Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Slams Chandrababu Govt Over AP Situations1
రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉందో సహానా ఘటన చూస్తే అర్థమవుతోందన్నారు వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదని చెప్పుకొచ్చారు. అలాగే, పోలీసులు రెడ్‌ బుక్‌ పాలనలో నిమగ్నమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ జగన్‌. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా బాధితులను సాయం చేసి వారికి క్షమాపణలు చెప్పాలన్నారు.గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి వద్ద వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. దళిత చెల్లి పరిస్థితిని చూస్తే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్ఢర్‌ లేదు. శాంతిభద్రతలు దిగిజారిపోయాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేది. దిశ యాప్‌ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచాం. ఈ ఘటనలో నిందితుడు నవీన్‌.. చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి. స్థానిక ఎంపీతో కూడా సన్నిహితంగా ఉన్నాడు. నిందితులు బాధితురాలిపై శారీరకంగా, లైంగిక​ దాడి జరిపి ఆసుపత్రిలో జాయిన్‌ చేసి వెళ్లిపోయారు. యువతిపై మృగాళ్లలా దాడి చేశారు. యువతి దేహాంపై కమిలిన గాయాలు ఉన్నాయి. ఇవన్నీ కళ్లేదుటే కనిపిస్తున్నా ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. నిందితుడు అధికార టీడీపీకి చెందిన వాడు కాబట్టే అతడిని నిస్సిగ్గుగా కాపాడుకుంటున్నారు. ఈ దారుణ ఘటనపై స్థానిక మంత్రి, హోంమంత్రి కనీసం స్పందించలేదు. నేను ఇక్కడికి వస్తున్నా అని తెలిశాకే టీడీపీ నేత ఆలపాటి ఆసుపత్రికి వచ్చారట.రాష్ట్రంలో ప్రతీచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. బద్వేలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేశారు. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారు. పలాసలో టీడీపీకి చెందిన ప్రబుద్దులే అత్యాచారం చేశారు. అఘాయిత్యాలు జరిగిన చోట పంచాయితీలు చేస్తున్నారు. పిఠాపురంలో యువతిపై టీడీపీ నేత అత్యాచారం చేశారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తున్నాడు. పవన్‌ కనీసం బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదు. హిందూపురంలోనూ అత్తాకోడలిపై గ్యాంప్‌ రేప్‌ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం పరామర్శకు వెళ్లలేదు. అనకాపల్లిలో బాలికను ప్రేమోన్మాది చంపేశాడు. వేధింపులపై అంతకుముందు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారు.రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా వెనకేసుకొస్తున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా చేజారిపోతున్నాయి. పోలీసులు రెడ్‌ బుక్‌ పాలనలో నిమగ్నమయ్యారు. బాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు. గతంలో దిశ యాప్‌తో 10 నిమిషాల్లో సాయం అందేది. దిశ యాప్‌ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడాము. వైఎస్సార్‌సీపీ హయాంలో 18 దిశ పీఎస్‌లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రతీ జిల్లాలోనూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. దిశ యాప్‌కు 19 అవార్డులు వచ్చాయి. దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా?. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేదని గుర్తు చేశారు.

YS Jagan Guntur And YSR Districts Tours Updates2
సహానా కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

బాధిత కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ పరామర్శ అప్‌డేట్స్‌.. 👉జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస​ జగన్‌ పరామర్శించారు. 👉ఈ సందర్భంగా సహానా కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. అలాగే, సహానాకు అందించిన చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్న వైఎస్‌ జగన్‌. 👉వైఎస్‌ జగన్‌ జీజీహెచ్‌ చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద భారీగా అభిమానులు, ప్రజలు చేరుకున్నారు. 👉వైఎస్‌ జగన్‌ గుంటూరు చేరుకున్నారు. కాసేపట్లో సహానా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. 👉వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు గుంటూరు, వైఎస్సా­ర్‌ జిల్లాల్లో పర్య­టించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్‌లో టీడీపీ కార్య­కర్త, రౌడీషీటర్‌ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబస­భ్యులను పరామర్శిస్తారు.👉కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయ­లు­దేరి 10.50 గంటలకు గుంటూరు జీజీ­హెచ్‌కు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. 👉అనంతరం.. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్‌ జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడి­లో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు.

CM Chandrababu Phone Call To Badvel Victim Family3
వైఎస్‌ జగన్‌ దెబ్బకు దిగి వచ్చిన చంద్రబాబు

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దెబ్బకు ముఖమంత్రి చంద్రబాబు దిగి వచ్చారు. ఎట్టకేలకు బద్వేల్‌ ఇంటర్‌ విద్యార్థిని కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటుగా ఆమె సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి ఇంటర్‌ విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో​ యువతిని మభ్యపెట్టి.. పెట్రోల్‌ పోసి నిప్పటించిన ఘటనలో బాధితురాలు మృతిచెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నేడు వైఎస్‌ జగన్‌ బద్వేల్‌ వెళ్తున్నారు. వైఎస్‌ పరామర్శ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగివచ్చారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించని చంద్రబాబులో ఎట్టకేలకు స్పందించారు. వైఎస్‌ జగన్‌ పరామర్శకు వెళ్తున్న నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్‌ చేశారు.తాజాగా బాధితురాలి తల్లితో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికం సాయంతో పాటు.. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.

Minister Anam Ramanarayana Reddy Sensational Comments On His Security4
మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు, సాక్షి: తన భద్రత విషయంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ భద్రత సరిగా లేకపోవడంపై అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘సొంత సెక్యూరిటీ సిబ్బందితో నియోజకవర్గంలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లైసెన్సుడ్ వెపన్‌ను క్యారీ చెయ్యాలనుకుంటున్నా. అందరికీ సెక్యూరిటీ ఇచ్చినట్లే నాకు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది’ అని అనుమానం వ్యక్తం చేశారు.చదవండి: ‘చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు’

BRS KTR Serious Comments On Congress Over Ramannapet Issue5
రేవంత్‌.. నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ముందా?: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా రామన్నపేటలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సవాల్‌ చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు.రామన్నపేటలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్యనల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్. , మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, లను హౌజ్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్యలు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వం కాక మరేంటి?. వీరితో పాటు ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలను ముందస్తు అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం రేవంత్ సర్కారు అణచివేత విధానాలకు నిదర్శనం.ఇంతటి నిర్బంధ పరిస్థితులను సృష్టించి నిర్వహించే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విలువ ఉండదు. ఇదీ ముమ్మాటికీ అదానీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ సాగిస్తున్న అరాచక పర్వం. అక్రమంగా నిర్బంధించిన బీఆర్ఎస్ నాయకులతోపాటు ప్రజాసంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అప్పుడే గుండె పగిలిన రైతుల ఆవేదన, చుట్టుపక్కల ప్రజల ఆక్రందన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. నియంతృత్వ విధానాలతో ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారు. జై తెలంగాణ అంటూ కామెంట్స్‌ చేశారు. రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్యనల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర…— KTR (@KTRBRS) October 23, 2024

 Priyanka Nomination For Wayanad Bypolls Rahul Gandhi Updates6
వయనాడ్‌ ఉప ఎన్నిక.. నామినేషన్‌ వేసిన ప్రియాంక గాంధీ

తిరువనంతపురం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేడు(బుధవారం) వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ హాజరయ్యారు. ఇప్పటికే రాహుల్‌​ వయనాడ్‌ చేరుకున్నారు. సుల్తాన్ బతేరిలో రాహుల్‌ హెలికాప్టర్‌ నుంచి దిగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.మధ్యాహ్నం 12 గంటలకు వయనాడ్‌ జిల్లా కలెక్టర్‌ ఎదుట ప్రియాంక నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారుఇదిలా ఉండగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. వయనాడ్‌లో ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేప అభ్యర్థి నవ్యా హరిదాస్‌ ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్‌డీఎఫ్‌ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్‌ మొకెరీ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్‌ గాంధీ.. వయనాడ్‌ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్‌ 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.#WATCH | Kerala: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi arrives in Wayanad for the nomination filing of party's national general secretary and his sister, Priyanka Gandhi Vadra for Wayanad Lok Sabha by-elections. Visuals from Sultan Bathery. pic.twitter.com/EgCeMpGolL— ANI (@ANI) October 23, 2024

LSG To Release KL Rahul Ahead Of IPL 2025 Auction, Mayank Yadav To Be Among Top 3 Retentions Says Reports7
కేఎల్‌ రాహుల్‌ను వదిలేయనున్న లక్నో.. మయాంక్‌ యాదవ్‌కు 14 కోట్లు..?

ఐపీఎల్‌ 2025 సీజన్‌ మెగా వేలానికి ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం కేఎల్‌ రాహుల్‌ను రిలీజ్‌ చేయాలని డిసైడైనట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌ రాహుల్‌ స్ట్రయిక్‌రేట్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత మూడు సీజన్లలో జట్టు పేలవ ప్రదర్శనకు రాహుల్‌ స్ట్రయిక్‌ రేట్‌ ప్రధాన కారణమని మేనేజ్‌మెంట్‌ భావిస్తుందట.రాహుల్‌ స్థానంలో లక్నో కెప్టెన్సీ పగ్గాలు నికోలస్‌ పూరన్‌కు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం పూరన్‌తో పాటు మరో ఇద్దరిని రిటైన్‌ చేసుకోనుందని సమాచారం. రవి బిష్ణోయ్‌, మయాంక్‌ యాదవ్‌ల కోసం భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. మయాంక్‌కు పారితోషికం కింద దాదాపు రూ. 14 కోట్లు దక్కవచ్చని అంచనా. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల కోటాలో ఆయుశ్‌ బదోని, మొహిసిన్‌ ఖాన్‌లను కూడా రిటైన్‌ చేసుకోనున్నట్లు సమాచారం.కాగా, లక్నో సూపర్‌ జెయింట్స్‌ 2022 సీజన్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మూడు సీజన్ల పాటు కేఎల్‌ రాహుల్‌ ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన లక్నో.. ఈ ఏడాది లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. చదవండి: ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు

Prabhas 45th Birthday Special Story8
ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న 'ప్రభాస్‌'.. ఎలా సాధ్యమైంది..?

'ఈశ్వర్‌'లా వెండితెరపై అడుగుపెట్టి అభిమానుల చేత 'సాహో' అనిపించుకున్నాడు. నేడు ఇండియన్‌ బాక్సాఫీస్‌కు 'ఛత్రపతి'లా 'ఏక్‌ నిరంజన్‌' అయ్యాడు. కేవలం రూ.100 కోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను ఏకంగా రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తా ఏంటో బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. తను పుట్టిన గడ్డపై ప్రకృతి కన్నేర్ర చేస్తే తనవంతుగా 'పౌర్ణమి' లాంటి వెలుగును అందింస్తాడు. సిల్వర్‌ స్క్రీన్‌పై పౌరుషంతో కదం తొక్కే 'మిర్చి'లాంటి కుర్రాడిగానే కనిపిస్తూనే అమ్మాయిల కలల రాకుమారుడిగా 'డార్లింగ్‌' అని పిలిపించుకుంటాడు. ప్రస్తుతం ఇండియన్‌ బాక్సాఫీస్‌లో 'సలార్‌' రూలింగ్‌ మాత్రమే జరుగుతుంది. ఇవాళ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని విషయాలు మీ కోసం..ప్రభాస్‌ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు ఉప్పలపాటి. అందరూ ముద్దుగా ప్రభ, డార్లింగ్‌ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి నటుడవ్వాలని ప్రభాస్‌ ఎప్పుడూ అనుకోలేదు. అయితే, ప్రభాస్‌ మంచి ఎత్తుతో పాటు చాలా గ్లామర్‌గా ఉండటంతో అందరూ ఆయన్ను 'హీరో... హీరో' అని పిలిచేవారట. కానీ సినిమాలంటే చాలా భయపడేవాడట. తనకు తెలిసిన మొదటి హీరో పెదనాన్న కృష్ణంరాజు. ఆయనకు ప్రభాస్‌ బిగ్‌ ఫ్యాన్‌ కూడా... ఓ రోజు భక్తకన్నప్ప సినిమా షూటింగ్‌ జరుగుతుంటే అక్కడికి ప్రభాస్‌ కూడా వెళ్లాడు.. అలా సినిమా సెట్‌లోని వాతావరణానికి అలవాటు పడ్డాడు. రోజూ పెదనాన్న కృష్ణంరాజు నటించిన సినిమాలు చూస్తూ అలా తన కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని డిసైడ్‌ అయ్యాడు.వరుసగా ప్లాపులొచ్చినా మళ్లీ.. మళ్లీ తిరిగొచ్చాడుకృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. ఈ రెండు చిత్రాలతో నటన, హావభావాలతో ఆకట్టుకున్నాడనే ప్రశంసలు ప్రభాస్‌కు దక్కాయి. కానీ, చిత్రపరిశ్రమలో తన మార్క్‌ వేయలేకపోయాడు. దీంతో మూడో చిత్రంతో మంచి విజయం అందుకోవాలని చాలా ఆశలు పెట్టుకుని 2004లో త్రిష కాంబినేషన్‌తో 'వర్షం' తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత పర్వాలేదనే టాక్‌ మాత్రమే వినిపించింది. దీంతో ఈ చిత్రం కూడా పోయిందని ప్రభాస్‌ అనుకున్నాడు. అయితే, వారం తర్వాత వర్షంలా కలెక్షన్స్‌ పెరిగాయి. ఆపై సూపర్‌ హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాడు. అలా ప్రభాస్‌ కెరియర్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్స్‌ కావడంతో మళ్లీ వర్షం లాంటి సినిమాతో హిట్‌ కొట్టాలని ప్రభాస్‌ తపించాడు. అలాంటి సమయంలో ‘ఛత్రపతి’ (2005) బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. మళ్లీ రెండేళ్ల పాటు ఒక్క హిట్‌ లేదు. పౌర్ణమి, యోగి, మున్నా వరుసుగా మళ్లీ పరాజయాలే.. ఇలా ఇండస్ట్రీలో పడిపోయిన ప్రతిసారి తిరిగి తానేంటో నిరూపించుకున్నాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'బుజ్జిగాడు'తో డిఫరెంట్‌ మ్యానరిజాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 'బిల్లా'తో తనలోని స్టైలిష్‌ లుక్‌ను పరిచయం చేసిన ప్రభాస్‌ ఏక్‌ నిరంజన్‌తో మరో కోణాన్ని పరిచయం చేశాడు. అలా డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, మిర్చి చిత్రాలతో అదరగొట్టేశాడు. బాహుబలి కోసం ఒకేఒక్కడుబాహుబల సమయంలో ప్రతి హీరో ఏడాదికి రెండు సినిమాలు తీస్తున్నాడు. కానీ ప్రభాస్‌ మాత్రం 'బాహుబలి' కోసం జక్కన్నకి ఐదేళ్లు పూర్తి కాల్షీట్లు ఇచ్చేశాడు. అప్పుడు దేశంలో ఇదో సంచలనం. అన్ని రోజులపాటు మరో సినిమా ఒప్పుకోకుండా నిలబడిని ఏకైక హీరోగా ఆయన పేరుపొందాడు. ఆ సమయంలో అనుష్క,రానా,తమన్నా వంటి వారందరూ వేరే సినిమాలు చేశారు. ప్రభాస్‌ ఒక్కడే బాహుబలి మొత్తం అయ్యే వరకు ఒకే సినిమాకి పనిచేశాడు. ప్రభాస్‌ పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎనలేని గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచే ప్రభాస్‌ నటిస్తున్న ప్రతి సినిమా కోసం నార్త్‌ ఇండియా ప్రేక్షకులూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్,సలార్‌,కల్కి వంటి చిత్రాలు బాలీవుడ్‌లో దుమ్మురేపాయి. టాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గకుండా అక్కడ కలెక్షన్లు రాబట్టాయి. ఎన్నో ఎళ్ల పాటు బాలీవుడ్‌ను శాసిస్తున్న ఖాన్‌ హీరోలను ప్రభాస్‌ వెనక్కు నెట్టేశాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌ కింగ్‌ కిరీటాన్ని ప్రభాస్‌ ఎప్పుడో అందుకున్నాడు.ప్రభాస్‌కు స్నేహితులు.. ఆ రెండు సినిమాలు 20 సార్లు చూశాడుప్రభాస్‌కు అభిమాన హీరో కృష్ణంరాజు అయితే, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, రాబర్ట్‌ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిష నటన అన్నా ఆయనకు చాలా ఇష్టం. తనకు దగ్గరైన దోస్తులు చాలామందే ఉన్నారు. వారిలో గోపిచంద్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌, రానా దగ్గుబాటి, మంచు మనోజ్‌లు ప్రభాస్‌కు మంచి స్నేహితులు. అయితే, కెరియర్‌ పరంగా తనను అత్యున్నత స్థానంలో నిలబెట్టిన డైరెక్టర్‌గా రాజమౌళి అంటే ప్రభాస్‌కి ఎనలేని అభిమానం. ఆయన తర్వాత అంత ఇష్టమైన దర్శకుడు మరొకరు ఉన్నారు. బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ. ఆయన సినిమాలను ప్రభాస్‌ చాలా ఎక్కువగానే ఇష్టపడతాడు. ఆయన డైరెక్ట్‌ చేసిన త్రీ ఇడియట్స్, ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ చిత్రాలను ఇరవైకి పైగా సార్లు చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.ప్రభాస్‌లో ఇవన్నీ ప్రత్యేకం► ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్‌ గుర్తింపు పొందారు.► కేవలం 'బాహుబలి' ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం► ప్రభాస్‌ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్‌ దేవగణ్‌, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్‌ జాక్సన్‌'లో అతిథిగా కనిపించారు.► ప్రభాస్‌కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రెరీ కూడా ఉందట.► స్టార్‌డమ్‌ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్‌ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.► ప్రభాస్‌ ఖాతాలో వెయ్యి కోట్లు సాధించిన సినిమాలు రెండు ఉన్నాయి బాహుబలి2, కల్కి 2898AD ► బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది.► మిర్చి సినిమాకు ఉత్తమనటుడిగా 2013లో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్‌► ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు.► తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.► ప్రభాస్‌ నటుడు కాకపోయుంటే..? హోటల్‌ రంగంలో స్థిరపడేవారు.► ప్రభాస్‌కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం► ఇష్టమైన పాట: 'వర్షం'లోని 'మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం'

how to find purity of petrol in petrol pump9
పెట్రోల్‌ కల్తీని ఎలా గుర్తించాలంటే..

రాజు మూడు నెలల కిందట షోరూమ్‌లో బైక్‌ కొనుగోలు చేశాడు. కానీ కంపెనీ ఇచ్చిన హామీ మేరకు బైక్‌ మైలేజీ రావడంలేదు. కనీసం అందులో సగమైన మైలేజీ రాకపోవడంతో నిరాశ చెందాడు. అయితే బైక్‌ కొన్నప్పటి నుంచి తాను ఒకే పెట్రోల్‌ పంపులో పెట్రోల్‌ కొట్టించేవాడు. అనుకోకుండా ఇటీవల వేరే పంపులోని పెట్రోల్‌ వాడాడు. అప్పటివరకు సరిగా మైలేజీ రాని తన బైక్‌ ఈసారి మెరుగైన మైలేజీ నమోదు చేసింది. దాంతో తాను గతంలో వాడిన పెట్రోల్‌ కల్తీ అయిందని గుర్తించాడు.మీకూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు కొన్ని ఏజెన్సీలు పెట్రోల్‌ను కల్తీ చేయడమే కారణం. భారత్‌ భారీగా పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అందుకు పెద్దమొత్తంలో డాలర్లు ఖర్చు చేస్తోంది. దీని ప్రభావం ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలపై పడుతుంది. వీటికి అనుబంధంగా ఉన్న కొన్ని ఏజెన్సీలు అక్రమంగా డబ్బు పోగు చేసుకోవాలనే దురుద్దేశంతో పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నాయి. అయితే మనం వాహనాల్లో వాడే పెట్రోల్‌ కల్తీ అయిందా..లేదా..అనే విషయాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..రెండు నిమిషాల్లో కల్తీ గుర్తించండిలా..నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్‌ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్‌ పేపర్‌ ఉంచుకోవాలి. మనం వాహనాల్లో పెట్రోల్‌ కొట్టించాలనుకున్నప్పుడు పెట్రోల్‌ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్‌ పేపర్‌ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్‌ గన్‌ ద్వారా 2-3 డ్రాప్స్‌ పెట్రోల్‌ వేయాలి. 2-3 నిమిషాలు ఆ ఫిల్టర్‌ పేపర్‌ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్‌ పోసినచోట పేపర్‌పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్‌గా పరిగణించవచ్చు. అలాకాకుండా ఏదైనా మచ్చలు ఏర్పడితే కల్తీ జరిగినట్లు భావించాలి.

social media benefits  and side effects special story10
సోల్‌మేట్స్‌తో సోషల్‌గా...మనసుకు మేలే..!

సోషల్‌ మీడియా చేసే చెరుపు గురించి చర్చ ఉన్నప్పటికీదానిని సరిగా ఉపయోగిస్తే మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.స్నేహాలు, సమూహాలు మనకంటూ కొందరున్నారన్న భరోసా ఇస్తేసలహాలు సూచనలు కూడా ఇక్కడి నుంచి అందడం వల్లఆందోళన దూరం అవుతుందంటున్నారు.సోషల్‌ మీడియాను మెరుగ్గా ఎలా అర్థం చేసుకొని ఉపయోగించాలి?సోషల్‌ మీడియా అంటే అదొక అవాస్తవిక ప్రపంచం, అక్కడున్న వారికి ఇబ్బందులు తప్పవు, మహిళల మీద ట్రోలింగ్‌ ఉంటుంది అనే అభి్ర΄ాయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే నాణేనికి మరోవైపు కూడా ఉంది. సోషల్‌ మీడియాను సరిగ్గా వాడితే మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఒంటరితనం, డిప్రెషన్, నిరాశ వంటివాటితో ఇబ్బంది పడేవారికి సోషల్‌ మీడియా ధైర్యాన్ని, మద్దతును, అర్థం చేసుకునే స్నేహితులను అందిస్తుందని అంటున్నారు.ఆత్మీయ బంధాలను అల్లుకోవచ్చుసోషల్‌ మీడియాలోని స్నేహాలన్నీ వ్యర్థమని, అక్కడ పరిచయమైన వారిలో నిజాయితీ ఉండదనే అ΄ోహ చాలామందిలో ఉంది. కానీ మనం నిజాయితీగా ఉంటే ఎదుటివారిలోని నిజాయితీని గుర్తించొచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. అనేక ్ర΄ాంతాల్లో నివసిస్తున్న వారు, అనేక సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్నవారు సోషల్‌మీడియాలో తారసపడుతుంటారు. అందులో మన భావాలకు, అభి్ర΄ాయాలకు తగ్గవారిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారితో స్నేహం చేయడం ద్వారా మనలోని ఒంటరితనం దూరమవుతుంది. సోషల్‌మీడియాలో పరిచయమై ఆ తర్వాత అత్యంత ఆత్మీయ మిత్రులుగా మారినవారు బోలెడంత మంది ఉన్నారు. ఇవి మనసుకు బలం ఇస్తాయి.అభిరుచులకు తగ్గ స్నేహాలు మన చుట్టూ ఉన్నవారు మన అభిరుచులకు తగ్గట్టే ఉంటారని అనుకోలేం. కానీ సోషల్‌మీడియాలో ఒకే అభిరుచి, ఇష్టాయిష్టాలు కలిగిన వారు ఒకచోట చేరే అవకాశం ఉంటుంది. పుస్తక ప్రియులైతే ఒకచోట, చిత్రలేఖనం ఇష్టమైనవారంతా ఒకచోట, సినిమాలపై ఆసక్తి ఉంటే ఒక గ్రూప్, ప్రయాణాలు ఇష్టపడేవారు మరో గ్రూప్‌.. ఇలా మన ఇష్టాలకు తగ్గట్టు మెలిగే వారు కనిపిస్తారు. ఆ అంశాల గురించి చర్చిస్తారు. వారి అనుభవాలు వినొచ్చు. మన అభి్ర΄ాయాలు పంచుకోవచ్చు.. ఈ గ్రూపులు మన అవగాహన పరిమితిని విస్తృతం చేస్తాయి. తద్వారా మనసును విశాలం చేస్తాయి.అభిప్రాయాలు సరి చేసుకోవచ్చుసోషల్‌ మీడియా భిన్నాభిప్రాయాలు వినిపించే వేదిక. మన చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలే కాక, ఎక్కడో ఉన్నవారి అభిప్రాయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు, సంయమనం చాలా ముఖ్యం. మన మాటే చెల్లాలి, మనం చెప్పిందే వినాలి అనే ఆధిపత్య ధోరణి ఉండకూడదు. కొన్ని అభిప్రాయాలు మన మీద లైట్‌ వేస్తాయి. మన మూస అభిప్రాయాలను మారుస్తాయి. నెగెటివ్‌ అభిప్రాయాలను దూరం చేసుకునేందుకు సాయం చేస్తాయి. ఇదంతా ఎందుకు అనంటే ఖాళీగా ఉండే మైండ్‌ను అర్థవంతమైన వ్యాపకంలో పెట్టడానికే. దీనివల్ల డిప్రెషన్‌ దూరమవుతుంది. అయితే సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజాలు కావనేది గుర్తించాలి. అలాంటి ఫేక్‌ వార్తలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రచారం చేసేవారిని దూరంగా ఉంచాలి.నూతన అంశాలపై ఆసక్తి గాజులు ఎలా తయారు చేస్తారో తెలుసా? అద్దం ఎలా తయారవుతుంది? ఇంట్లో ఖాళీ డబ్బాలతో ఏదైనా అలంకరణ వస్తువులు చేయొచ్చా? చార్‌ధామ్‌ యాత్ర అంటే ఏమిటి? ఇలా మనకు తెలియని అంశాలను సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. వీడియోల ద్వారా నేరుగా పరిశీలించొచ్చు. ఆసక్తి ఉంటే ప్రయత్నించవచ్చు. నూతన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి సోషల్‌ మీడియా ఉపయోగకారి. తద్వారా మనమూ కంటెంట్‌ క్రియేటర్లుగా మారొచ్చు. ఇదంతా మనసును ఉత్సాహ పరిచే అంశమే.నిపుణుల సలహాలకు వేదికవేసవిలో ఏ ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లొచ్చు? బైక్‌ ఎక్కువ మైలేజ్‌ రావాలంటే ఏం చేయాలి? ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోసం ఏ రంగులు మేలు? ఇలా అనేక ప్రశ్నలు మనకుంటాయి. కానీ సమాధానాలు ఇచ్చేందుకు అన్నిసార్లూ నిపుణులు మనకు అందుబాటులో ఉండరు. ఆ లోటును సోషల్‌మీడియా తీరుస్తుంది. ఇక్కడ అనేకమంది నిపుణులు అందుబాటులో ఉంటారు. కొందరు నిపుణులు కాకపోయినా, తమ అనుభవంతో మన సందేహాలను నివృత్తి చేయగలరు. దీనివల్ల మనకు శ్రమ తగ్గుతుంది. అయితే ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో సోషల్‌మీడియా సలహాలు పాటించకపోవడం మేలని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆ జాగ్రత్త పాటించడం తప్పనిసరి.సృజనాత్మకతకు వేదిక ఒక చక్కని కవిత రాశారా? పదిమందితో పంచుకోవాలని ఉందా? ఒక చిత్రం గీశారా? దాన్ని అందరికీ చూపించాలని ఉందా? సోషల్‌ మీడియా మన సృజనాత్మకతకు చక్కటి వేదిక. ఎంతోమంది అక్కడ పాపులర్‌ అయ్యారు, అవుతున్నారు. వారికంటూ అభిమానులను సంపాదించుకున్నారు. ఉన్నచోటే ఆగి΄ోకుండా సృజనకు వేదిక అందించి, సృజనకారుల్లో ఉత్సాహం నింపడం సోషల్‌ మీడియాలో సాధ్యం. మానసిక ఉల్లాసానికి సృజనాత్మక ప్రదర్శనలు చాలా మేలు చేస్తాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి!సోషల్‌ మీడియాలో సంయమనం టించాలి. వ్యక్తిగతంగా దూషించడం, టార్గెట్‌ చేయడం, వేధించడం వంటివి చేయకూడదు.సోషల్‌ మీడియాను పరిమితంగానే వాడాలి. దానికి అడిక్ట్‌ అయి΄ోకూడదు.పూర్తి వ్యక్తిగత వివరాలు, ఇబ్బందికరమైన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పంచుకోకూడదు.సోషల్‌ మీడియాలో నెగిటివిటీకి దూరంగా ఉండాలి. సోషల్‌ మీడియాలో ఏవైనా వేధింపులు, మోసం, ట్రోలింగ్‌ వంటివి ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలి. వెంటనే సైబర్‌ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయాలి.

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
ఎట్టకేలకు ప్రియాంక బరిలోకి : ఇందిర వారసత్వాన్ని నిలుపుకుంటుందా?

కాంగ్రెస్‌ శ్రేణుల చిరకాల  స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది.

title
హత్య కేసు: గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌కు బెయిల్‌

ముంబై: జయశెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌కు ఉపశ

title
విద్యార్థులకు శుభవార్త: ఆ సబ్జెక్టుల్లో 20 వస్తే పాస్‌

ముంబై: మహారాష్ట్రలో గణితం, సైన్స్‌ సబ్జెక్టులంటే భయపడే విద్యార్థులపై రాష్ట్

title
ప్రియాంక గాంధీ నామినేషన్‌.. వయనాడ్‌ చేరుకున్న రాహుల్‌

తిరువనంతపురం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా

title
‘ఢిల్లీకి వెళ్లడం ఇష్టంలేని అజిత్ దాదా మాత్రమే తెలుసు’

ముంబై: తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తర

NRI View all
title
చికాగో ఫ్యాన్స్‌ మీట్‌లో శృతిహాసన్ సందడి

శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

title
న్యూజెర్సీలో బ్రెస్ట్ కేన్సర్‌పై నాట్స్ వాక్ అండ్ టాక్ ఈవెంట్

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బ్రెస్ట్ కే

title
డల్లాస్‌లో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్ టోర్నీ

అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేసే విధంగా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

title
అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు

అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ని డాలస్‌లో స్థాపించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా మహాత్మాగాంధీ మెమ

title
కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్‌ అవగాహన సదస్సు

Advertisement
Advertisement