ఉత్తరాన నాట్లు.. దక్షిణాన తూట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో సీజన్ వరి సాగు వేగం పుంజుకుంది. గోదావరికి జలకళ సంతరించుకోవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రాజెక్టులు, కాలువల ద్వారా సమృద్ధిగా నీరు అందుబాటులోకి వచ్చి రైతులు పెద్దఎత్తున వరి నాట్లు వేస్తున్నారు. ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు కొద్ది రోజులుగా యుద్ధప్రాతిపదికన నాట్లు పూర్తి చేస్తున్నారు. వ్యవసాయశాఖ తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు నమోదైంది. అయితే గత నాలుగు రోజుల్లోనే సుమారు మూడు లక్షల ఎకరాల్లో నాట్లు వేసినట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి జలాలు సమృద్ధిగా అందుతుండటంతో రైతులు ఆలస్యం చేయకుండా నాట్లు పూర్తి చేస్తున్నారు. శ్రీరాంసాగర్, కాళేశ్వరం, ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్మానేరు, కాకతీయ కాలువల ఆయకట్టు ప్రాంతాల్లో, చెరువులు, కుంటల కింద వరి సాగు వేగంగా సాగుతోంది. వర్షాలు కూడా అనుకూలంగా ఉండటంతో పొలాల్లో నీటి కొరత లేకుండా సాగు జరుగుతోంది. మరోవైపు కృష్ణా పరీవాహక దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం వరి సాగు ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు.నాగర్కర్నూల్, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రైతులు ఇంకా సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదిలోకి నీటి ప్రవాహం పెరిగి ప్రాజెక్టుల్లోకి చేరుతున్నా, అది ఆలస్యంగా రావడంతో ప్రస్తుతం నాట్లకు పూర్తిగా అనుకూల పరిస్థితులు లేవని అధికారులు చెబుతున్నారు. 50 లక్షల ఎకరాలకు చేరే అవకాశం వ్యవసాయశాఖ సాధారణ విస్తీర్ణం ప్రకారం రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు 65.96 లక్షల ఎకరాలు. గత ఏడాది ఇదే సమయానికంటే ఈసారి నాట్లు వేగంగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వేగం మరో రెండు నుంచి మూడు వారాలు కొనసాగితే వరి సాగు 50 లక్షల ఎకరాల స్థాయిని చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆగస్టు మొదటి పక్షంలో వరి నాట్లు అత్యంత కీలక దశకు చేరనున్నాయి. ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న వేగం కొనసాగడంతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా కృష్ణా జలాలు పూర్తిస్థాయిలో అందితే రాష్ట్రవ్యాప్తంగా వరి సాగు ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.పత్తిదే ఇంకా అగ్రస్థానంవానాకాలంలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 92,86,726 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే రెండున్నర లక్షల ఎకరాలు అధికమే. ఇందులో అత్యధికంగా పత్తి 46,89,258 ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత వరి 29,32,884 ఎకరాలు, మొక్కజొన్న 5,01,508 ఎకరాలు, కందులు 4,68,975 ఎకరాలు, సోయాబీన్ 3,68,797 ఎకరాలు, శనగలు 74,671 ఎకరాలు, మినుములు 18,531 ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తం ఆహార ధాన్యాలు 40.24 లక్షల ఎకరాలు, నూనెగింజల పంటలు 3.74 లక్షల ఎకరాలు, వాణిజ్య పంటలు 47.27 లక్షల ఎకరాల్లో నమోదయ్యాయి.
భావోద్వేగాల స్పిరిట్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ తృప్తీ దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రకాష్రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ–సిరీస్ బ్యానర్స్పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ అనగానే పవర్ఫుల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం సాగుతుందని అనుకుంటారు. అయితే ఈ సినిమాలో భావోద్వేగాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉందట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘‘స్పిరిట్’ లో తన కెరీర్లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు ప్రభాస్. తన మార్క్ యాక్షన్, ఎమోషన్స్తో అద్భుతమైన అనుభూతిని ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూశాను. పోలీస్ స్టోరీ కథ అయినప్పటికీ కుటుంబ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు ఉంటాయి. మునుపెన్నడూ చూడని సినిమా ఇది అని ప్రేక్షకులు భావిస్తారు’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న విడుదల కానుంది.
ఇదో కొత్త చికాకు... ‘ఏఐ సైకోసిస్’!
సాక్షి, హైదరాబాద్: ఏఐ సైకోసిస్.. ఇది కొత్తగా వచ్చిన ఓ మానసిక రుగ్మత. ఏఐ చాట్బాట్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల, మానసిక సమస్యలున్న వారు లేదా దుర్బలమైన మనస్తత్వం ఉన్న వారు నిజం, అబద్ధం మధ్య తేడాను గుర్తించలేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. వాస్తవ పరిస్థితులకు దూరంగా... ఏఐ తమకు మాత్రమే నిజమైన, దైవిక లేదా రహస్య సందేశాలు ఇస్తోందని నమ్మే భ్రమని యూజర్లలో కలిగిస్తుంది. ఏఐ చాట్బాట్లు యూజర్లు చెప్పేదానికి ఎక్కువగా తల ఊపుతూ, వాటిని నిజమేనని (సైకోఫాన్సీ) సమర్థిస్తాయి. దీనివల్ల యూజర్లు ఏఐకి ప్రాణం ఉందని, అది సజీవంగా ఉందని భ్రమిస్తారు. ఒంటరిగా ఉన్న వారు ఏఐతో మితిమీరిన స్నేహం లేదా ప్రేమలో పడి, నిజమైన మానవ సంబంధాలను దూరం చేసుకోవడంతోపాటు తీవ్రస్థాయిలో భావోద్వేగాలకు గురయ్యే అవకాశాలుంటాయి.భ్రమలు – నమ్మకాలుబ్రిటన్, అమెరికాతోపాటు పలు దేశాల్లో పలువురు వ్యక్తులు తమ ఏఐ సహచరుడు తమకు ప్రత్యేకమైన దైవిక శక్తులు ఇచ్చాడని లేదా ప్రపంచ రహస్యాలను ఛేదించే మిషన్ అప్పగించాడని నమ్మినట్లు పరిశోధకులు గుర్తించారు. యూకేలో ఒక వ్యక్తి ఏఐ ప్రోద్బలంతో రాణిపై దాడికి కుట్ర పన్నగా, బెల్జియంలో మరొకరు తీవ్రమైన ఆందోళనలతో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా టీనేజర్లు సైతం ఏఐ వ్యసనానికి గురై తీవ్ర మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రాత్రంతా ఏఐతో చాట్లతో నిమగ్నం కావడం వల్ల నిద్రలేమితోపాటు ఒంటరితనం ఏర్పడి, మెదడుపై తీవ్ర ప్రభావం పడి సైకోసిస్ లక్షణాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సైకోసిస్ అనేది ఒక మానసిక రుగ్మత స్థితి. ఇది వైద్యపరంగా అధికారికంగా గుర్తించిన జబ్బు కానప్పటికీ, మానసిక నిపుణులు తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు.ప్రధాన కారణాలివీ..» ఏఐ చాట్బాట్లు యూజర్ల ఆలోచనలను ఎప్పుడూ సమర్థిస్తూ సమాధానాలు ఇస్తాయి. ఒక వ్యక్తికి తప్పుడు లేదా వింత ఆలోచనలు ఉన్నా, ఏఐ వాటిని నిజమే అని నమ్మించి భ్రమలను పెంచుతుంది.» కొన్నిసార్లు ఏఐ తనకు తెలియని విషయాలను కూడా తప్పుడు సమాచారంతో వాస్తవం లాగా సృష్టిస్తుంది. దీనిని నమ్మి యూజర్లు మతిస్థిమితం కోల్పోతారు» రాత్రంతా ఏఐతో చాటింగ్ వల్ల నిద్ర కరువై, మెదడు పనితీరు దెబ్బతింటుంది. సమాజానికి దూరంగా ఒంటరిగా ఉండటం వల్ల వాస్తవ జ్ఞానం నశిస్తుంది.వివిధ దేశాల్లో కేసులు...» 2026లో క్యారెక్టర్.ఏఐ, గూగుల్ వంటి సంస్థలపై పలు కుటుంబాలు దావాలు వేశాయి. మైనర్ పిల్లలు ఏఐ చాట్బాట్లను నిజమైన స్నేహితులుగా, ప్రేమికులుగా భావించి, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి.» నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం కొంతమంది యూజర్లు ఏఐ తమకు ప్రత్యేక శక్తులు ఇచ్చిందని, ప్రపంచాన్ని రక్షించే మిషన్ అప్పగించిందని నమ్మడం ప్రారంభించారు.» ఫాస్ట్ కంపెనీ నివేదిక ప్రకారం... వ్యాపార రంగంలో 44% మంది మేనేజర్లు తమ సొంత తెలివితేటల కంటే ఏఐ ఇచ్చే సలహాలనే గుడ్డిగా నమ్ముతున్నారు. ఇది ఓ రకమైన సామూహిక ఆధారపడే తత్వానికి దారితీస్తోంది.
నాలుగోసారీ.. యథాతథం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ వరుసగా నాలుగోసారీ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. కీలకమైన రెపో రేటును 5.5 శాతంగానే ఉంచాలని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. తదుపరి ఎంపీసీ సమావేశం అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరగనుంది. ఆహార, ఇంధన ధరల పెరుగుదల కారణంగా సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మరింత పెరిగి 2026–27 మూడో త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకుని, క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేస్తున్నట్లు ద్వైమాసిక పాలసీ సమీక్ష సమావేశం అనంతరం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. కొన్ని విభాగాల్లో మినహా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు విస్తృతంగా లేనందున ద్రవ్య పరపతి విధానాన్ని అత్యవసరంగా కఠినతరం చేయాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. ద్రవ్యోల్బణం అంచనాలపై మరింత స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తూనే, ధరలను టార్గెట్ దిగువకు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. తటస్థ పాలసీ విధానం, వడ్డీ రేట్లపై తదుపరి నిర్ణయాలనేవి ఎప్పటికప్పుడు వచ్చే డేటాపై ఆధారపడి ఉంటాయని మల్హోత్రా చెప్పారు. ‘‘వేగంగా మారిపోతున్న పశ్చిమాసియా పరిణామాలపై అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, సెంటిమెంట్లు ఆధారపడి ఉంటున్నాయి. ఇవి దేశీయంగా వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటమనేది, భారత ఎకానమీ ఈ గ్లోబల్ షాక్లను తట్టుకునేందుకు తోడ్పడుతోంది’’ అని మల్హోత్రా చెప్పారు. ‘‘వృద్ధికి ఊతమివ్వడం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, ధరలు .. కరెన్సీ స్థిరంగా ఉండేలా చూడటం .. ఇలా ఏ అంశమైనా సరే ఎకానమీని మరింత బలోపేతం చేసే విధానాలను అమలు చేయడాన్ని కొనసాగిస్తాం’’ అని ఆయన తెలిపారు. గ్లోబల్గా అనిశ్చితి నెలకొన్నప్పటికీ సర్వీసుల ఎగుమతులు, రెమిటెన్సుల రాకతో దేశ కరెంటు అకౌంటు పటిష్టంగా ఉన్నట్లు వివరించారు. జూలై 31 నాటికి ఫారెక్స్ నిల్వలు 692.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వివరించారు. త్వరలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు లైసెన్సు మార్గదర్శకాలు యూనివర్సల్ బ్యాంకుల తరహాలోనే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు ఆన్–ట్యాప్ లైసెన్సులు ఇవ్వడానికి సంబంధించి త్వరలోనే ముసాయిదా మార్గదర్శకాలను వెల్లడించనున్నట్లు మల్హోత్రా తెలిపారు. దీనిపై జనవరిలోనే చర్చాపత్రాన్ని రూపొందించినట్లు వివరించారు. మరోవైపు, బ్యాంకింగ్ రంగంలో గణనీయంగా మార్పులు వచ్చిన నేపథ్యంలో గ్రామీణ సహకార బ్యాంకుల్లో రిస్క్ ల నిర్వహణ మార్గదర్శకాలను సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. రుణాలపై వడ్డీ రేట్ల క్రమబద్దీకరణ.. నియంత్రిత సంస్థలవ్యాప్తంగా రుణాలపై వడ్డీ రేట్లను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మల్హోత్రా వివరించారు. వడ్డీ రేట్లలో పారదర్శకతను పెంచేందుకు, పరపతి విధాన నిర్ణయాల బదలాయింపు అమలయ్యేందుకు, విని యోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు, రూపాయిని బలోపేతం చేసే ఉద్దేశంతో పరిమిత కాలం కోసం ప్రకటించిన ఫారిన్ కరెన్సీ నాన్–రెసిడెంట్ (బ్యాంక్) స్కీము కింద గణనీయంగా నిధులు వస్తున్నాయని గవర్నర్ చెప్పారు. దీన్ని ముందస్తుగా ముగించేసే యోచనేదీ లేదని తెలిపారు. విదేశీ నిధులు వస్తున్నప్పటికీ దేశీ కరెన్సీ బలపడకపోవడంపై స్పందిస్తూ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే రూపా యి మరింత బలోపేతం కావచ్చని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాలిమర్ కరెన్సీ అంతా సజావుగా జరిగితే, పాలిమర్ కరెన్సీ నోట్లను 2028 ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మల్హోత్రా వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నోట్లు 30 ఏళ్లకు పైగా మన్నాయని ఆయన పేర్కొన్నారు.ద్వితీయార్థంలో అర శాతం పెంపునకు చాన్స్ రిస్కులను కూడా ప్రస్తావిస్తూ సమతూకంగా ఆర్బీఐ పాలసీ విధానం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఉపాసనా భరద్వాజ్ చెప్పారు. 2027 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో 50 బేసిస్ పాయింట్ల మేర రేట్ల పెంపు ఉండొచ్చని చెప్పారు. మరోవైపు, కఠినతరం చేసే సంకేతాలు ఇవ్వకుండా, తటస్థ ధోరణిని పాటించడం ద్వారా ఆర్బీఐ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉండేలా చూసుకుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఎండీ రాహుల్ గోస్వామి చెప్పారు. ఇతర కీలకాంశాలు .. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని జూన్లో అంచనా వేయగా, తాజాగా 5 శాతానికి తగ్గించారు. ఆహారం, ఇంధనం భాగంగా ఉండని కోర్ ద్రవ్యోల్బణ అంచనాలను 4.7 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గించారు. → వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచారు. వాస్తవ జీడీపీ వృద్ధి క్యూ1లో 7 శాతంగా, క్యూ2లో 6.4 శాతంగా, క్యూ3లో 6.5 శాతంగా, క్యూ4లో 6.8 శాతంగా ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నా దేశీయంగా డిమాండ్, తయారీ, సర్వీసుల కార్యకలాపాలు, ఎగుమతులు మెరుగ్గా ఉండటం ఇందుకు దోహదపడనున్నాయి. అయితే, రుతు పవనాలు, ఎల్నినో పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, గ్లోబల్ ట్రేడ్ పాలసీలపరమైన రిస్కులు పొంచి ఉన్నాయి. → ఏప్రిల్–మే వ్యవధిలో కరెంటు అకౌంటు మి గులు 2.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. → తొలి త్రైమాసికంలో స్థూలంగా 30.7 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి.
నాలుగోసారీ.. యథాతథం
పెరగని గ్రామీణుల ఆదాయం
ఇదో కొత్త చికాకు... ‘ఏఐ సైకోసిస్’!
ఉద్యోగం వచ్చింది.. కానీ
పొలాల్లో పాములు రైతు మిత్రులా? శత్రువులా?
యాక్షన్కి సై
కేరళ వరదల్లో అమ్మ సాహసం!
ప్రాణం తీసిన ఈత పందెం
మంత్రులు వర్సెస్ పీసీసీఎఫ్!
పిలిస్తే ఎగిరొచ్చే 'డ్రోన్'
నెలకు రూ.40 లక్షల భరణం.. అందుకే మేం కోర్టుకెళ్లాం
ఇక్కడి పరిశ్రమలను సార్ ఇతర రాష్ట్రాలకు పంపి దేశవ్యాప్తంగా ‘‘సంపద సృష్టిస్తున్నారు’’
ఇదీ మన మధ్యతరగతి పిల్లల పరిస్థితి
రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్
'త్రిషకు సారీ చెప్పాలి.. మరి సంస్కారం ఆయనకు ఉందో లేదో'
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
పొగాకు రైతులు.. సర్కార్
మన ఇల్లు లోతట్టు ప్రాంతంలో ఉండటం వలన డైరెక్ట్గా కొట్టుకొని వచ్చా!
ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి
సాక్షి కార్టూన్ : 05-08-2026
ఉదయ్నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్కాంత్
నిప్పంటించిన వ్యక్తి.. భారీగా తగలబడ్డ భవనాలు
టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?
అభిజీత్ దీప్కే అరెస్ట్కు రంగం సిద్ధం?
నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ
గట్టెక్కిన శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని దాటి 92.04 టీఎంసీలకు చేరిక
త్రిష పేరుతో సీఎం విజయ్పై కామెంట్స్
సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లో 241 రన్స్
ప్రదీప్ రావత్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు
నాలుగోసారీ.. యథాతథం
పెరగని గ్రామీణుల ఆదాయం
ఇదో కొత్త చికాకు... ‘ఏఐ సైకోసిస్’!
ఉద్యోగం వచ్చింది.. కానీ
పొలాల్లో పాములు రైతు మిత్రులా? శత్రువులా?
యాక్షన్కి సై
కేరళ వరదల్లో అమ్మ సాహసం!
ప్రాణం తీసిన ఈత పందెం
మంత్రులు వర్సెస్ పీసీసీఎఫ్!
పిలిస్తే ఎగిరొచ్చే 'డ్రోన్'
నెలకు రూ.40 లక్షల భరణం.. అందుకే మేం కోర్టుకెళ్లాం
ఇక్కడి పరిశ్రమలను సార్ ఇతర రాష్ట్రాలకు పంపి దేశవ్యాప్తంగా ‘‘సంపద సృష్టిస్తున్నారు’’
ఇదీ మన మధ్యతరగతి పిల్లల పరిస్థితి
రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్
'త్రిషకు సారీ చెప్పాలి.. మరి సంస్కారం ఆయనకు ఉందో లేదో'
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
పొగాకు రైతులు.. సర్కార్
మన ఇల్లు లోతట్టు ప్రాంతంలో ఉండటం వలన డైరెక్ట్గా కొట్టుకొని వచ్చా!
ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి
సాక్షి కార్టూన్ : 05-08-2026
ఉదయ్నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్కాంత్
నిప్పంటించిన వ్యక్తి.. భారీగా తగలబడ్డ భవనాలు
టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?
అభిజీత్ దీప్కే అరెస్ట్కు రంగం సిద్ధం?
నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ
గట్టెక్కిన శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని దాటి 92.04 టీఎంసీలకు చేరిక
త్రిష పేరుతో సీఎం విజయ్పై కామెంట్స్
సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లో 241 రన్స్
ప్రదీప్ రావత్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు
ఫొటోలు
బ్లూ శారీలో టాలీవుడ్ నటి అనసూయ అందాలు (ఫొటోలు)
వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన.. ప్రజలు బ్రహ్మరథం (ఫొటోలు)
గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)
అందాల ఆషికా రంగనాథ్ పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
పట్టుచీరలో బుట్టబొమ్మలా తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
'వారణాసి' షూటింగ్ చేసిన చోట 'దృశ్యం' పాప (ఫొటోలు)
బన్నీ 'వరుడు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫొటోలు)
భిక్షు యాదవ్, రాస్ బిహారీ.. ప్రదీప్ రావత్లోని మరో కోణం ఇది (ఫొటోలు)
హ హ హాసిని బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
గోల్డ్ కలర్ డ్రెస్లో అదరగొట్టిన తెలుగుగమ్మాయి.. ఈషా రెబ్బా (ఫొటోలు)
సినిమా
అది తెలియకపోవడం నిజంగా సిగ్గుచేటు: ధనుశ్ కామెంట్స్
కోలీవుడ్ హీరో ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చెన్నైలో తన సొంత నిధులతో నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ధనుశ్.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మీరంతా మాతృభాష పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు. తమిళం రాకపోవడం కరెక్ట్ కాదని.. అది నిజంగా సిగ్గుచేటని విద్యార్థులకు చురకలంటించారు. ఈ సందర్భంగా ధనుష్ తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. ఇతర భాషలలో ప్రావీణ్యం సంపాదించే ముందు విద్యార్థులు మొదట తమ మాతృభాషను చదవడం, రాయడం నేర్చుకోవాలని ధనుశ్ విజ్ఞప్తి చేశారు.ధనుశ్ మాతృభాష గురించి మాట్లాడుతూ.. "ఒకరు మొదట తమ మాతృభాషను నేర్చుకోవాలి. వారు మొదట దానిని చదవడం, రాయడం నేర్చుకోవాలి. మీకు తమిళం రాదని చెప్పడం గర్వించదగిన విషయం కాదు. మీ మాతృభాష తెలియకపోవడం నిజానికి అవమానకరం. దయచేసి మీ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వండి. దయచేసి తమిళంపై కూడా దృష్టి పెట్టండి" అని విద్యార్థులకు సూచించారు.ధనుశ్ మాట్లాడుతూ..'చిన్నప్పుడు తాను ఇంగ్లీషుతో ఇబ్బంది పడినప్పటికీ.. తమిళంలో మాత్రం ఎప్పుడూ అనర్గళంగా మాట్లాడేవాడినని గుర్తుచేసుకున్నారు. నేను ఇక్కడ చదువుతున్నప్పుడు నాకు ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు.. బాగా మాట్లాడలేకపోయేవాడిని. కానీ తమిళంలో అనర్గళంగా మాట్లాడేవాడిని. ఇప్పుడు అది మారింది. ఈ రోజు నేను ప్రజలను కలిసినప్పుడు, పది మందిలో ఎనిమిది మందికి తమిళం సరిగ్గా చదవడం, రాయడం రాదు, కానీ వారు ఇంగ్లీషులో చాలా నిష్ణాతులు. ఇది నన్ను చాలా నిరుత్సాహనికి గురిచేస్తోంది" అని ఆయన అన్నారు. ఆ తర్వాత బెల్జియంలో ఓ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. అది మాతృభాష పట్ల తన దృక్పథాన్ని పూర్తిగా మార్చిందని తెలిపారు.ధనుశ్ మాట్లాడుతూ.. "నేను ఒక ఫ్రెంచ్ ప్రొడక్షన్ సినిమాలో నటించా. ఆ మూవీ షూటింగ్ బెల్జియంలో జరిగింది. మీకు ఇంగ్లీష్ తెలుసా అని అక్కడి వాళ్లు అడిగినప్పుడ తెలుసని చెప్పా. దానికి వాళ్లు చాలా ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఇంగ్లీష్ రాకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ నేను తెలుసని చెప్పినప్పుడు వాళ్లంతా షాకయ్యారు. ఎందుకని అడిగితే'మీకు మీ మాతృభాష బాగా తెలిసు. ఇంగ్లీష్ ఒక బోనస్ కదా?' అని బదులిచ్చారు. వాళ్లు మాతృభాషను ఆ విధంగా చూస్తారు" అని పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ధనుశ్ ప్రస్తుతం 'ఓం: చాప్టర్ 1' చిత్రంలో నటిస్తున్నారు.
అరుణాచలంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం సందర్శించింది. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం, మాస్ జాతర, రాబిన్హుడ్ చిత్రాలతో అలరించింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. అల్లు అర్జున్ పుష్ప-2లో ఐటమ్ సాంగ్తో ఆకట్టుకుంది. కిస్సిక్ అంటూ అభిమానులను అలరించింది. ఈ ఏడాది శివ కార్తికేయన్ సరసన పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. Our girl #Sreeleela at Tiruvannamalai pic.twitter.com/naeZUbBt0u— KUMAR || Vaathi సార్ || Venky Atluri&Nelson Fan || (@RajiniDhanush5) August 5, 2026
ప్రియుడితో హీరోయిన్ ఎంగేజ్మెంట్.. పోస్ట్ వైరల్
ప్రముఖ నటి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ భామ జియా శంకర్ తన కాబోయే భర్తను పరిచయం చేసింది. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అఫీషియల్గా ప్రకటించింది. ప్రియుడు కరణ్తో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ శుభవార్త విన్న అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.కాగా.. అభిషేక్ మల్హన్తో డేటింగ్ రూమర్స్ ఖండించిన కొన్ని నెలలకే ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం. జియా, అభిషేక్లు గతంలో బిగ్ బాస్ ఓటీటీ -2 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక మ్యూజిక్ వీడియోలో కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఈ వార్తలను జియా కొట్టిపారేసింది.జియా శంకర్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా బిగ్బాస్తో పాటు చాలా రియాలిటీ షోలలో మెరిసింది. తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. ఎంత అందంగా ఉన్నావే మూవీలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ నటించిన హైదరాబాద్ లవ్ స్టోరీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఈ భామ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. View this post on Instagram A post shared by Jiyaa Shankar (@jiyaashankarofficial)
రాహుల్ సిప్లిగంజ్ మానవత్వం.. గబ్బర్ సింగ్ నటుడికి సాయం
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మానవత్వం చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న నటుడికి అండగా నిలిచారు. గబ్బర్ సింగ్ నటుడు రమేశ్కు ఆర్థిక సాయమందించారు. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వైద్యం కోసం స్వయంగా తన వంతుగా లక్ష రూపాయలు అందజేశారు. అతను కోలుకోవాలని.. ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. దీంతో రాహుల్పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.కాగా.. గబ్బర్ సింగ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేశ్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో రమేశ్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఆ సినిమాలో వచ్చే అంత్యాక్షరి కామెడీ ఎపిసోడ్ ద్వారా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో కూడా కనిపించారు. వీటితో పాటు టాలీవుడ్లో పలు చిన్న, మధ్యతరహా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ పాత్రల్లో నటించాడు.
క్రీడలు
పోరాడి ఓడిన మానవ్
యోకోహామా (జపాన్): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యోకోహామా చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్లు మానవ్ ఠక్కర్, మనుశ్ షా, మనిక బత్రాలకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ మానవ్ 11–9, 8–11, 6–11, 11–7, 6–11తో ప్రపంచ 15వ ర్యాంకర్ డార్కో జోర్గిచ్ (స్లొవేనియా) చేతిలో ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్లో ప్రపంచ 40వ ర్యాంకర్ మనుశ్ షా 5–11, 5–11, 8–11తో ప్రపంచ 10వ ర్యాంకర్ అలెక్సిస్ లెబ్రున్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్వన్, ప్రపంచ 55వ ర్యాంకర్ మనిక 1–11, 7–11, 7–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కువై మాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. మానవ్, మనుశ్, మనికలకు 4,500 డాలర్ల (రూ. 4 లక్షల 27 వేలు) చొప్పున ప్రైజ్మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
పాక్తో రెండో టెస్ట్.. విండీస్కు భారీ ఎదురుదెబ్బ
పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ బ్రాండన్ కింగ్ గాయం కారణంగా మ్యాచ్లో మిగిలిన భాగానికి దూరమయ్యాడు. ఆగస్టు 4న మూడో రోజు ఆట సందర్భంగా అతడికి తీవ్ర లోయర్ బ్యాక్ మసిల్ స్పాసమ్స్ వచ్చాయి.పాక్ ఇన్నింగ్స్లో 75వ ఓవర్ సందర్భంగా బాబర్ ఆజమ్ రనౌట్లో కింగ్ కీలక పాత్ర పోషించాడు. బాబర్ సింగిల్ కోసం ప్రయత్నించగా, తిరిగి క్రీజులోకి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కవర్ ప్రాంతం నుంచి కింగ్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో బాబర్ రనౌట్ అయ్యాడు.అయితే ఈ అద్భుతమైన ఫీల్డింగ్ ప్రయత్నం కింగ్కు తీవ్ర గాయాన్ని మిగిల్చింది. బంతిని అందుకుని డైరెక్ట్ త్రో వేసే సమయంలో అతడు ఇబ్బందికరంగా ల్యాండ్ కావడంతో వెన్ను కండరాల్లో తీవ్ర నొప్పి వచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అతడిని స్ట్రెచర్పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.క్రికెట్ వెస్టిండీస్ వైద్య బృందం ప్రాథమిక పరీక్షల అనంతరం కింగ్కు లోయర్ బ్యాక్ మసిల్ స్పాసమ్స్ ఉన్నట్లు నిర్ధారించింది. వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. గాయం మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో మిగిలిన మ్యాచ్కు అతడిని దూరంగా ఉంచారు.కింగ్ తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులు చేశాడు. అతడి గైర్హాజరీ వెస్టిండీస్ బ్యాటింగ్ కూర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్లో అతడు బ్యాటింగ్కు రాలేడు.కింగ్ లేని లోటు ఈ మ్యాచ్లో విండీస్ గెలుపోటములను శాశించే స్థితిలో ఉంది. ఆట నాలుగో రోజు విండీస్ రెండో ఇన్నింగ్స్లో ఘోరంగా పతనమైంది. తొలి సెషన్ సమయానికి ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (3), షమార్ జోసఫ్ (9) క్రీజ్లో ఉన్నారు. మరో రెండు వికెట్లు పడితే విండీస్ ఇన్నింగ్స్ ముగుస్తుంది. సాజిద్ ఖాన్ (4 వికెట్లు), అలీ ఉస్మాన్ (3 వికెట్లు) విండీస్ను ఘెరంగా దెబ్బతీశారు. ప్రస్తుతం విండీస్ కేవలం 72 పరుగుల లీడ్లో ఉంది. ఈ మ్యాచ్లో విండీస్ ఓటమి తప్పించుకోవాలంటే ఏదైనా మహాద్భుతమే జరగాలి. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి టెస్ట్ గెలవడంతో విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది.
2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ షెడ్యూల్ ఖరారు
2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు మ్యాచ్లు జరుగనున్నాయి. ఐసీసీ టోర్నీ తేదీలను ఖరారు చేసినప్పటికీ, వేదికను ఇంకా నిర్ణయించలేదు. మొత్తం 10 జట్లు ఈ క్వాలిఫయర్లో పోటీ పడనున్నాయి.ఈసారి క్వాలిఫికేషన్ విధానంలో కీలక మార్పులు ఉన్నాయి. 10 జట్లు క్వాలిఫయర్లో పాల్గొంటాయి. ఇక్కడ చాంపియన్గా నిలిచిన జట్టు నేరుగా 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది. 2, 3, 4 స్థానాల్లో నిలిచే జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన సూపర్ సిరీస్ దశకు వెళ్తాయి. సూపర్ సిరీస్లో విజేతకు ప్రపంచకప్ ప్రధాన దశలో మిగిలిన ఒక బెర్త్ దక్కుతుంది.ఏ జట్లు క్వాలిఫయర్కు వస్తాయి..?10 జట్లలో 2 జట్లు 2026 సెప్టెంబర్ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్లో దిగువన ఉండే ఫుల్ మెంబర్ జట్లు. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఇందుకు మినహాయింపు. 4 జట్లు క్రికెట్ వరల్డ్కప్ లీగ్ 2లో టాప్-4 జట్లు. మిగతా 4 జట్లు వరల్డ్కప్ క్వాలిఫయర్ ప్లేఆఫ్లో టాప్-4 జట్లు.విండీస్ పరిస్థితి ఆసక్తికరంప్రస్తుతం వెస్టిండీస్ పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. వన్డే ర్యాంకింగ్స్లో 10వ స్థానంలో ఉన్న ఆ జట్టు సెప్టెంబర్ 30 కట్ఆఫ్కు ముందు భారత్తో రెండు మ్యాచ్లు ఆడనుంది. ఆ రెండు మ్యాచ్ల ఫలితాలు, అలాగే ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ సిరీస్ ఫలితాలు వారి ప్రపంచకప్ మార్గాన్ని ప్రభావితం చేస్తాయి. 2027 ODI ప్రపంచకప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది.
యశ్ ధుల్ విధ్వంసకర శతకం
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అదరగొట్టింది. పూరానీ ఢిల్లీ 6పై ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ విజయానికి యువ బ్యాటర్ యశ్ ధుల్ సంచలన సెంచరీ ప్రధాన కారణంగా నిలిచింది.141 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ధుల్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో అజేయ సెంచరీ బాదాడు. ధుల్ ఒంటిచేత్తో సెంట్రల్ ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. అతడికి మరో ఎండ్లో యుగల్ సైనీ (27 నాటౌట్) నామమాత్రపు అండగా ఉన్నాడు. సైనీతో కలిసి ధుల్ అజేయమైన 81 పరుగులు జోడించి మ్యాచ్ను ఏకపక్షం చేశాడు. అంతకుముందు ధుల్ సహ ఓపెనర్ సిద్దార్థ్ జూన్ (8)తో తొలి వికెట్కు 60 పరుగులు జోడించాడు. ధుల్ ధాటికి సెంట్రల్ ఢిల్లీ 13.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత పురానీ ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ సమర్థ్ సేథ్ (32) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. ఆఖర్లో అశ్విని చిల్లర్ (38), రోహన్ రాఠీ (46) బ్యాట్ ఝులిపించారు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో మోనీ గ్రేవాల్ 3, ఖురానా 2, బరోకా ఓ వికెట్ తీశారు.ధుల్ 2022 అండర్-19 ప్రపంచకప్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరించి టైటిల్ గెలిపించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అతడు 110 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టోర్నీలో ధుల్ 4 మ్యాచ్ల్లో 229 పరుగులు చేశాడు. సగటు 76.33.అదే ఏడాది అండర్-19 ఆసియా కప్ గెలిచిన భారత్ జట్టులోనూ ధుల్ కీలక సభ్యుడు. అండర్-19 ప్రదర్శనల తర్వాత ధుల్ను భారత క్రికెట్లో భవిష్యత్ టాపార్డర్ బ్యాటర్గా పరిగణించారు. అయితే దురదృష్టవశాత్తు అతడు పెద్దగా రాణించలేకపోయాడు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో చేసిన సెంచరీ అతడి కెరీర్ను మలుపు తప్పుతుందేమో చూడాలి.
న్యూస్ పాడ్కాస్ట్
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ కుంభకోణంపై జెన్జీ వార్...
ఏపీలో డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే...
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అక్రమాలపై విచారణ. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రెండేళ్ల బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం... ‘కాగ్’ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం
బిజినెస్
దొంగదారిలో భారత్లోకి పాకిస్తాన్ ఖర్జూరాలు..
భారత్ విధించిన నిషేధాన్ని తప్పించుకుని మూడో దేశం ద్వారా భారత్లోకి పాకిస్తానీ ఖర్జూరాల దిగుమతికి చేసిన ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అడ్డుకుంది. గుజరాత్లోని కాండ్లా పోర్టులో పాకిస్తాన్ మూలానికి చెందిన 364 మెట్రిక్ టన్నుల డ్రై ఖర్జూరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 కోట్లుగా అధికారులు వెల్లడించారు.నిర్దిష్ట సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు కాండ్లా పోర్టులో వచ్చిన 13 కంటైనర్లను తనిఖీ చేశారు. పత్రాల్లో ఈ సరుకును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి వచ్చినవిగా పేర్కొన్నప్పటికీ, దర్యాప్తులో అసలు మూల దేశం పాకిస్తాన్ అని తేలింది. పాకిస్తాన్ నుంచి సరుకును తొలుత దుబాయ్కు తరలించి, అక్కడ మరో కంటైనర్లలోకి మార్చిన అనంతరం భారత్కు ఎగుమతి చేసినట్లు విచారణలో గుర్తించారు.గుగ్గుల్ రెసిన్ కేసులోనూ ఇదే తరహా మోసంకాండ్లా ఘటనకు కొద్దిరోజుల ముందే తమిళనాడులోని ట్యుటికోరిన్ పోర్టులోనూ ఇలాంటి వ్యవహారాన్ని డీఆర్ఐ గుర్తించింది. సుమారు 14 మెట్రిక్ టన్నుల పాకిస్తాన్ మూలానికి చెందిన గుగ్గుల్ రెసిన్ దాదాపు రూ.1.4 కోట్ల విలువైన సరుకును అధికారులు అడ్డుకున్నారు. ఈ సరుకును సోమాలియా మూలానికి చెందిన సహజ రెసిన్గా పత్రాల్లో చూపించి, దుబాయ్ మీదుగా భారత్కు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు గుర్తించిన అధికారులు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.పాకిస్తాన్ వస్తువులపై ఎందుకు నిషేధం?పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మూలానికి చెందిన వస్తువుల దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రత్యక్షంగానే కాకుండా మూడో దేశాల ద్వారా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం లేదా రవాణా చేయడం కూడా నిషేధం. దీంతో పాకిస్తాన్ నుంచి సరుకులను దుబాయ్ వంటి మూడో దేశాలకు తరలించి, అక్కడి నుంచి భారతదేశానికి పంపే మార్గాలను అక్రమంగా ఉపయోగించే ప్రయత్నాలపై డీఆర్ఐ నిఘా పెంచింది.ఇదీ చదవండి: ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్!
ఆర్బీఐ ఎఫెక్ట్: మార్కెట్ ముగిసిందిలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో భారత బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ కాస్త లాభాలతో పుంజుకున్నాయి. నిఫ్టీ 0.04 శాతం లేదా 9.75 పాయింట్ల లాభంతో 24,624.65 వద్ద, సెన్సెక్స్ 152.05 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 78,581.00 వద్ద ముగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 0.18 శాతం, 0.7 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో మెరుగైన పనితీరు కనబరిచాయి.
20 ఏళ్లలో ఇండిగో సాధించింది ఇదే..
భారత పౌర విమానయాన రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన ఇండిగో ఎయిర్లైన్స్ నిన్నటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2006 ఆగస్టు 4న ఢిల్లీ నుంచి గౌహతి మీదుగా ఇంఫాల్కి నడిపిన ఒకే ఒక్క విమాన సర్వీస్తో అత్యంత సాధారణంగా ప్రారంభమైన ఈ సంస్థ ప్రయాణం నేడు భారత గగనతలంలో కీలకంగా మారింది. విజయవంతంగా 20 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఇండిగో సాధించిన కొన్ని విజయాల గురించి కంపెనీ చెప్పిన కొన్ని అంశాలు కింద చూద్దాం.భారత దేశీయ విమానయాన రంగంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. నేడు దేశీయ విమానయాన సామర్థ్యంలో ఏకంగా 51% పైగా వాటాను కలిగి ఉంది. అంతర్జాతీయ సవాళ్లు, ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు, ఇతర కంపెనీల పోటీని తట్టుకుని లాభాల బాటలో పయనించడం ఇండిగో వ్యాపార వ్యూహానికి నిదర్శనం.ఒక్క విమానంతో మొదలైన ప్రయాణం, నేడు 430కి పైగా ఆధునిక విమానాల నెట్వర్క్గా రూపాంతరం చెందింది.రోజూ 2,200కి పైగా సర్వీసులను నిర్వహిస్తూ అత్యంత రద్దీగా ఉండే ఎయిర్లైన్గా గుర్తింపు పొందింది.భారతదేశంలోని 95 ప్రధాన నగరాలను, 40కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలను అనుసంధానిస్తోంది.భారత్లోని దాదాపు 90% జనాభాకు 100 కిలోమీటర్ల పరిధిలోనే ఇండిగో విమానాశ్రయ సేవలు అందుబాటులో ఉండేలా తన నెట్వర్క్ను విస్తరించింది.‘లో కాస్ట్ క్యారియర్’ మోడల్ను అమలు చేస్తూ అందుబాటు ధరల్లో టికెట్లను అందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్లతో పాటు ఏఐ వర్చువల్ అసిస్టెంట్ (6SKAI) ద్వారా టికెట్ బుకింగ్స్, కస్టమర్ సేవలను వేగవంతం చేసింది. ఇటీవల ‘ఇండిగో స్ట్రెచ్’ వంటి ప్రీమియం తరగతులను కూడా ప్రవేశపెడుతూ విభిన్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది.ఇటీవల 20,000 ఉచిత టికెట్ల వంటి (ఇండిగోఫ్రీ) ఆఫర్లతో తన 20 ఏళ్ల మైలురాయిని జరుపుకునే స్థాయికి ఇండిగో చేరింది.ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు
ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్!
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) వాణిజ్య కార్యకలాపాల్లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ప్రయాణికులకు భారీ గిఫ్ట్ ప్రకటించింది. దేశీయ విమాన ప్రయాణికుల కోసం ఏకంగా 20,000 ఉచిత టికెట్లను అందించే ప్రత్యేక వార్షికోత్సవ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘హ్యాపీ ఇండిగో డే’ వేడుకల్లో భాగంగా ‘ఇండిగో ఫ్రీ’ పేరుతో ఈ ఆఫర్ను తీసుకొచ్చింది.గౌహతి మీదుగా తొలి విమానం2006 ఆగస్టు 4న ఢిల్లీ నుంచి ఇంఫాల్కు గౌహతి మీదుగా తొలి విమాన సర్వీసును నడపడం ద్వారా ఇండిగో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పట్లో ఒకే రూట్తో సేవలు ప్రారంభించిన సంస్థ.. ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విస్తృత నెట్వర్క్ను నిర్వహించే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగింది.2026 ఆర్థిక సంవత్సరంలో ఇండిగో 12.3 కోట్లకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ప్రస్తుతం దేశ విమానయాన సామర్థ్యంలో సుమారు 51 శాతం వాటాను కలిగి ఉంది. ముఖ్యంగా నాన్-మెట్రో నగరాలకు విమాన కనెక్టివిటీని విస్తరించడంలో ఇండిగో కీలక పాత్ర పోషించింది.రూ.10 వేల వరకు రీఫండ్వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన ‘ఇండిగో ఫ్రీ’ ఆఫర్ కింద అర్హత పొందిన ప్రయాణికులకు వారి టికెట్ ఛార్జీని గరిష్ఠంగా రూ.10,000 వరకు రీఫండ్ చేయనున్నారు. ఈ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు ఇండిగో అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, ఏఐ వర్చువల్ అసిస్టెంట్ 6ఎస్కై వంటి ప్రత్యక్ష బుకింగ్ ఛానెళ్ల ద్వారా చేసే దేశీయ విమాన బుకింగ్స్కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.ఆఫర్ వ్యవధిలో టికెట్లు బుక్ చేసుకున్న వారిలో అర్హత కలిగిన ప్రయాణికులను యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈమెయిల్, వాట్సాప్ ద్వారా సమాచారం పంపుతారు. అనంతరం ఒక సాధారణ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సరైన సమాధానం ఇచ్చిన వారికి రూ.10,000 వరకు బుకింగ్ ఛార్జీని తిరిగి చెల్లిస్తారు.ఏ బుకింగ్స్కు వర్తిస్తుంది?ఈ ఆఫర్ కింద వన్-వే, రిటర్న్ జర్నీలతో పాటు దేశీయ ఎకానమీ క్లాస్, ఇండిగోస్ట్రెచ్ బుకింగ్స్కు అవకాశం ఉంది. ఎంపికైన ప్రయాణికులకు రీఫండ్ మొత్తాన్ని మూడు నుంచి ఐదు పనిదినాల్లో ప్రాసెస్ చేస్తామని సంస్థ తెలిపింది.
ఫ్యామిలీ
ఈ పెళ్లి కార్డు తులసి మొక్కగా మారుతుంది!
సాధారణంగా పెళ్లి కాగానే కార్డును బయట పడేస్తాం. కానీ, ఈ కార్డును బయట పడేయకుండా మట్టికుండీలో పెట్టి పైన మట్టిని వేసి నీరు పోస్తే వారం రోజుల వరకు కార్డు మట్టిలో కరిగిపోయి అందులోంచి తులసీ మొక్క బయటకు రావడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్ గుప్తా వ్యాపారరీత్యా నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఉంటున్నాడు. నిరుపేదల కోసం సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్లో ఉచిత స్వర్గలోక యాత్ర వాహనాలు, బాడీ ఫ్రీజర్లు సమకూరుస్తున్న ఆయన కూతురు వివాహానికి వినూత్నంగా ఆలోచించాడు. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా కార్డును తయారు చేయించాడు. పెళ్లి అయిన తర్వాత మంచిరోజు చూసుకుని ఆహ్వానపత్రికను మట్టితో కూడి పాత్రలో పెట్టాలని, వారంరోజులకు తులసీ మొక్క వస్తుందని పేర్కొన్నాడు. పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నట్లు వివరించాడు.– కోనరావుపేట(వేములవాడ)
బిడ్డ పుట్టినప్పుడే తల్లీ పుడుతుంది...
తల్లి క్షేమానికి సురక్షితమైన ప్రసవం ఎంత ముఖ్యమో, ప్రసవానంతరం బిడ్డ క్షేమానికి పాలు పట్టడమూ అంతే ముఖ్యం. శిశువు తర్వాతి దశలలో ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు తాగడం ఒక్కటే సరైన పరిష్కారం. బిడ్డ పుట్టిందనే ఆనందం మాత్రమే కాదు అదే సమయంలో స్త్రీ తల్లిగా కొత్త జన్మ ఎత్తుతుందని, ఆ జన్మను మరింత దివ్యంగా మార్చుకునే శక్తి ఆమెకే ఉందని ప్రపంచస్థాయిలో ఎన్నో నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విషయంలో తల్లికి కుటుంబ మద్దతు, వైద్యుల సూచనలు తప్పనిసరి అవసరం...ఔషధం లాంటి అమ్మపాలు బిడ్డకు అమృతమే. సహజ పోషకాహారం. బిడ్డ ఆరోగ్యకరమైన భావి జీవితానికి ఎంతో విలువైనవి. తల్లిపాలు తాగని పిల్లల్లో అనారోగ్యం, ఆకస్మిక మరణం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యుక్తవయస్సులో ఆరోగ్య సమస్యల ప్రమాదాలు పెరుగుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పాటు పలు నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమ్మపాల ్రపాధాన్యత గురించి, బిడ్డకు లభించిన జన్మహక్కు గురించి మరింత వివరంగా తెలుసుకోవడం, తెలియజెప్పడం మన విధి.ఇన్ఫెక్షన్ల నివారిణి...తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాన్ని అంటే.. చాలావరకు ప్రసవం అయ్యాక శిశువుకు తేనె నాకించడం, డబ్బా పాలు పడుతుంటారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల తల్లిలోనూ పాల ఉత్పత్తి ఆలస్యం కావచ్చు. ఇలాంటి వాటి వల్ల బిడ్డకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీర వేడి ద్వారా బిడ్డను రక్షించడమే కాకుండా తల్లీ బిడ్డ మధ్య బంధం బలపడుతుంది. మొదటి గంటలో తల్లి తన బిడ్డకు ఇచ్చే ప్రతి పాల చుక్కా అనారోగ్యకారకమైన బాక్టీరియాతో పోరాడే శక్తి ప్రదాయిని. సాధారణ సిజేరియన్ ఏ ప్రసవం అయినా మొదటి తల్లిపాలు శిశువుకు తప్పక ఇవ్వాలి. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతిముర్రుపాలుగా పిలిచే మొదటి పాలను కొలొస్ట్రమ్ అంటారు. ‘ప్రీ మిల్క్’ అనే ఈ పాలలోని పోషకాలు యాంటీబాడీలుగా శిశువుకు మొదటి సహజ టీకాగా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను ఏకకాలంలో అందజేస్తాయి. అంతేకాదు, ప్రసవం అయిన మొదటి గంటలో తల్లి హృదయానికి హత్తుకున్న బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల పిల్లల చర్మంలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది, తల్లీ–బిడ్డల బంధాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పట్టాలని, ‘మొదటి గంట’ మరీ కీలకం అని యూనిసెఫ్, డబ్ల్యూహెచ్వో తో పాటు ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఇంతగా తల్లిపాల విశిష్టతను తెలియజేయడానికి కారణం శిశువు ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, చురుకైన పనితీరుకు తోడ్పడే పోషకాలు ఆ పాలలో ఉంటాయి. ్ర΄÷టీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా, చక్కెరపాళ్లు తక్కువగా ఉండే తల్లి పాలు శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తి ఆహారం.తల్లి పాలు ఇవ్వడం ద్వారా... శిశువులోనూ, తల్లిలోనూ అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మాతా – శిశు మరణాల రేటు తగ్గించవచ్చు. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలు మేధో పరీక్షలలో మెరుగ్గా రాణిస్తారు. అధికబరువు లేదా ఊబకాయం బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువ ∙తల్లిపాలు ఇచ్చే మహిళలకు రొమ్ము, అండాశయ కాన్సర్ల ప్రమాదం కూడా తక్కువ ఉంటుంది. ఆరోగ్యంగా పెరగడం వల్ల ఉత్పాదక శక్తి పెరుగుతుంది. బలమైన ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకం. ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. తల్లిపాల పెంపుదలపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. తల్లిపాలు అందక ఇప్పటికీ ప్రతి వెయ్యి నవజాత శిశువులలో 224 నుంచి 263 శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా నేటికీ 6 నెలల లోపు శిశువులలో సగం కంటే తక్కువ మంది మాత్రమే తల్లిపాలు తాగుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.పని ప్రదేశాలలో తల్లిపాలకు మద్దతుపిల్లల జీవితంలో ఆరోగ్యకరమైన పునాది వేసేది తల్లిపాలు. శిశు, చిన్న పిల్లల పోషణలో అవగాహన మాత్రమే తల్లిపాలు ఇచ్చే శాతాన్ని పెంచుతాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఈ సంస్థ 16 అధ్యయనాల అంచనాలను క్రోడీకరించి ఆరోగ్య కేంద్రాలు, సంఘాలు, ఇళ్లలో చెప్పడం ద్వారా తల్లిపాలు ఇచ్చే రేటు 58 శాతం పెరిగిందని వివరించింది. ∙15,096 మంది నవజాత శిశువులపై జరిపిన అధ్యయనాలలో బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బిఎఫ్హెచ్ఐ) వల్ల శిశువు 6 నెలల వయసు వరకు తల్లిపాలు మాత్రమే ఇచ్చేవారి సంఖ్యలో 45 శాతం పెరిగిందని, ఆ తర్వాత కొనసాగించేవారి సంఖ్య 26 శాతం మాత్రమే పెరిగిందని వివరించింది ∙మీడియా జోక్యం ద్వారా 17 శాతం తల్లిపాలు పట్టడాన్ని పెంచిందని వివిధ అధ్యయనాల ద్వారా తెలిసింది ∙వేతనంతో కూడిన ప్రసూతి సెలవు వల్ల తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్య 52 శాతం పెరిగిందని తేలింది. పని ప్రదేశంలో శిశువులకు తల్లిపాలు పట్టడానికి మద్దతు ఇచ్చే విధానాలు, కార్యక్రమాలు తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్యను గణనీయంగా పెంచుతాయని అభి్రపాయపడింది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
హైదరాబాద్ ట్రావెలర్స్ కొత్త ట్రెండ్.. కల్చర్ ఫస్ట్!
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రయాణికులు ఇప్పుడు సాధారణ పర్యాటక ప్రాంతాల సందర్శనకే పరిమితం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక వంటకాలు, ఆధ్యాత్మిక అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్కైస్కానర్ విడుదల చేసిన ఇండియా కల్చర్ ట్రావెల్ ఇండెక్స్ వెల్లడించింది.నివేదిక ప్రకారం 56 శాతం మంది ప్రాంతీయ వంటకాలను ఆస్వాదించేందుకు, 54 శాతం మంది పండుగలు, ఉత్సవాల కోసం, 51 శాతం మంది ఆధ్యాత్మిక యాత్రల కోసం ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అలాగే 51 శాతం మంది పూర్తిగా సాంస్కృతిక అనుభవాల కోసమే సెలవులను ప్లాన్ చేస్తుండగా, 36 శాతం మంది సంస్కృతి తమ ప్రయాణాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుందని భావిస్తున్నారు.అయితే, ఇప్పటికే 95 శాతం మంది హైదరాబాద్ ప్రయాణికులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించగా, 87 శాతం మంది అసలైన సంప్రదాయాలు, వారసత్వాన్ని తెలుసుకునేందుకు స్థానిక ప్రాంతాలను కూడా అన్వేషించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దుర్గాపూజ, దీపావళి, కుంభమేళా, పొంగల్, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది.విదేశీ సాంస్కృతిక పర్యటనలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే 25 శాతం మంది ఇటువంటి పర్యటనలు చేయగా, మరో 65 శాతం మంది వెళ్లాలని వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే, జపాన్ అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా నిలవగా, థాయ్లాండ్, వియత్నాం, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో చార్మినార్, యాదాద్రి, భద్రాచలం, చిలుకూరు బాలాజీ ఆలయం, బోనాలు, బతుకమ్మ, మేడారం జాతర, వరంగల్ వారసత్వ కట్టడాలు రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపుగా ప్రయాణికులు పేర్కొన్నారు.అయితే భద్రత, వాతావరణ మార్పులు, అధిక రద్దీ, వసతి లభ్యత, పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని నివేదిక తెలిపింది. సంస్కృతి ఆధారిత పర్యాటకానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని స్కైస్కానర్ ఎక్స్ప్లోర్ విత్ ఏఐ, ప్రైస్ అలర్ట్స్, హోల్ మంత్ సెర్చ్, ఫ్లైట్ ట్రాకర్ వంటి డిజిటల్ సాధనాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
జ్వలించే విజయం
అద్దం చూడడానికి కూడా భయపడే విషాదస్థితి నుంచి ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకున్న ఆశావాద స్థితిలోకి వచ్చింది యాసిడ్ ఎటాక్ సర్వే్యవర్ రేషమ్. రాంచీకి చెందిన రేషమ్ ఫాతమ్ యూకే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘చెవెనింగ్ స్కాలర్షిప్’ను అందుకుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఈ)లో జెండర్, డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్లో ఎంఎస్సీ(మాస్టర్ ఆఫ్ సైన్స్) చేయనుంది. ‘ఇది కేవలం డిగ్రీ కాదు. నా కష్టానికి దొరికిన ప్రతిఫలం’ అంటోంది రేషమ్...చెవెనింగ్ స్కాలర్షిప్ అనేది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్కాలర్షిప్ ప్రోగ్రామ్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విదార్థులు, నిపుణులు యునైటెడ్ కింగ్డమ్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేయడానికి అవకాశం ఇచ్చే ప్రోగ్రామ్ ఇది.చావు అంటే ఇలాగే ఉంటుంది!ఇరవై తొమ్మిది సంవత్సరాల జీవితంలో రేషమ్ ఫాతమ్ ఎన్నో ఆట్లు పోట్లను చూసింది. తనకు అత్యంత సన్నిహితులైన వారి నుంచి వేధింపులు ఎదుర్కొంది. పదిహేడేళ్ల వయసులో రేషమ్పై యాసిడ్ దాడి జరిగింది. జంషెడ్పూర్లో జన్మించిన రేషమ్ 11వ తరగతి చదువుతూ లక్నోలోని తాతయ్య, నానమ్మలతో కలిసి ఉండేది. ఆమె దగ్గరి బంధువైన రియాజ్ ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని వేధించేవాడు. అతడు రేషమ్ కంటే ఇరవై సంవత్సరాలు పెద్ద!కొన్ని సంవత్సరాల క్రితం...ఆరోజు ప్రేమికుల దినోత్సవం. ఆరోజు ఏంజరిగిందో రేషమ్ మాటల్లోనే... ‘కోచింగ్ క్లాసు అయ్యాక నన్ను ఇంటి దగ్గర దింపుతానని రియాజ్ చె΄్పాడు. నేను నమ్మాను. ఉన్నట్టుండి కారును హైవే వైపు నడిపి, నా తల మీద యాసిడ్ పోశాడు. మొదట్లో అది పెట్రోల్ అనుకున్నాను. కాసేపటికి మంటపుట్టడం మొదలైంది. కత్తి తీసి నా గొంతు దగ్గర పెట్టి... చావు అంటే ఇలాగే ఉంటుందన్నమాట అన్నాడు. అంత బాధ, భయంలోనూ ఆ దుర్మార్గుడిని గట్టిగా తోసేసి పరుగెత్తాను. మంట భరించలేనంతగా ఉంది. పరుగెడుతూనే ఉన్నాను. నన్ను చూసి ఒక ఆటోరిక్షా డ్రైవర్ ఆగాడు. ఎంతైనా డబ్బు ఇస్తాను. నన్ను ఆదుకో అని బతిమిలాడాను. నా చర్మం మాడి పోతున్నట్లు అనిపించడంతో ఆటోలోనే జీన్స్ తీసేయాల్సి వచ్చింది. ఆటోలో ఉన్న ఒక వస్త్రంతో డ్రైవర్ నా కాళ్లను క΄్పాడు’ఎబ్రా ఫౌండేషన్జేఎన్యూలో చదువుతున్నప్పుడే ‘ఎబ్రా ఫౌండేషన్’ను ప్రారంభించింది రేషమ్. చదువు, ఆర్థిక స్వాతంత్య్రంపై మహిళలకు మార్గనిర్దేశం చేసే లక్ష్యంతో దీన్ని ప్రారంభించింది. 2024లో రేషమ్కు వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతోనే చెవెనింగ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంది. ‘లండన్కు వెళ్లిన తరువాత కూడా ఎబ్రా ఫౌండేషన్ పనులు కొనసాగుతాయి. అమ్మాయిల కోసం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడానికి ప్రణాళికలు తయారుచేసుకున్నాను. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులైతే, వారు స్వంత నిర్ణయాలు తీసుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. ఎన్నో సాధిస్తారు’ అంటుంది రేషమ్. పట్టువదలకుండా...పోలీస్ స్టేషన్ దగ్గరలో జనం గుమిగూడారు. కాని రేషమ్ను హాస్పిటల్కు తీసుకువెళ్లడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. అప్పుడు ఒక వృద్ధుడు ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు. ధైర్యం చె΄్పాడు. సర్జరీలు జరిగాయి. ఇంటి నుంచే చదువు కొనసాగించిన రేషమ్ అంత బాధలోనూ 87 శాతం మార్కులతో ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించింది. ఆతరువాత బీఎస్సీ ఫిజిక్స్ చేసింది. జేఎన్యూలో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.నమ్మితే చాలు...చదువు సంగతి ఎలా ఉన్నా ఇల్లు దాటి బయటికి వెళితే చాలు పరిచయం ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా రేషమ్కు ఇబ్బందులు ఎదురయ్యేవి. ‘అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ పరిస్థితుల్లో నువ్వు బతకడం అనేది నిజంగా వండర్’ అని ఒకరు...‘నీ భవిష్యత్ను తలుచుకుంటే బాధగా ఉంది. ఎలా బతుకుతావో ఏమో’ అని ఒకరు... సానుభూతి చూపుతున్నట్లుగా మాట్లాడుతూనే రేషమ్ను ఇబ్బంది పెట్టేవారు. ‘నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. నేను ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాను. నేను సాధించగలనని మీరు నమ్మితే చాలు’ అనేది రేషమ్.
అంతర్జాతీయం
ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి.. నీట మునక
ఎర్ర సముద్రంలో భారత వాణిజ్య నౌకపై దాడి జరిగింది!. యెమెన్ తీరంలో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలో ఉన్న 13 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 14 మందిని యెమెన్ కోస్ట్గార్డ్ సురక్షితంగా రక్షించింది. ఈ దాడి ఎవరి పని? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఎంఎస్వీ ఫైజ్ నూర్ ఒలియా (MSV Faize Noore Oliya) అనే నౌకపై గుర్తుతెలియని వస్తువు(క్షిపణి/పేలుడు పదార్థం) వచ్చి తగలడంతో అది బోల్తా పడి మునిగిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని యెమెన్ కోస్ట్గార్డ్ సహాయక చర్యలు చేపట్టి రక్షించి మొఖా పోర్టుకు తరలించినట్లు వెల్లడించారు. వాళ్లలో 13 మంది భారతీయులు, ఓ విదేశీయుడు ఉన్నాడు. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. పౌర నౌకపై జరిగిన ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి రక్షణ లేకుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకర పరిణామమని పేర్కొంది. భారతీయ నావికుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సోనోవాల్ తెలిపారు. రక్షించబడిన సిబ్బందికి అవసరమైన సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఘటనపై స్పందించింది. భారత జెండాతో ఉన్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని ఖండిస్తూ.. రియాద్లోని భారత రాయబార కార్యాలయం యెమెన్ అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది. సిబ్బంది రక్షణలో సహకరించిన యెమెన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది.అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన మరింత ఆందోళనకు దారితీసింది.ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఎర్ర సముద్రం ఒకటి. సుయాజ్ కాలువ ద్వారా యూరప్, ఆసియాలను కలిపే ఈ మార్గంలో ఇటీవలి కాలంలో భద్రతా సమస్యలు పెరిగాయి. ముఖ్యంగా యెమెన్ సమీపంలోని బాబ్ అల్ మండెబ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో పలు అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి.
మూడేళ్ల తర్వాత మృతుల జాడ
డెయిర్ అల్ బాలాహ్ (గాజా సిటీ): ఇజ్రాయె ల్ దమనకాండకు బలై మూడేళ్లుగా జాడ తెలీకుండా పోయిన తమ వారి కోసం ఆప్తుల అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. గాజాలోని సబ్రా సమీప ప్రాంతంలోని జనావాసాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హసై నా, అబూ షరీయాలకు చెందిన కుటుంబా లు సజీవసమాధి అయ్యాయి. అయితే ఆనా టి నుంచి మృతదేహాల జాడ కోసం గాలించి ఇటీవల ఎట్టకేలకు గుర్తించారు. 2023 నవంబర్ 22నాటి ఇజ్రాయెల్ దాడిలో 300 మంది దాకా గల్లంతుకాగా వీరిలో తాజాగా 112 మందికి చెందిన మృతదేహాలను వెలికితీశా రు. మృతదేహాలకు బంధువులు, ఆప్తులు మంగళవారం సామూహిక అంత్యక్రియలు జరిపారు. ఘటన జరిగిన రోజూ కాంక్రీట్, నిర్మాణ శిథిలాల్లో శరీరభాగాలు తెగిపోయిన స్థితిలో 40 మంది మృతదేహాలను వెలికితీయగా ఇప్పుడు ఒకేసారి 112 మంది బాధితుల అవశేషాలను బయటకుతీశామని హమాస్ సారథ్యంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా కాల్పుల విరమణ అమల్లో ఉండటంతో పాత శిథిలాల వద్ద తవ్వకం పనులు సాధ్యమయ్యాయి. దాంతో వీళ్ల మృతదేహాలను వెలికితీయగలిగారు. ఇంకా 157 మృతదేహాల జాడ తెలియాల్సి ఉంది. 2023 అక్టోబర్ ఏడు తర్వాత ఇజ్రాయెల్ మొదలెట్టిన మారణహోమంలో గాజాలో ఇప్పటిదాకా 73,377 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు.. 10 మంది మృతి
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ పరస్పరం జరుపుకున్న దాడుల్లో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఐదుగురు చనిపోగా 10 మంది గాయపడ్డారు. అదేవిధంగా, సెయింట్ పీటర్స్ బర్గ్లోని మరో వైల్డ్బెర్రీస్ గోదాముపై దాడి చేయగా మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన 320 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.ఉక్రెయిన్లోని మైకోలైవ్, పివ్డెన్యి, ఒడెసా పోర్టులపై దాడి చేసి చమురు, ఆయుధాలు, సైనిక సామగ్రితో వెళ్తున్న నాలుగు నౌకలను ధ్వంసం చేశామంది. రష్యా దాడుల్లో మైకోలైవ్ ఒకరు, సుమీలో ఇద్దరు బాలికలు, ఒక వృద్ధురాలు, ఖర్కీవ్లో మరొకరు చనిపోయారు. అదేవిధంగా, క్రమటోర్స్క్లో రష్యా జరిపిన గ్లైడ్ బాంబుల దాడిలో మరో 22 మంది గాయపడ్డారు.
కలర్ఫుల్ పక్షులకే కష్టాలు!
ప్రకృతి ఒడిలో తిరిగే రంగురంగుల పక్షుల అందమే ఇప్పుడు వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ రంగుల పక్షులతో పోలిస్తే.. ప్రకాశవంతమైన, ఆకర్షణీ యమైన రంగుల్లో కనిపించే పక్షులకే అంతరించి పోయే ముప్పు ఎక్కువగా ఉందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు మాంటెగ్యూ నీట్ క్లెగ్, నటాలియా ఒకాంపొ–పెన్యులా వియత్నాంలో పక్షులను పరిశీలించే యాత్ర ద్వారా కొన్ని రంగు రంగుల పక్షులు తీవ్ర ప్రమా దంలో ఉన్నాయని, వ్యాపార వర్గాల్లో వాటికే అధిక గిరాకీ ఉందని గ్రహించారు. అనంతరం అంతర్జాతీయంగా పరిస్థితే మిటో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) దగ్గర ఉన్న రెడ్ లిస్ట్లోని సుమారు 4,334 పాసరీన్ (పాటలు పాడే) కోవకు చెందిన పక్షి జాతుల స్థితిగతులను విశ్లేషించారు. పిచ్చుకలు, బుల్బుల్ వంటి పక్షులు కూడా వాటిలో ఉన్నాయి. వారి సందేహం నిజమేనని అధ్యయనంలో తేలింది. అక్రమ రవాణా దెబ్బరంగురంగుల ఈకలున్న పక్షులకు ముప్పు పెరగ డానికి ప్రధాన కారణం మానవ ప్రలోభాలు, పెంపుడు పక్షుల అక్రమ రవాణా వ్యాపారమేనని పరిశో ధకులు విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా అరుదైన రంగురంగుల పక్షులను ఇళ్లలో పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆ పక్షులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని.. దీంతో వేటగాళ్లు అడవుల నుంచి ఆకర్షణీయమైన పక్షులను పట్టుకొని అక్రమ రవాణా చేయడం వల్ల అడవుల్లో వాటి సంఖ్య వేగంగా పడిపోతోందని పరిశోధకులు పేర్కొన్నారు.ప్రత్యేకతలే శాపం..అడవుల నరికివేతతో పక్షుల సహజ నివాస ప్రాంతాలు వేగంగా దెబ్బతింటున్నాయి. సాధా రణ పక్షులు విభిన్న వాతావ రణాలకు సులువుగా అల వాటుపడగలవు. కానీ విభిన్న రంగులు, ప్రత్యేక ఆహార అలవాట్లుగల రంగురంగుల పక్షులు నిర్దిష్ట మైన పర్యావరణ వ్యవస్థలపైనే ఆధారపడి జీవి స్తాయి. అటువంటి నివాస ప్రాంతాలు ధ్వంసం కావడం వాటి ఉనికికే ప్రమాదకరంగా మారిందని పరిశోధకులు గుర్తించారు. చెట్ల జాతుల విత్తనాల వ్యాప్తికి, పూల పుప్పొడి రేణువుల చేరవేతకు, పర్యా వరణ సమతుల్యతకు పక్షులు దోహదపడతాయి. ఇవి అంతరించిపోతే పర్యావరణం దెబ్బతింటుంది. పక్షుల అక్రమ రవాణాను కఠిన చట్టాలతో అరి కట్టాలి. అరుదైన రంగుల పక్షులు నివసించే అటవీ ప్రాంతాలను పరిరక్షించే ప్రత్యేక ప్రణాళికలను ప్రపంచ దేశాలు తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
జాతీయం
ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్, లడఖ్ల ప్రయాణంలో ఆర్టికల్ 370 రద్దు ఒక ‘నిర్ణాయక నూతన అధ్యాయం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఆయన ఈ చారిత్రక నిర్ణయాన్ని గుర్తు చేసుకున్నారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ము కశ్మీర్ను జాతీయ ప్రధాన స్రవంతిలో పూర్తిగా విలీనం చేసింది. ఈ ప్రత్యేక హోదా రద్దు ద్వారా దశాబ్దాలుగా ప్రాథమిక రాజ్యాంగ హక్కులకు దూరంగా ఉన్న మహిళలు, అట్టడుగు వర్గాలకు సాధికారత లభించిందని ప్రధాని పేర్కొన్నారు. Seven years ago, on this day, Articles 370 and 35(A) became history, marking a decisive new chapter in the journey of Jammu and Kashmir as well as Ladakh.Since then, the lives of the people of J&K and Ladakh have witnessed wide-ranging transformation. Infrastructure has…— Narendra Modi (@narendramodi) August 5, 2026‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, ఏడేళ్ల కిందట ఇదే రోజున ఆర్టికల్ 370, 35(ఏ) చరిత్రలో కలిసిపోయాయని, నాటి నుంచి జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు వచ్చాయని అన్నారు. మౌలిక వసతులు విస్తరించడంతోపాటు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో, క్రీడల్లో నూతన అవకాశాలు మెరుగయ్యాయని చెప్పారు. నేడు దేశం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో ఈ ఆగస్టు 5వ తేదీకి మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.ఇది కూడా చదవండి: ఎంబీబీఎస్ గైనకాలజీ పేపర్ లీక్?
అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం
ఊహాగానాలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తెర దించింది. ఆ పార్టీ భవిష్యత్పై వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీగా మారే ఆలోచన తమకు లేదని.. ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే ‘ప్రెజర్ గ్రూప్’గానే పనిచేస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరుగుతున్న రెండు రోజుల వ్యూహ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.30 ఏళ్ల అభిజిత్ దీప్కే కేవలం రెండు నెలల క్రితమే వ్యంగ్య రూపంలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. తొలుత సోషల్ మీడియా వేదికగా సరదా ఉద్యమంలా కనిపించిన ఈ సంస్థ.. ఆ తర్వాత పరీక్షల అక్రమాలు, పేపర్ లీక్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన విద్యార్థి ఆందోళనలకు దీప్కే నాయకత్వం వహించారు. ఆ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.‘పార్టీ పెట్టే ఆలోచన లేదు’తమ భవిష్యత్ ప్రణాళికలపై దీప్కే మాట్లాడుతూ.. “రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. మీడియాకే ఆ అంశంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. మేము ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తాం” అని తెలిపారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలు, పరీక్షల నిర్వహణలో అక్రమాల వంటి అంశాలపై పోరాడడమే తమ లక్ష్యమని చెప్పారు.దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికCJP ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు దీప్కే తెలిపారు. యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ‘లిజనింగ్ టూర్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. “దేశంలోని ఏ ప్రాంతంలో విద్యార్థులు సమస్యలపై పోరాడినా.. వారికి అండగా ఉంటాం” అని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం జార్ఖండ్లో జేపీఎస్సీ సివిల్స్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే అక్కడికి వెళ్లి మద్దతు ఇస్తామని చెప్పారు. జంతర్ మంతర్ ఆందోళన సమయంలో 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తమ ఉద్యమానికి మార్గదర్శకుడిగా ఉన్నారని దీప్కే పేర్కొన్నారు. జార్ఖండ్ విద్యార్థి నేతలతో వాంగ్చుక్ ఇప్పటికే మాట్లాడి సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే.(అయితే ఈ మీటింగ్ జరుగుతున్న వేళ.. ఇవాళ అక్కడి ఆందోళలను విరమించడం గమనార్హం)యువత ఉద్యమానికి కొత్త దిశ?సీజేపీ వ్యూహ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, దాదాపు 50 మంది కీలక వాలంటీర్లు పాల్గొన్నారు. యువత సమస్యలను ఒక వేదికపైకి తీసుకురావడం, వాటిపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని వారు తెలిపారు. “యువత ఒక్కటైతే ఏదైనా సాధించగలరని ఈ ఉద్యమం నిరూపించింది” అని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు.కేవలం వ్యంగ్య వేదికగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు యువత సమస్యలపై జాతీయ స్థాయి ఉద్యమ వేదికగా మారే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎన్నికల రాజకీయాల్లోకి కాకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే శక్తిగా కొనసాగాలని అభిజిత్ దీప్కే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
E20 వివాదంలో గడ్కరీకి భారీ ఊరట
E20 పెట్రోల్ వివాదం నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టులో కీలక ఊరట లభించింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) విధానంతో అనుసంధానిస్తూ సోషల్ మీడియాలో ఆయనపై, కుటుంబ సభ్యులపై జరుగుతున్న ప్రచారానికి బుధవారం కోర్టు బ్రేకులు వేసింది. ఈ కంటెంట్ను “అసహ్యకరమైనది, దూషణాత్మకమైనది”గా అభివర్ణించిన ధర్మాసనం.. తక్షణమే తొలగించాలని డిజిటల్ ప్లాట్ఫారమ్లకు ఆదేశాలు జారీ చేసింది.ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) అంశం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్, ఇంజిన్ పనితీరుపై ప్రభావం ఉంటుందా? పాత వాహనాలకు ఇది అనుకూలమా? అనే అంశాలపై వినియోగదారుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో గడ్కరీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు, వీడియోలు ప్రచారం చేశారు. కేవలం తన కుటుంబ(కొడుకుల) వ్యాపారాలు బాగుండడం కోసమే ఆయన ఆ విధానం తెరపైకి తెచ్చారని జోరుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంపై గడ్కరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. E20 విధానం తన శాఖ పరిధిలోది కాదని, ఇది పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యక్రమమని స్పష్టం చేశారు. తన కుటుంబం చెరుకు పరిశ్రమలో ఏనాటి నుంచో ఉందని.. అయితే ఇథనాల్ పెట్రోల్ విధానం వల్ల తనకు గానీ, తన కుటుంబానికి గానీ పెద్దగా లాభం లేదని వివరణ ఇచ్చారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం, డీప్ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా గడ్కరీ తరఫు న్యాయవాదులు.. E20 విధానంపై విమర్శల పేరుతో మంత్రిని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు.. మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు ఇతర మధ్యవర్తి సంస్థలకు ఆ పోస్టులు, వీడియోలను తొలగించాలని ఇవాళ ఆదేశించింది.ఇదిలా ఉంటే.. E20 విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తోంది. పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల దేశ ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చని, రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెబుతోంది. మైలేజ్పై కొంత ప్రభావం ఉండొచ్చని అంగీకరిస్తూనే.. ఇంజిన్లకు నష్టం జరుగుతుందనే వాదనలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.గతంలో లోక్సభలో గడ్కరీ మాట్లాడుతూ.. వాహనం రకం, తయారీ సంవత్సరం ఆధారంగా మైలేజ్లో 2 నుంచి 6 శాతం వరకు మార్పు ఉండొచ్చని తెలిపారు. E20 అమలు శాస్త్రీయంగా, దశలవారీగా జరిగిందని పేర్కొన్నారు.మరోవైపు E20పై సుప్రీంకోర్టులోనూ చర్చ జరిగిన నేపథ్యంలో వివాదం కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం E20ను కేవలం “ప్రయోగం”గా పేర్కొన్నట్లు వచ్చిన ప్రచారాన్ని న్యాయశాఖ ఖండించింది. మొత్తంగా E20 విధానంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా గడ్కరీ చేసిన న్యాయపోరాటంలో బాంబే హైకోర్టు ఆదేశాలు కీలక పరిణామంగా మారాయి.
ఎంబీబీఎస్ గైనకాలజీ పేపర్ లీక్?
తిరువనంతపురం: కేరళ ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేయూహెచ్ఎస్) నిర్వహించిన ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గైనకాలజీ ప్రశ్నపత్రం లీకయ్యిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. జూలై 31న జరిగిన ఈ పరీక్షలో మొత్తం 15 ప్రశ్నలకు గాను 6 ప్రశ్నలు, విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ముందుగానే అందుబాటులో ఉన్న మోడల్ ప్రశ్నాపత్రం నుంచి యథాతథంగా వచ్చినట్లు తేలింది. దీనివల్ల 24 మార్కులు (24 శాతం) మోడల్ పేపర్ నుంచే రావడంతో పరీక్ష విశ్వసనీయతపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆరు నాలుగు మార్కుల ప్రశ్నలు మోడల్ పేపర్లోని క్రమ సంఖ్యతో పాటు అచ్చం అలాగే పునరావృతం కావడం విశేషం. ప్రశ్నపత్రం రూపొందించిన అధ్యాపకుడికి, దానిని పరిశీలించిన పరిశీలకుడికి (స్క్రూటినీ) మోడల్ పేపర్ ముందే ఇచ్చినప్పటికీ ఈ పొరపాటును గుర్తించడంలో విఫలమయ్యారని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. విశ్వవిద్యాలయానికి విద్యార్థులు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. మరోవైపు ఆగస్టు 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ నిర్వహణ విధానంపై కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల అనుసారమే పలు మార్పులు చేశామని విశ్వవిద్యాలయం సమర్థించుకుంది.ఇది కూడా చదవండి: అత్యాచార ఆరోపణలు.. మూకదాడిలో యువకుడు మృతి
ఎన్ఆర్ఐ
లండన్లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు)
డల్లాస్లో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం
సాక్షి, అమరావతి: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రముఖ నగరం డల్లాస్లో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. 2019–2024 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్క రణల గురించి వివరించారు. పార్టీ చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాలను వారికి పరిచయం చేశారు. ‘జననన్న కోసం మాట్లాడుదాం.. జగనన్న కోసం రాద్దాం.. జగనన్న కోసం పోస్ట్ చేద్దాం.. జగనన్న కోసం కోడ్ చేద్దాం (డిజిటల్ టూల్స్/ యాప్లు/టెక్ పరిష్కారాలు)..’ అని పార్టీని సాంకేతికంగా మరింత బలోపేతం చేసే కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ పోర్టల్ (www.ysrcpnriwing.org)ను ప్రారంభించారు. జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. పార్టీ కోసం సేవలందించే ఎన్ఆర్ఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు పార్టీ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామంటూ వైఎస్ జగన్ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.
క్రైమ్
మళ్లీ అదే స్టేషన్.. 12 ఏళ్ల తర్వాత పునరావృతమైన ఘటన
ప్రొద్దుటూరు క్రైం : వ్యభిచారం కేసులో పట్టుబడిన మహిళల నుంచి డబ్బు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో పని చేస్తున్న ముగ్గురు పోలీస్ సిబ్బందిపై జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వేటు వేశారు. హెడ్కానిస్టేబుల్ దస్తగిరి, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, సాయికిశోర్లను కడప వీఆర్లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా మంగళవారం ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ముగ్గురు పోలీసు సిబ్బంది కడప హెడ్క్వార్టర్లో రిపోర్టు చేసుకున్నారు. ఇటీవల ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్ సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళలను.. బెదిరించి వారి నుంచి వన్టౌన్ పోలీసు సిబ్బంది డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళల నుంచి నేరుగా నగదు తీసుకోకుండా ఓ వ్యక్తి పోన్పే ఖాతాకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలు రావడంతో.. పోలీసు సిబ్బందిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. డిజిటల్ లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ.. అన్ని కోణాల్లో పోలీసు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.ఇందులో ఆరోపణలు రుజువైతే తరుపరి శాఖాపరమైన చర్యలు ఉంటాయని స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు సిబ్బందిపైనే ఈ తరహా మహిళల నుంచి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళలను బెదిరించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు రుజువైతే అది కేవలం పోలీసుశాఖకు మచ్చ మాత్రమే కాదు.. మానవత్వానికి ప్రశ్నార్థకంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోన్పే చెల్లింపులతో అడ్డంగా దొరికిపోయారు ఫోన్పే చెల్లింపులతో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. డిజిటల్ చెల్లింపులు నేరాల విచారణలో కీలక ఆధారాలుగా మారుతున్నాయి. తాజాగా వ్యభిచారం కేసులో మహిళ నుంచి ఫోన్పే ద్వారా జరిగిన రూ.50 వేల బదిలీ వ్యవహారం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. నగదు చేతులు మారి ఉంటే ఈ వ్యవహారం బయటపడేదో లేదో కానీ ఫోన్పే ద్వారా జరిగిన ట్రాన్షక్షన్ మాత్రం మొత్తం వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చింది. డిజిటల్ ట్రాన్షక్షన్కు సంబంధించిన ఆధారాలే విచారణలో కీలకంగా మారడంతో ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది. 12 ఏళ్ల తర్వాత అదే స్టేషన్లో.. సరిగ్గా 12 ఏళ్ల క్రితం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వ్యభిచారం కేసులో ఆరుగురు సిబ్బందిపై వేటు పడింది. పలువురు పోలీసులు వ్యభిచార నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై నాటి పోలీసు అధికారులు.. ఆరుగురిపై చర్యలు తీసుకున్నారు. కాగా అప్పుడు కూడా ఆగస్టు నెలలోనే పోలీసు సిబ్బందిపై వేటుపడటం గమనార్హం. ప్రస్తుతం ముగ్గురు కానిస్టేబుళ్లు వ్యభిచారం వ్యవహారంలోనే ఆరోపణలు ఎదుర్కొంటూ వీఆర్కు వెళ్లారు. దీంతో ‘నాడు ఆరుగురు.. నేడు ముగ్గురంటూ’ పలువురు పోలీసులు అప్పటి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. డయల్ 100 కాల్కు విలువ లేదా? పోలీసుశాఖలో డయల్ 100 కాల్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన డయల్ –100 వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా తాజా ఘటన చర్చకు దారి తీసింది. డయల్– 100కు వచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసు సిబ్బందే.. మహిళలను బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందనే సమాచారం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే డయల్–100 వ్యవస్థ విశ్వసనీయతమైనే ప్రశ్నలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. డయల్ 100 కాల్కు వెళ్లిన వారు తప్పుడు సమాచారం ఇవ్వడంపై కూడా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యభిచార నిర్వాహకుడిపై చర్యలేవీ? పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు.. డబ్బులు తీసుకున్నారనే దానిపైనే ఇంత వరకు చర్చ జరుగుతూ వచ్చింది. అయితే వ్యభిచార నిర్వాహకుడి గురించి ఎక్కడా మచ్చుకైనా ప్రస్తావన రాలేదు. పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లే సరికి మహిళలు ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారని.. ఇంటి బయటే వారిని విచారణ చేయడం, తదితర పరిణామాలు చేసుకున్నాయని పోలీసు అధికారులు చెబుతున్న మాట. అయితే ఆ ప్రాంత వాసులు తెలిపే వివరాల ప్రకారం.. బైపాస్ రోడ్డులో అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి కొందరు నాయకుల అండతో వ్యభిచారం, జూదం నిర్వహిస్తున్నాడు.. అతనే మహిళలను పిలిపించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. అతను ఆ ప్రాంతంలోని ఓ నాయకుడి అండతో గలీజు దందా కొనసాగిస్తున్నాడని, సదరు వ్యక్తి గురించి పోలీసులకు తెలిసినా చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యభిచారం వ్యవహారంలో కూడా అతనే సెటిల్మెంట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసు అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.
హైదరాబాద్లో లిఫ్ట్ బీభత్సం.. మహిళ విషాదం!
హైదరాబాద్, చందానగర్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎలాంటి సూచిక బోర్డు లేకుండా లిఫ్ట్ ఆపరేటర్ మరమ్మతు చేస్తుండటం, లిఫ్ట్ ఎక్కిన మహిళకు ఆ విషయం తెలియకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్ నల్లగండ్లలోని అపర్ణ జినిత్లో సెక్యూరిటీ గార్డు. తన భార్య అనసూయ(43)తో కలిసి చందానగర్ అన్నపూర్ణ ఎన్క్లేవ్లోని చాట్వాజ్ మాన్షన్ అపార్ట్మెంట్లో ఉండే బంధువుల వద్దకు వచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆమె లోపల అడుగు పెట్టిన వెంటనే తలుపులు వేయకుండానే లిఫ్ట్ కదిలిపోయింది. దీంతో ఆమె కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆమె భర్త కేకలు వేయడంతో వెంటనే వచ్చిన అపార్ట్మెంట్ వాసులు లిఫ్టు తలుపులు తెరిచి ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, సూచిక బోర్డులు పెట్టకుండా, విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా లిఫ్ట్కు మరమ్మతులు చేపట్టడంతోనే నిండు ప్రాణం బలి అయిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడి బంగ్లాదేశ్? ఎక్కడి ఆదిలాబాద్?
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్లో జరిగిన దొంగతనం కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు మహ్మద్ జౌని అలీ గత కొన్నేళ్లుగా సుమారు 10 నుంచి 12 సార్లు అక్రమంగా, చాలా సులభంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబడ్డాడు. వివిధ రాష్ట్రాల్లోని ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇదే తరహాలో పనిచేసే 12 నుంచి 15 మంది బంగ్లాదేశ్ వాసులతో కూడిన ముఠాతో అతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో జిల్లా పోలీసులు ఇద్దరు బంగ్లాదేశీవాసులతోపాటు ఒక భారతీయ నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. సుమారు తొమ్మిదేళ్లుగా దేశ వ్యాప్తంగా పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ జౌని అలీని విచారించగా, పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్తాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సంచరిస్తూ ఇళ్ల తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు, బంగారం, వాహనాలు చోరీలకు పాల్పడుతున్నారు. నిందితులు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్లు నటిస్తూ కాలనీల్లో సంచరిస్తారు. ఇళ్లను రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న వాటిని గుర్తిస్తారు. రాత్రివేళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతారు. జౌనిపై దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎనిమిదికిపైగా నేరాల కేసులు ఉన్నాయి. ఇదే కేసులో పట్టుబడ్డ మరో సహ నిందితుడు భారత్కు చెందిన తరుణ్ సింగ్పై ఆరుకుపైగా కేసులు నమోదై ఉన్నాయి. ముఠాలోని ఇతర సభ్యులపై కూడా వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు.సహకరించిన వ్యక్తుల పాత్రపై దర్యాప్తు..సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, నిఘా సమాచారం, వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన ఇతర సభ్యులు, సహచరులు, అక్రమంగా భారతదేశంలో నివసించేందుకు సహకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారి పాత్రపై సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా పోలీసులు ముందుకెళ్తున్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారే అక్రమ విదేశీయులు, అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర నేర ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఐబీకి వివరాలు పంపిస్తున్నాంఈ దొంగతనం కేసులో మరికొంత మంది బంగ్లాదేశ్ వాసులు ముఠాగా సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రధాన నిందితుడి ద్వారా తెలిసింది. ఆ మిగిలిన వారి కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి వివరాలు పంపిస్తున్నాం. అక్రమంగా దేశంలోకి ఎలా ప్రవేశిస్తున్నారు? ఇంకా ఎలాంటి నేరాలు చేస్తున్నారు? అనే విషయాలను రాబడుతున్నాం. వివిధ రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నాం. – అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ
రాయితో దాడి.. ఆపై గొంతుకోసి..
నారాయణఖేడ్: కుటుంబ కలహాలు, అనుమానం పెనుభూతంలా మారి కట్టుకున్న భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ఇరక్పల్లిలో చోటుచేసు కుంది. ఖేడ్ సీఐ శ్రీనివాస్రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్ (35)కు 13 ఏళ్ల క్రితం మనూరు మండలం అతి మ్యాల్ గ్రామానికి చెందిన పర్వీన్ (32)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కాగా సయ్యద్ ముల్తాన్ దర్గాలో పూజలు చేస్తూ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తు న్నాడు.అయితే భార్యపై అనుమానంతో తరచూ ఆమెతో ఘర్షణపడేవాడు. దీంతో ఆరు నెలల క్రితం పర్వీన్ పుట్టింటికి వెళ్లింది. పెద్దలు సర్దిచెప్పడంతో 11 రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది. సోమవా రం అర్ధ రాత్రి కూడా భార్య తో గొడవపడిన ముల్తాన్ రాయితో ఆమెపై దాడి చేశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి మృతదేహాన్ని దర్గాలోకి తీసుకెళ్లి పడేశాడు. అక్కడి నుంచి సమీపంలోని గిరిజన తండాకు వెళ్లి విషయం చెప్పడంతో తండావాసులు పోలీసులకు సమాచారం అందించారు. నాగల్గిద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ శ్రీనివాస్రెడ్డి సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
వీడియోలు
NRI మహిళపై TDP మంత్రి లైంగిక వేధింపులు
తమాషాలు చేస్తున్నారా? పోలీసులపై అమర్నాథ్ ఫైర్!
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ ప్రభుత్వం
భారత్పై వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణ చెప్పిన Mark Zuckerberg
హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ 8 కాలేజీలు క్లోజ్
జగన్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
దుబాయ్ గుండెలపై మిస్సైళ్ళ వరం
క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?
రెండేళ్లలో మీ వల్ల జరిగింది ఇదే.. ! PIB రిపోర్ట్ చదివి వినిపించిన YS జగన్


