ఈ రాశి వారికి ధనలాభం.. వస్తువులు లాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం,శిశిరఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.చవితి సా.6.44 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: చిత్త ఉ.10.58 వరకు తదుపరి స్వాతి, వర్జ్యం: సా.5.03 నుండి 6.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.17 నుండి 7.53 వరకు,అమృత ఘడియలు: రా.3.28 నుండి 5.48 వరకు.సూర్యోదయం : 6.19సూర్యాస్తమయం : 6.03రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల సమాచారం.వృషభం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది. దైవ దర్శనాలు.మిథునం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.కర్కాటకం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో మరింత శ్రమించాలి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.సింహం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. విందులువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో హోదాలు. కుటుంబసమస్యలు తీరతాయి.కన్య: రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువిరోధాలు. పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.తుల: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు. ఆలయాల దర్శనాలు. ధనలబ్ధి. వ్యాపారాలలో లాభాలు.ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.వృశ్చికం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో డీలాపడతారు. ఉద్యోగాలలో పనిభారం.ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.మకరం: కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనసౌఖ్యం. ఆలయాల దర్శనాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో కొంత ఉపశమనం.కుంభం: ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో అవరోధాలు. మిత్రులతో విభేదాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో శ్రమ ఫలించదు.మీనం: అనుకోని ఖర్చులు. అదనపు బాధ్యతలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి.
వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం
సాక్షి, అమరావతి: శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 11 మందే అయినా 1,100 మందితో సమానమన్నట్లు మాట్లాడుతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ఉండకపోతే వైఎస్సార్సీపీ బలపడుతుందని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్సీపీ వాళ్లు చెప్పిన దానిని చాలా బలంగా నమ్ముతారు. కానీ, మనం చేసే పనులు మనం చెప్పుకోలేం. ఎందుకు సంకోచిస్తున్నామో తెలీదు. మనలో (కూటమి) ఏకాభిప్రాయం, ఏకత్వం ఉండాలి. వైఎస్సార్సీపీ వాళ్లను ఎదుర్కోవాలంటే కూటమి సభ్యులు చాలా బలంగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.
మన టాప్ ర్యాంక్ 23
సాక్షి, హైదరాబాద్: సివిల్స్–2025 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏపీలోని కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్చంద్ర ఆలిండియా 23వ ర్యాంక్ సాధించగా తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన 20 మందికి వెయ్యిలోపు ర్యాంకులు లభించాయి.ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వ సర్విసుల్లో 1,087 పోస్టులు ఖాళీగా ఉండగా తుది ఫలితాల్లో 659 మంది పురుషులను, 299 మంది మహిళలను కలిపి మొత్తంగా 958 మందిని సివిల్స్ విజేతలుగా యూపీఎస్సీ ప్రకటించింది. టాప్ 25 ర్యాంకులు సాధించిన వారిలో 14 మంది పురుషులు ఉండగా 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అర్హుల్లో 317 మంది జనరల్ కేటగిరీ వారుకాగా 306 మంది ఓబీసీలు, 158 మంది ఎస్సీలు, 73 మంది ఎస్టీలు, ఉన్నారు.అలాగే ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) విభాగం నుంచి 104 మంది ఈ జాబితాలో స్థానం సంపాదించారు. అలాగే ఐఏఎస్కు 180 మంది, ఐపీఎస్కు 150 మంది, ఐఎఫ్ఎస్కు 55 మంది, కేంద్ర సర్విసుల (గ్రూప్–ఏ)కు 507 మంది, గ్రూప్–బీ సర్విసులకు 195 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ను 5,76,793 మంది రాయగా 14,161 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. వారిలో 2,736 మంది మాత్రమే ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు.]గతేడాదికన్నా సంఖ్య తగ్గింది సివిల్స్–2025 ఫలితాల్లో ఏపీ, తెలంగాణ అభ్యర్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. గతేడాది రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధత వల్ల అభ్యర్థులు సివిల్స్పై ఎక్కువ దృష్టి సారించలేకపోయారు. విజేతల్లో ఎ క్కువ శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారు, సివిల్స్ రీ–అటెంప్ట్ చేసిన వారే ఉన్నారు. తొలిసారి పరీక్ష రాసిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీఅనూజ్ అగ్నిహోత్రి టాపర్ రాజస్తాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయి టాపర్గా నిలిచాడు. అనూజ్ ఎయిమ్స్ జో«ద్పూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తొలి ప్రయత్నంలో ఢిల్లీ, అండమాన్–నికోబార్ దీవుల సివిల్ సర్వీసు (డీఏఎన్ఐసీఎస్)లకు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్న అతను తాజాగా మూడో ప్రయత్నంలో ఆలిండియా టాపర్గా సివిల్స్కు ఎంపికయ్యాడు. చెన్నైకి చెందిన రాజేశ్వరి సువే తన రెండో ర్యాంకు సాధించారు.అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసిన ఆమె ఐదో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ కామర్స్ గ్రాడ్యుయేట్ ఆకాన్‡్ష ధుల్ మూడో ర్యాంక్ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ భార్గవ్ ఝన్ఝన్వాలా నాలుగో ర్యాంకు సాధించగా ఢిల్లీ లా యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) చేసిన ఇషాన్ భటా్నగర్ ఐదో ర్యాంకు పొందారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నందుకే ఈ ఫలితం: అనూజ్ సివిల్స్ ఫలితాల విడుదల అనంతరం అనుజ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ విజయం అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తోంది. గత రెండు ప్రయత్నాల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని అంకిత భావంతో సన్నద్ధం కావడం వల్లే ఈ ఫలితం లభించింది’అని పేర్కొన్నాడు. మరోవైపు ఆలిండియా టాపర్గా నిలిచిన అనుజ్ అగ్నిహోత్రికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా అభినందనలు తెలిపారు.ఐపీఎస్ టు ఐఏఎస్.. 23వ ర్యాంక్ సాధించిన కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్ చంద్ర ఐఐటీ కాన్పూర్లో బీటెక్ చేశారు. 2018లో బెంగళూరులో శామ్శాంగ్ సంస్థలో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. సివిల్స్ కోసం ఉద్యోగానికి స్వస్తిపలికి 2020లో తొలి ప్రయత్నంలో ర్యాంక్ రాకపోయినా మరో ప్రయత్నంగా 2021లో రాసి 314వ ర్యాంక్ సాధించి పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందారు. 2022లో మరోసారి సివిల్స్ రాసి ఐఆర్ఎంఎస్తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్విసులోనూ కొలువు సాధించారు.2023లో సివిల్స్లో ఆలిండియా స్థాయిలో 162వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఏపీ కేడర్కు ఎంపికయ్యారు. అప్పటి నుంచీ హైదరాబాద్లోని నేషనల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతూనే ఐఏఎస్ కోసం 2024లో మళ్లీ పరీక్ష రాశారు. 390వ ర్యాంక్ రావడం, లక్ష్యం నెరవేరకపోవడవంతో మరింత సాధన చేసి 2025లో మరోసారి పరీక్ష రాసి 23వ ర్యాంక్తో ఐఏఎస్కు ఎంపికయ్యారు. శ్రీజశ్వంత్ చంద్ర తండ్రి మాణిక్యాలరావు కుటుంబం పిఠాపురం నుంచి జగ్గంపేట వెళ్లి స్థిరపడింది. తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయిని.సింగరేణి కార్మీకుడి కుమార్తెకు 55వ ర్యాంకు సివిల్స్ ఫలితాల్లో సింగరేణి కార్మీకుడి కుమార్తె జాతీయ స్థాయిలో 55వ ర్యాంకుతో సత్తా చాటింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నారు గ్రామానికి చెందిన గుడెల్లి రాజేశం–రాణి దంపుతుల కుమార్తె గుడెల్లి సృజన ఆరో ప్రయత్నంలో విజయం సాధించింది. తండ్రి రాజేశం ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ వన్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. మంథని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశాక.. 2018లో ఢిల్లీ వెళ్లి శిక్షణ తీసుకుంది. అమ్మనాన్నల ప్రోత్సాహంతోనే.. ‘మేము ముగ్గురం పిల్లలం. ఐఏఎస్ కావాలనే నా కలను అమ్మానాన్నలు వారి కలగా మార్చుకున్నారు. నా ప్రయత్నాలను ప్రోత్సహించారు. గతేడాది ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కి వచ్చా. మరోసారి ప్రతి్నంచాలని ప్రోత్సహించారు. గ్రూప్–1 రాసి డీఎస్పీగా శిక్షణ తీసుకుంటూనే మరోసారి సివిల్స్కి ప్రిపేరయ్యా. అమ్మానాన్నల మాట ఈరోజు నిజమైంది. అప్పటి కరీంనగర్ కలెక్టర్ స్మితాసబర్వాల్ను స్ఫూర్తిగా తీసుకొని సివిల్స్కు ప్రిపేరయ్యా. మహేశ్ ఎం.భగవత్ సర్ సలహాలతో ఈరోజు సివిల్స్లో మంచి ర్యాంకు సాధించా.’ఐఎఫ్ఎస్ వచ్చినా ఐఏఎస్పై గురి 103వ ర్యాంకు సాధించిన బిపుల్ గుప్తా విశాఖవాసి. ఆయన తండ్రి విశాఖ స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ఫర్నేస్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ గుప్తా. 2024 సివిల్స్ పరీక్షల్లో బిపుల్కు 368వ ర్యాంకు రావడంతో ఐఎఫ్ఎస్ అధికారిగా ఏపీ కేడర్లో చేరారు. ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు. అయినా ఐఏఎస్ లక్ష్యంగా మళ్లీ సివిల్స్ రాసి ఇప్పుడు 103వ ర్యాంకు సాధించారు. బిపుల్ 2022లో ఐఐటీ మద్రాస్లో బీటెక్ పూర్తి చేశారు. తైక్వాండోలో బ్లాక్బెల్ట్ సాధించిన బిపుల్ గుప్తా తల్లి డాక్టర్ దీప గుప్త ప్రముఖ యూట్యూబర్. ఈసారి ఐఏఎస్ లభించే అవకాశం ఉందని బిపుల్ తెలిపారు.నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సివిల్స్లో మూడుసార్లు విఫలమైనా పట్టుదలతో చదివి నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సాధించారు తిరుపతికి చెందిన యారాశి తుషారికరెడ్డి. ఆమె తండ్రి వై.ఎం. గురువారెడ్డి తిరుపతి బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, తల్లి మల్లీశ్వరి టీటీడీలో సూపరింటెండెంట్. తుషారిక చెన్నైలోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ చేశారు. ప్రస్తుతం ఐఆర్ఎస్ లేదా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ పోస్టు రావచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. గ్రూప్–2తో మురిసి.. సివిల్స్లో మెరిసి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు లక్ష్మి కుమారుడు సౌరోతు రాము సివిల్స్లో 463వ ర్యాంకు సాధించారు. రాముది సాధారణ వ్యవసాయ కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి కష్టపడి కుమారుడిని చదవించారు. ఆయన ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ పూర్తి చేశారు. గత నెలలో గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ఇప్పుడు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ర్యాంకు కొట్టారు.నాలుగో యత్నంలో 573వ ర్యాంకు విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎల్ఎంఎం విభాగంలో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్న రాజబాబు, విజయలక్ష్మి దంపతుల రెండో కుమార్తె శ్వేత ఐఐటీ హైదరాబాద్లో పూర్తి చేశారు. అనంతరం రెండుసార్లు సివిల్స్ ప్రిలిమ్స్లో విఫలమైన ఆమె మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అనుకున్న ఫలితం రాలేదు. నాలుగో ప్రయత్నంలో 573 ర్యాంక్ సాధించారు. ప్రజాసేవ చేయాలన్నదే తన లక్ష్యమని శ్వేత పేర్కొన్నారు. ⇒ ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన గోగుళ్ల రాజశేఖర్కు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైనా సివిల్ సర్విసెస్లో 920వ ర్యాంకు సాధించారు. ఒడిశాలోని భువనేశ్వర్ ఐఐటీలో ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ చదివారు. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోకుండా ఐదోసారి పరీక్షలు రాసి విజయం సాధించారు.⇒ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన ప్రమోద్విష్ణు సత్తా చాటారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 640వ ర్యాంకు సాధించారు. ఆయన విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ⇒ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన రాఘవేందర్ పదుకొనె, మమత దంపతుల కూతురు ఇంద్రార్చిత సివిల్స్లో 627 ర్యాంకు సాధించారు.నాలుగో ప్రయత్నంలో 178వ ర్యాంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాకతీయనగర్కు చెందిన బానోతు లక్ష్మీరచన సివిల్స్ ఫలితాల్లో 178వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి బానోతు వెంకటరమణ విప్రోలో ఉద్యోగి కాగా తల్లి తులశమ్మ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ తర్వాత బజాజ్ సంస్థలో అసోసియేట్ సైంటిస్ట్గా పనిచేస్తూ సివిల్స్ సాధించాలని మూడుసార్లు ప్రయతి్నంచింది. చివరకు నాలుగో ప్రయత్నంలో లక్ష్మీరచన 178వ ర్యాంకు సాధించింది. ఐఐటీ ఇండోర్లో ఆమె చదివింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్స్ సాధించాలన్న తన తండ్రి కోరిక నెరవేరలేదని.. దాంతో తనను సివిల్స్ రాయమన్నారని.. ఇప్పుడు తన తండ్రి కల నెరవేర్చినట్లయిందన్నారు.ఎంపీడీఓకు 472వ ర్యాంకుసిద్దిపేట జిల్లా మర్కూక్ మండల అభివృద్ధి అధికారి బేతి విక్రమ్ సివిల్స్లో 472 ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విక్రమ్ మాట్లాడుతూ సాధించాలనే కృషి ఉంటే ఏదీ అసాధ్యం కాదని, తాను ఐఏఎస్ కోసం చాలా కష్ట పడ్డానన్నారు. తన కల సాకారమైందన్నారు. డిప్యూటీ కలెక్టర్కు 358వ ర్యాంకు మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ సివిల్స్లో 358వ ర్యాంకు సాధించారు. గతేడాది ఫలితాల్లో ఆయనకు 700వ ర్యాంకు వచ్చింది. గ్రూప్–1లోనూ సత్తా చాటిన వెంకటేశ్.. ప్రస్తుతం నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణలో ఉన్నారు. ఆయన తండ్రి సత్యయ్య ట్రాన్స్కో ఏఈగా పనిచేస్తున్నారు. తల్లి యశోద గృహిణి. ఈసారి ఐఏఎస్ రాకపోతే మరోసారి ప్రయతి్నంచి లక్ష్యాన్ని చేరుకుంటానని వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు.రెండో ప్రయత్నంలో...హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన ఆర్మీ విశ్రాంత అధికారి కల్నల్ శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయిని బిందుల కుమారుడు డి.ఎస్.కె ప్రచేత్ సివిల్స్లో 193వ ర్యాంకు సాధించాడు. రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. మద్రాస్ ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలో 259వ ర్యాంకు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి సివిల్స్లో 259వ ర్యాంక్ సాధించారు. వర్షిత్ హైదరాబాద్లోని బిట్స్ క్యాంపస్లో 2023లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కస్టమ్స్ విభాగంలో జీఎస్టీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా గతేడాది ఉద్యోగం సాధించి ప్రస్తుతం విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్లో ర్యాంక్ సాధించారు. ఆయన తండ్రి శనిగరం నవీన్రెడ్డి వ్యాపారవేత్త, తల్లి కవితరెడ్డి.అటెండర్ కొడుకుకు 768వ ర్యాంకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి శ్రవణ్కుమార్ సివిల్స్లో 768 ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి కుమ్మరి యాదగిరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తుండగా తల్లి జ్యోతి ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గ్రూప్–1లో ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికై ఉద్యోగ శిక్షణ ఉంటూనే సివిల్స్ కోసం ప్రయతి్నంచి 6వ ప్రయత్నంలో శ్రవణ్కుమార్ లక్ష్యం చేరుకున్నాడు. లక్ష్యం పెట్టుకొని చదివానని.. సమాజంలో విద్యాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు.సివిల్స్లో అన్నదమ్ములకు ర్యాంకు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన అంజిరెడ్డి, ఆలివేలు దంపతుల కుమారులు వేలిమినేటి విక్రమసింçహారెడ్డి, విజయసింçహారెడ్డి సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. విక్రమసింçహారెడ్డి 541 ర్యాంకు, విజయసింçహారెడ్డి 682 ర్యాంకు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోదరులిద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్–1 పరీక్షల్లో విక్రమ్సింçహారెడ్డి 208 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగంలో చేరగా విజయసింహారెడ్డి గ్రూప్–1లో 340 ర్యాంక్ సాధించి మహబూబ్నగర్లో ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు.అమ్మానాన్న ప్రోత్సాహంతోనే.. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే సివిల్స్లో ర్యాంక్ సాధించానని 748వ ర్యాంకర్ పూదరి రాహుల్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి గంగలక్షి్మ–మల్లేశం దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు రాజశ్రీకి వివాహం కాగా, పెద్దకుమారుడు రవితేజ సివిల్ సర్జన్గా శిక్షణ పొందుతున్నారు. చిన్నకుమారుడు రాహుల్ సివిల్స్లో 748వ ర్యాంక్ సాధించారు.
ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
సినీ తారలు మాత్రమే కాదు.. ఎవరికైనా బాల్యం అనేది ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులు తిరిగి వస్తే బాగుంటుందని అందరం అనుకుంటాం. కానీ అది జరగదని మనకు కూడా తెలుసు. ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగుతాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్ తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. అక్క జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా తనతో ఉన్న చిన్నప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఈ ఫోటోలు చూస్తుంటే అస్సలు జాన్వీకపూర్ చిన్నప్పుడు ఇలా ఉండేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ చాలా క్యూట్ క్యూట్గా కనిపించారు. జాన్వీతో చిన్నప్పటి ఫోటోలు, అమ్మ శ్రీదేవితో ఉన్న పిక్స్ను షేర్ చేసింది. నా సోదరి, నా ప్రాణ స్నేహితురాలు, నా సలహాదారు, నా గురువు, నా క్రైమ్ పార్ట్నర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు నా జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండి..ఈ రోజు ఒక వ్యక్తిగా మారడానికి నన్ను పెంచడంలో సహాయపడినందుకు ధన్యవాదాలు తెలిపింది. నువ్వు లేకుండా నేను జీరో.. నా జీవితంలో ఎల్లప్పుడు నీతోనే ఉండాలని ఆశిస్తున్నాను.. లవ్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మరో సినిమా చేస్తోంది. రామ్ చరణ్- బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor)
చావుకు అడ్డొస్తోందని భార్యపై పెట్రోల్ దాడి
ప్రజాప్రతినిధులకు ఒకే రూల్ ఉండాలి
బస్సు అదుపుతప్పి.. లారీ, టిప్పర్ దూసుకెళ్లి..
అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు
వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం
ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు
అసెంబ్లీలో భజన.. కౌన్సిల్లో పలాయనం
నేను అందరివాడిని
చేబదుళ్లకూ భారీగా వడ్డీ చెల్లింపు
చమురు సలసల.. మార్కెట్ విలవిల!
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
మొయిన్ అలీపై నిషేధం..!
'లడ్డూ'పై సమాధానం చెప్పలేక చంద్రబాబు సతమతం
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
పడిపోతున్న పసిడి ధరలు.. ఈసారి తులం..
IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
అణ్వాయుధ ప్రోగ్రామ్.. అమెరికాకు ఇరాన్ కండీషన్..!
రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
తనూజ బర్త్డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి లాభం
'మమ్మల్ని పంపించండి మహాప్రభో'
చావుకు అడ్డొస్తోందని భార్యపై పెట్రోల్ దాడి
ప్రజాప్రతినిధులకు ఒకే రూల్ ఉండాలి
బస్సు అదుపుతప్పి.. లారీ, టిప్పర్ దూసుకెళ్లి..
అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు
వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం
ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు
అసెంబ్లీలో భజన.. కౌన్సిల్లో పలాయనం
నేను అందరివాడిని
చేబదుళ్లకూ భారీగా వడ్డీ చెల్లింపు
చమురు సలసల.. మార్కెట్ విలవిల!
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
మొయిన్ అలీపై నిషేధం..!
'లడ్డూ'పై సమాధానం చెప్పలేక చంద్రబాబు సతమతం
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
పడిపోతున్న పసిడి ధరలు.. ఈసారి తులం..
IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
అణ్వాయుధ ప్రోగ్రామ్.. అమెరికాకు ఇరాన్ కండీషన్..!
రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
తనూజ బర్త్డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి లాభం
'మమ్మల్ని పంపించండి మహాప్రభో'
ఫొటోలు
ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు
జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష సందడి.. ఫోటోలు వైరల్
నిజామాబాద్లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
వైఎస్ జగన్ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)
సినిమా
యాక్షన్ భోగి
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. కాగా శుక్రవారం (ఫిబ్రవరి 6) శర్వానంద్ బర్త్డే.ఈ సందర్భంగా ‘భోగి’ మూవీ నుంచి ఆయన పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ రూపొందుతోంది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నాం.ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకూ కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. జిద్ధి జిద్ధి...: శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘బైకర్’. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. జిబ్రాన్ సంగీతం అందించారు. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ‘జిద్ధి జిద్ధి...’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటని జిబ్రాన్, షెన్బగరాజ్, అరవింద్ శ్రీనివాస్, సుదర్శన్ రామ్ పాడారు.
జాన్వీ కపూర్ బర్త్ డే.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్
పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్కు మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. పెద్ది మూవీ సెట్లో జాన్వీ కపూర్తో ఉన్న స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన సీన్స్ను చెర్రీ పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర 'అచ్చియమ్మ' గెటప్లో కనిపిస్తూ సందడి చేశారు. ఆమెకు తన వృత్తి పట్ల ఆమెకున్న మక్కువ, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది.. ఈ ఏడాది తనకి మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి సాంగ్ చికిరి చికిరి అభిమానులను ఓ ఊపు ఊపేయగా.. ఇటీవల రిలీజైన రైరై రారా అంటూ సాగే పాట కూడా అదే రేంజ్లో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మించిన ఈ చిత్రం నేడు(మార్చి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాంకథేంటంటే..మల్లేష్(శ్రీనాథ్ మాగంటి) చిన్నప్పటి నుంచి తాగుడు అలవాటు ఉంటుంది. దానికి కారణం వాళ్ల నాన్న. నాన్న తాగొచ్చ అతన్ని కొట్టడంతో.. ఓ రోజు మల్లేష్ కూడా మద్యం సేవించి నాన్నని కొట్టి పారిపోతాడు. కొన్నాళ్ల తర్వాత నాన్న చనిపోయిన విషయం తెలిసి తిరిగి వస్తాడు. ఊర్లోనే టెంట్ హౌస్ పెట్టి.. వచ్చిన డబ్బులతో తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అతని మేనమామ కొడుకు చిన్న పటేల్(రాజేష్)తో మల్లేష్ ఫ్యామిలీకి గొడవలు ఉంటాయి. తల్లి బలవంతం చేయడంతో జ్యోతి(గాయత్రీ రమణ)ని మల్లేష్ పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజే అతనికి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? దాని వల్ల మల్లేష్కి వచ్చిన సమస్యలు ఏంటి? చిన్న పటేల్తో మల్లేష్ చేసిన ఛాలెంజ్ ఏంటి? జ్యోతి-మల్లేష్ల సంసారం ఎలా సాగింది? మందు లేనిదే ఏ పని చేయలేని మల్లేష్...చివరకు మద్యానికి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ కథలో కామాక్షి భాస్కర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ అడల్ట్ కామెడీ చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ సింపులే అయినా.. దాని చుట్టు అల్లిన సన్నివేశాలు బాగున్నాయి. అడల్ట్ కామెడీ అయినా.. అందులోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. దారితప్పిన వ్యక్తిని తల్లి, భార్య ఎలా దారికి తీసుకొచ్చారు అనేది చూపిస్తూనే మద్యానికి బానిసైతే ‘సంసార’ జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయి.మల్లేష్కు చిన్నప్పుడే తాగుడు అలవాటు ఎలా వచ్చింది అనే సన్నివేశాలతో కథను ప్రారంభించాడు దర్శకుడు. మొదటి పది నిమిషాలు రొటీన్గానే సాగిపోతుంది. మల్లేష్, జ్యోతిల పెళ్లి తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు. కానీ ‘కార్యం’ మాత్రం కాదు. ఆ విషయం దాచేందుకు హీరో చేసే ప్రయత్నాలన్నీ నవ్వులు పూయిస్తాయి. మల్లేష్కి ‘కార్యం’ కాలేదనే విషయం చిన్నపటేల్కి తెలిసిన తర్వాత అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఇంటర్వెల్ ముందు ఇద్దరు చేసుకునే సవాల్.. సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థం ప్రారంభంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఛాలెంజ్ గెలవడం కోసం హీరో చేసే ప్రయత్నాలు.. దాన్ని తిప్పికొట్టేందుకు చిన్న పటేల్ చేసే కుట్రలు అన్ని రొటీన్గానే ఉంటాయి. తల్లి చనిపోయే సీన్ కూడా అనవసరమే అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో కామాక్షీ సీన్ అదిరిపోతుంది. అయితే ఆ తర్వాత ఆమె పాత్రను అంతే బలంగా చూపిస్తే బాగుండేది. కానీ దర్శకుడు మాత్రం భార్య భర్తల అనుబంధంపైనే ఫోకస్ చేశాడు. అవి ఆకట్టుకుంటాయి. అలాగే కార్యం సమయంలో పక్కింట్లోని ముసలాయన రేడియోలో వినే పాత పాటల సీన్లన్నీ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. రేడియో సీన్ రిపీట్ అయిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుతాడు. కానీ కార్యం సీన్తో పాటు కొన్ని బూతు డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. క్లైమాక్స్ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు తెరపై సాఫ్ట్ పాత్రల్లో కనిపించిన శ్రీనాథ్.. ఇందులో ఊరమాస్ లుక్లో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్గా నటించిన గాయత్రి రమణ..తెరపై పక్కింటి తెలుగు అమ్మాయిలా కనిపించడమే కాకుండా నటన పరంగానూ మెప్పించింది. కామాక్షి భాస్కర్ల పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు కానీ.. ఒక్క సీన్లో మాత్రం అదరగొట్టేసింది. పటేల్గా రాజేశ్ బాగానే నటించాడు. మురళీ ధర్, రాజ్ కుమార్ కసిరెడ్డిల కామెడీ సినిమాకు ప్లస్ అయింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సురేశ్ బొబ్బిలి నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టే, సాక్షి వెబ్డెస్క్
ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
క్రీడలు
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ టైటిల్ పోరుకు న్యూజిలాండ్, టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో భారత్తో ఫైనల్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్ బౌలర్ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లోకాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్ అని అన్నాడు.అతడు కూడా మనిషే కదా!‘‘ఇటీవల టీమిండియా సిరీస్లో భాగంగా బుమ్రా బౌలింగ్లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్ బౌలర్. వైవిధ్యభరితంగా బౌలింగ్ చేస్తాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. అయితే, అతడి మీద మాకు మంచి రోజు అయ్యేది ఫైనలే ఎందుకు కాకూడదు?’’ అని గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్ కివీస్తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్
IND v AUS: భారత్ ఆలౌట్.. ఆసీస్ స్కోరెంతంటే?
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు మొదటి రోజు తడబడింది. తొలి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ అయింది. ఆసీస్ వుమెన్ టీమ్తో మూడు టీ20, మూడు వన్డేలు.. ఒక టెస్టు ఆడేందుకు హర్మన్ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాటీ20 సిరీస్ను భారత్ 2-1తో దక్కించుకోగా.. వన్డే సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం డే- నైట్ టెస్టు మ్యాచ్ మొదలైంది. పెర్త్లోని WACA స్టేడియం వేదికగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఫలితంగా బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) నాలుగు పరుగులకే వెనుదిరిగింది. లూసీ హోమిల్టన్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరింది. వన్డౌన్లో వచ్చిన ప్రతికా రావల్ (18) సైతం నిరాశపరిచింది.హాఫ్ సెంచరీతో రాణించిన జెమీమాఇక మరో ఓపెనర్ షఫాలీ వర్మ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) అర్ధ శతకం (84 బంతుల్లో 52, 7 ఫోర్లు)తో రాణించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (19) విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో కశ్వీ గౌతం (34 నాటౌట్) మెరుగైన బ్యాటింగ్తో ఆకట్టుకుంది.మిగిలిన వారంతా పెవిలియన్కు క్యూ కట్టారు. దీప్తి శర్మ (7), రిచా ఘోష్ (11), స్నేహ్ రాణా (5), సయాలీ సత్గరే (7), క్రాంతి గాడ్ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా భారత్ 62.4 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అనాబెల్కు నాలుగు వికెట్లుఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేయగా.. లూసీ హోమిల్టన్ మూడు వికెట్లు పడగొట్టింది. డార్సీ బ్రౌన్ రెండు, ఆష్లే గార్డ్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లలో జార్జియా వోల్ (2)ను సయాలీ బౌల్డ్ చేయగా.. ఫోబే లిచిఫీల్డ్ (9)ను క్రాంతి గాడ్ పెవిలియన్కు పంపింది. కెప్టెన్ అలెసా హీలీ (13) వికెట్ను సయాలీ తన ఖాతాలో వేసుకోగా.. ఎలిస్ పెర్రీ, అనాబెల్ పట్టుదలగా నిలబడ్డారు.నిలకడగా పెర్రీ, అనాబెల్శుక్రవారం నాటి మొదటిరోజు ఆట పూర్తయ్యేసరికి ఎలిస్ పెర్రీ 62 బంతుల్లో 43, అనాబెల్ 29 బంతుల్లో 20 పరుగులతో క్రీజులో నిలిచారు. మొత్తంగా ఆసీస్ 27 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే ఆసీస్ 102 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్గా తొలి రోజు ఆసీస్దే పైచేయి అని చెప్పవచ్చు. చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్ శర్మపై అశ్విన్ ఆగ్రహం
అభిషేక్ శర్మ.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్ దశలో మూడు మ్యాచ్లు ఆడి డకౌట్ అయినా యాజమాన్యం అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తేలిపోయాడు. తొందరపడి వికెట్ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్మరో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ ఓపెనింగ్ బ్యాటర్ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‘‘ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి అభిషేక్ గేమ్ప్లాన్కు నేను వీరాభిమానిని. విల్ జాక్స్ బౌలింగ్లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్ తీసి మరో ఎండ్కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్ అభిషేక్పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్తో ఫైనల్ నేపథ్యంలో.. ‘‘అభిషేక్ మంచి బ్యాటర్. న్యూజిలాండ్తో ఇటీవలి సిరీస్లో సూపర్ ఫామ్ కనబరిచాడు. మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ బౌలింగ్లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్, హెడ్కోచ్ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్మెంట్ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. అభిషేక్ కోసం లెగ్సైడ్లో ఒకే ఒక్క ఫీల్డర్ను ఉంచాడు. అతడికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రంచకప్-2026 ఫైనల్కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ను భారత్ ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో భారత్- న్యూజిలాండ్ మధ్య మార్చి 8 (ఆదివారం) ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మెగా ఫైనల్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.అంపైర్లు వీరే..టీమిండియా- కివీస్ (IND vs NZ Final) మధ్య టైటిల్ పోరుకు అంపైర్లను శుక్రవారం ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్లకు చోటు ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరు ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్కు కూడా అంపైర్లుగా వ్యవహరించారు.ఆ రెండుసార్లూ గెలిచినా..ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫైనల్లలో అంపైర్గా పని చేసిన అనుభవం ఇల్లింగ్వర్త్కు ఉంది. వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్లో ఆయనే అంపైర్.అయితే, 2023లో తప్ప 2024, 2025 టైటిల్ పోరులో టీమిండియానే విజయం వరించింది. అన్నట్లు 2023లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్కు అడుగు దూరంలో నిలిచిపోయింది.ఆందోళనలో అభిమానులు.. కారణం ఇదేఅయితే, 2024లో వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాను.. 2025లో దుబాయ్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, 2023 మాదిరే ఈసారి కూడా అదే అంపైర్ (ఇల్లింగ్వర్త్), అదే వేదిక (అహ్మదాబాద్)పై ఫైనల్ కావడంతో అభిమానులు కాస్త సెంటిమెంట్ ఫీలవుతున్నారు. దురదృష్టం వెంటాడకూడదని ప్రార్థిస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026లో భారత్- న్యూజిలాండ్ ఫైనల్కు అంపైర్లు వీరే👉ఆన్ ఫీల్డ్ అంపైర్లు- రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్👉థర్డ్ అంపైర్- అల్లాఉద్దీన్ పలేకర్👉ఫోర్త్ అంపైర్- అడ్రియాన్ హోల్డ్స్టక్👉మ్యాచ్ రిఫరీ- ఆండీ పైక్రాఫ్ట్.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్
న్యూస్ పాడ్కాస్ట్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
తీవ్రరూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం... ఇరాన్కు అండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
భగ్గుమన్న పశ్చిమాసియా... ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు... భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు క్లీన్చిట్... కవిత, సిసోడియా సహా 23 మందీ నిర్దోషులే... ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
బిజినెస్
బంగారానికి భారీ డిస్కౌంట్.. ఎక్కడ.. ఎందుకు?
మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్కు, అమెరికా-ఇజ్రాయెల్కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.
ఒకేసారి 300 మంది ఉద్యోగులపై వేటు!
అమెజాన్ కంపెనీ ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన తరువాత.. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సంస్థ తన వ్యాపారాలలో దాదాపు 20,000 మంది ఉద్యోగులను మాత్రమే కలిగి ఉంది.2024 ప్రారంభంలో కూడా ఫ్లిప్కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో 5 శాతం లేదా 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు 300 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇంటర్నెట్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించడం & పనితీరును మెరుగుపరచడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. స్టార్టప్ రంగంలో పెట్టుబడులు తగ్గడం.. లాభదాయకతపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలను తీసుకుంటున్నాయి. ఫ్లిప్కార్ట్ కూడా అదే దిశగా చర్యలు తీసుకుంటూ సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫ్లిప్కార్ట్ భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సంస్థ గోల్డ్మన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ & కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి పెట్టుబడి బ్యాంకులతో ప్రారంభ చర్చలు జరుపుతోంది. కాగా కంపెనీ 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో ఐపీఓ చేయాలని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ఫ్లిప్కార్ట్ తన సంస్థ నిర్మాణంలో కూడా కొన్ని మార్పులు చేసింది. కంపెనీకి సంబంధించిన హోల్డింగ్ సంస్థను సింగపూర్ నుంచి తిరిగి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి ఆమోదం పొందింది. ఈ నిర్ణయం కంపెనీ భారతదేశంలో పబ్లిక్ లిస్టింగ్కు సిద్ధం కావడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.ఇదీ చదవండి: జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!
జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!
ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే అవసరం వద్దనుకునేవారి కోసం రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో ఒకటి సెలక్ట్ చేసుకుంటే.. 200 కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ.1748 ప్లాన్రూ. 1748 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు డేటా లభించదు. ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఎంటర్టైన్మెంట్ కోసం జియోటీవీ, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్కు యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు లేదా సెకండరీ నంబర్ను ఉపయోగించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.2025 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా (మొత్తం 500 జీబీ), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఇవి కాకుండా కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3599 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాదిపాటు (365 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వీటితో పాటు కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3999 ప్లాన్రూ. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు. హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత వేగం 64Kbpsకి పడిపోతుంది.
కుప్పకూలిన మార్కెట్లు.. కూల్చేసిన క్రూడ్
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ఏడాది కాల గరిష్టానికి పెరగడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు షెషన్ చివర్లో గణనీయ నష్టాలను చవిచూశాయి.నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 1.27 శాతం లేదా 315.45 పాయింట్ల నష్టంతో 24,450.45 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 1.37 శాతం లేదా 1,097 పాయింట్లు నష్టపోయి 78,918.90 వద్ద ముగిసింది.యూఎస్-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నందున హోర్ముజ్ జలసంధి షిప్పింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఇది సరఫరా అంతరాయం భయానికి ఆజ్యం పోసింది. దీంతో యూరోపియన్ వాణిజ్య సెషన్ లో బ్రెంట్ క్రూడ్ ను బ్యారెల్ కు 87 డాలర్ల మార్కుకు పైగా నెట్టింది.నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.69 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.24 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.27 శాతం క్షీణతతో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన సూచీగా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్లో నష్టపోయిన ఇతర రంగాలు. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఐటీ స్వల్ప లాభాలతో సెక్టోరల్ సూచీలను అధిగమించింది.
ఫ్యామిలీ
హెయిర్కట్ తప్పిదానికి..రూ. 5 కోట్ల పరిహారం!
హెయిర్కట్ తప్పిదానికి ఓ మహిళ ఏకంగా కోట్లలో నష్టపరిహారం కోరింది. సరిగ్గా హెయిర్ కటింగ్ చేయకపోవడం వల్ల ఉద్యోగంలో ఉన్నతి పదవిని కోల్పోయానని, అధిక వేతనం పొందలేకపోయానంటూ కోర్టుని ఆశ్రయించింది. చిన్నపాటి తప్పిదాన్ని పెద్దగా చేసి చూపించి వినియోగదారుల కేసులో కోట్లలో నష్టపరిహారం పొందింది. పాపం సదరు సెలూన్ సెంటర్ ఇంత చిన్నతప్పిదానికి అంత భారీ పరిహారమా అని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే..మళ్లీ అమాంతం పరిహారం పెంచేసింది. చివరికి ఆమెకు ధర్మాసనం ఊహించని దిమ్మతిరిగిపోయే ఝలక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 12, 2018న, ఆమె హెయిర్ కట్ కోసం ఒక ఫైవ్ స్టార్ హోటల్ బ్యూటీ సెలూన్కి వెళ్లింది. కానీ వాళ్లు పొరపాటున తప్పుగా కట్చేశారు. దాంతో వాళ్ల సేవకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జూలై 2018లో వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 21, 2021న, వినియోగదారుల కమిషన్ బ్యూటీ సెలూన్ను తప్పుపడుతూ బాధిత మహిళకు ఏకంగా రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించమని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ ఆదేశంతో అసంతృప్తి చెందిన బ్యూటీ సెలూన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే పరిహారం మొత్తం అంచనా వేసేందుకు ఆ కేసుని తిరిగి వినియోగదారుల కమిషన్కు పంపింది ధర్మాసనం. దాంతో ఆ మహిళ తన క్లైయిమ్ను అమాంతం రూ.2 కోట్లు నుంచి రూ. 5.2 కోట్లుకు పెంచేసింది. పైగా అందుకోసం కమిషన్ ముందు పలు పత్రాలను కూడా సమర్పించింది. వినియోగదారుల కమిషన్ ఆ పత్రాలను పరిశీలించి ఆమె ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి చెల్లింపు జరిగే రోజుకి రూ. 9 వడ్డీతో కలిపి మళ్లీ రూ. 2 కోట్లు పరిహారంగా మంజూరు చేసింది. దాంతో మనస్తాపం చెంది బ్యూటీ సెలూన్ మళ్లీ సుప్రీంకోర్టులో మరో అప్పీల్ దాఖలు చేసింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టు ముందు, ఆమె తాను ఉన్నత విద్యావంతురాలైన మహిళనని, కలకత్తాలోని ఐ.ఐ.ఎం. నుంచి మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా కూడా చేశానని పేర్కొంది. ఆ సెలూన్లో హెయిర్ కటింగ్ చేసుకోకముందు తనకు మంచి కెరీర్ ఉందని చెప్పింది. కానీ బ్యూటీ సెలూన్ దానిని ఖండించింది. హెయిర్ అనేది ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉన్న అంశంగా వాదించింది. పైగా ఎగ్జిక్యూటివ్ పదవుల్లో ఉన్నవాళ్లు సినీ సెలబ్రిటీలు లేదా మోడలింగ్ వాళ్ల మాదిరిగా జుట్టు కత్తిరించుకోకూడదని వాదించింది. అందువల్ల జాబ్ కెరీర్ పాడైందని, ఉన్నతి పదవులు కోల్పోయానని, భారీ వేతనం అదుకోవాల్సిన తాను తక్కువ మొత్తంలో జీతం పొందుతున్నానని తన గోడును వినిపించింది. అంతేగాదు హెయిర్ కట్ కోసం వెళ్ళినప్పుడు, మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్నానని, కానీ జూన్ 2018లో తన ఉద్యోగాన్ని ఈ కారణంగా కోల్పోయానని పేర్కొంది. అయితే ఈ సంఘటనకు ముందు, తర్వాత ఆదాయ పన్ను రిటర్న్లను సమర్పించడంలో విఫలమైందని సెలూన్ తరుపు న్యాయవాది వాదించారు. అలాగే అంత భారీ మొత్తంలో నష్ట పరిహారం పొందేలా సరైన ప్రామాణిక పత్రాలు ఏమి సమర్పించ లేదని కోర్టు గుర్తించింది. దాంతో కోర్టు కేవలం బాధతురాలి అంచనాలు, ఆమె ఇష్టాఇష్టాలను అనుసరించి పరిహారం ఇవ్వరని స్పష్టం చేసింది. అలాగే ఈ న్యాయపోరాటంలో గతంలో సదరు సెలూన్ 25 లక్షలు కోర్టులో డిపాజిట్ చేసిందని గుర్తుచేస్తూ..అంతమొత్తం మీరు సమర్పించిన పత్రాలకు అనుగుణంగా సరిపోతుందని స్పష్టం చేసింది. అంతేగాదు ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో పరిహారం పొందాలంటే..అతనికి జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేస్తారు. అందుకు తగిన డాక్యుమెంట్స్, సాక్షాధారాలు కూడా ఉండాలంటూ సదరు మహిళకు చురకలు అంటించింది.(చదవండి: అర్జున్-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్ లుక్..!)
అర్జున్-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్ లుక్..!
సచిన్- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండుల్కర్, యువ వ్యాపారవేత్త సానియా చందోక్ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు క్రికట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంత్-రాధిక మర్చంట్ల వివాహవేడుక జరిగిన అదే ప్రదేశంలో అర్జున్ సానియాల వివాహం జరగడం విశేషం. ఆ నేపథ్యంలో ఆ సచిన్ టెండూల్కర్ ఇంట జరిగే పెళ్లి తంతుకి సంబంధించిన ప్రతీది అంబానీ కుటుంబమే స్వయంగా చూసుకుంది. అందుకు సచిన్ కూడా సభా ముఖంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. కాగా ఈ వేడుకలో ఫ్యాషన్కి ఐకాన్గా ఉండే రిలయన్స్ ఛైర్మన్, తన సిగ్నేచర్స్టైల్తో మెరిశారు. వేడుకుకు తగిన విధంగా తన ఆహార్యాన్ని ప్రతిబింబించేలా కేర్ తీసుకుంటారు నీతా. ఆమె ఈ వేడుకకి రిలయన్స్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అతడి భార్య శ్లోకా మెహతాలతో కలిసి విచ్చేశారు. ఈ వేడుకలో ఆయు ధరించిన చీర, ధగ ధగ మెరిసిపోతున్న నెక్లెస్ అత్యంత హైలెట్గా నిలిచాయి. నీతా ఈ వేడుక కోసం రాచరికపు స్టైల్ ఐవరీ బంగారు సిల్క్ చీర ఎంచుకున్నారు. ఈ ఆరుగజాల చీరలో నీతా బంగారపు బొమ్మలా ముగ్ధమనోహరంగా కనిపించారు. బంగారు మోటీఫ్లతో అలకరిచిన ఆ ఫ్యాబ్రిక్ ప్రకాశవంతమైన ఆకృతిని ఇచ్చింది. నిలువు జరీ చారలతో ఎంబ్రాయిడరీ స్లీవ్ బోర్డర్లు చీర లుక్ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆ చీరకు సింపుల్గా స్టేట్మెంట్ డైమండ్ నెక్లస్ చీర అందాన్ని అమాంతం రెట్టింపు చేసింది. చెవికి కూడా డైమండ్ స్టడ్ పోగులు ధరించి స్టైల్ పరంగా నీతాకు సాటిరారెవ్వరూ అనేంతగా ఉంది ఆమె ఆహార్యం. ఇక ముఖేశ్ అంబానీ కూడా క్లాసిక్ బ్లాక్ బంధ్ గలా సూట్లో హుందాగా కనిపించారు. అంతేగాదు ఈ జంట ఆధునాతన సంప్రదాయంతో కలగలసిన స్టైలిష్ లుక్లో అందరి మనసులను దోచుకున్నారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) (చదవండి: 'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా)
మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి
కేరళ పేరు వినగానే మన తెలుగువారికి భక్తితో అయ్యప్పస్వామి గుర్తుకొస్తారు శబరిమల యాత్ర మనకి గొప్ప అనుభూతినిస్తుంది. శబరివాసుడు అయ్యప్పస్వామి దర్శనం ఇంచుమించుగా పురుషులకి మాత్రమే అయితే స్త్రీలకి మాత్రమే ఏటా ఒకసారి పొంగలి సమర్పించే దేవాలయం ఆటుకాల్ భగవతి క్షేత్రం. ఈ క్షేత్రం కేరళ రాజధాని తిరువనంతపురం నగరంలో ఉంది. ఏటా ఫిబ్రవరి, మార్చినెలలలో ఆటుకాల్ భగవతికి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి పొంగలి సమర్పిస్తారు. కేరళ రాష్ట్రం నలుమూలల నుండి అలాగే దేశ విదేశాలలో ఉండే మలయాళీ స్త్రీలు లక్షలలో భగవతికి పొంగాల (పొంగలి) సమర్పించడానికి వస్తారు. ఆరోజు కేరళ రాష్ట్ర రాజధాని స్త్రీలతో నిండిపోతుంది. పొంగాల సమర్పించడానికి పొయ్యి, వంట దినుసులు మాన్తా కోసం వంటచెరకు సిద్ధం చేసుకుంటారు. లక్షలాది మంది స్త్రీలు ఒకచోట చేరి దేవికి ప్రసాదం వండడం గిన్నెస్ బుక్ రికార్డు. ప్రతి ఏటా ఆ రికార్డు తిరగ రాయడం భగవతి శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో కేవలం స్త్రీలు మాత్రమే పాల్గొనాలి. పురుషులకి ప్రాధాన్యత లేదు. స్త్రీలు తమ జీవిత ఐశ్వర్యం కొరకు కుటుంబ అభివృద్ధి కోసం ఆటుకాల్ భగవతికి పొంగాల సమర్పించుకుంటారు. పొంగాల స్త్రీలు నగరం వీధులలోను రోడ్డు మీద ఇంటి అరుగు మీదా చేసుకుంటారు. ఇంకా చె΄్పాలంటే... ఇందులో పాల్గొనేవాళ్ళు అందరు భగవతి స్వరూపంగా భావించి ఎంతో భక్తి, గౌరవం చూపుతారు. స్త్రీలు స్నానం చేయడానికి, బట్టలు మార్చడానికి అన్ని సౌకర్యాలు జాతిమతం;పేదా గొప్పా భేదం లేకుండా చూసుకుంటారు. ఇన్నిలక్షలమంది స్త్రీలు ఒకచోట చేరినా, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగడం గొప్పవిశేషం. స్త్రీలు కొత్త వస్త్రాలు ధరించి కొత్త మట్టి కుండ, కర్రలు మూడు ఇటుకలు, పాలు, బియ్యం, బెల్లం వంటివి తెచ్చుకుని తాము కూర్చునే చిన్నస్థలాన్ని శుభ్రం చేసుకుంటారు. అంతకుముందు పారిశుధ్య కార్మికులు నగర వీధులు అంతటా శుభ్రం చేస్తారు. ఇక్కడ జరిగే ఒక అద్భుతం ముహూర్త సమయానికి చిరుజల్లులు పడి ఆ ప్రదేశం అంతా పవిత్రంగా మారడం. ఇది ప్రతి యేటా కనిపించే సత్యం. దేవి చైతన్యానికి నిదర్శనం. అందరూ ముందుగా ఇటుకలు పేర్చి కొత్త మట్టికుండలో పాలు, బెల్లం, బియ్యం పోసి సిద్ధంగా ఉంచాలి. ఆటుకాల్ భగవతి ముందు పూజారి పొయ్యి వెలిగించి పొంగాల వండటం ప్రారంభిస్తారు. ఆ పొయ్యి నుండి దీపాన్ని వెలిగించి పూజారులు నాలుగువైపులా తిరుగుతూ తీర్థంతో సంప్రోక్షణ చేస్తారు. స్త్రీలు తాము సిద్ధం చేసిన పొయ్యిలో తాము తెచ్చిన దీపంతోనే అగ్ని వెలిగిస్తారు. స్త్రీలు, వారి వెంట వచ్చిన వారు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవతిని ప్రార్థిస్తారు. భగవతికి సమర్పించిన పొంగాల ఎంతగా పొంగి పొయ్యిలోకి పొర్లుతుందో అంతగా తమ జీవితాలలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.ప్రతి సంవత్సరం మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి హైదరాబాద్ నగరాల నుంచి రైలు తిరువనంతపురం నగరానికి వెళ్తోంది. ఇంకా కేరళలోని ఎర్నాకులం తిరువనంతపురం చేరడానికి విమాన మార్గం ఉంది.(ఈ యేడు ఫిబ్రవరి 23న మొదలైన ఆటుకాల్ పొంగాల్ ఉత్సవాలు మార్చి 4 వరకు జరిగాయి).– ఇ.ఎస్. మాధవన్, విశాఖపట్నం చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..!
'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!
హోలీ వేడుకును అందరు పలు విధాలుగా జరుపుకుంటారు. సహజసిద్ధమైన రంగులతో కొందరు..ప్రకృతిని ఆస్వాదించేలా కొందరు సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ వాటన్నింటికంటే మన పుడమి తల్లి జరుపుకునే హోలీ వేడుకకు మించిన రంగుల పండుగ మరొకటి ఉండదు. సరిగ్గా చూస్తే దానిలో దాచుకున్న అద్భుతం హే రంగులే.. హే రంగులే ..అన్నట్లుగా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియోని పారిశ్రామిక దిగ్గజం షేర్ చేస్తూ అందర్నీ ప్రకృతి రమ్యత గూర్చి ఆలోచింపచేసేలా చేశారు.ఆ వీడియోలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా "హోలీ వేళ తప్పక వీక్షించాల్సిన వీడియో" అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఆకాశం నుంచి చూస్తే..రంగుల వస్త్రాన్ని కప్పుకున్న నేల తల్లిలా అందంగా కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అద్భుతమైన ఎర్రమిరప పంట వైమానిక క్లిప్. రైల్వేలైన్ ఇరువైపులా ఎండబెట్టిన మిరపకాయలు షీట్లు కనిపిస్తాయి. అది చూస్తే ఒకవైపు పచ్చదనం..మరోవైపు ఎరుపు రంగు కలగలసి అద్భుతమైన పెద్ద కాన్వాస్ని పోలి ఉంటుంది. భారతదేశంలోని వ్యవసాయ రంగం నుంచి పుట్టుకొచ్చే రంగులే వేరు. బెలూన్ రైడ్, స్థానిక సంగీతం, నృత్య ప్రదర్శనలకు మించిన సహజసిద్ధమైన రంగుల ప్రదర్శన అని, తానెప్పుడు దీన్ని చూడలేదని రాసుకొచ్చారు మహీంద్రా పోస్ట్లో. పర్యాటకులను ఆకర్షించేలా తమ ఆదాయాన్ని పెంచుకునేలా స్థానిక రైతులు చేస్తే బాగుండనని, అయితే ఆ దిశగా ఎవ్వరూ ఆలోచించడం లేదని కూడా అన్నారు. నెటిజన్లు కూడా ఈ పోస్ట్పై స్పందిస్తూ..ఇలా పోస్టలు పెట్టారు. గుంటూరు మిర్చి పొలాలు ఇప్పటికే భారతదేశ సహజ హోలీ కాన్వాస్లు. సరైన ప్రణాళికతో రైతులకు మద్దతు ఇచ్చేలా..ఆంధ్రుల గర్వాన్ని ప్రదర్శించే ప్రపంచ స్థాయి వ్యవసాయ-పర్యాటక ఉత్సవంగా మార్చొచ్చు అని పోస్టులు పెట్టారు.The perfect video to view on Holi… Because the colours of India spring up in many different ways & surprise us. Chillis laid out for drying create an amazingly beautiful tapestry when seen from above.This is Guntur district in Andhra Pradesh which alone has a share of 15%… pic.twitter.com/QKUn1rbDm0— anand mahindra (@anandmahindra) March 4, 2026 (చదవండి: తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..)
అంతర్జాతీయం
ఇరాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్కు వారానికి ఎంత నష్టమంటే..!
జెరూసలేం: జనాలను, జలవనరులను నాశనంచేసే యుద్ధం కారణంగా దేశాల ఖజానాలు వేగంగా ఖాళీ అవుతుంటాయి. ఇప్పుడు ఇరాన్పై బాంబులేస్తూ యుద్ధంలో మునిగిపోయిన ఇజ్రాయెల్ ఆర్థిక కోణంలో వారానికి దాదాపు రూ.27 వేల కోట్లు నష్టపోతోందని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనావేసింది. ఇకనైనా ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని లేదంటే ఆర్థికఊబిలో కూరుకుపోతామని ఆర్థికశాఖ హెచ్చరించింది.ఈ మేరకు హోం ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షెయీ క్లాపర్కు ఆర్థికశాఖ డైరెక్టర్ జనరల్ ఇలాన్ రోమ్ ఒక లేఖ రాశారు. భద్రతకోణంలో రక్షణాత్మక చర్యలు అవసరమేగానీ ఆర్థిక స్వావలంభన పైనా దృష్టిసారించాలని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యాసంస్థలు, వ్యాపారసముదాయాలు, పని ప్రదేశాలను మూసేయడంతో వ్యాపారం తగ్గిపోయి ఆర్థికవ్యవస్థ దెబ్బతింటోంది. ఇకనైనా కఠిన ఆంక్షలను పాక్షికంగా సడలించాలి. రెడ్ లెవల్ అలర్ట్ను ఆరెంజ్ స్థాయికి తగ్గించాలి’’ అని ఆయన లేఖలో సూచించారుకాగా, ఇరాన్పై దాడి కోసం అమెరికా అక్షరాల 779 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.6,900 కోట్లు) ఖర్చు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్క ప్రకారం ట్రంప్ ప్రకటించినట్లుగా ఇరాన్పై దాడులు నాలుగు లేదా ఐదు వారాలు అంతకంటే ఎక్కువ సమయం పడితే లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం..క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు (ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటివి) పనిచేయడానికి రోజుకు దాదాపు 6.5 మిలియన్లు (రూ.58 కోట్లు) ఖర్చయ్యాయి. అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర కీలక వ్యక్తులను టార్గెట్ చేస్తూ అమెరికా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా రెండు యుద్ధ విమానాలను మొహరించింది. దీంతో పాటు విమానాలను తిరిగి తెచ్చుకోవడం, నేవి నౌకలను మోహరించడం, సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు సైనికుల నిత్యవసరాలు, యుద్ధసామాగ్రి, యుద్ధంలో వినియోగించేందుకు ట్యాంకర్లు ఇతర వాహనాలకోసం వినియోగించే ఇంధనంతో పాటు వ్యవహారాల కోసం దాదాపు 630 మిలియన్ డాలర్లు (రూ.5,556 కోట్లు) ఖర్చైంది.
ఇరాన్ కొత్త నాయకుడికి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్ష్యుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపికలో అగ్రరాజ్యం పాత్ర ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అయతొల్లా అలీ ఖమేనీ కొడుకు మోజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంగా ఎంపిక అయ్యారనే ప్రచారంపైనా ట్రంప్ తీవ్రంగా స్పందించారు.ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా మోజ్తబాను చూడటం దాదాపుగా అసాధ్యం అని ట్రంప్ తేల్చేశారు. రాయిటర్స్ మీడియాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ భవిష్యత్తు కోసం జరిగే నాయకత్వ ఎంపికలో మేము (అమెరికా) భాగం కావాలి. అప్పుడే ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ప్రతీ ఐదు సంవత్సరాలకొకసారి మళ్లీ ఇదే చేయాల్సిన అవసరం ఉండదు. ఇరాన్కు, ఆ దేశ ప్రజలకు గొప్ప సేవ అందించే నాయకుడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మోజ్తబాను తదుపరి నాయకుడిగా పరిగణించడం అసాధ్యమనే రీతిలో ఆయన మాట్లాడినట్లు సదరు మీడియా సంస్థ కథనం ఇచ్చింది.మరోవైపు.. ఇరాన్ మాజీ రాజకుమారుడు రెజా పహ్లవికి ఆ అవకాశం ఉండొచ్చా? అని రాయిటర్స్ ప్రతినిధి వేసిన ప్రశ్నకు.. ఎంపికలో ఎంతో మంది పేర్లను పరిశీలించవచ్చు. అది ఇప్పుడే చెప్పలేం అని ట్రంప్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ కొత్త నాయకుడి ఎంపికలో అమెరికా ప్రమేయం ఉండాల్సిందేనన్న ట్రంప్ ప్రకటన చేయడం ద్వారా మధ్య ప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్లో అమెరికా ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ వ్యాఖ్యలు ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటనకు, రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న(2026)అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో అయతొల్లా ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించారు. ఆయన మరణాంతరం గార్డియన్ కౌన్సిల్కు చెందిన అయతొల్లా అలిరెజా ఆరఫీని (ఖమేనీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు కూడా) తాత్కాలిక సుప్రీం లీడర్గా నియమించారు. ఆపై మార్చి 4న ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఖమేనీ తనయుడు మోజ్తబాను అధికారికంగా ఎన్నుకుంది. అయితే ఈ ఎంపిక సజావుగా జరగలేదని, ఇందులో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒత్తిడి ఉందని పలు కథనాలు చెబుతున్నాయి.
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచమంతా యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్దం ముగిసిన వెంటనే క్యూబా సంగతి తేలుస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో, మరో యుద్ధం తప్పదని ట్రంప్ పరోక్షంగా చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరాన్పై యుద్ధం జరుగుతోంది. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబా సంగతి తేలుస్తాం. అమెరికాతో డీల్ చేసుకునేందుకు క్యూబా ఎంతో ఉత్సాహంగా ఉంది. క్యూబా అమెరికా మాట వినకపోతే ఇలాంటి పరిస్థితే ఉంటుంది అంటూ హెచ్చరించారు. చివరకు స్నేహ పూర్వకంగా క్యూబాను దక్కించుకునే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. మరి ఇరాన్ యుద్ధం అయిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. CAN ANYONE STOP THIS LUNATIC⁉️Trump says that America will go to war with Cuba after the war in Iran is "finished." pic.twitter.com/DlOuWd8dFo— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) March 6, 2026అంతకుముందు కూడా క్యూబా లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో స్నేహపూర్వక రీతిలోనే క్యూబాను తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి రావచ్చు అంటూ కామెంట్ చేశారు.
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన పరిధిలో లేని 1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ)ను అడ్డుపెట్టుకుని విదేశాలపై విధించిన అధిక టారిఫ్ల మాటున వసూలుచేసిన 130 బిలియన్ డాలర్లను తిరిగి ఆయా కంపెనీలకే చెల్లించాలని మాన్హట్టన్ నగరంలోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’లో జడ్జి రిచర్డ్ ఈటన్ తీర్పు చెప్పారు.టెన్నిస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలోని అట్మాస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ వేసిన పిటిషన్ను విచారిస్తూ జడ్జి ఈ తీర్పు వెలువర్చారు. ప్రపంచదేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమంటూ ఫిబ్రవరి 20వ తేదీన అమెరికా దేశ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. కానీ ఆయా దేశాల కంపెనీలు చెల్లించిన అధిక టారిఫ్లను తిరిగి వాళ్లకే రీఫండ్ చేయాలని తీర్పులో ఎక్కడా పేర్కొనలేదు. అయితే గురువారం ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పుతో రీఫండ్ విషయంలో స్పష్టత వచి్చనట్లయింది.
జాతీయం
పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీహోర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోర్డ్ ఎగ్జామ్స్కు వెళ్తున్న ఇద్దరు తోబుట్టువులను వారి సొంత బాబాయే దారుణంగా కొట్టి చంపాడు. అక్కా తమ్ముళ్లు శీతల్ (20), కుల్దీప్ (18) తమ అడ్మిట్ కార్డులతో పరీక్షా కేంద్రం వైపు నడుచుకుంటూ వెళుతుండగా కాపుకాసి అత్యంత పాశవికంగా వారిని కొట్టి చంపాడు. రక్తపు మడుగులో వారి మృతదేహాలు ఒక పక్క, వారి అడ్మిట్ కార్డులు ఒకపక్క పడిపోయిన ఘటన పలువురి కంట కన్నీరు తెప్పించింది. ఈ జంట హత్యలు తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:పోలీసులు అందించిన సమాచాం ప్రకారం ఇది ఆవేశపూరితంగా జరిగిన హత్యలు కావు. పాతకక్షలతో ప్లాన్ చేసిన మరి వారసులను హతమార్చిన దుర్మార్గ ఘటన ఇది.పిల్లలిద్దరూ ఉదయాన్నే పరీక్షకు వెళ్తారని తెలిసి, నిందితుడు, బాబాయి హరిసింగ్ మాలవీయ రోడ్డుపై కాపు కాశాడు. మార్గమధ్యలో కర్రతో బలంగా తలలపై బాదడంతో వారిద్దరూ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.సీహోర్ జిల్లా ధరంపురి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్కుటుంబ కలహాలే కారణమని మృతుల తండ్రి జగదీష్ మాలవీయ ఆరోపించారు. తమ ఇంటి దీపాలను ఆర్పేశాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకున్న పిల్లలు, ఇలా సొంత బాబాయి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇదీ చదవండి : కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్యమరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధీఖ్గంజ్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారైన నిందితుడు హరిసింగ్ కోసం పోలీసులు అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.అతనిని పట్టుకోవడానికి టీమ్లను ఏర్పాటు చేశామని, రహస్య ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఎఎస్పీ సునీతా రావత్ తెలిపారు.గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని స్టేషన్ ఇన్చార్జ్ రాజు సింగ్ బాఘేల్ తెలిపారు.
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మొబైల్ వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. పిల్లలపై మొబైల్స్ దుష్ప్రభావం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయడానికి బ్యాన్ చేసినట్లు సీఎం తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం ఉండగా.. ఫిన్లాండ్, యూకే కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.కాగా, సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్ఫారమ్లలో అసభ్యకరమైన కంటెంట్ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి. ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ స్ఫూర్తితో.. యూరోపియన్ యూనియన్ అంశాన్ని పరిశీలిస్తోంది. మరి కొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి.
వాడు పాస్ అవ్వడు… ఎందుకు పరీక్ష రాయడం?
చెన్నై: ‘పాస్ అవ్వడు’ అంటూ 10వ తరగతి విద్యారి్థకి పబ్లిక్ పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఆ ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసిన సంఘటన కలకలం రేపింది.ç బజనై కోవిల్ వీధికి చెందిన రాధికా అనే మహిళ తన భర్తతో విడిపోయి జీవిస్తోంది. ఆమెకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు కాగలూరు ప్రాంతంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యారి్థకి చర్మవ్యాధి ఉండటంతో అప్పుడప్పుడు సెలవులు తీసుకుని చికిత్స పొందాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను కోలుకున్నాడు. ఈ పరిస్థితిలో సెలవులు ఎక్కువగా తీసుకున్నాడనే కారణంతో అతనికి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయకూడదని, రాసినా పాస్ అవడని చెప్పి పాఠశాల అధికారులు పరీక్ష రాయడానికి అనుమతించలేదని తెలుస్తోంది. దీనిపై విద్యార్థి తల్లి రాధికా తిరువళ్లూర్ జిల్లా ప్రధాన విద్యా అధికారికి ఫిర్యాదు పత్రం ఇచ్చారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు విచారణ చేసి, ఆ విద్యార్థికి పబ్లిక్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాధికా మాట్లాడుతూ, ‘ఇప్పటికే మూడు సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో చదివిన నా కుమార్తె 10వ తరగతి పరీక్షలో ఓ సబ్జక్ట్ లో ఫెయిల్ అయ్యిందని తర్వాత మళ్లీ పరీక్ష రాసి పాస్ అయ్యిందన్నారు. అయినా ఆమెను 11వ తరగతిలో చేర్చడానికి పాఠశాల వారు ఆసక్తి చూపలేదని అందువల్ల ఆమె చదువు కొనసాగించలేదు. ఇప్పుడు నా కుమారుడి పరిస్థితి కూడా అలాగే అవ్వకూడదని నేను ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు.
కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
న్యూఢిల్లీ: అసోంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానంతో కమ్యూనికేషన్ కట్ అయినట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత వాయుసేన పూర్తి వివరాలు తెలిపింది. ఆ యుద్ధ విమానం కుప్పకూలిపోయిందని, భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లు మృతి చెందారని చెప్పింది. మృతి చెందిన పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేశ్ దురాగ్కర్గా అధికారులు గుర్తించారు. “భారత వాయుసేనకు చెందిన సిబ్బంది అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం” అని వాయుసేన ఎక్స్ లో తెలిపింది.సుఖోయ్ సు-30 ఎంకేఐ శిక్షణ మిషన్లో ఉండగా జోర్హాట్ వాయుసేన స్థావరం నుంచి ఎగిరిన కొద్ది సేపటికే కనిపించకుండా పోయింది. అది కుప్పకూలిన ప్రాంతం అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉంది.నిన్న రాత్రి 7.42 గంటలకు దానితో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సుఖోయ్ సు-30 ఎంకేఐ రెండు సీట్లు ఉండే, మల్టీరోల్, దీర్ఘ శ్రేణి యుద్ధ విమానం. రష్యా విమాన తయారీ సంస్థ సుఖోయ్ దీన్ని అభివృద్ధి చేసింది.ప్రస్తుతం భారత వాయుసేన అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్తో దీనిని తయారు చేస్తోంది. భారత వాయుసేన వద్ద 260కి పైగా సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్నాయి. IAF acknowledges the loss of Sqn Ldr Anuj and Flt Lt Purvesh Duragkar, who sustained fatal injuries in the Su-30 crash. All personnel of the IAF express sincere condolences, and stand firmly with the bereaved family in this time of grief.@DefenceMinIndia@SpokespersonMoD… pic.twitter.com/zUtfUJ2ewr— Indian Air Force (@IAF_MCC) March 6, 2026
ఎన్ఆర్ఐ
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. సింగపూర్లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది.
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది.
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
క్రైమ్
పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీహోర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోర్డ్ ఎగ్జామ్స్కు వెళ్తున్న ఇద్దరు తోబుట్టువులను వారి సొంత బాబాయే దారుణంగా కొట్టి చంపాడు. అక్కా తమ్ముళ్లు శీతల్ (20), కుల్దీప్ (18) తమ అడ్మిట్ కార్డులతో పరీక్షా కేంద్రం వైపు నడుచుకుంటూ వెళుతుండగా కాపుకాసి అత్యంత పాశవికంగా వారిని కొట్టి చంపాడు. రక్తపు మడుగులో వారి మృతదేహాలు ఒక పక్క, వారి అడ్మిట్ కార్డులు ఒకపక్క పడిపోయిన ఘటన పలువురి కంట కన్నీరు తెప్పించింది. ఈ జంట హత్యలు తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:పోలీసులు అందించిన సమాచాం ప్రకారం ఇది ఆవేశపూరితంగా జరిగిన హత్యలు కావు. పాతకక్షలతో ప్లాన్ చేసిన మరి వారసులను హతమార్చిన దుర్మార్గ ఘటన ఇది.పిల్లలిద్దరూ ఉదయాన్నే పరీక్షకు వెళ్తారని తెలిసి, నిందితుడు, బాబాయి హరిసింగ్ మాలవీయ రోడ్డుపై కాపు కాశాడు. మార్గమధ్యలో కర్రతో బలంగా తలలపై బాదడంతో వారిద్దరూ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.సీహోర్ జిల్లా ధరంపురి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్కుటుంబ కలహాలే కారణమని మృతుల తండ్రి జగదీష్ మాలవీయ ఆరోపించారు. తమ ఇంటి దీపాలను ఆర్పేశాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకున్న పిల్లలు, ఇలా సొంత బాబాయి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇదీ చదవండి : కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్యమరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధీఖ్గంజ్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారైన నిందితుడు హరిసింగ్ కోసం పోలీసులు అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.అతనిని పట్టుకోవడానికి టీమ్లను ఏర్పాటు చేశామని, రహస్య ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఎఎస్పీ సునీతా రావత్ తెలిపారు.గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని స్టేషన్ ఇన్చార్జ్ రాజు సింగ్ బాఘేల్ తెలిపారు.
వ్యసనాల కొడుకును వధించి..
ఇందల్వాయి (నిజామాబాద్ రూరల్): మత్తు వ్యసనాలకు బానిసైన కొడుకును ఒక తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. నల్లవెల్లికి చెందిన కొత్తగొల్ల లక్ష్మి, కిషన్ దంపతులకు ఇద్దరు కొడుకుల్లో భాను ప్రకాశ్ (23) చిన్నవాడు. పదో తరగతి వరకు చదివిన భాను ప్రకాశ్ పైచదువులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. అయిదారేళ్లుగా చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు బానిసై తల్లిదండ్రులను వేధిస్తూ జులాయిగా తిరుగుతున్నాడు. భాను ప్రకాశ్ తరచూ గొడవ పడటంతో.. అతని అన్న గ్రామాన్ని విడిచి హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు కొద్ది రోజులుగా వేరే వారి ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో కొడుకుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తండ్రి కిషన్ ఇంట్లో నిద్రిస్తున్న భానుప్రకాశ్ను బుధవారం అర్ధరాత్రి గొడ్డలితో నరికి చంపాడు. ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామని ఎస్ఐ సందీప్ తెలిపారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
అప్పులు చేయొద్దని తల్లి మందలించిందని..
నవాబుపేట: అప్పులు ఎక్కువగా చేస్తున్నారని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన భార్యతో కలిసి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా.. ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం జంగమయ్యపల్లిలో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జంగమయ్యపల్లికి చెందిన మురగని రవి (25), లావణ్య (23) భార్యాభర్తలు. రవి కొంతకాలంగా ఎక్కువగా అప్పులు చేస్తుండటంతో బుధవారం రాత్రి అతడి తల్లి పద్మమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రవి భార్య లావణ్యతో పాటు 11 నెలల కూతురిని తీసుకుని పొలానికి వెళ్లాడు. రాత్రి పొలంలోనే వారు నిద్రించారు. గురువారం ఉదయం రవి తన సోదరుడు ఆనంద్కు వీడియో కాల్ చేసి.. చెట్టుపై తాను, తన భార్య కూర్చున్నామని, తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆనంద్ గ్రామస్తులతో కలిసి పొలానికి వెళ్లి చూడగా.. దంపతులిద్దరూ చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వారిని కిందికి దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే లావణ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రవి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై లావణ్య తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
స్కానింగ్ సెంటర్లోనే ప్రసవం!.. గంగరాజుపై పోక్సో కేసు
నాగర్కర్నూల్ క్రైం: మైనర్ను శారీరకంగా వాడుకుని ప్రసవానికి కారణమైన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 2న జిల్లాకేంద్రంలోని ఓ స్కానింగ్ సెంటర్లోని బాత్రూంలో మైనర్ బాలిక ప్రసవమైన సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ మైనర్ సమీప బందువు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకోవడంతో గర్భం దాల్చింది. సదరు వేసవి సెలవుల అనంతరం కేజీబీవీ హాస్టల్కు వెళ్లి అక్కడే ఉంటుంది. గర్భిణీ అనే విషయం దాచిపెట్టి కళాశాల అధ్యాపకులు, సిబ్బందికి కాలు ఫ్యాక్చర్ అయిందని, హాస్టల్ భోజనంతోనే లావు అవుతున్నానని సమాధాం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన బాలికకు కడుపు నొప్పి రావడంతో స్కానింగ్ కోసం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్కు రావడంతో అక్కడే ప్రసవం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కానింగ్ సెంటర్కు వెళ్లి తల్లి, మగ శిశువును జనరల్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. తొలుత ఓ మైనర్ బాలుడిని తీసుకొచ్చి విచారణ జరపగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు. దీంతో బాలికను మరోసారి పోలీసులు గట్టిగా నిలదీసి.. వివరాలు సేకరించారు. తన ఇంటి సమీపంలో ఉన్న బంధువు గంగరాజు కారణమని బాలిక చెప్పడంతో... అతని గంగరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికను శారీరకంగా లోబర్చుకోవడం వల్లే తల్లి అయిందని విచారణలో తేలడంతో నిందితుడి గంగరాజుపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా.. నిందితుడికి ఇది వరకే పెళ్లి అయి.. ఇద్దరు పిల్లలున్నారు.
వీడియోలు
ఏ దేశంలో ఎన్ని అణుబాంబులున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా
పావలా శ్యామలకు బన్నీ భరోసా..!
UPSC సివిల్స్ ఫలితాలు విడుదల టాపర్స్ వీళ్లే
ఈనెల 11 నుంచే ప్రభుత్వ సంస్థ.. ఏకంగా రూ.6000 కోట్లు.. రెడీగా ఉండండి..
బ్లూ స్పేరోతో ఖమేనీపై దాడి ఇజ్రాయెల్ కీలక ప్రకటన..
భీకర యుద్ధం.. ఇరాన్ గుండెల్లో బాంబుల వర్షం
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి
ఏపీ మండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత
పెద్ది మళ్ళీ పోస్టుపోన్..! APR 30 కాదు.. ఎప్పుడంటే..?
విడాకుల వ్యవహారం.. భార్య సంగీతకి రూ.250 కోట్లు ఆఫర్ చేసిన విజయ్!


