ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం
ఉత్కంఠకు తెర పడింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే బిల్లుపై ట్రంప్ ఇవాళ సంతకం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారడంతో ఆయా దేశాలపై ఏ క్షణమైనా 100 శాతం వరకు టారిఫ్లు ట్రంప్ విధించే అవకాశం ఉంది. ప్రధానంగా.. భారత్, చైనాలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. లిండ్సే గ్రాహం యాక్ట్ ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ లేదంటే గ్యాస్ దిగుమతి చేసుకునే టాప్-5 దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే చట్టంలో ఆ దేశాల పేర్లను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆయా జాబితాలను ఎలా లెక్కించాలన్న దానిపైనా పూర్తి స్పష్టత లేదు. దీంతో తుది నిర్ణయాధికారం ట్రంప్ ప్రభుత్వానికే దక్కింది. అబ్ ఆయేగా అస్లీ మజా!ట్రంప్ సంతకం చేయడంతో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కానీ అసలు పరిణామాలు ఇప్పుడే మొదలుకానున్నాయి. భారత్, చైనా సహా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఏ దేశాలు ‘టాప్-5’ జాబితాలోకి వస్తాయి? వాటిపై ట్రంప్ 100 శాతం వరకు టారిఫ్ విధిస్తారా? లేక మినహాయింపు ఇస్తారా? అన్నదే ఇప్పుడు కీలకం. తుది జాబితా, టారిఫ్ స్థాయిపై అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఆగస్టు క్రూడ్ దిగుమతుల డేటా ఆధారంగా రష్యా చమురు కొనుగోలులో ముందున్న దేశాలు:భారత్చైనాఇటలీటర్కీనెదర్లాండ్స్ఎస్అండ్పీ గ్లోబల్ ప్రకారం ఆగస్టులో రష్యా క్రూడ్ దిగుమతుల్లో భారత్ రోజుకు సుమారు 16 లక్షల బ్యారెళ్లతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 11 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇటలీ, టర్కీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.భారత్కు ఎందుకు కీలకం?రష్యా నుంచి చౌకగా లభించే క్రూడ్ ఆయిల్ భారత రిఫైనరీలకు కీలక వనరుగా మారింది. దేశీయ అవసరాల్లో భారీ భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. రష్యా చమురు దిగుమతులు భారత మొత్తం క్రూడ్ దిగుమతుల్లో దాదాపు సగం వరకు ఉన్నాయని తాజా విశ్లేషణలు పేర్కొంటున్నాయి. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లపై అమెరికా చర్యలు తీసుకుంటే భారత రిఫైనింగ్ రంగంతో పాటు అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ ఉత్పత్తులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే భారత్ సహా ఏ దేశాలపై, ఎప్పుడు, ఎంతమేర సుంకాలు విధించాలన్న విషయంలో ట్రంప్దే తుదినిర్ణయం కానుంది. మరోవైపు ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. చర్చల్లో మరికొన్ని దేశాలురష్యా చమురు కొనుగోలుదారుల జాబితాతో పాటు రష్యా ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరిస్తున్న దేశాలపైనా చట్టం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్, జపాన్, యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలు కూడా అమెరికా చర్యల పరిధిలోకి రావచ్చనే చర్చ జరుగుతోంది. 30 రోజుల్లో నిర్ణయం?కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన దేశాలపై టారిఫ్లు విధించే చర్యలను 30 రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ అంశం కీలకంగా మారింది. రష్యా చమురుపై ఆంక్షలు కఠినతరం చేస్తే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడి ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో వినియోగదారులపై ఇంధన ధరల భారం పెరగకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ అధికారాలను ఎంతవరకు ఉపయోగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.రష్యాపై మరింత ఒత్తిడిఈ చట్టం కేవలం చమురు కొనుగోలుదారులపైనే కాదు.. రష్యా ఇంధన, రక్షణ రంగాలతో పాటు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలకు వీలు కల్పిస్తోంది. ఇరాన్పై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా ఈ చట్టం పొడిగించింది. ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా అమెరికా పేర్కొంటోంది. మొత్తంగా చూస్తే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు ఇది నేరుగా తాకే అంశమే అయినప్పటికీ, 100 శాతం టారిఫ్ ఇప్పటికిప్పుడు ఖరారైన నిర్ణయం కాదు. ఏ దేశాలను తుది జాబితాలో చేర్చుతారు? భారత్పై ఎంత మేర ప్రభావం ఉంటుంది? అన్నది ట్రంప్ ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: భూకంపం కాదు.. భూకంపాలు పుట్టిన కిమ్
క్లాస్ పీకిన సుప్రీంకోర్టు.. వెనక్కి తగ్గని విజయ్ సర్కార్
హిందీ భాష విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనూ తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు భూమి కేటాయించబోమని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్మోహన్ స్పష్టం చేశారు. అలాగే తమిళనాడు రెండు భాషల విధానానికే కట్టుబడి ఉంటుందని తెలిపారు.నవోదయ పాఠశాలల్లో మూడు భాషల విధానం అమలవుతుండటం, అందులో హిందీ ఉండటంపై తమిళనాడు విజయ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో కచ్చితంగా భూములు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు గత ఆదేశాలను సమీక్షించాలంటూ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మైండ్ సెట్ మార్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి చురకలు అంటించింది. అయితే హిందీకి తాము వ్యతిరేకం కాదని, తమిళానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ విధానమని మంత్రి రాజ్మోహన్ అంటున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తుది తీర్పు కాదని, కేసు ఇంకా విచారణలోనే ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో సీఎం విజయ్ చర్చిస్తున్నట్లు సమాచారం.నవోదయ పాఠశాలల కోసం ప్రతి జిల్లాలో భూమిని గుర్తించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న వెనక్కి తీసుకోలేదు. మరో మూడు నెలల గడువు ఇచ్చింది. కేంద్రం, రాష్ట్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం.. తమిళనాడు హిందీపై తన ‘మైండ్సెట్’ మార్చుకోవాలని, రాష్ట్రంలో హిందీ బోధించకూడదనే వైఖరి ఉండకూడదని వ్యాఖ్యానించింది.ఈ పరిణామాల మధ్య తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వ వైఖరికి మద్దతు తెలిపారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు అవసరం లేదని, ఇప్పటికే మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి నవోదయ పాఠశాలలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. అదే సమయంలో హిందీకి తాము వ్యతిరేకం కాదని, హిందీని బలవంతంగా అమలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.దీంతో తమిళనాడులో అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. రాజకీయంగా పరస్పరం విభేదిస్తున్నప్పటికీ భాషా విధానం విషయంలో ఒకే వైఖరితో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య ఈ వివాదం తదుపరి విచారణలో ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: బెంగాల్లో బీజేపీ సర్కార్.. మరీ ఇంత ఘోరమా?
ఇరాన్లో ఏం జరుగుతోంది.. అమెరికా, ఇజ్రాయెల్కు కొత్త పరీక్ష!
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. వేలాది మంది మిలటరీ దుస్తులు ధరించి, ఇరాన్ జెండాలు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికా దురాక్రమణ ప్రయత్నాలను అడ్డుకుంటామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని నినాదాలు చేశారు. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత టెహ్రాన్లో జరిగిన అతిపెద్ద ర్యాలీ ఇదేనని పలు కథనాలు పేర్కొంటున్నాయి. సుమారు 3 లక్షల మంది పాల్గొన్నట్టు ఇరాన్ ప్రభుత్వ టీవీ అంచనా వేసింది.ఇరాన్ ప్రభుత్వం చేపట్టిన ‘జన్ఫాదే–ఇరాన్’ (ఇరాన్ కోసం ప్రాణాలర్పించేవారు) ప్రచారోద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాల్గొన్న వారికి ఆయుధ శిక్షణ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయడంలో కీలకంగా ఉండే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్, బసీజ్ మిలీషియాలకు వీరు అదనపు బలంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేరేందుకు ఇప్పటికే 6 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ హస్సన్ హస్సన్జాదెహ్ తెలిపారు. త్వరలోనే ఇతర నగరాల్లోనూ ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తామని బసీజ్ విభాగం నూతన సారథి హొస్సేన్ తాయెబ్ ప్రకటించారు.ర్యాలీని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, మిలటరీ కమాండర్లు, సీనియర్ అధికారులు పరిశీలించారు. కొందరు పాల్గొనేవారు అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ దేశాల జెండాలను తొక్కుకుంటూ వెళ్లారు. మరోవైపు ఓ ట్రక్కుపై మహిళా గార్డులు మెషీన్ గన్లతో కనిపించడం ర్యాలీలో ప్రత్యేకంగా నిలిచింది.Women present in today's rally of ´Sacrifice for Iran' in Tehran pic.twitter.com/YiiLOO3rov— Farzaneh Ashoorioun | فرزانه عشوریون (@frzaneh_a) September 18, 2026 ఇరాన్కు ప్లస్.. ఇదిలా ఉండగా.. యుద్ధం కొనసాగుతున్న వేళ జరిగిన ఈ భారీ ర్యాలీని ఇరాన్ ప్రభుత్వం దేశ ప్రజాబలాన్ని, ప్రతిఘటన సామర్థ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లింది. అమెరికా ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య దేశంలో ఐక్యతను చాటే ప్రయత్నంగానూ దీనిని అంతర్జాతీయ మీడియా విశ్లేషించింది. ఇప్పటికే 6 లక్షల మంది వాలంటీర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు చెబుతుండటం, ఇతర నగరాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించడం.. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలను మరింతగా సమీకరించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్న విషయాన్ని సూచిస్తోంది.ట్రంప్కు టెన్షన్.. ఇదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఇరాన్ ప్రజలు అమెరికా దాడులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించిన సమయంలో.. యుద్ధం మధ్యలో ఇరాన్ ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రజలను సమీకరించి ప్రతిఘటనకు సిద్ధమవుతున్నట్లు చూపిస్తోంది. ఈ పరిణామం అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.ఇదీ చదవండి: ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం🚨🇮🇷 🇺🇸 Iranians marched under a "we will kill" banner showing Trump in crosshairs as 600,000 sign up for military trainingGen. Hassan Hassanzadeh gave that recruitment figure at Friday's rally in Tehran, where state media counted 300,000 in the streets under the banner "ones… pic.twitter.com/BxKY00yrnz— Mario Nawfal (@MarioNawfal) September 19, 2026
టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేల్చేసింది. జంతు కొవ్వు కలిసిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019 నుంచి 2024 మధ్య టీటీడీకి సరఫరా అయిన నెయ్యికి సంబంధించి అన్ని విధాలా విచారించింది. ఏ దశలో కూడా జంతువుల కొవ్వు కలిపారనే దానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని గుర్తించింది. తద్వారా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు పనిగట్టుకుని దు్రష్పచారం చేసినట్లు తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు.. భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయన్న ఆలోచన లేకుండా, కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దారుణంగా ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడారని నిరాధారంగా ప్రకటించి కలకలం రేపారు. చంద్రబాబు సీఎం అయ్యాకే.. తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్లలో నాణ్యత లేదని కొన్నింటిని వెనక్కు పంపడం, ఆ నెయ్యి అసలే వాడక పోయినా.. వాడారంటూ అబద్ధం చెప్పడం.. దానిపై ఎల్లో మీడియా వరుస కథనాలు వెలువరించడం.. సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం.. సీబీఐ సిట్ కూడా దర్యాప్తు చేసి, జంతుకొవ్వు కలవలేదని నివేదిక ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో ఇదే విషయమై తిరుపతిలో నమోదైన కేసుపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. పలు సంస్థలను, పలువురిని విచారించి.. ఎట్టకేలకు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్దారించింది. చంద్రబాబు కేవలం తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ భాగస్వామ్య సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా తప్పుడు ఆరోపణలు, దు్రష్పచారం చేశారని ఇదివరకే స్పష్టమైంది. ఇప్పుడు ఈడీ కూడా జంతువుల కొవ్వు కలవలేదని తేల్చడంతో ఇదంతా చంద్రబాబు డైవర్షన్ డ్రామా అని మరోమారు స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హామీలు నెరవేర్చలేని తరుణంలో ఎప్పటికప్పుడు డైవర్షన్ డ్రామాలకు తెర లేపడం చంద్రబాబుకు అలవాటేనని, ఆ పరంపరలోనే శ్రీవారి లడ్డూపై కూడా ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. After CBI-led SIT, even ED investigation confirms that "animal fat", as claimed by Andhra Pradesh CM @ncbn in 2024, was not used to adulterate ghee used in Tirumala Tirupati Devasthanam's Srivari prasadam. ED's probe also points to chemical & plant based adulterants. For 2… https://t.co/Gm4INAzthq pic.twitter.com/lgk1Hprd8l— Anusha Ravi Sood (@anusharavi10) September 18, 2026
నితీశ్ రెడ్డిపై గంభీర్ ప్రశంసలు.. వరల్డ్కప్ జట్టులో చోటు ఖాయమే!
గల్ఫ్లో కొత్త యువరాజు ఎంట్రీ.. మోదీ, పుతిన్తో భేటీపై కొత్త చర్చ
స్పాల్లోకి వెళ్లిన పోలీసులు.. లోపల సీన్ చూసి షాక్!
‘మరో రోహిత్ వేముల..’ దళిత పీహెచ్డీ విద్యార్థి ఆవేదన
హైదరాబాద్లో కానిస్టేబుల్ భార్య అత్మహత్య
గంటలో 106 పుల్-అప్స్ : చీరకట్టుతో నటి ఫిట్నెస్ ఫీట్
నటనకు అవకాశం ఉంటే అలాంటి పాత్రనైనా చేస్తా :భాగ్యశ్రీ
‘AIతో ప్రపంచం అంతం’పై ఎన్విడియా సీఈవో కామెంట్
మరోసారి టీమిండియాకు అదే ‘గండం’.. స్పందించిన బీసీసీఐ
ముక్కును నరికిన భర్త.. ప్రైవేట్ పార్ట్ను కొరికిన భార్య!
ఏదో రకంగా ఒక కూలర్ పెట్టించండి స్వామీ! మీకు పుణ్యముంటుంది!!
సాక్షి కార్టూన్ 17-09-2026
ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి
కత్రినాపై బాడీ షేమింగ్.. పాకిస్తాన్ నటుడు మద్దతు
బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం
సాక్షి కార్టూన్ 19-09-2026
ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
ఆడమ్ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్
పసిడి ప్రియులకు తీపి కబురు.. తులం ఎంతంటే..
చచ్చీ చెడి సెమీస్కు చేరిన పాక్
కియా నుంచి భారీ ఎలక్ట్రిక్ వ్యాన్ వచ్చేస్తోంది..
'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్'
పెద్ది, ఇరుముడి కాదు.. ఆస్కార్ బరిలో ఊహించని సినిమా..!
అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్!
బిగ్బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
ఈ రాశి వారికి గృహయోగం
SIR: ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్
సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్
ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్
నితీశ్ రెడ్డిపై గంభీర్ ప్రశంసలు.. వరల్డ్కప్ జట్టులో చోటు ఖాయమే!
గల్ఫ్లో కొత్త యువరాజు ఎంట్రీ.. మోదీ, పుతిన్తో భేటీపై కొత్త చర్చ
స్పాల్లోకి వెళ్లిన పోలీసులు.. లోపల సీన్ చూసి షాక్!
‘మరో రోహిత్ వేముల..’ దళిత పీహెచ్డీ విద్యార్థి ఆవేదన
హైదరాబాద్లో కానిస్టేబుల్ భార్య అత్మహత్య
గంటలో 106 పుల్-అప్స్ : చీరకట్టుతో నటి ఫిట్నెస్ ఫీట్
నటనకు అవకాశం ఉంటే అలాంటి పాత్రనైనా చేస్తా :భాగ్యశ్రీ
‘AIతో ప్రపంచం అంతం’పై ఎన్విడియా సీఈవో కామెంట్
మరోసారి టీమిండియాకు అదే ‘గండం’.. స్పందించిన బీసీసీఐ
ముక్కును నరికిన భర్త.. ప్రైవేట్ పార్ట్ను కొరికిన భార్య!
ఏదో రకంగా ఒక కూలర్ పెట్టించండి స్వామీ! మీకు పుణ్యముంటుంది!!
సాక్షి కార్టూన్ 17-09-2026
ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి
కత్రినాపై బాడీ షేమింగ్.. పాకిస్తాన్ నటుడు మద్దతు
బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం
సాక్షి కార్టూన్ 19-09-2026
ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
ఆడమ్ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్
పసిడి ప్రియులకు తీపి కబురు.. తులం ఎంతంటే..
చచ్చీ చెడి సెమీస్కు చేరిన పాక్
కియా నుంచి భారీ ఎలక్ట్రిక్ వ్యాన్ వచ్చేస్తోంది..
'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్'
పెద్ది, ఇరుముడి కాదు.. ఆస్కార్ బరిలో ఊహించని సినిమా..!
అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్!
బిగ్బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
ఈ రాశి వారికి గృహయోగం
SIR: ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్
సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్
ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్
ఫొటోలు
తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)
సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు)
ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు)
మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు)
బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు)
హైదరాబాద్ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు)
తిరుమల : సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో శ్రీమలయప్ప అభయం (ఫొటోలు)
ది ప్యారడైజ్ లుక్లో హీరో నాని.. ఫోటోలు
ఇటలీలో హీరో వరుణ్ తేజ్ ఫ్యామిలీ చిల్.. ఫోటోలు
సినిమా
ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు
మొన్నటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ‘ఇరుముడి’ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో సినిమా మిస్ అయినవారు ఇంటి వద్దే చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుండడంతో వైరల్గా మారుతున్నాయి.ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు.. ముఖ్యంగా పల్లెల్లో ‘ఇరుముడి’ని ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. వీధుల్లో పెద్ద స్క్రీన్లు పెట్టి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సినిమాను చూస్తున్న వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా కొన్ని గ్రామాల్లో వెండి తెరపై సినిమాను ప్రదర్శించడం విశేషంగా మారింది. థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులు ఇలా తమ గ్రామాల్లోనే సినిమాను చూసే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘ఇరుముడి’ ఓటీటీలోనే జోరు చూపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గ్రామల్లో ప్రదర్శనల వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.200 కోట్లకు పైగా కలెక్షన్లుకాగా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించారు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో విశేషాదరణ దక్కించుకుంది. దీంతో బాక్సాఫీసులో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం సెప్టెంబరు 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదీ చదవండి: బిగ్బాస్ తొలి కెప్టన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా Vizianagaram district devada village lo irumudi movie grama prajalu inkaa aadharisthunnaru. Vinayaka chavithi sandharbam gaa committee members ilaa grama prajaliki chupisthunnaru🙏🙏🙏#irumudimovie #mythrimoviemakers#gvprakash#raviteja#sivanirvana pic.twitter.com/xPBhrmbrlJ— 𝗥𝗔𝗝𝗔𝗦𝗔𝗔𝗕 (@RAJU_BHAI_LUV) September 18, 2026
బిగ్బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ రేసు ఆసక్తికరంగా సాగింది. ఓవైపు కంటెస్టెంట్లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడుతుండగా.. మరోవైపు హౌస్లో నవ్వులు పూయించేలా కామెడీ స్కిట్ చేశారు. రాంప్రసాద్, నరేశ్, వంశీ, రోహిత్, అమన్ కలిసి ‘ఛత్రపతి’ సినిమాలోని ‘ఓ సూరీడు’ కామెడీ సీన్ను రీక్రియేట్ చేశారు. మరి నిన్నటి ఎపిసోడ్లో ఝాన్సీ కెప్టెన్ ఎలా అయిందో ఒకసారి చూద్దాం రండి!ఓ సూరీడు.. అదిరిపోయిన స్కిట్స్కిట్లో వంశీ ప్రభాస్ పాత్రలో కనిపించగా.. రాంప్రసాద్ చిన్న పిల్లాడు సూరీడుగా అలరించాడు. నరేశ్ రౌడీ కాట్రాజ్ పాత్రలో నటించాడు. అమన్ వంశీ ఫ్రెండ్గా కనిపించగా.. ఝాన్సీ సూరీడు తల్లి పాత్రలో నటించింది. సినిమా సీన్ను హౌస్మేట్స్ తమదైన శైలిలో రీక్రియేట్ చేయడంతో స్కిట్ మొత్తం నవ్వులు పూయించింది. స్కిట్ పూర్తయ్యాక బిగ్బాస్ కూడా మంచి మార్కులే ఇచ్చాడు. స్కిట్ బాగుంది.. కానీ నరేశ్ కాట్రాజ్ పాత్రలో కండలు మరీ ఎక్కువగా చూపించాడంటూ సరదాగా కామెంట్ చేశాడు. అలాగే రాంప్రసాద్ను ఉద్దేశించి సూరీడు మరీ పసిపిల్లాడిలా అయిపోయాడంటూ జోక్ చేశాడు.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..‘చిక్కకు దొరకకు’.. కెప్టెన్సీ టాస్క్ఆ తర్వాత కెప్టెన్సీ రేసులో ఉన్న ముకేశ్, షాలిని, ఝాన్సీ, రాంప్రసాద్, త్రిగుణ్లకు బిగ్బాస్ ‘చిక్కకు దొరకకు’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో మిగిలిన పది మంది గార్డులుగా వ్యవహరించాలి. ఈ ఐదుగురు పోటీదారులు జైలులో ఉండాలి. గార్డుల నుంచి తప్పించుకుని గోడ దాటి సేఫ్ జోన్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. సేఫ్ జోన్లోకి చేరుకోలేని పోటీదారులు కెప్టెన్సీ రేసు నుంచి ఎలిమినేట్ అవుతారు. ఈ టాస్క్లో వంశీ, రోహిత్ హెడ్ గార్డులుగా వ్యవహరించారు. టాస్క్ ప్రారంభానికి ముందు ఐదుగురు పోటీదారులు తాము ఎందుకు కెప్టెన్ కావాలనుకుంటున్నారో వివరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరూ కెప్టెన్ అయితే హౌస్లో ఏం చేస్తారో చెప్పారు. ఇదీ చదవండి: మహిళల అభివృద్ధికి సినీ సెలబ్రిటీల సంచలన నిర్ణయంబయట ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినట్టుగానే.. హౌస్లోని కంటెస్టెంట్లు కూడా తాము కెప్టెన్ అయితే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ హామీలు ఇచ్చారు. దీంతో వారి చిన్నపాటి ‘కెప్టెన్సీ మేనిఫెస్టో’ ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత గార్డులు తమ నిర్ణయం ప్రకారం చివరికి రాంప్రసాద్, ఝాన్సీలను కెప్టెన్సీ పోటీలో నిలిపారు. దీంతో వీరిద్దరి మధ్య చివరి పోటీ ఆసక్తికరంగా మారింది.ఝాన్సీనే కొత్త కెప్టెన్రాంప్రసాద్, ఝాన్సీలకు బిగ్బాస్ ‘పవర్ ఆఫ్ కెప్టెన్సీ’ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఇద్దరు పోటీదారుల ముందు ఇనుప నెట్ను ఏర్పాటు చేశారు. పట్టకర్రతో ఆ నెట్ను తొలగిస్తూ లోపలికి వెళ్లాలి. అక్కడ ఉన్న పెట్టెలోని కీని తీసుకుని.. అందులో ఉన్న చిన్న మూటను తీసుకోవాలి. ఆ మూటలో ఉన్న ‘C’ అనే లెటర్ను జెండాకు అతికించి.. ఆ తర్వాత కెప్టెన్ జెండాను ఎగరేయాలి. ఈ టాస్క్లో రాంప్రసాద్పై ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్బాస్ హౌస్కు కొత్త కెప్టెన్గా ఝాన్సీ నిలిచింది. కెప్టెన్గా ఎంపికైన ఝాన్సీకి వైట్ గోల్డ్ సంస్థ.. లక్ష విలువైన గోల్డ్ కాయిన్ బహుమతిగా అందించింది. అనంతరం ఝాన్సీ కోసం ప్రత్యేకంగా కెప్టెన్సీ గదిని కూడా బిగ్బాస్ ఓపెన్ చేశాడు. అయితే ఆ రూంలో కెప్టెన్కి మాత్రమే ప్రవేశం ఉంటుందని గుర్తుచేశాడు. ఇదీ చదవండి: ‘ఆయా షేర్’ రీల్స్ కోసం లక్ష జడలు కొన్నారు: నాని
ఆస్కార్ బరిలో గోంధళ్
మరాఠి థ్రిల్లర్ సినిమా ‘గోంధళ్’ ఆస్కార్ బరిలో నిలిచింది. వచ్చే ఏడాది మార్చి 14న అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో 99వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 15). కాగా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ కోసం భారతదేశం నుంచి ‘గోంధళ్’ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల్లో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ కోసం 33 సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’, ‘హక్’, ‘హనుమాన్ అంశ్’, ‘బోర్డర్ 2’, ‘120 బహదూర్’, ‘ఇక్కీస్’ వంటి 14 హిందీ సినిమాలున్నాయి. అలాగే ‘పెద్ది’, ‘ఇరుముడి’, ‘సింగ్ గీతం’, ‘ఇగ్వా (ఇంకా విడుదల కావాల్సి ఉంది)’ వంటి నాలుగు తెలుగు సినిమాలతో పాటుగా, మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’ కూడా ఉంది. ఈ చిత్రాలన్నింటినీ దాటుకుని ‘గోంధళ్’ మూవీ ఆస్కార్ అవార్డుల పోటీకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.కథ ఏంటంటే..?ఇషితా దేశ్ముఖ్, యోగేష్ సోహోని, అనుజ్ ప్రభు, నిషాద్ భోయిర్, కిషోర్ కదమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గోంధళ్’. సంతోష్ దవఖర్ దర్శకత్వంలో దీక్షా దవఖర్ నిర్మించిన ఈ చిత్రం 2025 నవంబరు 14న విడుదలైంది. సంప్రదాయం, మోసం, అధికారం, ఆకాంక్షల అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రం కథ విషయానికి వస్తే... మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా పెళ్లయిన దంపతుల జీవితంలోని అడ్డంకులు తొలగిపోవడానికి రాత్రంతా సంగీతం, నృత్యం, పురాణ కథలతో ‘గోంధళ్’ అనే సంప్రదాయ జానపద పూజ నిర్వహిస్తారు. ఈ పూజ నేపథ్యంతోనే ఈ కథ సాగుతుంది. ఆనంద్ (యోగేష్ సోహోని)తో సుమన్ (ఇషితా దేశ్ముఖ్) వివాహం జరుగుతుంది. కానీ, గతంలోనే గోంధల్ ప్రదర్శకుడు సాహెబ్రావ్ (అనుజ్ ప్రభు)ను సుమన్ ప్రేమిస్తుంది. మరి.. ఆ రాత్రి ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ. కాగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగపు నామినేషన్ కోసం గతంలో ‘హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’, ‘శ్వాస్’, ‘కోర్ట్’ వంటి మరాఠి చిత్రాలు పోటీలో నిలిచినా నామినేషన్ దక్కలేదు. మరి..‘గోంధళ్’కు అయినా ఆస్కార్ నామినేషన్ లభిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మదర్ ఇండియా’, ‘సలామ్ బాంబే’, ‘లగాన్ ’ చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్లోని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందినప్పటికీ అవార్డు మాత్రం లభించలేదు.
ప్రేమనే ఊరిలో...
‘‘ప్రేమనే ఊరిలో’ అనే టైటిల్, టీజర్ చాలా బాగుంది. టీజర్లో శ్రీకాంత్గారి వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది. నటీనటులు తెరపై అద్భుతంగా కనిపించారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ మంచి పేరు రావాలి, అలాగే నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’’ అని హీరోయిన్ కామాక్షి భాస్కర్ల పేర్కొన్నారు. శ్రీరామ్, రామికా శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మనోజ్ కుమార్ దర్శకత్వంలో మహారత్న ప్రొడక్షన్స్, ఎస్.కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. సునాద్ గౌతమ్ సంగీతం అందించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్కి కామాక్షి భాస్కర్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చందు శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘ప్రేమనే ఊరిలో’తో నిర్మాతగా మారాను. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘నేను గతంలో చేసిన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’ సినిమాల స్థాయిలో ‘ప్రేమనే ఊరిలో’ ఉంటుంది’’ అని సురేష్ కొండేటి తెలిపారు. ‘‘నాకు కన్నడ ఇండస్ట్రీతో పాటుగా తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం’’ అని శ్రీరామ్ పేర్కొన్నారు.
క్రీడలు
సెమీస్లో ఓటమి.. అయినా మరో అవకాశం!
ఆసియా క్రీడలు-2026లో భారత టెక్బాల్ స్టార్ క్విమ్సీ డిసౌజాకు చేదు అనుభవం ఎదురైంది. మహిళల సింగిల్స్లో ఆది నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ముంబైకర్ సెమీ ఫైనల్లో మాత్రం ఓటమిపాలైంది.ఇండోనేషియాకు చెందిన ఇమా సుమయతో సెమీస్లో తలపడ్డ క్విమ్సీ తొలి సెట్ను 12-7తో గెలుచుకుంది. అయితే, సుమయ అనూహ్య రీతిలో పుంజుకుని రెండో సెట్ను 12-9తో సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో పట్టువదలని సుమయ 12-7తో క్విమ్సీపై పైచేయి సాధించింది.ఫలితంగా సుమయా ఫైనల్కు అర్హత సాధించింది. అయితే, సెమీస్లో ఓడినప్పటికీ క్విమ్సీకి పతకం గెలిచేందుకు మరో అవకాశం ఉంది. ఆదివారం జరిగే కాంస్య పతక పోరులో ఆమె జపాన్కు చెందిన యియునా సకామొటోతో అమీతుమీ తేల్చుకుంటుంది. ఎవరీ క్విమ్సీ డిసౌజా?ముంబైకి చెందిన క్విమ్సీ పదమూడేళ్ల వయసులో మిడిల్ డిస్టాన్స్ రన్నర్గా తన క్రీడా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఫుట్బాల్పై మక్కువ పెంచుకున్న 24 ఏళ్ల ఈ అమ్మాయి ఏజ్ గ్రూప్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించింది.అయితే, ఆశించిన రీతిలో కెరీర్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో క్విమ్సీ.. చదువు మీద శ్రద్ధ పెట్టింది. స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసి.. క్రీడా వస్తువుల రీటైలర్ డెకథ్లాన్లో ఉద్యోగంలో చేరింది. అక్కడే ఆమెకు టెక్బాల్ పరిచయమైంది.బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం రినాల్డిన్హో ఇన్స్టాగ్రామ్ వీడియోలో టెక్బాల్ ఆటను వీక్షించిన క్విమ్సీకి ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో కఠోర శ్రమతో క్రమక్రమంగా భారత టెక్బాల్ స్టార్గా ఎదిగింది. అంతర్జాతీయ స్థాయిలో టెక్బాల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించిన తొలి మహిళా టెకర్గా నిలిచింది.ఏడుసార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన క్విమ్సీ.. బెంగళూరులో టెక్బాల్ క్లబ్ స్థాపించి.. క్రీడను ప్రోత్సహిస్తోంది. ఇటీవల రొమేనియాలో జరిగిన టెక్బాల్ ప్రపంచ చాంపియన్షిప్స్లో క్విమ్సీ తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఇక తాజాగా ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్లో గ్రూప్-ఎ నుంచి తలపడ్డ క్విమ్సీ.. తొలుత జపాన్ టెకర్ యియునా సకామొటోపై 2-1తో గెలిచింది. ఆ తర్వాత కాంబోడియా టెకర్ కొయెమైయన్ను ఓడించింది. ఈ క్రమంలో గ్రూప్-ఎ టాపర్గా నిలిచి సెమీస్కు అర్హత సాధించింది. అయితే, సెమీస్లో మాత్రం ఓటమి ఎదురైనప్పటికీ.. కాంస్య పతక పోరులో నిలవగలిగింది.ఏమిటీ టెక్బాల్?ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్ల కలయికే ఈ గేమ్. వాలుగా ఉన్న టేబుల్ పైనున్న నెట్ మీదుగా.. ఆటగాళ్లు తమ పాదాలు, కాళ్లు, ఛాతీ, తలతో ఫుట్బాల్ను కొడుతుంటారు. చేతులు, భుజాలు కాకుండా శరీరంలోని ఏ భాగంతోనైనా ఫుట్బాల్ను హిట్ చేయొచ్చు. సింగిల్స్, డబుల్స్ ఫార్మాట్లలో దీనిని నిర్వహిస్తారు. హంగేరీలో 2014లో ఈ క్రీడను కనుగొన్నారు.
హెట్మైర్ శతకం వృధా
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026 తుది అంకానికి చేరింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, జమైకా కింగ్స్మన్ జట్లు సెప్టెంబర్ 20న టైటిల్ కోసం పోరాడతాయి. ఇవాళ జరిగిన క్వాలిఫయర్-2లో గయానా అమెజాన్ వారియర్స్పై గెలిచి జమైకా కింగ్స్మన్ ఫైనల్కు చేరింది.ఈ మ్యాచ్లో వారియర్స్ భారీ స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో వారియర్స్ తరఫున షిమ్రోన్ హెట్మైర్ అజేయ మెరుపు శతకం (45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 102 నాటౌట్) వృధా అయ్యింది. కింగ్స్మన్ను వారి కెప్టెన్ రోవ్మన్ పావెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (17 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి గెలిపించారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్, హెట్మైర్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని కింగ్స్మన్ సునాయాసంగా ఛేదించింది. ఆ జట్టు తరఫున ప్రతి ఒక్కరు రాణించారు. కీసీ కార్తీ 56, మాజ్ సదాకత్ 41, కిర్క్ మెకెంజీ 34, సైమ్ అయూబ్ 23, రోవ్మన్ పావెల్ 40 పరుగులు చేశారు. ఇదీ చదవండి: పాక్ ప్లేయర్ హ్యాట్రిక్
భారత్తో సిరీస్కు ముందు న్యూజిలాండ్కు బిగ్ షాక్
త్వరలో భారత్తో జరుగబోయే టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర గాయంతో ఈ సిరీస్కు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆక్లాండ్లో సెప్టెంబర్ 16న స్కై సంస్థ నిర్వహించిన ప్రమోషనల్ షూట్లో డైవింగ్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రచిన్ కుడి భుజం డిస్లోకేషన్కు గురైంది. దీంతో అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో అతడు ఆడటం అనుమానంగా మారింది. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును వచ్చే వారం ప్రకటించనున్నారు. కాగా, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు ఐదు వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం అక్టోబర్ 22 నుంచి భారత జట్టు న్యూజిలాండ్లో పర్యటించనుంది.షెడ్యూల్అక్టోబర్ 22, 2026 తొలి టీ20 క్రైస్ట్చర్చ్ మధ్యాహ్నం 12:30 (భారతకాలమానం ప్రకారం)అక్టోబర్ 24, 2026 రెండో టీ20 క్రైస్ట్చర్చ్ మధ్యాహ్నం 12:30అక్టోబర్ 27, 2026 మూడో టీ20 వెల్లింగ్టన్ మధ్యాహ్నం 12:30అక్టోబర్ 30, 2026 నాలుగో టీ20 ఆక్లాండ్ మధ్యాహ్నం 12:30నవంబర్ 1, 2026 ఐదో టీ20 హామిల్టన్ మధ్యాహ్నం 12:30నవంబర్ 4, 2026 తొలి వన్డే ఆక్లాండ్ ఉదయం 6:30నవంబర్ 7, 2026 రెండో వన్డే వెల్లింగ్టన్ ఉదయం 6:30నవంబర్ 10, 2026 మూడో వన్డే హామిల్టన్ ఉదయం 6:30నవంబర్ 13, 2026 నాలుగో వన్డే టౌరంగ ఉదయం 6:30నవంబర్ 15, 2026 ఐదో వన్డే టౌరంగ ఉదయం 6:30నవంబర్ 19–23, 2026 తొలి టెస్టు వెల్లింగ్టన్ ఉదయం 3:30నవంబర్ 27–డిసెంబర్ 1, 2026 రెండో టెస్టు క్రైస్ట్చర్చ్ ఉదయం 3:30ఇదీ చదవండి: పాక్ ప్లేయర్ హ్యాట్రిక్
పాక్ ప్లేయర్ హ్యాట్రిక్
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో పాకిస్తాన్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ హ్యాట్రిక్తో చెలరేగాడు. ఈ టోర్నీలో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. గయానా అమెజాన్ వారియర్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోటీలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఫాల్కన్స్ వారియర్స్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు దూసుకెళ్లింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వారియర్స్, షాదాబ్ ఖాన్ (4-0-16-4), సుఫ్యాన్ మొఖీమ్ (4-0-13-4) ధాటికి 15 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది.వారియర్స్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (16), మవేంద్ర దిండ్యాల్ (11), షాయ్ హోప్ (16), రొమారియో షెపర్డ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయడంతో వారియర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం ఫాల్కన్స్ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 5.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రఖీమ్ కార్న్వాల్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి ఫాల్కన్స్ను గెలిపించాడు. మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ (13 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఫాల్కన్స్ను విజయతీరాలకు చేర్చాడు.ఈ మ్యాచ్లో ఓడినా వారియర్స్కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. శుక్రవారం క్వాలిఫయర్-2లో కింగ్స్మెన్పై గెలిస్తే ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో ఫాల్కన్స్ను ఎదుర్కొంటుంది.ఇదీ చదవండి: ఆడమ్ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేసిన హైకోర్టు... ఆయన పార్టీ ఫిరాయించినట్లు నిర్ధారణ
ఏపీలో ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్... సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ‘పోలీసింగ్’... మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసనకు YSRCP పిలుపు..
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
బిజినెస్
టాటా సన్స్ను లిస్ట్ చేయాల్సిందే
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ లిస్టింగ్కు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మద్దతు తెలిపింది. లిస్టింగ్ను టాటా ట్రస్ట్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ టాటా సన్స్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత బలం చేకూరుస్తోంది. టాటా సన్స్లో 18.6 శాతం వాటాతో రెండో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న ఎస్పీ గ్రూప్.. లిస్టింగ్ కోసం చాన్నాళ్లుగా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. పబ్లిక్ లిస్టింగ్ వల్ల సంస్థలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం కూడా బలోపేతమవుతాయని ఎస్పీ గ్రూప్ చైర్మన్ షాపూర్ మిస్త్రీ చెప్పారు. టాటా సన్స్ బోర్డు సమావేశంలో చైర్మన్ చంద్రశేఖరన్కు మరో ఐదేళ్ల పొడిగింపుతో పాటు కంపెనీ లిస్టింగ్కు మెజారిటీ డైరెక్టర్లు ఓకే చెప్పడం.. దీన్ని టాటా ట్రస్ట్స్ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో గ్రూప్పై పట్టు కోసం ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఈ తరుణంలో కీలకమైన వాటాదారుల్లో ఒకటైన ఎస్పీ గ్రూప్ లిస్టింగ్కు సై అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ చేయడం అనేది కేవలం ఆర్థికపరమైన, నియంత్రణపరమైన అంశం మాత్రమే కాదని,.. సామాజిక, నైతిక ఆవశ్యకత అని మిస్త్రీ పేర్కొన్నారు. టాటా ట్రస్ట్ల దాతృత్వ పాత్రను కాపాడుకుంటూనే, పాలనను బలోపేతం చేసేందుకు ఇది మంచి అవకాశమన్నారు. టాటా సన్స్లో టాటా ట్రస్ట్లకు 66% మెజారిటీ వాటా ఉంది. ఇదిలా ఉంటే, టాటా సన్స్ను ప్రైవేటు కంపెనీగా కొనసాగించేందుకు ఎస్పీ గ్రూప్ వాటాలో కొంత భాగాన్ని బైబ్యాక్ చేయడం ద్వారా కనీసం రూ.25,000 కోట్లు అందించేలా టాటా ట్రస్ట్స్ మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. సమస్యకు సామరస్య పరిష్కారం... టాటా సన్స్ లిస్టింగ్ అనేది ఒక వారధిగా మారగలదని మిస్త్రీ వ్యాఖ్యానించారు. ఈ అంశం విభేదాలకు ములంగా మారకుండా... వాటాదారులు, టాటా ట్రస్ట్స్, ఇతర పక్షాల మధ్య సయోధ్య కుదరాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని సామరస్యంగా, ఉమ్మడి లక్ష్యంతో పరిష్కరించుకోవాలని టాటా గ్రూప్ ట్రస్టీలు, డైరెక్టర్లు, వాటాదారులు, ఉద్యోగులను కోరారు. మరింత లోతైన, సౌహార్ద్రపూర్వక సంబంధాల కోసం టాటా సన్స్, ట్రస్ట్లతో కలిసి పని చేయడానికి ఎస్పీ గ్రూప్ సిద్ధంగా ఉందని కూడా మిస్త్రీ పేర్కొన్నారు. ఏ ఒక్క పక్షానికో విజయం చేకూర్చడం కాకుండా.. పటిష్టమైన టాటా సామ్రాజ్యం, బలమైన దాతృత్వం, మరింత జవాబుదారీతనం, విస్తృత భాగస్వామ్యం.. అంతిమంగా భారత్కు మరింత సేవ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
మన దగ్గరా ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు తాజాగా భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో చాంతాడంత క్యూలు కనిపించాయి. పలువురు ఫ్యాన్స్ తమ పాత ఐఫోన్లను అప్గ్రేడ్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ‘మూడు కెమెరాలు, అప్గ్రేడ్ చేసిన అనేక ఫీచర్లు, మెరుగైన పనితీరుతో పాటు షో ఆఫ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. పైగా యాపిల్ అనేది చాలా పెద్ద బ్రాండ్ కూడా. సెప్టెంబర్ 12 సాయంత్రం ప్రీ–బుక్ చేసుకుంటే 18 ఉదయం 8.15 గం.కి మొదటి స్లాట్ దొరికింది. మొత్తానికి మొదటి ఫోన్ అందుకున్నా‘ అని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న అమెరికాలో ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో ధర భారత్లో రూ. 1,64,900 నుంచి, 18 ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,79,900 నుంచి ప్రారంభమవుతుంది. బ్లాక్, సిల్వర్ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ’డ్యుయో’ని ప్రవేశపెట్టింది. భారత్లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది.
భూటాన్ ప్రభుత్వానికి 54 కార్లు!
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్.. థింఫులో భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గేకు 54 మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e) ఎలక్ట్రిక్ కార్లను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.జైశంకర్ రెండు రోజుల భూటాన్ పర్యటన సందర్భంగా.. ఈ వాహనాలను అప్పగించారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి, ఇతర సీనియర్ నాయకులతో ఇంధనం, కనెక్టివిటీ.. విస్తృత ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. 54 ఎలక్ట్రిక్ వాహనాలను అప్పగించడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, ఈ-మొబిలిటీ.. సుస్థిర రవాణా రంగాలలో భూటాన్ సాధిస్తున్న పురోగతికి భారతదేశం మద్దతు ఇస్తోందని డాక్టర్ జైశంకర్ సోషల్ మీడియాలో తెలిపారు.మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈఎక్స్ఈవీ 9ఈ అనేది మహీంద్రా కంపెనీకి చెందిన ప్రత్యేకమైన INGLO ఆర్కిటెక్చర్పై నిర్మితమయ్యాయి. ఇది ప్రత్యేకంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్ల కోసం రూపొందించిన టెక్నాలజీ. ప్యాక్ టూ వేరియంట్ 59 కిలోవాట్ LFP బ్యాటరీ ప్యాక్ను.. వెనుక యాక్సిల్పై అమర్చిన ఒకే ఒక పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ను ఉపయోగిస్తుంది. ఇది దీనిని రియర్ వీల్ డ్రైవ్ SUVగా చేస్తుంది.ఈ మోటార్ 228 bhp పవర్, 380 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. రేంజ్ విషయానికి వస్తే.. 59 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 542 కిమీ రేంజ్ అందిస్తుంది. ఎక్స్ఈవీ 9ఈ 140 kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది, అనుకూల పరిస్థితులలో బ్యాటరీ సుమారు 20 నిమిషాల్లో 20 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ అవ్వగలదు. AC ఛార్జింగ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర భారతదేశంలో రూ. 21.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).Delighted to hand over 54 ‘Made in India’ electric vehicles to PM @tsheringtobgay. India is supporting Bhutan’s advances towards e-mobility and sustainability transport. 🇮🇳 🇧🇹 pic.twitter.com/RjgtftUzI2— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 17, 2026
జాబ్ చేస్తున్నారా.. జాగ్రత్త! కియోసాకి హెచ్చరిక
ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ముఖ్యంగా ఏఐ, ఆటోమిషన్, సాఫ్ట్వేర్ వంటి టెక్నాలజీలు.. కంపెనీలు పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. గతంలో ఒక పని చేయడానికి వందల మంది ఉద్యోగులు అవసరమైతే, ఇప్పుడు అదే పనిని తక్కువ మంది వ్యక్తులతో లేదా కొన్ని సాఫ్ట్వేర్ సిస్టం సహాయంతో చేయగలుగుతున్నారు. ఈ మార్పు కంపెనీలకు ప్రయోజనం కలిగించవచ్చు. కానీ ఇదే సమయంలో ఉద్యోగుల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ఈ విషయాన్ని కియోసాకి చెబుతున్నారు.కియోసాకి ప్రకారం.. మెటా కంపెనీ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. కొన్ని రోజులకు సంస్థ స్టాక్ మార్కెట్ విలువ 50 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే ఇక్కడ పెట్టుబడిదారులు లాభపడ్డారు. కంపెనీలో కోసం కష్టపడిన ఎంతోమంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.అదే హెచ్చరించానుతమ రాత్రులు, వారాంతాలు, కుటుంబ సమయాన్ని త్యాగం చేసిన ఉద్యోగులకు ఆటోమేటెడ్ టెర్మినేషన్ ఈమెయిల్ వచ్చింది. ఇదే సమయంలో వాటాదారులు మరింత ధనవంతులయ్యారు. ఇది వ్యవస్థలో లోపం కాదు, వ్యవస్థ రూపొందించిన విధంగానే పనిచేస్తోంది. అందుకే నేను దశాబ్దాలుగా దీని గురించి హెచ్చరిస్తూనే ఉన్నాను. ఉద్యోగుల వర్గం ఎప్పుడూ ఒక ఉచ్చుగానే ఉండేదని కియోసాకి చెప్పారు.చాలామంది ఒక కంపెనీకి నిజాయితీగా పనిచేస్తే, కంపెనీ కూడా మనకు జీవితాంతం భద్రత ఇస్తుందని అనుకుంటారు. అందుకోసమే మంచి పర్ఫామెన్స్ ఇవ్వాలి, ప్రమోషన్స్ పొందాలి, జీతం పెంచుకోవాలి, రిటర్మెంట్ వరకు అదే విధంగా కొనసాగాలి అనేది సాధారణమైన ఆలోచన. కానీ ప్రస్తుత ప్రపంచంలో కంపెనీల అవసరాలు మారుతున్నాయి. మార్కెట్ పరిస్థితులు, ఆటోమిషన్, ఏఐ వంటి కారణాల వల్ల ఒకప్పుడు అవసరమైన ఉద్యోగం భవిష్యత్తులో అవసరం లేకపోవచ్చు.ఉద్యోగం చెడ్డది కాదు, కానీ..ఉద్యోగం చెడ్డది అని కాదు. ఉద్యోగం ఇప్పటికీ చాలా మందికి స్థిరమైన ఆదాయాన్ని, అనుభవాన్ని ఇస్తుంది. కానీ.. మన మొత్తం ఆర్థిక భవిష్యత్తును ఒక్క జీతంపైనే ఆధారపెట్టడం ప్రమాదకరంగా మారవచ్చు. ఉద్యోగంతో పాటు మనకు సొంతంగా ఉండే ఆస్తులు లేదా ఇతర ఆదాయ మార్గాలను కూడా నిర్మించుకోవడం తప్పనిసరి.ఏఐ, ఆటోమిషన్ ఈ మార్పును మరింత వేగవంతం చేస్తున్నాయి. ఒక కంపెనీ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కువ పనిని తక్కువ ఖర్చుతో చేయగలిగితే, ఆ కంపెనీకి ప్రొడక్టివిటీ పెరగవచ్చు. దాని వల్ల ఏర్పడే అదనపు లాభం ఎక్కడికి వెళ్తుంది? అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. అది షేర్ హోల్డర్లకు వెళ్లవచ్చు, కంపెనీ విస్తరణకు ఉపయోగపడవచ్చు, కొత్త టెక్నాలజీలో పెట్టుబడి కావచ్చు. ఇక్కడ ఉద్యోగులు లాభపడేది ఏముంటుంది?.మీరు ఏ వైపు?రిచ్ డాడ్ పూర్ డాడ్ ప్రకారం.. పూర్ డాడ్ ఉద్యోగం మీద నమ్మకం ఉంచారు. విధేయతతో పనిచేశారు. రిచ్ డాడ్ ఎప్పుడూ వ్యవస్థను నమ్మలేదు. వ్యవస్థ తొలగించలేని ఆస్తులను ఆయన నిర్మించుకున్నాడు. ఉద్యోగం పోయినప్పుడు.. పూర్ డాడ్ ఇబ్బదులు ఎదుర్కొన్నారు. రిచ్ డాడ్ తాను నిర్మించుకున్న ఆస్తులతో ముందుకు సాగారు. మార్పు ఇప్పటికే మొదలైంది. ఇక మిగిలింది మీరు ఏ పక్షాన ఉన్నారనేదే ప్రశ్న అని కియోసాకి వెల్లడించారు.ఇదీ చదవండి: 'చరిత్రలో అతిపెద్ద క్రాష్ మొదలైంది': కియోసాకి హెచ్చరిక!
ఫ్యామిలీ
రాత్రి 10 తర్వాతే డిన్నర్
సాక్షి, హైదరాబాద్: మారిన జీవనశైలి, సుదీర్ఘమైన ప్రయాణాలు, ఆలస్యంగా తినే భోజనం నగర వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ ఉద్యోగుల్లో ఏకంగా 64 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాతే భోజనం (డిన్నర్) చేస్తున్నారని ఈవా ఇండియా వెల్నెస్ ఇండెక్స్ 2026 నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలోనే మొదటి టచ్ బేస్డ్ మెటబాలిక్ వెల్నెస్ ట్రాకర్ రూపొందించిన ఈ నివేదిక దేశవ్యాప్తంగా 30,000 మందికి పైగా వినియోగదారుల నుంచి సేకరించిన 35 లక్షలకు పైగా రీడింగ్ల ఆధారంగా రూపొందింది. శరీర విశ్రాంతికి విఘాతం.. రాత్రిపూట ఆలస్యంగా, అతిగా భోజనం చేయడం, ఒత్తిడి, నిద్రకు ముందు కాఫీ తాగడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకోలేకపోతోంది. మరుసటి రోజు ఉదయానికి శరీరం అలసటగా ఉండే ‘మెటబాలిక్ హ్యాంగోవర్’ ఎదురవుతోందని నివేదికలో వెల్లడించింది. ఉదయం పూట మధుమేహం స్థాయుల్లో హెచ్చుతగ్గులతో పాటు నిద్ర నాణ్యత పడిపోతోందని అధ్యయనం పేర్కొంది. దాదాపు 40 శాతం మంది నిద్రపోయే ముందు కాఫీ తీసుకోవడంతో గుండె స్పందన రేటు పెరుగుతోందని వెల్లడించింది. ఇతర నగరాల్లోనూ.. ముంబైలో 64 శాతం మంది రాత్రి 9.30 గంటల తర్వాతే తింటున్నారు. లోకల్ రైళ్ల ప్రయాణాలు వారిలో ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయి. బెంగళూరులో 44 శాతం మందికి సుదీర్ఘమైన ట్రాఫిక్ ప్రయాణాలతో రోజువారీ శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. ఢిల్లీ– ఎన్సీఆర్లో చలికాలపు పొగమంచుతో 30 శాతం మంది బయటకు రాకపోవడంతో వెల్నెస్ స్కోర్లు తగ్గుముఖం పట్టాయి.ఇలా చేస్తే మేలు.. చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్య స్కోర్ను 8 శాతం నుంచి 12 శాతం వరకు పెంచుకోవచ్చని ఈ అధ్యయనం సూచించింది. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిచే వారిలో షుగర్ లెవల్స్ 12–16 శాతం వరకు నియంత్రణలోకి వస్తున్నాయి. రాత్రి డిన్నర్ను వీలైనంత త్వరగా ముగించడం, కేఫిన్ (కాఫీ) తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యత, జీవక్రియను మెరుగుపరుచుకోవచ్చు.
డేటా సెంటర్ అంటే ఏమిటి?
డేటా సెంటర్ అంటే ఇంటర్నెట్కి లైబ్రరీ లాంటిది. మీరు మొబైల్లో చూసే యూట్యూబ్ వీడియోలు, ఆన్ లైన్ గేమ్స్, ఇన్ స్టా ఫోటోలు అవన్నీ భద్రంగా దాచే రహస్య ప్రదేశమే డేటా సెంటర్! అంటే వేల సంఖ్యలో సూపర్ కంప్యూటర్లు (సర్వర్లు) ఒకే చోట ఉండే పెద్ద భవనం. డేటా సెంటర్లో నాలుగు ముఖ్య భాగాలు ఉంటాయి: 1. సర్వర్లు 2. స్టోరేజ్ సిస్టమ్స్ 3. నెట్వర్క్ 4. కూలింగ్ సిస్టమ్స్. మన భారతదేశంలో ప్రస్తుతం 160కి పైగా పెద్ద డేటా సెంటర్లు పని చేస్తున్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోసం ప్రత్యేకంగా ఏఐ డేటా సెంటర్లు వస్తున్నాయి. ఈ ఏఐ కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్ల కంటే వందల రెట్లు వేగంగా ఆలోచిస్తాయి. అంత వేగంగా పని చేయడం వల్ల విపరీతమైన వేడి పుడుతుంది. ఆ వేడిని తగ్గించడానికి ఏసీలతో పాటు చాలా ఎక్కువ నీరు అవసరం అవుతుంది. కేవలం ఒక్క చిన్న 20 మెగావాట్ల డేటా సెంటర్ను చల్లబరచడానికి రోజుకు దాదాపు 14 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇది మన నగరాల్లోని 27,000 కుటుంబాల రోజువారీ నీటి అవసరంతో సమానం. ప్రస్తుతం మన దేశంలోని డేటా సెంటర్లు అన్నీ కలిపి ఏడాదికి సుమారు 150 బిలియన్ లీటర్ల నీటిని వాడుతున్నాయి. ఈ డేటా సెంటర్లు రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటలూ, 365 రోజులూ పని చేస్తూనే ఉండాలి. ఒక్క క్షణం ఆగినా ప్రపంచ ఇంటర్నెట్ మొత్తం స్తంభించిపోతుంది. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు నీటిని వృథా చేయకుండా, వాడిన నీటినే మళ్లీ శుద్ధి చేసి వాడే సరికొత్త కూలింగ్ టెక్నాలజీలను కనిపెడుతున్నారు. మనం ఫోన్ లో ఒక్క క్లిక్ చేయగానే, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డేటా సెంటర్ల నుంచే సమాచారం క్షణాల్లో మన స్క్రీన్ పైకి వస్తుంది!
ఈ బాలుడు టోర్నెడో రాకను కనిపెడతాడు
పిల్లలూ... మీరు సినిమాల్లో టోర్నెడో (సుడిగాలి) చూశారా? ఇళ్లను, కార్లను గాల్లోకి లేపేసే పెద్ద రాక్షసి అది. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఏడాదికి 50 టోర్నెడోలు వస్తాయి. అక్కడే అనిరుధ్ రావ్ అనే 12 ఏళ్ల తెలుగు అబ్బాయి ఉంటున్నాడు. అతనికి నాలుగైదేళ్ల వయసులో నాష్ విల్లేలో ఉండగా, తన కళ్ల ముందే ఒక టోర్నెడో తన స్నేహితుడి ఇంటిని పూర్తిగా నాశనం చేయడం చూశాడు. ఆ చిన్న వయసులోనే అతని మనసులో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది – ‘మనమెందుకు టోర్నెడో రాకను ముందే పసిగట్టకూడదు?’ అని. అప్పట్నించి అతను పరిశోధిస్తూ ఇన్నాళ్లకు కనిపెట్టిన ఆవిష్కరణే 'Revere’. సాధారణంగా టోర్నెడో పుట్టే ముందు మన చెవులకు వినపడని ‘ఇన్ ఫ్రా సౌండ్’ అనే ప్రత్యేక శబ్దం వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. ఇప్పుడున్న పెద్ద రాడార్లు ఆ శబ్దం తమకు బాగా దగ్గరికి దగ్గరికి వచ్చాకే గుర్తిస్తాయి.సాధారణంగా ఇలా గుర్తించాక 13 నిమిషాలకు టోర్నెడో ఆ ప్రాంతానికి వస్తుంది. కానీ అనిరుధ్ సెన్సార్లు ఉన్న చిన్న డ్రోన్లను తయారు చేసి, టోర్నెడో పుట్టిన వెంటనే అవి ఆ శబ్దం దగ్గరికి తమకు తాముగా వెళ్లి దాని ఆచూకీని కనిపెట్టేలా చేశాడు. దీని వల్ల టోర్నెడో రాబోతున్నదని 40 నిమిషాలకు ముందే తెలిసిపోతుంది. అంటే అనిరుద్ వల్ల దొరికిన ఆ అదనపు 27 నిమిషాలు వందల కుటుంబాల ప్రాణాలను కాపాడతాయి. ఈ గొప్ప ఆలోచనకు గాను అనిరు«ద్కు అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘గ్లోరియా బారన్ ప్రైజ్ ఫర్ యంగ్ హీరోస్ 2025’ అవార్డు వచ్చింది. పిల్లలూ... చిన్న ప్రశ్నే పెద్ద ఆవిష్కరణకు మొదటి మెట్టు అని అనిరుధ్ నిరూపించాడు.
తెలివైన చలికోడి
అనగనగా రష్యాలోని దట్టమైన మంచు అడవిలో ఒక చలికోడి (రష్యన్ గ్రౌస్) ఉండేది. ఒక సాయంత్రం ఆ కోడి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. అదే సమయంలో ఆహారం కోసం వెతుకుతున్న జిత్తులమారి నక్క ఆ చెట్టు కిందికి వచ్చింది. పైన కూర్చున్న కోడిని చూడగానే నక్క నోట్లో నీరూరాయి. కానీ అంత ఎత్తుకు తను ఎగరలేదు కదా. అందుకే ఒక ఉపాయం ఆలోచించింది.నక్క మంచితనంగా ‘ఓ కోడి మరదలా! నీకో శుభవార్త. మన అడవి జంతువులన్నీ కలిసి ఇప్పుడే ఒక కొత్త చట్టం చేసుకున్నాయి. దాని ప్రకారం అడవిలో ఎవరూ ఒకదానినొకటి చంపుకోకూడదు, అందరూ స్నేహంగా ఉండాలి. కాబట్టి నువ్వు భయం లేకుండా కిందికి రా, ఇద్దరం ఆలింగనం చేసుకుని స్నేహం చేద్దాం’ అంది.కోడి నక్క మోసాన్ని గ్రహించి, ‘అవునా బావా! ఎంత మంచి వార్త చెప్పావు. అదో చూడు, దూరంగా వేటగాళ్లు తమ వేట కుక్కలతో ఇటువైపే వస్తున్నారు. ఆ కుక్కలు కూడా ఈ కొత్త చట్టం వింటే ఎంతో సంతోషిస్తాయి కదా’ అంది.‘వేట కుక్కలు’ మాట వినగానే నక్క గుండె ఆగిపోయినంత పనైంది. తోక ముడుచుకుని పారిపోవడానికి సిద్ధమైంది. అప్పుడు కోడి నవ్వుతూ ‘ఎందుకు పారిపోతున్నావు నక్క బావా? కొత్త చట్టం వచ్చింది కదా, కుక్కలు నిన్నేం చేయవులే’ అంది. దానికి నక్క వణుకుతూ ‘బహుశా ఆ కుక్కలకు ఇంకా కొత్త చట్టం తెలిసి ఉండదు’ అని అడవిలోకి పరుగు తీసింది. కోడి తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది.నీతి: ఆపద సమయంలో ఆవేశపడకుండా ఉపాయంతో ఆలోచిస్తే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు.
అంతర్జాతీయం
మీడియాపై ట్రంప్ ప్రతాపం.. ఆ దిగ్గజ సంస్థలకు నో ఎంట్రీ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలను వైట్హౌస్లోకి అనుమతించబోమని ప్రకటించారు. ఈ మూడు సంస్థలు తన ప్రభుత్వం, అమెరికాపై పదేపదే ‘ఫేక్ న్యూస్’ ప్రసారం చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. మరికొన్ని మీడియా సంస్థలపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.ట్రంప్ శుక్రవారం తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ వార్తా సంస్థలు ‘ఫేక్ న్యూస్’ ప్రచురిస్తున్నందుకే వైట్హౌస్ నుంచి నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. తన పరిపాలన, అమెరికా అధ్యక్షుడు, అమెరికా దేశానికి సంబంధించిన వార్తల్లో ‘కల్పిత కథనాలు, అబద్ధాలు’ రాయడానికి మీడియా సంస్థలను అనుమతించకూడదని ఆయన అన్నారు. అయితే ఏయే కథనాలు లేదా ఏదైనా ప్రత్యేక ఘటన ఈ నిర్ణయానికి కారణమయ్యాయో ట్రంప్ వివరించలేదు.ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పేర్లను కూడా ట్రంప్ ప్రస్తావించారు. అయితే వీటిపై నిషేధం విధించినట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు. ట్రంప్కు మీడియా సంస్థలతో విభేదాలు కొత్తేమీ కాదు. ఆయన తొలి అధ్యక్ష పదవీకాలంలో సీఎన్ఎన్ రిపోర్టర్ జిమ్ అకోస్టా వైట్హౌస్ ప్రెస్ పాస్ను రద్దు చేయడానికి ప్రయత్నించగా, న్యాయస్థానం ఆ పాస్ను పునరుద్ధరించాలని ఆదేశించింది. 2025లో అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)ను కూడా కొన్ని వైట్హౌస్ కార్యక్రమాల నుంచి నిషేధించారు. మెక్సికో గల్ఫ్ను ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’గా పేర్కొనడం కొనసాగించడమే అందుకు కారణంగా ట్రంప్ పరిపాలన పేర్కొంది.సీఎన్ఎన్, పొలిటికో వంటి సంస్థలు తమ జర్నలిస్టులు వైట్హౌస్లో వార్తలను కవర్ చేసే హక్కును సమర్థించాయి. అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ స్వేచ్ఛా పత్రికా హక్కును రక్షిస్తుందని పేర్కొన్నాయి. మీడియా సంస్థలను వైట్హౌస్ నుంచి పూర్తిగా మినహాయించే నిర్ణయం ఎంతవరకు చట్టబద్ధమన్నది దాని పరిధిపై ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పరిమిత స్థలాల్లో జరిగే కొన్ని కార్యక్రమాలకు మీడియా ఎంపికపై అధ్యక్షుడికి విస్తృత అధికారం ఉన్నప్పటికీ, సాధారణ వైట్హౌస్ ప్రెస్ సౌకర్యాలు లేదా ప్రెస్ పూల్ నుంచి విస్తృతంగా మినహాయించడం రాజ్యాంగపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.ఇదీ చదవండి: ఆ గణపయ్య హుండీ తెరవగానే.. కళ్లు చెదిరే కానుకలు!
హౌతీల గుప్పిట్లో ‘బాబ్ అల్ మండేబ్’.. చిక్కుల్లో భారత్, చైనా!
హార్ముజ్ జలసంధి ఇప్పటికే మూసుకుపోయిన పరిస్థితుల్లో మరో కీలక సముద్ర మార్గంపై ముప్పు ముదురుతోంది. యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారుల ఆధిపత్యం బాబ్ అల్ మండేబ్ జలసంధి చుట్టూ పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో భారత్, చైనా సహా ఆసియా దేశాల యూరప్ వాణిజ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్గం ద్వారా నౌకల రాకపోకలు ప్రమాదకరంగా మారితే, ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లడం ప్రత్యామ్నాయంగా మిగులుతుంది. అయితే ఈ మార్గం చాలా పొడవుగా ఉండటంతో ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.మోఖా పోర్ట్పైనా హూతీల ఆధిపత్యంయెమెన్లో కొనసాగుతున్న ఘర్షణల్లో హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా మద్దతు ఉన్న ప్రభుత్వ దళాలపై పైచేయి సాధిస్తూ, పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఎర్ర సముద్ర నౌకాశ్రయ నగరం మోఖాను కూడా హౌతీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బాబ్ అల్ మండేబ్ చుట్టుపక్కల ఉన్న పలు దీవులపై కూడా వారి నియంత్రణ పెరిగినట్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ సముద్ర మార్గాన్ని ఉపయోగించే భారత్, చైనా సహా ఆసియా దేశాల వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ దారే మార్గమా?బాబ్ అల్ మండేబ్ మీదుగా యూరప్-ఆసియా మధ్య నౌకాయానం కష్టతరమైతే, నౌకలు ఆఫ్రికా దక్షిణ అంచున ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, అట్లాంటిక్ మహాసముద్రం నుంచి మళ్లీ హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాలి. దీంతో నౌకల ప్రయాణ దూరం భారీగా పెరుగుతుంది. ఫలితంగా సరుకు రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు షిప్పింగ్ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.యూరప్ నుంచి భారత్కు ఎలా చేరాలి?ఉదాహరణకు ఫ్రాన్స్ లేదా ఇటలీ నుంచి భారత్కు సముద్ర మార్గంలో సరుకులు రవాణా చేయాలంటే ముందుగా మధ్యధరా సముద్రాన్ని దాటాలి. ఆ తర్వాత స్పెయిన్, మొరాకో మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధి ద్వారా అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లాలి. అక్కడి నుంచి ఆఫ్రికా ఖండం పశ్చిమ, దక్షిణ తీరాల వెంట సుమారు 8 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి, దక్షిణ అంచున ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ను దాటాలి. అనంతరం హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మీదుగా భారత్కు చేరుకోవాల్సి ఉంటుంది.దూరం దాదాపు రెట్టింపుబాబ్ అల్-మండేబ్ మార్గం ద్వారా భారత్ నుంచి ఫ్రాన్స్కు సముద్ర దూరం సుమారు 11 వేల కిలోమీటర్లు ఉంటుందని నివేదిక చెబుతోంది. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగితే ఈ దూరం దాదాపు 22 వేల కిలోమీటర్లకు చేరుతుంది. అంటే ప్రయాణ దూరం దాదాపు రెట్టింపు అవుతుంది. ఆసియా లేదా మధ్యప్రాచ్యం నుంచి యూరప్కు నౌకల రాకపోకలకు సాధారణం కంటే మరో 10 నుంచి 30 రోజుల వరకు అదనపు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ఉదాహరణగా సౌదీ అరేబియాలోని యాన్బు నుంచి తైవాన్కు బాబ్ అల్-మందబ్ మీదుగా సుమారు 19 రోజులు పడుతుండగా, ఆఫ్రికా చుట్టూ తిరిగితే ఈ ప్రయాణం సుమారు 48 రోజులకు చేరవచ్చని నివేదిక పేర్కొంది.భారత్-ఈయూ వాణిజ్యంపై ప్రభావం?కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ గణాంకాల ప్రకారం, 2025లో భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య మొత్తం వాణిజ్యం 136.5 బిలియన్ అమెరికా డాలర్లకు పైగా నమోదైంది. ఇందులో ఈయూ నుంచి భారత్కు దిగుమతులు, భారత్ నుంచి ఈయూకు ఎగుమతులు రెండూ ఉన్నాయి. భారత్ నుంచి ఈయూకు సుమారు 75.8 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు, భారత్ ఈయూ నుంచి సుమారు 60.7 బిలియన్ డాలర్ల విలువైన సరుకులను ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే, ఇలాంటి భారీ వాణిజ్య ప్రవాహాలపై రవాణా సమయం, ఖర్చుల పరంగా ప్రభావం పడే అవకాశం ఉంది.బాబ్ అల్ మండేబ్ ఎందుకంత కీలకం?అనాడోలు ఏజెన్సీ నివేదిక ప్రకారం, హౌతీల డ్రోన్లు, దాడుల భయంతో బాబ్ అల్ మండేబ్ గుండా నౌకల రాకపోకలు సుమారు 88 శాతం తగ్గాయి. హౌతీలు తాము సౌదీ అరేబియా నౌకలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ, ఇతర దేశాల నౌకలు కూడా ఈ మార్గంలో ప్రయాణించేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తున్నది. సాధారణ పరిస్థితుల్లో ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం ఈ సముద్ర మార్గం గుండా సాగుతుంది. అంతేకాకుండా తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటీకి హౌతీ ఆధీన ప్రాంతాలు కేవలం 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. జిబౌటీలో అమెరికా సహా పలు దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ పరిణామాలు బాబ్ అల్ మండేబ్ ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయి.ఇదీ చదవండి: ఎల్నినో ఎఫెక్ట్: అట్లాంటిక్ను తాకని హరికేన్లు!
ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం
ఉత్కంఠకు తెర పడింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే బిల్లుపై ట్రంప్ ఇవాళ సంతకం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారడంతో ఆయా దేశాలపై ఏ క్షణమైనా 100 శాతం వరకు టారిఫ్లు ట్రంప్ విధించే అవకాశం ఉంది. ప్రధానంగా.. భారత్, చైనాలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. లిండ్సే గ్రాహం యాక్ట్ ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ లేదంటే గ్యాస్ దిగుమతి చేసుకునే టాప్-5 దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే చట్టంలో ఆ దేశాల పేర్లను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆయా జాబితాలను ఎలా లెక్కించాలన్న దానిపైనా పూర్తి స్పష్టత లేదు. దీంతో తుది నిర్ణయాధికారం ట్రంప్ ప్రభుత్వానికే దక్కింది. అబ్ ఆయేగా అస్లీ మజా!ట్రంప్ సంతకం చేయడంతో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కానీ అసలు పరిణామాలు ఇప్పుడే మొదలుకానున్నాయి. భారత్, చైనా సహా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఏ దేశాలు ‘టాప్-5’ జాబితాలోకి వస్తాయి? వాటిపై ట్రంప్ 100 శాతం వరకు టారిఫ్ విధిస్తారా? లేక మినహాయింపు ఇస్తారా? అన్నదే ఇప్పుడు కీలకం. తుది జాబితా, టారిఫ్ స్థాయిపై అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఆగస్టు క్రూడ్ దిగుమతుల డేటా ఆధారంగా రష్యా చమురు కొనుగోలులో ముందున్న దేశాలు:భారత్చైనాఇటలీటర్కీనెదర్లాండ్స్ఎస్అండ్పీ గ్లోబల్ ప్రకారం ఆగస్టులో రష్యా క్రూడ్ దిగుమతుల్లో భారత్ రోజుకు సుమారు 16 లక్షల బ్యారెళ్లతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 11 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇటలీ, టర్కీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.భారత్కు ఎందుకు కీలకం?రష్యా నుంచి చౌకగా లభించే క్రూడ్ ఆయిల్ భారత రిఫైనరీలకు కీలక వనరుగా మారింది. దేశీయ అవసరాల్లో భారీ భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. రష్యా చమురు దిగుమతులు భారత మొత్తం క్రూడ్ దిగుమతుల్లో దాదాపు సగం వరకు ఉన్నాయని తాజా విశ్లేషణలు పేర్కొంటున్నాయి. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లపై అమెరికా చర్యలు తీసుకుంటే భారత రిఫైనింగ్ రంగంతో పాటు అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ ఉత్పత్తులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే భారత్ సహా ఏ దేశాలపై, ఎప్పుడు, ఎంతమేర సుంకాలు విధించాలన్న విషయంలో ట్రంప్దే తుదినిర్ణయం కానుంది. మరోవైపు ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. చర్చల్లో మరికొన్ని దేశాలురష్యా చమురు కొనుగోలుదారుల జాబితాతో పాటు రష్యా ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరిస్తున్న దేశాలపైనా చట్టం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్, జపాన్, యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలు కూడా అమెరికా చర్యల పరిధిలోకి రావచ్చనే చర్చ జరుగుతోంది. 30 రోజుల్లో నిర్ణయం?కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన దేశాలపై టారిఫ్లు విధించే చర్యలను 30 రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ అంశం కీలకంగా మారింది. రష్యా చమురుపై ఆంక్షలు కఠినతరం చేస్తే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడి ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో వినియోగదారులపై ఇంధన ధరల భారం పెరగకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ అధికారాలను ఎంతవరకు ఉపయోగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.రష్యాపై మరింత ఒత్తిడిఈ చట్టం కేవలం చమురు కొనుగోలుదారులపైనే కాదు.. రష్యా ఇంధన, రక్షణ రంగాలతో పాటు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలకు వీలు కల్పిస్తోంది. ఇరాన్పై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా ఈ చట్టం పొడిగించింది. ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా అమెరికా పేర్కొంటోంది. మొత్తంగా చూస్తే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు ఇది నేరుగా తాకే అంశమే అయినప్పటికీ, 100 శాతం టారిఫ్ ఇప్పటికిప్పుడు ఖరారైన నిర్ణయం కాదు. ఏ దేశాలను తుది జాబితాలో చేర్చుతారు? భారత్పై ఎంత మేర ప్రభావం ఉంటుంది? అన్నది ట్రంప్ ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: భూకంపం కాదు.. భూకంపాలు పుట్టిన కిమ్
రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల సందడి
మాస్కో: రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల సందడి మొదలైంది. మూడు రోజులపాటు పోలింగ్ జరుగనుంది. దేశంలో 11.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం అధికారులు వారాంతంలో పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని కూడా అనుమతించారు. శుక్రవారం ప్రారంభమైన పోలింగ్ ఆదివారం ముగుస్తుంది. 2022లో ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభమైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంటరీ ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఉక్రెయిన్పై యుద్ధానికి ప్రజల మద్దతు ఉందని చాటుకోవాలని, తమ చర్యలకు చట్టబద్ధత ఉ న్నట్లుగా ఒక ముద్ర వే యాలని పుతిన్ ప్రభుత్వం భావిస్తోంది. అ ధ్యక్షుడు పుతిన్ శుక్ర వారం ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మీ ఎంపిక, మీ సంకల్పం లక్షలాది మంది మన యోధులకు అండగా నిలుస్తున్నారని నిరూపిస్తుంది. ఐక్యతను చాటిచెబుతుంది’’ అని పేర్కొన్నారు. ఓటు వేయడానికి కంప్యూటర్ స్క్రీన్ ముందు పుతిన్ ఉన్న వీడియోను రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు విడుదల చేశాయి. ప్రజలు ఓటు వేయడానికి రెండు వేర్వేరు బ్యాలెట్లను ఉపయోగిస్తారు. మొదటి బ్యాలెట్ లోని రాజకీయ పార్టీల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవడం ద్వారా పార్లమెంట్ దిగువ సభ అయిన స్టేట్ డూమాలోని 450 సీట్లలో సగాన్ని భర్తీ చేస్తారు. మిగిలిన సింగిల్–సీట్ నియోజకవర్గాల్లో అభ్యర్థు లను ఎన్నుకుంటారు. పుతిన్ నాయకత్వంలోని ‘యునైటెడ్ రష్యా’ స్టేట్ డూమాపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకో వడం ఖాయంగా కనిపిస్తోంది.
జాతీయం
టికెట్ చూపించమంటే బట్టలు చించేసుకుంది!
రైలు ప్రయాణంలో టికెట్ తనిఖీ సాధారణమే. టికెట్ లేకపోతే జరిమానా చెల్లించాలి.. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు ఎదుర్కోవాలి. కానీ ఓ మహిళ మాత్రం టికెట్ అడిగిన టికెట్ ఎగ్జామినర్తో వాగ్వాదానికి దిగి.. చివరకు తన దుస్తులనే చించేసుకుంది. అంతటితో ఆగకుండా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేయడంతో అక్కడున్నవారంతా షాక్కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో రైలులో ప్రయాణిస్తున్న మహిళను యువతి చూపించమని టీటీఈ అడిగాడు. అయితే ఆమె వద్ద టికెట్ లేకపోవడంతో డ్రామాకు దిగింది. అదే సమయంలో తన సోదరుడు కూడా రైల్వేలో టీటీఈగా పని చేస్తాడని కబర్లు చెప్పింది. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫోన్లో మాట్లాడుతున్నట్లు చేస్తూ.. ఆ యువతి ఒక్కసారిగా తన దుస్తులను తానే చించుకోవడం ప్రారంభించింది. దీంతో అక్కడున్నవాళ్లంతా కంగుతిన్నారు. ఆపై టీటీఈ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఫోన్లో రికార్డ్ చేయడంతో..అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని టీటీఈ తన ఫోన్లో రికార్డ్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి గొడవకు దిగకుండా ప్రశాంతంగా వ్యవహరించిన ఆయన.. అత్యవసర పరిస్థితి అనుకుంటే 112కు ఫోన్ చేయాలని మహిళకు సూచించినట్లు తెలుస్తోంది.ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ మొదలైంది. ఘటనను రికార్డ్ చేయడం వల్ల టీటీఈపై తర్వాత ఎలాంటి ఆరోపణలు వచ్చినా అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆధారం ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. రైల్వే సిబ్బందికి బాడీ కెమెరాలు అందుబాటులో ఉంచితే ఇలాంటి వివాదాల్లో మరింత స్పష్టమైన ఆధారాలు ఉంటాయని కొందరు సూచిస్తున్నారు.రైల్వే సిబ్బందికి కొత్త సవాల్ప్రయాణికులతో నిత్యం నేరుగా వ్యవహరించే టీటీఈలు, ఇతర ఫ్రంట్లైన్ రైల్వే సిబ్బందికి ఇలాంటి వివాదాలు కొత్త సవాలుగా మారుతున్నాయి. టికెట్ తనిఖీల సమయంలో ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునే సందర్భాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఇరువైపులా ఉన్న వారి ప్రవర్తనను రికార్డ్ చేసే వ్యవస్థ ఉంటే వాస్తవాన్ని నిర్ధారించడం సులభమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టత లేదు. సోషల్మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతోంది. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మహిళకు జరిమానా విధించినట్లు కూడా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు, కేసులో నమోదైన ఆరోపణలు తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.Woman tears off her clothes to accuse TT of molestation when he asked her to show ticketNeither Indian Police Nor Indian Judiciary knows how to handle such women Men in all such services should be provided bodycams to save themselves from false cases pic.twitter.com/ZoaV3HmBek— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) September 19, 2026ఇదీ చదవండి: రాజా సాబ్ వార్నింగ్ వీడియో వైరల్
క్లాస్ పీకిన సుప్రీంకోర్టు.. వెనక్కి తగ్గని విజయ్ సర్కార్
హిందీ భాష విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనూ తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు భూమి కేటాయించబోమని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్మోహన్ స్పష్టం చేశారు. అలాగే తమిళనాడు రెండు భాషల విధానానికే కట్టుబడి ఉంటుందని తెలిపారు.నవోదయ పాఠశాలల్లో మూడు భాషల విధానం అమలవుతుండటం, అందులో హిందీ ఉండటంపై తమిళనాడు విజయ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో కచ్చితంగా భూములు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు గత ఆదేశాలను సమీక్షించాలంటూ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మైండ్ సెట్ మార్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి చురకలు అంటించింది. అయితే హిందీకి తాము వ్యతిరేకం కాదని, తమిళానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ విధానమని మంత్రి రాజ్మోహన్ అంటున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తుది తీర్పు కాదని, కేసు ఇంకా విచారణలోనే ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో సీఎం విజయ్ చర్చిస్తున్నట్లు సమాచారం.నవోదయ పాఠశాలల కోసం ప్రతి జిల్లాలో భూమిని గుర్తించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న వెనక్కి తీసుకోలేదు. మరో మూడు నెలల గడువు ఇచ్చింది. కేంద్రం, రాష్ట్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం.. తమిళనాడు హిందీపై తన ‘మైండ్సెట్’ మార్చుకోవాలని, రాష్ట్రంలో హిందీ బోధించకూడదనే వైఖరి ఉండకూడదని వ్యాఖ్యానించింది.ఈ పరిణామాల మధ్య తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వ వైఖరికి మద్దతు తెలిపారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు అవసరం లేదని, ఇప్పటికే మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి నవోదయ పాఠశాలలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. అదే సమయంలో హిందీకి తాము వ్యతిరేకం కాదని, హిందీని బలవంతంగా అమలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.దీంతో తమిళనాడులో అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. రాజకీయంగా పరస్పరం విభేదిస్తున్నప్పటికీ భాషా విధానం విషయంలో ఒకే వైఖరితో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య ఈ వివాదం తదుపరి విచారణలో ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: బెంగాల్లో బీజేపీ సర్కార్.. మరీ ఇంత ఘోరమా?
‘రోడ్డు వేయకపోతే ఓటు వేయను సర్’.. ఎంపీ సీరియస్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున ప్రశ్నించడం ఒక బాధ్యత.. అధికారంలోకి వచ్చాక అదే ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం మరో బాధ్యత. ఆ మధ్య రాఘవ్ చద్దా నీట్ నిరసనలపై మౌనంగా ఉండడంపై చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తానిప్పుడు అధికార పార్టీలో భాగమని.. ప్రశ్నించే స్థానంలో లేనంటూ వ్యాఖ్యానించారాయన. ఇప్పుడు కేంద్ర మంత్రి, గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తీరు కూడా అలాగే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రోడ్డు సమస్యపై ఓటర్ నిలదీయగా.. కాస్త కోపం.. కాస్త ఆవేశంగా ఆయన స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని గుణలో సెప్టెంబర్ 18న ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు హనుమాన్ ఆలయం వద్ద సింధియా వాహనాన్ని ఆపి రోడ్డు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు నిర్మించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి.. రోడ్డు వేయకపోతే వచ్చేసారి ఎన్నికల్లో మీకు ఓటు వేయబోమని చెప్పాడు.దీనిపై సింధియా స్పందిస్తూ.. “ఈ భాష నా ముందు ఉపయోగించొద్దు.. ఊరుకుంటా అనుకుంటున్నారా’’ అంటూ కటువుగా బదులిచ్చారు. ఆ తర్వాత కాస్త శాంతించి.. మీరు వచ్చి వినతిపత్రం ఇవ్వండి.. నా బాధ్యత, అన్నీ జరుగుతాయి అని చెప్పారు. సదరు వ్యక్తికి వేలు చూపిస్తూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Janta bhi matlab ek dum bewakoof hai.Raja sahab ne election time me khud ko "jan-sevak" aur tumhe "janta-janardan" kya bol diya, tum to khud ko relevant samajh kar accountability maangne lage.Hadd me raho bhai. Charno me let kar nivedan karna seekho. pic.twitter.com/gjonJQJ5Qq— THE SKIN DOCTOR (@theskindoctor13) September 18, 2026మరోవైపు, గుణ పర్యటనలోనే సింధియా అధికారుల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలతో ఎదురుచూస్తుండగా కారు వద్ద ఉన్న కలెక్టర్, ఎస్పీలను పిలిపించి.. “వాహనంలో కూర్చోవద్దు.. మీరు నా డ్యూటీలో ఉన్నారు” అంటూ ఆదేశించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.సింధియా స్పందనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా గతంలో కాంగ్రెస్లో ఉండి, ఆ తర్వాత బీజేపీలో చేరారు. యువత పన్నులు చెల్లించాలని, బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని తరచూ సూచించే ఆయన.. తాజాగా రోడ్డు సమస్యపై ఓ పౌరుడు, రోడ్డు నిర్మించకపోతే ఓటు వేయబోమని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందిస్తున్న కొందరు.. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల కింద ఉండే ప్రజలు కాదని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాల్సిన వారని గుర్తు చేస్తున్నారు. రాచరిక కాలం ముగిసి దశాబ్దాలు గడిచాయని, ప్రజలే అసలైన యజమానులనే విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలని సింధియాకు చురకలంటిస్తున్నారు.ఇదీ చదవండి: మోదీ 76.. ఆయనకు కూడా 76!
మొదటి భార్యతో అనుబంధం.. భార్యకు రహస్య ప్రేమ.. ‘భర్త’కు చివరి సీన్!
భర్తకు మొదటి భార్యతో అనుబంధం.. రెండో భార్యకు మరో వ్యక్తితో రహస్య సంబంధం. ఈ వరుస బంధాల మధ్య రగిలిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. నిద్రలో ఉన్న భర్తను రెండో భార్య తన ప్రియుడితో హత్య చేయించి, మృతదేహాన్ని చెక్కపెట్టెలో దాచి.. అర్ధరాత్రి ఈ-రిక్షాలో కాలువ వంతెన కింద పడేసింది. రెండు రోజుల తర్వాత బయటపడిన ఈ కేసులో భార్య, ప్రియుడు సహా నలుగురిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో, రెండు భార్యతో పాటు ఆమె ప్రియుడు, అతడి సహాయకుడిని అరెస్టు చేయగా.. మహిళ మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. రామ్కిశోర్ వాల్మీకి, కవితా దేవికి వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. అనంతరం, సుఫియా బానోకు రామ్కిశోర్ వాల్మీకితో నాలుగేళ్లుగా పరిచయం ఉండగా, రెండేళ్ల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే సుఫియాకు మున్నా అలియాస్ ముచ్చడ్ (52)తోనూ సంబంధం ఏర్పడింది. ఈ విషయం రామ్కిశోర్కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదే సమయంలో రామ్కిశోర్ తన మొదటి భార్య కవితా దేవిని మళ్లీ కలుస్తూ, ఆమెకు ఆర్థిక సహాయం చేయడం సుఫియాకు నచ్చలేదు. దీంతో మున్నా, అతడి సహచరుడు మహమ్మద్ ఇక్బాల్ అలియాస్ బాసిర్ అహ్మద్ (40)తో కలిసి సుఫియా భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు డీసీపీ మహమ్మద్ ముస్తాక్ తెలిపారు.Lucknow Murder: दूसरी पत्नी के अवैध संबंधों की राह में रोड़ा बना तो सोफिया बानो ने रामकिशोर वाल्मीकि को मार डाला.. #LucknowCrime #CrimeStory #UpPolice pic.twitter.com/dTd5wGZFhf— UP Tak (@UPTakOfficial) September 18, 2026సెప్టెంబర్ 14-15 అర్ధరాత్రి రామ్కిశోర్ నిద్రిస్తున్న సమయంలో సుఫియా ఇంటి తలుపు గడియ వేయకుండా ఉంచిందని, లోపలికి వచ్చిన ఇద్దరు నిందితులు కత్తితో పొడిచి అతడిని హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్య అనంతరం ఆధారాలు చెరిపేందుకు నిందితులు ఇంటి నేలను శుభ్రం చేసి, రక్తపు మరకలున్న చీపురు, బాధితుడి దుస్తులు, హత్యకు ఉపయోగించిన కత్తిని దాచినట్లు తెలిపారు. ఆ తర్వాత సుఫియా తన 16 ఏళ్ల కుమారుడిని పిలవగా, నలుగురూ కలిసి మృతదేహాన్ని మంచం కింద ఉన్న చెక్క పెట్టెలో దాచారు. సెప్టెంబర్ 15-16 రాత్రి ఈ-రిక్షాలో మృతదేహాన్ని తరలించి, కనఖా ప్రాంతంలోని భవాఖడా వద్ద కాలువ వంతెన కింద పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.సెప్టెంబర్ 17న రామ్కిశోర్ మొదటి భార్య కవితా దేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానిత మార్గంలోని 170 నుంచి 180 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారంతో నిందితులను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. శుక్రవారం సుఫియా, మున్నా, ఇక్బాల్ను అరెస్టు చేయగా, ఆమె మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తి, మృతదేహాన్ని తరలించిన ఈ-రిక్షాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదీ చదవండి: రాములమ్మ.. ఎంత పనిచేశావ్..
ఎన్ఆర్ఐ
భద్రతా కారణాలతో విజయ్ లండన్ కార్యక్రమం రద్దు
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ కోసం లండన్లో భారీగా తరలివచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లండన్లోని ప్రముఖ ‘ది షార్డ్’ భవనం వద్ద విజయ్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో అధికారులు రద్దు చేశారు. వందలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో భాగంగా యూకేలో ఉన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు మంగళవారం ‘ది షార్డ్’ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పలువురు అభిమానులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. అయితే భారీగా జనసమీకరణ జరగడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.‘అనుమతి రాలేదు.. కార్యక్రమం రద్దు’భద్రతా కారణాలతో కార్యక్రమానికి అవసరమైన అనుమతి లభించలేదని విజయ్ బృందం ప్రకటించింది. లౌడ్స్పీకర్ ద్వారా అభిమానులకు సమాచారం అందిస్తూ.. ప్రజల భద్రత దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో విజయ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు గంటల తరబడి ఎదురు చూసినట్లు పీటీఐ తెలిపింది.VIDEO | UK: Vijay fan greeting event in London called off due to 'health and safety' reasons after large number of people gather to see Tamil Nadu CM.Announcement was made by the authorities outside CM Vijay's hotel at the Shard in London on Tuesday.(Full video available on… pic.twitter.com/l4GDVUL6Fk— Press Trust of India (@PTI_News) September 15, 2026తలా-దళపతి.. విమర్శలకు టీవీకే కౌంటర్ఇదిలా ఉండగా.. విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి లండన్ వెళ్లినట్లు చెబుతున్న విజయ్.. తన స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసును వీక్షించడంపై డీఎంకే నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పెట్టుబడుల పర్యటన పేరుతో వెళ్లి రేసు కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శించారు. దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. విజయ్ అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ అజిత్ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్లో అజిత్కు ఉన్న గుర్తింపును తమిళనాడు బ్రాండ్ ప్రమోషన్కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.పెట్టుబడుల కోసం విజయ్ యూకే పర్యటనఇదిలా ఉండగా విజయ్ యూకే పర్యటన ప్రధానంగా తమిళనాడుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంపైనే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సుమారు రూ.12,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా రాష్ట్రంలో 9,400కు పైగా హై-వాల్యూ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడును ఆసియాలో అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ తన యూకే పర్యటనను ముగించుకుని బుధవారం భారత్కు తిరిగి రానున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విజయ్పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!
న్యూయార్క్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.లోయర్ మన్హాటన్లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సౌత్ వింగ్ వైపు వెళ్తున్న నంబర్ 4 రైలు పట్టాలపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత రైలులో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను బయటకు తరలించారు.ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో..మలైకా చిత్రే న్యూజెర్సీలోని డేటన్కు చెందినవారు. అకాడియా ఫార్మాస్యూటికల్స్లో ఆపరేషన్స్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. నవమ్ కౌల్ సైరేవిల్లేకు చెందినవారు కాగా.. బ్లూమ్బర్గ్లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్గా పనిచేస్తున్నారు. ఇద్దరూ రట్జర్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. దాదాపు ఒకే సమయంలో అక్కడి నుంచి పట్టాలు పొందారు.ఈ విషాదంతో వాళ్ల సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నవమ్ ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవాడని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. మలైకా తెలివైన, చురుకైన విద్యార్థినిగా తమకు తెలుసని ఆమె కుటుంబానికి సమీపంలోని పొరుగువారు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.A tragic situation in Manhattan. Recent Rutgers graduates Navam Kaul and Malaika Chitre were killed after being struck by a southbound 4 train at Spring Street around 3:15 a.m. Sunday.Reports say Kaul went onto the tracks first and Chitre climbed down after him, apparently…— Shadab Chow 🇺🇸 (@tonyinmycity97) September 15, 2026వైరల్గా మారిన వీడియో..ఈ ఘటనకు ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్గా మారింది. అందులో మలైకా, నవమ్ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. రైలు వస్తున్న సమయంలోనూ వారు అక్కడే ఉన్నారు. అయితే రైలు డ్రైవర్ మాత్రం.. మలైకా నవమ్ను తన వైపునకు లాగుతున్నట్లు, ఆమె నవ్వుతున్నట్లు కనిపించిందని చెప్పినట్లు సమాచారం.ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయి ఉండొచ్చని, ఆమెను కాపాడేందుకు మరొకరు పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రైలు డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేకులు వేసినా.. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో ఆపడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.మత్తులో ఉన్నారా?ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం లేదంటే ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆత్మహత్య కోణాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఆ యాక్సిడెంట్తో స్పాట్లోనే చనిపోయేదాన్ని!
620 కోట్ల కుంభకోణం.. భారత్లో తలదాచుకున్న నిందితుడు!
అమెరికాలో సుమారు రూ. 620 కోట్ల విలువైన భారీ మెడికేర్ కుంభకోణానికి పాల్పడి, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ భారతీయ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్లో తలదాచుకున్నట్లు తెలిసింది. మహమ్మద్ ఖదీర్ ఖాన్ అనే ఈ నిందితుడు నగరంలోనే ఉన్నాడని అమెరికా పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక అధికారులు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.టెక్సాస్లోని రిచర్డ్సన్లో ఖదీర్ ఖాన్ 'అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్' పేరుతో ఒక జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్వహించేవాడు. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో, అమెరికా ప్రభుత్వ మెడికేర్ పథకం కింద సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన నకిలీ క్లెయిమ్లను అతడు సృష్టించాడు. వీటి ద్వారా ప్రభుత్వం నుంచి 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 620 కోట్లు) అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్బీఐ, ఆరోగ్య శాఖల సంయుక్త విచారణలో వెల్లడైంది.ఈ కుంభకోణం బయటపడటంతో అధికారులు ఖాన్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, అతడిని 'మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్'గా ప్రకటించారు. అయితే, అప్పటికే అతను అమెరికా నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఖాన్ హైదరాబాద్లోనే ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో, శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల జాబితాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: జేడీయూ యూటర్న్.. షాక్లో బీజేపీ!
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో అంతర్జాలంలో గూగుల్ మీట్ ద్వారా 14-Sep-2026 ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలిగి అందరి పై వినాయకుని ఆశీస్సులు ఉండాలని వినాయకుడిని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు , శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్), కామాక్షి సిల్వర్,గోల్డ్ & డైమండ్ , బులియన్ కింగ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
నర్సు కేసులో కీలక ఆధారం.. నిందితుడి డీఎన్ఏ మ్యాచ్!
సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో నర్సుపై (21) ‘హత్యా’చారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ సనావుల్లాను (34) న్యాయస్థానంలో దోషిగా నిరూపించడానికి పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. కేవలం సాక్షుల వాంగ్మూలాలు, భౌతికాంశాలే కాకుండా శాస్త్రీయ ఆధారాల పైనా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా హతురాలి శరీరం నుంచి సేకరించిన జీవ నమూనాలను నిందితుడి నుంచి సేకరించిన శాంపిల్స్ పోలుస్తూ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ఫోరెన్సిక్ లాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) చేపట్టిన పరీక్షల్లో నివేదికలు పాజిటివ్గా వచ్చాయి. దీంతో ఈ కేసులో నిందితుడిని దోషిగా నిరూపించడంలో ఈ నివేదిక కీలకం కానుంది. దారుణం జరిగిన మరుసటి రోజే (ఆగస్టు 30) పోలీసులు బిహార్కు చెందిన సనావుల్లాను పట్టుకున్నారు. హత్య కేసుగా నమోదైన ఈ కేసులో తర్వాత అత్యాచారం, ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టంలో సెక్షన్లను చేర్చారు. ఇదిలా ఉండగా నిందితుడు దాదాపు నెల రోజుల పాటు నర్సు కదలికలను గమనించినట్లు వెల్లడైంది. సనావుల్లాను అరెస్టు చేసిన పోలీసులు నేర నిరూపణలో కేవలం అతడి వాంగ్మూలం పైనే ఆధారపడకూడదని భావించారు.ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలపైనా దృష్టి సారించారు. ఘటనాస్థలంలో లభించిన వస్తువులు, వెంట్రుకలు, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను క్లూస్ టీమ్స్ సాయంతో సేకరించారు. వీటితో పాటు నిందితుడి కదలికలకు సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్నీ సంగ్రహించారు. హతురాలి శరీరంపై నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన అధికారులు కోర్టు అనుమతితో నిందితుడి నుంచి శాంపుల్స్ సేకరించి పరీక్ష చేయించారు. ఈ నేపథ్యంలో ఆమె శరీరంపై లభించిన డీఎన్ఏ సనావుల్లా డీఎన్ఏతో సరిపోలినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందించింది. ఇది నర్సుపై నిందితుడే లైంగిక దాడి చేశాడని న్యాయస్థానంలో నిరూపించడానికి తిరుగులేని ఆధారంగా మారనుంది. త్వరలో ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయడానికీ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య!
వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య!
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని ఎల్.అగ్రహారం టిడ్కో గృహసముదాయంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. రూరల్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం ముండూరుకు చెందిన యాదాల మంగ (28) రెండేళ్ల క్రితం భర్తను వదిలేసి, ఎల్.అగ్రహారం టిడ్కో కాంప్లెక్స్లో పరిచయస్తురాలైన విజయకుమారి ఇంట్లో నివాసముంటోంది. ఈమెకు ముండూరుకే చెందిన గెడ్డం సందీప్ అలియాస్ సన్నితో వివాహేతర సంబంధం ఉంది. గురువారం రాత్రి మంగ వేరొకరితో ఫోన్ మాట్లాడుతుండటంతో అనుమానించిన సన్ని గొడవపడ్డాడు.తనతో పాటు ముండూరు రావాలని ఒత్తిడి చేశాడు. అనంతరం ఇద్దరూ ఒకే గదిలో నిద్రించారు. శుక్రవారం తెల్లవారుజామున మంగ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని విజయకుమారి గుర్తించి, మృతురాలి సోదరి రత్నమ్మకు సమాచారమిచ్చింది. బంధువులతో వచ్చి చూడగా మంగ పీక నులిమి హత్యకు గురైనట్లు తేలింది. సోదరి ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్సై రవికుమార్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
తల, కాళ్లు, చేతులు లేకుండా మహిళ మృతదేహం
విజయవాడ : ఎన్టీటీపీఎస్ చన్నీటి కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం రాత్రి స్వా«దీనం చేసుకున్నారు. సంస్థ స్టేజ్ –2 వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని బయటకు తీయగా, మహిళకు తల, చేతులు, కాళ్లు లేనట్లు గమనించారు. సుమారు 30–40 ఏళ్ల మధ్య వయస్సు మహిళగా గుర్తించారు. ఆమె శరీరంపై ఉన్న బ్లూ కలర్ టాప్, బ్లాక్ కలర్ బ్రా, వైట్ కలర్ లెగ్గింగ్ దుస్తులను స్వా«దీనం చేసుకున్నారు. ఎవరో హత్య చేసి ఎన్టీటీపీఎస్ కాలువలో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు 94406 27084 నంబర్కు సమాచారం ఇవ్వాలని సీఐ సుబ్రహ్మణ్యం కోరారు.
మా నాన్నను చంపితే.. నీకు డీజే సౌండ్ సిస్టమ్ కొనిస్తా!
ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం టి.రాయవరం సమీపంలో చేపల చెరువు లీజుదారు హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధంపై తండ్రి మందలించాడని అతడి కుమార్తె నాగలక్ష్మి తన ప్రియుడు వ్యాన్ డ్రైవర్ జయబాబుతో కలసి ఈ పథకం పన్నినట్టు పోలీసులు తెలిపి నిందితుడిని అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా పైడి చింతపర్రు గ్రామానికి చెందిన మోరి నరసింహారావు (70) ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ స్థానిక పోలీసు స్టేషన్లో శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వితంతువైన చేపల చెరువు లీజుదారు కుమార్తె బలే నాగలక్ష్మి చేపల ఎరువు, మేత తదితరాలతో తరచూ వచ్చే వ్యాన్ డ్రైవర్ జయబాబుతో ఆరు నెలలుగా వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయం తెలిసి తండ్రి నరసింహారావు ఆమెను మందలించడంతో ప్రియుడు జయబాబుతో కలిసి తండ్రి హత్యకు కుట్ర పన్నింది. హత్య చేస్తే డీజే సౌండ్ సిస్టమ్ కొని ఇస్తానని, కొంత నగదు ముట్టజెప్పింది. ఇందులో భాగంగా హత్యకు వారం రోజుల ముందే ఆమె తన పింఛను నిమిత్తం స్వగ్రామం కొవ్వాడలంకకు వెళ్లినట్టు కథ అల్లింది. ఆ రోజు అర్ధరాత్రి జయబాబు టి.రాయవరం వచ్చి నరసింహారావును హత్య చేసి రెండు వేలు నగదు, రోల్డుగోల్డు నగలు దోచుకుపోయాడు. అనంతరం వచ్చిన నాగలక్ష్మి రూ.2 లక్షల నగదు, పది గ్రాముల బంగారం చోరీకి గురైనట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై సీఐ సూర్య అప్పారావు పర్యవేక్షణలో ప్రత్తిపాడు, అన్నవరం, రౌతులపూడి ఎస్సైలతో మూడు బృందాలుగా దర్యాప్తు ముమ్మరం చేసి సీసీ ఫుటేజీలు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, సెల్ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసును చాకచక్యంగా ఛేదించి అనకాపల్లి జిల్లా పాయకరావు పేట మండలం పడాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ వీర్ల జయ నాగ వెంకట సత్యనారాయణ అలియాస్ జయబాబును ధర్మవరం నుండి వెల్దుర్తి రోడ్డులో శుక్రవారం అరెస్టు చేశారు. నాగలక్ష్మిని అరెస్టు చేయాల్సి ఉంది. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ జి.బింధుమాదవ్ అభినందిస్తూ, ప్రోత్సాహక నగదు బహుమతిని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్కు అందజేశారు.
వీడియోలు
లడ్డూ నెయ్యి వివాదంలో కీలక ట్విస్ట్.. జంతు కొవ్వుపై దర్యాప్తులో క్లారిటీ
ది ప్యారడైజ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!
ఖైరతాబాద్ బై ఎలక్షన్!
కమలమ్మ పార్థివ దేహనికి విజయమ్మ, అవినాష్ రెడ్డి నివాళులు
భర్త లేని సమయంలో ఒంటరి మహిళపై జనసేన నేత దాడి
బుడ్డోడికి షాక్ ఇచ్చిన గంభీర్.. అప్పటివరకు టీంలో నో ప్లేస్
బంగారంపై AI ఎఫెక్ట్.. 10 గ్రాములు రూ.3 లక్షలు?
రోజుకో ట్విస్ట్.. పూటకొక కొత్త బాధితుడు!
ఆస్కార్ బరిలో తెలుగు సినిమాలు ఇవే
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షాలు
