నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్
సాక్షి, విజయవాడ: నందూస్ స్కామ్ బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. వీసా రెన్యువల్తో పాటు ఉద్యోగాల పేరుతోనూ రమానందన దంపతులు భారీ మోసాలకు పాల్పడ్డారు. యూకేలోని 'నందూస్ కిచెన్' స్పాన్సర్షిప్ స్కామ్ వల్ల తమిళనాడుకు చెందిన అన్బరాసన్ శేఖర్ ఉద్యోగం కోల్పోయారు. మూడేళ్లకు డబ్బులు చెల్లిస్తే ఏడాదిలోనే ఉద్యోగం నుంచి అన్బరాసన్ శేఖర్ను రమానందన తీసేసింది.‘‘రమానందన దంపతులు చాలా స్కామ్లు చేశారు. నందూస్ కిచెన్లో నేను ఫ్లోర్ మేనేజర్గా చేశా.. వారి తప్పుల వల్ల నేను ఉద్యోగాన్ని కోల్పోయాను’’ అని అన్బరాసన్ శేఖర్ చెబుతున్నారు. ‘‘జీతం సరిగా ఇవ్వకపోవడం వల్ల నా ఉద్యోగం పోయింది. నేను పనిచేసిన సమయంలో నందూస్ కిచెన్కు చాలా మంది బాధితులు డబ్బుల కోసం వచ్చేవారు. ఎవరికంటా పడకుండా రమానందన తన భర్త మధుకర్ను 2-3 గంటలు టాయిలెట్లో దాచేసేది..ఒక్కోసారి రోజంతా బాత్ రూమ్లోనే మధుకర్ దాక్కునేవారు. సరైన పత్రాలు, ఉద్యోగాలు లేక ఇప్పటికీ చాలా మంది యూకేలోనే చిక్కుకుపోయారు. వారంతా ఇండియా రాలేక ఇబ్బంది పడుతున్నారు. వారి స్కామ్ల వల్ల నాలాంటి వారు చాలా మంది తమ జీవితాలను, కలలను, తమ పిల్లల భవిష్యత్తును కోల్పోయారు. నాకు రావాల్సిన పెండింగ్ జీతం, పి 45 ఎక్స్పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్ ఇవ్వాలని కోరుతున్నాను. కానీ రమానందన నాకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదురమానందన దంపతులు తప్పులు చేసి తాము ఏ తప్పు చేయలేదని తప్పించుకుంటున్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కాంట్రాక్టు కోసం చేసిన సంతకాలు ఉన్నాయి. వాటిని చూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. రమానందన దంపతులు ఇతరుల డబ్బుతో జీవిస్తున్నారు. వారు తినే తిండి వేసుకునే బట్టలు అన్నీ ఇతరుల డబ్బుతో వచ్చినవే. ఇప్పటికైనా ఏపీ పోలీసులు మా బాధితుల బాధలను అర్థం చేసుకోవాలి. నా దగ్గరున్న ఆధారాలతో ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని అన్బరాసన్ శేఖర్ తెలిపారు.ఇదీ చదవండి: గుట్టు చప్పుడు కాకుండా విచారణకు..
బీజేపీకి కొత్త చిక్కులు.. యూపీ‘ఐ’ ఫైట్ తప్పదా?
జేబుల్లో, పర్సుల్లో క్యాష్ పెట్టడం జనాలకు అరుదుగా మారిపోయింది. చిల్లర నుంచి పెద్ద పెద్ద పేమెంట్ల దాకా ఫోన్తోనే జరిగిపోతోంది. అలాంటిది యూపీఐ (UPI)తో చెల్లింపుల విషయంలో కొత్త రూల్స్ జనాలను బెంబేలెత్తిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, ఆపై డిజిటల్ చెల్లింపులంటూ క్యాష్లెస్ విధానం అలవాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పుడు ఛార్జీల ద్వారా పరోక్షంగా సామాన్యుడిపై భారం వేసే ప్రయత్నమూ చేస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఇదే బీజేపీ పాలిట గుదిబండగా మారుతుందా?..2016 నవంబర్ 8.. రూ.500, రూ.1,000 నోట్ల చెల్లుబాటును రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పునకు దారితీసింది. నగదు లావాదేవీలపై ఆధారపడిన ప్రజలకు ఒక్కసారిగా ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాల అవసరం ఏర్పడింది. అదే సమయంలో ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ప్రారంభించింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయని.. ఇకపై నగదు ఆధారిత వ్యవస్థను తగ్గించి ‘క్యాష్ లెస్ ఎకానమీ’ వైపు వెళ్లాలని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడితోనే ఆగకుండా.. డిజిటల్ పేమెంట్లు చేసే వినియోగదారులు, వ్యాపారులను ప్రోత్సహించేందుకు ‘లక్కీ గ్రాహక్ యోజన’, ‘డిజి-ధన్ వ్యాపార్ యోజన’ వంటి ప్రోత్సాహక పథకాలను తీసుకొచ్చింది. అలా క్రమంగా డిజిటల్ చెల్లింపులు వ్యవస్థ.. అర్బన్ నుంచి రూరల్ ప్రాంతాలకు విస్తరించగలిగింది.ఇప్పుడు అదే UPIపై ఛార్జీల చర్చ!ఇప్పుడు UPI లావాదేవీలపై MDR చర్చకు దారితీస్తోంది. తాజా నిబంధనల ప్రకారం.. ఒకరి నుంచి ఒకరు యూపీఐ(ఫోన్పే, గూగుల్పే ఇలా.. ) చేసుకునే చెల్లింపులు పూర్తిగా ఉచితం. కానీ, రూ.2,000 దాటి ఏదైనా బయట షాపింగ్, కొనుగోలు చేస్తే మాత్రం MDR పడుతుంది. అలాగే.. చిన్న వ్యాపారులకు కూడా జీరో-MDR రక్షణ కొనసాగుతుందని కేంద్రం చెబుతోంది. దాదాపు 96 శాతం మర్చంట్ UPI లావాదేవీలు ప్రభావితం కావని ప్రభుత్వం వెల్లడించింది. కానీ, ఆర్థిక నిపుణులు మాత్రం మరోలా చెబుతున్నారు. ఇది సామాన్యుడిపై భారం పడే స్థితికి కచ్చితంగా తెస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ‘UPIపై ఛార్జీలు’ అనే అంశం రాజకీయ చర్చలోకి వచ్చింది.రాహుల్ గాంధీ ఎంట్రీ.. రాజకీయ వేడి.. ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయంగా ప్రశ్నిస్తున్నారు. 2,000కు మించిన లావాదేవీలు మొత్తం UPI లావాదేవీల్లో సంఖ్య పరంగా సుమారు 5 శాతమే అయినప్పటికీ.. వాటి విలువ మొత్తం UPI లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మర్చంట్పై MDR విధించినా.. వ్యాపారులు ఆ ఖర్చును చివరకు వస్తువులు, సేవల ధరల్లో కలిపి వినియోగదారుడిపై మోపే అవకాశం ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. భారత్లోని జీరో-MDR విధానాన్ని అమెరికా చెల్లింపుల సంస్థలు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయని, తాజా మార్పు అమెరికా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమంటూ రాహుల్ ఆరోపించారు. ఈ అంశాన్ని అమెరికా ట్రేడ్ డీల్ చర్చలతోనూ ముడిపెట్టారు. అయితే, కేంద్రం వాదన మరోలా ఉంది. UPI వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, మోసాల నిరోధం, టెక్నాలజీ, మౌలిక వసతులపై నిరంతరం పెట్టుబడులు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ఆ వ్యవస్థ దీర్ఘకాలికంగా కొనసాగేందుకు పరిమిత MDR అవసరమని వివరిస్తోంది.యూపీ ఎన్నికల్లో ఎందుకు కీలకం?యూపీఐ అంటే కేవలం యాప్లో డబ్బు పంపడం కాదు. కూరగాయల బండి, టీ దుకాణం, మెడికల్ షాప్, చిన్న హోటల్, ఆటో.. ఇలా రోజువారీ లావాదేవీల్లోకి అది వెళ్లిపోయింది. అందుకే ఛార్జీల అంశం కేవలం బ్యాంకింగో లేదంటే ఫిన్టెక్ పాలసీగా కాకుండా చిన్న వ్యాపారి, వినియోగదారుడి జేబుకు సంబంధించిన అంశంగా రాజకీయ పార్టీలు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదే పాయింట్ను కాంగ్రెస్ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ‘ఒకప్పుడు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించారు.. ఇప్పుడు పెద్ద మొత్తంలోని మర్చంట్ లావాదేవీలకు MDR ఎందుకు?’ అనే ప్రశ్నను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాలనుకుంటోంది. వచ్చే ఏడాదిలో ఏడు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని పలు సమస్యలతో పాటు యూపీఐని కూడా ఎన్నికల ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.క్యూఆర్ కోడ్ టూ రాజకీయ కోడ్.. ఇప్పటికే రైతులు, యువత, ఉద్యోగాలు, ధరలు, సంక్షేమ పథకాలు వంటి అంశాల చుట్టూ సాగుతున్న యూపీ రాజకీయంలో.. UP‘I’ ఛార్జీల అంశం కొత్త చర్చకు దారి తీస్తుందా? రోజూ ఫోన్లో కనిపించే QR కోడ్.. ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ కోడ్గా మారుతుందా? లేక ఇది కేవలం కేంద్ర విధానంపై కాంగ్రెస్ చేస్తున్న మరో విమర్శగానే మిగిలిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కొంతకాలం హడలెత్తించిన ఐబొమ్మ పైరసీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఇమంది రవి తాజాగా కోర్టును ఆశ్రయించాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని.. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. సినీ పైరసీ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు రవికి చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో దాదాపుగా రూ.3 కోట్లు అలాగే ఉండిపోయానని తన పిటిషన్లో పేర్కొన్నాడు.తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని.. వాటిని తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్పై ఇవాళ నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టనుంది. విశాఖపట్నంకు చెందిన ఇమంది రవి.. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చి, ఆపై పైరసీ వ్యవహారంతో కోట్లు సంపాదించాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. ఆయన తండ్రి పేరు అప్పారావు. విశాఖపట్నంలో సాధారణ జీవితం గడుపుతున్న ఆయన.. రవి అరెస్టు తర్వాత మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడని, ఆ తర్వాత విదేశాల్లో ఉన్న విషయం కూడా తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. తన కుమారుడు తప్పు చేశాడని తాను సమర్థించబోనని, చట్టం తన పని తాను చేసుకుంటుందని అప్పారావు అప్పట్లో స్పష్టం చేశారు.ఇక రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాల నేపథ్యంలోనే రవి భార్య నుంచి విడాకుల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్కు వచ్చేవాడని, అదే సమయంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని బంధువులు తెలిపారు. రవికి ఓ కుమార్తె ఉంది. అయితే భర్త వ్యవహారంపై స్పందించేందుకు ఆ భార్య అప్పట్లో నిరాకరించింది. అయితే ప్రస్తుతం వాళ్లు కలిసి ఉంటున్నారా? రవి కేవలం తన తల్లిదండ్రులతోనే ఉంటున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.పైరసీకి ‘ఐబొమ్మ’ అడ్డాగా..తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ సమస్య ఈనాటిది కాదు. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్దిసేపటికే వాటి పైరసీ ప్రింట్లు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతుండటం ఇప్పటికీ తలనొప్పిగానే ఉంది. ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్సైట్ల ద్వారా సినిమాలు అక్రమంగా అందుబాటులోకి వచ్చేవి. ఈ వెబ్సైట్ల వెనుక ఇమంది రవి కీలకంగా వ్యవహరించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.అక్కడే మొదలైన అసలు కథపైరసీ కేసులో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఐ బొమ్మ నిర్వాహకులు ఏకంగా పోలీసులకు సవాల్ విసిరారు. తన వెబ్సైట్పై చర్యలు తీసుకుంటే సినీ పరిశ్రమకు చెందిన పలువురి వివరాలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు మరింత సీరియస్గా తీసుకున్నారు. సుమారు ఆరు నెలలపాటు రవి కదలికలపై నిఘా పెట్టి అతని నెట్వర్క్ను ఛేదించే ప్రయత్నం చేశారు.పక్కా స్కెచ్తో అరెస్ట్విదేశాల్లో ఉంటూ ఐబొమ్మ నెట్వర్క్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 నవంబర్లో రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టారు. చివరకు నవంబర్ 15, 2025న కూకట్పల్లిలోని అపార్ట్మెంట్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. రవి అరెస్ట్ వార్త అప్పట్లో సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీకి సంబంధించిన వెబ్సైట్లను మూసివేయించే చర్యలు చేపట్టారు. 65కుపైగా పైరసీ మిర్రర్ వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. సినీ ప్రముఖులు కూడా పోలీసుల చర్యలను అభినందించారు. రూ.3 కోట్లు ఫ్రీజ్.. 21 వేల సినిమాలు?దర్యాప్తులో భాగంగా రవి బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. కొన్ని నివేదికల్లో ఈ మొత్తం రూ.3.5 కోట్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. రవి వద్ద వేలాది సినిమాల డిజిటల్ కాపీలు, హార్డ్డిస్క్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడో కరేబియన్ దీవుల నుంచి పెద్ద నెట్ వర్క్తో ఈ వ్యవహారమంతా నడిపించడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేయించింది. హైదరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ అప్పట్లో మాట్లాడుతూ.. రవి సుమారు రూ.20 కోట్లు సంపాదించినట్లు దర్యాప్తులో తేలిందని, అతడి వద్ద దాదాపు 21 వేల సినిమాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ల వ్యవహారంరవి వ్యవహారంలో కేవలం సినిమా పైరసీకే పరిమితం కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించిన అంశాలు కూడా దర్యాప్తులోకి వచ్చాయి. పోలీసుల ప్రకారం.. ఐబొమ్మ వెబ్సైట్లకు వచ్చే భారీ ట్రాఫిక్ను బెట్టింగ్ ప్లాట్ఫామ్ల వైపు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు తర్వాతి నివేదికల్లో వెల్లడైంది. బెయిల్ కోసం వరుస ప్రయత్నాలుఅరెస్ట్ తర్వాత రవి బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ తొలుత నాంపల్లి కోర్టులో ఉపశమనం లభించలేదు. వివిధ కేసుల్లో దర్యాప్తు కొనసాగడంతో అతడు జైలులోనే ఉన్నాడు. పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఐబొమ్మ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? విదేశీ లింకులు ఎలా ఉన్నాయి? పైరసీ కంటెంట్ ఎలా సేకరించేవారు? డబ్బు లావాదేవీలు ఎలా జరిగేవి? అనే అంశాలపై ప్రశ్నించించారు. అదేసమయంలో.. అతన్ని హీరోగా అభివర్ణిస్తూ ఇటు సోషల్ మీడియాలో మద్దతు పెద్ద ఎత్తున కనిపించింది.90 రోజుల తర్వాత బయటకు..దాదాపు మూడు నెలలపాటు జైలులో ఉన్న రవికి 2026 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు, ఫిబ్రవరి 18న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్లో భాగంగా పాస్పోర్టును కోర్టులో సమర్పించాలని, విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. ఇంటర్నెట్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించడంతోపాటు అవసరమైతే పోలీసుల అనుమతి తీసుకోవాలని షరతులు పెట్టింది.ఇప్పుడు మళ్లీ కోర్టు మెట్లుఇలా అరెస్ట్, రిమాండ్, కస్టడీ, బెయిల్, విడుదల వంటి దశలు దాటిన తర్వాత తాజాగా రవి మరోసారి కోర్టును ఆశ్రయించడం కేసులో కీలక పరిణామంగా మారింది. తన నుంచి పోలీసులు ఫ్రీజ్ చేసిన సుమారు రూ.3 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబ ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని అంటున్నాడు. ఈ తరుణంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: హైడ్రాకు ఇది ఊహించని షాకే!
ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!
గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్లోమరో విడత ఉద్యోగ కోత (Layoff) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఉదయం తెల్లవారేసరికి ల్యాప్టాప్లు పనిచేయడం మానివేయడంతో వేల మంది ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన పడిపోయారు.అమెరికాలోనే ఉద్యోగాల కోతలు ఉన్నట్లు భావించినా ఇప్పుడు ఇండియాలో కూడా మరో రౌండ్ లేఆఫ్స్ జరుగుతున్నట్టు టెకీల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. ఈ క్రమంలో ఒరాకిల్ (Oracle) సంస్థలో 12 సంవత్సరాలుగా సీనియర్ ప్రిన్సిపాల్ సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేసిన ఇండియన్ టెకీ సౌరభ్ (Sourabh), ఇటీవల సంస్థ చేపట్టిన ఉద్యోగ కోతలలో తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆయన తన వర్క్ సిస్టమ్లోకి లాగిన్ కాలేకపోవడంతో ఉద్యోగం పోయిందని గ్రహించారు. సౌరభ్ భార్య పూజా సాహు లింక్డ్ఇన్ (LinkedIn) వేదికగా తన భర్త సంస్థ పట్ల ఎంతో విధేయత, అంకిత భావంతో పనిచేశారో వివరిస్తూ పోస్ట్ పోట్టారు. సెలవులు, వారాంతాలు లేవు. పండగలు, పబ్బాలు లేకుండా ఎంతో కష్టపడి పనిచేశారనీ చెప్పుకొచ్చారు. హోలీ, దీపావళి వంటి పండుగలు, కుటుంబ వేడుకలు, చివరికి ఆమె ఆసుపత్రిలో శస్త్రచికిత్స సమయంలో కూడా ఆయన పనిచేశారని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఇంత చేసిని 12 ఏళ్ల అనుభవం ఉన్నా తనకి ఉద్వాసన తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే కష్టపడి పనిచేసే తన భర్తకు తగిన ఉద్యోగ అవకాశాలు చూపించాల్సిందిగా ఆమె తన ప్రొఫెషనల్ నెట్వర్క్ను కోరారు. చివరగా "సౌరభ్ నీకు మంచి రోజులు రాబోతున్నాయి అంటూ తన భర్తకు భరోసా ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఆమె భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మరో ఉద్యోగికథపన్నెండేళ్లు అదే సంస్థలో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన ఒక ఉద్యోగి మాత్రం దీన్ని ఇదోరకమై "విముక్తి"గా అభివర్ణించాడు. భారీ పనిగంటలు,. ఒత్తిడినుంచి మోక్షం లభించిందన్నాడు. రెడ్డిట్ వేదికగా తన అనుభవాన్ని పంచుకుంటూ, తాను ఒక కీలకమైన ప్రాజెక్ట్పై పనిచేశానని, రోజుకు 12-13 గంటలు కష్టపడ్డానని తెలిపాడు. అయితే, మేనేజ్మెంట్ నుండి ఎదురైన సూక్ష్మ పర్యవేక్షణ (micromanagement) , అధిక ఒత్తిడి కారణంగా ఈ ఉద్యోగం పోవడం వల్ల తనకు ఉపశమనం కలిగిందని పేర్కొన్నాడు.ఎంత కష్టపడి పనిచేసినా, ఎన్ని సంవత్సరాల విశ్వాసపాత్రత చూపించినా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగ కోతలను క్షణాల్లో అమలు చేస్తాయని, ఈ ఘటన మరోసారి నిరూపించిందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుకాగా 2026 ప్రారంభంలో జరిగిన చాలా పెద్ద కోత తర్వాత ఈ తాజా కోతలు చోటుచేసుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్య సుమారు 21,000 మంది (13 శాతం) తగ్గారు. దీంతో మే నెలాఖరు నాటికి కంపెనీలో దాదాపు 141,000 మంది ఉద్యోగులు మిగిలారు. కంపెనీ AI మౌలిక సదుపాయాలు , డేటా సెంటర్లపై కూడా ఖర్చును గణనీయంగా పెంచుతోంది.విస్తృత సంస్థాగత మార్పులలో భాగంగా సెప్టెంబర్ 14న కంపెనీ కొత్త విడత ఉద్యోగ కోతలను ప్రారంభించింది. ప్రభావిత ఉద్యోగులకు తెల్లవారుజామున ఇమెయిల్స్ అందినట్లు సమాచారం. ఈ తాజా విడతలో ప్రభావితమైన మొత్తం ఉద్యోగుల సంఖ్యను ఒరాకిల్ బహిరంగంగా వెల్లడించలేదు. ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్
కాంగ్రెస్ రెబల్.. స్టన్నింగ్ విక్టరీ!
అతడు బంగారం.. ఇతడేమో అంచనాలు పెంచేశాడు!
సభ జరగకూడదనే అలా వ్యవహరించారు: రేవంత్
సంతోషం కోసం వెతకొద్దు.. ఈ సూత్రాలు పాటించండి!
వివాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మేనకోడలు.. ఏం జరిగిందంటే?
గణేశ్ చతుర్థి వేడుకల్లో ముగ్ధ మనోహరంగా సారా టెండూల్కర్ ..అంత ఖరీదా ఆ చీర!
ఒక్క నిర్ణయం.. త్రివిక్రమ్ జీవితాన్నే మార్చేసింది
రూ.4 కోట్ల పొదుపుతో వృద్ధురాలి బ్యూటీ ట్రీట్మెంట్..
నెల రోజుల్లో దిగొచ్చిన నిరుద్యోగం!
‘క్వీన్ ఫిషర్’ యూట్యూబర్ జీవితం విషాదాంతం
నీవే శరణ్యం గణేశా!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
‘జైహింద్’ అనలేదని ఐపీఎస్ అధికారిణి బదిలీ!
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
మమ్మీ! తమ్ముడు నా ప్రోగ్రెస్ రిపోర్టును తన ప్రోగ్రెస్ రిపోర్టు అని ఏపీ సీఎంలా చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు!!
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
గణనాథుని సేవలో నమ్రతా.. వినాయకుడి పూజలో అనసూయ
నిన్న బంగారంతో చైనా.. ఇవాళ సౌదీ అరేబియాకు జాక్పాట్!
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
బాబర్ ఆజం సంచలన నిర్ణయం!
Daily Horoscope : ప్రముఖుల నుంచి కీలక సందేశం
Daily Horoscope : ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్
కాంగ్రెస్ రెబల్.. స్టన్నింగ్ విక్టరీ!
అతడు బంగారం.. ఇతడేమో అంచనాలు పెంచేశాడు!
సభ జరగకూడదనే అలా వ్యవహరించారు: రేవంత్
సంతోషం కోసం వెతకొద్దు.. ఈ సూత్రాలు పాటించండి!
వివాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మేనకోడలు.. ఏం జరిగిందంటే?
గణేశ్ చతుర్థి వేడుకల్లో ముగ్ధ మనోహరంగా సారా టెండూల్కర్ ..అంత ఖరీదా ఆ చీర!
ఒక్క నిర్ణయం.. త్రివిక్రమ్ జీవితాన్నే మార్చేసింది
రూ.4 కోట్ల పొదుపుతో వృద్ధురాలి బ్యూటీ ట్రీట్మెంట్..
నెల రోజుల్లో దిగొచ్చిన నిరుద్యోగం!
‘క్వీన్ ఫిషర్’ యూట్యూబర్ జీవితం విషాదాంతం
నీవే శరణ్యం గణేశా!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
‘జైహింద్’ అనలేదని ఐపీఎస్ అధికారిణి బదిలీ!
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
మమ్మీ! తమ్ముడు నా ప్రోగ్రెస్ రిపోర్టును తన ప్రోగ్రెస్ రిపోర్టు అని ఏపీ సీఎంలా చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు!!
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
గణనాథుని సేవలో నమ్రతా.. వినాయకుడి పూజలో అనసూయ
నిన్న బంగారంతో చైనా.. ఇవాళ సౌదీ అరేబియాకు జాక్పాట్!
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
బాబర్ ఆజం సంచలన నిర్ణయం!
Daily Horoscope : ప్రముఖుల నుంచి కీలక సందేశం
Daily Horoscope : ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్
ఫొటోలు
పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)
మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తజనం (ఫోటోలు)
రాజమౌళితో వారణాసి.. 15 ఏళ్లు పట్టిందన్న మహేశ్ బాబు(ఫోటోలు)
సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)
హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)
'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)
ఆషికా.. బార్బీ డాల్కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)
అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
ఫ్యాన్స్ ఫైట్ చేస్తుంటే.. స్టార్స్ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)
సినిమా
ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. అలా ఈ వారం కూడా దాదాపు 24 వరకు మూవీస్, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇరుముడి, హుషార్ పిట్టలు, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3, రామ్ అండ్ లీలా తదితర చిత్రాలు ఉన్నాయి. వీటితోపాటు ఇప్పుడు రీసెంట్గా హిట్ అయిన తమిళ కామెడీ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)సిరాయ్, యూత్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనిష్మా హీరోయిన్గా చేసిన లేటెస్ట్ తమిళ సినిమా 'మొదరాత్రి'. తెలుగులో ఈ టైటిల్కి ఫస్ట్ నైట్ అని అర్థం. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించింది. గత నెల 21న థియేటర్లలోకి వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఈ శుక్రవారం (సెప్టెంబరు 18) నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.'మొదరాత్రి' విషయానికొస్తే.. పెళ్లయిన రోజు రాత్రే తాను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని ముత్తు సెల్వి(అనిష్మా), భర్త మారుదు(రిషికాంత్)కు చెబుతుంది. కానీ మారుదు కోప్పడడు. ప్రేమించిన వ్యక్తితో తన భార్యని కలపాలని అనుకుంటాడు. ఈ మేరకు ఆమెకు సాయం కూడా చేయాలనుకుంటాడు. అలా ఆరోజు రాత్రి వీళ్లిద్దరూ ముత్తుసెల్వి ప్రియుడితో కలిసి బయటకు వెళ్తారు. తర్వాత ఏమైంది? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)
పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక
తమిళ స్టార్ జంట సూర్య-జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2006లో ప్రేమ వివాహం చేసుకున్న వీళ్లు.. ఇప్పుడు తమ బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రిస్టియన్ పద్ధతిలో పిల్లల సమక్షంలో ఉంగరాలు మార్చుకుని కొత్త జంటలా వివాహం చేసుకున్నారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని జ్యోతిక తన ఇన్ స్టాలో షేర్ చేసింది. 'ది సీక్వెల్- 20 ఏళ్ల ప్రేమకు మరో ప్రతిజ్ఞ' పేరుతో వీడియో షేర్ చేసిన జ్యోతిక తన మనసులోని మాటలకు అద్భుతమైన అక్షరరూపం ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'20 ఏళ్ల వైవాహిక బంధం.. ఎన్నో మధుర జ్ఞాపకాలు. చిన్న చిన్న మనస్పర్థలు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, త్యాగాలు, మరీ ముఖ్యంగా ఎలాంటి అంచనాల్లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఇది పరిపూర్ణమైన పెళ్లిని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఒకరి కోసం మరొకరు మారుతూ, ఎదుగుతూ వచ్చిన మనం అనే బంధానికి ఇది ఓ వేడుక. ఒకప్పుడు కలలా అనిపించిన జీవితం.. ఇప్పుడు నా జీవితాంతం కలగనేంత అందమైన నిజంలా మారింది''ఇకపై నేను ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. జీవితంలో ఇబ్బందులు ఎదురైతే అందులోని పాజిటివిటీనే చూడాలని నిర్ణయించుకున్నాను. జీవితాన్ని ప్రతిరోజూ వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇకపై ఎలాంటి ఫిర్యాదు చేయను. కృతజ్ఞతతో ఉంటాను. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను. మంచి తల్లిగా ఉండేందుకు ప్రయత్నిస్తాను' అని జ్యోతిక చెప్పుకొచ్చింది.తన భర్త సూర్య గురించి మాట్లాడుతూ.. 'నేను ఎప్పటికీ నీతో గొడవపడతాను. మళ్లీ నేనే వచ్చి మాట్లాడతాను. ప్రతి చిన్న గొడవ తర్వాత మన బంధం మరింత దగ్గరవుతుందని నమ్ముతాను. ఈ 20 ఏళ్ల ప్రయాణంలో అన్నింటికంటే విలువైనది మన స్నేహమే. ఓ వ్యక్తి నాతో సమానంగా, మనసులోని మాటలు చెప్పుకోగలిగే నమ్మకస్తుడిగా, గాసిప్ పార్ట్నర్గా, బెస్ట్ ఫ్రెండ్గా ఉండటం అరుదు. అలాంటి వ్యక్తే నా భర్తగా, నా పిల్లలకు తండ్రిగా నా జీవితంలో ఉండటం నేను చేసుకున్న అదృష్టం. ఇది 20 ఏళ్ల ప్రయాణానికి ముగింపు కాదు. మరో 20 ఏళ్లకు ఆరంభం' అని జ్యోతిక భావోద్వేగానికి గురైంది.(ఇదీ చదవండి: పదేళ్ల ప్రేమ.. ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్) View this post on Instagram A post shared by Jyotika (@jyotika)
'ది ప్యారడైజ్' టికెట్ రేట్లు పెంచుతారా?.. ఎందుకీ రిస్క్?
ఇటీవల సాధారణ టికెట్ రేట్లతోనే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’ రెగ్యులర్ ధరలతోనే డబుల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. మరోవైపు టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇలాంటి సమయంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ రేట్ల పెంపుతో వస్తుందనే ప్రచారం మొదలైంది. ఈ చిత్రం ప్రీమియర్స్కు ఫ్లాట్గా రూ.400 ధర నిర్ణయించినట్లు, తొలి రోజు నుంచి పది రోజుల వరకు ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక జీవోలు రావాల్సి ఉంది.అయితే అసలు ప్రశ్న టికెట్ రేట్లు ఎంత పెంచుతున్నారనేది కాదు.. ఎందుకు పెంచుతున్నారనేదే. కంటెంట్పై నమ్మకం ఉంటే సాధారణ ధరలతోనే సినిమా విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని ‘ఇరుముడి’ వంటి సినిమాలు నిరూపించాయి.‘ది ప్యారడైజ్’ మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమాను ట్రైలర్ లేకుండా రిలీజ్ చేస్తూ ఓ రిస్క్ తీసుకుంటున్నారు. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుతో మరో రిస్క్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సినిమాకు ప్లస్ అవుతుందా.. లేక ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుందా అనేది రిలీజ్ తర్వాతే తేలనుంది.తాజాగా నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 24 తేదీనే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సెప్టెంబరు 24న రిలీజ్ డేట్తో కూడిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
పెళ్లి పీటలెక్కిన ప్రముఖ హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు
ప్రముఖ మలయాళ బ్యూటీ అహానా కృష్ణ పెళ్లి పీటలెక్కింది. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవిని ఆమె పెళ్లాడింది. వీరిద్దరి వివాహా వేడుక కేరళ కోవలంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి ఫోటోలను అహానా తన ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో హీరో దుల్కర్ సల్మాన్, సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ సందడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. రాజీవ్ రవి దర్శకత్వం వహించిన 'నాన్ స్టీవ్ లోప్స్' చిత్రంతో అహానా కృష్ణ హీరోయిన్గా పరిచయమయ్యారు. అంతేకాకుండా అహానా బీజేపీ నాయకుడు, నటుడు జి. కృష్ణకుమార్ కుమార్తె కావడం విశేషం. ఆమె నటించిన తొలి చిత్రానికి నిమిషా రవి సహాయ కెమెరామెన్గా పనిచేశారు. అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అహానా నటించిన'లూకా'మూవీకి సైతం నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో ఒకరిగా నిమిష్ రవి గుర్తింపు తెచ్చుకున్నారు. Ace cameraman #NimishRavi and actor & creator #AahaanaKrishna got married on Sep 13 in Kovalam, Kerala. Wishing the couple all the best🔥❤️ pic.twitter.com/lckqMZm2XF— Sreedhar Pillai (@sri50) September 15, 2026
క్రీడలు
రిటైర్మెంట్పై మెస్సీ యూటర్న్!
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఇటీవలే అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. గత నెల (ఆగష్టు) 31న తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే, మెస్సీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టు తరఫున మరోసారి ఆడేందుకు ఈ దిగ్గజ ఫుట్బాలర్ సిద్ధమైనట్లు అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (AFA) వెల్లడించింది.దిగ్గజానికి వీడ్కోలు మ్యాచ్బెనిన్తో అక్టోబరు 6న జరిగే మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో AFA మెస్సీకి చోటిచ్చింది. ఈ మేరకు.. ‘‘మా జాతీయ జట్టు కోచ్ లియోనల్ స్కలోనీతో చర్చించిన తర్వాత ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు, మా జట్టు ఐకాన్.. మా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. సెండాఫ్ మ్యాచ్కు అతడు అన్ని విధాలా అర్హుడు. అందుకే అక్టోబరు 6న అతడికి సెండాఫ్ ఇస్తున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నాము’’ అని AFA తన ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో మెస్సీ ఫేర్వెల్ మ్యాచ్ చూడవచ్చని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే సమయంలో ఫ్రెండ్లీ మ్యాచ్లో కాకుండా.. బ్రెజిల్ లేదంటే జర్మనీ వంటి మేటి జట్లతో మెస్సీ ఫేర్వెల్ మ్యాచ్ ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని పెదవి విరుస్తున్నారు.ఇది మూడోసారికాగా 2007లో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మెస్సీ.. 2016లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 2016 కోపా అమెరికా కప్ చిలీతో ఫైనల్లో పెనాల్టీ కిక్ను స్కోర్ చేయలేకపోవడంతో.. ఎదురైన ఓటమితో తీవ్రంగా కుంగిపోయిన మెస్సీ.. ఆవేశంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.ఆ తర్వాత మనసు మార్చుకుని రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు. ఈ క్రమంలో అర్జెంటీనాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన మెస్సీ.. 2022లో ఫిఫా ప్రపంచకప్ అందించాడు. ఇక 2026 వరల్డ్కప్లో రన్నరప్గా అర్జెంటీనా సరిపెట్టుకోగా.. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం మరోసారి యూటర్న్ తీసుకుని.. చివరగా జాతీయ జట్టు తరఫున బరిలో దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.చదవండి: ‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. స్పందించిన సంజూ
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. అఫ్గానిస్తాన్తో రెండో టీ20 సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు అర్ధ శతకంతో అలరించాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు.తొలి మ్యాచ్లో విఫలం కావడంతోకాగా జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న సంజూ శాంసన్.. అఫ్గాన్తో ఢిల్లీలో జరుగుతున్న టీ20 సిరీస్తో టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో కేవలం పది పరుగులే చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో సంజూపై విమర్శల వర్షం కురిసింది.బ్యాట్తోనే సమాధానం సంజూకు బదులు.. జింబాబ్వేలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా పంపాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, విమర్శలకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు సంజూ. రెండో టీ20లో భారత ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచి తన బ్యాటింగ్ పదును తగ్గలేదని నిరూపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు.వైభవ్, అభిషేక్తో పోటీపై స్పందనఈ నేపథ్యంలో అఫ్గాన్పై విజయానంతరం సంజూ శాంసన్ మీడియాతో మాట్లాడగా.. సహచర ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలతో పోటీ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘బయటి ప్రపంచం దృష్టిలోనే వాళ్లిద్దరు (అభిషేక్, వైభవ్) నాకు పోటీదారులు. అయితే, జట్టుగా మేమంతా ఒకటే.దేశం కోసం ఆడుతున్నాము. అన్నింటికంటే జట్టు విజయమే మా మొదటి ప్రాధాన్యం. ఆ తర్వాతే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తాము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరి పట్ల ఒకరికి ప్రతికూల ఆలోచనలు ఉండవు. కోపం తెచ్చుకునే మైండ్సెట్ కూడా ఉండదు.నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?‘నాకు కాకుండా.. అతడికే ఎందుకు అవకాశం ఇచ్చారు?.. నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?’ అనే ప్రశ్నలకు తావు లేదు. అలాంటి మనస్తత్వం ఉంటే ఇక్కడ పనికిరాదు’’ అని సంజూ శాంసన్ విలేకరులతో పేర్కొన్నాడు. ఏదేమైనా గతంలో విమర్శల గురించి ఆలోచిస్తూ బాధపడేవాడినన్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ప్రస్తుతం తానెంతో పరిణతి సాధించానని తెలిపాడు.కచ్చితగా ప్రభావం ఉంటుంది.. కానీ‘‘ప్రస్తుతం నాకు తగినంత అనుభవం, పరిణతి వచ్చాయి. కెరీర్ ఆరంభంలో ట్రోల్స్ చూసి బాధపడేవాడిని. నేనేమీ యంత్రాన్ని కాదు. ఆటగాళ్లు రోబోలు కాదు. కాబట్టి.. ‘అలాంటి మాటలు నాపై ప్రభావం చూపలేవు’ అని సులువుగా చెప్పలేము. ఎందుకంటే కొంతమంది మాటలు తప్పకుండా ప్రభావం చూపుతాయి.అయితే, గతంలో మాదిరి నేను ఇప్పుడు ఆ మాటల్ని పట్టించుకోవడం మానేశాను. ఒక షాట్ ఆడేముందు గతంలో చాలా ఆలోచించేవాడిని. సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు వస్తాయో ఊహించుకునేవాడిని. కానీ ఇప్పుడు కేవలం ఆట మీదే పూర్తిగా దృష్టి పెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదనే పరిణతి సాధించాను’’ అని సంజూ శాంసన్ ట్రోల్స్కు కౌంటర్ ఇచ్చాడు.చదవండి: ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డుSanju Samson putting Mohammed Nabi through the boundary tour. 😮💨 Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/hNKWkuiSbL— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026
వైభవ్ ఆడడంపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సంజూ శాంసన్ (57) అర్థసెంచరీతో రాణించగా, అభిషేక్ శర్మ (39), ఇషాన్ కిషన్ (34 నాటౌట్) రాణించారు. చివర్లో తిలక్ వర్మ (15 నాటౌట్) జట్టును గెలిపించాడు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. తనపై వచ్చిన విమర్శలకు సంజూ శాంసన్ నోటితోనే సమాధానం చెప్పాడని పేర్కొన్నాడు. బౌలర్ల సమిష్టి ప్రదర్శన ఈ విజయాన్ని అందించిందని తెలిపాడు.తొలి మ్యాచ్ ఆటతీరును దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్లో భారీ విజయాన్ని ఆశించామని.. దానికి తగ్గట్టుగానే భారత ప్లేయర్లు అద్భుతంగా రాణించారని తెలిపాడు. మైదానంలో ప్లేయర్లు చూపిన పట్టుదల, ప్లాన్ అమలు తీరు తమకు అనుకూలంగా ఫలితాన్ని ఇచ్చిందన్నాడు. మొదట్లో కొన్ని విషయాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ, క్రీడా ప్రయాణం అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదని పేర్కొన్నాడు. ఏ పరిస్థితిలోనైనా కూల్ గా ఉండటం చాలా ముఖ్యమని, గతాన్ని ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నానని చెప్పాడు. ఒత్తిడిని ఎంతగా ఆస్వాదిస్తే పరిస్థితులు అంతగా అనుకూలంగా మారుతాయని తాను గతంలో కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇక సిరీస్ ఇప్పటికే 2-0తో కైవసం కావడంతో చివరి, మూడో టీ20 మ్యాచ్లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. దీంతో తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీ మూడో టీ20లో ఆడే అవకాశముంది. అందరినీ ఇక్కడి పిచ్ వాతావరణానికి అలవాటు చేయడం, మైదానంలో తగినంత ప్రాక్టీస్ కల్పించడం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. అందువల్ల ఇప్పటివరకు బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు మూడో మ్యాచ్ లో అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నామని.. జట్టు కాంబినేషన్లో కూడా కొన్ని చిన్నపాటి మార్పులు చేసే అవకాశం ఉందని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.ఇదీ చదవండి: శతకంతో చెలరేగిన బ్రూక్.. లంకపై ఇంగ్లండ్ విజయం
శతకంతో చెలరేగిన బ్రూక్.. లంకపై ఇంగ్లండ్ విజయం
సౌతాంప్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర సెంచరీకి తోడు బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హ్యారీబ్రూక్ (49 బంతుల్లో 114 నాటౌట్, 10 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, ఓపెనర్ జాస్ బట్లర్ (44 బంతుల్లో 80; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకంతో రాణించాడు. లంక బౌలర్లలో చమీరా, దునిత్ వెల్లలగె, ఇషాన్ మలింగ, వనిందు హసరంగ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. దునిత్ వెల్లలగె (33) టాప్ స్కోరర్గా నిలవగా, దాసున్ షనక (24) ప్రభావం చూపించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సొన్ని బేకర్ 3 వికెట్లు తీయగా, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 42 బంతుల్లో సెంచరీ సాధించిన బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 రేపు మాంచెస్టర్ వేదికగా జరగనుంది.ఇదీ చదవండి: షేక్ హసీనా సన్నిహితులకు మరణశిక్ష!ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
న్యూస్ పాడ్కాస్ట్
డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసనకు YSRCP పిలుపు..
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
బిజినెస్
న్యూ–ఏజ్ ఎకానమీ @ రూ.25 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ క్యాపిటల్, డిజిటల్ ఆవిష్కరణల ఆధారంగా అభివృద్ధి చెందుతున్న భారత ‘న్యూ–ఏజ్ ఎకానమీ’ (కొత్త తరం ఆర్థిక వ్యవస్థ) వేగంగా విస్తరిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2030–31 (ఎఫ్వై31) నాటికి ఈ రంగం ఆదాయం మూడు రెట్లు పెరిగి 300 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.25 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. ఇది ప్రస్తుత భారత ఐటీ పరిశ్రమ స్థాయికి చేరువ కానుంది. దేశీయ న్యూ–ఏజ్ కంపెనీల ఉమ్మడి ఆదాయం ఎఫ్వై22లో 33 బిలియన్ డాలర్ల నుంచి ఎఫ్వై26 (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు) నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అక్కడి నుంచి ఏటా 25 శాతం వృద్ధితో ఎఫ్వై31 నాటికి 300 బిలియన్ డాలర్ల మార్కును తాకనుంది. నివేదికలో మరిన్ని అంశాలు ....ఎఫ్ఎంసీజీ, రిటైల్, లీజర్ వంటి వినియోగ ఆధారిత రంగాలు ‘న్యూ–ఏజ్ ఎకానమీ’ విస్తరణకు దోహదపడనున్నాయి. ఈ రంగాలు ఏటా 25 శాతం వృద్ధితో ఎఫ్వై31 నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరతాయని రెడ్సీర్ అంచనా వేసింది. అంటే మొత్తం న్యూ–ఏజ్ ఎకానమీలో దాదాపు సగం వాటా ఈ రంగాలదే కానుంది. మరోవైపు టెక్నాలజీ, మీడియా, టెలికాం (టీఎంటీ), ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అధునాతన తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాలు ఏటా 26 శాతం వృద్ధి చెందనున్నాయి. కంపెనీల కార్యాచరణ పనితీరు మెరుగవడంతో ఆర్థిక సంవత్సరం 2025లో ఈ రంగాలు మళ్లీ లాభాల్లోకి ప్రవేశించి, ఉమ్మడిగా 1.4 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేశాయి. అయితే, ఇందులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగానిదే 140 శాతం వాటా కావడం విశేషం. బీఎఫ్ఎస్ఐని మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాలు కలిపినా ఇంకా నష్టాల్లోనే ఉన్నాయని రెడ్సీర్ పేర్కొంది. డైరెక్ట్–టు–కన్జూమర్ (డీ2సీ) ఛానళ్లు, క్విక్ కామర్స్ వేగంగా విస్తరించడంతో వినియోగ వస్తువుల బ్రాండ్లు రూ. 100 కోట్ల ఆదాయాన్ని సాధించే సమయం సగానికి తగ్గింది. 2016 నాటి బ్రాండ్లకు రూ. 100 కోట్ల ఆదాయం దాటడానికి 6.8 ఏళ్లు పడితే, 2020లో వచి్చన బ్రాండ్లు కేవలం 3.4 ఏళ్లలోనే ఈ మార్కును చేరుకున్నాయి.ఆర్థిక సంవత్సరం 2022లో రూ.100 కోట్లకు పైగా ఆదాయ ఉన్న బ్రాండ్ల సంఖ్య 90 ఉన్నాయి. ఇవి ఎఫ్వై 2026కి 230కి, ఎఫ్వై 2031 నాటికి 500కి పెరుగుతుందని రెడ్సీర్ అంచనా వేసింది. అయితే, ఆఫ్లైన్ నెట్వర్క్, నెట్వర్క్ మౌలిక సదుపాయిల సవాళ్ల కారణంగా రూ. 500 కోట్ల ఆదాయం దాటడం మాత్రం కంపెనీలకు ప్రధాన అడ్డంకిగా ఉంది. 2016 తర్వాత రూ. 100 కోట్లు దాటిన 110 బ్రాండ్లలో కేవలం 26 మాత్రమే రూ. 500 కోట్ల మార్కును దాటగలిగాయి.
‘బీన్యూ’ 12వ వార్షికోత్సవ ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్, ఎల్రక్టానిక్స్ రిటైల్ సంస్థ ‘బీ న్యూ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్’ తన 12వ వార్షికోత్సవం సందర్భంగా ‘యానివర్సరీ సేల్’ ప్రకటించింది. ఇందులో భాగంగా మొబైల్స్, టాబ్లెట్స్, ల్యాప్టాప్స్, మొబైల్ యాక్సెసరీస్, ఆడియో ఉత్పత్తులు, హోమ్ ఆప్లయెన్సెస్పై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫైనాన్స్ ప్రయోజనాలు అందించనుంది. మొబైల్ యాక్సెసరీస్పై 80%, హోమ్ అప్లయెన్సెస్పై 60% డిస్కౌంటు ఇస్తుంది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై రూ.12,000 వరకు ప్రత్యేక తగ్గింపు అందిస్తుంది. ల్యాప్ట్యాప్లు ప్రారంభ ధరతో రూ.17,999 అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.14,000 వరకు తక్షణ డిస్కౌంటు పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఫైనాన్స్ సదుపాయం ఉంది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ వై.డీ. బాలాజీ చౌదరీ మాట్లాడుతూ... వినియోగదారులు చూపిన నమ్మకమే ‘బీన్యూ’ 12 ఏళ్ల నిరంతర ప్రయాణానికి, వృద్ధికి ప్రధాన కారణమన్నారు. సరికొత్త టెక్నాలజీని సరైన ధరకు, ఉత్తమ సేవలతో అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించి కస్టమర్లకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో పనిచేస్తామన్నారు.
ఇన్వెస్టర్ల సంపద... రూ. 9 లక్షల కోట్లు ఆవిరి!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, బాండ్లపై రాబడులతో పాటు ముడిచమురు ధరలు పెరగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ 1 శాతానికి పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 778 పాయింట్లు కోల్పోయి మూడు నెలల కనిష్టం 74,004 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 280 పాయింట్లు పతనమై 5 నెలల కనిష్టం 23,119 వద్ద నిలిచింది. ప్రాథమిక మార్కెట్లో పలు ఐపీఓల సబ్స్క్రిప్షన్ ప్రారంభంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత, పశ్చిమాసియాలోకు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు, వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం (75,436) నుంచి 1,442 పాయింట్లు క్షీణించి 73,994 వద్ద, నిఫ్టీ డే హై (23,593) నుంచి 474 పాయింట్లు పతనమై 23,117 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 9 లక్షల కోట్ల మేర హరించుకుపోయి రూ.472 లక్షల కోట్లకు దిగొచి్చంది. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. భారత్కు అత్యధికంగా దిగుమతయ్యే బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 108 డాలర్లకు చేరుకుంది. ⇒ ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో క్యాపిటల్ గూడ్స్ 4.19%, రియల్టీ 3.93%, మిడ్క్యాప్ సెలెక్ట్ 2.50%, స్మాల్క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.41 శాతం పతనమయ్యాయి. ⇒ లిస్టింగ్ లాభాలు కోల్పోయిన ప్రణవ్ కన్స్ట్రక్షన్ షేరు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.124)తో పోలిస్తే 31% ప్రీమియంతో రూ.162 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 33% ఎగసి రూ.165 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి షేరు 4.50% పెరిగి రూ.130 వద్ద స్థిరపడింది.⇒ నూతన సీఈవో నియామక ప్రక్రియ ముందడుగుతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.27 శాతం పెరిగి రూ.717 వద్ద స్థిరపడింది. ⇒ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ‘టాటా సన్స్’ తన కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (సీఐసీ) నమోదును రద్దు చేసుకోవడానికి సమర్పించిన దరఖాస్తును ఆర్బీఐ తోసిపుచి్చంది. దీంతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు (లిస్టింగ్కు) రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంతో టాటా గ్రూప్ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. టాటా కెమికల్స్ 20%, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 15.2% ర్యాలీ చేశాయి. టాటా కెమికల్స్ 20% ర్యాలీ చేశాయి. టీఎంపీవీ 5.9%, టీసీఎస్ 5.5%, టాటా ఎలాక్సీ 4.3%, టాటా పవర్ 3.4% పెరిగాయి.
ఆహార ధరల మంట!
న్యూఢిల్లీ: సామాన్యుల జేబుకు ధరలు చిల్లు పెడుతున్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు, ఇతరత్రా ఆహారోత్పత్తుల రేట్లు భారీగా ఎగబాకడంతో ద్రవ్యోల్బణం రివ్వుమంటోంది. ఆగస్టులో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి. దీంతో రాబోయే పాలసీ సమీక్షలో (అక్టోబర్ 5–7) రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్ల పెంపు దిశగా అడుగులు వేయొచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 4.82 శాతానికి చేరింది. జూలైలో ఇది 4.45 శాతంగా నమోదైంది. ఇక టోకు ద్రవ్యోల్బణం 9.78 శాతం నుంచి 9.92 శాతానికి ఎగసింది. రిటైల్ ధరలు ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం (రెండు శాతం అటూఇటుగా) పరిధిలోనే ఉన్నప్పటికీ.. పశి్చమాసియా సంక్షోభం దెబ్బకు ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ధరల మంట మొదలైంది. దీంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. రిజర్వ్ బ్యాంక్ విధాన నిర్ణయానికి సీపీఐనే పరిగణనలోకి తీసుకుంటుంది. మరోపక్క, 2024 బేస్ సంవత్సరంగా ఈ ఏడాది జనవరిలో కొత్త సిరీస్ మొదలైన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులోనే అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, గత నెలలో ఆర్బీఐ కీలక రెపో రేటును యథాతథంగా (5.25%) కొనసాగించింది. అధిక క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో అక్టోబర్, డిసెంబర్ పాలసీ సమీక్షల్లో రెపో రేటును పావు శాతం చొప్పున పెంచాల్సి ఉంటుందని తాజాగా ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో పేర్కొనడం తెలిసిందే. ఆహార ధరలు పైపైకి... ⇒ ఆగస్టులో రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం 5.95 శాతానికి పెరిగింది. జూలైలో ఇది 5.23 శాతంగా ఉంది. ⇒ ఉల్లిపాయల ధరల పెరుగుదల జూలైలో 22.54 శాతంగా నమోదు కాగా, ఆగస్టులో ఏకంగా 48.27 శాతం ఎగసింది. అలాగే, వెల్లుల్లి ధరలు 35.36 శాతం నుంచి 43.6 శాతానికి ఎగబాకాయి. అల్లం ధరలు అత్యధికంగా జూలైతో పోలిస్తే 73.82 శాతం దూసుకెళ్లాయి. ⇒ మరోపక్క, టమాటా, బంగాళదుంపలు సహా కొన్ని కూరగాయల రేట్లు దిగిరావడం విశేషం. ⇒ తెలంగాణలో అత్యధికంగా 6.27 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవగా, మిజోరంలో అత్యల్పంగా 2.35 శాతమే ఉంది. ⇒ కాగా, టోకు ధరల విషయానికొస్తే, ఆహార ద్రవ్యోల్బణం జూలైలో 6.65 శాతం నుంచి ఆగస్టులో 7.05 శాతానికి జంప్ చేసింది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 8.29 శాతం నుంచి 8.37 శాతానికి పెరిగింది. ఇంధన ద్రవ్యోల్బణం 20.05 శాతం నుంచి 22.93 శాతానికి చేరింది.త్వరలో వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం..అధిక ఇంధన ధరల సెగ ఎకానమీ మొత్తానికి తగులుతోంది. ముఖ్యంగా దేశ స్థూల ఆర్థిక ముఖ చిత్రం మారుతోంది. పటిష్ట వృద్ధికి డిమాండ్ దన్నుగా నిలుస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో ముడి సరుకుల వ్యయానికి మరింత ఆజ్యం పోస్తోంది. దీంతో వేచిచూసే ధోరణికి ఇక చెల్లు చెప్పి, కఠిన పాలసీ నిర్ణయాల దశలోకి ఆర్బీఐ అడుగుపెట్టే అవకాశం ఉంది. అంటే, త్వరలోనే వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చు’. – ధర్మకృతి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్
ఫ్యామిలీ
76 ఏళ్ల వయసులోనూ అద్భతంగా తకిల్..!శబరిమలలో..
పురుషులే ఎక్కువగా వాయించే భారీ తాళ వాయిద్యం తకిల్. అలాంటి వాయిద్యాన్ని ఒక మహిళ కళాకారిని అద్భుతంగా పలికించడమే కాదు ఓ కొత్త లయను సృష్టివచి ఆశ్చర్యపరిచింది. ఇంతవరకు అలాంటి వాయిద్యాన్ని పరికించిన మహిళామణి లేదు. అలాగే ఏకంగా శబరిమలలో అయ్యప్ప గుడిలో తకిల్ వాయించే మహిళా కళాకారిణిగా చరిత్ర సృష్టించింది ఈ వనిత. ఏడు పదుల వయసులోనూ అంతే అద్భుతంగా వాయిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోందామె. ఆ మహిళే కేరళకు చెందిన పతియూర్ కమలం. ఆమె మొదటి గురువు తండ్రి గోపాల కృష్ణ పణికర్. ఆయన స్వయంగా దేవస్వం బోర్డులో తకిల్ విద్వాంసుడు. తన కుమార్తె ఆసక్తిని గమనించి సాధన కోసం తేలికపాటి తకిల్ వాయిద్యాన్ని తయారు చేయించారు. అలా ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఈ రంగంలోకి ప్రవేశించింది. శబరిమలలో తన తండ్రితో కలిసి ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఆమె వృత్తిపరమైన ప్రస్థానం ఊపందుకుంది. పెరున్న సుబ్రహ్మణ్య ఆలయం 'తైపూయం' ఉత్సవంలో ఆమె ఇచ్చిన అద్భుత ప్రదర్శన, కేరళ, తమిళనాడులోని వివిధ ఆలయాల నుంచి పెద్ద ఎత్తున ఆహ్వానాలలు వచ్చేందుకు దారితీసింది. ఆమె భర్త 'ఇడక్క' (మరొక సాంప్రదాయ తాళ వాయిద్యం) కళాకారుడు. ఎనమిది మంది సంతానంలో మూడొవది అయిన కమలం తన సుదీర్ఘ వృత్తి జీవితంలో అనేక పురస్కారాలు అందుకున్నారు. 2019లో కేరళ సంగీత నాటక అకాడమీ ప్రతిష్టాత్మక 'గురుపూజ' అవార్డుతో ఆమెను సత్కరించింది. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆమె కుమారుడు ప్రదీప్ జి. పణికర్ కూడా తకిల్ కళాకారుడిగా రాణిస్తున్నారు. కేరళ ప్రముఖ రచయిత ఆర్యద్ సనల్ కుమార్ కళాకారిణి కమలం జీవితం, ఆమె కళా ప్రస్థానంపై డాక్యుమెంటరీని రూపొందించారు. దీన్ని ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ డిసెంబర్లో ప్రదర్శించనున్నారు.(చదవండి: జెన్ ఆల్ఫా పెంపకంపై ఆది సాయికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!)
జెన్ ఆల్ఫా పెంపకంపై ఆది సాయికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
నటుడు ఆదిసాయికుమార్..ఈ తరం జెన్ ఆల్ఫా, వాళ్ల పెంపకం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోని కుమారుడికి జన్మనివ్వడంతో తండ్రిగా మరో కొత్త అద్యాయనం మొదలైందంటూ పేరెంట్గా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె అయానా పెంపక గురించి చెబుతూ..ఈ జెనరేషన్ని పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పుకొచ్చాడు ఆది. నేటి పిల్లలకు రక్షణ, స్వేచ్ఛ, మార్గదర్శకత్వం, సమతుల్యం అవసరమని నొక్కి చెబుతున్నాడు. ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో ఎలా మెలగాలో ప్రతి పేరెంట్ తెలుసుకోవాలని చెబుతున్నారు. తాను రక్షణను కల్పిస్తూనే కూల్గా వ్యవహరించే తండ్రిని అని చెప్పారు. తన కూతురు అయానాను పెంచుతున్నప్పుడు నేర్చుకున్న పాఠాలే, పెంపకం పట్ల తన దృక్పథాన్ని నిరంతరం తీర్చిదిద్దుతున్నాయని అన్నారు. ఈ తరం పిల్లల జీవితాల్లో సాంకేతికత ఎంతగా పెనవేసుకుపోయిందో చూస్తూనే ఉన్నాం, అందువల్ల స్క్రీన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు ఆది. అందుకే తన భార్య అరుణ తాను ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటామని చెప్పాడు. డిజిటల్ ఫ్లాట్ఫార్మ్లు ప్రతిచోట ఉన్నాయని, పాఠశాల ప్రకటనలు సైతం వాట్సాప్ ద్వారానే వస్తున్నాయని అన్నారు. ఇక యూట్యూబ్లో మంచి,చెడు రెండు పక్కపక్కనే ఉంటాయని అన్నారు. తాను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడే డిజిటల్ ప్రపంచం పిల్లల దైనందిన జీవితంలో ఎంత లోతుగా భాగమైపోయిందో చూసి ఆశ్చర్యపోయానని అంటున్నారు. ఎందుకంటే యూఎస్ పర్యటనలో తన కూతురు ఆన్లైన్ వీడియోలో చూసిన ప్రదేశాలను నేరుగా చూడగానే గుర్తుపట్టేసి చెబుతుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఆమె అపారమైన జ్ఞాపకశక్తికి ఫిదా అయినా..డిజిటల్ ఫుట్ప్రింట్ గురించి ఒక పేరేంట్గా తాను అవగాహన కల్పించాల్సి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేసిందని అంటున్నారు.(చదవండి: కంజీవరం చీర, బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న సమంత..!)
బోబా టీని ఆస్వాదించే గణేశుడు..!
గణేశుడు కేవలం భారత్లోనే కాదు విదేశాల్లో సైతం వివిధ రూపాల్లో పూజలందుకుంటాడు. ఆయనకు ఎల్లలు లేవు..సర్వత్రా ఆయనే పలు రకాల పేర్లతో పిలిపించుకుంటూ పూజలందుకునే మహాగణపతి. అలాంటి లంబోదరుడుని బ్యాంకాక్లో భక్తులు ఎలా ఆరాధిస్తారో వింటే విస్తుపోతారు. మనమంతా వినాయకుడికి మోదకాలు, లడ్డూలు సమర్పిస్తే బ్యాంకాక్ వాసులు మాత్రం బొజ్జ గణపయ్యకు ఏం సమర్పిస్తారో తెలిస్తే షాకవ్వుతారు. థాయ్ కంటెంట్ క్రియేటర్ ప్రియా పింగ్ దీని గురించి షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. బ్యాంకాక్లోని యూనియన్ మాల్ వెలుపల ఉన్న గణేశ్ ఆలయంకి సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అక్కడ భక్తులు వినాయకుడికి బోబాటీని సమర్పిస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వినాయకుని ఆలయం వద్ద ఉంచిన అనేక బబుల్ మిల్క్ టీ కప్పులను చూడొచ్చు. ఆ ఆలయం వద్ద సమర్పించాలనుకుంటున్న బబుల్ టీ బ్రాండ్ల మెనూ కూడా ఉంటుంది. భక్తులు తమకు నచ్చినది ఎంచుకుని గణనాథుడికి సమర్పిస్తే చాలు. కొందరు ఒకేసారి పదికిపైగా బోబా కప్పులను సమర్పిస్తుండటం కూడా క్లియర్గా కనిపిస్తుంది. కోరిక నెరవేరితే ఎక్కువ కప్పుల బోబా టీని సమర్పిస్తుంటారట. అది ఒక్కోసారి 200 పై చిలుకు బోబా టీలు కూడా కావొచ్చట. ప్రజలు తాము ఆస్వాదించే దాన్నే దేవుడికి సమర్పించడం అనేది థాయి సంప్రదాయానికి సంబంధించిన ఒక నమ్మకమని చెబుతోంది కంటెంట్ క్రియేటర్ ప్రియ. View this post on Instagram A post shared by Piya Ping (@piya_pu)(చదవండి: శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు రాధికా మర్చంట్ నృత్యం..!)
‘శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు రాధికా మర్చంట్ నృత్యం..!
అంబానీ కుటుంబం సోమవారం గణేశ్ చతుర్థి వేడుకలను అంగరంగ వైభవంగా రుపుకుంది. నిజానికి అంబానీ ఇంట గణేశ్ నవరాత్రుల్లో అత్యంత ప్రత్యేకం. అక్కడ విఘ్న వినాయకుడు 'యాంటిలియా చా రాజా'గా పూజలందుకుంటాడు. ఇక ఈ వేడుకల్లో భాగంగా శంకర్ మహదేవన్ పాడిన ప్రసిద్ధ భక్తిగీతం ‘శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు అంబానీల చిన్న కోడలు, అనంత్ అంబానీ సతీమణి రాధికా మర్చంట్ అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఆమె సుందరమైన ప్రదర్శన, గణేశుని దివ్య రూపాలు, జ్ఞానం, విశ్వవ్యాప్త ఉనికిని కీర్తించే ఈ సంస్కృత భక్తిగీతానికి లయబద్ధంగా చేసిన రాధికా నృత్యం అక్కడున్న వారందరీ దృష్టిని అమితంగా ఆకర్షించింది. కాగా, 2005లో వచ్చిన ‘విరుద్ధ్’ చిత్రంలోనిది ఈ గీతం. దీనికి అజయ్-అతుల్ సంగీత ద్వయం సంగీతం అందించగా, శంకర్ మహదేవన్ ఆలపించారు. అందరీ మనసులను హత్తుకునే ఈ పాట అర్థం ఏంటో సవివరంగా చూద్దామా..!.‘శ్రీ గణేశాయ ధీమహి’ అంటే..‘శ్రీ గణేశాయ ధీమహి’ అనే పదబంధానికి అర్థం గణేశుడిని ధ్యానిద్దాం లేదా గణేశుడి దివ్య రూపాన్ని మననం చేసుకుందాం అని అర్థమట. ఈ పాట వినాయకుడి విభిన్న గుణాలను, రూపాలను వర్ణించే సంస్కృత ప్రార్థన. ఇందులో ఏకదంత, వక్రతుండ, గజానన అంటూ వినాయకుడిని కీర్తిస్తూ సాగే అద్భుతమైన గీతం. ఈ పాటతో ఆయన్ను జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని, ఆశీర్వాదాలను అందించమంటూ ప్రార్థిస్తారు భక్తులు. ఈ గీతం కేవలం అడ్డంకులు తొలగించే వాడికంటే గొప్పవాడిగా వర్ణిస్తూ వినాయకుడి గుణాలను చాటే భక్తిపాట. View this post on Instagram A post shared by Loveleen Ramchandani (@loveleen_makeupandhair) ఇదీ చదవండి: అత్యంత విలక్షణమైన గణేశ్ ఆలయం..! ఆ రూపంలోనే పూజలందుకుంటాడు..)
అంతర్జాతీయం
భారత్కు బిగ్ షాక్.. వంద శాతం టారిఫ్లకు అమెరికా గ్రీన్సిగ్నల్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అధికారం కల్పించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ముందడుగు పడింది. ‘లిండ్సేఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’పై ఓటింగ్లో భాగంగా 214–211 ఓట్ల తేడాతో కీలక ప్రొసీజరల్ ఆమోదం పొందింది. ఈ బిల్లులో భారత్, చైనా వంటి రష్యా చమురు కొనుగోలు చేసే దాదాపు 10 దేశాలపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, హౌస్లో ఈ దశలో జరిగిన ఓటింగ్ తుది ఆమోదం కాదు. బిల్లుపై తుది ఓటింగ్ బుధవారం జరగాల్సి ఉంది. అది ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడి సంతకం కోసం వైట్హౌస్కు వెళ్లే అవకాశం ఉంటుంది.భారత్కు ఎందుకు కీలకం?రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించింది. ఇప్పుడు ప్రతిపాదిత అమెరికా చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించే దేశాలపై అదనపు టారిఫ్లకు మార్గం ఏర్పడుతుంది. బిల్లులో 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అంటే చట్టం ఆమోదం పొందినంత మాత్రాన భారత్పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. టారిఫ్ విధించాలా? ఎంత విధించాలి? అనే నిర్ణయం అధ్యక్షుడి వద్దే ఉంటుంది.రష్యాపైనే ప్రధాన గురిఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్లకు మాత్రమే పరిమితం కాదు. రష్యా నాయకత్వం, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంతో పాటు ఆంక్షలను తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు అమెరికా భావిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది. రష్యా చమురు ఆదాయం ఉక్రెయిన్పై కొనసాగుతున్న యుద్ధానికి నిధులుగా ఉపయోగపడుతోందన్నది అమెరికా చట్టసభ సభ్యుల వాదన. అలాగే ఇరాన్పై ఇప్పటికే ఉన్న ఆంక్షలను పొడిగించే నిబంధనలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.సెనేట్లో భారీ మెజార్టీతో ఆమోదంఈ బిల్లుకు అమెరికా సెనేట్లో ఇప్పటికే భారీ మద్దతు లభించింది. ఆగస్టు 7న సెనేట్ 86–11 ఓట్లతో బిల్లును ఆమోదించింది. అనంతరం ఇది ప్రతినిధుల సభకు చేరింది. సెనేట్లో ఆమోదమైన రూపంలో రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్లకు అవకాశం కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు ఈ నిబంధన పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ సహా పలు నివేదికలు పేర్కొన్నాయి.ఇక, బిల్లుకు మద్దతు ఉన్నప్పటికీ.. అమెరికా ప్రతినిధుల సభలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అధ్యక్షుడికి టారిఫ్ల విషయంలో అత్యధిక అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రటిక్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.Breaking || US House to vote on Russia sanctions bill, which could give Trump authority to impose tariffs of up to 100% on countries buying Russian energy.➤ India may face possible 100% tariff➤ India among 10 nations named for tariffs➤ Russia oil buyers: U.S. tariff… pic.twitter.com/4gyjSS8Gi6— TIMES NOW (@TimesNow) September 16, 2026ఇక ఏం జరుగుతుంది?హౌస్లో తుది ఓటింగ్ కీలకం. బిల్లు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందితే అధ్యక్షుడి సంతకం కోసం వెళ్తుంది. ఆ తర్వాతే చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రస్తుతం భారత్పై 100 శాతం టారిఫ్ విధించినట్లు కాదు.. అయితే అలాంటి చర్య తీసుకునే చట్టపరమైన అధికారాన్ని ట్రంప్కు కల్పించే దిశగా అమెరికా కాంగ్రెస్లో ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ పరిణామం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు, భారత్ కొనసాగిస్తున్న రష్యా చమురు కొనుగోళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్!
సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్!
ప్రపంచ చమురు మార్కెట్ను ప్రభావితం చేసే సౌదీ అరేబియా ఇప్పుడు ఊహించని సంక్షోభంలో చిక్కుకుంది. ఎర్ర సముద్ర తీరంలోని కీలక ప్రాంతాలతో పాటు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలో హౌతీలు పట్టు సాధించడంతో.. సౌదీ చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు హౌతీల ముప్పు.. మరోవైపు మిత్రదేశాల నుంచి ఆశించిన స్థాయిలో ప్రత్యక్ష సైనిక సహకారం లేకపోవడంతో రియాద్కు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్న చందంగా పరిస్థితి మారింది. మరోవైపు సౌదీ మిత్రదేశంగా ఉన్న పాకిస్తాన్.. యెమెన్లో హౌతీలపై నేరుగా పోరాడేందుకు తమ బలగాలను పంపబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో రియాద్.. అధికారిక దౌత్య సంబంధాలే లేని ఇజ్రాయెల్ నుంచి కూడా పరోక్షంగా సాయం కోరినట్లు వార్తలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.టెల్ అవీవ్కు చెందిన ది జెరూసలెం పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. హౌతీల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సహాయం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇజ్రాయెల్ హయోమ్ కథనం ప్రకారం.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) ఇతర గల్ఫ్ దేశాలు, ఈజిప్ట్ నుంచి కూడా సహాయం కోరినట్లు సమాచారం. కాగా, సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు’ అన్న సామెత గుర్తుకొచ్చేలా.. రియాద్ ఇప్పుడు తనకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్నీ పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. యెమెన్లో రియాద్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ల తీవ్రతను ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.అసలు సంక్షోభం ఏంటి?ఇటీవల వరకు సౌదీ ఇంధన మౌలిక వసతులపై అప్పుడప్పుడు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిన హౌతీలు.. గత వారం అనూహ్యంగా పెద్ద ఎత్తున దాడికి దిగినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. సౌదీ మద్దతున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ను వెనక్కి నెట్టి.. ఎర్ర సముద్ర తీరంలోని విస్తారమైన ప్రాంతాలతో పాటు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలోని కొన్ని ద్వీపాలపై హౌతీలు నియంత్రణ సాధించినట్లు సమాచారం. కాగా, ఈ జలసంధి ద్వారా సౌదీ అరేబియా ఇరాన్ ఆధిపత్యంలో ఉన్న హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకోగలదు. ఇప్పుడు ఈ మార్గంపైనా ముప్పు ఏర్పడటంతో సౌదీ చమురు ఎగుమతులపై ఆందోళన పెరిగింది.ఇప్పటికే జులై నుంచి సౌదీ నౌకలపై ఆంక్షలు కొనసాగిస్తున్న హౌతీ నాయకత్వం.. ఈ నిర్బంధాన్ని కొనసాగిస్తామని ప్రకటించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఇతర దేశాల నౌకలకు మాత్రం రాకపోకలకు అనుమతిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు సౌదీకి చెందిన కీలక పైప్లైన్ వ్యవస్థలపై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. చమురు ఉత్పత్తి మాత్రమే కాకుండా దాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు తరలించే సామర్థ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పాక్ ఎందుకు వెనక్కి?సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మధ్య ఏర్పడిన మక్కా డిఫెన్స్ అలయన్స్ నేపథ్యంలో ఇస్లామాబాద్ నుంచి సైనిక సహాయం వస్తుందని రియాద్ ఆశించినట్లు కథనాలు సూచిస్తున్నాయి. అయితే యెమెన్లో హౌతీలపై పోరాటానికి తమ బలగాలను పంపే విషయంలో పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. సౌదీ భూభాగాన్ని రక్షించేందుకు మాత్రం తమ బలగాలను మోహరించవచ్చని పాక్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే విదేశీ గడ్డపై జరిగే ప్రత్యక్ష యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనబోమని ఇస్లామాబాద్ స్పష్టమైన గీత గీసినట్లు కథనాలు చెబుతున్నాయి.అమెరికా, బ్రిటన్ కూడా దూరంహౌతీలపై అమెరికా, బ్రిటన్ కూడా ప్రత్యక్ష సైనిక చర్య విషయంలో వెనుకంజ వేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. యెమెన్లో హౌతీలపై నేరుగా దాడులు చేయబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. బ్రిటన్ కూడా సైనిక సలహాదారులను అందించే దిశగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇజ్రాయెల్ సాయం ఎంతవరకు?ఇజ్రాయెల్ నుంచి సౌదీకి వచ్చే సహాయం కూడా ప్రధానంగా ఇంటెలిజెన్స్కే పరిమితం కావచ్చని ఇజ్రాయెల్ హయోమ్ కథనం పేర్కొంది. హౌతీలు ఇజ్రాయెల్ నగరాలపై రాకెట్లతో దాడులు చేసే ప్రమాదం ఉండటంతో.. యెమెన్లో ప్రత్యక్ష సైనిక చర్యకు ఇజ్రాయెల్ కూడా పరిమితులు విధించుకునే అవకాశం ఉందని సమాచారం. హౌతీలకు వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకోవాల్సి వస్తే ఇజ్రాయెల్ ఒంటరిగా కాకుండా విస్తృత అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమిలో భాగంగా చేపట్టాలని ఆ దేశ రక్షణ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ట్రంప్ తెచ్చిన యుద్ధం.. అమెరికాకు 3 లక్షల కోట్ల బిల్లు!అయితే, సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేకపోయినా, గతంలో కొన్ని సందర్భాల్లో తెరవెనుక సహకారం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి.1960లలోనే రహస్య సహకారం1960లలో యెమెన్లో అంతర్యుద్ధం జరిగినప్పుడు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ రెండూ సనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాయలిస్టు వర్గాలకు మద్దతు ఇచ్చాయి. బ్రూకింగ్స్ ప్రకారం, ఇరుదేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు రాయలిస్టులకు ఆయుధాలు, నిపుణుల సహాయం అందించడంలో సమన్వయం చేసుకున్నాయి. అంటే ఇది కొత్తగా ఏర్పడిన సహకారం కాదు.. యెమెన్ విషయంలో ఇరుదేశాలకు ఉమ్మడి శత్రువు ఉన్నప్పుడు దశాబ్దాల క్రితమే పరోక్షంగా కలిసి పనిచేసిన చరిత్ర ఉంది.2010లలో ఇరాన్ అంశం కీలకమైంది. తర్వాత ఇరాన్ ప్రభావం పెరగడంతో సౌదీ, ఇజ్రాయెల్ రెండింటికీ ఒకే భద్రతా ఆందోళన ఏర్పడింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మిలీషియాలు, యెమెన్లో హౌతీల అంశాల్లో ఇంటెలిజెన్స్, భద్రతా సహకారంపై తెరవెనుక సంప్రదింపులు జరిగినట్లు పలు విశ్లేషణలు పేర్కొంటున్నాయి. 2017లో అప్పటి ఇజ్రాయెల్ సైనిక చీఫ్ గాడి ఐసెన్కోట్ కూడా సౌదీతో ఇరాన్ను ఎదుర్కొనేందుకు అనుభవాలు, ఇంటెలిజెన్స్ పంచుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని సౌదీ మీడియాకు చెప్పారు.
471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ‘ఒంటరి మెదడు’ హెచ్చరిక?
మనుషుల ఉనికికి కృత్రిమ మేధ (ఏఐ) ముప్పుగా మారొచ్చన్న హెచ్చరికలు ఇప్పటివి కాదని.. 471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో చెప్పారని ‘వియాన్’ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. 1555లో ప్రచురించిన Les Prophéties పుస్తకంలో భవిష్యత్తులో ఓ సాంకేతికత.. ప్రపంచాన్ని ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలున్నాయని దానిలో పేర్కొంది. ఏఐపై భయాలు ఇటీవలి కాలంలో అందరినీ చుట్టుముడుతున్నాయి. ఏఐ సంస్థ ఆంత్రోపిక్లో పనిచేసిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్, ఈ సాంకేతికత 2030 నాటికే మానవాళికి తీవ్ర ముప్పు కలిగించవచ్చని హెచ్చరించారు. నోస్ట్రడామస్ 1555లో రాసిన ఒక పుస్తకంలో ‘కొత్త జ్ఞాని’, ‘ఒంటరి మెదడు’, ‘అమరత్వం’, ‘శిష్యులు’ వంటి పదాలు కనిపించాయి. వీటిని కొందరు కంప్యూటర్లు, అప్లోడ్ చేసిన మైండ్ లేదా మెషీన్ ఇంటెలిజెన్స్కు సంబంధించినవిగా అన్వయిస్తున్నారు.నోస్ట్రడామస్ అనుచరులు గతంలో 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఘటనలను కూడా ఆయన ప్రవచనాలతో అనుసంధానించారు. తాజాగా కాక్సన్ హెచ్చరికలను కూడా ఆ సందేశంతో కలిపి చూస్తున్నారు. బల్గేరియన్ మిస్టిక్ బాబా వంగా కూడా 2026లో ఏఐ కీలక రంగాలను ప్రభావితం చేసి, అనేక ఉద్యోగాలను భర్తీ చేస్తుందని చెప్పినట్లు ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. అయితే ఈ వాదనలకు స్పష్టమైన ఆధారాలు లేవని కొందరు అంటారు. సెప్టెంబర్ 9న ఎక్స్లో కాక్సన్ చేసిన పోస్టులో ఏఐ సంస్థలు స్వీయ అభివృద్ధి చేసుకునే సూపర్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా సాగుతున్నాయని, ఇది మానవ జీవితాలతో ప్రమాదకరంగా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. దశాబ్దం ముగిసేలోపు ఏఐ మానవాళికి అస్తిత్వ ముప్పుగా మారొచ్చని పలువురు పరిశోధకులు భావిస్తున్నారని తెలిపారు.సూపర్హ్యూమన్ ఏఐ వ్యవస్థలు మౌలిక వసతులను హ్యాక్ చేయడం, వాస్తవ ప్రపంచ వనరులను సంపాదించడం, ప్రమాదకర జీవ పరిశోధనలను వేగవంతం చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కాక్సన్ హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు Anthropic అలైన్మెంట్ సైన్స్ విభాగం నేత ఇవాన్ హ్యూబింగర్ మద్దతు పలికారు. ఏఐ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో, కీలకమైన రక్షణ చర్యలు లేకపోతే వచ్చే పదేళ్లలో మానవులు అంతరించిపోయే ప్రమాదం 10 శాతానికి పైగా ఉండొచ్చని హ్యూబింగర్ అంచనా వేశారు.ఇదీ చదవండి: ‘ఎంఎస్’ జీవితాన్ని మలుపుతిప్పిన సదాశివం
ట్రంప్ తెచ్చిన యుద్ధం: అమెరికాకు 3 లక్షల కోట్ల బిల్లు!! ఇకపై ప్రతీ నెలా మరో 25 వేల కోట్లు!
ఇరాన్పై యుద్ధానికి దిగినందుకు అమెరికా ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆరు నెలలు ముగిసినా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకోసం అమెరికా ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేసిందో తెలుసా?.. మన కరెన్సీలో 3,00,00,00,00,00,000. అంటే మూడు లక్షల కోట్లు. ఇదే కాకుండా సైన్యానికి భారీగా నష్టం వాటిల్లింది. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా నెలకు రూ.25 వేల కోట్లు చెల్లించుకుంటూనే పోవాలంట!.డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ యుద్ధం మొదలైంది. అయితే ఈ యుద్ధంతో ఇప్పటివరకు అమెరికా రక్షణ శాఖపై పడిన ప్రత్యక్ష వ్యయం ఏకంగా 38 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాని లెక్క రూ.3.2 లక్షల కోట్లు. యుద్ధం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రతి నెలా మరో 2–3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడం, అమెరికా భద్రతకు ముప్పును తొలగించడం లక్ష్యంగా ఈ దాడులకు ఆదేశించినట్లు ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. అయితే కొన్ని వారాల్లో ముగుస్తుందని భావించిన ఈ సైనిక చర్య సుదీర్ఘ ఘర్షణగా మారింది. సెప్టెంబర్ నాటికీ పోరాటం పూర్తిగా ఆగలేదు. తాజాగా ట్రంప్ ఈ యుద్ధాన్ని ప్రారంభించిన నిర్ణయంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పారు. నెలకు మరో రూ.25 వేల కోట్లు!యుద్ధం మరింత కొనసాగితే అమెరికా ఖజానాపై భారం ఆగేలా కనిపించడం లేదు. తక్కువ తీవ్రతతో పోరాటం కొనసాగితే నెలకు సుమారు 2 బిలియన్ డాలర్లు, దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చితే దాదాపు 3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సీబీవో తెలిపింది. అంటే భారత కరెన్సీలో చూస్తే ఒక్క నెలలోనే దాదాపు రూ.17 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో అమెరికా ఖజానాకే కాదు.. ఆ దేశ సైన్యానికీ భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రతిదాడుల్లో అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పలు విమానాలు, సైనిక పరికరాలు నష్టపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. మరోవైపు ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా భారీ సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో యుద్ధం సాగుతున్న కొద్దీ అమెరికా సైనిక సామర్థ్యాలపై, ముఖ్యంగా కీలక ఆయుధ నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది.అసలు ఖర్చు.. క్షిపణులే!ఈ యుద్ధంలో అమెరికా భారీగా క్షిపణులు, ఇంటర్సెప్టర్లను ప్రయోగించింది. ఆగస్టు 1 వరకు ఉపయోగించిన ఆయుధాలను తిరిగి సమకూర్చుకోవడానికే సుమారు 21.7 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని సీబీవో లెక్కించింది. ఇందులో ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్లకు 7.3 బిలియన్, మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లకు 13.1 బిలియన్ డాలర్లు, ఇతర ఆయుధాలకు 1.2 బిలియన్ డాలర్లు ఉన్నాయి. యుద్ధంలో కోల్పోయిన పరికరాలను భర్తీ చేయడానికి మరో 1.9 బిలియన్ డాలర్లు అవసరమని పేర్కొంది. ఆయుధ నిల్వలకు గండి..డబ్బు ఖర్చవడమే కాదు.. అమెరికా ఆయుధ నిల్వలపైనా యుద్ధం ప్రభావం పడుతోంది. ముఖ్యంగా క్షిపణి రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని సీబీవో పేర్కొంది. వాటిని పూర్తిస్థాయిలో తిరిగి సమకూర్చుకోవడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రక్షణ కార్యాలయం పెంటగాన్ మాత్రం తమ వద్ద అధ్యక్షుడి వ్యూహాత్మక అవసరాలకు సరిపడా ఆయుధాలు ఉన్నాయని చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక మాత్రం.. యుద్ధం కారణంగా కీలక ఆయుధాల్లో ‘స్ట్రాటజిక్ ఇన్వెంటరీ షార్ట్ఫాల్స్’ ఏర్పడ్డాయని పేర్కొంది. హర్ముజ్ మూసివేత.. ప్రపంచానికి మరో దెబ్బఇరాన్తో యుద్ధం ప్రభావం అమెరికా సరిహద్దులకే పరిమితం కాలేదు. హార్ముజ్ జలసంధిలో రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. యుద్ధం తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర రెండో త్రైమాసికంలో బ్యారెల్కు 103 డాలర్ల వరకు చేరింది. ఇంధన ధరల పెరుగుదల ఇతర వస్తువులు, రవాణా ఖర్చులపై ప్రభావం చూపడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని సీబీవో తెలిపింది. 2027 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గతంలో వేసిన అంచనాల కంటే 0.5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇంకా అసలు బిల్లు రాలేదు!సీబీవో చెప్పిన 38 బిలియన్ డాలర్లలో యుద్ధానికి సంబంధించిన ప్రతి ఖర్చూ లేదు. అమెరికా స్థావరాలకు జరిగిన నష్టం, భవిష్యత్లో వాటి మరమ్మతులు, యుద్ధానికి అప్పులు తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ, సైనికులకు భవిష్యత్లో అందించాల్సిన వైద్య, వైకల్య ప్రయోజనాలు వంటి ఖర్చులు ఇందులో పూర్తిగా లేవు. రక్షణ శాఖ నుంచి సీబీవో కోరిన సమాచారానికి పూర్తి సహకారం అందకపోవడంతో ఈ అంచనాల్లో కొంత అనిశ్చితి కూడా ఉందని బడ్జెట్ ఆఫీస్ స్పష్టం చేసింది. అమెరికాకే కాదు.. డ్యామేజ్ ట్రంప్కు కూడా!యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్నది స్పష్టంగా లేకపోవడంతో ఈ బిల్లు చివరకు ఎంతకు చేరుతుందన్నది కీలక ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ ప్రతిష్టపైనా ప్రభావం చూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయనకున్న ప్రజాదరణ క్రమంగా తగ్గిపోయిందని రాయిటర్స్ లాంటి పలు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయి. ఇరాన్ యుద్ధం, పెరిగిన ఇంధన ధరలు అమెరికన్లలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు అవి వెల్లడించాయి.ముఖ్యంగా నవంబర్ మిడ్టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీలో ఆందోళన పెరిగిపోతోంది. యుద్ధ వ్యయం, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధ నిల్వలపై ఒత్తిడి వంటి అంశాలు ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. ఒకవైపు యుద్ధాన్ని కొనసాగించాల్సిన వ్యూహాత్మక అవసరాన్ని ట్రంప్ సమర్థిస్తుండగా.. మరోవైపు పెరుగుతున్న ఖర్చు, ఆర్థిక భారం, ప్రజాభిప్రాయంపై దాని ప్రభావం ఆయన ముందున్న పెద్ద సవాళ్లుగా మారాయి.ఇదీ చదవండి: అమెరికా ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు!
జాతీయం
దిశా మృతి కేసు దర్యాప్తు.. ఎవరీ సీమా పాహుజా?
న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు క్రిమినల్ కేసుల దర్యాప్తులో అనుభవం ఉన్న సీబీఐ అధికారి సీమా పాహుజాకు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓ భవనంలోని 12వ అంతస్తు నుంచి పడిపోవడంతో దిశా సాలియన్ మృతి చెందింది. ఇది జరిగిన ఆరేళ్ల తర్వాత ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లో ఎవరినీ నిందితుడిగా పేర్కొనలేదు.సీమా పాహుజా ఎవరంటే..ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ క్రైమ్స్ యూనిట్ ఎస్పీగా సీమా పాహుజా పనిచేస్తున్నారు. గతంలో సీబీఐ చండీగఢ్ విభాగంలోనూ సేవలందించారు. హత్రాస్ ఘటన, ఉన్నావ్ అత్యాచార కేసు, కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం-హత్య కేసు దర్యాప్తులతో పాటు సిమ్లాలోని ‘గుడియా’ అత్యాచారం హత్య కేసు దర్యాప్తులోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. 2021లో ‘బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్’గా సీమా పాహుజాకు బంగారు పతకం లభించించింది.దిశా సాలియన్ కేసులో దర్యాప్తుదిశా మృతికి సంబంధించిన పాత రికార్డులు, అందుబాటులో ఉన్న ఆధారాలను సీబీఐ బృందం మరోసారి పరిశీలించనుంది. 2020 జూన్ 8 రాత్రి ఆమె కాబోయే భర్త రోహన్ రాయ్ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైన వారి వాంగ్మూలాలను తొలిదశలో నమోదు చేయనున్నారు. అప్పటి పోలీసు దర్యాప్తు వివరాలు, ఘటనాస్థల రికార్డులు, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర పత్రాలను కూడా పరిశీలించనున్నారు. దిశా మృతి జరిగిన కొద్ది రోజులకే సుశాంత్సింగ్ రాజ్పుత్ బాంద్రాలోని తన నివాసంలో మృతిచెందారు. రెండు ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరగడంతో వాటి మధ్య సంబంధంపై అప్పట్లో అనేక ఊహాగానాలు వినిపించాయి.ఇదీ చదవండి: ఇక చిటికెలో టీబీ గుర్తింపు.. 16 ఏళ్ల కుర్రాడి వినూత్న ఆవిష్కరణ!
దర్గా సాక్షిగా హిందూ జంట పెళ్లి.. ముస్లిం పెద్దల అక్షింతలు
మతాల మధ్య చిచ్చు పెట్టి తమ ప్రయోజనాలు చూసుకునే ప్రయత్నాలు ఎక్కడో జరుగుతుండొచ్చు. కానీ సామాన్యులు మాత్రం ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికే పెద్దపీట వేస్తున్నారు. తమిళనాడులోని నాగూర్ నుంచి ఇప్పుడు అలాంటి మానవీయతను చాటే ఓ అందమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. నాగపట్నం జిల్లాలోని నాగూర్ ఆండవర్ దర్గాకు ఆదివారం ఉదయం వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలోని సన్నిధి వద్ద హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. వరుడు వధువు మెడలో తాళి కట్టగా.. అక్కడే ఉన్న దర్గా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు, ఇరు కుటుంబాల సభ్యులు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించారు.ముస్లిం పెద్దల ఆశీర్వాదం..నాగూర్ దర్గా చైర్మన్, వారసత్వ ట్రస్టీ మొహమ్మద్ ఖలీఫా సాహిబ్ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగపట్నం జిల్లా చాలా కాలంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నాగూర్ దర్గాలో వివిధ మతాలకు చెందిన ప్రజలు రావడం, తమ ప్రత్యేక సందర్భాలను జరుపుకోవడం కొత్తేమీ కాదన్నారు.VIDEO | Nagapattinam: Hindu wedding held at Nagore Dargah, with people from both Hindu and Muslim communities attending the ceremony. pic.twitter.com/D2f4vQ83PH— Press Trust of India (@PTI_News) September 15, 2026వధూవరుల వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. దర్గా నిర్వాహకులు హిందూ జంటను ఆశీర్వదిస్తున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాగూర్ దర్గా భిన్న మతాల ప్రజలు కలిసి మెలిసి ఉండే సంప్రదాయానికి మరోసారి వేదికగా నిలిచిందంటూ పలువురు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలను భవిష్యత్ తరాలకు కూడా చూపించాల్సిన అవసరం ఉందని ఖలీఫా సాహిబ్ అభిప్రాయపడ్డారు. ఓవైపు పలువురి అభ్యంతరాలు.. మరోవైపు మతం ఏదైనా ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావచ్చనే సందేశాన్ని ఈ వివాహ వేడుక చాటిందనే కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: నాగ్పూర్ హిట్ అండ్ రన్ కేసులో బిగ్ ట్విస్ట్
మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదం.. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య. పైగా ఆ వెనక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణ. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బాల్య స్నేహితుడ్ని కలిసి.. సీబీఐ విచారణ జరిపించాలని ఆ పెద్దాయన కోరారు. అవతలి ఉంది మాములు వ్యక్తి కాదు.. అందుకే వారం తిరగ్గ ముందే ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.ప్రధాని నరేంద్ర మోదీతో పాఠశాలలో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా.. మహారాష్ట్రలోని భయందర్లో తన భూమి వివాదంపై సెప్టెంబర్ 8న మోదీని కలిశారు. ఇది జరిగిన.. వారం రోజుల్లోనే వివాదాస్పద స్థలంపై బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెనక్కి తగ్గారు. భూమిపై తనకున్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు, అక్కడ నిర్మాణానికి తీసుకున్న అనుమతులను కూడా సరెండర్ చేశారు. వోరాపై గతంలో ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును సైతం ఉపసంహరించుకున్నారు.నాకేం తెలియదు: వోరామోదీతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న వోరా.. ప్రస్తుతం ముంబై సమీపంలోని మీరా రోడ్లో నివసిస్తున్నారు. భయందర్ ఈస్ట్లోని నవ్ఘర్లో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేశారు. తాను ఆ భూమిని ఎప్పుడూ విక్రయించలేదని, మరెవరికీ బదలాయించలేదని పేర్కొన్నారు.అయితే 2011లో తనకు తెలియకుండా భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి, ఆస్తిని రెండు భాగాలుగా విభజించినట్లు వోరా ఆరోపించారు. ఒక భాగాన్ని స్వయం బిల్డర్స్ పేరుతో, మరో భాగాన్ని నరేంద్ర మెహతాకు సంబంధించిన సెవెన్ ఎలెవన్ కన్స్ట్రక్షన్స్ పేరుతో చూపించినట్లు ఆయన పేర్కొన్నారు. తన భూమిపై నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపైనా అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కూడా ఆయన కోరారు.15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా..ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు దాదాపు 15 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ విభాగాలను ఆశ్రయిస్తున్నానని వోరా తెలిపారు. 2015లో నకిలీ పత్రాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని, అయితే దర్యాప్తు నివేదిక చాలా ఆలస్యంగా వచ్చిందని ఆయన ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని వోరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 8న ప్రధాని మోదీని కలిసి తన సమస్యను వివరించారు. ఈ భేటీ అనంతరం మహారాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.మోదీ ఎఫెక్ట్.. సచివాలయంలో కీలక సమావేశంసెప్టెంబర్ 15న మహారాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీకర్ పరదేశి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అస్గర్ అలీ వోరాతో పాటు ఎమ్మెల్యే నరేంద్ర మెహతా, మీరా-భయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా బినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తమ్ షిండే పాల్గొన్నారు.ఈ సమావేశంలో నరేంద్ర మెహతా టౌన్ ప్లానింగ్ విభాగానికి లేఖ ఇచ్చారు. వివాదాస్పద భూమిపై తాను కలిగి ఉన్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు, ఆ స్థలానికి మంజూరైన నిర్మాణ అనుమతిని కూడా సరెండర్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఈ భూమిని తాను 2019లో మెర్విన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు మెహతా తన లేఖలో తెలిపారు.ఫిర్యాదు కూడా ఉపసంహరణఇదే సమయంలో వోరాపై గతంలో తాను చేసిన పోలీస్ ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు మెహతా పోలీస్ కమిషనర్కు మరో లేఖ రాశారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినందున ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భూవివాదానికి ఓ ఎండ్ కార్డ్ పడినట్లైంది.ఇదీ చదవండి: ఆ హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్కు ఊరట
విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం
నాగ్పుర్: ఆధ్యాత్మికతతో పాటు విజ్ఞానాన్ని మేళవిస్తూ మహారాష్ట్రలోని నాగపూర్లో గల బాల గణేశోత్సవ మండల్ ఈ ఏడాది ‘విజ్ఞానం ద్వారా ఆత్మశుద్ధి’ ఇతివృత్తంతో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసింది. మనసు, చైతన్యం, విజ్ఞానం, ఆధ్యాత్మికతల మధ్య ఉన్న అనుసంధానాన్ని భక్తులకు పరిచయం చేయడం దీని ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ మండపాన్ని అంతరిక్షాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. గెలాక్సీలు, గ్రహాల స్ఫూర్తితో లోహాలు, రేఖాగణిత ఆకృతులు, వృత్తాకార నిర్మాణాలను ఉపయోగించి ఖగోళ అంశాలు, అవి మానవ జీవితంపై చూపే ప్రభావాన్ని ప్రతిబింబించారు.ప్రవేశద్వారం వద్ద భక్తుల అవగాహనకు విశ్వానికి సంబంధించిన నమూనాలను ఉంచారు. మానవ మెదడు పనిచేసే తీరును చూపించే ప్రతిరూపాలు, ఇన్స్టలేషన్లు ఇందులో ఏర్పాటు చేశారు. ఈ అలంకరణ ద్వారా భక్తులు తమలోకి తాము చూసుకుని ఆలోచనలు, భావోద్వేగాలు, చర్యల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు కార్పొరేటర్, మండల్ అధ్యక్షుడు ఈశ్వర్ తెలిపారు. ప్రధాన మండపంలోకి వెళ్లిన తర్వాత విశ్వాన్ని తలపించే ఏర్పాట్లు కనిపిస్తాయని, మానవ మెదడులో నిరంతరం జరిగే ఆలోచనలు, కార్యకలాపాలను గోడలపై ప్రతిబింబించామని ఈశ్వర్ వివరించారు. భావోద్వేగాలు, ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రీయ ప్రక్రియలను కూడా ఇందులో చూపించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ మండళ్లలో రూపొందించిన నమూనాలు, డిజైన్లను పరిశీలించిన తర్వాత ఈ మండపాన్ని రూపొందించినట్లు చెప్పారు.మండపం మధ్యలో మనసు, మేధస్సు, ఆలోచనలు, సంస్కృతికి ప్రతీకగా భారీ జలాశయాన్ని పోలిన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. దాని నుంచి వెలువడే తరంగాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు అంతర్గత శత్రువులను సూచిస్తాయి. మధ్యభాగం పైన భారీ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. మానవులలో మారుతూ ఉండే ఆలోచనలు, భావోద్వేగాలను వీక్షించే విశ్వశక్తికి ఇది ప్రతీకగా పేర్కొన్నారు. అదుపు లేని భావోద్వేగాలు, ప్రతికూల ధోరణులు.. మానసిక అశాంతి, ఘర్షణ, ద్వేషం, హింస, విధ్వంసానికి దారితీస్తాయని ఈశ్వర్ తెలిపారు. దీనికి భిన్నంగా గణేశుడికి శరణాగతి, ప్రార్థన, నైతిక విలువలు, సత్ప్రవర్తన, కరుణ ఆత్మశుద్ధికి మార్గాలుగా చూపించినట్లు చెప్పారు. అజ్ఞానం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు సాగే ప్రయాణానికి ప్రతీకగా 16 దీపస్తంభాలను కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: ఆడంబరాలకు దూరంగా.. వందేళ్ల 32 గణేశ మండపాలు
ఎన్ఆర్ఐ
ఇదేమి వింతో.. బ్రేకప్ తర్వాత రివర్స్ ట్విస్ట్..
సింగపూర్లో జరిగిన ఓ వింత ఘటన అందర్నీ అశ్చరపరుస్తోంది. ప్రేమలో ఉండగా ప్రేయసి కోసం ఏకంగా రూ.3.5 కోట్లు ఖర్చు చేశాడు.. విలాసవంతమైన కానుకలు, ఫస్ట్క్లాస్ విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనలు.. ఇలా ఆమె కోసం భారీగా ఖర్చు చేసిన భారత సంతతికి చెందిన ఓ సీఈవో.. ప్రేమ బంధం తెగిపోయిన తర్వాత ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోర్టుకెక్కాడు. కానీ న్యాయస్థానం మాత్రం ఇది ప్రేమలో ఇచ్చిన బహుమతులేనంటూ తీర్పు చెప్పింది. దీంతో డబ్బు తిరిగి రాకపోగా.. కోర్టు ఖర్చులు కూడా అతడే భరించాల్సి వచ్చింది. ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.సీఎన్ఎన్ కథనం మేరకు భారత లాజిస్టిక్స్ సంస్థ టీసీఎల్ ఎక్స్ప్రెస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ అగర్వాల్, తన మాజీ ప్రేయసి ఫెలీషియా లీ తనకు దాదాపు $3.7 లక్షలు చెల్లించాల్సి ఉందని పేర్కొంటూ సింగపూర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెపై ఖర్చు చేసిన మొత్తాన్ని తాను వడ్డీ లేని రుణాలుగా ఇచ్చానని.. వాటిని ఆమె తిరిగి చెల్లించాల్సి ఉందని అగర్వాల్ వాదించారు. అయితే కోర్టు మాత్రం ఆ మొత్తంలో ఎక్కువ భాగం బహుమతుల రూపంలో ఇచ్చినవేనని తేల్చింది. అగర్వాల్ దావాను కొట్టివేసింది.అగర్వాల్, లీ ఇద్దరూ తొలిసారిగా 2019లో ఓ విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్లో వారి మధ్య ప్రేమ ఏర్పడింది. 2023 డిసెంబర్లో వారి సంబంధం ముగిసింది. లీ తనకు నమ్మకద్రోహం చేసిందని.. అందుకే తాము విడిపోయామని అగర్వాల్ పేర్కొన్నారు. వారు ప్రేమలో ఉండగా అగర్వాల్.. లీ కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. అంతే కాకుండా.. లీ నివసించే ఫ్లాట్ కోసం ఓ ఫెంగ్ షుయ్ నిపుణుడికి సుమారు S$17,000 కూడా చెల్లించారు.ఈ చెల్లింపు మాత్రం రుణమేనని అగర్వాల్ వాదించారు. లీ తనను డబ్బు రుణంగా ఇవ్వాలని కోరిందని.. దాన్ని తిరిగి చెల్లిస్తానని ఆమె అంగీకరించిందని అగర్వాల్ తెలిపారు. ఇందుకు ఆధారంగా లీ ఇనిషియల్స్ ఉన్నాయని తాను పేర్కొన్న ఓ చేతిరాత ఒప్పందాన్ని కూడా కోర్టుకు ఆయన సమర్పించారు. అయితే, లీ ఆ పత్రంపై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశారు. చెల్లింపులు రుణాలు కాదని.. బహుమతులేనని, అందువల్ల లీ ఆ డబ్బును అగర్వాల్కు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని సింగపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ
90 నిమిషాల్లో ఇద్దరు స్నేహితులను చంపిన ఆమె దొరికిపోయింది..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరు కేరళకు చెందిన స్నేహితుల హత్య కేసులో భారత సంతతికి చెందిన అనిలా బేబీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 28న శాన్జోస్, మిల్పిటాస్ ప్రాంతాల్లో 90 నిమిషాల వ్యవధిలో 2 హత్యలు జరిగాయి. మృతులను యాన్ మేరీ మ్యాథ్యూ(35), అంజనా హరి(35)గా గుర్తించారు. అనిలా బేబీతో పాటు మిగతా ఇద్దరు కేరళ మూలాలు ఉన్నవారే.మొదటి ఘటన శాన్జోస్లోని మ్యాథ్యూ ఇంట్లో జరిగింది. ఆమెను గొంతు నులిమి, కత్తితో పొడిచినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. శాన్జోస్ పోలీసులు కూడా ఆమెకు కత్తిపోట్లు ఉన్నాయని, ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు.దాదాపు 90 నిమిషాల తర్వాత మిల్పిటాస్లోని తమ అపార్ట్మెంట్ సముదాయం పార్కింగ్ ప్రదేశానికి అంజనా హరిని అనిలా బేబీ పిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్ సముదాయంలో నివసించేవారు. అంజనా అనిలా బేబీ వాహనం వద్దకు వెళ్లిన సమయంలో వాహనం ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి ఆమెను ఢీకొట్టి, హత్య చేసింది. అనంతరం అనిలా అక్కడి నుంచి పారిపోయి మరో మూడు వాహనాలను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత పోలీసులు ఓ దుకాణం సమీపంలో నీలిరంగు టయోటా వాహనాన్ని గుర్తించారు. వాహనం నడిపింది అనిలా బేబీనేనని గుర్తించారు. ఆమె అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కనిపించిందని, చేతులు, కాళ్లపై రక్తం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి శాంటా క్లారా కౌంటీ ప్రధాన జైలుకు తరలించారు.ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు శాన్జోస్ పోలీసులు తెలిపారు. అనిలా బేబీపై 2 హత్య కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే 50 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది.మృతుల భౌతిక కాయాలను భారత్కు, ముఖ్యంగా కేరళకు తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత రాయబార కార్యాలయం, కాలిఫోర్నియాలోని మలయాళీ సంఘం కూడా కుటుంబాలకు సహాయం చేస్తున్నాయి. శవపరీక్ష, ఇతర న్యాయపరమైన ప్రక్రియలు త్వరగా పూర్తి కావాలని వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
భారత సంతతి మహిళను ఫాలో అయ్యాడు.. చివరకు కాల్పులు
అమెరికాలోని కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల భారత సంతతికి చెందిన ఓ మహిళ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. నెలల తరబడి ఓ వ్యక్తి ఆమె వెంటపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. అమెరికాలో నిషేధాజ్ఞ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని సంప్రదించడం, కలవడం లేదా దగ్గరకు వెళ్లడాన్ని చట్టపరంగా నిరోధించే ఆదేశం.షాలిని ఠాకూర్ (38) తన కారుకు సమీపంలో నిలబడి ఉండగా.. భారతదేశానికి చెందిన చట్టబద్ధ పత్రాలు లేని వలసదారు రోహిత్ ఆమె వద్దకు వచ్చినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. షాలిని తప్పించుకునేందుకు ప్రయత్నించగా రోహిత్ ఆమెను వెంబడించి తలపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాల్పుల ఘటనపై స్పందించిన పోలీసులు రోహిత్ను కొద్దిసేపటికే పట్టుకున్నారు. అధికారుల ప్రకారం.. ఆ తర్వాత అతడు తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంటల తరబడి కారు నిలిపి.. కాల్పుల ఘటనకు ముందు రోహిత్ నెలల తరబడి షాలినిని వెంటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలినికి అతడు డోర్డ్యాష్ డెలివరీ డ్రైవర్గా తెలుసని ఏబీసీ 10 తెలిపింది. అతడు ఆమె ఇంటి బయట గంటల తరబడి కారు నిలిపి.. ప్రతిరోజూ ఆమెతో మాట్లాడేవాడని పేర్కొంది.ఓ దశలో రోహిత్ తనను పెళ్లి చేసుకోవాలని షాలినిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతరులతో స్నేహంగా ఉండకుండా కూడా ఆమెను అడ్డుకున్నాడు. ఆమె ఎవరినైనా కలిస్తే ఆ వ్యక్తిని లేదా తనను తాను తుపాకీతో కాల్చుకుంటానని రోహిత్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత రోహిత్ షాలిని కారు టైర్లలోని గాలిని తీసేసి.. ఆమె పనిచేసే చోటుకూ వెంబడించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించేవాడని చెప్పారు. షాలిని అపార్ట్మెంట్ తాళం చెవి నకలును కూడా రోహిత్ సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించేందుకే అతడు ఆ నకలు తాళం చెవిని సంపాదించినట్లు తెలుస్తోంది.మేలో షాలిని చివరకు రోహిత్పై నిషేధాజ్ఞ పొందింది. అయినప్పటికీ అతడు ఆమెను ఫాలో కావడం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలిని తల్లి సుదేశ్ కుమారి మాట్లాడుతూ తన కుమార్తె పలుసార్లు పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. చివరకు మంగళవారం శాక్రమెంటో కౌంటీలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో షాలిని ప్రాణాలు కోల్పోయింది.
ఫీనిక్స్లో ‘రాజా 50’ : వేలాది మందిని కట్టిపడేసిన ఇళయరాజా!
శంకర నేత్రాలయ సేవలపై అవగాహన కల్పించే లక్ష్యంతో అరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా, ‘రాజా 50’ పేరుతో ప్రత్యక్ష సంగీత కార్యక్రమంలో ఆహూతులను అలరించింది. దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను తన సంగీత ప్రపంచంలో విహరింపజేశారు. ఫీనిక్స్లో గతంలో ఎన్నో భారతీయ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో లైవ్ సింఫనీ సంగీత బృందంతో జరిగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.దాదాపు 40 మంది సంగీత కళాకారులతో కూడిన బృందం ఇళయరాజాతో కలిసి వేదికను పంచుకుంది. ఒక్కో వాయిద్యం సంగీతంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇళయరాజా స్వయంగా వివరించడం ఈ కార్యక్రమాన్ని సాధారణ సంగీత కచేరీకి భిన్నంగా నిలిపింది.Arizona Financial Theatreలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 4వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు వివిధ భారతీయ భాషలు, ప్రాంతాలకు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంగీతానికి భాషా సరిహద్దులు లేవని మరోసారి చాటింది.‘రాజా 50’ ఫీనిక్స్లో ఒక విజయవంతమైన సంగీత కార్యక్రమంగా మాత్రమే కాకుండా, శంకర నేత్రాలయ సేవలను 4,000 మందికి పైగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమైన అవగాహన వేదికగా నిలిచింది. ముఖ్యంగా MESU కార్యక్రమాన్ని పరిచయం చేయడం, దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించడం ద్వారా సంగీత వేదికపై సేవా సందేశాన్ని కూడా వినిపించే అవకాశం లభించింది. ఇళయరాజా సంగీతం ప్రజలను ఒకచోట చేరిస్తే, ఆ అవకాశాన్ని శంకర నేత్రాలయ సేవలను మరింత మందికి పరిచయం చేయడానికి ఉపయోగించుకోవడం ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకతను ఇచ్చింది. సంగీతం, సమాజం, సేవ ఒకే చోట కలిసిన మరపురాని రాత్రిగా ‘రాజా 50’ నిలిచిపోయింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నేత్ర వైద్య సేవలను చేరువ చేయడంలో MESU చేస్తున్న సేవలను పరిచయం చేస్తూ, దానికి సంబంధించిన వీడియోలను కూడా వేదికపై ప్రదర్శించారు. సంగీతం కోసం వచ్చిన వేలాది మందికి శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలను చూపించగలగడం ఈ వేదికకు ప్రత్యేకమైన సామాజిక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.ఈ కార్యక్రమానికి ఫీనిక్స్లోని వివిధ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంఘాలు, ఇతర భారతీయ సామాజిక సంస్థల ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, స్పాన్సర్లు, వాలంటీర్లు తమ వంతు సహకారం అందించారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఒక మంచి కార్యక్రమం కోసం అందరూ కలిసి రావడం ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. నిర్వాహకులతో పాటు వివిధ సంఘాలు, స్పాన్సర్లు, వాలంటీర్లు, శంకర నేత్రాలయ శ్రేయోభిలాషులు, ఫీనిక్స్ భారతీయ సమాజం అందించిన సహకారం ఇందులో భాగమైంది.ఇంత పెద్ద కార్యక్రమం వెనుక ఆది మొర్రెడ్డి, అనిల్ భరద్వాజ్, విజయ్ రాజ్, చెన్నా రెడ్డి మద్దూరి, చిత్రప్రియ, సుబ్బు ఉప్పులూరి, జ్ఞాని మారుపాకుల, జెగ్గీ క్రిష్, డా. కార్తిక్ రెడ్డి దొనూర్, లక్ష్మి బొగ్గరపు, ప్రవీణ్ సామల, శరవ్ సుబ్రమణియన్, సచ్చిదానంద ప్రభు, సతీష్ పంచాక్షరం, సతి శివం, శ్యామ్ బైరా, శ్రీజిత్ శ్రీనివాసన్, గుప్తా, శ్రీని సుబ్రమణియన్, వంశీ కృష్ణ ఇరువారం, ధీరజ్ రెడ్డి పోల తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు.ఇళయరాజా సంగీత ప్రయాణానికి యాభై సంవత్సరాలు అనే సందర్భంలో జరిగిన ఈ కార్యక్రమం తరాలను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాటలను ఆస్వాదిస్తున్న తరం పక్కనే నేటి యువతరం కూడా అదే సంగీతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించింది. వివిధ వయసులు, భాషలు, ప్రాంతాలకు చెందిన వేలాది మంది సంగీతంతో ఒక్కటయ్యారు.
క్రైమ్
తొలిపూజ వివాదం పూజారి ప్రాణం తీసింది
తిరుమలగిరి(సాగర్)నల్గొండ జిల్లా : గణేష్ మండపాల వద్ద రెండు వర్గాల మధ్య ఏర్పడిన గొడవ చివరికి పూజారి మృతికి దారితీసింది. తిరుమలగిరి(సాగర్) మండలం చింతలపాలెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత 17 సంవత్సరాలుగా నందికొండ మున్సిపాల్సి పరిధిలోని పైలాన్కాలనీకి చెందిన ఉప్పల దత్తుప్రసాద్(60) పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో కూడా పూజలు చేస్తారు. సోమవారం వినాయకచవితి కావడంతో విగ్రహాల వద్ద పూజలు నిర్వహించడానికి ఆయనతో పాటు ఆయన కుమారుడు ఉప్పల శ్రీవల్లభరాఘవ చింతలపాలెం వచ్చారు. గ్రామానికి చెందిన గుండాల రవి, గుండాల పున్నయ్య పూజారికి ఫోన్ చేసి మొదటగా మా విగ్రహం వద్ద పూజలు నిర్వహించాలని సూచించారు. వారి సూచన మేరకు అక్కడికి వెళ్లిన దత్తుప్రసాద్.. అక్కడ ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన మరో విగ్రహం వద్దకు వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న రవి, పున్నయ్య మొదటగా మా విగ్రహం వద్దనే పూజలు నిర్వహించాలని చెప్పినప్పటికీ ఇక్కడికి వచ్చి ఎలా పూజలు నిర్వహిస్తావని దత్తుప్రసాద్తో గొడవకు దిగారు. ఈ క్రమంలో దత్తుప్రసాద్పై చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లు కలుగజేసుకొని దత్తుప్రసాద్ను పక్కనే ఉన్న ఆలయంలోకి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తరువాత గ్రామస్తులు సర్దిచెప్పడంతో దత్తుప్రసాద్ తన కుమారుడు శ్రీవల్లభరాఘవకు కమిటీ విగ్రహం వద్ద పూజలు నిర్వహించమని చెప్పి ఆయన గుండాల రవి, పున్నయ్య విగ్రహం వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహిసూ్తనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే నాగార్జునసాగర్ కమలానెహ్రూ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు.పూజలందుకోకుండానే గంగమ్మ ఒడికి.. పురోహితుడు దత్తుప్రసాద్ మృతితో చింతలపాలెంలో ఆరు విగ్రహాలను ప్రతిష్ఠించగా సోమవారం రాత్రి రెండు విగ్రహాల వద్దనే పూజ జరిగింది. మిగతా నాలుగు విగ్రహాల వద్ద పూజ జరగలేదు. దీంతో మంగళవారం రాత్రి గ్రామంలో ఉన్న ఆరు విగ్రహాలను శోభాయాత్ర లేకుండానే నాగార్జున సాగర్లో నిమజ్జనం చేశారు. ఇదీ చదవండి: ఎక్కడున్నావ్ జానూ!
వివాహేతర సంబంధం.. మహిళ ఆత్మహత్య!
విశాఖపట్నం: వివాహేతర సంబంధంలో వివాదాల కారణంగా మనస్తాపానికి గురై ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలు.. మధురవాడ ఆర్టీసీ కాలనీలోని సాయిప్రియ నివాస్ ఎఫ్–2లో పిట్ల కోమలి(29) మూడు నెలలుగా సుభాన్ అనే వ్యక్తితో కలిసి ఉంటోంది. ఈ నెల 13న సుభాన్ భార్య, ఆమె సోదరుడు కోమలిని వాంబే కాలనీకి పిలిపించి సుభాన్తో ఉన్న సంబంధంపై నిలదీసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సుభాన్కు కోమలి ఫోన్లో చెప్పినప్పటికీ అతని నుంచి స్పందన లేదు. దీంతో మనస్తాపానికి గురైన కోమలి అదే రోజు రాత్రి ఇంటి కిటికీ ఊచలకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతురాలి సోదరి బి.భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎం పాలెం సీఐ జి.భాస్కరరావు తెలిపారు. ఇదీ చదవండి: విశాఖలో కలకలం.. పార్క్ వద్ద చిరిగిన కరెన్సీ నోట్ల కుప్ప
భర్త పట్టించుకోవడం లేదని.. ప్రియుడి చెంతకు వెళ్లిన భార్య
మంచిర్యాలక్రైం: భర్త సరిగా చూసుకోవడం లేదని ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తకు విడాకులు ఇప్పించిన అతడు నాలుగేళ్లు ఆమెతో సహజీనం చేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. ఆడపిల్ల అని తెలిసి అబా ర్షన్ చేయించాడు. తీరా పెళ్లికి నిరాకరించడంతో అటు భర్త, కన్నవారికి దూరమై.. ఇద్దరు పిల్లలతో ఎలా జీవించాలో తెలియక ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పెల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహామైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతడు విదేశానికి వెళ్లేవాడు. ఇద్దరి మధ్య గొడవల కారణంగా విడిపోయారు. ఈ క్రమంలో బాధిత వివాహిత స్నేహితురాలి స్నేహితుడు మందమర్రికి చెందిన మహేష్తో కలిసి మందమర్రి పాలచెట్టు ప్రాంతానికి చెందిన షారుఖ్పాష పరిచయమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి తరచూ బాధిత మహిళ ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో షారుఖ్పాషకు బాధిత మహిళతో సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఆమెతో భర్తకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాడు.ఆడపిల్ల అని తెలిసి అబార్షన్!సదరు వివాహితను పెళ్లి చేసుకుంటానని, ఇద్దరు కూతుళ్లను చూసుకుంటానని షారుఖ్పాష నమ్మించి రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని క్యాతనపల్లిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకాలం సహజీవనం చేశారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులకు కూడా తెలియడంతో నాలుగేళ్లుగా కలిసే ఉంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆమెకు అబార్షన్ చేయించగా.. మూడోసారి మంచిర్యాల బస్టాండ్ సమీపంలోని ఓ స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో మళ్లీ అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు పెద్ద మనుషులను పిలిపించి షారుఖ్పాషపై ఆమె ఒత్తిడి తేగా నిరాకరించాడు. దీంతో ఆ మహిళ దోమలమందు, జ్వరం గోలీలు వేసుకుని ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ విషయమై సీఐ ప్రమోద్రావు స్పందిస్తూ బాధితురాలి ఫిర్యాదు మేరకు షారుఖ్పాషపై కేసు నమోదు చేసి రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్కు బదిలీ చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: విశాఖలో కలకలం.. పార్క్ వద్ద చిరిగిన కరెన్సీ నోట్ల కుప్ప
బాలికపై లైంగిక దాడి.. ‘క్షమాపణ చెబితే చాలు’ అని తీర్పు!
పెద్దపల్లి జిల్లా: మాయమాటలు చెప్పి బాలికను లైంగికంగా వేధించిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి(52) ఇదే గ్రామానికి చెందిన బాలిక(17)ను ప్రలోభపెట్టి తన ఇంటికి పిలిపించి అత్యాచారం చేసినట్లు బాలిక తన తండ్రికి వెల్లడించినట్లు సమాచారం. బాలిక మూడు రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవటంతో తండ్రి ఆరా తీయగా..ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇస్తూ పాఠశాలకు వెళ్లొద్దని చెబుతున్నాడని తెలిపినట్లు సమాచారం.సదరు వ్యక్తి తనను మధ్యాహ్నం ఇంటికి పిలిపించి లైంగికదాడికి పాల్పడినట్లు చెప్పడంతో తండ్రి గ్రామ పెద్దలను ఆశ్రయించినట్లు తెలిసింది. బాలిక తండ్రి గ్రామ పెద్దలను సంప్రదించగా నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కుమారుడు అందుబాటులో లేని కారణంగా పంచాయితీని కొన్నిరోజులు వాయిదా వేసినట్లు సమాచారం. సోమవారం కుమారుడు గ్రామానికి రావటడంతో పెద్దలు సదరు వ్యక్తిని బాలిక ఇంటికే పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. ఈ క్రమంలో పెద్దమనుషులు అత్యాచారం చేసిన వ్యక్తిని బాలిక తండ్రి కాళ్లు మొక్కి మరోసారి ఇటువంటి తప్పులు చేయనని ప్రాధేయపడాలని సూచించినట్లు సమాచారం. దీంతో అతడు తాను తప్పు చేశానని, క్షమించాలని పంచాయితీ పెద్దల సమక్షంలోనే బాలిక తండ్రిని ప్రాధేయపడుతూ కాళ్లుమొక్కాడు. కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి సదరు వ్యక్తిపై దాడిచేయగా అక్కడ నుంచి పారిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ పోలీసులతో బాలిక ఇంటికి వెళ్లి మహిళా పోలీసుతో బాలికతో మాట్లాడించి వివరాలు సేకరించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక వాంగ్మూలం, ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
మెగాస్టార్ డబుల్ ధమాకా.. ఒకే నెలలో చిరు 2 సినిమాలు
చెల్లింపులు 2000 దాటితే బాదుడు షురూ... ఇక UPIతో బ్రేక్ పడ్డట్టేనా?
మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు
మార్కెట్ పడుతున్నా తగ్గేదేలే.. 9 రోజుల్లో రూ.55,000 లాభం తెచ్చిన షేర్
FBI ముసుగులో బాబు అరాచకాలు.. బయటపడ్డ సంచలన నిజాలు..
ట్రంప్ మా పథకాన్ని కాపీ కొట్టిండు
గాల్లో ఇంజిన్ ఫెయిల్.. ఊడిన టైర్..! విమానంలో ఒక్కసారిగా అలజడి..!
Mahabubabad: కారు బీభత్సం.. కలెక్టరేట్ గేట్లు గుద్దుకుంటూ..
మక్కా సమీపంలో డ్రోన్ దాడి.. కూల్చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్
నాలుగు దేశాలుగా విడిపోనున్న UK..?

