కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు
ఖమ్మం జిల్లా: ‘టీ తాగేందుకు పది నిమిషాలు ఆగడం వల్లే ప్రాణాలు దక్కించుకున్నాం.. కళ్ల ముందే జరిగిన పెను విషాదంతో నోట మాట రావడం లేదు..’అని మానస సరోవర యాత్రకు వెళ్తూ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడిన ఖమ్మం జిల్లా వాసి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన దాసరి శ్రీలక్ష్మిరెడ్డి శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి ఫోన్లో మాట్లాడగా వివరాలు వెల్లడించారు. సరోవర్ యాత్రకు అనుమతి ఆలస్యం కావడంతో కఠ్మాండులో బస చేసి ఈనెల 21న నేపాల్ నుంచి మరికొందరితో బయలుదేరినట్లు లక్ష్మిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో అలసటగా ఉందంటూ బృందంలోని ఓ సభ్యురాలు అనడంతో అంతా టీ తాగేందుకు ఆగినట్లు చెప్పారు. ఆ తర్వాత నిమిషాల్లోనే భారీ వరద ముంచెత్తడం...తమ ముందు వెళ్లిన వాహనాలు భారీ బురద, నీటి ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాయని తెలిపారు. ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చారని వెల్లడించారు. అయితే ముందుగా వెళ్లిన వాహనాల్లో తమ ట్రావెల్ బ్యాగులు, బట్టలు, ఇతర సామగ్రి మొత్తం కొట్టుకుపోయాయని చెప్పారు. సామగ్రి కోల్పోయినా బృందంలోని అందరం క్షేమంగా బయటపడటం సంతోషంగా ఉందని తెలిపారు. పరిసర గ్రామాల్లో పరిస్థితి భయానకంగా ఉందని, వరదతో ఇళ్లు కొట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా హృదయ విదారకరమైన దృశ్యాలే కనిపించాయని చెప్పారు. శ్రీలక్ష్మిరెడ్డి భర్త దాసరి జయపాల్రెడ్డి హైకోర్టు న్యాయవాది కాగా, వీరి పెద్దకుమార్తె దాసరి రోహిణి సింధూరి కర్ణాటక కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి, చిన్న కూతురు ప్రియాంకరెడ్డి బెంగళూరులో ప్రముఖ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కాగా, శ్రీలక్ష్మిరెడ్డి బృందం శుక్రవారం రాత్రి సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారు. చదవండి: యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్కు చైనా మరో డెడ్లీ వార్నింగ్!
జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద విషాదం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కారు పూజ కోసం ఆలయానికి వచ్చిన ఓ 70 ఏళ్ల వృద్ధుడు.. అదే కారు కింద పడి అనూహ్యరీతిలో మృతిచెందారు. మేనల్లుడి కారు పూజ కార్యక్రమం కోసం రామచంద్రరావు(70) బంధువులతో పెద్దమ్మ గుడికి వచ్చారు. పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత కారును అక్కడి నుంచి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొరపాటున యాక్సిలరేటర్ను తొక్కడంతో వాహనం ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న వృద్ధుడు కారు కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు సమాచారం. ఆలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: జాబ్ వస్తుందన్న ఆనందం అంతలోనే..
Video: భయానక దృశ్యం.. క్షణాల్లో కొట్టుకుపోయిన గ్రామం
నేపాల్ను వరదలు వణికిస్తున్నాయి.. వరద బీభత్సానికి సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో విరుచుకుపడిన వరద.. ఓ నదీ తీర గ్రామాన్ని క్షణాల్లో ముంచెత్తింది. భారీగా వచ్చిన బురదతో కూడిన వరదనీళ్ల ధాటికి ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి.భోటేకోశి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమైంది. నదులు పొంగిపొర్లడంతో నీరు, బురద జనావాసాల్లోకి దూసుకెళ్లాయి. చూస్తుండగానే ఓ నదీ తీర ప్రాంతం మొత్తం బురదగా మారిపోయింది. ఆ తర్వాత వరద ప్రవాహం దిగువ ప్రాంతాల వైపు కొనసాగింది. ఈ భారీ విపత్తులో 1,400 మందికి పైగా ఆచూకీ గల్లంతవ్వగా.. 392 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.ఈ వరదల తాకిడికి వందల సంఖ్యలో వంతెనలు ధ్వంసమయ్యాయి. దాదాపు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక, గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. హిమానీనదం నుంచి మంచు విరిగిపడటం వల్లే ఈ ఆకస్మిక వరద సంభవించి ఉండొచ్చని అంచనా. ఒక దశలో త్రిశూలి నదిలో నీటి మట్టం కేవలం అరగంటలోనే 9 మీటర్ల వరకు పెరిగినట్లు ఖాట్మండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ నిపుణులు తెలిపారు.Bright daylight, clear skies, and then suddenly a tsunami like wave crashes into a village. These scenes from Nepal today are beyond horrific. Everything feels like a doomsday scene.95+ people reported killed and 500+ still missing. Prayers for everyone #Nepal 🙏 https://t.co/0aIccVPsd8 pic.twitter.com/zSOXpiA0nK— Nikhil saini (@iNikhilsaini) August 26, 2026రాసువా జిల్లాలో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేపాల్లో 290 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. ఇప్పటివరకు 84 మంది భారతీయులను రక్షించినట్లు తెలిపింది. ఆచూకీ తెలియని వారిలో కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు, త్రిశూలి-1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు.
‘అంతా ఆ ఉంగరం వల్లే’..
అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆ కుటుంబంలో ఆశల దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. ‘అమ్మా.. నాన్న.. ఎప్పుడొస్తారు?’ అంటూ ఆ పసికవలలు అడుగుతున్న ప్రశ్నలకు ఆ ఇల్లంతా మూగబోయింది. రూ.50 వేల విలువైన ఉంగరం కోసం సాగిన వేధింపులు, బెదిరింపులు చివరికి ఆ దంపతులను గోదావరి ప్రవాహంలోకి నెట్టేశాయి. రెండేళ్ల క్రితం తీసుకున్న చిన్న బాకీ, మానసిక ఒత్తిడి ఆ దంపతుల ప్రాణాలను బలిగొనగా, అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను అనాథలను చేసింది. ఈ విషాద ఘటన ఊరందరినీ కంటతడి పెట్టిస్తోంది.తణుకు అర్బన్ : యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి దంపతులు గోదావరిలోకి దూ కిన ఉదంతం కలకలం రేపుతోంది. ఆర్థిక సమస్య లు, ఒత్తిళ్లు, బెదిరింపులు వీరి ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది. అమ్మా.. నాన్న.. అంటూ విలపిస్తున్న పసిపిల్లలు, కుమారుడు, కోడలును పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలతో వే ల్పూరులో విషాదఛాయలు అలముకున్నాయి. వే ల్పూరుకు చెందిన దొడ్డా వెంకట ధన సాయికృష్ణ అలియాస్ డీవీడీ (32), భార్య శిరీష (28)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది.గురువారం రాత్రి వీరిద్దరూ గోదావరి దూకి ఆత్మహత్యకు యత్నించారు. వేల్పూరులో నివసిస్తున్న సాయికృష్ణ కొన్ని నెలల నుంచి భీమవరంలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. వివాహానికి ముందు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో కొంతకాలం పనిచేశాడు. స్వదేశానికి వచ్చిన తర్వా త శిరీషను వివాహం చేసుకుని కొన్నాళ్లు హైదరాబాద్లో అంబులెన్స్ డ్రైవర్గానూ జీవనం సాగించాడు. అనంతరం వేల్పూరులో రెడీమేడ్ వస్త్ర దుకాణం నిర్వహించినా వ్యాపారం లేక అప్పులపాలై దుకాణం మూతపడింది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, దుర్గ వారి ఇంటిని సైతం విక్రయించి ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తుండగా కొంతమేర రుణాల నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. సాయికృష్ణ దంపతులకు కుమారుడు, కుమార్తె (కవలలు) ఉన్నారు. హింస పెట్టి, నానా మాటలు అన్నారు ‘నేను ఒకరి వద్ద ఉంగరం తీసుకుని ఇవ్వలేకపోయాను. దీంతో వారు మమ్మల్ని హింసపెట్టి నానామాటలు అనడం, చేసిన రాద్ధాంతంతో టెన్షన్ వచ్చి ఉండలేకపోయాం. పరిస్థితులు బాగోనప్పుడు.. నానామాటలు పడటంతో ధైర్యం చాలక ఏంచేయాలో తెలియక ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే మేం చేసిన అప్పులు మా అ మ్మా నాన్న తీర్చారు.. మా చావుకు మా అమ్మ నాన్నలకు ఎటువంటి సంబంధం లేదు..’ – సాయికృష్ణ మాట్లాడినట్టువైరల్ అవుతున్న వాయిస్ రికార్డింగ్గోదావరిలో కొనసాగుతున్న గాలింపు యలమంచిలి: చించినాడ వద్ద వశిష్ట గోదావరిలో దొడ్డా సాయికృష్ణ, శిరీష దంపతుల కోసం శుక్రవారం పోలీసుల గాలింపు కొనసాగింది. ఎస్సై మోటూరి రాజ్కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సభ్యులు సంయుక్తంగా స్పీడ్ బోట్లలో చించినాడ నుంచి ఏనుగువానిలంక, రామరాజులంక వైపు గాలించారు. రాత్రి 7 గంటల వరకు గాలించినా ఆచూకీ లభించకపోవడం, మరో వైపు చీకటి పడడంతో గాలింపు ఆపివేశారు. ఆదివారం ఉదయం మళ్లీ గాలింపు కొనసాగిస్తామని ఎస్సై రాజ్కుమార్ చెప్పారు. ఉంగరం కోసం రాద్ధాంతంతోనే.. దొడ్డా వెంకటేశ్వరరావు (సాయికృష్ణ తండ్రి) తమ సమీప నివాసితుడైన రవి అనే వ్యక్తి నుంచి తీసుకున్న ఉంగరం దంపతుల ప్రాణంపైకి వచ్చిందని సాయికృష్ణ తల్లితండ్రులు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. రెండేళ్ల క్రితం రవి నుంచి తీసుకున్న ఉంగరాన్ని తమ కుమారుడు తాకట్టు పెట్టి తిరిగి ఇవ్వలేకపోయాడని, గురువారం రవి కొందరు వ్యక్తులను వెంటపెట్టుకుని వచ్చి ఉంగరం కోసం చేసిన ఒత్తిడి, రాద్ధాంతం చేశాడని అన్నారు. ఈ కారణంగానే తన కుమారుడు, కోడలు బలవన్మరణానికి పాల్పడ్డారంటూ తల్లితండ్రులు మీడియా వద్ద వాపోయారు. ముందుగా వేల్పూరులో తమ ఇంటికి వచ్చి దుర్భాషలాడారని, అనంతరం భీమవరం వెళ్లి సాయికృష్ణ, శిరీషను ఇష్టానుసారంగా మాట్లాడి దాడికి దిగబోయారని కన్నీళ్లపర్యంతమయ్యారు. పసిపిల్లలను చూసి కూడా వారికి జాలి కలగలేదని కేవలం రూ.50 వేల కోసం తమను నానా మాటలు అన్నారంటూ వాపోయారు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం సాయికృష్ణ ఫ్యాన్కు ఉరేసుకుని చేసిన సెల్ఫీ వీడియో కూడా వైరల్గా మారడం తాజాగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో తేలాల్సి ఉండగా, దీనిపై ఎ టువంటి ఫిర్యాదులు అందలేదని తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: వీడియో కాల్ వైద్యానికి గర్భిణి మృతి
వరి పొలంలో 3డీ ఆర్ట్.. రైతుల సూపర్ క్రియేటివిటీ!
నేపాల్ వరదలు.. ప్రకృతి ఉగ్రరూపానికి పరాకాష్ఠ
గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్ సాహసం!
‘రావే చెలీ’... పాట మైకంలో చెవిటిదైపోయే పక్షి.. ఎక్కడుందో తెలుసా?
సునీల్ నరైన్ ఉగ్రరూపం
సమంతా.. మీ బేబీకి ఏం పేరు పెడతారు..? రిప్లై అదిరింది..!
ప్రశాంత్ కిశోర్ జన సేవా కేంద్రం ప్రారంభం.. లక్ష్యం ఇదేనట!
జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద విషాదం
కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు
నేపాల్ను ముంచిన బురద సునామీ!
రాష్ట్రానికి కరువు కానీ మీ అప్పులకేమీ ఉండదేమిటి సార్!
ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...
‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
..కరువెక్కడా కనపడి చావదేం!!
కోట్లు సంపాదించా.. ఇప్పుడు ఫలితం లేదు: షకీలా
రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి
ఇరుముడితో ఏం చెప్పాలనుకున్నారు?.. డైరెక్టర్కు సూటి ప్రశ్న
ఫైవ్ స్టార్ హోటల్లో విలాసాలు.. రూ.5.74 లక్షల బిల్లు రాగానే..
'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
సాక్షి కార్టూన్: 28-08-2026
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
IND vs AFG: ఊహించని షాకిచ్చిన అఫ్గానిస్తాన్!
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
కన్నీళ్లతో మంత్రి రాజీనామా.. ఇది తొలిసారి కాదు
యశ్ ‘టాక్సిక్’కు అన్నామలై రివ్యూ
మమిత సూపర్ డ్యాన్స్.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
అలా జరగకపోయి ఉంటే.. సాధిక్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే?
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. కారణమిదే?
చైనా హెచ్చరిక.. పొంచి ఉన్న మరో ప్రమాదం!
వరి పొలంలో 3డీ ఆర్ట్.. రైతుల సూపర్ క్రియేటివిటీ!
నేపాల్ వరదలు.. ప్రకృతి ఉగ్రరూపానికి పరాకాష్ఠ
గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్ సాహసం!
‘రావే చెలీ’... పాట మైకంలో చెవిటిదైపోయే పక్షి.. ఎక్కడుందో తెలుసా?
సునీల్ నరైన్ ఉగ్రరూపం
సమంతా.. మీ బేబీకి ఏం పేరు పెడతారు..? రిప్లై అదిరింది..!
ప్రశాంత్ కిశోర్ జన సేవా కేంద్రం ప్రారంభం.. లక్ష్యం ఇదేనట!
జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద విషాదం
కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు
నేపాల్ను ముంచిన బురద సునామీ!
రాష్ట్రానికి కరువు కానీ మీ అప్పులకేమీ ఉండదేమిటి సార్!
ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...
‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
..కరువెక్కడా కనపడి చావదేం!!
కోట్లు సంపాదించా.. ఇప్పుడు ఫలితం లేదు: షకీలా
రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి
ఇరుముడితో ఏం చెప్పాలనుకున్నారు?.. డైరెక్టర్కు సూటి ప్రశ్న
ఫైవ్ స్టార్ హోటల్లో విలాసాలు.. రూ.5.74 లక్షల బిల్లు రాగానే..
'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
సాక్షి కార్టూన్: 28-08-2026
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
IND vs AFG: ఊహించని షాకిచ్చిన అఫ్గానిస్తాన్!
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
కన్నీళ్లతో మంత్రి రాజీనామా.. ఇది తొలిసారి కాదు
యశ్ ‘టాక్సిక్’కు అన్నామలై రివ్యూ
మమిత సూపర్ డ్యాన్స్.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
అలా జరగకపోయి ఉంటే.. సాధిక్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే?
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. కారణమిదే?
చైనా హెచ్చరిక.. పొంచి ఉన్న మరో ప్రమాదం!
ఫొటోలు
దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)
హైదరాబాద్లో స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు)
'ఇరుముడి' కావేరీ.. షూటింగ్లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు)
రాఖీ పండుగ సెలబ్రేషన్స్ లో ప్రముఖులు (ఫొటోలు)
హీరోయిన్ ప్రిషా సింగ్ బ్యూటిఫుల్ (ఫొటోలు)
హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ రక్షాబంధన్ వేడుకలు.. ఫోటోలు
డైమండ్ డ్రెస్లో మెరిసిపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు
డీసీ బ్యూటీ సంజనా గ్లామరస్ పిక్స్.. ఫోటోలు
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్ (ఫొటోలు)
సినిమా
ఫుల్ జోష్లో...
‘ఇరుముడి’ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు రవితేజ. వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నారు. రవితేజ హీరోగా హసిత్ గోలి డైరెక్షన్లోని సినిమా ప్రకటన ఈ వారంలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న మూవీని ప్రకటించారు. బ్రిడ్జ్ ప్రోడక్షన్స్పై లక్ష్మణ్, శ్రీని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఇరుముడి’తో సూపర్ హిట్ అందుకున్న రవితేజను లక్ష్మణ్, శ్రీని కలిసి అభినందించి, ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్కు తగ్గట్లు ఈ సినిమా ఉంటుంది. వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో రూపొందించే కొత్త ప్రపంచంలోకి రవితేజ అడుగు పెట్టనున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.
'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
వారం గడిచిపోయినా సరే ఇప్పటికీ థియేటర్లలో 'ఇరుముడి' సినిమా అదరగొడుతోంది. ఇప్పటివరకు రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓవైపు భారీ హైప్తో రిలీజైన 'టాక్సిక్'కి ఫ్లాప్ టాక్ రావడం రవితేజ మూవీకి ఈ వీకెండ్ మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే ఇందులో నాగులు అనే విలన్ టచ్ ఉన్న పాత్ర చేసిన కొమరం.. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ వివరాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా)'ఇరుముడి' సినిమా ముందు వరకు కొమరం అంటే లేడీ గెటప్స్ వేసే వ్యక్తిగా మాత్రమే జనాలకు తెలుసు. ఇతడిలో విలనిజం చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. నాగులు పాత్రలో సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. ఇప్పటికే తనకు వస్తున్న గుర్తింపు చూసి ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్న కొమరం, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా కోసం తాను 16 రోజులు పనిచేస్తే.. రోజుకీ రూ.60 వేలు లెక్కన ఇచ్చారని చెప్పుకొచ్చాడు.అంటే 'ఇరుముడి'లో నటించినందుకుగానూ కొమరం రూ.9.6 లక్షలు అందుకున్నాడు. ఈ మూవీలో అద్భుతమైన యాక్టింగ్ చేసిన ఇతడికి.. 'బలగం' వేణు తాను తీస్తున్న 'ఎల్లమ్మ'లో పిలిచి అవకాశమిచ్చాడు. ఈ సంగతి కూడా స్వయంగా కొమరం మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గత 18 ఏళ్లుగా ఇతడు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ 'జబర్దస్త్' లాంటి షోల్లో లేడీ గెటప్స్ వేసుకునే కమెడియన్గానే జనాలకు తెలుసు. ఇప్పుడు 'ఇరుముడి'తో ఫేట్ మారిపోయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం రోజుకు రూ.60 వేల పారితోషికం ఉన్నది కాస్త త్వరలో క్రేజ్ పెరిగితే రూ.లక్ష అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)
ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ
1980లో కమల్ హాసన్ హీరోగా 'ఆకలిరాజ్యం' సినిమా వచ్చింది. నిరుద్యోగుల బాధలు, కష్టాల గురించి ఇందులో చూపించిన విధానం ఇప్పటికీ రిలేటబుల్గానే ఉంటుంది. ఇదొచ్చి 45 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లేటెస్ట్గా 'ఆకలిరాజ్యం 2026' పేరుతో తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీశారు. ఆహా ఓటీటీలో ఈ రోజే(ఆగస్టు 28) స్ట్రీమింగ్లోకి వచ్చింది. మరి ఇదెలా ఉంది? ఇందులో ఎలాంటి కంటెంట్ చూపించారు? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రమేశ్(వికాస్ వశిష్ఠ), అరుణ(గీతా సైనీ), అక్షయ్(రాజేశ్ ఖన్నా) ఇంజినీరింగ్ చదివేటప్పటి నుంచి స్నేహితులు. హైదరాబాద్లో ఒకే గదిలో అద్దెకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరోవైపు సొంతంగా ఏదైనా చేయాలని తాపత్రయపడుతుంటారు. ఓ వైపు నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ మరోవైపు వ్యక్తిగతంగానూ కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా నిరాశ, నిస్పృహలతో సాగుతున్న వీళ్ల జీవితం చివరకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సిరీస్లో చూపించింది కొత్త కథేం కాదు. నిరుద్యోగ సమస్య అనేది రోజురోజుకీ చాలా పెరుగుతోంది. ఇంజినీరింగ్ పాస్ అయినప్పటికీ ఉద్యోగాలు రాని యువత కోట్లాదిమంది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో బతుకీడుస్తూ కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి ఓ ముగ్గురి జీవితమే ఈ సిరీస్. ప్రస్తుతానికి మూడు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఉన్నంతలో వీటిని బాగానే తీశారు.ఒక్కో ఎపిసోడ్ సగటుగా 35 నిమిషాల నిడివితో ఉంటుంది. నిరుద్యోగం అనే సీరియస్ అంశాన్ని హాస్యంతో చెప్పే ప్రయత్నం చేశారు. తొలి రెండు ఎపిసోడ్స్ నవ్వించినప్పటికీ మూడో ఎపిసోడ్ మాత్రం ఎమోషనల్ చేస్తుంది. ప్రస్తుత జనరేషన్ కనెక్ట్ అయ్యే అంశాల్ని ఇందులో చూపించిన దర్శకుడు నీలగిరి మామిళ్ల.. సిరీస్ ఆకట్టుకునేలా తీయడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. కాకపోతే అవసరమైన కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. అక్కడక్కడ వినిపించే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి.ఉన్నంతలో హైదరాబాద్లోని రియల్ లొకేషన్లలోనే తీశారు. కాకపోతే ఇప్పటికే ఇలాంటి కథల్ని చాలా సినిమాల్లో, యూట్యూబ్ సిరీస్ల్లో చూసేశాం. కాబట్టి ఆ విషయంలో అయితే కొత్తగా అనిపించదు. ప్రస్తుతానికి రిలీజ్ చేసిన మూడు ఎపిసోడ్లు పర్లేదనిపించాయి. వచ్చే వారం స్ట్రీమింగ్ చేయబోయే ఎపిసోడ్లలో స్మార్ట్ ఫార్మింగ్(వ్యవసాయం) గురించి చూపించబోతున్నారు. అంటే పల్లెలో కథంతా ఉండబోతుంది.ప్రధాన పాత్రధారుల విషయానికొస్తే వికాశ్, రాజేశ్, గీతా ఉన్నంతలో బాగానే చేశారు. స్టోరీ రొటీన్గా ఉండటం వల్ల గుర్తుండిపోయే సీన్స్ అయితే వీళ్లకు పడలేదు. కొన్నిచోట్ల కన్వీనియంట్ రైటింగ్ కూడా మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే ఇదో టైంపాస్ సిరీస్. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుటుంబ సభ్యులతోనూ కలిసి చూడొచ్చు.-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
ట్రైలర్: 'ఇరుముడి' తర్వాత వస్తున్న మరో దేవుడి సినిమా
రీసెంట్ టైంలో దేవుడి నేపథ్యంత తీసిన సినిమాలు హిట్ అవుతున్నాయి. 'ఇరుముడి'లో తండ్రి కూతురి ఎమోషన్ ఉన్నప్పటికీ అయ్యప్ప స్వామి పాటలు, సీన్స్ కూడా మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. ఇప్పుడు మరో దేవుడి కథతో వస్తున్న తెలుగు చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. సెప్టెంబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ అంచనాలు పెంచేస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)సుమంత్, ఐశ్వర్య రాజేశ్, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు నటించిన ఈ సినిమా.. వారణాసి గ్రామదేవత వారాహీ అమ్మవారి కథతో తెరకెక్కించారు. ట్రైలర్లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. మూవీ కూడా ఇలానే ఉంటే హిట్ అయ్యే అవకాశముంది. హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్.. ఇందులో వారాహీ అమ్మవారిగా కనిపించనుంది. సిద్ధు జొన్నలగడ్డ అతిథి పాత్ర చేయడం విశేషం.(ఇదీ చదవండి: 'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?)
క్రీడలు
టెంట్లే డ్రెస్సింగ్రూమ్లు!
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల పురుషుల విభాగంలో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా... వీటిలో ఐదు టెస్టు క్రికెట్ దేశాలు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. సహజంగానే అంతర్జాతీయ టోర్నీలు, సిరీస్లలో ఈ టీమ్ల వసతి, ఇతర సౌకర్యాలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ క్రికెట్ జట్లకు కొత్త సమస్య వచ్చి పడింది. ఆసియా క్రీడల కోసం క్రికెటర్లకు చేస్తున్న ఏర్పాట్లు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని ఆయా దేశాల క్రికెట్ బోర్డును అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం క్రికెట్ మ్యాచ్లకు వేదిక అయిన కరోగీ పార్క్లో ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఎలాంటి డ్రెస్సింగ్రూమ్లు లేవు. బౌండరీ బయట ఏర్పాటు చేసే టెంట్లోనే మ్యాచ్ సాగినంత సేపు క్రికెటర్లు ఉండాల్సిందే. పైగా కనీసం 500 మీటర్లు నడిస్తే గానీ వాష్రూమ్ సౌకర్యం లేదు! మైదానం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఆటగాళ్లకు వసతి ఏర్పాటు చేశారు. ఇక్కడి గదులు మరీ చిన్నవిగా ఉన్నాయని కూడా ఫిర్యాదు వచ్చింది.‘లగేజీ, కిట్బ్యాగ్లతో సహా చూస్తే ఇద్దరు క్రికెటర్లు కలిసి ఉండలేనంత చిన్నవిగా రూమ్స్ ఉన్నాయి. ఒక ప్లేయర్ తన కిట్బ్యాగ్ తెరిస్తే మరో ఆటగాడు నిలబడేంత స్థలం కూడా లేదు’ అని ఒక బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. దీనిపై ఆసియా క్రీడల నిర్వాహకులతో మాట్లాడి సౌకర్యాలను సమీక్షించాలని బోర్డులు భావిస్తున్నాయి. ఇలాగే ఉంటే భారత్ తరఫున ద్వితీయ శ్రేణి జట్టును పంపే ఆలోచనతో బీసీసీఐ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు జట్టును మార్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆసియా క్రీడల కోసం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా పూర్తి స్థాయి టి20 టీమ్ను బరిలోకి దింపుతోంది.
ఎనిమిదో స్థానంతో సరి
అమ్స్టెల్వీన్: పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకుంది. వర్గీకరణ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు షూటౌట్లో బెల్జియం చేతిలో ఓడింది. 7–8 స్థానాల కోసం శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో టీమిండియా 3–4 గోల్స్ తేడాతో బెల్జియం చేతిలో ఓడింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3–3తో సమంగా నిలవగా... విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించారు. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్ప్రీత్ (31వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... అభిõÙక్ (6వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. బెల్జియం తరఫున రోమాన్ (22వ ని.లో), హుగో (23వ ని.లో), స్లూవర్ (47వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. షూటౌట్లో శైలానంద్ లక్రా, దిల్ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్ చేయగా... హర్మన్ప్రీత్, సుఖ్జీత్ విఫలమవడంతో భారత్కు ఓటమి తప్పలేదు. గత ప్రపంచకప్లో తొమ్మిదో స్థానంలో నిలిచిన టీమిండియా ఈ సారి ఒక స్థానం మెరుగు పరుచుకుంది. మహిళల హాకీ జట్టుకు 50 లక్షల నజరానా.. మహిళల హాకీ ప్రపంచకప్లో ఐదో స్థానంలో నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా (హెచ్ఐ) శుక్రవారం రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. 1974లో తొలిసారి నిర్వహించిన హాకీ వరల్డ్కప్లో అత్యుత్తమంగా నాలుగోస్థానంలో నిలిచిన భారత జట్టు మళ్లీ 52 ఏళ్ల తర్వాత మెరుగైన ప్రదర్శన చేసింది. వరల్డ్కప్లో చక్కటి ఆటతీరు కనబర్చిన ప్లేయర్లను హెచ్ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అభినందించారు.
పాఠాలు నేర్వని పాక్.. ఇంగ్లండ్ దెబ్బకు 110 రన్స్కే ఆలౌట్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భాగంగా పాకిస్తాన్ తమ దారుణ ఆటతీరును కంటిన్యూ చేస్తోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో పాఠాలు నేర్వలేదు. లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో పాకిస్తాన్ 37.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు వణికిపోయారు. ఓపెనర్ అజాన్ అవైస్ (46), సాద్ షకీల్ (16) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 4 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ 3, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (61), జోర్డాన్ కాక్స్ (55) అర్ధసెంచరీలు సాధించగా, గస్ అకిన్సన్ (45), జోష్ టంగ్ (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు తీయగా, మొహమ్మద్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా ఇమామ్-ఉల్-హక్ బ్యాటింగ్కు రాకపోవడంతో పాకిస్తాన్ 9 మంది బ్యాటర్లతోనే ఆటను కొనసాగించింది. దీంతో తొమ్మిదో వికెట్ పడిన తర్వాత పాక్ ఆలౌటైనట్లు అంపైర్లు ప్రకటించారు.Another humiliating defeat confirmed for Pakistan. 💔- Bowled out for 110 runs, with England leading by 180 runs. Congratulations to England in advance. pic.twitter.com/aAZplAxS9h— Abdullah (@Abdullahhhh_56) August 28, 2026చదవండి: టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన పసికూన
టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా
టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ట్రై సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా జట్టుకు పసికూన నమీబియా ఊహించని షాక్ ఇచ్చింది. విండ్హోక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో నమీబియా 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. టీ20ల్లో సఫారీలను చిత్తు చేయడం నమీబియాకు ఇది రెండోసారి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ట్రై సిరీస్కు సౌతాఫ్రికా తమ బి జట్టును ఆడేందుకు పంపించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు జాన్ ఫ్రైలింక్ (38 బంతుల్లో 60), లోరెన్ స్టీన్కాంప్ (29 బంతుల్లో 41) తొలి వికెట్కు 84 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో గెర్హార్డ్ ఎరాస్మస్ (19), అలెక్సాండర్ (13 నాటౌట్) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ప్రినెలన్ సుబ్రయెన్ 3 వికెట్లు తీయగా, డాన్ జాన్సెన్, జోర్న్ ఫోర్టున్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకు పరిమితమైంది. డెవాల్డ్ బ్రెవిస్ (50 బంతుల్లో 75) రాణించినప్పటికీ మిగతావాళ్ల నుంచి సహకారం కరువైంది. చివర్లో డాన్ జాసన్ (17 బంతుల్లో 25 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెలమన్, జేజే స్మిత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. సరిగ్గా పది నెలల క్రితం ఇదే వేదికపై సౌతాఫ్రికాను నమీబియా తొలిసారి టీ20ల్లో మట్టికరిపించడం విశేషం.Read: నైట్క్లబ్ ఉదంతం.. స్టోక్స్ను చావుదెబ్బ తీసిన భారత బౌలర్?
న్యూస్ పాడ్కాస్ట్
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
బిజినెస్
ఎయిరిండియాకు మరో 1.5 బిలియన్ డాలర్లు కావాలి
న్యూఢిల్లీ: నష్టాల్లో కొనసాగుతున్న ఎయిరిండియా అదనపు మూలధనం కోసం సహ యజమానుల నుంచి టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ (ఎస్ఐఏ) నుంచి 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14,000 కోట్లకుపైగా) నిధులను కోరాలని యోచిస్తోంది. ఈ వార్తలపై స్పందించిన సింగపూర్ ఎయిర్లైన్స్... ఎయిరిండియా నుంచి వచ్చే అదనపు మూలధన అభ్యర్థనలను తమ బోర్డు జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపింది. అదనపు నిధుల కేటాయింపు నిర్ణయం తీసుకునేటప్పుడు గ్రూప్ ఇతర పెట్టుబడి అవసరాలతో పాటు ఎయిరిండియా వ్యాపార వ్యూహాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఎయిరిండియాలో ప్రస్తుతం సింగపూర్ ఎయిర్లైన్స్కు 25.1 శాతం వాటా ఉంది.సింగపూర్ ఎంపీ అభ్యంతరంఎయిరిండియాకు అదనపు నిధులు సమకూర్చే అంశంపై సింగపూర్ పార్లమెంటు సభ్యుడు కెన్నెత్ టియాంగ్ బూన్ కియాట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఎయిరిండియా నష్టాలను భరించడానికి సింగపూర్ పౌరులు బాధ్యులు కాదు. సింగపూర్ ఎయిర్లైన్స్లో సింగపూర్ ప్రభుత్వ సార్వ¿ౌమ సంపద నిధి (సావరిన్ వెల్త్ ఫండ్) ‘టెమాసెక్’కు ప్రధాన వాటా ఉంది. కావున, టెమాసెక్ నిధులను ఎయిరిండియా కోసం మళ్లించకూడదు.సింగపూర్ ఎయిర్లైన్స్ స్వతంత్రంగానే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’’ అని ఆయన సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఈ అంశంపై సింగపూర్ రవాణా శాఖ మంత్రిని ప్రశ్నిస్తూ పార్లమెంటులో ప్రశ్న కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. ఆ ప్రశ్న సెపె్టంబర్ 8న జరిగే సింగపూర్ పార్లమెంట్ సమావేశంలో చర్చకు రానుంది. అయితే, అదనపు నిధుల అవసరం, సింగపూర్ ఎంపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఎయిరిండియా నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.పునరుద్ధరణకు అయిదు నుంచి పదేళ్లుఎయిరిండియా పునరుద్ధరణ ప్రక్రియకు అయిదు నుంచి పదేళ్లు సమయంపట్టవచ్చని టాటా సన్స్ చైర్మన్, ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఇటీవల పేర్కొన్నారు. పాత వ్యవస్థలు, సంస్థాగత సంస్కృతి, విమానాల సముదాయాన్ని ఆధునికీకరించడంతో పాటు భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన విమానయాన నిపుణులను తీర్చిదిద్దాల్సి ఉందని చెప్పారు. ఎయిర్స్పేస్ ఆంక్షలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన ఇంధన ధరలు, విదేశీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు వంటి అంశాలు ఎయిరిండియా పునరుద్ధరణ ప్రయాణానికి సవాళ్లుగా మారాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా నష్టాలు 3.56 బిలియన్ సింగపూర్ డాలర్లకు చేరాయి. ఇది మే 14 నాటి మారకం విలువ ప్రకారం రూ.26,700 కోట్లకుపైగా ఉంది. ఎయిరిండియా నష్టాలు సింగపూర్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపాయి. అలాగే, విస్తారా విలీనంతో గత ఏడాది ఒకసారి నమోదైన అకౌంటింగ్ లాభం ఈసారి లేకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. దీంతో గ్రూప్ నికర లాభం 57 శాతం తగ్గి 1.184 బిలియన్ సింగపూర్ డాలర్లకు చేరింది.
బంగారం ధరలు.. మూడు రోజుల్లో రూ.4,700 డౌన్!
న్యూఢిల్లీ: డాలర్ పుంజుకోవడం, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ డీలా పడ్డాయి. శుక్రవారం ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర 10 గ్రా. ఏకంగా రూ. 3,300 తగ్గి రూ. 1,62,400 స్థాయికి చేరింది. గడిచిన మూడు రోజుల్లోనే బంగారం ధర దాదాపు 3% (రూ. 4,700) మేర దిగొచ్చింది.మరోవైపు వెండి కిలో ధర రూ. 5,000 తగ్గి రూ. 2,45,500 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 99.15 స్థాయిని దాటి బలపడటం పసిడి క్షీణతకు కారణమైంది. దేశంలో స్మగ్లింగ్ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ (దిగుమతి సుంకం) తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు దేశీయంగా ధరలను మరింత ఒత్తిడికి గురిచేశాయి.ఫెడ్ కఠిన సంకేతాలతో పసిడికి షాక్: ‘జాక్సన్ హోల్’ సదస్సులో ఫెడరల్ చైర్మన్ కెవిన్ వార్‡్ష మాట్లాడుతూ అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా ఫెడరల్ రిజర్వ్ నిర్దేశించుకున్న 2% లక్ష్యానికి చేరలేదన్నారు. ధరలు అదుపులోకి తీసుకురావడానికే అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. వడ్డీ రేట్లు మరింత కాలం అధిక స్థాయిలో కొనసాగవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో గోల్డ్ ధర ఔన్సుకు 3% తగ్గి 4,520 డాలర్లను, వెండి 4% క్షీణించి 66.6 డాలర్లను తాకాయి.
జియో.. మెగా ఐపీవోకు సై
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన టెలికం, డిజిటల్ సర్వీసుల విభాగం జియో ప్లాట్ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ. 37,700 కోట్లు (3.8 బిలియన్ డాలర్లు) సమీకరించనుంది. జియో ప్లాట్ఫామ్స్ సెబీకి ఈ ఏడాది జూన్లో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో 27 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇది ఐపీవో తదుపరి ఈక్విటీ మూలధనంలో 2.9%కి సమానంకాగా.. కంపెనీ విలువ 137 బిలియన్ డాలర్లకు చేరవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.వెరసి దేశీ మార్కెట్లో అతిపెద్ద ఇష్యూగా నిలిచే అవకాశముంది. తద్వారా 2024లో రికార్డ్ నెలకొల్పుతూ 3.3 బిలియన్ డాలర్ల ఐపీవో చేపట్టిన హ్యుందాయ్ మోటార్ను అధిగమించనుంది. అంతేకాకుండా దేశీ స్టాక్ ఎక్స్చెంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ సైతం భారీ ఐపీవో ద్వారా దాదాపు రూ. 30,000 కోట్లు సమీకరించనుంది. ఇష్యూతో జియో, హ్యుందాయ్ తర్వాత ఎన్ఎస్ఈ నిలవవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా.రుణ చెల్లింపులకు జియో ప్లాట్ఫామ్స్ ఐపీవో నిధులలో రూ. 27,500 కోట్లు కీలక అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. జియో ప్లాట్ఫామ్స్ గతంలో ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ, పీఈ దిగ్గజాల నుంచి పెట్టుబడులు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. 2020లో మెటాకు 9.99% వాటా కేటాయించడం ద్వారా రూ. 43,574 కోట్లు అందుకోగా.. గూగుల్ 7.73 శాతం వాటాకు రూ. 33,737 కోట్లు వెచి్చంచింది.ఈ బాటలో మరో 15.2 శాతం వాటాను సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, టీపీజీ, క్వాల్కామ్ వెంచర్స్, ఇంటెల్ క్యాపిటల్ తదితర ఫైనాన్షియల్, వ్యూహాత్మక ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాల నుంచి రూ. 74,745 కోట్లు సమకూర్చుకుంది. ప్రస్తుతం కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 66.43% కాగా.. మెటా, గూగుల్ సంయుక్తంగా 17.71% వాటాను కలిగి ఉన్నాయి. మిగిలిన వాటా ఇతర ఇన్వెస్ట్మెంట్ కంపెనీల చేతిలో ఉంది. 2008 తదుపరి రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీవోగా జియో ప్లాట్ఫామ్స్ నిలవనుంది.
లిస్టింగ్కు 4 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా దుమ్ము రేపుతున్న ప్రైమరీ మార్కెట్లకు జోష్నిస్తూ తాజాగా నాలుగు కంపెనీల లిస్టింగ్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో పారస్ హెల్త్కేర్, భారత్ పెట్ లిమిటెడ్, ఎంకే సన్స్ ఫైన్ జ్యువెల్స్, సద్భావ్ ఫ్యూచర్టెక్ చేరాయి. ఈ ఏడాది మార్చి-జూన్ మధ్య కాలంలో ఈ కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. కాగా.. ఇప్పటికే ప్యాకేజ్డ్ మసాలా దినుసుల కంపెనీ పుష్ప్ బ్రాండ్(ఇండియా)సహా.. ఫిన్టెక్ సంస్థ పారామోటార్ డిజిటల్ టెక్నాలజీ ఐపీవోలకు సైతం సెబీ అనుమతి ఇచ్చిన విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం..రూ. 1,800 కోట్లకు రెడీపారస్ హెల్త్కేర్ జూన్ 16న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి అదనంగా రూ. 1,300 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులకు, సొంత అనుబంధ సంస్థ పీఎంహెచ్పీఎల్ రుణాల చెల్లింపులకు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. పారస్ హెల్త్ బ్రాండుతో 8 ఆసుపత్రులను నిర్వహిస్తున కంపెనీ 2026 మార్చి31కల్లా 2,211 పడకల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ప్రమోటర్లు, ఇన్వెస్టర్ల వాటా..సద్భావ్ ఫ్యూచర్టెక్ ఏప్రిల్ 7న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా 2.55 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 235 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్తోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రూ. 760 కోట్లపై దృష్టిభారత్ పెట్ మార్చి 25న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 120 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 640 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 760 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 36 కోట్లు మెషీనరీ, పరికరాల కొనుగోలు(పెట్టుబడి వ్యయాలు)కు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది.ఈక్విటీ షేర్ల జారీతో..ఎంకే సన్స్ ఫైన్ జ్యువెల్స్ మే 14న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా 1.36 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 34 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్ రామ్చంద్ మురళీధర్ ఆర్. విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మహారాష్ట్రలో కొత్త షోరూముల ఏర్పాటుతోపాటు.. గుజరాత్లోని ప్రస్తుత స్టోర్ల విస్తరణకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఫ్యామిలీ
ఆమె ‘టైమ్’ మొదలైంది!
ఒక జవాబు ఏం చేస్తుందో తెలియదుకానీ...ఒక ప్రశ్న మాత్రం చాలా చేస్తుంది! ఆ ప్రశ్న ఆమెను కొత్తగా ఆలోచించేలా, కొత్త ఆవిష్కరణకు స్ఫూర్తినిచ్చేలా చేసింది. ఆ ఆవిష్కరణే అనీమా ఆనంద్కుమార్ను టైమ్స్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్స్డ్ పీపుల్ ఇన్ ఏఐ’ జాబితాలో చోటు సాధించేలా చేసింది...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యాసాలు రాయగలదు. ప్రశ్నలకు జవాబులు చెప్పగలదు. ఇన్ని చేసే కృత్రిమ మేధస్సు... భౌతిక ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోగలదా? సెమీకండక్టర్ తయారీని మెరుగుపరచగలదా? ఇప్పుడున్న సాంకేతిక పద్ధతుల కంటే అసాధారణ వాతావరణాన్ని మెరుపు వేగంతో పసిగట్టగలదా?... ఈ ప్రశ్నలు అనీమా ఆనంద్ కుమార్ను లోతుగా ఆలోచించేలా చేశాయి. ప్రమాద నష్టాలను తగ్గించే సాంకేతికతపై కాకుండా ప్రమాదాలను ముందుగా పసిగట్టే సాంకేతికతపై దృష్టి పెట్టారు అనీమ. దాని ఫలితమే... యాక్సిలరేటెడ్ అండర్స్టాండింగ్ అనే సంస్థ.మరో ముందడుగుఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్ అయిన అనిమా ఆనంద్ కుమార్, బెనెడిక్ట్ జెనిక్తో కలిసి ‘యాక్సిలరేటెడ్ అండర్స్టాండింగ్ ఇంక్’ అనే స్టార్టప్ ప్రారంభించారు. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి ఏఐ దిగ్గజాలను ఎదుర్కోవడానికి, వాటికి దీటుగా ఏఐ చాట్బాట్లు, మోడల్స్ని నిర్మించడానికి ఎన్నో టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆ టెక్ కంపెనీల జాబితాలో తాజాగా ‘యాక్సిలరేటెడ్ అండర్స్టాండింగ్’ సంస్థ చేరింది.‘ఇది ఏఐ ప్రపంచంలో మరో ముందడుగు’ అని అంటున్నారు విశ్లేషకులు. అనిమ రూ΄÷ందించిన అల్గారిథమ్, వాతావరణ సూచన, వైద్యపరికరాల డిజైనింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ కాంపోనెంట్స్ తయారీ, న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్కు ఉపయోగపడుతుంది.పిన్న వయసులోనే ప్రొఫెసర్కర్నాటకలోని మైసూర్లో జన్మించిన అనీమ ఐఐటీ, మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ, కార్నెల్ యూనివర్శిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఎంఐటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. టెక్నాలజీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందు యూసీ ఇర్వీన్లో ప్రొఫెసర్గా పనిచేశారు. కాల్టెక్ యూనివర్శిటీలో అత్యంత పిన్నవయస్కురాలైన ప్రొఫెసర్గా గుర్తింపు ΄÷ందారు. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా, ‘ఎన్విడియ’లో ఏఐ రిసెర్చ్కు సంబంధించి సీనియర్ డైరెక్టర్గా పనిచేశారు.ప్రత్యేకత ఇది...‘యాక్సిలరేటెడ్ అండర్ స్టాండింగ్ ఇంక్’ అనేది న్యూరల్ ఆపరేటర్స్ అనే సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఫిజికల్ సిస్టమ్స్ నుండి నేర్చుకున్నదాన్ని వివిధ సమస్యల పరిష్కారానికి ఏఐ సిస్టమ్స్ను ఉపయోగించుకుంటుంది. తమ సిస్టమ్ సింగిల్ ప్రాంప్ట్లో 5 ట్రిలియన్ల డేటా పాయింట్స్ను ప్రాసెస్ చేయగలదని కంపెనీ తెలియజేసింది.టైమ్ ప్రశంస‘వాతావరణాన్ని ఏఐ నియంత్రించలేకపోవచ్చు. కానీ దానిని అంచనా వేయగలదు. ఈ కాలెక్ట్ ప్రొఫెసర్ (అనీమ) అత్యంత వేగంగా వాతావరణాన్ని అంచనా వేసే పద్ధతులకు మార్గదర్శకత్వం వహించారు. సంప్రదాయ విధానాల కంటే వేల రేట్లు వేగంగా వాతావరణాన్ని అంచనా వేయడానికి అల్గారిథమ్లను రూ΄÷ందించారు. క్వాంటం కంప్యూటర్లు, నూతన వైద్యపరికరాలు రూ΄÷ందించడానికి, కంప్యూటర్ చిప్ తయారీలో కీలక దశను ఆప్టిమైజ్ చేయడానికి...ఇంకా మరెన్నో పనులకు అల్గారిథమ్లను ఉపయోగించారు’ అని అనీమా ఆనంద్కుమార్ను పరిచయం చేసి, ప్రశంసించింది టైమ్ మ్యాగజైన్. ఐక్యరాజ్య సమితిలో అనీమఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి శాస్త్రీయ సలహా మండలిలో సభ్యురాలిగా అనీమా ఆనంద్ కుమార్ నియామకం అయ్యారు. తద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన ప్రపంచస్థాయి నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం ఆమెకు వచ్చింది. ఐక్యరాజ్య సమితి శాస్త్రీయ ఎజెండాను రూ΄÷ందించడంలో సహాయం అందించారు అనీమ. ఏఐ సాంకేతికత గురించి తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏఐ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే విషయంపై ప్రచారం చేశారు.
ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ..
రాఖీ పూర్ణిమ సందర్భంగా కొన్ని బంధాలు నిజంగా ఆశ్చర్యం కలిగించేలా ఎలా స్ఫూర్తిగా ఉంటాయో తెలుసా..!. అందుకు ఈ ఇద్దరు తోబుట్టువులే ఉదాహరణ. ఔను మీరు వింటుంది నిజమే. ఒకే ఇంట్లోని ఏ తోబుట్టువులు కూడా ఒకే రంగంలో కొనసాగడం అనేది అత్యంత అరుదు. ఒకవేళ కొనసాగినా..సహోద్యోగులగా ఉండటం అనేది..చాలా వృత్తిల్లో సాధ్యం కాదు. కానీ ఈ అక్కా తమ్ముళ్లు ఒకే వృత్తిని ఎంచుకోవడమే కాదు..ఒకో చోట కొలిగ్స్గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలా అని ఇద్దరికీ పెద్ద ఏజ్ గ్యాప్ ఉండదనుకుంటే పొరపాటే.ఆ తోబుట్టువులే మణిపూర్కి చెందిన వాహెంగ్బామ్ సురేయా, రోహిత్ సింగ్లు. వారిద్దరికి విమానయానం ఉద్యోగానికి మించి అని చెప్పొచ్చు. ఇంఫాల్లో ఎనిమిదేళ్ల వయసు తేడాతో పెరిగిన ఇద్దరూ..ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ సభ్యులు. ఇద్దరికి ఒకే రకమైన కఠినమైన షెడ్యూళ్లు, ఒకే చోట వేచి ఉండటం తదితరాలన్ని ఎదుర్కొంటుంటారు. అయితే వారి కుటుంబంలో విమానయాన రంగంలోకి ప్రవేశించిన తొలి వ్యక్తి సురేయా కాగా, ఆమె తమ్ముడు కూడా ఆమె బాటలో పయనించి ఈ వృత్తిని ఎంచుకోవడం విశేషం. అక్క సురేయా 2014లో విమానయాన జర్నీని ప్రారంభించింది. అయితే అక్క డ్యూటీ నుంచి తిరిగి వచ్చాక రోహిత్కి వివిధ ప్రాంతాలు, ఆ వృత్తి విధివిధానాల గురించి ఆమె కథలు కథలుగా చెప్పేది. ఆమె అనుభవాలు వింటూ పెరిగిన రోహిత్కి తెలియకుండానే ఆ వృత్తిపై అమితంగా ఆసక్తి పెరిగిపోయింది. అలా చివరికి కొన్నేళ్ల తర్వాత అక్క మాదిరిగానే ఎయిర్ ఇండియాలో చేరి తన చిన్న నాటి కలను వృత్తిగా మార్చుకుఉన్నాడు. అన్నింట్లకంటే విశేషం ఏంటంటే ఒకే ఎయిర్లైన్ పనిచేయడంతో వారి బంధం మరింత స్ట్రాంగ్గా మారింది. ఎంత బిజీ షెడ్యూళ్లు ఉన్నా ఒకరినొకరు సులభంగా అర్థ చేసుకుంటుంటారు. అలాగే ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకుంటుంటామని చెబుతున్నారు. అయితే ఈ వృత్తి కారణంగా తోబుట్టువుల నుంచి సహోద్యోగులుగా కూడా మారామని నవ్వుతూ చెబుతుంటారు ఇద్దరూ. అలా తామిద్దరి లైఫ్స్టైల్ ఒకటే కాబట్టి ప్రతీది పూర్తిగా వివరించకుండానే..అవతల వాళ్ల బిజీని అర్థం చేసుకుంటామని అంటున్నారు. అలాగే తాము విరామ సమయాల్లో కలిసి గడుపుతామని, అది మాకు ఇంట్లో ఉన్న అనుభూతిని ఇస్తుందంటున్నారు. అంతేగాదు మాకు ఎయిర్ ఇండియా క్యాబ్ కేటాయించినప్పుడూ మా ఇద్దరి అడ్రస్ ఒకటే కావడంతో క్యాబ్ డ్రైవర్ ఎయిర్ ఇండియా ఫ్యామిలీ ప్యాకేజీలను ఎప్పుడు అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది అని జోక్ చేస్తుంటాడని చెబుతున్నారు. ఒక్కోసారి తన తమ్ముడు రోహిత్కి డ్యూటీ లేకపోతే తనకోసం వేడివేడిగా భోజనం తీసుకొస్తాడని, అది నాకు ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తుందని చెబుతోంది సురేయా. ఇక తమ్ముడు రోహిత్ తన అక్క శ్రద్ధ , దయను ప్రశంసిస్తూ..క్యాబిన్ సిబ్బందిగా ఆమె ఆత్మవిశ్వాసం, వృత్తి నైపుణ్యం, ప్రవర్తించే తీరుకి తాను సదా అభిమానిని అంటున్నాడు. నిజంగా ఇలాంటి అదృష్టం ఎందరి సోదర సోదరీమణులకు దక్కుతుంది చెప్పండి. (చదవండి: హమ్మయ్యా ఎట్టకేలకు గంగానదిలో స్నానమాచరించా..! వీడియో వైరల్)
గరగాయతో బోలెడన్నీ ఉపయోగాలు..!
గరగాయను ‘గోలిక’ అని కూడా అంటారు. ఈ చెట్టుకు కొన్ని ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉంది. దీని ఆకులు, వేప చెట్టు ఆకులను పోలి పెద్దగా ఉంటాయి. కాయలు వేపకాయల కంటే పెద్దగా ఉండి గుండ్రంగా (గోళీ కాయల వలె) ఉంటాయి. ఈ చెట్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. కొండ వేప అనడానికి వీటి ఆకులే కారణమనవచ్చు.English Name : Garuga/Grey Downy Balsamశాస్త్రీయ నామం : గరుగ పిన్నెటScientific Name : Garuga pinnata Roxb.Synonym (s) : Kunthia pinnata (Roxb.) Kuntze, Garuga kenghar Buch.-Ham.కుటుంబం : బుర్సెరేసిFamily : Burseraceaeఉనికి: ఈ చెట్లు ఎక్కువగా కొండ ప్రాంతాలలో పెరుగుతుంటాయి. ఇవి దాదాపు 40–50 అడుగుల ఎత్తువరకు పెరుగ గలవు. గరగాయ చెట్టుకు ఆకులు రాల్చే స్వభావం ఉంది. ఈ చెట్లకు ఇండియా, బంగ్లాదేశ్, మలేసియా, పాకిస్తాన్, చైనా, ఫిలిప్పైన్స్ తదితర దేశాల్లో పెట్టింది పేరు. గరగాయ చెట్టు అన్ని నేలల్లో పెరుగుతుంది. కానీ చౌడు భూములు అనుకూలం కావు. కొన్ని ప్రాంతాలలో ఈ చెట్లను పొలంగట్టు, పెరటి స్థలంలో పెంచుకుంటారు. సముద్రమట్టానికి 400–1200 అడుగుల ఎత్తున్న ప్రాంతాల్లో వీటి ఉనికి ఉంటుంది. గరగాయ చెట్ల ప్రవర్ధనం విత్తనాలు, వేర్ల ద్వారా చేస్తుంటారు.కొండ వేప ఉపయోగాలు:చెట్టు పెద్దగా ఎదిగినా, కలప మాత్రం అంత గట్టిగా ఉండదు. గరగాయ చెట్ల అన్ని భాగాలు మాత్రం ఔషధ గుణాలు కూడినవని గుర్తింపు ఉంది. కలపను వంట చెరుకుగా, చిరు ఫర్నీచర్, చెక్కపెట్టెలు మొదలగు వాటికి ఉపయోగపడతాయి. తీగ తోటల్లో ఆధారం కోసం నాటుతారు (ఉదా: మిరియాల తీగ). చెట్ల మాను నుంచి జిగురును తీయవచ్చు (జిగురు తీస్తే చెట్లు త్వరగా అంతరిస్తాయి). బెరుడు నుంచి ‘ట్యానిన్స్’ లభిస్తాయి. దీన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తారు (ఉదా: తోళ్ళ పరిశ్రమ). వీటి కాయలు ఆకుపచ్చ రంగులో గుండ్రంగా ఉంటాయి. పండ్లుగా మారినప్పుడు నలుపురంగుకు మారతాయి. వీటిని తింటారు. కాయలను మాత్రం ఊరగాయ తొక్కుగా ఉపయోగిస్తారు. కాయలు చేదుగా ఉన్నప్పటికి ఊరగాయలో రుచిగా ఉంటాయి. ఆయుర్వేదంలో, నాటు వైద్యంలో ఈ చెట్లను విరివిగా వాడతారు. ఆకుల రసాన్ని బ్యాక్టీరియా, ఫంగస్ జబ్బులను తగ్గించడానికి వాడతారు. క్యాన్సర్, కడుపు నొప్పి, చక్కెర రోగం, ఆస్త్మా (ఉబ్బసం), ఊబకాయం తదితర రోగాలను తగ్గించే ఔషధాల్లో వాడతారు.గరగాయ చెట్లను పెరటిలోను, పొలంగట్లపైన, రోడ్డుకు ఇరువైపుల నాటుకోవచ్చు. ఈ చెట్లు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. దీని కాయలు పక్షులకు, కోతులకూ ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ పండ్లల్లో సీ, ఈ విటమిన్లు, ఫోలిక్ ఆసిడ్, మినరల్స్ (కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పోటాషియం, భాస్వరం, సోడియం..) ఉంటాయని నిర్ధారణైంది. ఈ చెట్లు నల్లమల ప్రాంతంలో అధికంగా లేకున్నా, రాష్ట్రంలోని ఇతర అడవుల్లో వీటి ఉనికి ఉంది. వీటిపైన పరిశోధనలు ముఖ్యంగా ఆయుర్వేదంలో జరిగినప్పటికీ.. వ్యవసాయ, అటవీ రంగాల్లో అనుకున్నంతగా పరిశోధనలు జరగలేదు. కాబట్టి వ్యవసాయ పరంగా (ఆగ్రోఫారెస్ట్రీ) పరిశోధనలు చేపట్టినట్లయితే, ఫలితాలు రైతులకే కాకుండా ఇతరులకు ఉపయోగపడతాయి. వివిధ భాషల్లో గరగాయ చెట్టు పేర్లు: అస్సామీ: పమా, రహిమోల, తూట్ మల ఇంగ్లీష్: గరుగ, గ్రేడౌని బల్సం ఒరియా: కేకడొగట్చో కన్నడ: ఆరనెల్లి, బిలిగడ్డె, కాశతనెల్లి గుజరాతీ: కాకెడ్, కుసుంబితమిళం: ఆరునెత్ల, కరువెంపు తెలుగు: గరగ, కొండ వేప బెంగాలీ: జుం, కపిల మరాఠీ: కకడ్మలయాళం: కెరయా, అన్నక్కార, కాట్టు కాట్టు నెత్త కోస్ రంబ, కారె యాం, కరువెంపు హిందీ: ఖర్పత్సంస్కృతం: కర్లీకార్, కిని కిరత్, నేపాలీ: డబోదబె, రంసిన్పూత: జనవరి – ఫిబ్రవరిపండ్లు: జూన్ – ఆగస్టు
హమ్మయ్యా ఎట్టకేలకు గంగానదిలో స్నానమాచరించా..! వీడియో వైరల్
భారతీయ సంస్కృతి, ఇక్కడ ఆచార వ్యవహారాలు ఎందరో విదేశీయులను ఆకర్షించాయి. దాంతో ఈ గడ్డపైనే ఉండిపోవాలని నిర్ణయించుకుని మరి స్థిరపడినవారు కూడా ఉన్నారు. కానీ ఈ జపాన్ అమ్మాయి ఆధ్యాత్మిక అనుభూతి కోసం ఏం చేసిందో తెలిస్తే విస్తుపోతారు. జపాన్ కంటెంట్ క్రియేటర్ మాయో జపాన్ ఇటీవల భారతదేశ పర్యటనలో భాగంగా హరిద్వార్లోని గంగా ఘాట్ వద్ద ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వీడియోలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి కెమెరా వైపు చూస్తూ..జీవితంలో మొదటిసారి గంగాస్నానం చేస్తున్నాని చెప్పింది. ఆ తర్వాత నదిలో ఏర్పాటు చేసిన భద్రతా గొలుసులు పట్టుకుని నీటిలో మునిగి స్నానం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. నదీప్రవాహానికి కొట్టుకుపోకుండా గట్టిగా గొలుసులు పట్టుకుని కనిపిస్తుంది వీడియోలో. ఆ తర్వాత ఆమె స్నానం సరిపోతుందా అని అక్కడే ఉన్న స్థానికుడిని అడుగుతుంది కూడా. మొత్తం మూడుసార్లు హిందూ భక్తుల మునిగినట్లుగానే మునిగి స్నానం చేస్తుందామె. ఒక అపరిచితుడి సాయంతో ఈ వీడియోని తీయగలిగానని, ఆయన చాలా అద్భుతంగా తీశారని ప్రశంసించిందామె. చివరగా ఆమె బాగా స్నానం చేశాను, చాలా సంతోషంగా ఉంది. అని అన్నారామె. అయితే ఆమెకు హిందీ ఎలా వచ్చు అని సందేహించకండి. ఎందుకంటే..ఆమె హిందీ, భారతీయ సంస్కృతులపై 13 ఏళ్లకు పైగా అధ్యయనం చేసి, ఎట్టకేలకు గంగా నదిలో పవిత్ర స్నానం చేసి, చాలా మంచి అనుభూతి పొందింది. అంతేగాదు చివర్లో ఈ ఊహించని జీవిత ప్రయాణం అందించినందుకు భారత్కి సదా ధన్యావాదాలు అని పోస్ట్లో పేర్కొంది కూడా. నెటిజన్లు ఈ పుణ్యస్నానం తర్వాత నిజంగానే మీలో మంచి మార్పు వచ్చింది. ఇది గంగా నది అనుగ్రహం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Mayo Japan (@mayojapan) (చదవండి: గూగుల్లో రూ. 83 లక్షల వేతనం వదులుకుని..సేంద్రీయ వ్యవసాయం!)
అంతర్జాతీయం
జన్మహక్కు పౌరసత్వం.. ట్రంప్కు మరో షాక్?
అమెరికాలో జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ అధ్యక్షుడు తీసుకొచ్చిన కొత్త ఆదేశానికి వెంటనే అడ్డుకట్ట వేయడానికి ఫెడరల్ జడ్జి డెబోరా బోర్డ్మన్ నిరాకరించారు. అయితే.. డొనాల్డ్ ట్రంప్ ఆదేశం చెల్లుబాటు అవుతుందని చెప్పలేదు. కొత్త ఆదేశాన్ని ప్రస్తుత పిటిషన్లో ప్రస్తావించకపోవడం వల్ల, దానిపై తక్షణమే స్టే ఇవ్వలేనని స్పష్టం చేశారు. అదే సమయంలో.. పిటిషనర్లు తమ కేసులో కొత్త ఆదేశాన్ని చేర్చుకునేందుకు అనుమతించారు. దీంతో ఈ వ్యవహారంపై త్వరగా విచారణ జరిగే అవకాశం ఉంది.ట్రంప్ తొలిసారి 2025లో జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లల తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, చట్టబద్ధ శాశ్వత నివాసితులు కాకపోయినా వారికి ఆటోమేటిక్గా పౌరసత్వం రాకుండా చేయడం ఈ ఆదేశం ఉద్దేశం.దీనిపై కోర్టుల్లో సవాళ్లు ఎదురయ్యాయి. చివరకు జూన్ 30న అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ తొలి ప్రయత్నాన్ని తిరస్కరించింది. 14వ రాజ్యాంగ సవరణలోని పౌరసత్వ నిబంధనలకు ఈ ఆదేశం విరుద్ధంగా ఉందని కోర్టు పేర్కొంది. దీంతో.. ట్రంప్ ఆగస్టు 6న మరో కొత్త ఆదేశాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా అమెరికాకు ప్రసవం కోసం వచ్చే 'బర్త్ టూరిజం'ను లక్ష్యంగా చేసుకుని, కొన్ని సందర్భాల్లో పిల్లలకు పౌరసత్వం నిరాకరించేలా ఈ ఆదేశంలో నిబంధనలు పెట్టారు.ఈ కొత్త ఆదేశంపైనే ఇప్పుడు మరోసారి న్యాయపోరు మొదలైంది. ప్రభుత్వ న్యాయవాదులు సెప్టెంబర్ 5లోగా దీనిని ఎలా అమలు చేయాలనే దానిపై ఫెడరల్ ఏజెన్సీలు మార్గదర్శకాలు జారీ చేస్తాయని కోర్టుకు తెలిపారు. కానీ.. జడ్జి బోర్డ్మన్ ఈ విషయంలో వేచి చూడాల్సిన అవసరం ఉందా?, అన్న దానిపై సందేహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో 'బర్త్ టూరిజం'కు జన్మహక్కు పౌరసత్వం నుంచి మినహాయింపు ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. దీంతో ట్రంప్ కొత్త ఆదేశం కూడా కోర్టులో నిలబడుతుందా?.. లేదా?, అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నదిలో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని లాగి.. చెవిదుద్దులు చోరీ
కాఠ్మాండు: చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల వేళ బాధితులకు సాయం చేయాల్సిందిపోయి చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. నారాయణి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిదుద్దులు చోరీ చేశారు. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.వరదలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకునిలాగిన ఇద్దరు వ్యక్తులు బంగారు చెవిదుద్దులను తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అరెస్టులు జరిగాయి. నేపాల్ పోలీసులు ఆ 41 సెకన్ల వీడియోను తమ ఖాతాలోనూ పోస్ట్ చేశారు.వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు చెక్క పలకలు, మహిళ జుట్టు ఉపయోగించి నీటిలో నుంచి ఆమె మృతదేహాన్ని బయటకు లాగడం కనిపించింది. తర్వాత ఆమె రెండు చెవుల నుంచి చెవిదుద్దులను తీసి పక్కన పెట్టారు. ఈ ఘటన జరుగుతుండగా పలువురు చుట్టూ నిలబడి వీడియోలు చిత్రీకరించారు.తర్వాత చిత్వన్ పోలీసులు దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించిన మృతదేహం భారీ వరద కారణంగా నారాయణి నదిలోకి కొట్టుకుపోయినట్లు గుర్తించారు. వీడియో ఆధారంగా పోలీసులు 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరీని గుర్తించారు. నేపాల్ మీడియా సంస్థ ఖబర్హబ్ పోలీసులను ఉటంకిస్తూ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం భరత్పూర్ మహానగరపాలక సంస్థ-1లోని పోఖరా బస్ పార్క్ సమీపంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడటం లేదా ఎలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటాన్ని సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నార్వే రాజు హరాల్డ్-5 ఇకలేరుకాగా, నేపాల్లో గత కొన్నేళ్లలో సంభవించిన అత్యంత ప్రాణాంతక వరద విపత్తుల్లో ఈ ఘటన ఒకటి. నేపాల్-టిబెట్ సరిహద్దును ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కొన్ని వందల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. సరిహద్దు మార్గానికి వెళ్లే రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ప్రాంతంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి భూకంపనలు లేదా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండవచ్చని కూడా అది తెలిపింది.मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026
నేపాల్ జల ప్రళయం.. గల్లంతైనవారి జాబితా విడుదల
నేపాల్ వరదల్లో గల్లంతైనవారి జాబితా విడుదలైంది. 33 దేశాల పర్యాటకులు గల్లంతయ్యారు. విదేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. అత్యధికంగా 290 మంది భారతీయులు గల్లంతయినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా-65, ఉక్రెయిన్-53, మలేషియా-51, ఆస్ట్రేలియా-35, బ్రిటన్-33, కెనడా-25, సింగపూర్కు చెందిన 9 మంది గల్లంతయ్యారు.నేపాల్ జల విలయంలో మృతుల సంఖ్య 550 దాటింది. 1000 మందికిపైగా గల్లంతవ్వగా.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 85 మంది భారతీయులు సహా 117 మంది పర్యాటకులను నేపాల్ ఆర్మీ రక్షించింది.ఉత్తరప్రదేశ్లోని గండక్ నదీప్రవాహంలో మూడు మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు. నేపాల్ను దాటాక వరద ప్రవాహం భారత్లోకే వస్తుంది. దీంతో అక్కడి నుంచే ఈ మృతదేహాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు.రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలోని నారాయణి నదిలోనూ వరద ఉధృతి పెరిగే ఆస్కారముందని అధికారులు తెలిపారు. మరోవైపు బిహార్లో ఆరు జిల్లాల్లోని నదీ పరీవాహక దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మ రోవైపు ఈశా ఫౌండేషన్కు చెందిన డజన్ల మంది సభ్యుల జాడ గల్లంతైందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తంచేశారుఇదీ చదవండి: నేపాల్లో రెడ్ అలర్ట్.. మరో భారీ జల ప్రళయం ముప్పుకాగా, మానస సరోవరం యాత్ర నుంచి విశాఖ వాసులు క్షేమంగా తిరిగొచ్చారు. విశాఖపట్నం నుంచి మానస సరోవరం యాత్రకు 10 మంది పర్యాటకులు వెళ్లారు. ఆగస్టు 11వ తేదీన విశాఖపట్నం నుంచి మానస సరోవరం యాత్రకు వెళ్లారు. 23వ తేదీన తిమోర్ చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్కు యాత్రికులు వెళ్లగా.. 26న వరద బీభత్సంలో చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్ కొట్టుకుపోయింది. వరద ప్రమాదానికి ఒకరోజు ముందే ఖాట్మండు ఎయిర్పోర్టు నుంచి విశాఖపట్నం పర్యాటకులు ఢిల్లీ చేరుకున్నారు. ఇతర బృందాల్లో పలువురు వరదల్లో గల్లంతయ్యారు. ఇషా ఫౌండేషన్కు చెందిన కొందరు బృందం సైతం గల్లంతయ్యారు.
నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన 7 మృతదేహాలు భారత్లో గుర్తింపు
లక్నో: నేపాల్ నుంచి ప్రవహించే నదుల్లో ఏడు మృతదేహాలను భారత అధికారులు వెలికితీశారు. ఇవి మెరుపు వరదల్లో మృతి చెందినవారి మృతదేహాలు అయి ఉండొచ్చని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటన ఘోర వరద విపత్తు తీవ్రతను తెలియజేస్తోంది.నేపాల్ దక్షిణ ప్రాంతంలోని వరద ప్రభావిత చిత్వన్ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాల్లో నదుల్లో ఈ మృతదేహాలు కొట్టుకొస్తూ కనిపించాయి.“గుర్తుతెలియని నాలుగు మృతదేహాలను గురువారం జిల్లాలో వెలికితీశాం. అక్కడ సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత అవి నేపాల్ నుంచి కొట్టుకొచ్చి భారత్లోకి ప్రవేశించి ఉంటాయని భావిస్తున్నాం” అని ” అని మహారాజ్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ సింగ్ సోగర్వాల్ ఏఎఫ్పీకి తెలిపారు. సరిహద్దు నుంచి నదీ ప్రవాహ దిశలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుషీనగర్ జిల్లాలో మరో మూడు మృతదేహాలను వెలికితీశామని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.కాగా, నేపాల్ వరదల్లో 538 మంది మృతి చెందారు. ఇందులో నేపాల్లో వెలికితీసిన 469, చైనాలో 3 మృతదేహాలు ఉన్నాయి. దాదాపు 1,400 మంది ఆచూకీ తెలియడం లేదు. భారత్లో వెలికితీసిన ఏడు మృతదేహాలను ఈ మృతుల సంఖ్యలో చేర్చలేదు.ఇదీ చదవండి: నార్వే రాజు హరాల్డ్-5 ఇకలేరు
జాతీయం
జిమ్లో వ్యాయామం చేస్తూ కుప్పకూలి డాక్టర్ మృతి
అసోంలోని నగావ్లో జిమ్లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలడంతో 47 ఏళ్ల వైద్య కళాశాల ప్రొఫెసర్ మృతి చెందారు. నగావ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ షాహిన్ రెహ్మాన్ ఆగస్టు 27న రాత్రి 7.36 గంటల సమయంలో జిమ్లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది.రెహ్మాన్ను వెంటనే వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అనంతరం ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతికి కచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఇటీవలి సంవత్సరాల్లో జిమ్లలో వ్యాయామం చేస్తూ పలువురు అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.జిమ్లో కుప్పకూలిన ఉత్తరాఖండ్ పోలీసు అధికారిఈ ఏడాది జూన్లో ఉత్తరాఖండ్లోని చంపావత్ జిల్లాలో 38 ఏళ్ల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారి వ్యాయామం చేస్తూ కుప్పకూలి మృతి చెందారు. గిరీష్ భట్గా గుర్తించిన ఆ అధికారి శుక్రవారం స్థానిక జిమ్లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. జిమ్లో ఉన్నవారు ఆయనను సమీపంలోని ఖతిమాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.పుణెలో వ్యాయామం చేస్తూ వ్యక్తి మృతిగత ఏడాది ఆగస్టు 2న పుణెలోని చించ్వాడ్ ప్రాంతంలో 37 ఏళ్ల వ్యాపారవేత్త మిలింద్ కులకర్ణి జిమ్లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు. కులకర్ణి 6 నెలలుగా క్రమం తప్పకుండా జిమ్కు వెళ్తున్నట్లు సమాచారం. వ్యాయామం చేస్తున్న సమయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని నీళ్లు తాగారు. ఆ తర్వాత ఆయనకు కళ్లు తిరిగి కుప్పకూలారు. జిమ్ సిబ్బంది, అక్కడ ఉన్న ఇతరులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.వ్యాయామం సమయంలో ఆకస్మిక మరణాలుఈ ఘటనలు వ్యాయామం చేస్తున్న సమయంలో లేదా వ్యాయామం చేసిన వెంటనే సంభవించే ఆకస్మిక మరణాలు. ముఖ్యంగా తక్కువ వయసున్నవారిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీర్ఘకాలంలో గుండె జబ్బుల ముప్పును ఇది తగ్గిస్తుంది.అయితే, తీవ్రమైన వ్యాయామం అరుదైన సందర్భాల్లో తీవ్రమైన గుండె సంబంధిత సమస్యను ప్రేరేపించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిలో లేదా తమకు అలాంటి సమస్య ఉందని తెలియని వారిలో ఈ ముప్పు ఉండవచ్చు.
ల్యాండింగ్ సమయంలో పేలిన విమాన టైర్
ఢిల్లీ నుంచి బిలాస్పూర్కు వెళ్తున్న అలయన్స్ ఎయిర్ విమానం టైరు ల్యాండింగ్ సమయంలో పంక్చర్ అయింది. శుక్రవారం ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న 41 మందినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విమానయాన సంస్థకు చెందిన అధికారి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.అలయన్స్ ఎయిర్కు చెందిన 9I613 విమానంలో 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ల్యాండింగ్ సమయంలో విమానం ఎడమవైపు ఉన్న టైర్ పంక్చర్ అయినట్లు అధికారి చెప్పారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.ఘటన తర్వాత ప్రయాణికులు, సిబ్బంది అందరినీ రన్వే నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చి టెర్మినల్ భవనానికి తరలించినట్లు అధికారి తెలిపారు. ఆ తర్వాత బిలాస్పూర్ నుంచి వెళ్లాల్సిన విమానం తదుపరి సర్వీసును రద్దు చేసినట్లు విమానయాన సంస్థ అధికారి చెప్పారు.
“వాళ్లను కొడతాం.. దెబ్బలు తింటారు”
ముంబై: మరాఠీ భాషా నిబంధనపై ఒత్తిడి పెంచుతూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నేత అమిత్ ఠాక్రే హెచ్చరికలు జారీ చేశారు. హిందీలో మాత్రమే మాట్లాడాలని పట్టుబట్టే ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లను కొడతామని ఆయన అన్నారు. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే కుమారుడే అమిత్ ఠాక్రే అన్న విషయం తెలిసిందే.మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆటోరిక్షా, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు పని నిర్వహణకు అవసరమైన మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది సమయం ఇచ్చింది. ఈ నిర్ణయం తర్వాత అమిత్ ఠాక్రే స్పందించారు. డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు మరింత సమయం కావాలని కోరారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ రంగంలో వివిధ వయసులు, విద్యా నేపథ్యాలకు చెందిన వారు పనిచేస్తున్నారని వారు చెప్పినట్లు ఆయన వివరించారు.దీంతో అమిత్ ఠాక్రే మాట్లాడుతూ.. ఆటోరిక్షా డ్రైవర్లు హిందీలో మాట్లాడుతున్నారని లేదా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు వస్తే తమ పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. “ఆటోరిక్షా డ్రైవర్ హిందీలో మాట్లాడుతున్నట్లు లేదా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు మా దృష్టికి వస్తే వాళ్లను కొడతాం. మీరు ప్రజలను ఇబ్బంది పెడితే దెబ్బలు తింటారు. ప్రజలు ఉత్తరప్రదేశ్ భాషలోనే మాట్లాడాలని లేదా హిందీలోనే మాట్లాడాలని వారికి చెప్పకండి. మేం మరాఠీలో మాట్లాడతాం. అంతమాత్రం మీరు అర్థం చేసుకోండి” అని ఆయన అన్నారు.పని నిర్వహణకు అవసరమైన మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది అదనపు సమయం ఇచ్చిన నిర్ణయంపై ఫడ్నవీస్ను ఠాక్రే కూడా లక్ష్యంగా చేసుకున్నారు. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ప్రయోజనాలకు మరాఠీ భాష కంటే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. “వారికి 10 సంవత్సరాల గడువు ఇవ్వండి. 15 సంవత్సరాల గడువు ఇవ్వండి. మరాఠీ భాషపై, మా రాష్ట్రంపై మీకు ఎంత ప్రేమ ఉందో మేం అర్థం చేసుకున్నాం” అని ఆయన అన్నారు.వేరే రాష్ట్రాల్లో చూడండి.. “మీరు గుజరాత్కు వెళ్లండి, పంజాబ్కు వెళ్లండి లేదా దక్షిణాదికి వెళ్లండి.. ప్రతిచోటా ప్రజలకు తమ సొంత భాషపై అనుబంధం ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నందున ఏడాది అదనపు గడువు ఇస్తున్నారు” అని ఠాక్రే అన్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయపరమైన సవాలు కొనసాగుతున్న సమయంలో ఈ ఏడాది అదనపు గడువు ఇచ్చారు. నలుగురు క్యాబ్ డ్రైవర్లు ఈ ఆదేశాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేశారు.ఆటోరిక్షా, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లతో సహా వాణిజ్య ప్రయాణికుల వాహనాల డ్రైవర్లకు ఆగస్టు 12 నుంచి మరాఠీపై పరిజ్ఞానం తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. సవరించిన నిబంధనల ప్రకారం, మరాఠీని పని నిర్వహణ స్థాయిలో ఉపయోగించగలమని నిరూపించలేని డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ అనుమతిని 3 నెలల పాటు నిలిపివేయవచ్చు. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే వారి అనుమతులను శాశ్వతంగా రద్దు చేయవచ్చు.ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని హైకోర్టులో దాఖలైన పిటిషన్లో పేర్కొన్నారు. 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్సులకు ఎలాంటి భాషా నిబంధనను విధించలేదని, అందువల్ల ఈ నిబంధన ఆ చట్టం పరిధిని మించిపోయిందని పిటిషన్లో వాదించారు.
కన్నీళ్లతో మంత్రి రాజీనామా.. ఇది తొలిసారి కాదు
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ నుంచి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ నేత బి.నాగేంద్ర ప్రకటించారు. ఆ సమయంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అవినీతి ఆరోపణలపై బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన డీకే శివకుమార్ నేతృత్వంలోని కర్ణాటక మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఇదే వివాదం కారణంగా రెండేళ్ల క్రితం కూడా ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆగస్టు మొదటి వారంలో నాగేంద్ర తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు.కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.89 కోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ లేవనెత్తుతోంది. 2024 మేలో ఆ సంస్థ ఖాతాల అధికారి చంద్రశేఖరన్ పి.ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనధికారికంగా నిధులు బదిలీ చేశారని ఆరోపిస్తూ ఆయన ఒక లేఖను వదిలి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో సంస్థ బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో డబ్బు వివిధ ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు తేలింది.సిద్ధరామయ్య మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన నాగేంద్ర ప్రముఖ ఎస్టీ నేత. కాంగ్రెస్ పార్టీ శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించిన తర్వాత, ఈ వివాదం నేపథ్యంలో 2024 జూన్లో నాగేంద్ర రాజీనామా చేశారు. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆగస్టు 3న ఆయనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు.శుక్రవారం నాగేంద్ర మాట్లాడుతూ, “నాకు రాజ్యాంగంపై నమ్మకం ఉంది... నాపై వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని బీజేపీని ఎన్నోసార్లు కోరాం. కానీ వారు రాలేదు” అని అన్నారు. బీజేపీ మనుస్మృతిని అమలు చేయాలని కోరుకుంటోందని, ఆ పార్టీకి గిరిజన వ్యతిరేక ఆలోచనా విధానం ఉందని ఆయన ఆరోపించారు.ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రాయచూర్ నుంచి బళ్లారి వరకు 10 రోజుల పాదయాత్ర నిర్వహించనున్నట్లు కర్ణాటక బీజేపీ ప్రకటించింది. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడం ఈ 200 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రధాన అంశంగా మారుతుందని భావిస్తున్నారు. రైతుల ఇబ్బందులు, నిరుద్యోగం, నియామకాల్లో అవినీతి ఆరోపణలు కూడా ఇందులో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. VIDEO | Bengaluru: "I am submitting my resignation to CM today to ensure party does not face any embarrassment", says Karnataka Minister Nagendra. pic.twitter.com/3ysOZovm5v— Press Trust of India (@PTI_News) August 28, 2026
ఎన్ఆర్ఐ
వైభవంగా సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట అంతర్జాతీయ పోటీలు
అమెరికాలోని చార్లెట్ నగరంలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు మాట్లాట 2026 అంతర్జాతీయ పోటీలు హిల్టన్ చార్లెట్ ఎయిర్పోర్ట్ రిసార్ట్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. పారుపూడి కిరణ్, తాళ్లూరి ప్రత్యూష, గొల్లపూడి సీతారామ్ నాయకత్వంలో జరిగిన ఈ పోటీల్లో అమెరికా, కెనడాలోని పలు ప్రాంతాల నుంచి 200 మందికి పైగా తెలుగు పిల్లలు పాల్గొన్నారు. దాదాపు 1000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సంగీత విద్వాంసుడు శ్రీ ప్రభల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తెలుగు భాషా నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో పదరంగం (తెలుగు పదాలు వ్రాసే ఆట), తిరకాటం (తెలుగు ప్రశ్నోత్తరాల ఆట), ఒనిమా – ఒక్క నిమిషం మాత్రమే (తెలుగులో మాట్లాడే ఆట) అనే మూడు విభాగాల్లో బుడతలు (5–7), సిసింద్రీలు (8–11), చిరుతలు (12–16) వయోవర్గాల్లో పోటీలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికా, కెనడాలోని పలు కేంద్రాల్లో జరిగిన ప్రాథమిక పోటీల్లో విజేతలైన పిల్లలు తమ కుటుంబాలతో కలిసి చార్లెట్కు చేరుకుని మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో వేడుకల్లో పాల్గొన్నారు.ముఖ్య అతిథి శ్రీ ప్రభల శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేస్తూ.. సిలికానాంధ్ర నాకు అత్యంత అభిమాన సంస్థ. మనబడి నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట పోటీల స్థాయి, ఏర్పాట్లు, పిల్లల భాషా పటిమ నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. తెలుగు తెలిసిన యువతకు ఉద్యోగం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ప్రయోజనాలు ఉన్నాయి. తెలుగు తెలిసిన వారు సంగీతం, నాట్యం, నటన వంటి కళల్లో కూడా సులభంగా రాణించడాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. తెలుగు మాట్లాట బృందం నిబద్ధత, సమర్థత అభినందనీయం అని అన్నారు.
సోషల్ మీడియాలో సంచలనంగా కన్సల్టెంట్ కథ!
ఇండియాకు చెందిన ఓ మేనేజ్మెంట్ కన్సల్టెంట్.. త రెండున్నర ఏళ్లలో రూ.6.5 కోట్లు ఆదా చేసినట్టు, తన మొత్తం నెట్ వర్త్ను రూ.1 కోటి నుంచి రూ.7.5 కోట్లకు పెంచుకున్నట్టు రెడ్డిట్లో పంచుకున్న పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.'From Rs 1 Cr at 34 to Rs 7.5 Cr at 37: My Middle East Consulting Journey' పేరుతో పెట్టిన ఈ పోస్టులో, 37 ఏళ్ల ఈ వ్యక్తి తన కెరీర్, ఆదాయం, పొదుపు, పెట్టుబడుల వివరాలను వివరంగా పంచుకున్నాడు. ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఈయన, ప్రస్తుతం ఒక ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు.కెరీర్, జీతం ఎలా పెరిగాయంటే...22 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేట్ ట్రైనీగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన, అప్పుడు ఏడాదికి రూ.10 లక్షలు సంపాదించేవాడు. ఎంబీఏ పూర్తయ్యాక 26 ఏళ్లకు మేనేజ్మెంట్ కన్సల్టింగ్లోకి అడుగుపెట్టాడు, అప్పటి వార్షిక ఆదాయం రూ.25 లక్షలు. 29 ఏళ్లకు మరో కెరీర్ మార్పుతో ఇండస్ట్రీ రోల్లోకి మారి, రూ.40 లక్షల ప్యాకేజీ అందుకున్నాడు. తర్వాతి ఐదేళ్లలో జీతం క్రమంగా పెరుగుతూ రూ.65 లక్షలకు చేరింది. ఈ కాలంలోనే పీఎఫ్, బంగారం, స్టాక్స్, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులతో దాదాపు రూ.1 కోటి నెట్ వర్త్ సాధించాడు.పశ్చిమాసియా మలుపు తిప్పిన సంపద34 ఏళ్ల వయసులో మళ్లీ కన్సల్టింగ్ రంగంలోకి వెళ్లి, పశ్చిమాసియాకు మారిన ఈయన జీతం ఒక్కసారిగా రూ.3.5 కోట్లకు (సుమారు 4 లక్షల డాలర్లు) పెరిగింది. అదీ పన్ను లేకుండా. ఈ భారీ జీత పెరుగుదలే ఆదా వేగాన్ని పెంచింది. "ఇప్పుడు 37 ఏళ్ల వయసులో, గత రెండున్నర ఏళ్లలో దాదాపు రూ.6.5 కోట్లు ఆదా చేశాను, నా నెట్ వర్త్ రూ.7.5 కోట్లకు చేరింది" అని ఆయన పోస్టులో పేర్కొన్నాడు.తన ప్రస్తుత ఆస్తుల గురించి కూడా వివరించాడు. ముంబైలో పూర్తిగా చెల్లించిన మూడు ప్రాపర్టీలు, భౌతిక బంగారం, సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో సుమారు 700 గ్రాముల బంగారం, ఈక్విటీల్లో దాదాపు రూ.30 లక్షల పెట్టుబడి ఉన్నట్టు తెలిపాడు. రాబోయే కాలంలో ఈక్విటీ పోర్ట్ఫోలియోను మరింత పెంచుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ రెడ్డిట్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. కొందరు తమ కెరీర్, ఫైనాన్స్ గురించి సీరియస్గా ఆలోచించేలా ప్రేరణ ఇచ్చిందని చెప్పగా, మరికొందరు ఇంత సంపద సాధించడం వెనుక ఏళ్ల కృషి, కష్టమైన నిర్ణయాలు ఉంటాయని కొనియాడారు. అధిక జీతాలు, పన్ను మినహాయింపులతో మిడిల్ ఈస్ట్ సంపద నిర్మాణానికి 'చీట్ కోడ్' లాంటిదని కొందరు వ్యాఖ్యానించారు. విదేశాలకు మారడం ఎలా సాధ్యమైందో, కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోవాలని కొందరు ఆసక్తి చూపారు.
27 ఏళ్లుగా అమెరికాలోనే.. ICE అదుపులో ఎన్నారై మహిళ!
అమెరికాలో 27 ఏళ్లుగా నివసిస్తున్న ఓ భారత సంతతి మహిళకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా (గ్రీన్కార్డ్) ఉన్నప్పటికీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆమెను అదుపులోకి తీసుకుంది. అంతేకాదు.. ఆమెపై గతంలో కొనసాగిన డిపోర్టేషన్ కేసును ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఇప్పటికే కొట్టివేసినప్పటికీ ఈ అరెస్టు జరగడం చర్చనీయాంశంగా మారింది.వెంకట నరసమాంబ వాసంశెట్టి అనే మహిళను ఆగస్టు 11న సాధారణ చెక్-ఇన్కు హాజరైన సమయంలో ICE అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను జార్జియాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచినట్లు సమాచారం. 2013 నుంచి ఆమెకు అమెరికాలో లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ (LPR) హోదా ఉంది.క్రిమినల్ రికార్డ్ లేదు..వాసంశెట్టి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడింది. నార్త్ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా ఆమె పనిచేసినట్లు ఆమె కుటుంబ న్యాయవాది వెల్లడించారు. ఆమెకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, ఇద్దరు అమెరికా పౌరులైన పిల్లలు, ఇద్దరు అమెరికా పౌరులైన మనవళ్లు ఉన్నారని తెలిపారు.ఆమె ఇల్లు, ఉద్యోగం, కుటుంబం మొత్తం అమెరికాలోనే ఉన్నాయని.. గ్రీన్కార్డ్ను వదులుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతున్నారు.ఏడు నెలలు భారత్లో ఉన్నందుకేనా?వాసంశెట్టి 2022 జూలైలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆమెకు కోవిడ్ సోకడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని న్యాయవాదులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో దాదాపు రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. దీంతో ఆమె అమెరికాకు తిరిగి రావడం ఆలస్యమైంది. చివరకు 2023 ఫిబ్రవరిలో రాలీ-డర్హామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అమెరికాకు చేరుకున్నారు. మొత్తం మీద ఆమె సుమారు ఏడు నెలలు భారత్లో ఉన్నారు. అయితే.. ఈ వ్యవధినే అమెరికా ప్రభుత్వం ఆమె గ్రీన్కార్డ్ హోదాను ప్రశ్నించడానికి ప్రధాన కారణంగా చూపినట్లు సమాచారం. అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం వల్ల శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే ఉద్దేశం ఉందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలించవచ్చు.‘అమెరికాను వదిలే ఉద్దేశమే లేదు’అయితే వాసంశెట్టి మాత్రం అమెరికాలో తన జీవితాన్ని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు సమర్పించారు. భారత్కు వెళ్లిన సమయంలోనూ అమెరికాలో తన ఉద్యోగం, కుటుంబం, ఇల్లు వంటి సంబంధాలను కొనసాగించారని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాదు.. భారత్లో ఉన్న సమయంలోనే నార్త్ కరోలినాలో తన ప్రధాన నివాసంగా ఉపయోగించుకునే ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. తల్లిదండ్రుల అనారోగ్యం, తన ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన తాత్కాలిక ప్రయాణాన్ని అమెరికా శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే నిర్ణయంగా చూడలేమని వాదించారు.కోర్టు కేసు కొట్టేసినా.. మళ్లీ అరెస్టువాసంశెట్టిపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) డిపోర్టేషన్ చర్యలు ప్రారంభించింది. అయితే కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించేందుకు కోర్టు విధించిన గడువులో DHS విఫలమైందని ఆమె న్యాయవాది తెలిపారు. దీంతో 2026 మే 19న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఆమెపై కొనసాగుతున్న డిపోర్టేషన్ ప్రక్రియను ముగించారు. ఆ తర్వాత కూడా ఆమెకు విధించిన ICE చెక్-ఇన్లకు క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చారు. అలా ఆగస్టు 11న చెక్-ఇన్కు వెళ్లిన సమయంలోనే ICE అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.‘ఆమె గ్రీన్కార్డ్ హోల్డర్ కాదు’వాసంశెట్టిని అదుపులోకి తీసుకున్న తర్వాత ICE మాత్రం ఆమె గ్రీన్కార్డ్ హోల్డర్ కాదని వాదిస్తున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆగస్టు 13న ఆమె తరఫు న్యాయ బృందం అత్యవసర హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఫెడరల్ న్యాయమూర్తి.. ఆమెను నిర్బంధించడానికి ఉన్న చట్టపరమైన ఆధారాలను మూడు రోజుల్లో వివరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించారు.తర్వాత ఏం జరగొచ్చు?తాజా కోర్టు పరిణామాల ప్రకారం.. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశం వెలువడలేదు. అయితే కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, వాసంశెట్టికి బెయిల్పై విడుదల కావచ్చా? అనే అంశాన్ని పరిశీలించేందుకు ఇమ్మిగ్రేషన్ జడ్జి ఎదుట బాండ్ హియరింగ్ జరిగే అవకాశం ఉంది.27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ.. గ్రీన్కార్డ్ ఆధారంగా జీవనం సాగిస్తున్న ఓ భారత సంతతి మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు అమెరికాలోనే కాకుండా భారతీయ సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తాత్కాలికంగా విదేశాల్లో ఎక్కువకాలం ఉండటం వల్ల గ్రీన్కార్డ్ హోదాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది.
నాట్స్ వినూత్న సేవ కార్యక్రమం
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ చాప్టర్ సభ్యులు వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సెయింట్ లూయిస్ ప్రాంతీయ ఫుడ్ బ్యాంకాక్లో జరిగిన ప్రత్యేక ఆహార సేకరణ, ప్యాకేజింగ్ కార్యక్రమంలో నాట్స్ టీమ్ చురుగ్గా పాల్గొని సేవలు అందించింది. పేదలు, నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ వాలంటీర్లు, తెలుగు కుటుంబాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ నార్త్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాలలతో పాటు చాప్టర్ ప్రతినిధులు మధుసూధన్ దడ్డాల, నరేష్ రాయంకుల తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు. తెలుగు సమాజానికి, అలాగే స్థానిక అమెరికన్ సమాజానికి సహాయం చేయడంలో నాట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాట్స్ నాయకులులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆకలితో ఉన్నవారికి బాసటగా నిలవడం ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాట్స్ వాలంటీర్లకు, నాట్స్ సభ్యులకు నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం)
క్రైమ్
సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్ను ఈడ్చుకెళ్లిన లారీ
కాకినాడ: ఆ కుటుంబ సభ్యులు అప్పటి వరకూ సినిమా చూసి, ఆనందంగా గడిపారు. అతడు భార్యాపిల్లలను ఇంటి దగ్గర దింపి, పలావ్ కొనుక్కుని వచ్చేందుకు బయల్దేరాడు. తిరిగి వెళ్తూండగా మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. అతడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘోర సంఘటన జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నీలాపు సంతోష్ కుమార్ రెడ్డి (34) ప్రతిపాడులోని సీఎఫ్సీ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పని చేస్తూ, 11 సంవత్సరాలుగా జగ్గంపేట బాలాజీ నగర్లో నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి భార్య శ్రీలిఖిత, కుమార్తెలు శాన్వి, లాస్య(చిన్న పిల్లలు)తో కలసి సినిమాకు వెళ్లారు. అనంతరం, భార్యాపిల్లలను సంతోష్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద దించి, పలావు కోసం గోకవరం రోడ్డులోని బిర్యానీ సెంటర్కు మోటార్ సైకిల్పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొంది. దీంతో, సంతోష్ కుమార్ రెడ్డి బైక్ అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ను ఢీకొంది. అందరూ కింద పడిపోగా ఆ లారీ సంతోష్ కుమార్ రెడ్డి బైక్ను కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అతడి చెయ్యి నుజ్జునుజ్జయి ఊడిపోయింది. తీవ్ర గాయంతో రక్తస్రావం అవుతూండగానే సంతోష్ కుమార్ రెడ్డి మరో చేత్తో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి మొబైల్ ఫోన్లో సమాచారం అందించడం స్థానికులను కలచివేసింది. అతడిని స్థానికులు, పోలీసులు, బంధువులు తొలుత స్థానిక సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తూండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్ సైకిల్పై వెళ్తున్న వారు కూడా గాయపడ్డారు. సంతోష్ కుమార్ రెడ్డి భార్య శ్రీలిఖిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.చదవండి: ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం?
ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం?
కాకినాడ క్రైం: ఓ ద్విచక్ర వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనంపై వచ్చిన వ్యక్తితో నలుగురు చుట్టుముట్టారు. వారిలో ఇద్దరిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. వారు ప్రతిదాడి చేశారు. వీరికి మిగిలిన ఇద్దరూ తోడయ్యారు. మొత్తం నలుగురూ కలసి మూకదాడికి దిగారు. అక్కడే ఉన్న చెక్కతో ఆ వ్యక్తిపై విచక్షణారహితంగా చావబాదారు. విరిగిన చెక్కలో పదునైన భాగాన్ని.. అపస్మారక స్థితికి చేరుకున్న ఆ వ్యక్తి గొంతులో పరమ కిరాతకంగా దించేశారు. అయినా బతికేస్తాడేమోననే అనుమానంతో ఆ కర్రను బయటకు తీసి మరింత లోతుగా దించారు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో మూడుసార్లు తీసి గుచ్చి, చివరిగా ఆ కర్రను బలంగా గొంతులోకి దిగ్గొట్టి క్రూరాతిక్రూరంగా హతమార్చారు. ఇదంతా మూడంటే మూడు నిమిషాల్లోనే జరిగిపోయింది. ఏదో క్రైం థ్రిల్లర్ కథలా.. సినిమాలోని క్రూర సన్నివేశంలా జరిగిన ఈ దారుణం.. ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకొనే కాకినాడ నగరం నడిబొడ్డున.. భానుగుడి సెంటర్లో.. జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరాన.. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిమ్ ట్రైనర్ కొడమాటి సతీష్రెడ్డి (30) క్రూరహత్యోదంతం జిల్లాను కుదిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో పోలీసు భద్రతను ప్రశ్నార్థకం చేసింది. హతమార్చింది అందుకేనా? ఈ హత్య చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్న వ్యక్తికి రాజకీయ అండదండలున్నాయని చెబుతున్నారు. అతడి భార్య బ్యూటీషియన్గా పని చేస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని సమాచారం. ఆమెతో హతుడు సతీష్ చనువుగా ఉండేవాడని తెలుస్తోంది. అతడి స్నేహితుడు సాయికిరణ్ కూడా ఆమెపై కన్ను వేశాడని, ఆమెకు ఇష్టం లేకపోయినా దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళ సతీష్కు చెప్పడంతో అతడికి, సాయికిరణ్కు మధ్య తరచుగా గొడవలు జరుగుతూండేవి. ఈ నేపథ్యంలో సాయికిరణ్ ఆ మహిళ భర్తకు సతీష్ పై లేనిపోని చాడీలు చెప్పి, ఇద్దరి మధ్య కక్షలు పెంచాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ భర్త ఆదేశాలు, అండదండలతో సాయికిరణ్, మరో ముగ్గురు కలసి సతీష్ను ప్రణాళిక ప్రకారం అర్థరాత్రి భానుగుడి సెంటర్కు రప్పించి హతమార్చినట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన కర్రను సాయికిరణ్ అప్పటికే సమకూర్చుకున్నాడని తెలుస్తోంది. ఆ నాలుగు రోజుల్లో ఏం జరిగింది! గత నెల 8 నుంచి 12వ తేదీ మధ్య జరిగిన సంఘటనలే ఈ హత్యకు దారి తీశాయని తెలియవచ్చింది. ఆ మహిళ విషయంలో సతీష్ భార్య జయశ్రీని సాయికిరణ్ కలిశాడు. ఆ మహిళతో సతీష్ సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమె ఫలానా వ్యక్తి భార్య అని వెల్లడించాడు. టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడిగా చెబుతున్న ఆ వ్యక్తి అప్పటికే తన భర్త సతీష్ ద్వారా జయశ్రీకి తెలుసు. గర్భిణిగా ఉన్న ఆమె పుట్టింట్లో ఉండగా సాయికిరణ్, ఆ వ్యక్తితో జయశ్రీని కలిశాడు. ఆమె భర్తను చంపేస్తానని చెప్పాడు. తనను, కడుపులో ఉన్న బిడ్డను చూసి తన భర్తను విడిచిపెట్టాలని, సతీష్ ఆ మహిళ జోలికి వెళ్లకుండా చూసుకుంటానని ఆమె చెప్పింది. వారు వెళ్లిన తర్వాత రోజు ఆ మహిళ విషయమై సతీష్ను జయశ్రీ నిలదీసింది. ఆమెతో మాట్లాడుతున్నానని ఒప్పుకున్న అతడు.. నిండుగర్భిణిగా ఉన్న తన భార్యకు ఈ విషయం చెప్పిన సాయికిరణ్పై ఆగ్రహంతో రగిలిపోయాడు. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండగా, మంగళవారం అర్ధరాత్రి సాయికిరణ్, సతీష్లు ఫోనులో గొడవ పడ్డారు. దమ్ముంటే రా అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన సతీష్ తన ద్విచక్ర వాహనంపై కిరణ్ ఉన్న భానుగుడి జంక్షన్కు రాత్రి 1.45 సమయంలో వెళ్లాడు. ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం అతడిని సాయికిరణ్, అనుచరుల హతమార్చారు. సతీష్కు జయశ్రీతో ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరో నెల గర్భిణి. పొంతన లేకుండా.. ఈ హత్యకు సంబంధించి పోలీసులు చెబుతున్న కారణాలకు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తునికి చెందిన ఓ యువతిని ఇద్దరూ ప్రేమించి గొడవ పడగా అది హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, అది పోలీసుల కల్పిస్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిద్రలో నైట్ డ్యూటీ కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఈ హత్య నేపథ్యంలో పోలీసుల రాత్రి నిఘా పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. హత్య జరిగిన భానుగుడి సెంటర్ జిల్లా పోలీసు కార్యాలయానికి 200 మీటర్ల లోపే ఉంది. హత్య సమయంలో అరగంట పైగా అక్కడ అలజడి చోటు చేసుకుంది. అయినప్పటికీ నైట్ బీట్లు అటువైపు కనీసం దృష్టి పెట్టలేకపోయాయి. పోనీ కూతవేటు దూరంలోనే ఉన్న కమాండ్ కంట్రోల్ సిబ్బంది కూడా సీసీ కెమెరాల ద్వారా ఏమీ గమనించలేదు. రాత్రి వేళ డ్యూటీల్లో ఉన్న వారు గుర్రు పెట్టి నిద్రపోవడం వల్లనే దీనిని గమనించలేదనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారే కనుక మేల్కొని ఉండి, ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గమనించి ఉంటే కనీసం సైరన్ మోగించే అవకాశం ఉండేది. అప్పుడైనా ఈ నేరం ఆగి ఉండేదని పలువురు అంటున్నారు. పోలీసులపై టీడీపీ నేత ఒత్తిళ్లు! రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం రేపిన ఈ హత్యపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. సతష్ హత్యను నగరంలోని ఓ ముఖ్య టీడీపీ నేత అనుచరుడే చేయించాడని ప్రచారం జరుగుతోంది. అతడు సెటిల్మెంట్లు, దందాలతో పేట్రేగిపోతూ నగరంలో గూండాగిరి చేస్తూంటాడని, అతడే ఈ హత్య చేయించాడని సతీష్ కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. అయితే, తమ నోటి వెంట అతడి పేరు రానివ్వకుండా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సతీష్ హత్య రాత్రి 2 గంటల సమయంలో జరిగితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టీడీపీ నాయకుడి అనుచరుడు తనకు ఒంట్లో బాగోలేదంటూ సర్పవరం జంక్షన్ సమీపంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో 3 గంటల ప్రాంతంలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ కేసు నుంచి తన అనుచరుడిని తప్పించాలంటూ ఆ టీడీపీ నేత ఉన్నతాధికారుల ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన నలుగురు దుర్మార్గులూ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు.చదవండి: సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్ను ఈడ్చుకెళ్లిన లారీ
సాధిక్, సౌజన్య ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టారు?
కాకినాడ క్రైం: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వర్రెడ్డి హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జగదీశ్వర్రెడ్డికి అందించిన చికిత్స వివరాలు ఇవ్వాలంటూ ఆయన చికిత్స పొందిన ఆస్పత్రులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కాకినాడలోని జన్మభూమి పార్కు సమీపంలో ఉన్న అహోబిల ఆసుపత్రికి, సర్పవరం జంక్షన్లో ఎస్కే ఆసుపత్రి, నాగమల్లితోట జంక్షన్లో ఉన్న ఇనోదయ ఆసుపత్రుల్లో జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందగా ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి వివరాలు కోరారు. చికిత్స వేళ ప్రమాదకరమైన పదార్థాలు ఏవైనా శరీరంలో గుర్తించారా, అనుమానాస్పద రీతిలో ఆరోగ్య స్థితి ఉండడాన్ని గమనించారా వంటి ప్రశ్నలకు సమా«ధానంగా వైద్యులు అందించే ఆరోగ్య నివేదికలు దోహదపడనున్నాయి. ఏం ఆర్డర్ పెట్టారు? స్లోపాయిజన్ గుణాలున్న రసాయనంతో సాధిక్ సౌజన్యతో కలిసి జగదీశ్వర్రెడ్డి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎలా తెప్పించాడనే వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంప్రదాయ మార్గాలను ఎంచుకున్నాడా, మరెక్కడి నుంచైనా తెచ్చాడా అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సౌజన్య, సాధిక్లు గడచిన మూడు నెలల్లో పెట్టిన ఆన్లైన్ ఆర్డర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడలో ఇన్స్టా మార్టు, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సహా ఇతర ఆన్లైన్ డెలివరీ కార్యాలయాలకు సాధిక్, సౌజన్యల ఫోన్ నంబర్లతో ఇచ్చిన ఆర్డర్ హిస్టరీలు అడుగుతున్నారు. ఇందుకు అధికారికంగా నోటీసులు జారీ చేస్తున్నారు. లావాదేవీలపై ఆరా... సాధిక్ బ్యాంకు అకౌంట్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మతం మార్చడం, లవ్ జీహాద్, ఉగ్రవాదుల ప్రస్తావనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అక్రమ మార్గాల్లో లేదా మరెవరి నుంచైనా సాధిక్ ఆర్థిక ప్రయోజనాలు పొందాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి బ్యాంకు వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకుగాను, మెయిన్రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు సహా కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు నోటీసులు జారీ చేశారు. రేపు మరికొన్ని బ్యాంకులకు పోలీసుల నోటీసులు అందనున్నాయి. సాధిక్ఖాన్ కస్టడీపై కౌంటర్ దాఖలు కాకినాడ లీగల్: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన షేక్ సాధిక్ఖాన్ను 7రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయవాది జవహర్ అలీ మొబైల్ కోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగనుందిపోలీసులు కనీస మర్యాద ఇవ్వడం లేదు : సాధిక్ఖాన్ సోదరి సాజిదతమని స్టేషన్కి పిలిపిస్తున్న పోలీసులు హీనంగా చూస్తున్నారని, కనీస మర్యాద ఇవ్వడం లేదని సాధిక్ఖాన్ సోదరి సాజిద గురువారం ఆరోపించారు. అవమానకర రీతిలో మాట్లాడుతూ, నిలబెట్టే ప్రశ్నిస్తుండడం ఆవేదన కలిగిస్తోందన్నారు. స్టేషన్కు వెళ్లిన వెంటనే ఫోన్లు స్వాదీనం చేసుకోవడం, వాటిని ఇవ్వమంటే ముప్పుతిప్పలు పెట్టడం మానసిక క్షోభకు గురిచేస్తోందని తెలిపారు. చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు!
అమెరికాలో నగర యువతి హత్య కేసులో పురోగతి
హైదరాబాద్: అమెరికా మేరీల్యాండ్లో గతేడాది దారుణ హత్యకు గురైన తార్నాకకు చెందిన తెలుగు యువతి నిఖిత గొడిశాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ ఘటనకు బాధ్యుడైన నిందితుడు అర్జున్ శర్మను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది నెలల సుదీర్ఘ పోరాట విజయంగా దీన్ని బాధితుల కుటుంబం స్వాగతించింది. అమెరికాలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనీ, మృతికి గల కారణాలను అధికారికంగా చెప్పకుండా దాస్తున్నారనీ నిఖిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూఎస్, భారత్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలనీ కోరుతున్నారు. ఈ హత్య వెనుక ఏమైనా నేరపూరిత చర్యలు ఉన్నాయా అనేది తేల్చాలని కోరారు. చదవండి: వీడియో కాల్ వైద్యానికి గర్భిణి మృతి
వీడియోలు
ఎకరా రూ. 269 కోట్లు
జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్
రేవంతన్నకు బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
మీర్జా రహ్మత్ బేగ్ పై MIM వేటు
అమ్మ ఎక్కడ...! కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం
యువతకు తోడుగా నేనుంటా..! కూటమిపై రాచమల్లు అల్లుడు ఫైర్
గురు శిష్యుల చీకటి ఒప్పందంతో రాయలసీమ తాకట్టు.. శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు
తాగడానికి నీళ్లు లేవు కానీ.. డ్రగ్స్ మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి
చంద్రబాబు పేరు చెప్తుంటే సల సల మండిపోతున్నారు..
మంత్రి నిమ్మలకు చేదు అనుభవం.. చుట్టుముట్టిన మార్కాపురం ప్రజలు

