తెలంగాణకు కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో తక్షణమే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది. కేవలం తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలు వినియోగించాలన్న కేఆర్ఎంబీ.. పునర్విభజన చట్ట ప్రకారమే నీటిని వినియోగించాలని స్పష్టం చేసింది. కాగా, ఈ రోజు(శుక్రవారం, సెప్టెంబర్ 4వ తేదీ) హైదరాబాద్లోని జలసౌధ వేదికగా జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం అసంతృప్తిగానే ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ భేటీని అసంతృప్తిగానే ముగించాల్సి వచ్చింది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, తాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదీ చదవండి:‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా దాటనివ్వం’
డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాను మూడు సెకన్లలో డబ్బు సంపాదించానని పేర్కొన్నారు. అదెలాగో కూడా వివరించారు.కియోసాకి ప్రకారం.. ఒక స్టాక్ పొజిషన్ను అమ్మి, ఆ నగదును ఖాతాలో జమ చేసుకోవడానికి 3 సెకన్ల సమయం పట్టింది. స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు అంత త్వరగా అందుతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే.. ఆస్తి విలువ పెరగడం ద్వారా సంపదను సృష్టించుకోవచ్చు. కానీ.. ఆ ఆస్తిని అమ్మాలంటే కొనుగోలుదారుడు దొరకాలి, బ్యాంక్ లోన్ ప్రక్రియ పూర్తవ్వాలి, ఇన్స్పెక్షన్, డాక్యుమెంటేషన్, క్లోజింగ్ వంటి ఎన్నో దశలు ఉంటాయి. కాబట్టి మన డబ్బు వెంటనే చేతికి రాదు.స్టాక్స్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మార్కెట్లో కొనుగోలు చేయడం, విక్రయించడం చాలా వేగంగా జరుగుతుంది. అందుకే కియోసాకి స్టాక్స్ను తన పెట్టుబడి వ్యూహంలో ఒక భాగం అని అన్నారు.స్టాక్స్లో పెట్టుబడులకు మూడు ముఖ్యమైన ప్రయోజనాలను కియోసాకి పేర్కొన్నారు.మొదటిది అందుబాటు ధర. రియల్ ఎస్టేట్లా భారీ మొత్తంలో డబ్బు అవసరం లేకుండానే.. చిన్న మొత్తంలోనే కొన్ని స్టాక్స్ కొనుగోలు చేసుకోవచ్చన్నమాట.రెండోది లిక్విడిటీ. అవసరమైనప్పుడు స్టాక్ను విక్రయించి డబ్బును త్వరగా పొందే అవకాశం ఉంటుంది.మూడోది వేగం. పెట్టుబడుల గురించి నేర్చుకోవడానికి సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదని, కొంతకాలం నేర్చుకున్న తర్వాత చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నిజమైన డబ్బు పెట్టుబడి పెట్టే ముందు సిమ్యులేటర్లో ప్రాక్టీస్ చేయవచ్చని కియోసాకి పేర్కొన్నారు. మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న తర్వాతే.. అసలు డబ్బుతో ప్రారంభించడం మంచిది. ఉద్యోగంలో ఉంటే జీతం కోసం ఒక నిర్దిష్ట తేదీ వరకు ఎదురుచూడాలి. కానీ పెట్టుబడుల ద్వారా తమ డబ్బును వివిధ మార్గాల్లో పనిచేయించుకోవచ్చని ఆయన అభిప్రాయం. తాను స్టాక్స్ ద్వారా వేగంగా క్యాష్ఫ్లో సృష్టించి, ఆ డబ్బును ఇతర పెట్టుబడులు, ఆస్తులను పెంచుకోవడానికి ఉపయోగించానని చెబుతూ.. సరైన సమయం కోసం ఎదురుచూడటం కంటే, పెట్టుబడులపై అవగాహన పెంచుకుని క్రమంగా ముందుకు సాగడం ముఖ్యమని సూచిస్తున్నారు.పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు.. తప్పకుండా కొంత అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ లాభాలు మాత్రమే కాదు, భారీ నష్టాలు కూడా ఉంటాయి. సోషల్ మీడియా కథనాలు లేదా వీడియోలు చూసి.. పెట్టుబడులు పెడితే మాత్రం నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. రూ.4600 పెరిగిన బంగారం!
‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం’
హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖ రాజకీయ భవిష్యత్పై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్రెడ్డి స్పందించారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కొండా సురేఖను బీఆర్ఎస్లోకి ఆహ్వానించే ప్రసక్తే లేదన్నారు. కొండా సురేఖను కనీసం తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమన్నారు జగదీష్రెడ్డి. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దని తప్ప ఎవరినీ తీసుకోమన్నారు. ఎమ్మెల్యేల క్యారకర్ట్ ఆధారంగా వాళ్లు వస్తామంటే తీసుకుంటామన్నారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు బిఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకోము. ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామంటే తీసుకోలేదు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ జరుగుతుంది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడు పోయినట్టే’ అని పేర్కొన్నారు. కొండా సురేఖ బర్తరఫ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
‘ఆ మంత్రమే నన్ను బతికించింది’.. నేపాల్ టన్నెల్ రెస్క్యూలో అద్భుతం!
ఖాట్మండ్: హిమాలయాలను ముంచెత్తిన జలప్రళయం నేపాల్ను తీవ్ర అల్లకల్లోలానికి గురిచేసింది. ఈ విలయం మధ్య త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్లో సాగిన మృత్యుపోరాటం ప్రతీ ఒక్కరిని విస్తుపోయేలా చేస్తోంది. ఊపిరాడని ఆ మృత్యుకూపంలో, తిండి నీరు లేక 9 రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడిన ఇద్దరు కార్మికులు అద్భుత రీతిలో సురక్షితంగా బయటపడ్డారు. ఆ చీకటి నరకంలో నిరంతరం జపించిన ఆ పవిత్ర మంత్రమే తనను బతికించిందంటూ బాధితుడు కన్నీటిపర్యంతమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆగస్టు 26 నేపాల్-టిబెట్ సరిహద్దులోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంభవించిన తీవ్రమైన కొండచరియలు, మంచుచరియలు విరిగిపడటంతో ఉత్తర, మధ్య నేపాల్ తీవ్రమైన ఆకస్మిక వరదల్లో చిక్కుకుంది. లంగ్టాంగ్ జాతీయ పార్క్ వద్ద ప్రారంభమైన ఈ ప్రవాహం త్రిశూలి నది నుంచి దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉధృతంగా ప్రవహించి దారంతా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.రసువా, నువాకోట్, దాడింగ్, గోర్ఖా, తనాహున్, చిత్వాన్ జిల్లాలు ఈ వరద ధాటికి సర్వనాశనమయ్యాయి. గైరోంగ్-కేరుంగ్ సరిహద్దు పోర్ట్, రోడ్లు, వంతెనలతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్స్ కొట్టుకుపోవడంతో వందలాది గ్రామాలు బురద, శిథిలాల కింద పూడుకుపోయాయి. అయితే, టన్నెల్లో విధి నిర్వహణలో ఉండి చిక్కుకుపోయిన కార్మికుల కోసం రెస్క్యూ టీమ్స్ చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక ఊహించని అద్భుతం జరిగింది! మృత్యుకూపంగా మారిన త్రిశూలి 3ఏ ప్రాజెక్ట్ టన్నెల్ శిథిలాల నడుమ నుంచి ఇద్దరు కార్మికులు ఏకంగా 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడటం అందరినీ విస్తుపోయేలా చేసింది.రెస్క్యూ టీమ్స్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బురద తొలగించి, టన్నెల్ సందు గుండా 30 ఏళ్ల మెకానికల్ ఫోర్మన్ సంజయ్ షా, 45 ఏళ్ల మెకానికల్ సూపర్వైజర్ కబీర్ మహర్జన్ లను బయటకు తీశాయి. 9 రోజుల చీకటి నరకం నుంచి ప్రాణాలతో భయటపడడంపై సంజయ్ షా స్పందించారు. రెస్క్యూ సిబ్బంది ‘నన్ను కాపాడినప్పుడు నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది నాకు పునర్జన్మ అని భావోద్వేగానికి గురయ్యాడు. కబీర్ మహర్జన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లో ఖాట్మండ్ సైనిక ఆసుపత్రికి తరలించగా, సంజయ్ షా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ సందర్భంగా సంజయ్ షా తనకు ఎదురైన భయానక క్షణాలను వివరిస్తూ..‘నేను కంట్రోల్ రూమ్లో ఉన్నప్పుడు వరద నీరు ఒక్కసారిగా టన్నెల్లోకి దూసుకొచ్చింది. నా బాధ్యత ఇతరుల ప్రాణాలు కాపాడటం. అందుకే అందరినీ వెంటనే బయటకు పరిగెత్తమని కేకలు వేశాను. అందరూ సురక్షితంగా బయటకు వెళ్లేలా చూసే క్రమంలో నేను వెనకబడిపోయాను. అప్పటికే టన్నెల్ ద్వారాలన్నీ నీరు, బురదతో పూర్తిగా మూసుకుపోయాయి.చీకటి, తాగునీరు, ఆహారం లేని ఆ 9 రోజులూ నన్ను బతికించింది కేవలం దైవచింతనే. నిరంతరం ‘హరే కృష్ణ’ మహామంత్రాన్ని జపిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకున్నాను’ అని అన్నారు. విశేషమేమిటంటే వారు సురక్షితంగా బయటపడిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి కావడం విశేషం.తనకు సమీపంలో మరో 3-4 మంది కార్మికుల శబ్దాలు వినబడ్డాయని, అయితే టన్నెల్ చాలా పొడవుగా ఉండటంతో పవర్హౌస్ వైపు మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని సంజయ్ చెప్పాడు. నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీస్, సశస్త్ర సీమా బల్, భారత టన్నెల్ నిపుణుల బృందాలు సంయుక్తంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో టన్నెల్లోకి ప్రవేశించి మిగిలిన వారి కోసం సహాయక చర్యలను మరింత వేగవంతం చేశాయి.
అమెరికన్ క్రీడా వ్యవస్థపై ఉన్నతస్థాయి సదస్సు
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా?
దంచి కొట్టిన వర్షం.. ఢిల్లీ ఎయిర్పోర్టును ముంచెత్తిన వరద నీరు
కన్నప్పుడు కాలేజీ ఫీజు కూడా కట్టరా?.. ఎపిక్ ట్రైలర్ రిలీజ్
మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్
నిశాంత్జీ.. 7లక్షల గోల్డ్ చైన్ దొరికేనా?..వీడియో వైరల్
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
మహేంద్రగిరి వారాహి.. ది రేజ్ ఆఫ్ వారాహి రిలీజ్
సౌతాఫ్రికా ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. 5 ఫోర్లు, 8 సిక్స్లతో
తెలంగాణకు కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు
జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా..
కొత్త కెరీర్ను ప్రారంభించిన అభినందన్ వర్ధమాన్
...మన ‘కష్టమంతా’ వృథా అయినట్లేనా సార్!
కరువు, ధరల బరువు, అప్పుల అరువు.. ఈ టైంలో వెళితే దరువు తప్పేలా లేదు సార్!
Viral: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలు
రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం!
‘రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి’
రైతు బిడ్డకు రూ.46 లక్షల జీతం
ఈసారి ప్రారంభోత్సవానికి హెల్మెట్, స్విమ్సూట్ తప్పనిసరి సార్!
సినిమాల్లో స్టార్.. రియల్ లైఫ్లో ఫెయిల్.. ఓ హీరోయిన్ జీవిత కథ..!
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 12 సినిమాలు స్ట్రీమింగ్..!
3, 4 తేదీల్లో చికెన్ దుకాణాలు బంద్?
రామ్చరణ్ ఉంటే అద్భుతమే..‘ఇరుముడి 2’పై శివ నిర్వాణ క్లారిటీ
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
తమిళ రాజకీయంలో ‘ధనుష్’ వేడి!
జియో రూ.200 రీచార్జ్ ప్లాన్: ప్రయోజనాలివే..
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు
సాక్షి కార్టూన్: 04-09-2026
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
అమెరికన్ క్రీడా వ్యవస్థపై ఉన్నతస్థాయి సదస్సు
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా?
దంచి కొట్టిన వర్షం.. ఢిల్లీ ఎయిర్పోర్టును ముంచెత్తిన వరద నీరు
కన్నప్పుడు కాలేజీ ఫీజు కూడా కట్టరా?.. ఎపిక్ ట్రైలర్ రిలీజ్
మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్
నిశాంత్జీ.. 7లక్షల గోల్డ్ చైన్ దొరికేనా?..వీడియో వైరల్
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
మహేంద్రగిరి వారాహి.. ది రేజ్ ఆఫ్ వారాహి రిలీజ్
సౌతాఫ్రికా ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. 5 ఫోర్లు, 8 సిక్స్లతో
తెలంగాణకు కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు
జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా..
కొత్త కెరీర్ను ప్రారంభించిన అభినందన్ వర్ధమాన్
...మన ‘కష్టమంతా’ వృథా అయినట్లేనా సార్!
కరువు, ధరల బరువు, అప్పుల అరువు.. ఈ టైంలో వెళితే దరువు తప్పేలా లేదు సార్!
Viral: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలు
రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం!
‘రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి’
రైతు బిడ్డకు రూ.46 లక్షల జీతం
ఈసారి ప్రారంభోత్సవానికి హెల్మెట్, స్విమ్సూట్ తప్పనిసరి సార్!
సినిమాల్లో స్టార్.. రియల్ లైఫ్లో ఫెయిల్.. ఓ హీరోయిన్ జీవిత కథ..!
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 12 సినిమాలు స్ట్రీమింగ్..!
3, 4 తేదీల్లో చికెన్ దుకాణాలు బంద్?
రామ్చరణ్ ఉంటే అద్భుతమే..‘ఇరుముడి 2’పై శివ నిర్వాణ క్లారిటీ
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
తమిళ రాజకీయంలో ‘ధనుష్’ వేడి!
జియో రూ.200 రీచార్జ్ ప్లాన్: ప్రయోజనాలివే..
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు
సాక్షి కార్టూన్: 04-09-2026
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఫొటోలు
శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)
హాయ్ మూవీ మూడ్లో నయనతార పోజులు.. ఫోటోలు
బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు
సిప్లిగంజ్కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు
పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు
బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు
కర్నూలులో వైఎస్ జగన్కు ఘన స్వాగతం (ఫొటోలు)
కూతురిని ఆడిస్తూ.. ట్రిప్ను ఆస్వాదిస్తున్న సూర్యకుమార్ (ఫొటోలు)
‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
దేవతను తలపించే లుక్లో నికితా పోర్వాల్ (ఫోటోలు)
సినిమా
అప్పట్లో దేవుళ్లు.. ఇప్పుడు స్మగ్లర్లు, క్రిమినల్స్: నటి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటి కస్తూరి శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వస్తోన్న మూవీస్పై కీలక వ్యాఖ్యలు చేసింది. మన తెలుగులో మొదట్లో హీరోలు దేవుడి పాత్రల్లో నటించేవారని తెలిపింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోలు పోలీస్, లాయర్, విప్లవాత్మకమైన పాత్రలు ఎక్కువగా కనిపించాయని పేర్కొంది. అయితే ఈ నాటి చిత్రాల్లో మాత్రం స్మగ్లర్, క్రిమినల్ లాంటి పాత్రల్లో మాత్రమే హీరోలు కనిపిస్తున్నారని విమర్శించింది. సోషల్ మేసేజ్తో వచ్చే చిత్రాలు చాలా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేసింది.కస్తూరి శంకర్ మాట్లాడుతూ.." చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినిమాను సినిమాగానే చూడాలి. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మాయాబజారు, కృష్ణార్జున యుద్ధం, ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు చూసేదాన్ని. అప్పట్లో దేవుడి పాత్రల్లో ఎక్కువ కనిపించేవారు. కానీ ఇప్పుడు సినిమాల్లో మాత్రం స్మగ్లర్, క్రిమినల్ పాత్రలు చేసే సినిమాలు వస్తున్నాయి. ఆనాడు ఒక సామాజిక బాధ్యతతో సినిమాలు చేసేవారు. అలాంటి సోషల్ మేసేజ్ ఇచ్చే మూవీనే మా ధర్మస్థల నియోజకవర్గం" అని తెలిపింది. ఆమె కీలక పాత్రలో నటించిన ధర్మస్థల నియోజకవర్గం ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఈ సందర్భంగా కస్తూరి శంకర్ తెలుగు సినిమాలను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. మొదట్లో తెలుగు సినిమాల్లో హీరోలు దేవుడి పాత్రల్లో నటించేవారు.ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోలు పోలీస్, లాయర్, విప్లవాత్మకమైన పాత్రల్లో నటించేవారు.ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోలు స్మగ్లర్, క్రిమినల్ లాంటి పాత్రల్లో నటిస్తున్నారు.- Kasthuri Shankar… pic.twitter.com/s1FglISJx7— Tupaki (@tupaki_official) September 3, 2026
‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మొదట్లో ఈ సినిమా కోసం వచ్చిన కష్టాలను విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు. 25 షోలకు పడిపోయాం‘ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రానికి తొలుత దేశవ్యాప్తంగా 350కిపైగా షోలు దొరికాయి. ఇతర భారీ చిత్రాల విడుదలతో ఈ సినిమా షోల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ప్రేక్షకులే ఈ సినిమాను నడిపించారు. పెద్ద సినిమాలు విడుదల కావడంతో మా షోలను థియేటర్లు తగ్గించాయి. ఒకానొక సందర్భంలో 250 షోల నుంచి 25 షోలకు పడిపోయాం. మల్టీప్లెక్స్లు కూడా ప్రధాన ప్రాంతాల్లో మా సినిమాను ప్రదర్శించేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు’ అని విశాల్ తెలిపారు.ఇదీ చదవండి: ఎయిర్హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీఆ పోస్టు ఇచ్చిన ధైర్యం..‘సాధారణంగా పోస్టులను పెద్దగా పట్టించుకోను. కానీ ఆ సమయంలో నా సినిమా ఆడలేదేమోనని లోలోపల బాధపడుతున్నా. అప్పుడు ఒక పోస్ట్ కనిపించింది. ‘నీ పని నువ్వు చేయి.. మిగతాది నేను చూసుకుంటాను’ అనే సందేశం ఉంది. మొదటి వారం చివర్లో ఆ మాటలు నన్ను ఎంతో ప్రోత్సహించాయి’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.బాలీవుడ్ నుంచి సాయం..‘హనుమాన్ అంశ్’తో పాటు ‘అవారాపన్ 2’, ‘బత్వారా’ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. సినిమా కష్టాల్లో ఉన్న సమయంలో హిందీ చిత్ర పరిశ్రమ నుంచి తాను ఆశించినంత మద్దతు లభించలేదని విశాల్ అన్నారు. ‘సినిమా విజయవంతం అయిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి అభినందించారు. కాగా రూ.2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.75 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని విశాల్ తెలిపారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: ఓటీటీలు సోమరిపోతుల కోసమే: నటుడు శివాజీ
అల్లు అర్జున్ రాకా.. రిలీజ్ డేట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ రాకా. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలు మరించ పెంచేశాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో టాక్ నెట్టింట వైరల్గా మారింది.ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 2028 జనవరి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. ఈ తేదీపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రాకా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అధికారిక ప్రకటన వస్తేనే ఫుల్ క్లారిటీ రానుందని తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో తండ్రి... ఇద్దరు కొడుకులు... ఇలా ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారట అల్లు అర్జున్. అంతేకాదు... ఈ మూడు పాత్రల్లో ఒకటి విలన్ రోల్ అని సమాచారం. ఇదే నిజమైతే ‘రాకా’ చిత్రంలో హీరోగా, విలన్గా అల్లు అర్జున్ నటన చూడొచ్చు. ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్లో దీపికా పదుకోణె నటిస్తున్నారు. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. 🚨 𝐒𝐇𝐎𝐂𝐊𝐈𝐍𝐆 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 🚨Allu Arjun’s #𝐑𝐀𝐀𝐊𝐀 Is 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋𝐋Y Set For 𝟐𝟔𝐓𝐇 𝐉𝐀𝐍𝐔𝐀𝐑𝐘 𝟐𝟎𝟐8 Release🗓️❤️🔥❤️🔥!Targeting A 𝟓-𝐃𝐀𝐘 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃 𝐑𝐄𝐏𝐔𝐁𝐋𝐈𝐂 𝐃𝐀𝐘 𝐖𝐄𝐄𝐊𝐄𝐍𝐃 🥁, The Film Has Announced Its Release Date Via Its… pic.twitter.com/ldGV5jN8tq— Movies Buster (@buster_movies) September 4, 2026
మార్కండేయుడిగా బహ్మాజీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
బ్రహ్మాజీ మార్కండేయుడి పాత్రలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు కలాల్ శ్రీనివాస్ నిర్మిస్తుండగా.. నాగరాజ్ కొట్టే దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ను సోషల్ మీడియాలో లాంఛ్ చేశారు.పోస్టర్లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్లో సంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో ఆయన లుక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.కాగా.. ఈ చిత్రంలో ప్రదీష్, వంగమయి పటేల్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీలో మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచ్చ రవి డైలాగ్స్ అందిస్తున్నారు.
క్రీడలు
వివాదాలకు స్వస్తి.. మళ్లీ సొంత గూటికి స్టార్ ప్లేయర్
టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ దీపక్ హుడా ఐదేళ్ల తర్వాత తిరిగి తన సొంత జట్టు బరోడా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 సీజన్కు ముందు నెట్ ప్రాక్టీస్ సమయంలో, బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాతో హుడాకు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రాక్టీస్ సెషన్లో పాండ్యా తనను దూషించాడని ఆరోపిస్తూ హుడా జట్టు బయో-బబుల్ నుండి బయటకు వచ్చేశాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించినందుకు అతడిపై బరోడా క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. దీంతో హుడా బరోడాను వదిలి రాజస్తాన్ జట్టుకు వెళ్లిపోయాడు.అయితే, ఇప్పుడు బరోడా క్రికెట్ అసోసియేషన్తో ఉన్న విభేదాలు తొలిగిపోవడంతో ఆయన తిరిగి తన సొంతగూటికి చేరాడు. ఈ విషయాన్ని బీసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్నేహల్ పారిఖ్ ధ్రువీకరించారు."31 ఏళ్ల హుడా మళ్లీ దేశవాళీ క్రికెట్లో బరోడా తరఫున ఆడబోతున్నాడు. అతడు బరోడా నుంచే గొప్ప క్రికెటర్గా ఎదిగాడు. ఇప్పుడు మళ్లీ మా జట్టు కోసం ఆడటానికి తిరిగొచ్చాడు. కృనాల్, హుడాల మధ్య ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు సర్దుమణిగాయి" అని ఐఏఎన్ఎస్ ఇంటర్వ్యూలో పారిఖ్ పేర్కొన్నారు. హుడా కూడా తాను తిరిగి బరోడాకు ఆడబోతున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు.హుడాకు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలతో సహా 4,267 పరుగులు చేశాడు. అలాగే టీ20ల్లో 3,972, లిస్ట్-ఎ క్రికెట్లో 3,340 రన్స్ నమోదు చేశాడు. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగల హుడా, భారత్ తరఫున ఇప్పటివరకు 10 వన్డేలు, 21 టీ20 మ్యాచ్లు ఆడాడు.చదవండి: ENG vs SL: శ్రీలంక క్రికెట్ జట్టుకు డబుల్ షాక్
శ్రీలంక క్రికెట్ జట్టుకు డబుల్ షాక్
ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ తొడ కండరాల గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. లంకా ప్రీమియర్ లీగ్ సమయంలో హామ్స్ట్రింగ్ గాయానికి గురైన మెండిస్.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధ్రువీకరించింది. కాగా ఈ గాయం కారణంగానే స్వదేశంలో భారత్తో జరిగిన టెస్టు సిరీస్కూ కుశాల్ దూరమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్ నుంచి కూడా దూరం కావాల్సి వచ్చింది. ఇక అతడితో పాటు స్టార్ ఫాస్ట్ బౌలర్ బినుర ఫెర్నాండో వెన్ను గాయం కారణంగా ఇంగ్లండ్తో సిరీస్కు అందుబాటులో లేడు.దీంతో మెండిస్ స్దానంలో యువ బ్యాటర్ పవన్ రత్నాయకేను జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా బినుర ఫెర్నాండో స్థానంలో ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మదుశంక జట్టులోకి వచ్చాడు. కాగా కుశాల్ మెండిస్ అందుబాటులో లేకపోవడంతో చరిత్ అసలంక జట్టును నడిపించనున్నాడు. ఇక ఈ మూడు మ్యాచ్ల సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, లహిరు ఉదార, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), జనిత్ లియానాగే, దసున్ షనక, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, తరిందు రత్నాయకే, దుష్మంత చమీర, ఈషాన్ , మలింగ, నువాన్ తుషార, దిల్షాన్ మధుశంక, పవన్ రత్నాయక్.చదవండి: కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన కశ్మీర్ సంచలనం
62 మంది క్రికెటర్లపై నిషేధం యోచనలో బీసీసీఐ!
ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికైన కొన్ని వారాలకే, తన వయసును తప్పుగా చెప్పాడనే ఆరోపణలపై బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ బయటపడింది. రోహిత్ యాదవ్ ఒక్కడే కాదు దాదాపు 62 మంది యువ క్రికెటర్లు వయసుకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలింది. ఈ 62 మంది క్రికెటర్ల వయసులో వ్యత్యాసాలున్నట్లు బయటపడడం సంచలనం కలిగిస్తోంది. పత్రాలు, వయస్సు సంబంధిత వ్యత్యాసాల కారణంగా, 2026-27, 2027-28 సీజన్లలో ఏ టోర్నమెంట్కైనా నమోదు లేదా బదిలీ చేసిన 62 మంది క్రికెటర్లను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అనర్హులుగా ప్రకటించింది. వీరిలోనే ప్రస్తుతం రెండేళ్ల నిషేధం పడిన రోహిత్ యాదవ్ కూడా ఉన్నాడు.దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఆ 62 మంది క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో పాటు తాను కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇక జాబితాలో రోహిత్ యాదవ్తో పాటు 2022 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రవికుమార్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ విశాల్ భట్టి కూడా ఉన్నారు. అయితే బెంగాల్ అసోసియేషన్ రికార్డుల్లో రవి వయసు అసలుతో పోలిస్తే 45 నెలల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది.రవితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా వయసుకు సంబంధించి గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు క్యాబ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ 62 మంది ఆటగాళ్లకు సంబంధించిన అన్ని వివరాలను బీసీసీఐకి అందజేసినట్లు క్యాబ్ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తప్పుడు వయసు పత్రాలను చూపించిన 62 మంది యువ ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది ఆసక్తిగా మారింది.ఇక ఉత్తర ప్రదేశ్కు చెందిన రోహిత్, జూలైలో జరిగిన అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనలో భారత్కు ప్రాతినిధ్యం వహించి, ఆరు వికెట్లు తీసి, చివరి టెస్టులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత కొన్నేళ్లుగా తన పుట్టిన సంవత్సరానికి సంబంధించి రోహిత్ వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు సమాచారం. బెంగాల్ అసోసియేషన్కు 2014లో ఇచ్చిన వివరాల్లో తాను జూలై 7, 2007లో జన్మించినట్లు అతడు పేర్కొన్నాడు. అందులో తన చిరునామాను ఉత్తరప్రదేశ్గా పేర్కొన్నాడు. అయితే, 2017లో ఆధార్ అప్డేట్ సందర్భంగా తాను 2006లో జన్మించినట్లు రోహిత్ యాదవ్ తెలిపాడు. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి అప్డేట్ చేసుకోగా.. ఈసారి తాను 2009లో జన్మించినట్లు పేర్కొన్నాడు.చదవండి: కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన కశ్మీర్ సంచలనం
కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన కశ్మీర్ సంచలనం
కౌంటీ చాంపియన్షిప్లో ఆడుతున్న జమ్మూ కశ్మీర్ సంచలనం అకిబ్ నబీ మెయిడెన్ వికెట్ సాధించాడు. సీజన్లో సర్రే తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అకిబ్ నబీ భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఔట్ చేయడం ద్వారా కౌంటీల్లో తొలి వికెట్ పొందాడు. యార్క్షైర్తో మ్యాచ్ సందర్భంగా నబీ వేసిన బంతిని ఆడే క్రమంలో కుల్దీప్ స్లిప్లో ఆడి కార్డన్కు దొరికిపోయాడు. దీంతో అప్పటివరకు ఉన్న పార్టనర్షిప్ బ్రేక్ అవ్వడంతో పాటు 53 బంతుల తర్వాత వికెట్ లభించినట్లయింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయంది.ఇక జమ్మూ కశ్మీర్లోని బారాముల్లాకు చెందిన అకిబ్ నబీ గత నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ సిరీస్లో మ్యాచ్ ఆడే అవకాశం అతడికి రాలేదు. దీంతో సిరీస్ ముగిసిన వెంటనే కౌంటీల్లో ఆడేందుకు ఇంగ్లండ్ చేరుకున్నాడు. కెరీర్లో తొలిసారి కౌంటీ ఆడుతున్న అకిబ్ నబీ తన బౌలింగ్ మెరుపులను ఇంగ్లీష్ గడ్డపై ప్రత్యర్థులకు రుచి చూపించే పనిలో పడ్డాడు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఉండడంతో కౌంటీల్లో సత్తా చాటి మరోసారి జట్టుకు ఎంపికవ్వాలని అకిబ్ నబీ భావిస్తున్నాడు. ఇక మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీసిన నబీ రెండో ఇన్నింగ్స్లో జేమ్స్ వార్టన్ను ఔట్ చేసి రెండో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్లో సర్రే జట్టు విజయం దిశగా నడుస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సర్రే జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.దేశవాళీలో సంచలన ప్రదర్శనఇక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్ తరఫున అకిబ్ నబీ వరుసగా రెండేళ్లు సంచల ప్రదర్శన నమోదు చేశాడు. 2025-26 రంజీ సీజన్లో అకిబ్ నబీ 60 వికెట్లు పడగొట్టి జమ్మూ కశ్మీర్ టైటిల్ అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే అకిబ్ నబీ 43 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 162 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే అకిబ్ నబీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు రూ. 8.4 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. కౌంటీ ముగిసిన తర్వాత అకిబ్ నబీ స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరగనున్న రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనున్నాడు. అంతేకాదు న్యూజిలాండ్తో జరగబోయే టెస్టు సిరీస్కు బీసీసీఐ మదిలో ఉన్న ఐదుగురు ఫాస్ట్ బౌలర్లలో అకిబ్ నబీ పేరు కూడా ఉండడం విశేషం.Auqib Nabi gets his first Surrey wicket as Kuldeep Yadav is caught at second slip by Ollie Pope. ✅Yorkshire 170/8 at the Kia Oval.🤎 | #CountyChampionship pic.twitter.com/VXVuEeI4mA— Surrey Cricket (@surreycricket) September 3, 2026Read: చివరి గ్రాండ్స్లామ్ ఆడిన ఫ్రెంచ్ ఐకాన్.. భార్య ఎవరో తెలిస్తే షాక్!
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
బిజినెస్
పసిడి ప్రియులకు షాక్.. రూ.4600 పెరిగిన బంగారం!
తగ్గేదేలే అన్నట్లు.. బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో రెండు రోజుల్లోనే గోల్డ్ రేటు గరిష్టంగా 4640 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో పసిడి ధరల్లో ఊహకందని మార్పు కనిపించింది.హైదరాబాద్, విజయవాడలలో సెప్టెంబర్ 2న రూ.1,52,020 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఈ రోజుకు 1,56,660 రూపాయల (రూ.4640 పెరిగింది) వద్ద నిలిచింది. 22 క్యారెట్ల రేటు 1,39,350 రూపాయల నుంచి రూ.1,43,600 వద్దకు (రూ.4250 పెరిగింది) చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులలో కూడా కొనసాగాయి.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రెండు రోజుల్లో రూ. 4640 పెరిగి రూ. 1,56,660 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 4250 పెరిగి రూ.1,43,600 వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది.ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్ పెరగడమే. డిమాండుకు తగిన గోల్డ్ అందుబాటులో లేనప్పుడు, కొనుగోలుదారులు ఎక్కువైనప్పుడు తప్పకుండా ధరల్లో గణనీయమైన మార్పు జరుగుతాయి. రాజకీయ, భౌగోళిక కారణాలు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి.
ఆ రాత్రి పంపిన సందేశం.. రూ.కోటి సంపాదనకు మార్గం!
జీవితాన్ని మార్చడానికి కొన్నిసార్లు పెద్ద పెట్టుబడి, డిగ్రీ లేదా భారీ పరిచయాలు అవసరం ఉండకపోవచ్చు. సరైన సమయంలో వేసే ఒక్క అడుగు కూడా కెరీర్కు కొత్త దారిని చూపించొచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది యువ రచయిత, ఫ్రీలాన్సర్ ఆదిత్య బన్సాల్ కథ. 17 ఏళ్ల వయసులో పోడ్కాస్టర్, ఎంట్రాప్రెన్యూర్ రాజ్ షమానీకి ఓ అర్ధరాత్రి పంపిన డీఎం (సందేశం).. తన కెరీర్ను మలుపుతిప్పిందని బన్సాల్ తాజాగా వెల్లడించారు. ఆ అవకాశంతో మొదలైన ప్రయాణంలో 22 ఏళ్ల వయసుకే రూ.1 కోటి సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు.జేఈఈ ప్రిపరేషన్ నుంచి ఆన్లైన్ కంటెంట్ వైపు..2021లో బన్సాల్ జేఈఈకి సిద్ధమవుతున్నారు. పరీక్ష అక్టోబర్కు వాయిదా పడిన సమయంలో యూట్యూబ్లో స్వయంవృద్ధి, ఆదాయ మార్గాలకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే రాజ్ షమానీ వీడియోలను కూడా ఫాలో అయ్యేవారు. అప్పటికే డబ్బు సంపాదించేందుకు గ్రాఫిక్ డిజైన్, వెబ్సైట్ డెవలప్మెంట్ వంటి మార్గాలను ప్రయత్నించినా అవి సఫలం కాలేదని బన్సాల్ చెప్పారు.అప్పటికి తన ముందున్న సాధారణ మార్గం జేఈఈ రాయడం.. ఇంజినీరింగ్ చదవడం.. ఆ తర్వాత ఉద్యోగం చేయడమేనని ఆయన గుర్తుచేసుకున్నారు. కానీ ఆ దారిలో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే ఊహించగలిగానని, అది తనకు నచ్చలేదని తెలిపారు.రాత్రి పంపిన డీఎం..ఒకరోజు షమానీ ఆదాయ మార్గాలపై చేసిన వీడియోను చూసిన బన్సాల్.. అందులోని ఆలోచనలను ట్విట్టర్ (ప్రస్తుతం ‘ఎక్స్’) థ్రెడ్గా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గూగుల్ డాక్లో గంటల తరబడి పనిచేసి, ఎలాంటి ఉద్యోగం లేదా డబ్బు ఆశించకుండా ఆ థ్రెడ్ను షమానీకి నేరుగా పంపించారు.రాత్రి 10:41 గంటలకు పంపిన ఆ డీఎంకు తెల్లవారుజామున 3:53 గంటలకు సమాధానం వచ్చింది. థ్రెడ్ను ముందుగా పోస్ట్ చేసి స్పందన ఎలా వస్తుందో చూస్తానని, మంచి ఫలితం వస్తే తన ట్విట్టర్ థ్రెడ్ల కోసం బన్సాల్ను నియమించుకుంటానని షమానీ చెప్పినట్లు ఆయన వెల్లడించారు.17 ఏళ్లకే తొలి పెయిడ్ వర్క్..బన్సాల్ పంపిన థ్రెడ్కు సుమారు 1,200 లైక్స్ వచ్చాయి. తాను అప్పటికి పెద్దగా అనుభవం లేని రచయితనని, ఆ థ్రెడ్ తన అత్యుత్తమ రచన కూడా కాదని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ షమానీ అతనిలోని సామర్థ్యాన్ని గుర్తించి అవకాశం ఇచ్చారు.ఆ తర్వాత బన్సాల్ షమానీ కోసం సుమారు 5–6 ట్విట్టర్ థ్రెడ్లు రాశారు. అప్పటికి తనకు బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో అమెజాన్ గిఫ్ట్ కార్డుల రూపంలో చెల్లింపులు అందుకున్నట్లు తెలిపారు. అయితే ఈ అనుభవంలో తనకు లభించిన అసలు విలువ డబ్బు కాదని బన్సాల్ చెప్పారు. కంటెంట్ కోసం అవసరమైన సమాచారం, సోర్సులు, మెటీరియల్ను షమానీ అందించడంతో పాటు తనను టీమ్లో ఒకరిగా చూసేవారని గుర్తుచేసుకున్నారు.ఒక్క టెస్టిమోనియల్తో మరో అవకాశం..తర్వాత షమానీకి పూర్తి స్థాయి టీమ్ అవసరం కావడంతో ఈ పని ఆగిపోయింది. అయితే వెళ్లే ముందు బన్సాల్కు ఆయన ఇచ్చిన టెస్టిమోనియల్ మరో కీలక అవకాశానికి దారితీసింది. అదే సిఫార్సుతో తన తొలి రిటైనర్ క్లయింట్ను సంపాదించుకున్నట్లు బన్సాల్ తెలిపారు.అక్కడి నుంచి ఫ్రీలాన్స్ రచయితగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పటివరకు 45 మందికి పైగా ఫౌండర్లతో పనిచేశానని, 22 ఏళ్ల వయసులో రూ.1 కోటి సంపాదనను దాటానని ఆయన పేర్కొన్నారు. మధ్యలో క్లయింట్లు లేకపోయినా, ఆదాయం లేని దశలు ఎదురైనా.. 17 ఏళ్ల వయసులో లభించిన తొలి అవకాశం తనపై నమ్మకాన్ని పెంచిందని చెప్పారు.‘‘ఆ డీఎం ఇప్పటికీ నా బెస్ట్.. ’’తన కెరీర్లో ఆ ఒక్క అవకాశానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెబుతూ బన్సాల్ షమానీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆ డీఎం ఇప్పటికీ నేను రాసిన అత్యుత్తమ విషయం’’ అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 362.57 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 76,515.43 వద్ద, నిఫ్టీ 24.25 పాయింట్లు లేదా 0.10 శాతం లాభంతో 23,897.70 వద్ద నిలిచాయి.న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, వోక్హార్డ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్ఆర్ కేబుల్ లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్, ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కియా వారి నయా కారు: రేటెంతో తెలుసా?
కియా మోటార్స్ భారతదేశంలో కొత్త సోరెంటో ఎస్యూవీని రూ.27.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్, ఫోక్స్వ్యాగన్ టేరాన్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న కియా సోరెంటో 6 సీటర్, 7 సీటర్ రూపంలో అందుబాటులో ఉంది. ఇది 4,815 మిమీ పొడవు, 1,900 మిమీ వెడల్పు, 1,785 మిమీ ఎత్తును కలిగి ఉంది. దీని వీల్బేస్ 2,815 మిమీ వరకు ఉంటుంది.కియా సోరెంటో నిలువుగా అమర్చిన హెడ్ల్యాంప్లు, టైగర్-నోస్ గ్రిల్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగం కూడా ముందు భాగాన్ని పోలి ఉండేలా నిలువుగా అమర్చిన టెయిల్ ల్యాంప్లు ఉన్నాయి. ఇది మొత్తం 8 రంగులలో లభిస్తుంది.సరికొత్త కియా సోరెంటో 4 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో కూడిన 12.3-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ లేదా దానికి సరిపోయే 12.3-అంగుళాల డిజిటల్ డిస్ప్లే పొందుతుంది. కియా కనెక్ట్ 2.0, ఓవర్-ది-ఎయిర్ అప్డేట్లు, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్ప్లే, జనరేటివ్-AI అసిస్టెంట్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి కాకుండా.. వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ రో సీట్లు, 10-వే ఎలక్ట్రిక్ డ్రైవర్ సీటు, ముందు ప్రయాణీకుడి సీటు కోసం పవర్ అడ్జస్ట్, పనోరమిక్ సన్రూఫ్, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్గేట్, 12-స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్ వంటికి ఉన్నాయి.సేఫ్టీ విషయానికి వస్తే.. ఇందులో ఏడు ఎయిర్బ్యాగ్లు, 26-ఫీచర్ల భద్రతా ప్యాకేజీ ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్స్ పది ఎయిర్బ్యాగ్లు, 28 వరకు భద్రతా ఫీచర్లను పొందుతాయి. ఇందులో లెవెల్ 2+ ఏడీఏఎస్, సరౌండ్-వ్యూ, బ్లైండ్-వ్యూ మానిటర్లు, రిమోట్ పార్కింగ్ అసిస్టెన్స్, డిజిటల్ ఇన్సైడ్ రియర్-వ్యూ మిర్రర్, ఫ్రంట్ అండ్ రియర్ డాష్క్యామ్, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్ ఉన్నాయి.కియా సోరెంటో అనేది స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్ట్రెయిన్, ఆల్-వీల్ డ్రైవ్ పొందిన కియా ఇండియా మొదటి మోడల్. ఇది డీజిల్ ఇంజన్ను కూడా అందిస్తుంది. హైబ్రిడ్ వెర్షన్లో 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటార్ లభిస్తుంది. ఇంజన్ 180 హార్స్ పవర్ ఉత్పత్తి చేయగా, ఎలక్ట్రిక్ మోటార్ 65 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ రెండింటి సంయుక్త అవుట్పుట్ 238హార్స్ పవర్. హైబ్రిడ్ పవర్ట్రెయిన్ 265 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఫ్యామిలీ
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు ఆతిథ్యం దేశంగా భారత్ తొలగింపు!
ఈ ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్(ఎంజీఐ) పోటీలకు భారత్ అతిధ్యం ఇవ్వాల్సి ఉండగా అర్థాంతరగా వాటిని నిలిపేసింది ఆ పోటీ సంస్థ. తమ ఒప్పంద కట్టుబాట్లను నెరవేర్చడంలో భారత్ విఫలమైందంటూ..ఆతిధ్య దేశంగా భారత్ని తొలగించింది ఎంజీఐ సంస్థ. ఆ నేపథ్యంలోనే భారత్లో ఆ పోటీకి సంబంధించిన కార్యకలాపాలను కూడా ముగించి, థాయిలాండ్కు తరలించనున్నట్లు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. అంతేగాదు తమ ఒప్పందం ప్రకారం..‘ఫైవ్-స్టార్ ఆతిథ్యం, నిర్మాణ ప్రమాణాలు’ అవసరం. కానీ భారత్ వాటిని అందుకోలేదని వెల్లడించింది మిస్గ్రాండ్ ఇంటర్నేషనల్ సంస్థ(ఎంజీఐ). ప్రస్తుతం మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2026 సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 వరకు థాయిలాండ్లో జరగనున్నాయి. ఆ ప్రకటనలో ఎంజీఐ ఇలా పేర్కొంది. "తమ పోటీదారుల భద్రత, సౌకర్యం, మొత్తం అనుభవాన్ని నిర్ధారించడానికి, అలాగే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ వృత్తిపరమైన ప్రమాణాలు, సమగ్రతను కాపాడుకోవడానికి ఈ 5-స్టార్ ఒప్పంద ప్రమాణాలు అవసరం. అందుకోసం అన్ని చర్చలు, ప్రయత్నాలు చేసినప్పటికీ..అంగీకరించిన ఒప్పంద ప్రమాణాలు నెరవేరలేదు అందువల్ల ఆతిథ్య దేశంగా భారత్ని తొలగిస్తున్నట్లు వెల్లడించింది". సదరు అందాల పోటీ సంస్థ ఎంజీఐ. ఇదిలా ఉండగా రాచల్ గుప్తా వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్ విజేత రాచల్ గుప్తా తన టైటిల్ని వదులుకున్న ఏడాది తర్వాతే ఎంజీఐ నుంచి ఇలాంటి నిర్ణయం వెలువడటంతో నాటి ఘటనే కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె తమ అనుమతి లేకుండానే ప్రాజెక్టులను చేపట్టి ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ టైటిల్ని రద్దు చేసినట్లు ప్రకటించింది ఎంజీఐ. అంతేగాకుండా థాయ్ వ్యాపారవేత్త, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు మిస్ యూనివర్స్ వైస్ ప్రెసిడెంట్ (ఆసియానా) అయిన నవాత్ ఇత్సరగ్రిసిల్ ఆమె శస్త్ర చికిత్స చేయించకుందంటూ ఆమె రూపాన్ని ఎగతాళి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఆమె ఇక్కడ విషపూరిత వాతావరణం, పదే పదే నెరవేర్చని వాగ్దానాలు కారణంగా తాను ముందుగానే తన పదవికిరాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో కూడా ఇలాంటి తొలగింపే..2022లో మిస్గ్రాండ్ ఇంటర్నేషనల్ ఒప్పందం సమస్యలనే కారణాలుగా చూపి కంబోడియాను సహా ఆతిత్యం దేశంగా రద్దు చేసి మిగిలిన పోటీ కార్యకలాపాలను, పోటీదారులను థాయిలాండ్కు తరలించింది. ఆ తర్వాత మిస్ గ్రాండ్ కంబోడియా అంతర్జాతీయ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ఒక ప్రకటన జారీ చేసింది. కాగా, నెటిజన్లు మిస్ గ్రాండ్ ఇంటర్నెషనల్ సంస్థ నిర్ణయంపై మండిపడుతున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీతో సహా, భారతదేశం ఇన్ని ఏళ్లుగాగా అందాల పోటీలకు ఆతిథ్యం ఇవ్వగలిగినప్పుడు, ఆ దేశం ఖచ్చితంగా MGIకి కూడా ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం ఉందని, థాయిలాండ్ కావాలనే డ్రామా చేస్తుందంటూ తిట్టిపోస్తున్నారు. View this post on Instagram A post shared by 𝗠𝗶𝘀𝘀 𝗚𝗿𝗮𝗻𝗱 𝗜𝗻𝘁𝗲𝗿𝗻𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 (@missgrandinternational) (చదవండి: మీనాక్షి దేవతను తలపించేలా నికితా పోర్వాల్ అద్భుత నృత్యం..!)
రోడ్డుపై ఈము.. పోలీస్ పరుగులు! చివరికి ఏం జరిగిందంటే?
అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటిదే ఈ ఘటన కూడా. రోడ్డుపైకి వచ్చిన ఓ భారీ ఈము పక్షి.. ఓ పోలీస్ అధికారిని పరుగులు పెట్టించింది. ఈమును పట్టుకునేందుకు అధికారి చేసిన ప్రయత్నం కాసేపు సరదా ఛేజింగ్గా మారింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో నాష్డేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈము పక్షి రోడ్డుపైకి వచ్చి అటూ ఇటూ సంచరించడంతో వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సమాచారం అందుకున్న ఓ యువ పోలీస్ అధికారి అక్కడికి చేరుకున్నాడు. రోడ్డుపై నుంచి ఈమును పక్కకు పంపించేందుకు ప్రయత్నించగా.. అది ఆ అధికారిని పరుగులు పెట్టించింది. అధికారి ఎంత వేగంగా పరుగెత్తినా ఈము ఏమాత్రం దొరకకుండా ఉరకలు తీసింది. దీంతో అక్కడ కొద్దిసేపు సరదా ఛేజింగ్ కనిపించింది. ఎట్టకేలకు అధికారి ఆ పక్షిని రోడ్డుకు దూరంగా పంపించడంలో విజయవంతమయ్యాడు.అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ‘క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్’ అని పేర్కొంటూ పోస్ట్ చేశారు. రోడ్డుపై ఈము ఉండటం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపైకి వచ్చిన పశువులు, కంగారూలను పోలీసులు తరలిస్తుంటారు. అయితే ఈము కోసం ట్రాఫిక్ నిర్వహించాల్సి రావడం మాత్రం అరుదైన అనుభవమని అధికారులు పేర్కొన్నారు.ఈ వీడియోకు దాదాపు 90 వేల వ్యూస్ రావడంతో నెటిజన్లు కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘అది తిరిగి పోలీస్ను వెంటాడితే అసలు వేగం తెలుస్తుంది’ అంటూ కొందరు సరదాగా స్పందించారు. మరికొందరు ఈ ఘటనను 1932లో ఆస్ట్రేలియాలో జరిగిన ‘ఈము వార్’తో పోల్చారు. అప్పట్లో పంటలను నాశనం చేస్తున్న ఈములను నియంత్రించేందుకు సైన్యం చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించకపోవడంతో ఆ ఘటన చరిత్రలో నిలిచిపోయిందని గుర్తుచేసుకున్నారు.అయితే, ఈ ఘటన సరదాగా కనిపించినప్పటికీ రోడ్డుపైకి వచ్చే పెద్ద జంతువులు వాహనదారులకు ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ఉండాలి. పక్షులను, జంతువులను భయపెట్టకుండా దూరంగా వెళ్లి, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిదని మరికొందరు వారి వారి అభిప్రాయాలను సోషల్మీడియా వేదికగా పంచుకున్నారు. View this post on Instagram A post shared by ABC News (@abcnews) ఇవి కూడా చదవండి: సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి!
సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి!
కొందరు జీవితంలో మంచి సక్సెస్ అందుకుని కూడా సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. కొందరు ఏకంగా ఆ డబ్బుదర్పం పై మమకారం లేకుండా నిరాకారంగా జీవించేందుకు సిద్ధపడి సన్యాసం స్వీకరిస్తుంటారు. ఎలాంటి వాటిపై ఆశ, కోరికలకు తావులేకుండా అత్యంత నిరాడంబరంగా బతకడం అంటే మాటలు కాదు. అందులోనే శ్రీమంతుడిలా బతికిన వాడికి ఇది మరింత కష్టం కానీ. ఈ వ్యక్తి అంత పెద్ద నిర్ణయమే తీసుకుని ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ అనూహ్య నిర్ణయం తీసుకున్న వ్యక్తే థాయ్ వ్యాపారవేత్త సిరిపాంగ్ అక్కరశ్రీయుక్. సన్యాసం స్వీకరించి అడవిలో మంచి చోటు చేసుకుని ధ్యానం చేసుకుంటూ తన మిగిలిన జీవితాన్ని గడపాలనుకుంటున్నాడు. తనకు భోజనం తెచ్చే సహాయక సన్యాసి తప్ప మరెవ్వరితో సంబంధం పెట్టుకోకూడదని భావిస్తున్నట్లు తెలిపాడు. తన శేష జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనలోనే గడపాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు హేవల్సశ్రీ అనే థాయ్ ఐస్క్రీమ్ బ్రాండ్ చైర్మన్ సిరిపాంగ్. ఆ నేపథ్యంలోనే సుమారు రూ. 47 కోట్లు విలువ చేసే తన బ్రాండెండ్ హేవెల్స్ ఐస్క్రీం వ్యాపారాన్ని అమ్మేయాలని అనుకుంటున్నాడు. దశాబ్దాలుగా తాను నిర్మించిన కంపెనీ నుంచి ఆ వ్యాపారవేత్త వైదొలగాలని అనుకుంటున్నాడట. ఈ జీవితం కోసమే 15 ఏళ్లుగా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఆయన 2016లో బౌద్ధమతం వైపు ఆకర్షితులై బుద్దుని నుంచి పొందిన విజయం అనే పుస్తకం కూడా రాశారు. ఇంకో రెండేళ్లలో సన్యాసం స్వీకరించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లో తెలిపాడు సిరిపాంగ్. అంతేగాదు తనకు మంచి క్లయింట్ని వెతికిపెట్టి వారికి కూడా భారీ ఆఫర్ ప్రకటించాడు. వాళ్లకు సుమారు కోటి రూపాయలు పైనే రిఫరల్ ఫీజు కింద ఇస్తానని ప్రకటించాడు. కాగా సిరిపాంగ్ తన హేవెల్స్ ఐస్క్రీం బ్రాండ్ని 1999లో ప్రారంభించారు. థాయ్లాండ్లో ఇది ప్రసిద్ధి చెందిన వ్యాపారం. మూడేళ్లలోపే 22 శాఖలకు విస్తరించింది. ధాయ్లాండ్లో ప్రతి షాపింగ్మాల్లో తప్పక ఉండేది ఈ ఐస్క్రీమ్ దుకాణం. అయితే గత రెండేళ్లుగా హేవెల్స్కి షాపింగ్ మాల్స్లో స్థలం దొరకక్క ఎదుర్కొంటోంది. ప్రతి షాపింగ్ మాల్ అందుకు తమ వద్ద స్థలం లేదని చెప్పేయడంతో ప్రస్తుత ఈ బ్రాండ్ ఐస్క్రీం దుకాణాలు కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం ఆ బ్రాండ్ ఉనికి దాదాపుగా కనుమరుగైపోయింది. ఆ నేపథ్యంలో ఆయన ఇలా నిర్ణయం తీసుకుని ఉండొచ్చనేది సన్నిహిత వర్గాల సమాచారం. కాగా ఈయన అమ్మేయాలనకుకుంటున్న తన వ్యాపార సామ్రాజ్యంలో లభించేవి...2.77 ఎకరాల భూమితో పాటు, ఒక కార్యాలయ భవనం, ఒక ఫ్యాక్టరీ, యంత్ర పరికరాలు, హావెల్స్ ఐస్ క్రీమ్ & ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్ లైసెన్స్లు, కంపెనీ ట్రేడ్మార్క్లతోపాటు 37 ఏళ్లుగా కూడగట్టిన నైపుణ్యం, ఐస్క్రీం రెసీపీలు తదితరాలన్ని పొందొతారని సిరిపాంగ్ పోస్ట్లో పేర్కాన్నారు. (చదవండి: సాధువుగా మారి..54 ఏళ్ల వయసులో సీఆర్పీఎఫ్ పోలీస్గా!)
ఏఐని చూసి జెన్జీలు ఎందుకు భయపడుతున్నారు?
కాలం వేగం పుంజుకుంటోంది. టెక్నాలజీ శరవేగంగా దూసుకెళుతోంది. గడచిన వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘టెక్’ మార్పులపై ఓ లుక్ వేద్దామా?1.ఏఐతో సైబర్ దాడులు!ఏఐ ఆధారిత సైబర్ దాడులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని టెక్ సంస్థలు హెచ్చరించాయి. ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ సహా 100కుపైగా సంస్థలు ఈ ముప్పును ఎదుర్కొనేందుకు సైబర్ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చాయి.2. హ్యాక్ చేసింది!ఓపెన్ ఏఐ నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ పరీక్షలో ఏఐ ఏజెంట్లు శాండ్బాక్స్ నుంచి బయటపడి ఇంటర్నెట్లోకి వెళ్లి, మరో ఏఐ ఏజెంట్తో కమ్యూనికేట్ చేస్తూ హగ్గింగ్ ఫేస్ సంస్థ ΄్లాట్ఫామ్ను హ్యాక్ చేశాయి. ఏఐకి సైబర్ నైపుణ్యాలు వేగంగా పెరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక హెచ్చరికగా భావించవచ్చు..3. 399కే ‘బాతు’ రోబోట్!హగ్గింగ్ ఫేస్ సంస్థ ‘మైక్రోడక్’ పేరుతో ఓ చిన్న ఓపె¯Œ సోర్స్ రోబోను విడుదల చేసింది. కేవలం 25 సెంటీమీటర్ల ఎత్తు, సుమారు 800 గ్రాముల బరువున్న ఈ రోబోను యూజర్లు తమకు కావాల్సిన పనులు నేర్పించుకునేలా రూ΄÷ందించారు. దీని ధర 399 డాలర్లు.4. మాట్లాడే ఆడియో సిస్టమ్!సోనోస్ సంస్థ కొత్త హెడ్ఫో¯Œ ్స, సౌండ్బార్తో ΄ాటు ‘సోనోస్ 27’ అనే కొత్త ఆడియో ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రకటించింది. ఇందులో ఏఐ అసిస్టెంట్లు, చాట్ జీపీటీ ఆధారిత మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండటంతో ఆడియో గ్యాడ్జెట్లు కూడా ఏఐ వైపు వేగంగా మారుతున్నాయి.5. ఇన్స్టా షాక్!ఏఐతో తయారైన వ్యక్తులను నిజమైన మనుషులుగా చూపించే అకౌంట్లపై ఇన్స్టాగ్రామ్ కఠినంగా వ్యవహరించనుంది. ఏఐ జనరేటెడ్ ్ర΄÷ఫైల్ అని వెల్లడించకుండా కంటెంట్ పెట్టే అకౌంట్ల రీచ్ను తగ్గించనున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్పై ΄ారదర్శకత పెంచడమే దీని ఉద్దేశం.6. మీ మాటల్లో ఐదు భారతీయ భాషలుమెటా సంస్థ ‘మ్యూస్ వాయిస్ ట్రాన్స్క్రైబ్’ పేరుతో కొత్త రియల్టైమ్ స్పీచ్–టు–టెక్ట్స్ ఏఐ మోడల్ను ప్రకటించింది. ఇది తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి భారతీయ భాషలతో సహా 70కుపైగా భాషలపై శిక్షణ ΄÷ందింది. ఒకే సంభాషణలో భాషలు మారినా అర్థం చేసుకోవడం దీని ప్రత్యేకత.7. భారత్కు సొంత ఏఐ స్టాక్!బెంగళూరుకు చెందిన ‘జ్ఞాని అర్థ’ భారతీయ సంస్థలు, ప్రభుత్వ సంస్థల కోసం సోవరిన్ ఏఐ స్టాక్ను ప్రకటించింది. భారతీయ భాషలు, లిపులకు అనుగుణంగా రూ΄÷ందించిన టెక్నాలజీతో ఏఐ వినియోగ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.8. ఏఐ అంటే జెన్జీలకే భయం!గ్లాస్ డోర్ ఫ్లాట్ ఫాం అధ్యయనం ప్రకారం ఇతర వయసుల ఉద్యోగులతో పోలిస్తే జెన్ జీలు ఏఐ టూల్స్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఏఐ వల్ల ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా వారిలోనే ఎక్కువగా ఉందట. అంటే ఏఐని ఎక్కువగా వాడుతున్న వారే భవిష్యత్తుపై ఎక్కువగా బెంగపెట్టుకున్నారన్నమాట.ఇవి కూడా చదవండి: వరదలో కొట్టుకుపోయే పరిస్థితి.. దుపట్టాతో రక్షించిన వధువు!
అంతర్జాతీయం
స్పెయిన్ సర్వనాశనం కావడం ఖాయం: ట్రంప్
స్పెయిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా-యూరప్ సరిహద్దు సియూటాలో కొనసాగుతున్న వలస సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ.. పరిస్థితిని సరిగా ఎదుర్కోలేకపోతే ఆ దేశం ‘నాశనమవుతుందని’ హెచ్చరించారు. ఇది సైనిక దాడి కంటే కూడా తీవ్రమైన సమస్యగా ఆయన వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో వలసదారులు ఒక్కసారిగా దేశంలోకి చొచ్చుకురావడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ట్రంప్ అన్నారు.జీబీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. సియుటా(Ceuta)లోకి ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకో నుంచి భారీగా వలసదారులు ప్రవేశించడాన్ని ‘దండయాత్ర’గా అభివర్ణించారు. వేలాది మంది ఒక్కసారిగా దేశంలోకి చొచ్చుకురావడం సాధారణ విషయం కాదని, తాను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. బ్రిటన్ కూడా వలసల సమస్యను ఎదుర్కొంటోందని.. అయితే సియూటాలో ఉన్నంత స్పష్టంగా అక్కడ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఇంతకు ముందు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. వలసల్ని నియంత్రించకపోతే అమెరికాకు కూడా ఇదే గతి పడుతుందని అన్నారాయన.జూలై 30, 31 తేదీల్లో మొరాకో నుంచి సియూటాలోకి ఉప్పెనలా వలసలు వెల్లువెత్తాయి. దాదాపు 60 వేల మంది సముద్ర మార్గంలో ఈ స్పెయిన్ భూభాగంలోకి ప్రవేశించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కొందరు నీట మునిగి మరణించారు కూడా. దీంతో సరిహద్దు భద్రతా సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. స్పెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 50 వేల మందికి పైనే తిరిగి మొరాకోకు చేరుకున్నారు. వీళ్లలో చాలామందిని సైన్యం వెనక్కి పంపించింది. అదే సమయంలో సియూటాలో సాయం అందక.. నిరుత్సాహంతో చాలా మంది వాళ్లంతట వాళ్లే వెనక్కి వెళ్లిపోయారు. మరో 5 వేల మంది ఇంకా సియూటాలో ఉన్నారు. వీరిలో వెయ్యి మందికిపైగా మైనర్లు ఉన్నారు. అయితే స్థానిక ప్రభుత్వం మాత్రం ఈ సంఖ్యను 9 వేలుగా పేర్కొంటోంది.వలసదారులు సరిహద్దు దాటేందుకు మొరాకో అధికారులు అనుమతించారన్న ఆరోపణలు వచ్చినప్పటికీ.. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ మొరాకో పాత్రను తోసిపుచ్చారు. అయితే సియూటా సంక్షోభంపై దేశంలో సాంచెజ్పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టి ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది స్పెయిన్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు సాంచెజ్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. వలస సంక్షోభం ప్రభావం స్పెయిన్ అంతర్జాతీయ సంబంధాలపైనా పడుతోంది. ఇటలీతోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు దేశాలు షెంగెన్ ప్రాంతంలో భాగస్వాములు అయినప్పటికీ.. పరస్పరం తమ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తనిఖీలు విధించుకున్నాయి.మరోవైపు అమెరికా–స్పెయిన్ సంబంధాల్లోనూ గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై దాడులకు అమెరికా తన స్థావరాలను ఉపయోగించుకునేందుకు స్పెయిన్ అనుమతించలేదు. అలాగే నాటో రక్షణ వ్యయాన్ని 2035 నాటికి జీడీపీలో 5 శాతానికి పెంచాలన్న ట్రంప్ లక్ష్యాన్ని స్పెయిన్ వ్యతిరేకించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2 శాతం లక్ష్యమే సరిపోతుందని సాంచెజ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే స్పెయిన్ నాటో విషయంలో సరిగా వ్యవహరించడం లేదంటూ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: ఒక్కసారి ఇరాన్ వచ్చిపో.. శామ్ అంకుల్
నేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
నేపాల్ ఆకస్మిక వరదతో వేలమంది గల్లంతైన వేళ.. అద్భుత ఘటన చోటుచేసుకుంది. శిథిలాలతో పూర్తిగా కూరుకుపోయిన జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా రక్షించగలిగారు. దీంతో సహాయక బృందాల్లోనే కాకుండా.. గల్లంతైన వారి కుటుంబాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.త్రిశూలి ప్రాంతంలోని త్రిశూలి-3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో ఈ ఘటన జరిగింది. ఆగస్టు 26న వచ్చిన భారీ వరదల కారణంగా టన్నెల్ ప్రవేశ మార్గం మట్టి, బురద, శిథిలాలతో మూసుకుపోయింది. అప్పటి నుంచి లోపల చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ఇద్దరు వ్యక్తులు సజీవంగా ఉన్నట్లు గుర్తించి.. వారిని బయటకు తీసుకొచ్చారు.వాళ్ల పేర్లు కబీర్ మహార్జన్ (45), సంజయ్ షా (30)గా నేపాల్ హోంమంత్రి సుదన్ గురుంగ్ వెల్లడించారు. కబీర్ మహార్జన్ త్రిశూలి-3ఏ ప్రాజెక్టులో సూపర్వైజర్గా పనిచేస్తుండగా.. సంజయ్ షా నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో మెకానికల్ ఫోర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు టన్నెల్లో చిక్కుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడటం వారి కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చింది.TWO MEN RESCUED ALIVE AFTER 9 DAYS IN NEPAL TUNNELSanjay Sah and Kabir Maharjan were rescued alive from the Trishuli 3A hydropower tunnel, nine days after the August 26 flash flood. Rescuers heard voices inside and are continuing the search for others who may remain trapped. pic.twitter.com/ttV3RKbdtd— Subodh Kumar (@kumarsubodh_) September 4, 2026ఓ పొడి గదిలో ఉండడంతో.. వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారని రెస్క్యూ టీం వెల్లడించింది. సంజయ్ షాను బయటకు తీసుకువచ్చే సమయానికి ఆయన మాట్లాడే పరిస్థితిలో లేరని సమాచారం. వెంటనే అతడిని బట్టార్ ప్రాంతానికి విమానంలో తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కబీర్ మహార్జన్ స్పృహలోనే ఉన్నారని ఆయన భార్య తెలిపారు. ఆయనను ఖాట్మాండులోని ఛావునీ మిలటరీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.ఇద్దరు కార్మికులను బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. బురదతో పూర్తిగా తడిసిపోయిన ఓ కార్మికుడిని రక్షక సిబ్బంది భుజాలపై మోసుకెళ్లారు. మరో వ్యక్తిని బయటకు తీసుకొచ్చిన సమయంలో అతడి చేతులు జోడించి ప్రార్థిస్తున్న దృశ్యం కనిపించింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తొమ్మిది రోజుల పాటు చీకటి, బురద మధ్య ప్రాణాలతో పోరాడి బయటపడటం నిజంగా అద్భుతమేనని పలువురు పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే.. నేపాల్లోని మరికొన్ని జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో కూడా భారీగా కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు అరడజను టన్నెళ్లలో 150 మందికిపైగా చిక్కుకుని ఉండొచ్చని అంచనా. మొత్తం 12 జలవిద్యుత్ ప్రాజెక్టులకు చెందిన సుమారు 900 మంది కార్మికులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరిలో దాదాపు 500 మంది టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని గుర్తించి రక్షించేందుకు ఇంజినీర్లు టన్నెళ్లలోకి గాలిని పంపుతున్నారు. ఆగస్టు 26న సంభవించిన ఈ భారీ విపత్తు నేపాల్లోని పలు పట్టణాలు, లోయలను అతలాకుతలం చేసింది. హిమనదం(గ్లేసియర్) కూలిపోవడం వల్లే ఆకస్మిక వరదలు సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 1,259 మంది మృతి చెందగా.. 5,000 మందికిపైగా గల్లంతైనట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. టన్నెల్ నుంచి ఇద్దరు సజీవంగా బయటపడటంతో.. ఇంకా ఎక్కడైనా చిక్కుకున్న వారు ఉంటే వారిని కూడా క్షేమంగా రక్షించవచ్చన్న ఆశలు బలపడ్డాయి.ఇదీ చదవండి: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న నేపాల్!
ఇరాన్కు వాన్స్ బిగ్ వార్నింగ్.. ట్రంప్ వద్ద సీక్రెట్ ప్లాన్
వాషింగ్టన్: ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోవడంతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఇరాన్కు సహాయం చేస్తే ఊరుకోం అని తెలిపింది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.జేడీవాన్స్ మీడియాతో మాట్లాడుతూ..ఇరాన్ను ఎదుర్కొనేందుకు ట్రంప్ ప్రభుత్వం వద్ద ఆర్థిక, సైనిక, దౌత్యపరమైన చర్యలతో పాటు రహస్యంగా ఒత్తిడి చేసేలా ప్లాన్ ఉంది. ఇరాన్పై చేపట్టబోయే తదుపరి చర్యలను బహిరంగంగా వెల్లడించదు. మా వద్ద ఇంకా చాలా అదనపు సాధనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అధ్యక్షుడు ఉపయోగిస్తారు.. మరికొన్నింటిని ఉపయోగించకపోవచ్చు. ఏది జరిగినా అది పరిశీలనలోనే ఉంది. ఆర్థిక ఒత్తిడి, సైనిక ఒత్తిడి, దౌత్యపరమైన ఒత్తిడి, రహస్య ఒత్తిడి.. ఇవన్నీ అధ్యక్షుడి వద్ద ఉన్న మార్గాల్లో భాగమే” అని వాన్స్ పేర్కొన్నారు.ఇరాన్పై అమెరికా అనుసరిస్తున్న విధానం కేవలం సైనికపరమైన అంశాలకే పరిమితం కాదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఇంధన సంక్షోభం తలెత్తకుండా చూడటం కూడా తమ కర్తవ్యాల్లో ఒకటని చెప్పారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను ఇరాన్ ఇప్పటికీ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడంతో పాటు చమురు, సహజవాయువు సరఫరా నిరంతరం కొనసాగేందుకు అమెరికా సైన్యం చేపడుతున్న చర్యలను ఆయన సమర్థించారు.ఇరాన్కు ఎలా ప్రతిస్పందించాలన్న విషయంలో వాషింగ్టన్ తనకు ఉన్న అన్ని అవకాశాలను తెరిచి ఉంచుకోవాల్సిన అవసరం ఉందని వాన్స్ చెప్పారు. అయితే రానున్న నెలల్లో ఇరాన్పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.అయితే ఈ యుద్ధాన్ని ముగిసినట్లు ప్రకటించే అంశాన్ని ట్రంప్ ప్రైవేటుగా పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది.అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యుద్ధం కారణంగా ఇంధన ధరలు అధికంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ట్రంప్ యుద్ధానికి ముగింపు ప్రకటించే అంశంపై ఆలోచిస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది. మరోవైపు వాస్తవ పరిస్థితులేమో దీనికి భిన్నంగా ఉన్నాయి. అమెరికా పశ్చిమాసియాలో తన సైనిక బలగాల మోహరింపును మరింతగా పెంచింది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.
రోడ్డు కింద 20 వేల పాత టైర్లు.. ఎందుకు పాతిపెట్టారంటే?
20 వేల పాత టైర్లు... వాటిని రీసైకిల్ చేయలేదు.. కాల్చలేదు, చెత్తకుప్పలో పడేయలేదు. ఏకంగా ఓ రహదారి కింద పాతిపెట్టారు.. వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక ఉన్న ఇంజినీరింగ్ ఆలోచన మాత్రం అద్భుతం. మంచుతో గడ్డకట్టే నేల, బురదగా మారే రోడ్ల సమస్యను పరిష్కరించడంతో పాటు.. పేరుకుపోతున్న వ్యర్థ టైర్లను ఉపయోగించుకోవడమే ఈ ప్రయోగం ఉద్దేశం.1995లో అమెరికాలోని మైనే రాష్ట్రంలో నిర్వహించిన ఇంజినీరింగ్ ప్రాజెక్టులో సుమారు 20,000 పాత టైర్లను ఒక రహదారి కింద పాతిపెట్టారు. ఈ ప్రయోగాన్ని పరిశోధనా పత్రంలో నమోదు చేశారు. రోడ్డు కింద ఉన్న మట్టి పొరలోకి మంచు లోతుగా చొచ్చుకుపోకుండా అడ్డుకునేందుకు టైర్లను చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిని ఇన్సులేషన్ పొరగా ఉపయోగించిన విధానాన్ని ఈ పరిశోధన వివరిస్తుంది. మైన్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గ్రావెల్ రోడ్లు ఉన్నాయి. శీతాకాలంలో మంచు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోతుంది.వేసవికాలంలో అది కరిగినప్పుడు.. భూమిలో నీరు అధికంగా నిలిచి మట్టి మెత్తగా.. అస్థిరంగా మారుతుంది. ఈ సమయంలో భారీ వాహనాలు ప్రయాణిస్తే రోడ్లపై లోతైన గుంతలు, రంధ్రాలు, బురద ఏర్పడి రహదారులు దాదాపు ప్రయాణించలేని స్థితికి చేరుకునేవి. అదే సమయంలో మైన్ రాష్ట్రంలో ప్రతి ఏడాది 10 లక్షలకు పైగా స్క్రాప్ టైర్లు పేరుకుపోయేవి. టైర్లు సహజంగా కుళ్లిపోవడానికి చాలా కాలం పడుతుంది. అవి ల్యాండ్ఫిల్లలో విలువైన స్థలాన్ని ఆక్రమించడంతో పాటు.. అగ్ని ప్రమాదాలు, కాలుష్యానికి కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. దీంతో వాటిని సురక్షితంగా తిరిగి ఉపయోగించడానికి ఓ మార్గాని కనుగొన్నారు.టైర్లతో రహదారిని నిర్మించాలనే ఆలోచన.. యూనివర్సిటీ ఆఫ్ మైన్కు చెందిన సివిల్ ఇంజినీర్ డానా ఎన్. హంఫ్రీకు వచ్చింది. ఆయన బృందం మొత్తం టైర్లను అలాగే పాతిపెట్టకుండా వాటిని పెద్ద పరిమాణంలోని ముక్కలుగా కట్ చేశారు. సాధారణంగా ఈ టైర్ ముక్కల పరిమాణం 12 మిల్లీమీటర్ల నుంచి 76 మిల్లీమీటర్ల వరకు ఉండేది. ఆ టైర్ ముక్కలను రహదారి ఉపరితలం కింద మందమైన పొరగా అమర్చారు. దీంతో రెండు ప్రయోజనాలు కలిగాయి. నీరు సులభంగా బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ ఏర్పడింది. భూమిలోకి మంచు చొచ్చుకుపోయే ప్రభావం తగ్గింది.ప్రతి ఏడాది లక్షలాది వ్యర్థ టైర్లు ల్యాండ్ఫిల్స్లో పేరుకుపోయి పర్యావరణ ముప్పుగా మారుతున్నాయి. వాటిని ఇలా రోడ్ల నిర్మాణంలో ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరిగింది. ఈ విధానాన్ని టీడీఏ (Tire-Derived Aggregate) అని పిలుస్తారు. నీటి మట్టానికి ఎత్తులో వీటిని అమర్చడం వల్ల తాగునీటి నాణ్యతపై కూడా ఎలాంటి దుష్ప్రభావం ఉండదని పర్యావరణ అధ్యయనాలు నిరూపించాయి.
జాతీయం
‘నన్ను టార్గెట్ చేస్తే.. మళ్లీ కొడతా’ : స్వతంత్ర భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ (NEET) నిరసనలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్త తండ్రిపై దాడి చేసిన కేసులో నిందితుడు స్వతంత్ర భరద్వాజ్ తన వైఖరిని సమర్థించుకుంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అతని ఒక పాడ్కాస్ట్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సీజేపీ అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది.అయితే ఈ సందర్భంగా స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడుతూ సీజేపీ నిరసనలతో విద్యార్తుల గుంపు తనపై దాడి చేసి కొట్టి చంపేలా (Lynching) ప్రవర్తించడంతో, తనను తాను రక్షించుకోవడానికే తన చేతికి ఉన్న లోహపు కడా (Iron Bracelet)తో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ తలపై కొట్టానని తెలిపాడు.“I Cracked His Head. Still Never Went Jail.” Then He Named Powerful Politicians As Protection #SwatantraBhardwaj is heard allegedly claiming that he attacked the father of a protester, causing severe head injuries that required around 60 stitches. pic.twitter.com/sdydrSQzlm— Genzdigest (@genzdigest) September 3, 2026పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు వైరల్"నేను అతని(నిషు ఆజాద్ తండ్రి) పుర్రె పగలగొట్టాను, చావు బతుకుల మధ్య అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనికి 60 కుట్లు పడ్డాయి... నిజానికి నాపై సెక్షన్ 307 (హత్యాయత్నం) పడాలి, కానీ పోలీసులు నన్ను అరెస్ట్ కూడా చేయలేదు, రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను ఒక్క రోజులోనే విడుదలయ్యాను. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ , మోదీ కూడా నాకు అన్నయ్యలే. అందరి మద్దతు ఉంది" అంటూ గర్వంగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అయితే ఇది వివాదాస్పద మవ్వడంతో, ఆ మాటలను సరదాగా అన్నానని మాట మార్చాడు. అంతేకాదు పాడ్కాస్ట్లో తన మాటల్ని వక్రీకరిస్తున్నారంటూ మాట మార్చడంతోపాటు, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా కామెంట్ చేయడం వైరల్గా మారింది. మళ్లీ తనను చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నిస్తే, చేతి కడియంతో మళ్లీ కొడతానని హెచ్చరించడం కలకలం రేపింది.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలుకాగా స్వతంత్ర భరద్వాజ్ వ్యాఖ్యలకు నిరసనగా సీజేపీ భీమ్ ఆర్మీ నిరసన చేపట్టింది. CJP ప్రతినిధి సౌరవ్ దాస్, కో-కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. భరద్వాజ్ను వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై హత్యాయత్నం, SC/ST చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట భారీ ధర్నా చేపట్టారు. ఫలితంగా భరద్వాజ్పై హత్యాయత్యం కేసు నమోదైంది. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని సీజేపీకి పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
సాక్షి, న్యూఢ్లిల్లీ: జూలై 23న జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన హిందుత్వ కార్యకర్తగా చెప్పుకునే స్వతంత్ర భరద్వాజ్కు భారీ షాక్ తగిలింది. స్వతంత్ర భరద్వాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం (సెక్షన్ 307) , SC/ST చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నాయకులు, ఇతర కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. సీజేపీ సహ-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అలాగే ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీ రామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ సహా నిరసనకారులు, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భరద్వాజ్పై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడ పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.నీట్ (NEET) నిరసనల సమయంలో CJP కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై దాడి చేశానిని, అంతేకాకుండా తాను “తలను పగలగొట్టానని, తగిన చర్యలు తీసుకోకుండా రాజకీయ నేపథ్యం వల్ల తప్పించుకున్నానని” ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన వీడియో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపింది. దీంతో భరద్వాజ్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే తొలుత బలహీనమైన సెక్షన్లు పెట్టడంతో సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం పోలీసులతో గంటల తరబడి చర్చలు జరిపిన తర్వాత, నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్ఐర్లో ఎస్సీ/ఎస్టీ చట్టానికి సంబంధించిన సెక్షన్లను చేర్చారు. 'హత్యాయత్నం' (attempt to murder) అభియోగాన్ని చేర్చవచ్చా లేదా అని నిర్ధారించడానికి వైద్య పరీక్ష కూడా నిర్వహించనున్నారు. అత్యాచార బెదిరింపులకు సంబంధించి నిషు చేసిన ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించారు.నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ఈ సందర్భంగా నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ మాట్లాడుతూ FIRలో చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చాలన్న తమ డిమాండ్ను ఢిల్లీ పోలీసులు అంగీకరించారని తెలిపారు. నిందితులను 72 గంటల్లోగా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితులు అరెస్టు అవుతారనే విషయంలో ఢిల్లీ పోలీసులపైనా, రాజ్యాంగంపైనా తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.#WATCH | At Parliament Street PS in Delhi, CJP's Nishu Azad's father, Sanjay Azad, says, "Delhi Police have accepted our demand to include the relevant sections of the law in the FIR. The police have said that the accused will be arrested in 72 hours. We have full faith in the… https://t.co/z6HJt2azvf pic.twitter.com/yjnLnKLT4H— ANI (@ANI) September 4, 2026 “Addl DCP made a commitment that charge of attempt to murder will be added to Sanjay Azad's existing FIR by evening along with SC/ST Act, Section 308 and 351.We were assured that Swatantra Bhardwaj will be arrested within 72 hours.”- CJP's Saurav Das who led at Parliament… pic.twitter.com/qEXiqbBUfI— News Arena India (@NewsArenaIndia) September 4, 2026CJP నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు మాట్లాడుతూ, ఢిల్లీ పోలీసులు అధికార బీజేపీ ఒత్తిడికి లొంగి భరద్వాజ్పై తగిన చర్యలు తీసుకోలేదని, దళిత కుటుంబానికి చెందిన సంజయ్, ఆయన కుమార్తెపై జరిగిన దాడిని తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.మాటమార్చిన స్వతంత్ర భరద్వాజ్ మరోవైపు స్వతంత్ర భరద్వాజ్ స్పందిస్తూ, తాను ఆత్మరక్షణ (Self-defence) కోసమే తిరగబడ్డానని, తన దగ్గర దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. 10-15 మంది చుట్టుముట్టడంతో ఆత్మరక్షణ కోసం ప్రయత్నించినప్పుడు అతని తలకు దెబ్బ తగిలిందన్నారు. రాహుల్ గాంధీ ,ఇతరులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పాడ్కాస్ట్ క్లిప్ నకిలీదని, పోడ్కాస్ట్లో తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలు
ఎందరి తాళిబొట్లు తెంచావో మరిచిపోయావా?
కశ్మీర్లో 1990లలో జేకేఎల్ఎఫ్ సాగించిన ఉగ్రవాద హింసకు బలైన కుటుంబాలు.. ఆ సంస్థ అధినేత యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నర్సు సరళా భట్ హత్య కేసులో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాలిక్.. అదే సమయంలో తన భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తన భార్య వితంతువుగా జీవించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.జేకేఎల్ఎఫ్(JKLF) ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా భార్య నిర్మల్ ఖన్నా.. యాసిన్ మాలిక్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1990 జనవరి 25న శ్రీనగర్లోని ఓ బస్స్టాప్ వద్ద రవి ఖన్నాతో పాటు మరో ముగ్గురు వైమానిక దళ సిబ్బందిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ప్రకారం ఈ దాడికి యాసిన్ మాలిక్ నాయకత్వం వహించి కాల్పులు జరిపిన ప్రధాన షూటర్గా అతడిని గుర్తించారు.“నా ఆయుధాలు లేని భర్తను చంపాడు. ఆయన శరీరంలోకి 28 తూటాలు దూసుకెళ్లాయి. ఇప్పుడు తానే గొప్ప వ్యక్తినన్నట్లు మాట్లాడుతున్నాడు. అతడికి ఎలాంటి సానుభూతి అవసరం లేదు. మాలిక్కు మరణశిక్ష తప్ప మరో శిక్ష వద్దు. అతడిని ఉరితీసే రోజు కోసం ఎదురుచూస్తున్నా” అని నిర్మల్ ఖన్నా అన్నారు.మా సంగతేంటి?..తన భార్య వితంతువుగా జీవించకూడదనే ఉద్దేశంతో ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు మాలిక్ చెప్పడంపై నిర్మల్ ఖన్నా తీవ్రంగా స్పందించారు. “నీ భార్య వితంతువు కాకూడదని అంటున్నావు. మరి నీ వల్ల భర్తలను కోల్పోయిన ఎన్నో మహిళల సంగతేంటి? వారి కుటుంబాల బాధ నీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా?” అని ప్రశ్నించారు.మాలిక్ చేతులకు రక్తం అంటుకుందని, అతడు చేసిన హింసకు మూల్యం చెల్లించాల్సిందేనని ఆమె అన్నారు. 36 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతూ.. ఇంతకాలం గడిచినా బాధిత కుటుంబాలకు న్యాయం ఎందుకు జరగడం లేదని ప్రభుత్వం, న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. మాలిక్ తాజా అఫిడవిట్ సానుభూతి పొందేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఆరోపించారు.‘నా తల్లి కూడా వితంతువైంది’మరో ఉగ్ర బాధితురాలు డాక్టర్ సుష్మా షల్లా కూడా మాలిక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె తండ్రి ఇన్స్పెక్టర్ చునీలాల్ షల్లాను 1990 మే 1న ఉత్తర కశ్మీర్లో జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు.“నేను ప్రత్యక్షంగా ఉగ్రవాద బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తిని. యాసిన్ మాలిక్ తన పాపాలకు చివరకు మూల్యం చెల్లించాల్సి వస్తుండటం సంతోషంగా ఉంది. నా తండ్రిని జేకేఎల్ఎఫ్ చంపింది. నా తల్లి ఆయన మరణంతో వితంతువుగా జీవించాల్సి వచ్చింది. ఆ బాధను నువ్వెప్పుడైనా అనుభవించావా? ఇప్పుడు మాత్రం ఏడుస్తున్నావు” అని సుష్మా షల్లా మండిపడ్డారు.సరళా భట్ హత్య కేసులో..1990లో శ్రీనగర్లో నర్సు సరళా భట్ హత్యకు సంబంధించిన కేసులో యాసిన్ మాలిక్ విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ అతడు తాజాగా అఫిడవిట్ దాఖలు చేశాడు. ఇకపై విచారణలో తన తరఫున ఎలాంటి వాదనలు వినిపించబోనని కూడా స్పష్టం చేశాడు. అదే అఫిడవిట్లో పాకిస్థానీ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ రెండు నిర్ణయాల వెనుక సానుభూతి పొందే ప్రయత్నం ఉందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.36 ఏళ్లుగా ఎదురుచూపులు1990లలో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో భర్తలను, తండ్రులను కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ ఆ విషాదం నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నాయి. యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్ నేపథ్యంలో ఆ పాత గాయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తన భార్య వితంతువు కాకూడదనే కారణాన్ని మాలిక్ ప్రస్తావించడమే ఇప్పుడు బాధిత కుటుంబాల ఆగ్రహానికి కారణమైంది.ఇదీ చదవండి: ఆ పెళ్లి కూతురి సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్
శ్రీనగర్ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
శ్రీనగర్ ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది.. ఎయిర్పోర్టులోని స్తంభాన్ని ఇండిగో విమానం ఢీకొట్టింది. పార్కింగ్చేస్తుండగా ఘటన జరిగింది. విమానం ముందు భాగం దెబ్బతింది. సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.నవి ముంబై నుంచి శ్రీనగర్కు వెళ్తున్న ఇండిగో విమానం శుక్రవారం ఉదయం 9:02 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో పార్కింగ్ చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను మాన్యువల్ మెట్లను ఉపయోగించి సురక్షితంగా విమానం నుంచి దించినట్లు ఇండిగో తెలిపింది.ఈ ఘటనపై ఎయిర్పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ప్రమాదానికి అసలు కారణాలను నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం కూడా శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. విమానాల రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని ఇండిగో తెలిపింది.
ఎన్ఆర్ఐ
అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది.వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా తదితర రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. Run4Telugu పోటీలను రెండు విభాగాలలో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనబడి ధృవపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాలలో పాల్గొన్న వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేగాదు “తెలుగు నేర్చుకుందాం… తెలుగు మాట్లాడుదాం… తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం” అనే మనబడి సందేశాన్ని అమెరికా వ్యాప్తంగా ధ్వనింపచేసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. (చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)
లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
ఆరంకెల జీతం, హెచ్1-బీ వీసా కలలతో అమెరికాకు ఎగిరిపోయే భారతీయులకు ఈ కల సాకారమైనాక ఇక లైఫ్ సెట్ అనుకుంటారు. కానీ ఒక భారత సంతతి మహిళ అలా అనుకోలేదు. వాటన్నింటినీ వదులుకుని మాతృదేశానికి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకో తెలుసా?'బిజినెస్ ఇన్సైడర్' అందించిన వివరాల ప్రకారం 28 ఏళ్ల దిశా లాంబా, 2021లో న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ విజయ వంతమైన కెరీర్ను నిర్మించుకుని, 2024లో CVS హెల్త్లో డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని పొందింది. ఆరెంకల భారీ వేతనంతో కూడిన ఉద్యోగం. H-1B వీసా లాటరీ ప్రక్రియలోనూ విజయం సాధించింది. కానీ తన కుటుంబానికి దగ్గరగా ఉండటంతో పాటు,మారుతున్న పరిస్థితుల రీత్యా వాటన్నింటినీ వదులుకోవాలని నిర్ణయించుకుంది.ఒంటరితనం, అమెరికా సమయానికి అనుగుణంగా ఇండియాలోని తల్లిదండ్రులతో మాట్లాడాల్సి రావడం ఆమెను మానసికంగా ఇబ్బందికి గురి చేసినట్టు ఆమె వెల్లడించారు. H-1B వీసా పొందినప్పటికీ ఉద్యోగం మారడం, ఇతర ఆదాయ మార్గాలు (Side hustles) వెతుక్కోవడం, ప్రయాణాలు లేదా కెరీర్ గ్యాప్ తీసుకోవడం H-1B నిబంధనల వల్ల చాలా కష్టంతో కూడుకున్నవి కావడం కూడా ఆమె నిర్ణయానికి ఊతమిచ్చాయి.ఇదీ చదవండి: రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి2026 మేలో ఉద్యోగానికి రాజీనామా చేసి గురుగ్రామ్లోని తన తల్లిదండ్రుల వద్దకు తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఒక చిన్న కెరీర్ బ్రేక్ తీసుకుని, భారతదేశంలోనే కొత్త అవకాశాలు లేదా స్వంతంగా వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్నారు. H-1B వీసాలపై కొత్త ప్రతిపాదనలప్రకారం, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసాలకు సంబంధించి కొన్ని కఠినమైన మార్పులను ప్రతిపాదించింది: H-1B వీసా ఫీజు పెంచే ప్రతిపాదనతోపాటు. గ్రేస్ పీరియడ్ రద్దచేయాలని భావిస్తోంది. దీంతో ఉద్యోగం కోల్పోయిన H-1B హోల్డర్లకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగిస్తారు.అలాగే H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే (H-4 వీసా) ఇచ్చే పని అనుమతులను రద్దు చేసే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నిబంధనలు ఎక్కువ మంది భారతీయ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనం.. డాలస్లో ఘన సత్కారం!
డాలస్, టెక్సస్: అనేక దశాబ్దాలుగా పార్క్ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ తదితర సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం, డయాలసిస్ సేవలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించిన ప్రముఖ సామాజిక సేవకురాలు డా. భానుమతి ఇవటూరికి డాలస్లో ఘన సత్కారం లభించింది. 90 ఏళ్ల వయస్సులో అమెరికాలో 50 సంవత్సరాలకు పైగా జీవితం గడిపిన ఆమె ఇకపై మాతృదేశంలో జీవించేందుకు పయనమవుతున్న సందర్భంగా ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, శ్రీధర్ కోడెల, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె; అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి; నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) పూర్వాధ్యక్షులు బాపు నూతి; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, TANA బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం; కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, డా. జగదీశ్వరన్ పుడూర్ తదితరులు డా. భానుమతి ఇవటూరిని జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.సభాధ్యక్షత వహించిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “సమస్యకు–పరిష్కారానికి మధ్య, వివాదానికి–అవగాహనకు మధ్య, గందరగోళానికి–స్పష్టతకు మధ్య, నిరాశకు–ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారు. అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులభమైన విషయం కాదు. తల్లిదండ్రులు తమతో పాటు మాతృభూమి విలువలు, సంప్రదాయాలు, ఆశలు, ఆకాంక్షలను తీసుకువస్తారు. అయితే వారి పిల్లలు మాత్రం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లలపై ఉన్న ఆశలు అపార్థాలకు, చివరకు కుటుంబ కలహాలకు దారితీస్తాయి. ఈ సమస్యను ఎంతో లోతుగా అర్థం చేసుకున్న భానుమతి.. తల్లిదండ్రుల ఆశలు, అంచనాల కారణంగా పిల్లలనే దూరం చేసుకునే పరిస్థితి రాకూడదని చెబుతారు” అన్నారు.“జీవితంలో విజయం అంటే కేవలం డిగ్రీలు, పదవులు, బిరుదులు కాదు. మన వల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి అనేదే నిజమైన విజయానికి కొలమానం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డా. భానుమతి ఇవటూరి జీవితం. 50 సంవత్సరాలకు పైగా అమెరికాలో జీవితం గడిపి, తొమ్మిది పదులు దాటిన వయస్సులో మాతృదేశంలో తన భవిష్యత్ జీవితాన్ని గడపాలనుకోవడం హర్షనీయమైన విషయం. ఆమె మిగిలిన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని డా. ప్రసాద్ తోటకూర అన్నారు.వివిధ సందర్భాల్లో డా. భానుమతి ఇవటూరితో సన్నిహితంగా పనిచేసిన ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. కృష్ణబాబు చుండూరి, డా. కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి తదితరులు భానుమతి సామాజిక సేవలను కొనియాడారు.డా. భానుమతి ఇవటూరి మాట్లాడుతూ.. “అతి తక్కువ సమయంలో, వారాంతం కానప్పటికీ, ఇర్వింగ్లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి దాదాపు వంద మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఒక మధురమైన రోజుగా మిగిలిపోతుంది. నా సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.ఇవీ చదవండి: 8 ఏళ్లకే చెస్లో సంచలనం.. 9/9 గెలిచిన తెలుగు బాలిక!
అమెరికాలో తెలుగు యువతి కేసులో కీలక పరిణామం
అమెరికా తెలుగు యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రియురాలి హత్య కేసులో సాప్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని ఓ అపార్ట్మెంట్లో దాక్కున్న అర్జున్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అర్జున్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో శంకర్ గ్రీన్ రెసిడెన్షియల్ సొసైటీలో అరెస్ట్ చేశారు.అమెరికా-భారత్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి చర్యలు చేపట్టనున్నారు. 2025 డిసెంబర్ 31న డబ్బు తిరిగి ఇస్తానంటూ నిఖితను పిలిచి హత్య చేశాడు. ఆర్థిక వివాదమే హత్యకు కారణమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో నివసించే నిఖిత జనవరి 2న కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మేరీల్యాండ్లోని కొలంబియాలో ఉన్న ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లోనే ఆమె మృతదేహాన్ని గుర్తించారు. నిఖిత శరీరంపై కత్తిపోట్ల గాయాలు ఉన్నట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. నిఖిత నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడనే ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఏప్రిల్లో తెలంగాణలో అర్జున్పై మోసం కేసు నమోదైంది.దర్యాప్తులో భాగంగా కొన్ని కీలక ఆధారాలు లభించడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఆగ్రాకు పంపించాం. అక్కడ ఓ ఫ్లాట్లో అర్జున్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. మోసం కేసుకు సంబంధించి అతడికి నోటీసులు జారీ చేశాం. అదే సమయంలో అమెరికాలో అతడిపై కేసు ఉండటంతోపాటు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) పెండింగ్లో ఉన్న విషయం గుర్తించాం. దీంతో కేంద్ర అధికారులకు సమాచారం అందించాం’’ అని హైదరాబాద్ పోలీసు అధికారి తెలిపారు. అర్జున్ను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. నిఖిత గత నాలుగేళ్లు అమెరికాలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేసింది.
క్రైమ్
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
సాక్షి, న్యూఢ్లిల్లీ: జూలై 23న జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన హిందుత్వ కార్యకర్తగా చెప్పుకునే స్వతంత్ర భరద్వాజ్కు భారీ షాక్ తగిలింది. స్వతంత్ర భరద్వాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం (సెక్షన్ 307) , SC/ST చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నాయకులు, ఇతర కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. సీజేపీ సహ-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అలాగే ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీ రామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ సహా నిరసనకారులు, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భరద్వాజ్పై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడ పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.నీట్ (NEET) నిరసనల సమయంలో CJP కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై దాడి చేశానిని, అంతేకాకుండా తాను “తలను పగలగొట్టానని, తగిన చర్యలు తీసుకోకుండా రాజకీయ నేపథ్యం వల్ల తప్పించుకున్నానని” ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన వీడియో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపింది. దీంతో భరద్వాజ్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే తొలుత బలహీనమైన సెక్షన్లు పెట్టడంతో సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం పోలీసులతో గంటల తరబడి చర్చలు జరిపిన తర్వాత, నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్ఐర్లో ఎస్సీ/ఎస్టీ చట్టానికి సంబంధించిన సెక్షన్లను చేర్చారు. 'హత్యాయత్నం' (attempt to murder) అభియోగాన్ని చేర్చవచ్చా లేదా అని నిర్ధారించడానికి వైద్య పరీక్ష కూడా నిర్వహించనున్నారు. అత్యాచార బెదిరింపులకు సంబంధించి నిషు చేసిన ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించారు.నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ఈ సందర్భంగా నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ మాట్లాడుతూ FIRలో చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చాలన్న తమ డిమాండ్ను ఢిల్లీ పోలీసులు అంగీకరించారని తెలిపారు. నిందితులను 72 గంటల్లోగా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితులు అరెస్టు అవుతారనే విషయంలో ఢిల్లీ పోలీసులపైనా, రాజ్యాంగంపైనా తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.#WATCH | At Parliament Street PS in Delhi, CJP's Nishu Azad's father, Sanjay Azad, says, "Delhi Police have accepted our demand to include the relevant sections of the law in the FIR. The police have said that the accused will be arrested in 72 hours. We have full faith in the… https://t.co/z6HJt2azvf pic.twitter.com/yjnLnKLT4H— ANI (@ANI) September 4, 2026 “Addl DCP made a commitment that charge of attempt to murder will be added to Sanjay Azad's existing FIR by evening along with SC/ST Act, Section 308 and 351.We were assured that Swatantra Bhardwaj will be arrested within 72 hours.”- CJP's Saurav Das who led at Parliament… pic.twitter.com/qEXiqbBUfI— News Arena India (@NewsArenaIndia) September 4, 2026CJP నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు మాట్లాడుతూ, ఢిల్లీ పోలీసులు అధికార బీజేపీ ఒత్తిడికి లొంగి భరద్వాజ్పై తగిన చర్యలు తీసుకోలేదని, దళిత కుటుంబానికి చెందిన సంజయ్, ఆయన కుమార్తెపై జరిగిన దాడిని తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.మాటమార్చిన స్వతంత్ర భరద్వాజ్ మరోవైపు స్వతంత్ర భరద్వాజ్ స్పందిస్తూ, తాను ఆత్మరక్షణ (Self-defence) కోసమే తిరగబడ్డానని, తన దగ్గర దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. 10-15 మంది చుట్టుముట్టడంతో ఆత్మరక్షణ కోసం ప్రయత్నించినప్పుడు అతని తలకు దెబ్బ తగిలిందన్నారు. రాహుల్ గాంధీ ,ఇతరులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పాడ్కాస్ట్ క్లిప్ నకిలీదని, పోడ్కాస్ట్లో తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలు
కిరాణా కొట్టు నుంచి కోట్ల అక్రమ సామ్రాజ్యం! ఎవరీ నీతుబాయి?
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు గుడుంబా విక్రయం.. ఆ తర్వాత గంజాయి వ్యాపారం.. చిన్న స్థాయిలో మొదలైన దందా క్రమంగా భారీ నెట్వర్క్గా మారింది. అనేక ప్రాంతాలకు విస్తరించింది. గంజాయి విక్రేతలు, వినియోగదారులకు ఆమె కేంద్రంగా మారింది. అంచెలంచెలుగా ఎదిగింది. ధూల్పేట్లో కిరాణా దుకాణం ముసుగులో గంజాయి విక్రయాలను ప్రారంభించిన నీతుబాయి.. రూ.కోట్లలో అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి డాన్గా మారింది.ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ సిబ్బంది లక్ష్యంగా సామ్రాజ్యాన్ని విస్తరించింది. వరుసగా కేసులు నమోదైనా, పలుమార్లు అరెస్టయినా.. పీడీ యాక్ట్ కింద నిర్బంధించినా.. ఆమె దందా మాత్రం కొనసాగడం గమనార్హం. గంజాయి విక్రయాలతో ప్రారంభించి హవాలా వ్యాపారం దిశగా సాగింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది. నీతుబాయి స్వస్థలం ధూల్పేట్ అయినప్పటికీ, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ బాయ్లను లక్ష్యంగా చేసుకోవడానికి నానక్రామ్గూడలోని లోథాబస్తీలో చిన్న కిరాణా దుకాణం ప్రారంభించింది.అంగూరిబాయి (అరుణాబాయి)తో పాటు ఒడిశా, ఏపీ సరిహద్దు ప్రాంతాల ద్వారా గంజాయి దిగుమతి చేసుకునేది. కిలో గంజాయిని రూ.8వేలకు కొనుగోలు చేసి 5 గ్రాముల చిన్న పొట్లాలుగా మార్చి, ఒక్కో పొట్లాన్ని రూ.500 కి విక్రయించేది. ఈ లెక్కన కిలోపై రూ. 50 వేల వరకు నికర లాభం ఆర్జించేది. ఆమె కుటుంబం మొత్తం కూడా ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములే.రోజుకు సగటున రూ.10 లక్షల విక్రయాలు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అమ్మకాలు జరిగేవని ఎక్సైజ్ అధికారుల దాడుల్లో తేలింది. నీతుబాయిపై 18కి పైగా ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. గతంలో గచ్చిబౌలి పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2024లో 22.6 కిలోల గంజాయి, రూ.22.10 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు.నీతుబాయి నేరపూరిత సంపాదనపై ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎఎల్ఏ చట్టం కింద మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసి, నానక్రామ్గూడలోని ఇంట్లో సోదాలు నిర్వహించింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతాల్లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఆమె వ్యాపారాన్ని విస్తరించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇక్కడి నైట్లైఫ్ కూడా ఇందుకు దోహదం చేసినట్లు చెప్పారు.ఇవీ చదవండి: రేవంత్ బ్లాక్మెయిల్... అందుకే ఉద్వాసన
బావ హత్యకు బావమరిదే సూత్రధారి
గుంటూరు: కిడ్నాప్నకు గురైన పాలిష్ వ్యాపారి హత్య కేసులో బావమరిదే ప్రధాన సూత్రధారి అని తేలింది. కేసును తెనాలి రూరల్ పోలీసులు ఛేదించారు. బావ హత్యకు సుపారి ఇచ్చిన బావమరిదిని, కిరాయి ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... తెనాలికి చెందిన చుక్క కోటినాగవీరయ్య (53) అలియాస్ నాగ మహేష్ పాలిష్ వ్యాపారం చేసేవాడు. అతనికి 2006లో విజయవాడ వాసి సంధ్యారాణితో పెళ్లై, ఇద్దరు పిల్లలు. అతనికి 35 ఏళ్ల అట్టలూరి దీప్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రెండేళ్లుగా సరిగా ఇంటికెళ్లడం లేదు. తెనాలి నందులపేటలో దీప్తితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గత నెల 29న అతను సాయంత్రం ఇంటి నుంచి వెళ్లగా, ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో దీప్తి వెతుకుంటూ 30న ఆటోనగర్ వెళ్తుండగా సోమసుందరపాలెం శివారులో స్కూటీ, చెప్పులు కనిపించాయి. దీనిపై తెనాలి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అతడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో గాలించారు. విచారణలో విజయవాడ రాజీవ్నగర్లో ఉంటున్న నాగమహేష్ బావమరిది పగడాల రాజేష్ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. బావ హత్యకు బావమరిది కీలక సూత్రధారి అని గుర్తించామని చెప్పారు. బుధవారం రాత్రి రాజేష్ను, బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరుకి చెందిన కొమరబత్తిని సందీప్, బుస్సా సంజయ్, కొప్పుల అపర్ణ అలియాస్ బుజ్జి, దేవరకొండ మారుతీవరప్రసాద్ అలియాస్ మారుతీని అరెస్ట్ చేశామన్నారు. ఇసుక క్వారీ వద్ద మృతదేహం నాగమహేష్ దీప్తితో సహజీవనం చేస్తూ, ఆస్తి మొత్తం ఆమెకు రాసిస్తాడని రాజేష్ కక్ష పెంచుకున్నాడు. ఆస్తిని తన సోదరి, ఆమె పిల్లల పేరిట రాయకపోవడంతో బావ హత్యకు పథకం రూపొందించాడు. సందీప్కు రూ.4 లక్షల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సందీప్ తన అనుచరులతో తెనాలిలోని ఓ హోటల్లో పది రోజులు బస చేసి, నాగమహేష్ కదలికలపై రెక్కీ నిర్వహించాడు. గత నెల 29న సోమసుందరపాలెం వద్ద బైక్పై వెళ్తున్న అతన్ని గుంటూరు నుంచి అద్దెకు తెచ్చిన కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లారు. తేలప్రోలు, అత్తోట, తుములూరు మీదుగా కరకట్టపై రేపల్లె వైపు వెళ్తూ కారులోనే గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. గురువారం ఓలేరు ఇసుక క్వారీ వద్ద మతదేహాన్ని గుర్తించారు. భట్టిప్రోలు తహసీల్దార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ జనార్దన్, తెనాలి గ్రామీణ సర్కిల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్, కొల్లిపర పీఎస్ ఎస్ఐ ప్రసాద్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. చదవండి: ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’
‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’
సాక్షిప్రతినిధి, గుంటూరు: తమ చిన్నారిని రక్షించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ తండ్రి మూడు నెలలుగా అధికారులు, అధికారపార్టీ నాయకులు అందరి చుట్టూ కాళ్లరిగేలా తిరిగి కూతురి ఆచూకీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన సంఘటన అందరికీ తెలిసిందే. ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు ఆ బాధ్యతను మరిచిపోయి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సోషల్ మీడియా పోస్టులు పెట్టినవారిపై అత్యుత్సాహం చూపి అరెస్టు చేయడం వంటి వాటికి పరిమితమై పోయారు. లా అండ్ ఆర్డర్ గాలికొదిలేశారు. రక్షక భటులే భక్షకులుగా మారి జనాన్ని పీక్కుతింటూ పోలీసు శాఖ ప్రతిష్టను కొందరు అవినీతి ఖాకీలు దిగజారస్తున్నారు. గుంటూరు నగరంలో జరిగిన సంఘటనపై హైకోర్టు సీరియస్గా స్పందించి పోలీసులను చీవాట్లు పెట్టడంతో ఇప్పుడు హడావుడిగా సిట్ ఏర్పాటు చేసి వెతుకులాట ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... మూడు నెలలు దాటుతున్నా ఆచూకీ లేదు గుంటూరు నగరానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక జూన్ 9వ తేదీన ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి అదే రోజు సాయంత్రం నగరంలోని పట్టాభిపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు అనగా జూన్ 10వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికను గంజాయి తాగే ఓ యువకుడు (22 ఏళ్లు) కిడ్నాప్ చేశాడనే విషయం బయట పడడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కిడ్నాపర్ నెల్లూరు మొబైల్ షాపులో మొబైల్ కొన్నట్లు సీసీ çటీవీ ఫుటేజీలో గమనించిన తండ్రి అతని మొబైల్ ఈఎంఐ నంబరుతో సహా పోలీసులకు అందించారు. అదే నెల 18వ తేదీన ఫోన్ ఆన్ చేసినట్లుగా పోలీసులు చెప్పడంతో తండ్రి కార్లు ఏర్పాటు చేసి ఓ ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లను తీసుకుని హుటాహుటిన కోయంబత్తూరు వెళ్లారు. 13 నుంచి 18వ తేదీ వరకు కోయంబత్తూరులోని లాడ్జిల్లో వారు బస చేసినట్లు ఆధారాలు కూడా దొరికాయి. అనంతరం కోయంబత్తూరు రైల్వేస్టేషన్లో తండ్రే ఆరీ్పఎఫ్ పోలీసులను కలిసి రైల్వేస్టేషన్ పుటేజీ పరిశీలించగా సికింద్రాబాద్ రైలు ఎక్కినట్లు గుర్తించారు. దీంతో కారుల్లో వెళితే ఆలస్యమవుతోందని భావించిన తండ్రి ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లకు తానే విమాన టికెట్లు కొనుగోలు చేసి సికింద్రాబాద్కు వచ్చారు. అక్కడ కిడ్నాపర్ మేనత్తను పట్టుకుని ప్రశ్నించగా, తన ఇంటికి వచ్చివెళ్లినట్లు అంగీకరించింది. ఆ తరువాత సెల్ స్విచ్ ఆఫ్ చేసిన నిందితుడు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడో బాలికను ఎక్కడ దాచాడో తెలియని పరిస్థితి. మిస్సింగ్ కేసు నమోదు చేసి వదిలేశారు.. మైనర్ బాలికను గంజాయి తాగుతూ కత్తి పెట్టుకుని తిరిగే ఓ జులాయి కిడ్నాప్ చేశాడని జూన్ నెల 11వ తేదీన పోలీసులకు తెలిసినప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉంచి దర్యాప్తు చేశారే తప్ప, కనీసం కిడ్నాప్, పోక్సో చట్టం కింద సెక్షన్లు మార్పు చేయని పరిస్థితి. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన నిందితుడు షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అలియాస్ పండుగా పోలీసులు గుర్తించారు. అతనికి ఇన్స్ర్ట్రాగామ్లో 300 నుంచి 400 మంది వరకు కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరిని పిలిచి విచారించిన పోలీసులు ఆతరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో చేతులెత్తేశారు. పోలీసులు, బాలిక తండ్రి, వారి బంధువులు కోయంబత్తూరు, పాల్గాడ్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో లాడ్జిల్లో వెతికారు. అయితే వీరి ఆచూకీ ముందుగానే ఎలా తెలుసుకున్నాడో తెలియదు గాని నిందితుడు వీరు అక్కడికి చేరుకునే రోజు లాడ్జిలు ఖాళీచేసి వెళ్లిపోతున్నాడు. అయితే పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడడం, ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఏం చేయాలో తెలియక హడావుడిగా గురువారం కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసు మార్పు చేసి హైకోర్టుకు నివేదించేందుకు నానా తంటాలు పడ్డారు. ‘ఫోన్ ఆన్ చేస్తే తప్ప ఏం చేయలేమంటూ..’జూన్ 21వ తేదీన సికింద్రాబాద్లో వెతికిన పోలీసులు ఇక ఆ తరువాత నిందితుడి ఫోన్ ఆన్ చేస్తే తప్ప, తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రాలు దాటి వెళ్లి అమాయకులను అర్ధరాత్రి పూట ఎత్తుకొస్తున్న పోలీసులకు ఓ మైనర్ బాలిక కిడ్నాప్ అయి మూడు నెలలు దాటుతున్నా చలనం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అప్పటి నుంచి మూడు నెలలుగా పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాలిక తండ్రి చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులపై హైకోర్టు సీరియస్ అయిన విషయం అందరికి తెలిసిందే. బాలిక ఇంటి నుంచి వెళుతూ లక్ష రూపాయల నగదు, బంగారం తీసుకెళ్లినట్లు సమాచారం.పోలీసులకు సవాల్ విసిరిన కిడ్నాపర్ పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకున్న నిందితుడు సికింద్రాబాద్లో ఉండే తన మేనత్త ఫోన్ నుంచి జూలై 13వ తేదీన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. అయినా పోలీసుల్లో చలనం లేకపోవడం దారుణమైన విషయం. చదవండి: బావ హత్యకు బావమరిదే సూత్రధారి
వీడియోలు
మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత
DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్
లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్
జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...
కొండా అవుట్... మంత్రి పదవి కావలెను
శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)
ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!
జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్
ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

