్పాలని, ఆ సమాచారంపై ప్రజలకే నియంత్రణ ఉండాలని తాజాగా స్పష్టం చేసింది.కొనడం ఆపటం లేదు!ఇంట్లోని స్మార్ట్ పరికరాలు తమ సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్న లక్షలాది మంది బ్రిటన్ ప్రజలకే కాదు, మిగతా ప్రపంచదేశాలకూ ఈ నియమాల విధింపు మంచి పరిణామం. బ్రిటన్కి చెందిన 2,000 మందికి పైగా వయోజనులపై ఐసీవో చేసిన సర్వేలో... తమ పరికరాలు సమాచారాన్ని ఎలా సేకరిస్తాయో, ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాయో తమకు తెలియదని మూడింట ఒక వంతు మంది ప్రజలు చెప్పారు.అలాగే, ఒక స్మార్ట్ టోస్టర్ (బ్రెడ్ కాల్చేది) లేదా స్మార్ట్ టూత్బ్రష్ కూడా తమ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని తెలిసి ఆశ్చర్యపోయామని సర్వేలో పాల్గొన్నవారిలో ముప్పావు వంతు మంది చెప్పారు. ఈ సమాచార సేకరణ పట్ల తమకు ఆందోళన ఉందని 40 శాతం మంది బ్రిటన్ ప్రజలు చెబుతుండగా, మరికొందరు (15 శాతం మంది) ఇదే కారణంతో ఇలాంటి సాంకేతిక పరికరాలను అస్సలు కొనడం లేదు. అయినప్పటికీ, బ్రిటన్ ప్రజలు తమ ఇళ్లను ఇలాంటి నిఘా పెట్టే పరికరాలతో నింపేయడం మాత్రం ఆపలేదు.పైగా ఈ డేటా సేకరణ వల్ల వచ్చే వినియోగ పరమైన లాభాల కోసం స్మార్ట్ పరికరాలను కొనడానికి సిద్ధంగా ఉన్నామని యూకేలోని దాదాపు సగం మంది వినియోగదారులు చెబుతున్నారు. దీనిపై మాల్కం మాట్లాడుతూ: ‘‘ఈ పరికరాలు మన జీవితాలను సులభతరం చేయడానికి తయారవుతాయి. అంతకు మించి వీటికి మన వ్యక్తిగత గోప్యతను పణంగా పెట్టకూడదు’’ అంటున్నారు.డేటాను లాగి, ఏం చేస్తారు?మనం టీవీలో ఏమేం చూస్తున్నామో పూర్తి వివరాలను తెలుసుకొని, మన అలవాట్లకు సంబంధించిన ఒక పెద్ద నివేదికను తయారు చేయడానికి గాడ్జెట్లు చాలా సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ సమాచారాన్ని మనకు నచ్చే షోలు లేదా సినిమాలను సూచించడానికి ఉపయోగించవచ్చు, అలాగే మనకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి కూడా వాడుకోవచ్చు. అయితే ఇలా ప్రకటనలు చూపించటం వరకు పర్వాలేదని, టీవీ తయారీ కంపెనీలు అంతకంటే ముందుగా వినియోగదారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఐసీవో ఆదేశాలు జారీ చేసింది.ఇక గాడ్జెట్ తయారీ కంపెనీలు చట్టాన్ని పాటిస్తున్నాయా లేదా, వినియోగదారులకు నిజమైన పారదర్శకతను అందిస్తున్నాయా లేదా, వారి అనుమతిని నిజంగానే తీసుకుంటున్నాయా లేదా అని పరిశీలించడానికి ‘విచ్’ సంస్థ ఈ ఏడాది చివర్లో ఆయా కంపెనీలతో మాట్లాడనుంది.ఏమైనా, కన్జ్యూమర్ల డేటా చైనా వంటి ప్రమాదకర దేశాలకు చేరడం వల్ల ముఖ్యంగా గోప్యతా ప్రమాదాలు ఉంటాయి. చైనా చట్టాల ప్రకారం అక్కడ ఉండే కంపెనీలు తమ వద్ద ఉన్న డేటాను అక్కడి ప్రభుత్వానికి తప్పనిసరిగా అప్పగించాలి; దీనివల్ల మీ వై–ఫై నెట్వర్క్ వివరాలు, లొకేష¯Œ , డివైజ్ పాస్వర్డ్లు వేరే దేశం చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత ప్రొఫైల్ను బిల్డ్ చేసి, మీ ప్రమేయం లేకుండానే థర్డ్–పార్టీ సంస్థలకు ఆ డేటాను అమ్ముకోవడం లేదా ప్రకటనల కోసం వాడుకునే అవకాశం ఉంటుంది.చైనా సర్వర్లకు మన వివరాలు!విచ్ సంస్థ చేసిన పరిశోధనలో ఐగోస్టార్, షియోమి మి స్మార్ట్, కొసోరి అనే మూడు కంపెనీల ఎయిర్ ఫ్రయర్ల వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ తెలుసుకుంటున్నాయని, యూజర్ల ఫోన్లలోని ఆడియోను రికార్డ్ చేయడానికి అనుమతి అడుగుతున్నాయని తేలింది.షియోమి ఎయిర్ ఫ్రయర్కు సంబంధించిన యాప్... ఫేస్బుక్, పాంగిల్ (ఇది టిక్టాక్ బిజినెస్ ప్రకటనల నెట్వర్క్), చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్ వంటి వాటి ట్రాకర్లకు కనెక్ట్ అయి ఉంది. (ఇది వినియోగదారుడు ఉండే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది). మరోవైపు, ఐగోస్టార్ ఎయిర్ ఫ్రయర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే వినియోగదారుల జెండర్, పుట్టిన తేదీని అడుగుతోంది. అంతేకాదు, ఐగోస్టార్, షియోమి ఎయిర్ ఫ్రయిర్లు రెండూ తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపించాయి. అయితే ఆ విషయాన్ని వారు తమ ప్రైవసీ నోటీసులో ముందే పేర్కొన్నారు. ఇక కొన్ని స్మార్ట్ స్పీకర్లలో కూడా ఫేస్బుక్, గూగుల్కు సంబంధించిన ఇలాంటి ట్రాకర్లు కిక్కిరిసినట్లుగా నిండి ఉన్నాయి! ‘‘మన లొకేషన్ను ట్రాక్ చేసే ఎయిర్ ఫ్రయర్ల నుండి, మన పుట్టిన తేదీని అడిగే స్మార్ట్ వాషింగ్ మెషీన్ల వరకు... ఈ స్మార్ట్ పరికరాలు వాటికి అవసరమైన దానికంటే లేదా మనం అంగీకరించదగిన దానికంటే చాలా ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని మా గత పరిశోధనలు పదే పదే నిరూపించాయి’’ అని విచ్ సంస్థకు చెందిన టెక్ నిపుణుడు ఆండ్రూ లాఫ్లిన్ వెల్లడించారు.‘‘అవసరం లేని సమాచార సేకరణను తగ్గించడం, పారదర్శకతను పెంచడం, వినియోగదారులకు వారి సమాచారంపై మరింత నియంత్రణను ఇవ్వడంపై నిఘా సంస్థ (రెగ్యులేటర్) కొత్త మార్గదర్శకాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచి విషయం’’ అని ఆయన అంటున్నారు. ఇక, స్మార్ట్ టీవీలు సేకరిస్తున్న అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారంపై తమకు ప్రత్యేక ఆందోళనలు ఉన్నాయని కూడా ఐసీవో తెలిపింది.స్మార్ట్ వలలో పడకుండా ఐదు చిట్కాలుమీ స్మార్ట్ పరికరాలు మీపై నిఘా పెట్టకుండా కాపాడుకోవడానికి ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ 5 చిట్కాలు చెబుతోంది. కొనడానికి ముందే రీసెర్చ్ (పరిశోధన) చేయండి: మీరు ఏదైనా పరికరాన్ని కొనే ముందే, అది ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తుందో సరిచూసుకోండి. ఆ పరికరం అడిగే సమాచారాన్ని దానికి ఇవ్వడం మీకు ఇష్టమేనా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.పర్మిషన్లపై (అనుమతులపై) నియంత్రణ కలిగి ఉండండి: పరికరాన్ని సెటప్ చేసేటప్పుడు, అది ఏయే విషయాలను యాక్సెస్ చేయాలో నియంత్రించడానికి ‘ప్రైవసీ కంట్రోల్స్’ ఉపయోగించండి. ఏదైనా అనుమతి అనవసరం అనిపిస్తే, దానికి అస్సలు అంగీకరించకండి.మీ పరికరానికి భద్రత కల్పించండి: ఇతరులు మీ పరికరాన్ని వాడుకోకుండా ఉండటం కోసం ఒక బలమైన, విభిన్నమైన పాస్వర్డ్ను సెట్ చేసుకోండి. వీలైనప్పుడల్లా ‘టూ–స్టెప్ వెరిఫికేషన్’ ఆన్ చేసుకోండి.అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి: సాఫ్ట్వేర్ అప్డేట్స్ను క్రమం తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులోని సెక్యూరిటీ ప్యాచెస్ కొత్త ముప్పుల నుండి మీ డేటాను రక్షిస్తాయి.పరికరాన్ని వదిలించుకునే ముందు మీ డేటాను పూర్తిగా తుడిచేయండి: మీరు మీ స్మార్ట్ పరికరాన్ని ఎవరికైనా అమ్మేస్తున్నా లేదా పారేస్తున్నా... ముందుగా దాన్ని ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయండి. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం మొత్తం డిలీట్ అయిపోతుంది. - సాక్షి స్పెషల్ డెస్క్
అంతర్జాతీయం
'ఇరాన్ను లేకుండా చేస్తాం'.. 'నరకం చూపిస్తాం'!
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే.. ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్పై దాడి జరిగిందని ఆరోపిస్తూ అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిగా అమెరికా గల్ఫ్ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న పనామా జెండా కలిగిన కికు (KIKU) అనే చమురు ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్తో దాడి చేసిందని అమెరికా ఆరోపించింది. సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును తీసుకెళ్తున్న ఈ నౌక దెబ్బతిన్నప్పటికీ సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. దీనికి ప్రతిగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్లోని 10 కీలక సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, సముద్ర మైన్లను మోహరించే సామర్థ్యాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇచ్చినా.. ఇరాన్ మళ్లీ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపించింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ఆయన, అవసరమైతే అమెరికా యుద్ధాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశమే ఇక ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ పూర్తిగా తమదేనని మరోసారి స్పష్టం చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ.. తమ నిబంధనలను ఉల్లంఘించే నౌకలు ఉద్రిక్తతలకు కారణమవుతాయని హెచ్చరించారు. అదే సమయంలో, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే నరకాన్ని అనుభవిస్తాయి అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నేవీ కమాండర్ హెచ్చరించారు. మరోవైపు పశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బహ్రెయిన్లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే కువైట్ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంటున్నాయని తెలిపింది. గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.అయితే తీవ్ర సైనిక ఉద్రిక్తతల మధ్య కూడా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్లో శాంతి చర్చలపై అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ దాడులతో.. 60 రోజుల వ్యవధిలో శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. అయితే.. మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, పాకిస్తాన్ల విజ్ఞప్తితో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలకు ముందుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. మంగళవారం లేదంటే ఈ వారంలోనే దోహాలో సమావేశమై హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర భద్రత, కాల్పుల విరమణ అమలుపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సఫలమైతే ప్రాంతంలో యుద్ధ ముప్పు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. మరోవైపు ఇరు దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలు మధ్యప్రాచ్యాన్ని మరోసారి అగ్నిగుండంలా మార్చే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.
మళ్లీ దాడులు షురూ
దుబాయ్: పశ్చిమాసియాలో శాశ్వత శాంతి ఒప్పందం కోసం ఓవైపు మధ్యవర్తిత్వం కొనసాగుతుండగా మరోవైపు అమెరికా, ఇరాన్లు దాడుల పర్వాన్ని నెమ్మదిగా మొదలెడుతున్నాయి. సరకు రవాణా నౌకపై ఇరాన్ దాడిచేసినందుకు ప్రతిగా ఇరాన్పై దాడులు చేశామని ప్రకటించిన అమెరికాకు దీటుగా బదులిస్తామంటూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) ఆదివారం అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, కువైట్లపై క్షిపణుల వర్షం కురిపించింది. డ్రోన్లతో తెగబడింది. ఇకనైనా అమెరికా దాడులు ఆపకపోతే శాశ్వత శాంతి ఒప్పందం చర్చలకు చరమగీతం పాడతామని ఇరాన్ హెచ్చరించింది. హార్మూజ్పై ఇరాన్ ఆధిపత్యాన్ని గండికొట్టేలా ఒమన్ తీరం వెంట ఇరువైపులా రాకపోకలకు వీలుగా కొత్త జలసంధి మార్గాన్ని విస్తృతపరచాలని అమెరికా భావిస్తున్న వేళ ఈ పరస్పర దాడులు జరగడం గమనార్హం. తాజా దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందించారు. ఆదివారం ఇరాక్లో పర్యటన సందర్భంగా బాగ్దాద్లో ఆయన మాట్లాడారు. ‘‘ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా తీసుకునే నిర్ణయాలు హార్మూజ్ జలసంధిలో కొత్త ఉద్రిక్తతలను రాజేయడం ఖాయం. గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపేలా అమెరికా ఒత్తిడితేవాల్సిందే’’ అని అన్నారు. ఆదివారం ఉదయం ఇరాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని కువైట్ తెలిపింది. వాళ్లు బుద్ధి తెచ్చుకోరేమో: ట్రంప్ ఇరాన్పై దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్థించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్కు బుద్ధిచెప్పేందుకే మేం ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలపై, రాడార్ వ్యవస్థలపై దాడి చేశాం. ఇరాన్ ఎప్పటికీ బుద్ధి తెచ్చుకోదేమో. ఇలాగే కొనసాగితే మేం శాంతియుతంగా ఉండలేం’’ అని అన్నారు.
మారిషస్ ప్రధానితో భేటీ
విక్టోరియా: ప్రధాని మోదీ ఆదివారం మారిషస్ ప్రధానమంత్రి నవీన్చంద్ర రామ్గూలమ్తోనూ సమావేశమయ్యారు. భారత్, మారిషస్ ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. పరస్పర సహకారం, సముద్ర భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరువురు నేతలు భారత్– మారిషస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు.
హిందూ మహాసముద్రం అవకాశాల సంద్రం
విక్టోరియా: భాగస్వామ్యం అనేది దేశ పరిమాణంపై కాకుండా పరస్పర గౌరవం, విశ్వాసంపై ఆధారపడి ఉండాలని భారత ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఆర్థిక శ్రేయస్సుతో పాటు సముద్ర భద్రత కూడిన సుసంపన్న హిందూ మహాసముద్రాన్ని భారతదేశం ఆకాంక్షిస్తోందని అన్నారు. భారత్, సీషెల్స్ దేశాల రక్షణ, భద్రతలు ఒకదానికొకటి విడదీయరానివని స్పష్టంచేశారు. హిందూ మహాసముద్రాన్ని అవకాశాల సముద్రంగా మార్చడమే తమ ధ్యేయమని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆదివారం సీషెల్స్లోని విక్టోరియా నగరంలో సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశమయ్యారు. ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. హెర్మినీతో భేటీ అనంతరం మోదీ మాట్లాడారు. హిందూ మహాసముద్రం మన ఉమ్మడి ఇల్లు అని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సముద్ర భద్రత, సుస్థిరత, శ్రేయస్సు మన ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. భారతదేశపు మహాసాగర్ (ప్రాంతాలవ్యాప్తంగా భద్రత, వృద్ధి కోసం పరస్పర మరియు సంపూర్ణ పురోగతి) దార్శనికతకు ఇదే మూలమని తెలిపారు. వృద్ధి కోసం నూతన అవకాశాల అన్వేషణ భారత్, సీషెల్స్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంపై చర్చించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. పరిశ్రమలు, అనుసంధానం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు సహా ఇతర రంగాల్లో వృద్ధి కోసం రెండు దేశాలు నూతన అవకాశాలను అన్వేషిస్తాయని చెప్పారు. వాతావరణ మార్పులపై పోరాడుదాం తర్వాత సీషెల్స్ నేషనల్ అసెంబ్లీలో మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలు.. ముఖ్యంగా ద్వీప దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ఇప్పటికే తీరప్రాంతాలు, సముద్ర జీవావరణ వ్యవస్థలు, వాతావరణ సరళి, సమాజాలపై కనిపిస్తున్నాయని చెప్పారు. ఆయన ఆదివారం సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించారు. వాతావరణ మార్పులకు అతి తక్కువగా కారణమైవారు దాని పర్యవసానాల అత్యధిక భారాన్ని మోయకూడదని స్పష్టంచేశారు. వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరింత సమ్మిళిత ప్రపంచం, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించే అంతర్జాతీయ సంస్థల పట్ల భారత్, సీషెల్స్ ఒకే దృక్పథాన్ని పంచుకుంటున్నాయని గుర్తుచేశారు. గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి నిబద్ధతను చాటుతున్నాయని పేర్కొన్నారు.19 కీలక అంశాలపై నిర్ణయం రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భారత్, సీషెల్స్ తీర్మానించుకున్నాయి. భారత ప్రధాని మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో 19 అంశాలపై నిర్ణయానికి వచ్చారు. ఇందులో నేరస్తుల అప్పగింత ఒప్పందం, బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంలో సహకార ఒప్పందం, సీషెల్స్లో యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఒప్పందం, ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సమగ్ర రుణ ఒప్పందం, నూతన సీషెల్స్ జాతీయ ఆసుపత్రికి సహకార ఒప్పందం ఉన్నాయి. సీషెల్స్కు ఒక వేగవంతమైన గస్తీ నౌకను బహుమతిగా ఇవ్వడం, రక్షణ దళానికి 10 యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ తరగతి పడవలను అప్పగించడం, తీర రక్షక దళం బలోపేతానికి సహకరించడం, గ్లాస్ కాక్పిట్తో ఒక డోర్నియర్ విమానాన్ని ఉన్నతీకరించడం వంటి అంశాలను ఇరు పక్షాలు ప్రకటించాయి. దౌత్య శిక్షణ కోసం సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సరీ్వస్, సీషెల్స్ విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. మోదీకి సీషెల్స్ గౌరవ పురస్కారం ప్రదానం ప్రధాని మోదీకి సీషెల్స్ ప్రభుత్వం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’అనే గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ ఆయనను ఈ పురస్కారంతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మోదీ చూపుతున్న నిబద్ధత, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవాన్ని అందించారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లతో పోరాడుతున్న దేశాలకు, పర్యావరణ పరిరక్షణను భవిష్యత్ తరాల పట్ల తమ బాధ్యతగా భావిస్తున్న దేశాలకు అవార్డ్ను అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు.
జాతీయం
ఇల్లు ఊడ్చా.. అంట్లు తోమా.. అయినా కొట్టేవారు!
ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు. భార్య చెప్పిందని తల్లిదండ్రుల్ని వదిలేసి.. వేరు కాపురం పెట్టాడు. అత్తింటి వారినే తన సొంత తల్లిదండ్రులుగా భావించాడు. వాళ్లు చెప్పిన ప్రతి మాటను కాదనకుండా పాటించాడు. ఆ కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు. కానీ చివరికి అతని జీవితమే విషాదాంతమైంది. మరణానికి ముందు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందంటే..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతుల్ సుభాష్ కేసు గుర్తుందా?. మరణానికి ముందు ఆయన విడుదల చేసిన దాదాపు 81 నిమిషాల వీడియో, 24 పేజీల సూసైడ్ నోట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. భార్య, అత్తింటి వేధింపుల ఆరోపణలతో ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు, ఆయన రాసిన లేఖలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఇది కూడా. భార్య, అత్తింటి వాళ్ల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డ మరో భర్త దీనగాథే ఇది.హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన 28 ఏళ్ల వ్యాపారి రాహుల్.. ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే తన దుకాణంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యతో పాటు అత్తింటి కుటుంబ సభ్యుల వేధింపులే ఈ నిర్ణయానికి కారణమని వీడియోలో ఆరోపించాడు.బల్లభ్గఢ్లో నివసించే రాహుల్కు రెండేళ్ల క్రితం జ్యోతితో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్య ఒత్తిడితో.. తల్లిదండ్రుల నుంచి దూరంగా వేరు కాపురం పెట్టాడు. ఆమె అమ్మానాన్నల బాగోగులు కూడా అతనే చూసుకుంటున్నాడు. అయితేవలే గార్మెంట్స్ షాపు ప్రారంభించిన రాహుల్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని బంధువులు చెబుతున్నారు.మరణానికి ముందు ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియోలో భార్య జ్యోతి, అత్త వీణ, మామ బిట్టు, భార్య సోదరి నీతూ పేర్లను ప్రస్తావించిన రాహుల్.. దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. వాళ్ల కోసం తాను అడ్డమైన పనులు చేసేవాడినని చెప్పాడా భర్త. ఇల్లు ఊడ్చడం, తుడవడం, పాత్రలు తోమడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేసేవాడినని.. అయినా వాళ్లు తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆపై సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే.. డబ్బు కోసం, అందులో భాగస్వామ్యం కోసం వేధించడం మొదలుపెట్టారని చెప్పాడు. తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేశారని, తన మరణానికి వారే బాధ్యులని పేర్కొంటూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఆస్తిని తల్లి, సోదరులు, సోదరికి ఇవ్వాలని కూడా వీడియోలో విజ్ఞప్తి చేశాడు.ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన దుకాణానికి వెళ్లిన రాహుల్.. కొద్దిసేపటికే అక్కడ మృతిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కొడుకు మృతదేహం చూసి రాహుల్ తల్లిదండ్రులు కంటతడి పెట్టిన తీరు పలువురిని కదిలించింది.Faridabad News: सेक्टर-3 फरीदाबाद में राहुल की मौत के बाद मर्चरी के बाहर पिता का दर्द छलक पड़ा। परिजनों ने निष्पक्ष जांच और न्याय की मांग की। पुलिस पूरे मामले की जांच में जुटी है।#FaridabadNews #BreakingNews #HaryanaNews #CrimeNews #ViralNews #HindiNews #HindustanTehelka pic.twitter.com/XWn71XZ7FO— Hindustan Tehelka News (@htehelkanews) June 28, 2026అయితే వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు జరపకుండా.. ఆ ఆరోపణలు నిజమని చెప్పలేమని అంటున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ వీడియోను పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు.. భర్త మృతి, కేసు గురించి స్పందించేందుకు జ్యోతి కుటుంబం మీడియాకు అందుబాటులో లేకపోవడం గమనార్హం.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
శనీశ్వరుడి సన్నిధిలో రోజూ ప్రత్యక్షమవుతున్న కాకి..!
తిరువొత్తియూరు (తమిళనాడు): కాంచీపురం – వందవాసి హైవేపై ప్రసిద్ధి చెందిన 27 నక్షత్రాల ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న శనీశ్వర సన్నిధికి, శనీశ్వర భగవానుడి వాహనంగా గుర్తింపు పొందిన కాకి ఒకటి రోజూ పూజా సమయంలో తప్పకుండా వస్తోంది. పూజ పూర్తయిన తర్వాత ఇచ్చే ప్రసాదాన్ని తిన్న తర్వాతే ఆ కాకి అక్కడి నుండి వెళ్తుంది. ఈ ఘటన భక్తులలో అమితమైన భక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిని శనీశ్వర భగవానుడి అనుగ్రహానికి చిహ్నంగా భక్తులు భావిస్తున్నారు. శనీశ్వర పూజ సమయంలో వచ్చే ఈ కాకిని నేరుగా దర్శించుకోవడానికి, భగవంతుని ఆశీస్సులు పొందడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి పెద్దఎత్తున వస్తున్నారు.
రామమందిరం విరాళాల కేసులో కొత్త ట్విస్ట్!
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు అధికారికంగా నమోదు కావడానికి ముందే.. దొంగిలించబడిన నగదులో భారీ మొత్తాన్ని రికవరీ చేసినట్లు వెలుగులోకి రావడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ పాత్ర, పోలీసుల చర్యలు, దర్యాప్తు తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ప్రారంభించకముందే.. దొంగిలించబడిన నగదులో సుమారు రూ.58 లక్షలను ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది.జూన్ 4వ తేదీన విరాళాల నగదు గల్లంతైన విషయం ట్రస్ట్కు తెలిసింది. మరుసటి రోజే అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ప్రతినిధులు, పోలీసులతో కలిసి నిందితుడు అవినాశ్ శుక్లా ఇంటికి వెళ్లి సుమారు రూ.58 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం జూన్ 5 నుంచి 8 మధ్య మిగిలిన మొత్తం నిందితులు బ్యాంకు బదిలీల ద్వారా తిరిగి చెల్లించినట్లు సమాచారం.అయితే ఈ మొత్తం రికవరీ అంతా ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే జరగడం ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. కేసు బయటకు రావడానికి ముందే నగదు రికవరీ ఎందుకు జరిగింది? అధికారిక ఫిర్యాదు నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? అనే అంశాలపై విచారణ సంస్థలు దృష్టి సారించాయి.ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాతే.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి మరికొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.ఈ వివాదం నేపథ్యంలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు విరాళాల నగదు నిర్వహణ, ఉద్యోగుల నియామకాలు, సీసీటీవీ పర్యవేక్షణలో పలు లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం.కేసుపై ఇటు రాజకీయంగానూ దుమారం కొనసాగుతోంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా.. విశ్వహిందూ పరిషత్ (VHP) మాత్రం పారదర్శక దర్యాప్తు జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు సుప్రీం కోర్టు ఈ వ్యవహారంలో దాఖలైన పిల్ను.. నిదానంగా విచారణ జరుపుతానని అంటోంది.ఎఫ్ఐఆర్కు ముందే నగదు రికవరీ జరిగిన వ్యవహారం, దాని వెనుక అనుసరించిన ప్రక్రియపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరా తీస్తుండటంతో.. రామమందిరం విరాళాల కేసు మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకురానుందా అనే ఆసక్తి నెలకొంది.
పళనికి మరో ఎదురుదెబ్బ.. ఆరో ఎమ్మెల్యే రాజీనామా
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుతో అన్నాడీఎంకేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ.. విజయ్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే తన పార్టీకి రాజీనామా చేశారు. అయితే, ఆయన టీవీకే చేరనున్నట్టు సమాచారం.తమిళనాడులో మాజీ మంత్రి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. విజయభాస్కర్ తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్కు సమర్పించగా, అది ఆమోదించబడినట్లు నివేదికలు తెలిపాయి.అయితే, ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరడంతో, పార్టీ శాసనసభ బలం తగ్గుతూ వస్తోంది. ఈ పరిణామం పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయనే సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, పార్టీని వీడుతున్న వారంతా టీవీకే తరఫున పోటీ చేసేందుకే ఇలా రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్ఆర్ఐ
మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అమెరికాలోని మిస్సోరి (Missouri) రాష్ట్రంలో స్కైడైవింగ్ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి కార్తీక్ వర్మ దాట్ల కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన మొత్తం 12 మందిలో ఆయన ఒక్కరే భారతీయుడు.ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి' నుండి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కాన్సాస్ సిటీలో హెల్త్కేర్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో కాప్జెమినీ (Capgemini) లో పనిచేసిన ఆయన, ప్రస్తుతం అడ్వెంట్హెల్త్ (AdventHealth) సంస్థలో క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్కాన్సాస్ సిటీకి దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుండి ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయ్యింది. పైలట్తో పాటు 11 మంది స్కైడైవర్లతో ప్రయాణిస్తున్న 'పసిఫిక్ ఏరోస్పేస్ 750XL' విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానం భూమికి దాదాపు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎడమవైపునకు తిరిగి, పొలాల్లో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. విమానంలో ఇంజన్ పవర్ తగ్గిపోవడం వల్లే పైలట్ హైవేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని ఎయిర్పోర్ట్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. దీంతో విమానంలోవారందరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అమెరికా పారాచూట్ అసోసియేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జెన్ షార్ప్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి 20 లక్షలు : ఎలా?సాధారణ కమర్షియల్ విమానాల్లో ఉండేలాంటి 'బ్లాక్ బాక్స్' (డేటా రికార్డర్) ఈ చిన్న విమానంలో లభ్యం కాలేదు. దీంతో ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఇతర డిజిటల్ పరికరాలు, సాక్షుల ప్రకటనలు, వీడియోలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన పసిఫిక్ ఏరోస్పేస్ 750XL అనేది సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం. ఇది స్కైడైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ విమానం ప్రమాదానికి ముందు కూడా తొమ్మిదిసార్లు విజయవంతంగా ప్రయాణించిందని విమాన ట్రాకింగ్ సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!
అబుదాబిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అబుదాబి భారత రాయబార కార్యాలయంలో జూన్ 13, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సాంస్కృతిక శోభతో నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగువారి ఐక్యత, తెలంగాణ సంస్కృతి, జానపద వైభవం, చిన్నారుల ప్రతిభ—అన్నీ ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్జీ జార్జ్ , గౌరవ అతిథిగా వి. ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. వివిధ భారతీయ సంఘాల ప్రముఖులు.. ఇండియా సోషల్ సెంటర్ నుంచి బిజీ థామస్, లింసన్, బీహార్, జార్కండ్ సమాజ్ దివాకర్, ఉత్తర ప్రదేశ్ సమాజ్ వివేక్, తెలుగు అసోసియెషన్ రమేష్, ఐఎఫ్సీఏ నుంచి వినాయక్ అవాటె, మహారాష్ట్ర మండల్ నుంచి సంజయ్, ఇటిసిఏ నుంచి కిరణ్ కుమార్, సంస్కృతీ నుంచి రాజశేఖర్, తల్లిదండ్రులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం తెలంగాణ డప్పుల స్వాగతంతో ప్రారంభమై, దీపప్రజ్వలన, అరబిక్, భారత జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతంతో కొనసాగింది. అనంతరం డా. అందె శ్రీ, తెలంగాణ ఉద్యమ అమరులకు ఒక నిమిషం మౌనం పాటించారు.తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా స్వాగత ప్రసంగం అందిస్తూ ప్రవాస తెలంగాణవాసుల ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, యువతలో నాయకత్వ వికాసం వంటి అంశాలపై ప్రేరణాత్మకంగా మాట్లాడారు. చివరగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు)
యూట్యూబర్ నందు కేసులో విస్తుపోయే అంశాలు
సాక్షి, హైదరాబాద్: జాగర్లమూడి మధుకర్, రమానందన వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్లు ఇవ్వడం జాగర్లమూడి కపుల్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారు. యూకేలో వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.యూకేలో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన నందు దంపతులపై చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్తో రమానందన మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇచ్చే అర్హతను నందూస్ వరల్డ్ కిచెన్ కోల్పోయింది. జాగర్లమూడి కంపెనీలకు యూకే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇవ్వకుండా బ్రేక్ పడింది.యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయి.
కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు
కెనడాలోని భారత పౌరులకు అక్కడి అధికార యంత్రాంగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా, ఇమిగ్రేషన్ హోదా, శాశ్వత నివాసం, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాన్సులేట్ అధికారులు లేదంటే ఇమిగ్రేషన్ విభాగం పేరుతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.కెనడాలో నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాము కాన్సులేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వీసా స్టేటస్ సమస్యలు ఉన్నాయని, ఇమిగ్రేషన్ పత్రాలు అప్డేట్ చేయాలని లేదంటే తక్షణమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.ఈ తరహా కాల్స్లో కొందరు మోసగాళ్లు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెసింగ్, లేదా డిపోర్టేషన్ బెదిరింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అధికారికంగా అయితే ఎటువంటి ప్రభుత్వ సంస్థలు ఫోన్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో కెనడా అధికారులు, భారత కాన్సులేట్ కార్యాలయాలు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశాయి. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే ఎలాంటి వ్యక్తిగత సమాచారం, పాస్పోర్ట్ వివరాలు, బ్యాంక్ డేటా లేదంటే ఓటీపీలు పంచుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దని, అధికారిక వెబ్సైట్ లేదంటే నేరుగా కాన్సులేట్ను సంప్రదించాలని సూచించారు.కెనడాలోని భారతీయులు ఈ తరహా మోసాలకు బలవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని కెనడా ప్రభుత్వం, టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా “మీ వీసా రద్దు అవుతుంది”, “తక్షణంగా ఫైన్ చెల్లించాలి”, “ఇమిగ్రేషన్ సమస్య ఉంది” వంటి మాటలు వినిపిస్తే అది మోసపూరిత కాల్గా భావించాలని సూచించారు.అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఇలాంటి కాల్స్కి స్పందించకుండా వెంటనే బ్లాక్ చేయడం, స్థానిక పోలీసులకు లేదంటే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. కెనడాలో భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు.
క్రైమ్
ఇల్లు ఊడ్చా.. అంట్లు తోమా.. అయినా కొట్టేవారు!
ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు. భార్య చెప్పిందని తల్లిదండ్రుల్ని వదిలేసి.. వేరు కాపురం పెట్టాడు. అత్తింటి వారినే తన సొంత తల్లిదండ్రులుగా భావించాడు. వాళ్లు చెప్పిన ప్రతి మాటను కాదనకుండా పాటించాడు. ఆ కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు. కానీ చివరికి అతని జీవితమే విషాదాంతమైంది. మరణానికి ముందు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందంటే..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతుల్ సుభాష్ కేసు గుర్తుందా?. మరణానికి ముందు ఆయన విడుదల చేసిన దాదాపు 81 నిమిషాల వీడియో, 24 పేజీల సూసైడ్ నోట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. భార్య, అత్తింటి వేధింపుల ఆరోపణలతో ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు, ఆయన రాసిన లేఖలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఇది కూడా. భార్య, అత్తింటి వాళ్ల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డ మరో భర్త దీనగాథే ఇది.హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన 28 ఏళ్ల వ్యాపారి రాహుల్.. ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే తన దుకాణంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యతో పాటు అత్తింటి కుటుంబ సభ్యుల వేధింపులే ఈ నిర్ణయానికి కారణమని వీడియోలో ఆరోపించాడు.బల్లభ్గఢ్లో నివసించే రాహుల్కు రెండేళ్ల క్రితం జ్యోతితో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్య ఒత్తిడితో.. తల్లిదండ్రుల నుంచి దూరంగా వేరు కాపురం పెట్టాడు. ఆమె అమ్మానాన్నల బాగోగులు కూడా అతనే చూసుకుంటున్నాడు. అయితేవలే గార్మెంట్స్ షాపు ప్రారంభించిన రాహుల్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని బంధువులు చెబుతున్నారు.మరణానికి ముందు ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియోలో భార్య జ్యోతి, అత్త వీణ, మామ బిట్టు, భార్య సోదరి నీతూ పేర్లను ప్రస్తావించిన రాహుల్.. దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. వాళ్ల కోసం తాను అడ్డమైన పనులు చేసేవాడినని చెప్పాడా భర్త. ఇల్లు ఊడ్చడం, తుడవడం, పాత్రలు తోమడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేసేవాడినని.. అయినా వాళ్లు తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆపై సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే.. డబ్బు కోసం, అందులో భాగస్వామ్యం కోసం వేధించడం మొదలుపెట్టారని చెప్పాడు. తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేశారని, తన మరణానికి వారే బాధ్యులని పేర్కొంటూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఆస్తిని తల్లి, సోదరులు, సోదరికి ఇవ్వాలని కూడా వీడియోలో విజ్ఞప్తి చేశాడు.ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన దుకాణానికి వెళ్లిన రాహుల్.. కొద్దిసేపటికే అక్కడ మృతిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కొడుకు మృతదేహం చూసి రాహుల్ తల్లిదండ్రులు కంటతడి పెట్టిన తీరు పలువురిని కదిలించింది.Faridabad News: सेक्टर-3 फरीदाबाद में राहुल की मौत के बाद मर्चरी के बाहर पिता का दर्द छलक पड़ा। परिजनों ने निष्पक्ष जांच और न्याय की मांग की। पुलिस पूरे मामले की जांच में जुटी है।#FaridabadNews #BreakingNews #HaryanaNews #CrimeNews #ViralNews #HindiNews #HindustanTehelka pic.twitter.com/XWn71XZ7FO— Hindustan Tehelka News (@htehelkanews) June 28, 2026అయితే వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు జరపకుండా.. ఆ ఆరోపణలు నిజమని చెప్పలేమని అంటున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ వీడియోను పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు.. భర్త మృతి, కేసు గురించి స్పందించేందుకు జ్యోతి కుటుంబం మీడియాకు అందుబాటులో లేకపోవడం గమనార్హం.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
రామమందిరం విరాళాల కేసులో కొత్త ట్విస్ట్!
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు అధికారికంగా నమోదు కావడానికి ముందే.. దొంగిలించబడిన నగదులో భారీ మొత్తాన్ని రికవరీ చేసినట్లు వెలుగులోకి రావడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ పాత్ర, పోలీసుల చర్యలు, దర్యాప్తు తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ప్రారంభించకముందే.. దొంగిలించబడిన నగదులో సుమారు రూ.58 లక్షలను ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది.జూన్ 4వ తేదీన విరాళాల నగదు గల్లంతైన విషయం ట్రస్ట్కు తెలిసింది. మరుసటి రోజే అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ప్రతినిధులు, పోలీసులతో కలిసి నిందితుడు అవినాశ్ శుక్లా ఇంటికి వెళ్లి సుమారు రూ.58 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం జూన్ 5 నుంచి 8 మధ్య మిగిలిన మొత్తం నిందితులు బ్యాంకు బదిలీల ద్వారా తిరిగి చెల్లించినట్లు సమాచారం.అయితే ఈ మొత్తం రికవరీ అంతా ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే జరగడం ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. కేసు బయటకు రావడానికి ముందే నగదు రికవరీ ఎందుకు జరిగింది? అధికారిక ఫిర్యాదు నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? అనే అంశాలపై విచారణ సంస్థలు దృష్టి సారించాయి.ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాతే.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి మరికొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.ఈ వివాదం నేపథ్యంలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు విరాళాల నగదు నిర్వహణ, ఉద్యోగుల నియామకాలు, సీసీటీవీ పర్యవేక్షణలో పలు లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం.కేసుపై ఇటు రాజకీయంగానూ దుమారం కొనసాగుతోంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా.. విశ్వహిందూ పరిషత్ (VHP) మాత్రం పారదర్శక దర్యాప్తు జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు సుప్రీం కోర్టు ఈ వ్యవహారంలో దాఖలైన పిల్ను.. నిదానంగా విచారణ జరుపుతానని అంటోంది.ఎఫ్ఐఆర్కు ముందే నగదు రికవరీ జరిగిన వ్యవహారం, దాని వెనుక అనుసరించిన ప్రక్రియపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరా తీస్తుండటంతో.. రామమందిరం విరాళాల కేసు మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకురానుందా అనే ఆసక్తి నెలకొంది.
లే మామ.. మన ఊరికి వెళ్దాం..
నంద్యాల జిల్లా, ఎమ్మిగనూరురూరల్: కుమార్తె పెళ్లికి కొత్త దుస్తులు తీసుకొని వస్తూ తండ్రి ప్రభుదాస్(45), ఏరువాక పౌర్ణమి పండుగకు భార్య ఊరికి వెళ్తూ బోయ రవి (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బనవాసి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్ప గాయాలతో ఉదయ్ అనే బాలుడు బయటపడ్డాడు.కుమార్తె పెళ్లికి దుస్తులు తీసుకొని వస్తూ.. పెద్దకడుబూరు గ్రామానికి చెందిన ప్రభుదాస్(45)కు శిరీష, రాణి, కీర్తన, ఉదయ్లు సంతానం. భార్య కొన్ని సంవత్సరాల కిత్రం భర్తను వదలి వెళ్లిపోయింది. రెండో కుమార్తె రాణికి జూలై 1,2 వ తేదీల్లో జాలమంచి గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయింది. కుమార్తె పెళ్లి కోసం ఎమ్మిగనూరుకు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి కొత్త దుస్తులు కొనుగోలు చేశారు. కుటుంబ సభ్యులను ఆటోలో పంపి ప్రభుదాస్(45), కుమారుడు ఉదయ్లు మోటార్ సైకిల్పై పెద్దకడుబూరుకు బయలుదేరారు.బనవాసి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న స్కూటర్ ఢీ కొనటంతో ఎగిరి కిందపడ్డారు. ప్రభుదాస్ రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడేమృతి చెందాడు. కుమారుడు ఉదయ్ రోడ్డు పక్కన మట్టిరోడ్డుపై పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు రోజుల్లో కుమార్తె వివాహం జరుగుతుందని అందరూ సంతోషంగా ఉన్న తరుణంలో తండ్రి ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అనాథలయ్యారు.పౌర్ణమి పండుగకు వెళ్తూ..చిన్నతుంబళానికి చెందిన కడుబురప్ప, ఉరుకుందమ్మల కుమారుడు బోయ రవి(22)కి ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి రాధికతో మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది. బోయ రవి భార్య రాధిక పుట్టింటికి ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లారు. సోమవారం అత్తగారి ఊర్లో ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లేందుకు చిన్నతుంబళం నుంచి మోటార్ బైక్పై బోయ రవి బయలుదేరాడు. బనవాసి దగ్గర ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలుసుకొని ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులతో కలసి భార్య రాధిక వచ్చారు. అంబులెన్స్లో ఉంచిన మృతదేహాన్ని చూసి ‘లే మామ.. మన ఊరికి వెళ్దాం’ అంటూ రోదించారు. హెల్మెట్ ఉన్నా బోయ రవి ధరించకపోవటంతోనే తలకు బలమైన గాయం అయినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
ఒకరోజు నేను కూడా ఈ విమానం నడుపుతా అమ్మా..
మరో రెండు నెలలైతే..మరో రెండు నెలలైతే ఏడాది కాలం (80శాతం శిక్షణ) పూర్తవుతుంది. ఆగస్టు–సెప్టెంబర్ నెలలో తిరిగి సుమంత్ స్వదేశానికి వచ్చేవాడు. పెళ్లిచేసుకున్నాక మరో 20 శాతం శిక్షణ పూర్తి చేసుకోవడానికి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్తానని సుమంత్ చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.ఫోన్ కాల్తో కుప్పకూలిన కుటుంబంశనివారం వచ్చిన ఒక ఫోన్కాల్ ఆ కుటుంబాన్ని తలకిందులు చేసింది. ‘సుమంత్ ప్రయాణిస్తున్న శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది... అతడు ఇక లేడు’ అనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. హసన్పర్తి: తల్లిదండ్రులకు అండగా నిలవాలని... పైలట్గా ఉన్నత స్థానానికి చేరుకోవాలని సుమంత్ కన్న కలలు ఒక్క ప్రమాదంతో ముగిశాయి. ఆకాశాన్ని తాకాలని బయల్దేరిన యువకుడిని.. అదే ఆకాశం శాశ్వతంగా తనలో కలుపుకోవడం అందరినీ కలచివేస్తోంది. విమానాన్ని చూస్తూ.. ‘ఒకరోజు నేను కూడా ఈ విమానం నడుపుతా అమ్మా’.. అని చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ ఆ తల్లి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. పైలట్గా తిరిగి వచ్చి తల్లిదండ్రులకు గర్వకారణంగా రావాల్సిన ఆ కుమారుడు.. శవపేటికలో వస్తాడనే విషయాన్ని ఆ కుటుంబం ఊహించలేదు. హసన్పర్తికి చెందిన ఆడెపు సుమంత్ (21) దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్్గలో పైలట్ శిక్షణ పొందుతున్న సమయంలో శిక్షణ విమానం (భారత కాలమానం ప్రకారం) శనివారం కుప్పకూలడంతో మృతిచెందాడు. ఈ వార్త అందుకున్న కుటుంబం, గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.మధ్య తరగతి కుటుంబంనుంచి..హసన్పర్తి మండలం సీతంపేటకు చెందిన ఆడేపు వరలక్ష్మీ–చంద్రమౌళిది మధ్య తరగతి కుటుంబం. వ్యాపార రీత్యా చంద్రమౌళి కుటుంబం హసన్పర్తిలో స్థిరపడింది. ఆయన పెయింట్స్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఆడేపు సుమంత్ ప్రాథమిక విద్యాభ్యాసం స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత 6వ తరగతి నుంచి పదోతరగతి వరకు ఎల్లాపురంలో ఎస్పీఆర్ పాఠశాల జరిగింది. ఇంటర్ ఆల్ఫోర్స్లో పూర్తి చేశాడు. పైలెట్ కావాలన్నదే సుమంత్ లక్ష్యం. ఇందుకు సంబంధించిన పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు. దక్షిణాఫ్రికాలో శిక్షణ కోసం గతేడాది వెళ్లాడు.గ్రామమంతా శోకసంద్రంసుమంత్ మరణవార్త తెలియగానే హసన్పర్తి గ్రామానికి చెందిన బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అతడి ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేసినా వారి రోదనలు ఆగడం లేదు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ‘చాలా మంచివాడు.. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు.. ఇంత చిన్న వయసులో ఇలా జరగడం బాధాకరం’ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.మూడు రోజులు ఆగాలంటున్నారు..సుమంత్ మృతదేహం ఇండియాకు పంపడానికి మరో మూడు రోజుల సమయం పడుతోందని దక్షిణాఫ్రికా అధికారులు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భారత ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
వీడియోలు
ఘట్కేసర్లో రెచ్చిపోయిన యువకులు.. వైరల్ వీడియో!
"ఇతను ఒక కోచేనా?".. Gautam Gambhirపై వైరల్ పోస్టు!
రైలు పట్టాలపై పడుకుని.. క్షణాల్లో మారిన పరిస్థితి!
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ లొంగిపోయిన సాక్షులు...
కిల్లి రవి కేసు వెనుక అసలు కథ ఏంటి? పూర్తి వివరాలు!
జేసీ ప్రభాకర్ రెడ్డిపై YSRCP విమర్శల దాడి.. ఏమన్నారంటే?
కూతురు మృతి తర్వాత వచ్చిన ఫోన్ కాల్.. కుటుంబం చెబుతున్న సంచలన విషయాలు!
ఆ రోజు దాడిలో కోడిగుడ్లు, రాళ్లు విసిరింది టీడీపీ గూండాలే
"ఇది అంతా కావాలనే చేస్తున్నారు" అంటే అర్థం ఇదే.. వైరల్ కామెంట్స్!
ప్రజల్లోకి మోజ్తాబా ఖమేనీ...?


