Top Stories
ప్రధాన వార్తలు
‘తాగు.. తిను.. ఊగు.. సంక్రాంతి పేరుతో కూటమి సర్కార్ దోపిడీ’
సాక్షి, విజయవాడ: సంక్రాంతిని కూటమి ప్రభుత్వం దోచుకుందని.. దోపిడీకి ఏ మార్గాన్ని వదలడం లేదంటూ వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్(Pothina Mahesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంక్రాంతి(Sankranti)ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారు. సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకెళ్లారు. పాఠశాలలను కూడా జూద కేంద్రాలుగా మార్చేశారు’’ అని దుయ్యబట్టారు.‘‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల బరుల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారు. మద్యాన్ని ఏరులై పారించారు. రికార్డింగ్ డాన్స్లు చేయించారు. పండుగను అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకున్నారు. పేదలు ఈ సంక్రాంతి పండుగకు దూరమయ్యారు. తాగు... తిను.. ఊగు అనే కొత్త నినాదాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది’’ అంటూ పోతిన మహేష్ ధ్వజమెత్తారు.‘‘సంక్రాంతి సంబరాలను ఆర్గనైజింగ్ క్రైమ్గా మార్చేశారు. జూదం అధికారికమే అనేలా కూటమి అనుమతులిచ్చింది. ఐపీఎల్ మాదిరి కోడి ప్రీమియర్ లీగ్లు పెట్టారు. పనులు చేసుకోవద్దు.. వ్యసనాలకు అలవాటు పడండని చంద్రబాబు ప్రజలకు చెప్పదలచుకున్నారా సమాధానం చెప్పాలి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు కోడి పందాల్లో పాల్గొన్నారు. మహిళా బౌన్సర్లను పెట్టి విష సంస్కృతి తెచ్చారు. మైనర్లు సైతం గుండాట, పేకాట ఆడారు. కోడి పందాలు ఆడుకోవచ్చని అనుమతులుచ్చారా.. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలి’’ అని మహేష్ నిలదీశారు.‘‘భీమవరంలో క్యాసినో సెంటర్ పెట్టారు. కుక్కుట శాస్త్రం ప్రకారం రూ.కోటి 25 లక్షలతో ముహూర్తం పెట్టి ఆడించారు. చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. కోడి పందాల బరులకు టీడీపీ, జనసేన ట్యాక్స్ కట్టించుకున్నారు. స్కూళ్లలో కోళ్ల పందాలు పెట్టి విద్యార్ధులకు ఏం సందేశం ఇస్తారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. గోదావరి జిల్లాలకు ధీటుగా కృష్ణాజిల్లాలో 320కి పైగా కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు’’ అని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు...ఇదేం పాలన అని జనం చంద్రబాబు, పవన్ను తిట్టుకుంటున్నారు. వైఎస్ జగన్ను అనవసరంగా వదులుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విజనరీ ఎవరని ప్రజల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రాన్ని కోడి పందాలు.. పేకాటకు కేరాఫ్గా మార్చాలనుకుంటున్నారా చంద్రబాబు?. అశ్లీల నృత్యాలేనా పర్యాటకం అభివృద్ధి అంటే. ఇదేనా చంద్రబాబు మీ విజన్ 2047 అంటే. కోడి పందాలను ప్రమోట్ చేసిన ఒక్క సెలబ్రిటీ మీదనైనా కేసు పెట్టారా?. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను చంద్రబాబు, పనన్ సర్వ నాశనం చేస్తున్నారు.ఇదీ చదవండి: పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?..పేకాట, కోడి పందాలు.. అశ్లీల నృత్యాలు చూడాలంటే ఏపీకి వెళ్లాలని పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలు అనుకుంటున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు కట్టిన జగన్ అసలైన విజనరీ. ఉపాధి అవకాశాలు కల్పించలేమని పవన్ చెప్పిన కొద్దిసేపటికే ఇద్దరు యువకులు చనిపోయారు. ఇద్దరి చావుకు కారణమైన పవన్పై కేసు పెట్టాలా వద్దా?. పవన్ పదే పదే సనాతన ధర్మం.. సంస్కృతి అంటున్నారు. కోడి పందాలు, పేకాట, గుండాట ఆడటమే ధర్మమా?..అశ్లీల నృత్యాలే మన సంస్కృతా... పవన్ సమాధానం చెప్పాలి. ఇటీవల పవన్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అడిగేవాడు లేక జనసేన కార్యకర్తలు బరితెగించారు. నేషనల్ హైవేపై టోల్ గేట్ పెట్టడమేంటి?. కోడి పందాలు నిర్వహించినందుకు పవన్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదు. పార్టీలో చేర్చుకున్న భూకబ్జాదారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నలు గుప్పించారు.
కేటీఆర్పై ఈడీ ప్రశ్నల వర్షం..
ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణదాదాపు 7 గంటల పాటు కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీఫార్ములా- ఈ కేసులో కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీ ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్. కొనసాగుతున్న విచారణ.. ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటుగా విచారణ కొనసాగుతోందిమరోవైపు.. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన నెలకొంది. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కేటీఆర్ విచారణ సందర్బంగా ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసు వాహనాలల్లో వారిని తరలించారు. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. ఈడీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ విచారణ కోసం ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈడీ ఆపీసు వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మరోవైపు, ఈడీ ఆఫీసు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈడీ ఆఫీసుకు బయలుదేరిన కేటీఆర్గచ్చిబౌలి నివాసం నుంచి బయల్దేరిన కేటీఆర్మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం!ఏసీబీ విచారణ ముందు.. నందినగర్ నివాసంలో కీలక నేతలతో నేతలు చర్చలు జరిపిన కేటీఆర్ఇవాళ్టి విచారణకు మాత్రం గచ్చిబౌలి నివాసం నుంచే ఈడీ ఆఫీస్కు..ఈడీ విచారణ వేళ ఎక్స్లో కేటీఆర్ ట్వీట్ఫార్ములా-ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందిఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందిఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవుమంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తానుఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది...ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలిఅందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నానురాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది.కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందిఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతినయా పైసాకు లెక్క ఉందిమరి అలాంటి అప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందిఇలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుందికచ్చితంగా ఈ అంశం లో నిజమే గెలుస్తుంది... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయిఅప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఒంటరిగానే..ఈడీ విచారణకు కేటీఆర్(KTR) లాయర్లకు అనుమతి నిరాకరణ కేటీఆర్ ఒక్కరే విచారణకు హాజరుఇంతకు ముందు ఏసీబీ విచారణ టైంలో లాయర్ రగడకోర్టు అనుమతితో చివరకు లాయర్ను ఏసీబీ విచారణకు వెంట తీసుకెళ్లిన కేటీఆర్గతంలో ఇచ్చినా..కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో.. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా(FEMA) ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై దర్యాప్తు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిల విచారణ పూర్తిగత వారమే కేటీఆర్ను విచారించాల్సి ఉండగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంతో గడువు కోరిన కేటీఆర్దీంతో ఇవాళ(జనవరి 16న) విచారణకు రమ్మని పిలిచిన ఈడీతప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
గాజా ఒప్పందం.. ఆఖరి నిమిషంలో కొర్రీలు!
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్థానీ ఘనంగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఆఖరి నిమిషయంలో ఇటు ఇజ్రాయెల్.. అటు హమాస్లు ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ(Ceasefire Deal) ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు తమ కేబినెట్ సమావేశం ప్రస్తుతానికి జరగట్లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అందుకు హమాస్ చివరి నిమిషంలో పెట్టిన కొర్రీలే కారణమని ఆరోపించింది. ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.చివరి నిమిషంలో హమాస్(Hamas) ఉగ్రసంస్థ ఒప్పందంలో మార్పులు సూచించడమే అందుకు కారణమని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయితే ఆ కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. హమాస్ మాత్రం మధ్యవర్తులు తెచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం. పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఖతార్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తొలి ఫేజ్లో భాగంగా.. గాజాలో తాము బంధీలుగా ఉంచిన 33 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తారు. దానికి ప్రతిగా తమ దేశ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా బంధీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ఇదీ చదవండి: గాజా శాంతి ఒప్పందం ఘనత ఎవరిదంటే..అయితే.. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ (Israel) గాజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రకటన వెలువడినప్పటి నుంచి జరిగిన దాడుల్లో 71 మంది మరణించినట్లు గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. పైగా ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని, పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా.. మరికొందరికి గాయాలైనట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ ఆదివారం(జనవరి 19) నుంచి మొదలుకావాల్సిన ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకునే అవకాశం లేకపోలేదు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 15 నెలల యుద్ధంలో 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తూ వచ్చాయి. అటు అమెరికా.. ఇటు ఈజిప్ట్,ఖతారులు కొన్ని నెలలుగా కాల్పుల విరమణ చర్చలు జరుపుతూ వచ్చాయి.ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్థానీ టెలివిజన్ ముఖంగా చేసిన ప్రకటనతో.. పాలస్తీనాలో సంబురాలు జరిగాయి. ఇటు గాజా సరిహద్దులో శరణార్థ శిబిరాల్లో ఉన్నవాళ్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా మానవతా ధృక్పథంతో ముందకు సాగాలని, గాజా కోలుకునేందుకు అవసరమైన సాయం కోసం ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. గాజా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందన్న పరిణామంపై భారత్ సహా పలుదేశాలు స్వాగతించాయి.
ఇలాంటి కెప్టెన్ను చూడలేదు: రోహిత్పై టీమిండియా స్టార్ కామెంట్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్(Akash Deep) ప్రశంసలు కురిపించాడు. తన కెరీర్లో ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదన్నాడు. అతడి సారథ్యంలో అరంగేట్రం చేయడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాలో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనన్న ఆకాశ్ దీప్.. నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు.ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రంబిహార్కు చెందిన ఆకాశ్ దీప్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆకాశ్.. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లిష్ జట్టుతో నాలుగో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. మూడు వికెట్లు తీశాడు.అనంతరం న్యూజిలాండ్తో సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ ఆకాశ్ దీప్ పాల్గొన్నాడు. ఆఖరి రెండు టెస్టులాడి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఆకాశ్ దీప్ ఎంపికయ్యాడు. పెర్త్, అడిలైడ్లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అతడికి ఆడే అవకాశం రాలేదు.బ్యాట్తోనూ రాణించిఅయితే, బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టులో మాత్రం మేనేజ్మెంట్ ఆకాశ్ దీప్నకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్లో అతడు మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాట్తోనూ రాణించాడు. పదకొండో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 31 పరుగులు చేసి.. ఫాలో ఆన్ గండం నుంచి టీమిండియాను తప్పించాడు.ఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఆకాశ్ దీప్.. రెండు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. అనంతరం గాయం కారణంగా సిడ్నీలో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాగా ఈ సిరీస్లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. ట్రోఫీని చేజార్చుకున్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం బ్యాటర్గా విఫలం కావడంతో పాటు కెప్టెన్గానూ సరైన వ్యూహాలు అమలుచేయలేకపోవడమే అంటూ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇలాంటి కెప్టెన్ను చూడలేదు‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ఆడే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతం. ప్రతి విషయాన్ని సరళతరం చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఇలాంటి కెప్టెన్ను చూడలేదు’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు. ఇక హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గంభీర్ సర్ కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే.. ఆటగాళ్లను మోటివేట్ చేస్తారు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా చేస్తారు’’ అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు.సంతృప్తిగా లేనుఅదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇండియాలో టెస్టు క్రికెట్ ఆడటం వేరు. ఇక్కడ పేసర్ల పాత్ర అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ.. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్గా మానసికంగా, శారీరకంగా మనం బలంగా ఉంటేనే రాణించగలం. అక్కడ ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ టూర్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
Central cabinet: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ (Central cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించింది. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ను నిర్మించనున్నారు. ఎన్జీఎల్వీ ప్రయోగాలకు ఉపయోగపడే విధంగా మూడో లాంచ్ ప్యాడ్ నిర్మించనున్నారు.కాగా, ప్రధాని మోదీ ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుండగా, ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానుంది. దీంతో వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. వేతనం సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన క్రమంలో త్వరలోనే కమిషన్ చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యుల నియామకం చేపట్టనుంది.ఇదీ చదవండి: కేంద్ర మంత్రికి మెటా క్షమాపణలు
ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేసిన సందర్బంగా వైఎస్ జగన్.. ఇస్రోను అభినందించారు.ఇస్రో(ISRO) విజయంపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయడం ద్వారా ఒక అద్భుతమైన మైలురాయిని సాధించారు. ఈ ముఖ్యమైన విజయం రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యకలాపాలకు కీలకమైన ముందడుగు వేస్తుంది. ఇస్రోకు అభినందనలు! అంటూ కామెంట్స్ చేశారు.The scientists at @isro have achieved a remarkable milestone with the successful docking of satellites in space. This significant accomplishment is a pivotal step forward for India’s ambitious space missions in the years ahead. Kudos to ISRO!— YS Jagan Mohan Reddy (@ysjagan) January 16, 2025ఇది కూడా చదవండి: ఇస్రో సరికొత్త చరిత్ర.. ఆ మూడు దేశాల సరసన నిలిచిన భారత్
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
సాక్షి, ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. రెండు పిటిషన్లను బీఆర్ఎస్ దాఖలు చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపు(Defections)పై రిట్ పిటిషన్ వేసింది. పోచారం, కాలె యాదయ్య, సంజయ్కుమార్, కృష్ణమోహన్రెడ్డి, మహిపాల్రెడ్డి, ప్రకాష్గౌడ్, గాంధీలపై రిట్ వేయగా, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ వేసింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఎస్ఎల్పీ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్పీకర్ కనీసం ఎమ్మెల్యేలకు నోటీసు ఇవ్వలేదని పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొంది. స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనర్హత పిటిషన్లపై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ కోరింది. కాగా, ప్రస్తుతం ఢిల్లీలోనే బీఆర్ఎస్ నేత హరీష్రావు ఉన్నట్లు సమాచారం.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది.. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. అయితే, మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది.2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం 38 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది. కాగా.. భద్రాచలం, బాన్సువాడ, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, జగిత్యాల, చేవెళ్ల, గద్వాల్, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్..
మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!
అత్యంత కాలం బతికిన శతాధిక వృద్ధులను చూస్తే..వారి ఆరోగ్య రహస్యం ఏంటని కుతూహలంగా ఉంటుంది. వారి దీర్ఘాయువుకి కారణం.. క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని క్లియర్గా స్పష్టమవుతోంది. ఇంతవరకు జపాన్, బ్రెజిల్లోని శతాధిక వృద్ధ మహిళలు, వారి హెల్త్ సీక్రెట్ల గురించి విన్నాం. ఇప్పుడు వారందర్నీ వెనక్కినెట్టి అత్యంత శతాధిక వృద్ధురాలికి నిలిచి ఆశ్చర్యపరుస్తోంది ఈ చైనా బామ్మ. అయితే ఈ బామ్మ ఇప్పటికీ తన పనులను తానే చేసుకుంటోందట. మిగతా శతాధిక వృద్ధ బామ్మల మాదిరిగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో జాయిన్ అవ్వకపోవడం విశేషం. అయితే ఈ బామ్మ ఆరోగ్య రహస్యం ఏంటో తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఆ బామ్మ ఎవరంటే..చైనా(China)కు చెందిన క్వి చైషి(Qiu Chaishi) అనే బామ్మ. ఆమె వలసవాద సెమీ ఫ్యూడల్ పాలనకు గుర్తుగా నాటి క్వింగ్ రాజవంశ పాలకుల హయాంలో 1901లో జన్మించింది. జనవరి 1న 124వ పుట్టిన రోజున జరుపుకుంది. అప్పుడే రుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న నాన్చాంగ్ నగరం అత్యంత శతాధిక వృద్ధులలో ఆమె కూడా ఒకరిగా క్విచైషి బామ్మను గుర్తించింది.ఆమెకు ఏకంగా 60 ఏళ్ల వయసున్న మనవరాలు ఉంది. తన తరంలోని అత్యంత చిన్న కుటుంబ సభ్యురాలు వయసు ఎనిమిది నెలల చిన్నారి అట. ఇక ఆమె సుదీర్ఠకాల ఆరోగ్యం రహస్యం ఏంటంటే..హెల్త్ సీక్రెట్..తన సుదీర్ఘకాల(Longevity) జీవన రహస్యం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని నమ్మకంగా చెబుతోంది. రోజూ మూడుపూటల భోజనం(Lard Rice) చేస్తుందట. అయితే భోజనం తర్వాత నడక(Walks) తప్పనిసరి అని చెబుతోంది క్విచైషి. అలాగే రాత్రి 8 కల్లా నిద్రపోతుందట. ఇప్పటకీ తన పనులన్నీ చకచక చేసుకుంటుందట. తల దువ్వుకోవడం దగ్గర నుంచి స్టవ్ వెలిగించడం, పెంపుడు జంతువులను పెంచడం, మెట్లు ఎక్కడం తదితర అన్ని పనులను సునాయాసంగా చేసేస్తుందట. తనకు ఇష్టమైన వంటకాల గురించి కూడా షేర్ చేసుకుంది. ఆమెకు గుమ్మడికాయ, శీతాకాలపు పుచ్చకాయ, మొక్కజొన్న పిండితో చేసే గంజి, పందికొవ్వు అంటే మహా ఇష్టమట. కానీ పంది కొవ్వుని మాత్రం వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకుంటున్నట్లు తెలిపింది. నిజంగా ఈ బామ్మ ఆరోగ్యపు అలవాట్లు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈ బామ్మ మాములు గ్రేట్ కాదు, అంతకు మించి అని ప్రశంసించకుండా ఉండలేం కదా..!.(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!)
Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై దాడి ఘటనలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసేందుకు వచ్చిన వ్యక్తి నిన్న రాత్రే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రంతా ఇంట్లోనే దాక్కున్న దొంగ తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించాడు. సైఫ్ అలీ ఖాన్ పిల్లల బెడ్రూమ్ దగ్గరే దుండగుడు పనిమనిషితో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది.ఆరుసార్లు పొడిచి..ఆ అలికిడి గమనించిన నటుడు దుండగుడిని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. ఈ సమయంలో దొంగ సైఫ్ అలీఖాన్ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు రెడీగా లేకపోవడంతో రక్తమోడుతున్న తండ్రిని ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan) ఆటోలో తీసుకెళ్లాడు. ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు.చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి!వెన్నెముకకు సర్జరీఅతడిని పరీక్షించిన వైద్యులు సైఫ్ వెన్నెముకలో కత్తి మొన విరిగినట్లు గుర్తించారు. వెన్నెముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి మొనను సర్జరీ ద్వారా తొలగించారు. మెడపై అయిన లోతైన గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.సీసీటీవీ ప్రకారం..సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. ఘటన జరగడానికి రెండు గంటల ముందు వరకు ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి దొంగ నిన్న రాత్రే ఇంట్లోకి చొరబడ్డాడని చెప్తున్నారు. దీంతో సైఫ్ శత్రువులు ప్లాన్ ప్రకారం అతడిపై దాడి చేయించారా? లేదా తెలిసినవాళ్లే ఈ పని చేయించారా? అని పలువురూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సైఫ్ అలీ ఖాన్ ఇటీవల నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరిస్తున్నాడు. తెలుగులో దేవర సినిమాలో విలన్గా నటించాడు.సైఫ్ వ్యక్తిగత విషయానికి వస్తే..సైఫ్ అలీ ఖాన్ 1991లో అమృతా సింగ్ను వివాహం చేసుకున్నాడు. వీరికి సారా, ఇబ్రహీం అని ఇద్దరు సంతానం. సైఫ్- అమృత 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్.. కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.చదవండి: బ్లాక్బస్టర్ పొంగల్.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే?
మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే వాటిలో పెన్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. పెన్షన్(Pension) లెక్కలకు సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలుంటాయి. ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే పెన్షన్ ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే వచ్చే పెన్షన్ అధికంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తక్కువ సర్వీసు ఉంటే తక్కువ పెన్షన్ అందుతుందని గుర్తుంచుకోవాలి.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను నిర్వహిస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలిసుండాలి.పెన్షన్కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు.పెన్షన్ విధానంలో కనీసం నెలవారీ మొత్తం రూ.1,000 అందుతుంది.గరిష్ఠంగా అందే పెన్షన్ రూ 7,500.ఎలా లెక్కిస్తారంటే..ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 58 ఏళ్లకు చేరుకుని ఉండాలి.పెన్షన్ తీసుకోవాలనుకునే సమయం నుంచి గత 60 నెలల సగటు జీతం (నెలకు గరిష్టంగా రూ.15,000)ను పరిగణనలోకి తీసుకుంటారు.ఈపీఎస్కు మీరు కంట్రిబ్యూషన్ చేసిన మొత్తం సంవత్సరాల సంఖ్యను పెన్షనబుల్ సర్వీసు అంటారు. కింది ఫార్ములా ఉపయోగించి పెన్షన్ లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = పెన్షనబుల్ జీతం(రూ.15,000కు మించకుండా 60 నెలల సరాసరి)×పెన్షనబుల్ సర్వీస్/70ఉదాహరణకు, మీ పెన్షనబుల్ జీతం రూ.15,000, పెన్షనబుల్ సర్వీస్ 10 సంవత్సరాలు అయితే నెలవారీ పెన్షన్ కింది విధంగా ఉంటుంది.నెలవారీ పెన్షన్=15,000×10/70=2,143ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలుపదేళ్లలో విభిన్న కంపెనీలు మారితే..పెన్షన్ పొందాలంటే పదేళ్లు ఒకే కంపెనీలో పని చేయాలనే నిబంధనేం లేదు. పదేళ్లలోపు ఈపీఎస్ సర్వీసు అందుబాటులో ఉన్న విభిన్న కంపెనీల్లో పని చేసినా పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. అయితే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) మాత్రం యాక్టివ్గా ఉండాలి. కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి. ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త యజమాన్యం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) బ్యాలెన్స్ మీ మునుపటి యజమాని వద్ద ఉంటుంది. అయినప్పటికీ సర్వీస్ వివరాలు బదిలీ చేస్తారు. దాంతో మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేస్తారు.
చెరువుల కబ్జాపై కన్నెర్ర!
మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!
మరోసారి రెచ్చిపోయిన కరుణ్ నాయర్.. ఈసారి..!
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
ఢిల్లీ కెప్టెన్గా రిషభ్ పంత్!.. కోహ్లి ఆడుతున్నాడా?
అవకాశాలు లేక కాదు, రాక కాదు.. అందుకే సినిమాలు తగ్గించా!
‘తాగు.. తిను.. ఊగు.. సంక్రాంతి పేరుతో కూటమి సర్కార్ దోపిడీ’
ఓటీటీకి సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
హీరోయిన్ రమ్యకృష్ణ ఫిట్నెస్ రహస్యం.. ఇప్పటికీ అదే ఫాలో అవుతూ!
రియల్మీ కొత్త ఫోన్లు.. అదిరిపోయే కలర్ ఛేంజింగ్ ఫీచర్తో..
పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
దేశంలో ఓటేసిన మహిళలు 25శాతం
రొడ్డకొట్టుడు సినిమాలవి:పుష్ప2, టాలీవుడ్పై హృతిక్ తండ్రి విసుర్లు!
కూటమి జాతీయస్థాయి మాత్రం కోల్పోకుండా కాపాడుకోవాలి సార్!
Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ
10 కిలోమీటర్లు.. 32 నిమిషాలు
డెలివరీ తర్వాత వీల్చైర్కు పరిమితం.. జీవితాంతం ఇంజక్షన్స్..!
మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో
ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!
నమ్మించి నట్టేట ముంచిన కండక్టర్
చెరువుల కబ్జాపై కన్నెర్ర!
మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!
మరోసారి రెచ్చిపోయిన కరుణ్ నాయర్.. ఈసారి..!
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
ఢిల్లీ కెప్టెన్గా రిషభ్ పంత్!.. కోహ్లి ఆడుతున్నాడా?
అవకాశాలు లేక కాదు, రాక కాదు.. అందుకే సినిమాలు తగ్గించా!
‘తాగు.. తిను.. ఊగు.. సంక్రాంతి పేరుతో కూటమి సర్కార్ దోపిడీ’
ఓటీటీకి సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
హీరోయిన్ రమ్యకృష్ణ ఫిట్నెస్ రహస్యం.. ఇప్పటికీ అదే ఫాలో అవుతూ!
రియల్మీ కొత్త ఫోన్లు.. అదిరిపోయే కలర్ ఛేంజింగ్ ఫీచర్తో..
పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
దేశంలో ఓటేసిన మహిళలు 25శాతం
రొడ్డకొట్టుడు సినిమాలవి:పుష్ప2, టాలీవుడ్పై హృతిక్ తండ్రి విసుర్లు!
కూటమి జాతీయస్థాయి మాత్రం కోల్పోకుండా కాపాడుకోవాలి సార్!
Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ
10 కిలోమీటర్లు.. 32 నిమిషాలు
డెలివరీ తర్వాత వీల్చైర్కు పరిమితం.. జీవితాంతం ఇంజక్షన్స్..!
మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో
ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!
నమ్మించి నట్టేట ముంచిన కండక్టర్
సినిమా
రామ్ చరణ్తో బుచ్చిబాబు సినిమా.. జగపతి బాబు లుక్ చూశారా?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో చెర్రీ నటించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. షూట్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూట్కు సంబంధించిన వీడియోను ట్విటర్ షేర్ చేశారు.ఈ చిత్రంలో తన పాత్ర కోసం మేకోవర్ చేస్తున్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సీ 16 కోసం మంచి పని పెట్టాడు..గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది'అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆర్సీ16గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాను బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతమందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025
సంక్రాంతి రభస: మోహన్బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు
తన అభిమానులపై దాడి చేయించినందుకుగానూ తండ్రి మోహన్బాబు (Mohan Babu), సోదరుడు విష్ణుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచు మనోజ్ (Manchu Manoj) జనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా కూతురు పుట్టాక వచ్చిన మొదటి పండగకు కూడా ఇంటికి రానివ్వడం లేదు. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. మా ఇంటి విషయాన్ని ఎవరితో చర్చించడం నాకు ఇష్టం ఉండదు. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లాను. కానీ మా కుటుంబ విషయాలేవీ ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు అన్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత మనోజ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కడుపులో ఎడమవైపు నొప్పి రావడంతో పోలీస్ స్టేషన్ వెనక కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.ఏం జరిగిందంటే? మనోజ్, భార్య మౌనికతో కలిసి బుధవారం నాడు తిరుపతికి వెళ్లాడు. నారావారిపల్లెకు వెళ్లి మంత్రి నారా లోకేశ్తో 25 నిమిషాలపాటు భేటీ అయ్యాడు. అనంతరం శ్రీవిద్యానికేతన్ స్కూల్కు 200 మందితో ర్యాలీగా వెళ్లాడు. అప్పటికే సిబ్బంది గేట్లు మూసివేయగా పోలీసులు భారీగా మెహరించారు. ఆయన స్కూల్ లోపలకు వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు కోర్టు ఉత్తర్వులను చూపించారు.సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా..?పండుగ పూట తాత, నానమ్మల సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా అని మనోజ్ అసహనం వ్యక్తం చేశాడు. తనను అనుమతించకపోతే రోడ్డుపై బైఠాయిస్తానన్నాడు. మోహన్బాబు యూనివర్సిటీ సమీపంలోని డెయిరీ వద్దకు భార్యతో కలిసి వెళ్లాడు మనోజ్. అక్కడ అతడి అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసరడంతో వారిపై మోహన్బాబు బౌన్సర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ మనోజ్.. భార్యతో కలిసి నానమ్మ, తాతల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు.చదవండి: మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో
Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై దాడి ఘటనలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసేందుకు వచ్చిన వ్యక్తి నిన్న రాత్రే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రంతా ఇంట్లోనే దాక్కున్న దొంగ తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించాడు. సైఫ్ అలీ ఖాన్ పిల్లల బెడ్రూమ్ దగ్గరే దుండగుడు పనిమనిషితో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది.ఆరుసార్లు పొడిచి..ఆ అలికిడి గమనించిన నటుడు దుండగుడిని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. ఈ సమయంలో దొంగ సైఫ్ అలీఖాన్ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు రెడీగా లేకపోవడంతో రక్తమోడుతున్న తండ్రిని ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan) ఆటోలో తీసుకెళ్లాడు. ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు.చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి!వెన్నెముకకు సర్జరీఅతడిని పరీక్షించిన వైద్యులు సైఫ్ వెన్నెముకలో కత్తి మొన విరిగినట్లు గుర్తించారు. వెన్నెముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి మొనను సర్జరీ ద్వారా తొలగించారు. మెడపై అయిన లోతైన గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.సీసీటీవీ ప్రకారం..సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. ఘటన జరగడానికి రెండు గంటల ముందు వరకు ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి దొంగ నిన్న రాత్రే ఇంట్లోకి చొరబడ్డాడని చెప్తున్నారు. దీంతో సైఫ్ శత్రువులు ప్లాన్ ప్రకారం అతడిపై దాడి చేయించారా? లేదా తెలిసినవాళ్లే ఈ పని చేయించారా? అని పలువురూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సైఫ్ అలీ ఖాన్ ఇటీవల నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరిస్తున్నాడు. తెలుగులో దేవర సినిమాలో విలన్గా నటించాడు.సైఫ్ వ్యక్తిగత విషయానికి వస్తే..సైఫ్ అలీ ఖాన్ 1991లో అమృతా సింగ్ను వివాహం చేసుకున్నాడు. వీరికి సారా, ఇబ్రహీం అని ఇద్దరు సంతానం. సైఫ్- అమృత 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్.. కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.చదవండి: బ్లాక్బస్టర్ పొంగల్.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే?
‘‘మోస్ట్ అవైటెడ్ మూవీ’’లో ప్రభాస్ సినిమాలకి టాప్ ప్లేస్
ఒక ఏడాదిలో విడుదలైన సినిమాల నుంచి ప్రేక్షకాదరణను అనుసరించి టాప్ హిట్స్, టాప్ ఫ్లాప్స్ అంటూ జాబితాలు ప్రకటించడం మామూలే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను తాజాగా ప్రకటించింది. సినిమాలు, టీవీ షోలు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి పేజ్కి ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకులున్నారు. తమ వీక్షకుల ద్వారా ఈ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వాటిలో నెం.1గా నిలిచింది సికందర్.ఐఎండిబి విడుదల చేసిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ను పరిశీలిస్తే...1. సికందర్, 2. టాక్సిక్,3. కూలీ,4. హౌస్ ఫుల్ 5. బాఘీ, 6.రాజా సాబ్, 7. వార్ 2 8. ఎల్2: ఎంపురాన్ 9. దేవా 10. చావా 11. కన్నప్ప 12. రెట్రో 13. థగ్ లైఫ్ 14. జాట్ 15. స్కై ఫోర్స్ 16. సితారే జమీన్ పర్ 17. థామా 18. కాంతారా ఏ లెజెండ్: చాప్టర్ 1 , 19. ఆల్ఫా 20. తండెల్ఈ జాబితాలోని 20 టైటిల్స్ లో 11 హిందీ సినిమాలు, మూడు తమిళ, తెలుగు, రెండు కన్నడ, ఒకటి మలయాళ సినిమా కావడం గమనార్హం. హౌస్ ఫుల్ 5 (నెం.4), కన్నప్ప (నెం.11), స్కై ఫోర్స్ (నెం.15) వంటి మూడు చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించగా, రష్మిక మందన్న3 సినిమాలు సికందర్ (నెం.1), చావా (నెం.10), థమా (నెం.17)లలో, మోహన్ లాల్, ప్రభాస్, పూజా హెగ్డే, కియారా అద్వానీ లు రెండేసి చిత్రాల్లో నటిస్తున్నారు.నెంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది...మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్లో నెం.1 గా నిలిచినందుకు సికందర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘2025 ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో సికందర్ అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతని ఎనర్జీ, అంకితభావం సికందర్ సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా తీర్చిదిద్దాయి. అందుకు సహకరించిన నిర్మాత సాజిద్ నదియాడ్ వాలాకు ధన్యవాదాలు. సికిందర్ లో ప్రతి సన్నివేశం చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దాం. ప్రేక్షకులతో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్ చేయడం కోసం నేను మనస్పూర్తిగా పనిచేశాను’’ అంటూ చెప్పారు.
న్యూస్ పాడ్కాస్ట్
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
మహా కుంభమేళాకు తరలివస్తున్న అశేష జనవాహిని.. రెండ్రోజుల్లో రెండున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
తిరుపతి తొక్కిసలాట ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపణ
తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం
హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ, శిక్షేమీ విధించడం లేదు... న్యూయార్క్ కోర్టు తీర్పు
ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనలో చంద్రబాబే మొదటి ముద్దాయి, తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట... ఆరుగురు భక్తులు మృతి, 40 మందికి గాయాలు
ఆరోగ్యశ్రీ పథకంపై ఎందుకింత కక్ష?... చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
పింఛన్ పొందుతున్న లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపు. భార్యను పోగొట్టుకుని ఇప్పటికీ పెన్షన్ రాకున్నా భర్తకు మొండిచెయ్యే
క్రీడలు
టీమిండియా బ్యాటింగ్ కోచ్గా కేపీ..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బ్యాటర్ల ఘోర వైఫల్యం నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి క్రిక్బజ్లో ఓ నివేదిక వచ్చింది. ఇందులో బీసీసీఐ భారత బ్యాటింగ్ విభాగంలో సహాయక సిబ్బందిని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు పేర్కొని ఉంది. ఈ అంశాన్ని ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. భారత శిబిరంలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.🚨 BATTING COACH FOR INDIA. 🚨- The BCCI exploring possibilities to add a batting coach to India's coaching staff. (Cricbuzz). pic.twitter.com/mIRTwPDxOX— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 202544 ఏళ్ల కెవిన్ పీటర్సన్కు అద్భుతమైన బ్యాటర్గా పేరుంది. సౌతాఫ్రికాలో పుట్టిన కెవిన్.. 2004-2014 మధ్యలో మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లండ్ తరఫున 104 టెస్ట్లు ఆడిన కేపీ.. 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 47.3 సగటున 8181 పరుగులు చేశాడు.తన కెరీర్లో 136 వన్డేలు ఆడిన కేపీ 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 40.7 సగటున 4440 పరుగులు చేశాడు. టీ20ల్లోనూ మంచి రికార్డు కలిగిన కేపీ.. 37 మ్యాచ్ల్లో 141.5 స్ట్రయిక్రేట్తో 1176 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన కేపీ మూడు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు తీశాడు.2009 నుంచి 2016 వరకు ఐపీఎల్ ఆడిన కేపీ వివిధ ఫ్రాంచైజీల తరఫున 36 మ్యాచ్లు ఆడి 134.7 స్ట్రయిక్రేట్తో 1001 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేపీ తన ఐపీఎల్ కెరీర్లో ఏడు వికెట్లు కూడా తీశాడు.రిటైర్మెంట్ అనంతరం కేపీ వివిధ క్రికెట్ లీగ్ల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ (2010-11) సొంతం చేసుకున్న బృందంలో కేపీ కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2012-13 భారత పర్యటనలోనూ కేపీ ఇరగదీశాడు. దూకుడు స్వభావం కలిగిన కేపీ తన కెరీర్లో ఎన్నో వివాదాల్లో తల దూర్చాడు. వివాదాలు ఎలా ఉన్నా కేపీ అన్నింటికీ బ్యాట్తో సమాధానం చెప్పేవాడు.కాగా, ప్రస్తుతం భారత కోచింగ్ బృందంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. గౌతమ్ గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తుండగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్గా, టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్గా సేవలందిస్తున్నారు. ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. భారత జట్టుకు ప్రత్యేకించి బ్యాటింగ్ కోచ్ లేడు. ఈ స్థానం కోసం ఎవరైనా అనుభవజ్ఞుడిని ఎంచుకుంటే టీమిండియాకు మేలు చేకూరే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత్ ఆతర్వాత దారుణంగా విఫలమై మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)
BCCI: అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!.. వారి మ్యాచ్ ఫీజులలో కోత?!
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆటగాళ్ల పట్ల కఠిన వైఖరి అవలంబించనున్నట్లు తెలుస్తోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఇచ్చిన నివేదిక మేరకు కఠినమైన నిబంధనలు తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం.ముఖ్యంగా ఆటలో భాగంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడం, టూర్ ఆసాంతం వారిని అట్టిపెట్టుకుని ఉండటం ఇకపై కుదరదని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న భారత జట్టు.. వన్డే, టెస్టుల్లో మాత్రం ఇటీవలి కాలంలో ఘోర పరాభవాలు చవిచూసింది.ఘోర ఓటములుశ్రీలంక పర్యటనలో భాగంగా గతేడాది వన్డే సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది. అనంతరం.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆసీస్కు కోల్పోవడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో ఇంటాబయట టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ టూర్ తర్వాత బీసీసీఐ హెడ్కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.క్రమశిక్షణ లేదు.. అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!ఈ రివ్యూ మీటింగ్లో చర్చకు వచ్చిన అంశాల గురించి బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం.. ‘‘సమీక్షా సమావేశం(BCCI Review Meeting)లో గౌతం గంభీర్ ప్రధానంగా.. ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం గురించి ప్రస్తావించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ సమయంలో డ్రెసింగ్రూమ్లో అసలు సానుకూల వాతావరణం కనిపించలేదు. అందుకే.. ప్రి-కోవిడ్ నిబంధనలను తిరిగి తీసుకురానున్నారు. ఇకపై విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు.. వారితో కేవలం రెండు వారాలు మాత్రమే గడిపే వీలుంటుంది. 45 రోజుల పాటు టూర్ సాగినా వారు రెండు వారాల్లోనే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఈ విషయంలో ఆటగాళ్లతో పాటు కోచ్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.వారి మ్యాచ్ ఫీజులలో కోత?ఇక ఓ సీనియర్ ఆటగాడు కూడా గంభీర్, అగార్కర్తో కలిసి రివ్యూ మీటింగ్లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఫీజులను వెంటనే ఆటగాళ్లకు పంచేయకూడదని అతడు ఓ సలహా ఇచ్చాడు. ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించాలని సూచించాడు.కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్తో పాటు.. జాతీయ జట్టు విధుల పట్ల కూడా నిబద్ధత కనబరచడం లేదన్న విషయాన్ని తాను గమనించినట్లు తెలిపాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. ప్రధాన బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా విఫలమయ్యాడు. వీరిద్దరి వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో రోహిత్ తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు ముంబై తరఫున రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, కోహ్లి మాత్రం రంజీల్లో ఆడే విషయమై ఇంత వరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కు సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై తరఫున, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్ ఆడేందుకు సమాయత్తమవుతున్నారు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
సైకాలజీ స్టూడెంట్ ఇప్పుడు టీమిండియా తరఫున సత్తా చాటుతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆరో ఇన్నింగ్స్లోనే ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత మహిళా క్రికెట్ జట్టులోకి దూసుకువచ్చిన ఆ యువ కెరటం మరెవరో కాదు.. ప్రతీకా రావల్(Pratika Rawal).యువ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్టర్లు ప్రతీకా రావల్కు పిలుపునిచ్చారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న 24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో ఆడిన తొలి నాలుగు వన్డేల్లోనే రెండు అర్ధ శతకాలతో మెరిసింది.వరల్డ్ రికార్డు బద్దలుతాజాగా ఐర్లాండ్తో వన్డే సిరీస్(India Women Vs Ireland Women) జట్టులోనూ చోటు దక్కించుకున్న ప్రతీకా రావల్.. మూడు మ్యాచ్లలోనూ అదరగొట్టింది. తొలి వన్డేలో 89, రెండో వన్డేలో 67 పరుగులు సాధించిన ప్రతీకా.. బుధవారం నాటి మూడో వన్డేలో భారీ శతకంతో అదరగొట్టింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 154 పరుగులు సాధించింది.ఈ క్రమంలో ప్రతీకా రావల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. ప్రతీకా రావల్ భారత్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (154)ను సాధించింది. దీప్తి శర్మ (188), హర్మన్ప్రీత్ (171 నాటౌట్) ఆమెకంటే ముందున్నారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు👉ప్రతీకా రావల్(ఇండియా)- 444 పరుగులు👉చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్)- 434 పరుగులు👉నథాకన్ చాంథమ్(థాయ్లాండ్)- 322 పరుగులు👉ఎనిడ్ బేక్వెల్(ఇంగ్లండ్)- 316 పరుగులు👉నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)- 307 పరుగులు.అతిపెద్ద వన్డే విజయంరాజ్కోట్ వేదికగా ఐర్లాండ్తో మూడో వన్డేలో భారత ఓపెనర్లు ప్రతీక రావల్(154), స్మృతి మంధాన(135) శతకాలతో చెలరేగారు. వీరిద్దరికి తోడు రిచా ఘోష్ హాఫ్ సెంచరీ(59)తో రాణించింది. ఈ క్రమంలో భారత జట్టు 435 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది. పురుషులు, మహిళల వన్డే క్రికెట్లో భారత్కు ఇదే అతిపెద్ద స్కోరు. ఓవరాల్గా మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. టాప్–3 అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్ (491/4; 2018లో ఐర్లాండ్పై; 455/5; 1997లో పాక్పై; 440/3; 2018లో ఐర్లాండ్పై) పేరిటే ఉండటం విశేషం.ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 304 పరుగులతో ఐర్లాండ్పై టీమిండియా జయభేరి మోగించింది. పరుగుల తేడా పరంగా భారత మహిళా జట్టుకిదే అతిపెద్ద విజయం. 2017లో భారత్ 249 పరుగుల తేడాతో ఐర్లాండ్నే ఓడించింది. ఇక ఈ గెలుపుతో 3–0తో వన్డే సిరీస్ను స్మృతి బృందం క్లీన్స్వీప్ చేసింది. అదే విధంగా.. భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్స్వీప్ చేయడం ఇది 13వసారి. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన రికార్డు ఆస్ట్రేలియా (33 సార్లు) పేరిట ఉంది. ఇక.. ఐర్లాండ్తో ఇప్పటి వరకు ఆడిన 15 వన్డేల్లోనూ భారత జట్టే గెలవడం మరో విశేషం.చదవండి: ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్A post-series chat with the record-breaking opening duo! 😎From Maiden ODI century to Fastest ODI Hundred for India in women's cricket 💯Captain Smriti Mandhana and Pratika Rawal 𝙚𝙡𝙖𝙗𝙤𝙧𝙖𝙩𝙚 it all 😃👌 - By @mihirlee_58 #TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/7c0xsYGaIo— BCCI Women (@BCCIWomen) January 16, 2025
ఆర్సీబీలోకి ఇంగ్లండ్ ఆల్రౌండర్
ఇంగ్లండ్ ఆల్రౌండర్ ఛార్లీ డీన్ మహిళల ఆర్సీబీ జట్టుకు ఎంపికైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఆల్రౌండర్ సోఫీ మోలినెక్స్ గాయపడటంతో ఆమె స్థానంలో ఛార్లీ డీన్ ఆర్సీబీలోకి వచ్చింది. డీన్ను ఆర్సీబీ 30 లక్షలకు సొంతం చేసుకుంది. మోకాలి గాయం కారణంగా మోలినెక్స్ డబ్ల్యూపీఎల్ తదుపరి ఎడిషన్కు (2025) దూరం కానుందని ఆర్సీబీ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్గా ఉంది. గత ఎడిషన్ ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.మోలినెక్స్: లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన మోలినెక్స్ ఆసీస్ తరఫున 3 టెస్ట్లు, 13 వన్డేలు, 28 టీ20లు ఆడింది. మోలినెక్స్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 71 వికెట్లు (టెస్ట్ల్లో 7, వన్డేల్లో 23, టీ20ల్లో 41 వికెట్లు) తీసింది.ఛార్లీ డీన్: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన డీన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్లు, 39 వన్డేలు, 36 టీ20లు ఆడింది. ఇందులో మొత్తంగా 122 వికెట్లు (టెస్ట్ల్లో 7, వన్డేల్లో 69, టీ20ల్లో 46 వికెట్లు) తీసింది.కాగా, మహిళల ఐపీఎల్ ఇప్పటివరకు రెండు ఎడిషన్ల పాటు విజయవంతంగా సాగింది. తొలి ఎడిషన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్లో ఆర్సీబీ ఛాంపియన్గా నిలిచింది. మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకు జరుగనుంది. 2025 డబ్ల్యూపీఎల్ మొత్తం నాలుగు వేదికల్లో జరుగనుంది. బెంగళూరు, లక్నో, ముంబై, వడోదరాలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు జరుగనున్నాయి. తదుపరి సీజన్కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.డబ్ల్యూపీఎల్-2025లో పాల్గొనే జట్లు, ఆటగాళ్ల వివరాలు..ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా రోడ్రిగెజ్, మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ, స్నేహ దీప్తి, తనియా భాటియా, సారా బ్రైస్, నందిని కశ్యప్, అలైస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్ల్యాండ్, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసెన్, మారిజన్ కాప్, మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, నికీ ప్రసాద్, నల్లపురెడ్డి చరణి, టిటాస్ సాధుగుజరాత్ జెయింట్స్: భారతి ఫుల్మలి, లారా వోల్వార్డ్ట్, ఫోబ్ లిచ్ఫీల్డ్, ప్రియా మిశ్రా, సిమ్రన్ షేక్, బెత్ మూనీ, ఆష్లే గార్డ్నర్, దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, సయాలి సత్గరే, తనూజా కన్వర్, డేనియల్ గిబ్సన్, డియండ్రా డొట్టిన్, కష్వీ గౌతమ్, మన్నత్ కశ్యప్, మేఘనా సింగ్, షబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా, కమలిని, అమన్దీప్ కౌర్, అమన్జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, కీర్తన బాలకృష్ణన్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సజనా, అక్షిత మహేశ్వరి, సంస్కృతి గుప్త, నదినే డి క్లెర్క్, సైకా ఇషాఖీ, షబ్నిమ్ ఇస్మాయిల్ఆర్సీబీ: డేనియల్ వ్యాట్ హాడ్జ్, సబ్బినేని మేఘన, స్మృతి మంధన, రిచా ఘోష్, ఆశా శోభన, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, కనిక అహుజా, శ్రేయాంక పాటిల్, సోఫీ డివైన్, జోషిత, ప్రేమా రావత్, రాఘవి బిస్త్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, రేణుకా సింగ్, జాగ్రవి పవార్, ఛార్లీ డీన్యూపీ వారియర్జ్: కిరణ్ నవ్గిరే, శ్వేతా సెహ్రావత్, వృందా దినేశ్, ఆరూషి గోయల్, అలైసా హీలీ, చమారీ ఆటపట్టు, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్గ్రాత్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్, అంజలి శర్వాని, గౌహెర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అలానా కింగ్
బిజినెస్
పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు
పాలసీబజార్(Policybazaar) మాతృసంస్థ పీబీ ఫిన్టెక్ గురుగ్రామ్ కార్యాలయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) సోదాలు నిర్వహించింది. పాలసీబజార్ ఆఫ్లైన్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగమైన పీబీ పార్టనర్స్తో కలిసి కొందరు విక్రేతల ద్వారా పన్ను ఎగవేతకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. దాంతో జీఎస్టీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.ఈ సోదాల్లో భాగంగా అధికారులు కంపెనీ ఆవరణలోని డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జీఎస్టీ ఫైలింగ్లో వ్యత్యాసాలు, ఎగవేతలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సోదాలపై పీబీ ఫిన్టెక్ స్పందించింది. జీఎస్టీ అధికారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించినట్లు, తదుపరి ఏవైనా సమాచారం కావాల్సి వచ్చినా పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. ఈ సోదాల వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ పైసాబజార్ను కూడా నిర్వహిస్తోంది. ఈ సోదాలకు సంబంధించి జీఎస్టీ అధికారిక వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: హిండెన్బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?తనిఖీలు ఎందుకు..?పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి, ఏదైనా పన్ను ఎగవేతను కనుగొనడానికి జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తూంటారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఫ్రేమ్వర్క్ కింద ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ఈ సోదాలు చేస్తారు. అయితే ఇలా నిర్వహించే సోదాలకు చాలా కారణాలున్నాయి. జీఎస్టీ ఫైలింగ్లో వ్యత్యాసాలను గుర్తించడానికి, పన్ను ఎగవేతను వెలికితీయడానికి ఇవి సహాయపడతాయి. తనిఖీల సమయంలో మోసపూరిత కార్యకలాపాలను సూచించే పత్రాలు, రికార్డులు, ఇతర సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. పన్నులు ఎగవేయాలని భావించే వ్యాపారాలు, వ్యక్తులకు ఈ తనిఖీలు అడ్డంకిగా మారుతాయి.
పుంజుకుంటున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు లాభపడి 23,320కు చేరింది. సెన్సెక్స్(Sensex) 285 పాయింట్లు ఎగబాకి 77,006 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.04 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.34 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.65 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.83 శాతం లాభపడింది. నాస్డాక్ 2.45 శాతం ఎగబాకింది.రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
హిండెన్బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?
అదానీ గ్రూప్, నికోలా వంటి కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నోట్లో ఈమేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. సంస్థ మూసివేతకు సంబంధించి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.. అనే దానిపై అండర్సన్ నోట్లో వివరాలు తెలియజేశారు.‘సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా నా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాను. చాలా చర్చలు జరిగిన తర్వాతే సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నాను. మేము తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, వ్యక్తిగత అంశాలు లేవు. హిండెన్బర్గ్ నా జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏ మాత్రం తొనకకుండా సంస్థను నిర్వహించాను. ఈ వ్యవహారం అంతా నాకో ప్రేమకథలా తోస్తుంది. కంపెనీ స్థాపించడానికి ముందు నన్ను నేను నిరూపించుకోవాలని ఎంతో కష్టపడేవాడిని. ప్రస్తుతం కంఫర్ట్ జోన్లో ఉన్నానని అనిపిస్తోంది. ఇకపై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతాను. నా బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావంహిండెన్బర్గ్ గురించి..నాథన్ అండర్సన్ 2017లో దీన్ని స్థాపించారు. యూఎస్కు చెందిన ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్ సంస్థగా, ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. 2023లో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్స్లో మోసం చేసిందని హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికతో కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు)కు పైగా తుడిచిపెట్టుకుపోయింది. 2020లో నికోలా తన సాంకేతికతను ఉపయోగించి పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. హిండెన్బర్గ్ రద్దు చేయడానికి ముందు పోంజీ పథకాల నివేదికలతో సహా తన తుది దర్యాప్తులను పూర్తి చేసినట్లు తెలిపింది. అండర్సన్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావం
అమెరికా కొత్తగా ఆంక్షలు విధించినప్పటికీ మరో రెండు నెలల పాటు రష్యా నుంచి చమురు(Crude Oil) సరఫరాకి సమస్యేమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 12 వరకు అమలయ్యే కాంట్రాక్టులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలిపాయి. ఆ తర్వాత నుండి వర్తించే కాంట్రాక్టులపైన కూడా ప్రభావం పడకుండా రష్యా ఈలోగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందని వివరించాయి. భారత్ తదితర దేశాలకు చమురును చేరవేస్తున్న రెండు రష్యా సంస్థలపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.ఆంక్షలు ఎదుర్కొంటున్న రెండు సంస్థల్లో ఒకటి మాత్రమే కాస్త చెప్పుకోతగ్గ స్థాయిలో సరఫరా చేస్తుండగా రెండో దాన్నుంచి నామమాత్రంగానే ఉంటోందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. భారత్కు సరఫరా చేసే ఇతర రష్యన్ సంస్థలు, ట్రేడర్లపై ఆంక్షలు లేవని పేర్కొన్నారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశాన్ని ఆర్థికంగా కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు చమురు సరఫరాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో భారత్ తదితర దేశాలకు రష్యా చమురు సరఫరా చేస్తోంది.ఇదీ చదవండి: డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం అప్గాజ్ ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్నెఫ్టెగాస్తో సహా రష్యా చమురు ఉత్పత్తిదారులపై, రష్యన్ చమురును రవాణా చేసే సుమారు 180 ట్యాంకర్లపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భవిష్యత్తులో రష్యా ముడిచమురు దిగుమతుల్లో 15 శాతం భారత్పై ప్రభావం పడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా క్రూడ్ సరఫరాకు తక్షణ ముప్పు లేనప్పటికీ, ఆంక్షలు సరుకు రవాణా ఖర్చులను పెంచుతాయని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే చమురును మరింత ఖరీదవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రిఫైనరీలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూఎస్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
ఫ్యామిలీ
లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!
గయాసురుడు... పేరుకే అసురుడు కానీ ఎంతో మంచి మనసున్న దైవభక్తి పరాయణుడు. అతడొకసారి విష్ణువును గురించి గొప్ప తపస్సు చేసి, తనను తాకిన వారికి మోక్షం లభించే విధంగా వరం పొందాడు. తన శక్తితో శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పు విస్తరించి, జీవించసాగాడు. దాంతో ప్రతివారూ గయుణ్ణి తాకి మోక్షం ΄పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోవడంతో ఇంద్రుడికి, యమధర్మరాజుకు పని లేకుండా పోయింది. దాంతో వారిద్దరూ కలిసి బ్రహ్మవద్దకు వెళ్లి, ఈ విషయాన్ని గురించి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ వైచిత్రి గురించి త్రిమూర్తులు పరిపరివిధాలుగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇంద్రుడు గయాసురుడి వద్దకెళ్లాడు. ‘‘గయాసురా! లోకకల్యాణం కోసం మేమంతా కలసి ఒక యజ్ఞం చేయదలచుకున్నాము. ఆ యజ్ఞాన్ని చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషించగా పరమ పవిత్రమైన నీ శరీరమే అందుకు తగినదనిపించింది. కనుక నీవు అనుమతిస్తే, నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాము’’ అని అడిగాడు ఇంద్రుడు. గయాసురుడు అందుకు ఆనందంగా అంగీకరించి, తన శరీరాన్ని పెంచి ఉత్తరదిశగా తలను ఉంచి పడుకున్నాడు. సకల దేవతలు, రుషులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా, బ్రహ్మదేవుడు యజ్ఞం ఆరంభించాడు. అయితే, యజ్ఞంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నితత్వాన్ని తట్టుకోలేక గయుడి తల కదలడం ప్రారంభించింది. బ్రహ్మ సూచన మేరకు ‘దేవవ్రత’ అనే శిలను గయుడి తల మీద ఉంచి, ఆ శిలమీద విష్ణువు నిల్చున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞవేడిమిని, తన భారాన్ని మౌనంగా భరిస్తున్న గయాసురుడిని చూసి హృదయం ద్రవించిపోయిన విష్ణువు ‘‘వత్సా! ఏదైనా వరాన్ని కోరుకో’’ అని అడిగాడు. అందుకు గయాసురుడు ‘‘దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్ల, అంతకన్నా పరమ పవిత్రమైన నీ పాదధూళి సోకడం వల్ల నా జన్మ ధన్యమైంది. నేను ఇంతకుముందు నేను కోరుకున్న వరం ఎంతో అనుచితమైనదైనప్పటికీ, మీ భక్తుడినైన నన్ను సంహరించలేక, ఈ విధంగా చేశారని నాకు అర్థమైంది. అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ అని కోరుకున్నాడు. నిష్కల్మషమైన హృదయంతో గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు అనుగ్రహించాడు. గయుడి శరీరాన్ని ఉంచిన ప్రదేశమే గయ. పాదాలను ఉంచిన ప్రదేశం పాదగయ. రాక్షసుడైనప్పటికీ, లోకహితం కోరుకున్న గయుడు ధన్యుడైనాడు. ‘‘నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ దాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ – డి.వి.ఆర్(చదవండి: ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి)
పెళ్ళి ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?
ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదని శాస్త్రం చెప్తుంది.కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నాఇంకేం కావాలి. ఇదీ చదవండి: గృహిణి అంత చులకనా? అందుకే ఇలా చేశా!‘సీతారాముల్లా ఉండండి!‘ అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు! అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది. తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? ‘పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!‘ అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.
గృహిణి అంత చులకనా? అందుకే ఇలా చేశా!
‘కలలు కనడం మానవద్దు. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడాలని మరువద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆశలకలను త్యాగం చేయవద్దు’ అంటోంది అరుణా విజయ్. తోటి గృహిణులకు ఆమె ఇస్తున్న సందేశం ఇది. గృహిణి అంటే ఏ పనీ రానివాళ్లనే అపోహతో కూడిన వెక్కిరింతకు చెంప చెళ్లుమనిపించింది అరుణ. ఏ సోషల్మీడియా అయితే ఆమెను తక్కువ చేసి మాట్లాడిందో అదే సోషల్ మీడియాలో ఇప్పుడామె ఒక ఇన్ఫ్లూయెన్సర్. మాస్టర్ షెఫ్ టాప్ 4 గా నిలిచి ప్రశంసలందుకుంటోంది. ఆమె వంటలకు వ్యూస్, లైక్స్తో విజేతగా నిలిచింది. అపోహ తొలగింది! చెన్నైలో పుట్టి పెరిగిన అరుణ 22 ఏళ్లకు పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితమైంది. పదిహేనేళ్ల వయసు నుంచే వంటగదిలో ప్రయోగాలు చేసిన అరుణ భార్యగా, తల్లిగా ఇంటి బాధ్యతల నిర్వహణలో విజయవంతమైన మహిళ అనే చెప్పాలి. ఆమెది ఉద్యోగం చేసి డబ్బు సం పాదించాల్సిన అవసరం లేని జీవితమే. కానీ గృహిణి అనగానే తేలిగ్గా పరిగణించే సమాజం ఆమెకు చేసిన గాయాలెన్నో. తాను ఏదో ఒకటి సాధించాలనే కోరిక రగులుతూనే ఉండేదామెలో. ఆ కోరికే ఆమెను మాస్టర్ షెఫ్ ఇండియా 2023పోటీలకు తీసుకెళ్లింది. పోటీదారుల మీద రకరకాల కామెంట్లు రువ్విన సోషల్ మీడియా అరుణను ‘ఈవిడా... ఈవిడ గృహిణి’ అంటూ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదనే భావంతో తేలిక చేసింది. మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్లలో అరుణకు ఎదురైన చేదు అనుభవం ఇది. దక్షిణ భారత వంటలు ఇడ్లీ, దోశెలతో ఆమె ప్రయోగాలు న్యాయనిర్ణేతల నోట్లో నీళ్లూరించాయి. పోటీదారుల్లో నాలుగవ స్థానంలో నిలిచింది. పోటీ పాల్గొన్న నాటికి టాప్ ఫోర్లో నిలిచిన నాటికి మధ్య ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ‘‘సోషల్ మీడియా కామెంట్లకు మనసు గాయపడి కన్నీళ్లతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని’ చెప్పింది. మన సమాజంలో ‘గృహిణి అంటే ఏమీ తెలియని వ్యక్తి’ అనే అభిప్రాయం బలంగా ముద్రించుకుపోయి ఉంది. ఆ అపోహను తుడిచి పెట్టగలిగాను. గృహిణుల మనోభావాలకు నేను గళమయ్యాను’’ అంటోంది అరుణా విజయ్. View this post on Instagram A post shared by Aruna Vijay (@aruna_vijay_masterchef)
మా ఆయనకు ఆ వీడియోలు అంటే ఇష్టం
నా వయస్సు 30. నా భర్తకు 35 ఏళ్లు. ఆయన ఈ మధ్య తీవ్రమైన పోర్నోగ్రఫీ వ్యసనానికి గురయ్యాడు. ఇది మా కుటుంబ జీవితంతోపాటు అతని పనితీరునూ ప్రభావితం చేస్తోంది. అతను తన మొబైల్లో పోర్నో వీడియోలు స్క్రోల్ చేయడంలో గంటల తరబడి గడుపుతున్నాడు. నన్ను, మా ఇద్దరు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆస్లైన్ సెక్స్ చాట్లకు డబ్బు కూడా చెల్లిస్తున్నాడని ఈ మధ్యే తెలిసింది. ఆయన బాస్తో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. నా మీద కూడా ఏమీ ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మా వివాహబంధాన్ని ఎలా రక్షించుకోవాలో సలహా ఇవ్వగలరు.– అరుణకుమారి, చెన్నైమీ ఆందోళన మీ మాటల్లోనే అర్థమవుతోంది. పోర్నోగ్రఫీ వ్యసనం అనేది కుటుంబ జీవితం, వృత్తిపరమైన పనితీరుపై తీవ్రమైన ప్రభావాలను కలిగించే సంక్లిష్టమైన సమస్య. అతని ప్రవర్తన, మీ కుటుంబంపై దాని ప్రభావం గురించి అతనితో మాట్లాడే ప్రయత్నం (అతన్ని నిందించేటట్లు లేకుండా) చేయండి. మీ ఆందోళనలు, భావాలను ప్రశాంతంగా వ్యక్తపరుస్తూ అతని చర్యలు మీపైన, మీ పిల్లలపైనా ఎంత ప్రభావం చూపుతున్నాయో వివరంగా మాట్లాడి చూడండి. ఒక మంచి సైకియాట్రిస్ట్ లేదా థెరపిస్ట్ సలహాతో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఇతర చికిత్సా విధానాలతో అతన్ని ఈ వ్యసనానికి దూరం చేయవచ్చు.ఇద్దరూ కలిసి కపుల్ థెరపీకి హాజరు కావడం వల్ల కూడా మరింత మెరుగైన ఫలితాలుంటాయి. ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి, మీ మధ్య సాన్నిహిత్యం పెంచడానికి కూడా దోహదపడుతుంది. ఇంట్లో ఇంటర్నెట్ వినియోగం గురించి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసుకోండి. మీరు ఈ సమస్యల నుండి ధైర్యంగా సమర్థంగా బయటపడేందుకు వ్యక్తిగత కౌన్సెలింగ్ సహాయపడుతుంది. ఇక ఆయన ఈ వ్యసనం నుండి బయట పడటం, మీరు ఆ పరిస్థితుల ప్రభావం నుంచి కోలుకోవడం చాలా సమయం ఓర్పు, క్రమశిక్షణతో కూడుకున్న ప్రక్రియ అని గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి బయట పడడానికి నమ్మకమైన బంధుమిత్రులు లేదా నిపుణుల సహకారం తీసుకోవడానికి వెనుకాడకండి. మీ భర్త తన వ్యసనాన్ని అంగీకరించడానికి లేదా దాని నుంచి బయట పడడానికి ఇష్టపడకపోతే మీరు మీ శ్రేయస్సు, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని న్యాయనిపుణుడిని సంప్రదించడం అవసరం కావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
ఫొటోలు
టాలీవుడ్ హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు.. ఫోటోలు
తల్లి కాబోతున్న హీరోయిన్.. సీమంతం చేసిన కేజీఎఫ్ నటుడు (ఫోటోలు)
తిరుపతి జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు (ఫోటోలు)
పండగ పూట మరోసారి ‘మంచు’ వివాదం (ఫోటోలు)
హార్లే డేవిడ్సన్ బైక్ను తలపించే కొత్త మోడల్ (ఫొటోలు)
హీరోయిన్ బర్త్డే పార్టీలో బాలయ్య సందడి (ఫోటోలు)
Keerthy Suresh: భర్త ఆంటోనితో కీర్తి మొదటి సంక్రాంతి.. స్పెషల్ గెస్ట్గా విజయ్ (ఫోటోలు)
ఫ్యామిలీతో అనసూయ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
గారెలు, పులిహోరతో కడుపు నిండిపోయిందన్న హీరోయిన్ (ఫోటోలు)
సినీ స్టార్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
National View all
సైఫ్పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్
నటుడు సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి ఘటన గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు.
Central cabinet: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ (Central cabinet) కీలక నిర్
కేరళ సమాధి కేసులో అదిరిపోయే ట్విస్ట్!
కేరళలో తీవ్రచర్చనీయాంశంగా మారిన సమాధి కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. కేరళ హైకోర్టు ఆదేశం ప్రకారం..
ఢిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా
Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో..
అందరినీ ఆకట్టుకునే సోషల్ మీడియా ఇప్పుడు కుంభమేళా ఫొటోలు, వీడియోలతో నిండిపో
NRI View all
13 ఏళ్లకే రెండు శతకాలు రాసిన సంకీర్త్
తెలుగు పదాలను, పద్యాలను సరిగా పలకలేని విద్యార్ధులు ఉన్న ఈ తరంలో 13 ఏళ్ల వయసులోనే జనార్ద, శ్రీనరసింహ శతకాలను రాసి చ
తెలుగు, సాహితీ ప్రియులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!
తానా సంస్థ సాహిత్యవిభాగంగా మే, 2020 న ఆవిర్భవించిన “తానా ప్రపంచసాహిత్య వేదిక ‘నెలానెలా తెలుగువెలుగు’ పేరిట విభిన్న సాహిత
Sankranti 2025 : జపాన్లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు.
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
International View all
గాజా ఒప్పందం.. ఆఖరి నిమిషంలో కొర్రీలు!
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం, ఆ ఘనత ఎవరికంటే..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావడంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్
హమాస్తో డీల్.. నెతన్యాహు వ్యాఖ్యల అర్థమేంటి?
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుం
అమెరికన్లకు బైడెన్ హెచ్చరిక.. ఫేర్వెల్ స్పీచ్లో సంచలన కామెంట్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్న వేళ జో
గాజాలో శాంతి.. ఇజ్రాయెల్, హమాస్ కీలక అంగీకారం
దోహా: యుద్ధం, మానవీయ సంక్షోభంతో 15 నెలలుగా అట్టుడుకుతున్న గా
క్రైమ్
తిరుమలలో విషాదం.. భవనంపై నుంచి పడి బాలుడు మృతి
సాక్షి, తిరుమల: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్ స్టేషన్ వద్ద పద్మనాభ యాత్రిక సదన్ భవనం నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. వసతి సముదాయం (రెండో అంతస్తు) నుంచి బాలుడు కిందకి పడిపోయాడు. వైఎస్సార్ కడప జిల్లా చినచౌక్కు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతుల కుమారుడు సాత్విక్(3)గా గుర్తించారు.తిరుమలలో ఇంటి దొంగలు చేతివాటంతిరుమలలో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో దళారీలు.. భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తున్నారు. విజిలెన్స్ వింగ్ అధికారులకు అనుమానం రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద నిలిపివేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక పీఎస్జీ మణికంఠ, భానుప్రకాష్ భక్తులను మోసగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లను తయారు చేస్తున్నారు. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగుళూరు భక్తులు సుమారు 11 మంది నుంచి రూ.19 వేలు వసూలు చేసినట్లు సమాచారం.
HYD: జంట హత్య కేసులో ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: నార్సింగి(narsingi) పుప్పాలగూడ(puppalaguda) జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా దారుణంగానే హత్య చేసినట్లు తేలింది. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టు గుర్తించారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన అంకిత్ సాకేత్, ఛత్తీస్గఢ్కు చెందిన బిందుగా గుర్తించారు.వివరాల ప్రకారం.. నార్సింగిలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో జంట హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధమే వీరి హత్యకు కారణమైనట్టు పోలీసులు తెలిపారు. అంకిత్ సాకేత్కు వివాహిత బిందూతో గత పరిచయం ఏర్పడింది. బిందుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ నెల 11న బిందును సాకేత్ ఎల్బీనగర్ నుంచి నానక్ రామ్ గూడకు పిలిపించాడు. బిందును తన స్నేహితుడి రూమ్లో ఉంచాడు. తర్వాత ఇద్దరు కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు.అనంతరం, అక్కడ ఏకాంతంగా గడిపారు. అయితే, సాకేత్కు తెలియకుండా మరో యువకుడితో బిందు ప్రేమాయణం సాగించింది. మరో ప్రియుడు.. వీరిద్దరినీ రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బిందుపై దాడి చేశాడు. బండరాళ్లతో బాది హత్య చేశాడు. సాకేత్ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. పారిపోతున్న సాకేత్పై కూడా అతడు దాడికి పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇద్దరి ముఖాలపై బండరాయితో దాడి చేసి పరారయ్యాడు. హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. వీరిద్దరి హత్య కన్నా ముందు అంకిత్ అదృశ్యమైనట్టు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాగా.. వనస్థలిపురంలో బిందుపై మిస్సింగ్ కేసు నమోదైంది. నిన్న నార్సింగిలో ఇద్దరి హత్య జరిగింది.
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
లక్నో/హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్లోని కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయలుదేరింది. కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. ఇక, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. దీంతో, అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Hyd: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం
హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. యువతీ, యువకుడ్ని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది,. ఈరోజు(మంగళవారం) ఉదయం గుట్టల వద్దకు వచ్చిన వారికి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అక్కడ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతుండటంతో పని చేయడానికి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు సేకరించామని, వాటి ద్వారా మృతుల వివరాలను గుర్తిస్తామన్నారు.ఘటన జరిగిన ప్రదేశాన్ని డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
వీడియోలు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కర్ణాటకలో దొంగల బీభత్సం
తాడిపత్రిలో సీఐ, దళిత నేత మధ్య చిచ్చుపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫు న్యాయవాదుల పిటిషన్
సూపర్ స్టార్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టిన శ్రద్ధా శ్రీనాథ్
డాకు మహారాజ్ స్టెప్స్ పై ఊర్వశీ రౌతేలా స్ట్రాంగ్ కౌంటర్..
హిస్టారికల్ స్టోరీలో అల్లు అర్జున్
విహార యాత్రలో విషాదం
చీపురుతో తుడిచేస్తా.. కేజీవాల్ నామినేషన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు వైఎస్ జగన్ అభినందనలు