రేపు వైఎస్ జగన్ కీలక ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సెప్టెంబర్ 10, గురువారం) ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు.కాగా, ఇవాళ(బుధవారం) బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని.. ఇది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా ఒక మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ.. ఏదైనా రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఉందంటే అది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమేనని సగర్వంగా చెప్పగలుగుతామన్నారు.
భారత ఓటర్ల లిస్ట్లోకి అఫ్గాన్లు ?
రాంచీ: స్పెషల్ ఇంటెన్సివ్ (SIR) ప్రక్రియలో దుమారం చెలరేగింది. భారత్ ఓటర్ల జాబితాలో అఫ్ఘనిస్థాన్ దేశస్థుల పేర్లు నమోదవ్వడంపై రాజకీయంగా వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ అంశం జార్ఘండ్లో చర్చాంశనీయంగా మారింది. జార్ఖండ్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ వివాదాలకు దారి తీసింది. జంషెడ్పూర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని 286వ పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితాలో అసిల్ ఖాన్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ ఇబ్రహీం అనే ముగ్గురు అఫ్గానిస్థానీయుల పేర్లు వరుసగా 30, 31, 33 నంబర్లతో ఓటర్ల లిస్టులో కనిపించాయి. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విదేశీయుల పేర్ల ఎస్ఐఆర్ జాబితాలో ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు.ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సందీప్ వర్మ జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విదేశీ చొరబాటుదారుల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమ పార్టీ మొదటి నుంచీ చెబుతూనే ఉందన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి కె. రవికుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ " ఓటర్ల జాబితాలో విదేశీయులను చేర్చడం ఒక తీవ్రమైన విషయం. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాం. ఆ వ్యక్తులకు ఎవరు సహాయం చేశారు, ఏ ప్రక్రియ ద్వారా వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చారు అనే దానిపై దృష్టి సారిస్తాం. ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం," అని ఆయన స్పష్టం చేశారు.అదే విధంగా ఓటర్ల జాబితాలో ఆ మూడు పేర్లు ఎలా చేర్చబడ్డాయి, ఈ ప్రక్రియలో ఏదైనా వ్యక్తి లేదా నెట్వర్క్ పాత్ర ఉందా అనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
1980s ఫొటో ట్రెండ్లో హీరోయిన్లు అందరినీ చూస్తారా? ఇదిగో..
సోషల్ మీడియాను ‘1980 ఫొటో’ ట్రెండ్ ఊపేస్తోంది. యూజర్లు ఏఐ (కృత్రిమ మేధస్సు) సాయంతో తమను తాము గత కాలానికి చెందిన రూపాల్లో మళ్లీ ఊహించుకుంటున్నారు. చాట్జీపీటీని ఉపయోగించి నెటిజన్లు తమ కొత్త సెల్ఫీలను 1980 దశాబ్దం నాటి నిజమైన ఫొటోలలా కనిపించే విధంగా మార్చుకుంటున్నారు. ఈ వైరల్ ట్రెండ్ ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటుల నుంచి సామాన్యుడి వరకు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఈ ట్రెండ్లో.. చాట్జీపీటీలో ఒక ఫొటోను అప్లోడ్ చేసి, అదే చిత్రాన్ని 80ల నాటి నిజమైన శైలిలో రూపొందించాలని కోరుతారు. దుస్తులు, జుట్టు తీరు, వెలుతురు, నేపథ్యం, ఫొటోగ్రఫీ శైలి వంటి అంశాలను యూజర్లు తమకు నచ్చిన విధంగా ఎంచుకోవచ్చు. 1980 దశాబ్దం నాటి ప్రముఖ సినిమాలు, బాలీవుడ్ చిత్రాలు, కుటుంబ ఆల్బమ్ల ఆధారంగా రూపొందించిన చిత్రాలు ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. పూర్తయిన చిత్రాల్లో సాధారణంగా ఒత్తుగా కనిపించే జుట్టు, రంగురంగుల చీరలు, ఆకర్షణీయమైన ఆభరణాలు, పాత తరహా స్టూడియో నేపథ్యాలు, పాత ఫొటోలను గుర్తుచేసే స్వల్ప ఫిల్మ్ గ్రెయిన్ కనిపిస్తాయి. ఫిల్మ్ గ్రెయిన్ అంటే పాత ఫిల్మ్ కెమెరాలతో తీసిన ఫొటోల్లో కనిపించే సూక్ష్మమైన గింజల్లాంటి మసక ఆకృతి.కేంద్ర మంత్రి కూడా ఈ ట్రెండ్లోకి.. View this post on Instagram A post shared by Piyush Goyal (@piyushgoyalofficial)కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇన్స్టాగ్రామ్లో తన 1980ల నాటి శైలిలో రూపొందించిన కృత్రిమ మేధస్సు ఇమేజ్ను షేర్ చేయడంతో ఈ రెట్రో ఏఐ ట్రెండ్కు మరింత ఆదరణ లభించింది. ఆ చిత్రంలో గోయల్ చక్కగా కుట్టించిన సూట్, ఏవియేటర్ సన్గ్లాసెస్ ధరించి కనిపించారు. పాత ఫొటో ఆల్బమ్లను గుర్తుచేసేలా చిత్రానికి సెపియా ఛాయ, మసకబారిన పాత ఫొటో తరహా ఆకృతి ఇచ్చారు. ఈ ఇమేజ్ను షేర్ చేస్తూ “80ల ట్రెండ్ను ఆస్వాదిస్తున్నా” అని రాశారు.సౌతిండియా నటీమణులను ఫ్యాన్స్ ఎలా రూపొందించారంటే?ఈ వైరల్ ఏఐ ట్రెండ్ సినిమా అభిమానులకు పెద్ద పండుగగా మారింది. ‘ప్రాంప్ట్గ్యాలరీ.ఐజీ’ వంటి ప్రముఖ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఈ ట్రెండ్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. నెటిజన్లు వివరమైన చాట్జీపీటీ టెక్స్ట్ ప్రాంప్ట్లను ఉపయోగించి ప్రస్తుత సౌతిండియా గత కాలానికి చెందిన రూపాల్లోకి మార్చుతున్నారు. పాతకాలపు కళాశాల కథాంశాల్లో కనిపించే కల్పిత కథానాయికల శైలిని అందిస్తున్నారు. ఈ కింది ఇన్స్టాపోస్టులో 17 మంది హీరోయిన్ల 80ల ఫొటోలు చూడొచ్చు. View this post on Instagram A post shared by Trending AI Image Prompts (@promptgallery.ig)సమంత రూత్ ప్రభుఏఐతో రూపొందించిన పాతకాలపు రూపంలో హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఆధునిక రెడ్ కార్పెట్ ఫ్యాషన్కు బదులుగా 1980ల నాటి కళాశాల విద్యార్థిని శైలిలో కనిపిస్తున్నారు. ఆమెకు సాధారణంగా కనిపించే చక్కటి రూపానికి బదులుగా ఒత్తుగా కనిపించే జుట్టు, ప్రత్యేకమైన పక్క పాపిడి, కొద్దిగా అస్తవ్యస్తంగా కనిపించే జుట్టు తీరు ఇచ్చారు. దీంతో ఆ చిత్రం నిజమైన పాతకాలపు ఫొటోలా కనిపిస్తోంది. చిన్న బొట్టు, మృదువైన పెదాలు, స్పష్టంగా కనిపించే కళ్లు, సహజంగా కనిపించే చర్మంతో దశాబ్దాల క్రితం వచ్చిన సినిమాలోని యువ కళాశాల విద్యార్థినిని తలపించేలా రూపొందించారు.సాయి పల్లవిసహజమైన తెరపై కనిపించే తీరుకు పేరున్న సాయి పల్లవి 1980ల నాటి అనలాగ్ రూపానికి సరిగ్గా సరిపోయేలా కనిపిస్తున్నారు. ఏఐ ప్రాంప్ట్లలో ఆమెను పాతకాలపు కళాశాల భవనాలు, సూర్యకాంతితో నిండిన వరండాలు, స్థానిక భాషలో సైన్బోర్డులు, సైకిళ్లతో ఉన్న వీధులు వంటి నేపథ్యాల్లో చూపిస్తున్నారు.త్రిష త్రిష కృష్ణన్ ఏఐతో రూపొందించిన పాతకాలపు రూపం ఆ కాలానికి ప్రత్యేకమైన రెట్రో ఫ్యాషన్పై ఎక్కువగా దృష్టి పెడుతోంది. అభిమానులు ఆమెను నడుము పైభాగంలో బిగుతుగా ఉండే యాసిడ్-వాష్ జీన్స్, వెడల్పాటి బెల్టులు, లోపలికి మడిచిన షర్టులతో చూపించేలా ఏఐ చిత్రాలను రూపొందించారు. ఈ తుది రూపం 1980ల నాటి క్లాసిక్ ప్రేమకథా చిత్రంలో త్రిష హీరోయిన్గా ఎలా కనిపించి ఉండేవారో అభిమానులు ఊహించుకునేలా చేస్తోంది. ఈ హీరోయిన్ల ఇమేజ్లు అన్నీ ఫ్యాన్స్ చేసిన ఫొటోలు మాత్రమే.చాట్జీపీటీతో 80ల ఫొటోను ఎలా రూపొందించాలి? చాట్జీపీటీను తెరిచి న్యూ చాట్ ప్రారంభించండి.+ బటన్ను నొక్కి మంచి ఫొటోను అప్లోడ్ చేయండి.మీకు కావాల్సిన 1980ల శైలిని వివరించండి. ఇందులో దుస్తులు, జుట్టు తీరు, నేపథ్యం, వెలుతురు వంటి వివరాలను పేర్కొనండి.వ్యక్తిని గుర్తుపట్టగలిగే ముఖం, సహజమైన చర్మ రంగును అలాగే ఉంచాలని చాట్జీపీటీని కోరండి.మొదటి చిత్రం సరిగ్గా కనిపించకపోతే ప్రాంప్ట్ను మార్చండి.
పూనావాలా ‘అంకుల్’ నా జోలికి రావొద్దు.. రియా కౌంటర్
న్యూఢిల్లీ: నీట్ లీకేజీ ఆందోళనల్లో వర్షంలో పోలీస్ వ్యాన్ను అరచేతితో అడ్డుకుని రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన రియా అహిర్, ఇటీవల ‘బిగ్ బాస్ 20’షోలోకి అడుగుపెట్టలేకపోవడం చర్చాంశనీయంగా మారింది. షో నిర్వాహకులు రియా అహిర్, పంజాబీ నటి లవ్ గిల్ మధ్య నిర్వహించిన ఆడియన్స్ పోలింగ్లో లవ్ గిల్ విజయం సాధించడంతో రియా అవకాశాన్ని కోల్పోయారు.హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్ను చంపేసినట్లు.. ఒకవైపు పూనావాలా, రాహుల్ గాంధీల మధ్య రాజకీయం నడుస్తుంటే, ఈ గొడవలో బిగ్ బాస్ ఛాన్స్ మిస్సయ్యి రియా అహిర్ బలైపోయారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోందిఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆందోళనల ద్వారా రియా వైరల్ కావడం యాదృచ్ఛికం కాదని, దాని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ, రాజ్ థాకరే వంటి నేతల మద్దతుతో మోదీ వ్యతిరేక ఎజెండాను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్లాలని ఆమె ప్లాన్ చేశారు. అయితే, 99 ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్కు విజయం అందించలేని రాహుల్ గాంధీ మీకు ఆన్లైన్ మద్దతు ఎలా ఇవ్వగలరు?’ అని పూనావాలా ఎద్దేవా చేశారు.పూనావాలా విమర్శలపై రియా అహిర్ రెండు వీడియోల ద్వారా ఘాటుగా స్పందించారు. పూనావాలాను ‘అంకుల్’ అని సంబోధిస్తూ, తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. చిన్న వయసున్న అమ్మాయిలను టార్గెట్ చేయడం మాని, తన ఈడువారితో రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు వాడే పాత, డొల్ల స్క్రిప్ట్ లాంటివేనని ఎద్దేవా చేశారు.తాను భారత సైన్యాన్ని కానీ, ఏ ఇతర వ్యవస్థను కానీ ఎప్పుడూ అవమానించలేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ లాంటి ఎంటర్టైన్మెంట్ షోలలోకి రాజకీయాలు, మతాలను లాగడం సరైనది కాదని హితవు పలికారు. ప్రస్తుతం ఈ పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ వార్ నెట్టింట వైరల్ అవుతోంది.👉ఇదీ చదవండి : మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
శీతల్ దేవి సంచలనం.. భారత్కు రెండు స్వర్ణాలు
‘సీక్రెట్ సోల్జర్’ నుంచి సాంగ్ రిలీజ్
9/11 ట్విన్ టవర్స్ అటాక్.. రెండు రోజుల ముందు
నేపాల్కు ఇప్పుడు డబ్బు ఎంత అవసరం? ఎక్కడి నుంచి వస్తుంది?
బిగ్బాస్లో ఛాన్స్మిస్.. రాజకుమారి పరిస్థితి ఇదా..?
రేపు వైఎస్ జగన్ కీలక ప్రెస్మీట్
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ పేసర్లు
మేనల్లుడికి మాయావతి పెట్టిన కండీషన్ ఇదే..
‘‘మీరంతా సల్లబడేటట్టు చేస్తా.. జాగ్రత్త’’
సీఎం విజయ్ నేతృత్వంలోని కూటమి పేరు ఖరారు
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సాక్షి కార్టూన్ 07-09-2026
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
ఆ మాత్రం దానికే కరువు ప్రాంతంగా ప్రకటించ లేను!
ఎంత వెతికినా నీటి జాడ దొరకదు కానీ.. ఇక పైకి రండి
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
యూకే వీసా స్కామ్.. ‘మాస్టర్ మైండ్ అతడే’ : యూట్యూబర్ నందన
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
రూ. 17.40 కోట్ల బంగారం స్వాధీనం
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
ఈ రాశి వారికి పనుల్లో విజయం.. ఆస్తులు కొంటారు
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’
శీతల్ దేవి సంచలనం.. భారత్కు రెండు స్వర్ణాలు
‘సీక్రెట్ సోల్జర్’ నుంచి సాంగ్ రిలీజ్
9/11 ట్విన్ టవర్స్ అటాక్.. రెండు రోజుల ముందు
నేపాల్కు ఇప్పుడు డబ్బు ఎంత అవసరం? ఎక్కడి నుంచి వస్తుంది?
బిగ్బాస్లో ఛాన్స్మిస్.. రాజకుమారి పరిస్థితి ఇదా..?
రేపు వైఎస్ జగన్ కీలక ప్రెస్మీట్
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ పేసర్లు
మేనల్లుడికి మాయావతి పెట్టిన కండీషన్ ఇదే..
‘‘మీరంతా సల్లబడేటట్టు చేస్తా.. జాగ్రత్త’’
సీఎం విజయ్ నేతృత్వంలోని కూటమి పేరు ఖరారు
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సాక్షి కార్టూన్ 07-09-2026
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
ఆ మాత్రం దానికే కరువు ప్రాంతంగా ప్రకటించ లేను!
ఎంత వెతికినా నీటి జాడ దొరకదు కానీ.. ఇక పైకి రండి
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
యూకే వీసా స్కామ్.. ‘మాస్టర్ మైండ్ అతడే’ : యూట్యూబర్ నందన
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
రూ. 17.40 కోట్ల బంగారం స్వాధీనం
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
ఈ రాశి వారికి పనుల్లో విజయం.. ఆస్తులు కొంటారు
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’
ఫొటోలు
స్టార్ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్
ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్సిరీస్ (ఫొటోలు)
‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్ జగన్ (ఫొటోలు)
భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్లో అదిరిపోయే.. (ఫొటోలు)
సింపుల్ లుక్లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
రష్మిక పాత ఫొటోలు.. క్యూట్నెస్కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)
భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)
ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)
‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)
సినిమా
విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈరోజు టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం.కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్ ‘పంచనామా’ సిద్ధమైంది. మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్పై ఆసక్తిని పెంచింది.ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత, నటి ఉదయభాను చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.ఎక్కువ మంది చదివింది: బిగ్బాస్లో రాంప్రసాద్, చరణ్లకు షాక్! ఎలిమినేట్ ?స్వయం కృషితో ఎదిగా..చిన్న వయసు నుంచే మైక్ పట్టుకుని స్వయం కృషితో ఎదిగానని ఆమె తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒంటరిగానే నిలబడ్డానని చెప్పారు. ‘ఎవరికి టాలెంట్ ఉన్నా.. ఏ డోర్ మూసుకుపోయినా.. ఉదయభాను ప్రొడక్షన్స్ ఉందని మర్చిపోవద్దు. ఎవరి దగ్గర సత్తా ఉన్నా.. ఈ ప్రొడక్షన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని ఉదయభాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇదీ చదవండి: ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉంటుందంటే?x.com/FilmyFocus/status/2097604851358457984?s=20
బిగ్బాస్లో రాంప్రసాద్, చరణ్లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?
ఈరోజు బిగ్బాస్10 హౌస్లో హైరిస్క్ జోన్ టాస్క్ ఉత్కంఠ రేపనుంది. రెండు టీమ్ల నుంచి ఒక్కొక్కరిని హైరిస్క్లో పెట్టాలని బిగ్బాస్ ఆదేశించాడు. హైరిస్క్లో ఉన్నవారు ఈ వారంలో ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.ఎలాంటి వాదనలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండానే బ్లూ టీమ్ నుంచి రాంప్రసాద్ హైరిస్క్ జోన్లోకి వెళ్లేందుకు అంగీకరించాడు. అందుకు కారణం ఏంటని అడగగా.. శనివారం చెప్తా అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో తమ టీమ్ తరఫున రాంప్రసాద్ను హైరిస్క్లో పెడుతున్నట్లు నరేశ్ బిగ్బాస్కు తెలిపాడు.ఎమోషనల్ వాతావరణం..ఇక రెడ్ టీమ్ నుంచి చరణ్ను యూనానిమస్గా ఎంపిక చేసినట్లు రోహిత్ ప్రకటించాడు. అయితే అంతకుముందే త్రిగుణ్.. రోహిత్ హైరిస్క్లోకి వెళ్లడని టీమ్ సభ్యులతో చెప్పడం ఆసక్తికరంగా మారింది. చివరకు రోహిత్ కాకుండా చరణ్ హైరిస్క్ జోన్లోకి వెళ్లాడు.ఇదీ చదవండి: సందీప్రెడ్డికి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్మరోవైపు.. ‘హైరిస్క్లో ఉంటాను.. అక్కడి నుంచి ఎలాగైనా బయటికి వస్తా అంటూ రాంప్రసాద్ బిగ్బాస్ ముందు ఎమోషనల్ అయ్యాడు. చరణ్తో రోహిత్ మాట్లాడుతూ.. ‘ఒక్కరు నీకు సపోర్ట్ చేసినా.. నీ కోసం నేను పోరాడేవాడిని’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో హౌస్లో ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణం నెలకొంది. మరి ఈరోజు జరగబోతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కువమంది చదివింది: ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మరీ వెక్కిరించాడు: ఐశ్వర్య లక్ష్మి
సందీప్రెడ్డికి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. ఆ సినిమా తర్వాత ఇటు విజయ్, అటు సందీప్..ఇద్దరు కెరీర్ పరంగా బిజీ అయ్యారు. సందీప్ అయితే యానిమల్ చిత్రం పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అయినా కూడా ఇద్దరి మధ్య స్నేహ బంధం అలానే కొనసాగుతుంది. ఇటీవల సందీప్ నిర్మించిన ‘రోమాంచకం’ చిత్రానికి విజయ్ అండగా నిలిచాడు. మూవీ ప్రమోషన్స్లో పాల్గొని సందీప్పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఇక తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ నటించిన ‘ఎపిక్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో గెస్ట్గా వచ్చాడు సందీప్. ఇదే ఈవెంట్కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. ఇలా విజయ్, సందీప్ మరోసారి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ తన అభిమాన డైరెక్టర్కి ఒక ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఇచ్చిన వాచ్ ని సందీప్ రెడ్డి వంగ వెంటనే పెట్టుకోవడం చూసి వీళ్ళిద్దరికి ఒకరి ఉంటే ఒకరు ఎంత ఇష్టమో అని ఆ వీడియోని చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.#VijayDeverakonda gifted a brand new watch to #SandeepReddyVanga ! their bonding ❤️ https://t.co/56uF21Sgey pic.twitter.com/eFcfW46wGc— Rajesh Manne (@rajeshmanne1) September 8, 2026
క్రీడలు
ఏ బౌలర్ను వదల్లేదు.. భీకర ఫామ్లో ఇషాన్ కిషన్!
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భీకర ఫామ్లో ఉన్నాడు. సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇప్పటికే డబుల్ సెంచరీతో బీభత్సం సృష్టించిన ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్లో వన్డే తరహా బ్యాటింగ్తో అలరించిన ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు శిఖర్ మోహన్ (52) అర్థసెంచరీతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి ఈస్ట్జోన్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈస్ట్జోన్ ఇప్పటికే 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.త్రిపురానాను దంచికొట్టాడు..ఫిఫ్టీ మార్క్ సాధించిన తర్వాత త్రిపురానా వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6, 4 బాదడంతో పాటు సింగిల్ సహా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదే క్రమంలో ఏ బౌలర్ను విడిచిపెట్టని ఇషాన్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరును కనబరుస్తూ ప్రతీ బౌలర్ను చితక్కొడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో 708 పరుగులకు ఆలౌటైన ఈస్ట్జోన్, ఆ తర్వాత సౌత్జోన్ను 336 పరుగులకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోనుంది.4,6,6,4 BY ISHAN KISHAN - He smashing everyone in Duleep Trophy final 🥶 pic.twitter.com/lKPAA2awOY— Johns. (@CricCrazyJohns) September 9, 2026Read: ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్!
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్
సౌతాఫ్రికా యువ ఓపెనర్ జోర్డన్ హెర్మన్ చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు సమం చేశాడు. నమీబియాతో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో 24 ఏళ్ల హెర్మన్ భారీ సెంచరీతో కదంతొక్కాడు. తద్వారా తన దేశానికే చెందిన సహచర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీతో కలిసి వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.ఈ మ్యాచ్లో హెర్మన్ 126 బంతుల్లో 150 పరుగులు (17 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా.. బ్రీట్జ్కీ 2025 ఫిబ్రవరి 10న న్యూజిలాండ్తో లాహోర్లో జరిగిన తన వన్డే అరంగేట్రంలో 148 బంతుల్లో 150 పరుగులు చేశాడు. వన్డే అరంగేట్రంలో బ్రీట్జ్కీ, హెర్మన్ మినహా ఎవరూ 150 పరుగుల మార్కును తాకలేదు. ఈ ఘనత సాధించిన ఇద్దరూ సౌతాఫ్రికన్లే కావడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 27 పరుగులకే ఓపెనర్ కానర్ ఎస్టర్హుయిజన్ (10) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ అయిన హెర్మన్, టోనీ డి జోర్జి (72) కలిసి భారీ స్కోర్కు బలమైన పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 166 బంతుల్లో 190 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత సౌతాఫ్రికా స్కోర్ కాస్త నెమ్మదించింది. స్వల్ప వ్యవధిలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోవడంతో కాస్త తడబాటుకు లోనైంది. అయినా 47వ ఓవర్లో 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. 46.4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 302-5గా ఉంది. జేసన్ స్మిత్ (4), కార్బిన్ బాష్ (7) క్రీజ్లో ఉన్నారు. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపల్మన్ 4 వికెట్లతో సత్తా చాటాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం సౌతాఫ్రికా నమీబియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న తొలి వన్డేనే ఇది. దీనికి ముందు నమీబియాలోనే జరిగిన టీ20 ట్రై సిరీస్లో సౌతాఫ్రికా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: వైభవ్ సూర్యవంశీకి షాక్
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
ఆస్ట్రేలియా-‘ఎ’తో సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. మల్టీ డే మ్యాచ్లకు దేవదత్ పడిక్కల్ను కెప్టెన్గా ఎంపిక చేసిన మెన్స్ సెలక్షన్ కమిటీ.. వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తాడని తెలిపింది.హార్దిక్ పాండ్యాకు చోటుఇక ఆసీస్-‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డేలలో తలపడే భారత-‘ఎ’ జట్టులో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కూడా చోటు దక్కడం విశేషం. అయితే, ఫిట్నెస్ ఆధారంగా అతడు జట్టులోకి వస్తాడని బోర్డు వెల్లడించింది. గాయాల బెడదకాగా హార్దిక్ పాండ్యా వివిధ గాయాల కారణంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కు అతడు దూరమయ్యాడు. అయితే, ఆసీస్-‘ఎ’తో వన్డే సిరీస్ సందర్భంగా అతడు తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది.రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు భారత పర్యటనకు వస్తోంది. సెప్టెంబరు 22- అక్టోబరు 11 వరకు జరిగే ఈ రెండు సిరీస్లకు పుదుచ్చేరి వేదిక. ఆస్ట్రేలియా- ‘ఎ’తో అనధికారిక టెస్టులకు భారత-‘ఎ’ జట్టుఅమన్ మోఖడే, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), షామ్స్ ములాని, తనుష్ కొటియాన్, తుషార్ దేశ్పాండే, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే, నారాయణన్ జగదీశన్ (వికెట్ కీపర్), నచికేత్ భూటే, వి వైశాక్* (ఫిట్నెస్ ఆధారంగా).ఆసీస్-‘ఎ’తో అనధికారిక వన్డేలకు భారత-‘ఎ’ జట్టుప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధిర్, హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా), ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), గుర్జప్రీత్ సింగ్, యశ్ ఠాకూర్.భారత్-‘ఎ’ వర్సెస్ ఆసీస్-‘ఎ’ సిరీస్ షెడ్యూల్అనధికారిక టెస్టు సిరీస్👉సెప్టెంబరు 22-25: తొలి మల్టీ డే మ్యాచ్- పుదుచ్చేరి👉సెప్టెంబరు 29- అక్టోబరు 2: రెండో మల్టీ డే మ్యాచ్- పుదుచ్చేరిఅనధికారిక వన్డే సిరీస్👉అక్టోబరు 6: తొలి వన్డే- పుదుచ్చేరి👉అక్టోబరు 9: రెండో వన్డే- పుదుచ్చేరి👉అక్టోబరు 11: మూడో వన్డే- పుదుచ్చేరి.చదవండి: సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్బ్లాక్!
వైభవ్ సూర్యవంశీకి షాక్
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో అతడు రెండు స్థానాలు కోల్పోయి 49వ స్థానానికి పడిపోయాడు. ఇదే సమయంలో అతడి ఐపీఎల్ జట్టు (రాజస్థాన్ రాయల్స్) సహచరుడు, దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ లుహాన్ డ్రి ప్రిటోరియస్ ఏకంగా 61 స్థానాలు మెరుగుపర్చుకొని 44 స్థానానికి ఎగబాకాడు.ఇటీవల ముగిసిన నమీబియా ట్రై-సిరీస్లో ప్రిటోరియస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు మ్యాచ్ల్లో 56.50 సగటుతో, 179.37 స్ట్రైక్రేట్తో 226 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ప్రిటోరియస్ మెరుపుల కారణంగా సౌతాఫ్రికా ట్రోఫీని కైవసం చేసుకుంది.భారీ జంప్ కొట్టిన మరో సౌతాఫ్రికన్ప్రిటోరియస్తో పాటు నమీబియా ట్రై సిరీస్లో చెలరేగిన మరో దక్షిణాఫ్రికా ఆటగాడు కానర్ ఎస్టర్హుయిజన్ కూడా ర్యాంకింగ్స్లో భారీ జంప్ కొట్టాడు. ఈ సిరీస్లో 126 పరుగులు చేసిన అతడు, ఏకంగా 65 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్కు చేరుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్.కాగా, టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తన టీ20 టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. పాక్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తమ రెండు, మూడు స్థానాలను కాపాడుకున్నారు. మరో టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.బౌలర్ల విభాగంలో రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి అత్యుత్తమంగా ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా టాప్ ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. చదవండి: 300 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
బిజినెస్
జీఎస్టీ కౌన్సిల్ భేటీ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి 57వ సమావేశం వాయిదా పడింది. సెప్టెంబర్ 12న జరగాల్సిన ఈ భేటీని అక్టోబర్ 7కు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్లు ఢిల్లీలోనే ఈ సమావేశం జరగనుంది. వాయిదాకు అధికారికంగా కారణం వెల్లడించనప్పటికీ, ఇదే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు-2026 నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సు ఏర్పాట్ల దృష్ట్యా సెప్టెంబర్ 11న ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్త సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు.గత ఏడాది సెప్టెంబర్ 3న చివరిసారిగా జీఎస్టీ మండలి భేటీ జరిగింది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి సమావేశం జరగాలి. అయితే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సహా పలు కారణాలతో ఈసారి ఆలస్యం అయింది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన సాగే ఈ మండలిలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రితో పాటు, రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.ఈసారి భేటీలో వీటికి అవకాశం..ఇంకా అజెండా ఖరారు కాకపోయినా ఈసారి భేటీలో పన్ను వర్తింపు (కంప్లయెన్స్), వ్యాపార సౌలభ్యంపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశముంది. నెలకు రూ.2.5 లక్షలకు మించి పన్ను క్రెడిట్ బదిలీ చేసే వ్యాపారుల జీఎస్టీ నమోదు దరఖాస్తుల వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం ఏకరూప పత్రాల మార్గదర్శకాలు ఖరారు చేసే ప్రతిపాదన చర్చకు రానుంది. గతేడాది సెప్టెంబర్ 3 సిఫార్సు మేరకు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సరళీకృత పన్ను నమోదు విధానం, చిన్న-తక్కువ రిస్క్ వ్యాపారులకు వర్తిస్తోంది. ప్రస్తుతం 65 శాతం నమోదులు ఈ మార్గంలోనే జరుగుతుండగా మిగతా 35 శాతం పెద్ద వ్యాపారులకూ సరళ విధానం తేవాలని యోచిస్తున్నారు.అదే సమయంలో, సంచిత పరిహార సెస్ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. జీఎస్టీ పరిహార సెస్ క్రెడిట్ బదిలీ, రీఫండ్పై కేంద్రం నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇది సుమారు రూ.2,500 కోట్ల విలువైనదిగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జీఎస్టీ 2.0 ప్రకటన అనంతరం, సెప్టెంబర్ 22, 2025 నుంచి కొత్త విధానం అమల్లోకి రాకముందే తమ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లలో ఉన్న సెస్ నిల్వలను కొనసాగించాలని ఆటో డీలర్లు కోరుతున్నారు.ఇదీ చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
‘బేర్’మన్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 135 పాయింట్లు తగ్గి 23,502 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 531 పాయింట్లు నష్టపోయి 75,045 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.81బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 99.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.8 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.58 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.32 శాతం పడిపోయింది.Today Nifty position 09-09-2026(time: 09:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’
కింగ్ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో వచ్చారు. తనను ‘పారిపోయిన అప్పులవాడు’ (బగోడా)గా ముద్ర వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను 1992 నుంచే బ్రిటన్లో శాశ్వత నివాసిగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం చట్టపరమైన ఆంక్షల వల్లే యూకే వదిలి రాలేకపోతున్నానని ఎక్స్ వేదికగా వరుస పోస్టుల ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తనకు ఘోరమైన అన్యాయం చేసిందని ఆరోపించారు.కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత ఏడాది అక్టోబర్లో లోక్సభలో ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్-2018 కింద 15 మందిని ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించినట్టు, అందులో మాల్యా, నీరవ్ మోదీ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఇప్పుడు మాల్యా మాత్రం ‘నేను తప్పించుకుని తిరగడం లేదు, న్యాయపరమైన బంధనాలే నన్ను ఆపుతున్నాయి’ అంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు.ఇది కేవలం మాటల యుద్ధంతో ఆగిపోలేదు. బ్యాంకులు, ప్రభుత్వం తన నుంచి కోర్టు తీర్పు ప్రకారం రావాల్సిన రూ.6,203 కోట్లకు గాను రూ.14,100 కోట్లు వసూలు చేసినట్టు అంగీకరించారని మాల్యా చెప్పారు. అయినా తనను మోసగాడిగా చిత్రీకరించడం అన్యాయం అన్నారు. తనకు రావాల్సిన రిఫండ్ సంగతేమిటని ఎదురుదాడికి దిగారు. ఇక ఫిబ్రవరిలో బాంబే హైకోర్టు మాత్రం.. కోర్టు విచారణలకు దూరంగా ఉంటూ న్యాయమైన ఉపశమనం కోరడం భావ్యం కాదు అని మాల్యాను తీవ్రంగా మందలించింది. చివరిసారిగా భారత్ తిరిగొచ్చే ఉద్దేశం ఉందో లేదో స్పష్టం చేయాలని ఆదేశించింది.ఇదీ చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
పాలసీదారుల హక్కులపై ఐఆర్డీఏఐ మార్గదర్శకాలు
ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియలో పారదర్శకత, వేగవంతమైన సేవలు కల్పించే దిశగా బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పలు కీలక నిబంధనలను తప్పనిసరి చేసింది. పాలసీదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉంటే క్లెయిమ్ల విషయంలో అనవసర జాప్యాలు, తిరస్కరణలను నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐఆర్డీఏఐ మార్గదర్శకాల్లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.నగదు రహిత (క్యాష్లెస్) చికిత్సలకు సంబంధించి ఆసుపత్రి నుంచి అన్ని పత్రాలు అందిన తర్వాత బీమా సంస్థ ఒక గంటలోపే ఆమోదం తెలియజేయాలి. అలాగే డిశ్చార్జ్ సమయంలో మూడు గంటల్లోపే తుది అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా రోగులు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా ఆసుపత్రి నుంచి బయటకు రాగలుగుతారు.అవసరమైన పత్రాలన్నీ సమర్పించిన తర్వాత సాధారణ క్లెయిమ్లను 30 రోజుల్లోగా, ఇతర పాలసీలను 45 రోజుల్లోగా బీమా సంస్థలు తేల్చాల్సి ఉంటుంది.ఎనిమిదేళ్ల పాటు నిరంతరాయంగా పాలసీని రెన్యువల్ చేసుకున్న పాలసీదారుల క్లెయిమ్లను, మోసం లేదా మినహాయింపు జాబితాలోని అంశాలు మినహా తిరస్కరించే అవకాశం బీమా సంస్థలకు ఉండదు.పాలసీదారులు తమకున్న వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్లు, నో-క్లెయిమ్ బోనస్లను కోల్పోకుండానే ఒక బీమా సంస్థ నుంచి మరో సంస్థకు మారే వెసులుబాటు కలిగి ఉంటారు.క్లెయిమ్ తిరస్కరణకు గురైతే అందుకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని బీమా సంస్థను పాలసీదారు కోరే హక్కు ఉంటుంది. అన్యాయం జరిగిందని భావిస్తే బీమా అంబుడ్స్మన్ను ఆశ్రయించే అవకాశం కూడా ఉంది.ఇదీ చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
ఫ్యామిలీ
వాక్పతి: వ్యాసుని మహాభారత రచనలో గణపతి మహిమ!
‘తొండము నేకదంతము’... ప్రార్థనా పద్యంలో ‘విద్యల కెల్ల నొజ్జయై’ అని వాక్కుల కధిపతిగా, విద్యా బుద్ధుల ప్రదాతగా వినాయకుని కీర్తించటం ఉంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెపుతుండగా గణపతి రాశాడని చెబుతారు.అంటే గణపతి వ్యాసుని ఎదురుగా కూర్చుని రాస్తూవుంటే... వ్యాసుడు ఆశువుగా చెబుతున్నాడని పైకి తోచే అర్థం. కాని, వ్యాసుడు ఏకాక్షర గణపతిని ఉపాసించి సర్వ విద్యల సారం గ్రహించి, సమస్త ఛందస్సులలోని భాషా చాతుర్యమంతా అవగతం చేసుకుని మహాభారతాన్ని రచించాడని ఇందులోని అంతరార్థం అని గణేశ పురాణం చెబుతుంది. వ్యాసుడు మహా భారతం, మహా భాగవతాలనే కాక అష్టాదశ పురాణాలను, అష్టాదశ ఉప పురాణాలను కూడా రచించాడు. ఆ ఉప పురాణాలలో ఒకటి గణేశ పురాణం.రచన ధారళంగా సాగాలన్నా, భాషాదోషాలు లేకుండా, ఎక్కడా కుంటుపడకుండా భాష ప్రవహించాలన్నా, మంచి ఆలోచనలు రావాలన్నా గణపతి పూజ అవశ్యం అని పెద్దల మాట. అలనాటి వ్యాసుని నుంచి నేటి పండిత శ్రేష్ఠుల వరకు అందరికీ గణపతి ఆరాధ్య దైవం, వాక్పతి. విద్యాదాత.దేవతలు కూడా విధిగా పూజించవలసిన దైవం గణపతి. దేవతలు క్షీర సాగర మథనాన్ని గణపతి పూజ చేయకుండా ప్రారంభించటం వల్లనే మధ్యలో విఘ్నం కలిగిందనీ, అప్పుడు స్వయంగా మహా విష్ణువే దేవతలచేత గణపతి పూజ చేయించటం వల్ల ఆ కార్యం నిర్విఘ్నంగా జరిగిందనీ గణేశ పురాణం తెలియజేస్తోంది.– డా. చెంగల్వ రామలక్ష్మిఇవి కూడా చదవండి: హిమధీర
ప్రవాస భారతీయులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదు!
నేను భారత సంతతి అమెరికా పౌరుడిని. నాకు ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డు ఉంది. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఆస్తిని విక్రయించాలనుకుంటున్నాము. అయితే, ఈ అమ్మకాన్ని పూర్తి చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని రిజిస్ట్రార్ కార్యాలయంలో మేము సంప్రదించిన ఒక ఏజెంట్ చె΄్పాడు. రిజిస్ట్రార్ కూడా అది తప్పనిసరి అని చె΄్పారు. ఈ నేపథ్యంలో సంబంధిత రిజిస్ట్రార్ లేదా ఇతర అధికారులకు సమర్పించేందుకు వర్తించే చట్టపరమైన నిబంధనలను స్పష్టంగా తెలియజేయగలరని కోరుతున్నాను. – సుహాస్, అమెరికా (చిత్తూరు)భారత పౌరులు కానప్పుడు ఆధార్ కార్డు మీకెలా వస్తుంది? ఆధార్ చట్టంలోని ’resident’ నిర్వచనం ప్రకారం, గత 12 నెలల్లో కనీసం 182 రోజులు భారతదేశంలో నివసించిన వ్యక్తి నివాసకులు/ ’resident’గా పరిగణించబడతారు. కేవలం OCI కార్డు గ్రహీతగా ఉండటం వల్ల ఆధార్ కార్డు పొందడం తప్పనిసరి కాదు, మీ కేసులో వీలు కూడా లేదు.ఫెమా నిబంధనల ప్రకారం OCI కార్డు గ్రహీత భారతదేశంలో (ప్రత్యేక పరిస్థితులలో తప్ప) వ్యవసాయ భూమి, తోటలు లేదా ఫాం హౌస్ మినహా ఇతర స్థిరాస్తుల కొనుగోలు; విక్రయాలు చేయవచ్చు. ఈ లావాదేవీకి ఆధార్ను తప్పనిసరి పత్రంగా RBI/FEMA నిబంధనలు ఎక్కడా నిర్దేశించలేదు.భారతదేశంలో ఆస్తిని విక్రయించడానికి ఎన్నారైలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఎన్నారైకి ఏదైనా భారతీయ బ్యాంకులో NRO ఖాతా ఉండటం ముఖ్యం.అధికారికంగా అవసరమైన–సూచించిన పత్రాలతోపాటు (1) ఆస్తి పత్రాలు – ఆస్తిపై అప్పులు లేవు అని ధ్రువీకరించే Encumbrance Certificarte (EC); (2) గుర్తింపు ధ్రువీకరణ కోసం పాస్పోర్టు – పాన్ కార్డు వంటివి ఉంటే సరిపోతుంది. అయినప్పటికీ, రిజిస్ట్రార్ ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సిందే అని పట్టుబడితే, ఆధార్ కార్డు సమర్పించనందుకు రిజిస్ట్రేషన్ పత్రాన్ని తిరస్కరిస్తూ, అందుకు గల కారణాలను – ఏ చట్టం, నిబంధన, జీఓ Government Order) లేదా ఏ ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఆధార్ కోరుతున్నారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోరండి. రిజిస్ట్రార్ లిఖితపూర్వకంగా తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం, ఆ ఉత్తర్వులపై జిల్లా రిజిస్ట్రార్ లేదా Inspector General of Registration (IG Registration) ముందు అప్పీల్/పిర్యాదు చేసుకొని, ఆధార్ లేకుండానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా సంబంధిత సబ్–రిజిస్ట్రార్కు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరవచ్చు. హై కోర్టుకి కూడా వెళ్ళవచ్చు.- శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.conకు మెయిల్ చేయవచ్చు. ఇవీ చదవండి: హిమధీర
హిమధీర
చూశాం కదా... నేపాల్లో ఆకస్మిక వరద బీభత్సం! ‘ఆకస్మికం’ అని అంటున్నాంగానీ ఎన్నో సంవత్సరాలుగా మానవాళి చేస్తున్న తప్పుల ఫలితమే ఈ వినాశనం. ‘హిమాచల్ హైతో హమ్ హై’ ‘హిమాలయాలు ఉంటేనే మనం ఉంటాం’ అనేది ప్రసిద్ధ నినాదం. ఈ నేపథ్యంలో హిమాలయాలను కాపాడుకోవడానికి వివిధ రూపాల్లో మహిళలు చేస్తున్న కృషి గురించి...భారత హిమాలయ ప్రాంతం పర్యావరణం నుంచి సంస్కృతి వరకు మన జీవన విధానంలో భాగమైంది. వాతావరణ అనిశ్చితి ఎదురయ్యే ఈ ప్రాంతంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కాపాడుకోవడంలో, విత్తన సంరక్షణలో జీవవైవిధ్య సంరక్షకులుగా మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ నుండి చంబా వరకు సిక్కింలోని లెప్తా నుండి అరుణాచల్ప్రదేశ్లోని అపటాని పీఠభూమి వరకు హిమాలయాలను కాపాడుకోవడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.కొండల్లో చెత్తకుప్పలు! ప్రతి సంవత్సరం యాత్రికులు, పర్వతారోహకులు హిమాచల్ ప్రదేశ్లోని ఎత్తైన పర్వతమార్గాలకు వెళుతుంటారు. పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్, ఆహార ΄÷ట్లాలు, బట్టలు... మొదలైన వాటితో పర్వత్రపాంతాలు చెత్తకుప్పలుగా కనిపిస్తుంటాయి. ఈ చెత్తకుప్పల భారం హిమాలయాలపై అంతకంతకూ పెరుగుతూ పోతుంది. తీర్థయాత్రలు, ట్రెక్కింగ్కు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుండడంతో చెత్త అంతకంతకూ పేరుకుపోతోంది.నిశ్శబ్దంగా ... ‘తీర్థయాత్ర లు, సాహస యాత్రలకు హిమాల యాలు నిశ్శబ్దంగా మ్యూలం చెల్లిస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాలలో చిన్న ప్లాస్టిక్ కవర్ కూడా దశాబ్దాల పాటు ఉండిపోతుంది’ అంటున్నారు హిమాలయన్ ట్రైబ్ ఫౌండేషన్ ఫౌండర్ ఆర్పీ నేగి. ‘ ప్లాస్టిక్ ఫ్రీ హిమాలయాస్’ నినాదంతో హిమాలయన్ ట్రైబ్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు.పర్వత ప్రతిధ్వని... హిమాలయన్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్(హెచ్ఆర్పీ)లో చురుగ్గా పనిచేస్తోంది త్రిషా భట్టాఛార్జీ. జీవావరణ శాస్త్రంలో పట్టభద్రురాలైన త్రిష, కోయంబత్తూర్లోని జౌ ఔట్రీచ్ ఆర్గనైజేషన్లో హిమాలయన్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ కోసం రీసెర్చర్గా పనిచేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా కేంద్రంగా పనిచేస్తున్న త్రిషా ఇలా అంటుంది...‘హిమాలయాలు అనే మాట వినబడగానే కవి, తత్వవేత్త రూమీ మాట గుర్తుకు వస్తుంది నాకు... హిమాలయాలను చూడడం నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం. వసంతకాలపు రంగులు, పక్షుల కిలకిలారావాలు, స్వచ్ఛమైన గాలిని పీల్చే వన్య్రపాణులు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. హిమాలయాలను కాపాడుకోవడానికి హెచ్ఆర్పీ చురుగ్గా పనిచేస్తోంది’ప్రచారంతో... హెచ్ఆర్పీ ప్రాజెక్ట్లో చంబాలోని స్థానికులను భాగస్వాములను చేయడంలో కీలక పాత్ర పోషించింది పూజ. పైలట్ ప్రాజెక్ట్ కోసం తన భూమిని హెచ్ఆర్పీకి ఇచ్చింది. వాతావరణ సంక్షోభాన్ని నివారించడంలో చెట్లు అత్యంత విలువైన పాత్ర పోషిస్తాయి అంటూ ప్రచారం నిర్వహించింది. మహిళలు తమ భూములలో వెయ్యికి పైగా మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.మంచు చిరుతలకు అండగా మహిళలు... హిమాచల్ప్రదేశ్లోని స్పితి లోయలో మంచు చిరుత లు సంచరిస్తుంటాయి. వేటగాళ్ల బారిన పడి వాటి మనుగడ కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. సున్నితమైన పర్వత పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో మంచు చిరుతల ప్రాధాన్యతను గుర్తించిన స్థానిక మహిళలు అటవీశాఖ అధికారులతో కలిసి మంచు చిరుతను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. స్థానికంగా మంచు చిరుతను ‘షెన్’ అని పిలుస్తారు. అందుకే తమ గ్రూపుకు ‘షెన్మో’ అని పేరు పెట్టుకున్నారు. కెమెరా ట్రాప్లను అమర్చడం, పర్యవేక్షించడంలో శిక్షణ పొందారు. కాలాతీత పర్వతాలు‘ది సెంట్ ఆఫ్ హిమాలయాస్’ పేరుతో మోనా వర్మ రాసిన పుస్తకంలో హిమాలయ పర్వతశ్రేణులకు సంబంధించిన జానపద కథలు, ఇతిహాస కథలు ఉన్నాయి. హిమాలయాలు విస్తరించి ఉన్న ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక కథ ఇందులో ఉంది. హిమాలయ ప్రాంతంలో నివసించే గిరిజనుల ఆచార, వ్యవహారాలను ఈ కథలు తెలియజేస్తాయి. ‘హిమాలయాలు నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉన్నాయి. యుగాలుగా నిలిచి ఉన్న ఈ కాలాతీత పర్వతాలపై నా ఆరాధనకు ఈ పుస్తకం అద్దం పడుతుంది’ అంటున్నారు మోనా వర్మ.
పంబ-సన్నిధానం రోప్ వే ప్రాజెక్టులు వేగవంతం..
పంపాను శబరిమల సన్నిధానంతో అనుసంధానించే పూర్తి రోప్వేని సకాలంలో పూర్తి చేసేలా చర్యలుతీసుకోవాలని కేరళ రాష్ట్ర దేవస్వం పెన్షనర్ల సమాఖ్య పునలూర్ గ్రూప్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.శబరిమలను సందర్శించే లక్షలాది మంది యాత్రికులకు ఈ రోప్వే గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని, ఈ ప్రాజెక్టును మరింత ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.గత ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం కులతుపుళ గ్రామంలో 4.5336 హెక్టార్ల భూమిని కేటాయించింది. అయితే, యుడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. అలాగే ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత వరకు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, శబరిమల అభివృద్ధి కార్యకలాపాలపై తన నియంత్రణను బలోపేతం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం కొత్త శబరిమల అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయనుంది. దీనివల్ల అభివృద్ధి సంబంధిత విషయాలలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) పరిపాలనా పాత్ర తగ్గుతుందని భావిస్తున్నారు.ఈ అధికార సంస్థ తొలి సమావేశం సెప్టెంబర్ 11న జరగనుంది.శబరిమల మాస్టర్ ప్లాన్ కింద ప్రాజెక్టులను కాలపరిమితిలోగా అమలు జరిగేలా చూడటమే ఈ కొత్త ప్రాధికార సంస్థ ప్రధాన లక్ష్యం. ఇది సన్నిధానంచుట్టుపక్కల ప్రాంతాలలో యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం, అభివృద్ధి ప్రాజెక్టులను సమన్వయం చేయడం, నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించడం వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. అంతేగాదు ఈ సంస్థ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖతో సహా శబరిమల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ విభాగాల పనితీరును ఈ అథారిటీ సమన్వయం చేస్తుందని చెబుతున్నారు అధికారులు.(చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)
అంతర్జాతీయం
చైనా కండకావరం.. లైవ్లోనే ఏకిపారేశాడు
దక్షిణ చైనా సముద్ర వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరుగుతున్న డిఫెన్స్ డైలాగ్కు ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో హాజరయ్యారు. అయితే ఆయన మాట్లాడుతున్న టైంలో చైనా తరఫున ఓ నోట్ అందింది. ప్రసంగం మధ్యలో అందిన ఆ లేఖను టియోడోరో అక్కడే బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు.. చైనా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టియోడోరో ప్రసంగిస్తుండగా తెల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి ఆయన వెనుక నుంచి వచ్చి టేబుల్పై ఓ కాగితాన్ని ఉంచాడు. సియోల్లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన మిలిటరీ అటాషే ఆ నోట్ను సిబ్బందికి అందించినట్లు సమావేశ నిర్వాహకులు తెలిపారు. అయితే అది టియోడోరో బృందం నుంచి వచ్చిన సందేశమని భావించిన సిబ్బంది.. ప్రసంగం మధ్యలోనే దాన్ని మంత్రికి అందించారు.నోట్ తీసుకున్న టియోడోరో.. ‘‘ఇది చైనా నుంచి వచ్చినదని అనుకుంటున్నాను. దీన్ని చదవనా?’’ అంటూ సభికులను ఉద్దేశించి అన్నారు. అనంతరం దానిలోని విషయాలను బహిరంగంగా చదివారు.‘అంతర్జాతీయ చట్టాన్ని అవమానించారు’దక్షిణ చైనా సముద్రంపై 2016లో జరిగిన మధ్యవర్తిత్వ తీర్పుపై చైనా తన వైఖరిని నోట్లో స్పష్టం చేసింది. ఆ తీర్పు అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంది. అయితే ఈ వాదనను టియోడోరో తీవ్రంగా తప్పుబట్టారు. తన ప్రసంగం మధ్యలో ఇలా నోట్ పంపడం దక్షిణ కొరియాను, ఈ కార్యక్రమ నిర్వాహకులను, అక్కడి ప్రతినిధులను అవమానించడమేనని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన నిబంధనలను చైనా గౌరవించడం లేదని విమర్శించారు.ఇది బెదిరించడమే..చైనా చర్యను.. బెదిరించడం, వేధించడమే అవుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నోట్ను చైనా ఎంత నిరాశలో ఉందో గుర్తుచేసే జ్ఞాపికగా దాచుకుంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నోట్ను అందించిన వ్యక్తిని ఉద్దేశించి కూడా టియోడోరో వ్యంగ్యంగా మాట్లాడారు. అతను తన దేశానికి గొప్ప సేవ చేశాడంటూ వ్యాఖ్యానించారు.PHILIPPINES SHREDS CHINA OVER SOUTH CHINA SEA RULING IN FRONT OF THE WORLDYOU LOST : PHILIPPINE DEFENCE CHIEF PUBLICLY REBUKES CHINESE MILITARY OFFICIALA dramatic confrontation unfolded at a defence forum in seoul after a chinese military attaché handed a note to philippine… pic.twitter.com/QiwwlluQVl— Raj anand (@Rajanand7654) September 9, 2026దక్షిణ చైనా సముద్రంపై వివాదంఫిలిప్పీన్స్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. 2016లో ఫిలిప్పీన్స్ దాఖలు చేసిన కేసులో మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్.. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తృత చారిత్రక హక్కుల వాదనకు చట్టపరమైన ఆధారం లేదని తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లోని వనరులపై చైనాకు హక్కు లేదని పేర్కొంది.అయితే ఈ తీర్పును చైనా తిరస్కరిస్తూ.. ఆ ట్రైబ్యునల్కు ఈ కేసుపై విచారణ జరిపే అధికారమే లేదని చెబుతోంది. మరోవైపు చైనా తమ సముద్ర హక్కులను ఉల్లంఘిస్తోందని ఫిలిప్పీన్స్ తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా డిఫెన్స్ ఫోరంలో నోట్ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరోసారి తెరపైకి తెచ్చింది.ఇదీ చదవండి: ఎడారికి సముద్రపు నీరు!! ఎలా వచ్చిందో తెలుసా?
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
ఒకప్పుడు ‘ఇండియా ఔట్’ అంటూ భారత్ను మాల్దీవుల నుంచి దూరం చేయాలని ప్రయత్నించిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. ఇటీవలే న్యూఢిల్లీతో స్నేహగీతం ఆలపించారు. భారత్ సాయంతో నిర్మిస్తున్న థిలమాలే బ్రిడ్జిని ఇరు దేశాల శాశ్వత స్నేహానికి ప్రతీకగా కొనియాడారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతలోనే భారత్కు షాకిస్తూ.. వ్యూహాత్మకంగా కీలకమైన థిలాఫుషి పోర్ట్ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించిన విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ముయిజ్జు భారత్కు వెన్నుపోటు పొడిచారా? అన్న చర్చ మొదలైంది.మాల్దీవుల ప్రభుత్వ ఆధీనంలోని మాల్దీవ్స్ పోర్ట్స్ లిమిటెడ్.. థిలాఫుషి పోర్ట్ అభివృద్ధి తొలి దశ పనులను చైనా హార్బర్ ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించింది. ప్రస్తుతం మాలేలోని పోర్టులపై ఉన్న రద్దీని తగ్గించి.. దేశ వాణిజ్య కార్యకలాపాల్లో కీలక భాగాన్ని థిలాఫుషికి తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అంటే భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన వాణిజ్య నౌకాశ్రయాల్లో ఒకటిగా థిలాఫుషి మారబోతోంది. ఇక్కడే భారత్కు అసలు ట్విస్ట్ ఎదురవుతోంది. అదే థిలాఫుషికి భారత్ భారీ కనెక్టివిటీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు కింద మాలే, విలిమాలే, గుల్హిఫాల్హు, థిలాఫుషిలను అనుసంధానించే 6.7 కిలోమీటర్ల బ్రిడ్జిలు, రహదారులు, కాజ్వేలను భారత్ నిర్మిస్తోంది. 400 మిలియన్ డాలర్ల రుణం, మరో 100 మిలియన్ డాలర్ల గ్రాంట్తో ఈ ప్రాజెక్టుకు భారత్ మద్దతు ఇస్తోంది.అంటే.. థిలాఫుషికి చేరుకునే కనెక్టివిటీని భారత్ నిర్మిస్తుంటే.. అక్కడి కీలక పోర్టును చైనా అభివృద్ధి చేయబోతోంది. హిందూ మహాసముద్రంలో కీలకమైన సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న మాల్దీవుల విషయంలో ఈ పరిణామం సాధారణ నిర్మాణ ఒప్పందంగా చూడలేని పరిస్థితి. మౌలిక వసతుల వెనుక భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయి.భారత్కు నమ్మకద్రోహం..ఇక, ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తీరు చూస్తే ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. 2023లో ‘ఇండియా ఔట్’ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ఆయన.. తొలుత చైనాతో సంబంధాలను బలోపేతం చేశారు. తన తొలి విదేశీ పర్యటనను కూడా చైనాలోనే చేపట్టారు. భారత్ సైనిక సిబ్బందిని వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం ముయిజ్జును మళ్లీ భారత్వైపు చూసేలా చేసింది. భారీ రుణభారం, ఆర్థిక ఒత్తిళ్ల సమయంలో భారత్.. మాల్దీవులకు ఆర్థిక సహాయం అందించింది. 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ సదుపాయంతో పాటు రూ.3,000 కోట్ల మేర సహకారం అందించింది. దీంతో ముయిజ్జు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇటీవల థిలమాలే బ్రిడ్జిని ప్రశంసించడం, మోదీకి కృతజ్ఞతలు చెప్పడం కూడా ఈ మార్పులో భాగమే. దీంతో మాల్దీవులు పూర్తిగా భారత్ వైపు వచ్చేశాయని భావించిన సమయంలోనే.. చైనాకు థిలాఫుషి పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.అయితే, మాల్దీవులకు ఆర్థికంగా భారత్ అవసరం.. మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో చైనా కూడా కీలక భాగస్వామే. అందుకే మాలే ఒకరిని ఎంచుకోవడం కంటే ఇద్దరితోనూ సంబంధాలు కొనసాగించాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, భారత్కు మాత్రం థిలాఫుషి పరిణామం కీలక హెచ్చరిక. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీకి అనుసంధానంగా ఉన్న కీలక పోర్టు చైనా చేతుల్లోకి వెళ్లడం.. హిందూ మహాసముద్రంలో బీజింగ్ ప్రభావం పెరగడానికి మరో అవకాశమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భారత్కు నష్టం ఎక్కడ?మొదటిది.. వ్యూహాత్మక ప్రభావం. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీ చివరకు చైనా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కీలక వాణిజ్య పోర్టుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే భారత్ నిర్మించిన మౌలిక వసతులు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు.. చైనా ప్రభావం ఉన్న పోర్టు ప్రాంతానికి యాక్సెస్ను మరింత సులభం చేయవచ్చు.రెండోది.. చైనా ప్రభావం పెరిగే అవకాశం. థిలాఫుషి భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన కార్గో హబ్గా మారనుంది. అక్కడ చైనా కంపెనీకి నిర్మాణపరమైన కీలక పాత్ర లభించడం వల్ల బీజింగ్కు మాల్దీవుల సముద్ర వాణిజ్య మౌలిక వసతుల్లో మరింత పట్టు ఏర్పడే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో ఇది భారత్కు సున్నితమైన అంశం.మూడోది.. భారత్ ప్రభావానికి సవాలు. 2024లో భారత్, మాల్దీవులు థిలాఫుషిలో ఆధునిక వాణిజ్య పోర్టు అభివృద్ధిపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇప్పుడు చైనా సంస్థకు కీలకమైన పనులు వెళ్లడం.. మాలే తన మౌలిక వసతుల భాగస్వామ్యాలను భారత్తో మాత్రమే పరిమితం చేయడం లేదని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ఇజ్రాయెల్లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా?
హర్ముజ్లో ఇరాన్ ఎదురుదాడి.. సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.హర్ముజ్ జలసంధి ప్రవేశద్వారం వద్ద అమెరికాకు చెందిన అత్యాధునిక మానవరహిత జలాంతర్గామిని పట్టుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో అమెరికా దళాలు ఐదు ఇరానియన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) అధికారిక మీడియా ‘సెపాహ్ న్యూస్’ ప్రకారం.. సంక్లిష్టమైన నిఘా ఆపరేషన్లో అమెరికాకు చెందిన డైవ్ ఎల్డీ(Dive-LD) మానవరహిత అండర్వాటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక అండర్వాటర్ టెక్నాలజీ కలిగిన వాహనంగా దీన్ని ఇరాన్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. మరోవైపుహర్ముజ్ జలసంధిపై ఓ అమెరికా డ్రోన్( MQ-9 Reaper)ను కూల్చివేసినట్లు కూడా ఐఆర్జీసీ ప్రకటించింది.అమెరికా రియాక్షన్ ఇదేఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. తమ మానవరహిత అండర్వాటర్ వాహనం ఒకటి అంతకుముందు రోజు పనిచేయకుండా నిలిచిపోయిందని అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్నది అదే వాహనమా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఆ వాహనం పాత మోడల్ అని.. అందులో సున్నితమైన సమాచారం, రహస్య సోనార్ లేదంటే రాడార్ పరికరాలు లేవని పెంటగాన్ వెల్లడించింది.ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా దాడిఇదే సమయంలో ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. తమ యుద్ధనౌకపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఐదు ఇరానియన్ ముడిచమురు ట్యాంకర్లను ధ్వంసం చేశారు. గత రెండు రోజుల్లో అమెరికా నౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో రెండుసార్లు దాడికి ప్రయత్నించిందని సెంట్కామ్ పేర్కొంది.ఇరాన్ విమానయాన సంస్థలపై ఆంక్షలుమరోవైపు అమెరికా ఆర్థిక శాఖ ఇరాన్కు చెందిన మరో 27 విమానయాన సంస్థలను ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ఇరాన్ పాలనకు, ఐఆర్జీసీకి ఆయుధాల రవాణా, సిబ్బంది తరలింపులో వాణిజ్య విమానయాన సంస్థలు సహకరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది.‘వాళ్లు పశ్చాత్తాపపడే వరకు..’ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాత్రం.. యుద్ధంలో విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఇరాన్ ఎప్పుడూ కోరుకోలేదని.. అయితే దాడులను ఎదుర్కొనేందుకు తమ ప్రతిఘటన కొనసాగుతుందని తెలిపారు. ఆక్రమణదారులు పూర్తిగా పశ్చాత్తాపపడే వరకు బలంగా పోరాడతామని పేర్కొన్నారు.మళ్లీ ముదిరిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలుఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధానికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. అనంతరంహర్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది. జూన్ 18న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.ఇదీ చదవండి: ఇరాన్కు దిమ్మతిరిగే షాక్.. భారీ దెబ్బకొట్టిన అమెరికా
మొజ్తబా ఖమేనీపై సంచలన ఆరోపణలు
పశ్చిమాసియా యుద్ధంలో తండ్రి అయతొల్లా ఖమేనీ మరణాంతరం.. ఊహించని రీతిలో ఇరాన్కు సుప్రీం బాధ్యతలు చేపట్టాడు మొజ్తబా ఖమేనీ. అయితే యుద్ధంలో గాయపడిన ఆయన.. దాదాపు ఆరు నెలల నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉంటూ పాలనలో కీలక భాగస్వామ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆయన మీద సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి.ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లండన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నాయంటూ బ్రిటన్ మీడియాలో వచ్చిన కథనాలు తీవ్ర చర్చకు దారితీశాయి. బ్రిటన్లోని ‘ది సండే టైమ్స్’ సహా పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. లండన్లోని కెన్సింగ్టన్లో పాలెస్ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు మొజ్తబా ఖమేనీకి చెందినవిగా పేర్కొన్నారు. ఆ భవనం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలోనే ఉండటం ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచింది.అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఖమేనీకి ఇరాన్లోనే కాదు.. విదేశాల్లోనూ ఎలాంటి ఆస్తులు లేవని ఇరాన్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.‘ఆరోపణలు పూర్తిగా నిరాధారం’బ్రిటన్ మీడియా సంస్థలు చేసిన ఆరోపణలను ఇరాన్ రాయబార కార్యాలయం ‘పూర్తిగా నిరాధారం’గా అభివర్ణించింది. మొజ్తబా ఖమేనీ తన తండ్రిలాగే ఎలాంటి ఆస్తులు కలిగి లేరని పేర్కొంది. ఆయన నిరాడంబరమైన జీవనశైలిని ఇరాన్ ప్రజలు బాగా తెలుసని తెలిపింది. ఖమేనీకి దేశంలోగానీ.. విదేశాల్లోగానీ ఆస్తులు ఉన్నాయన్న ప్రచారం ఆయన జీవితం, వ్యక్తిత్వంపై తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించేందుకేనని రాయబార కార్యాలయం ఆరోపించింది.లండన్లోని కెన్సింగ్టన్లో పాలెస్ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు.. ఆరో, ఏడో అంతస్తుల్లో ఉన్నాయని, వాటిని 2014, 2016 సంవత్సరాల్లో మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసినట్లు బ్రిటన్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆస్తుల యాజమాన్యం ఖమేనీతో ముడిపడి ఉందన్న విషయాన్ని ఇటీవలే గుర్తించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.అరెస్టులతో ముడిపెట్టి ప్రచారంలండన్లో యూదు సమాజానికి సంబంధించిన వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా పెట్టినట్లు అనుమానిస్తూ నలుగురు ఇరానియన్, బ్రిటిష్-ఇరానియన్ వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ ఆస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని గమనించే అవకాశం ఉన్న ప్రాంతంలో ఈ ఫ్లాట్లు ఉండటంపై కూడా బ్రిటన్ మీడియాలో చర్చ జరిగింది. రాయబార కార్యాలయానికి 50 మీటర్లలోపే ఈ భవనం ఉందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే బ్రిటన్ మీడియా కథనాలకు ఇరాన్ ఇచ్చిన సమాధానం మాత్రం స్పష్టంగా ఉంది. మొజ్తబా ఖమేనీకి ఎక్కడా ఆస్తులు లేవని.. ఆయన నిరాడంబర జీవితం గడుపుతున్నారని రాయబార కార్యాలయం చెబుతోంది. ఇదీ చదవండి: అలా నెతన్యాహు ఇరుకున్నారా?
జాతీయం
అర్థాంతరంగా నిలిచిపోయిన క్లీన్ కేరళ కార్యకలాపాలు
పంబ , సన్నిధానంలో పనులు ప్రారంభించిన ఒక్క రోజే క్లీన్ కేరళ కంపెనీ తన వ్యర్థాల తొలగింపు కార్యకలాపాలను అర్థాంతరంగా నిలిపేసింది. దాంతో శబరిమల వ్యర్థాల నిర్వహణ కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదం ఎదురైంది. దాదాపు ఒక ఏడాది పాటు జరిగిన చర్చల అనంతరం, శబరిమల నుంచి వెలువడే వ్యర్థాలన్నింటినీ వేరు చేసి తొలగించాలని ఒక అవగాహనకు వచ్చారు. ఈ ప్రణాళికలో భాగంగా, వేరు చేసిన వ్యర్థాల మొదటి విడతను సిద్ధం చేశారు. జీవవిచ్ఛిన్నం కానీ వ్యర్థాల సేకరణ అధికారిక ప్రారంభోత్సవాన్ని సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే , ఆ కార్యక్రమం సజావుగా జరగలేదు. కొంతమంది అధికారులు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా , జీవవిచ్ఛిన్నం కాని వ్యర్థాల సేకరణ మరియు విభజన నుండి క్లీన్ కేరళ కంపెనీని మినహాయించారు.టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో , ప్రస్తుతానికి సన్నిధానం నుండి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రమే సంచులలో ప్యాక్ చేసి పంబకు తరలించాలని నిర్ణయించారు. సన్నిధానం, పంబలోని వివిధ ప్రాంతాల నుండి చెత్త , ప్లాస్టిక్ బాటిల్స్ , గాజు సీసాలు , స్క్రాప్ సామాగ్రి మరియు నిర్మాణ శిధిలాలతో సహా పేరుకుపోయిన వ్యర్థాలను వేరు చేసి తొలగించాలన్నది అసలు ప్రణాళిక. ప్రతిపాదిత ఏర్పాటు ప్రకారం , పునర్వినియోగించదగిన పదార్థాల కోసం దేవస్థానం బోర్డు ఒక స్థిరమైన మొత్తాన్ని అందుకుంటుంది, అయితే మిగిలిన వ్యర్థాలను శుద్ధి చేసి, పారవేసినందుకు రుసుములు వసూలు చేస్తారు కూడా. ఈ విషయమై ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదరలేదు. అయితే శబరిమల యాత్రా కాలం సమీపిస్తుండటంతో , ఒప్పందం ఇంకా కుదరకపోయినప్పటికీ పనులు ప్రారంభించాలని క్లీన్ కేరళ కంపెనీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నేపథ్యంలోనే కంపెనీకి చెందిన సుమారు 15 మంది ఉద్యోగులు ఒక వాహనంతో శబరిమలకు చేరుకుని వ్యర్థాల తొలగింపు పనులను ప్రారంభించారు. తీరా ప్రారంభించాక ప్రతిపాదిత వ్యర్థాల నిర్వహణ ఏర్పాటుపై అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆ పనులను తక్షణమే నిలిపివేశారు. కాగా, క్లీన్ కేరళ కంపెనీ లిమిటెడ్ (CKCL) కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోలేదని చెబుతున్నారు అధికారులు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో కార్మిక వివాదాలు, అలాగే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లతో ఏర్పడిన సమన్వయ లోపాల వల్ల తాత్కాలికంగా కొన్ని చోట్ల పనులు నిలిచిపోయినట్లు సమాచారం. అలాగే కొన్ని కార్మిక సంఘాలు నోక్కుకూలి' (పని చేయకుండానే డిమాండ్ చేసే అక్రమ కూలి) కోసం పట్టుబట్టడం కూడా ఒక కారణమనేది అధికారిక వర్గాల సమాచారం. (చదవండి:
సీజేపీ నేతలు దీప్కే, ఆశుతోష్, సౌరవ్పై రూ.2 కోట్లకు దావా
కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీ నేతలు అభిజీత్ దీప్కే, ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్పై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని చెప్పారు.భాటియా నష్టపరిహారంగా రూ.2 కోట్లు చెల్లించాలని, తనకు సంబంధించిన పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, తిరిగి పోస్టు చేయడం, ప్రసారం చేయకుండా ప్రతివాదులను ఆదేశించాలని కోర్టును కోరారు. సామాజిక మాధ్యమాల నుంచి వివాదాస్పద సమాచారాన్ని తొలగించాలని కూడా ఆయన కోరారు.స్వతంత్ర భరద్వాజ్కు సంబంధించి భాటియా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటూ కృత్రిమ మేధస్సుతో రూపొందించిన గ్రాఫిక్ను సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రచారం చేయడంతో వివాదం మొదలైందని దావాలో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని భాటియా ఖండించి, పోస్టును తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సౌరవ్ దాస్ను కోరారు.సౌరవ్ దాస్ ఆ పోస్టును తొలగించి, అది కృత్రిమ మేధస్సుతో రూపొందించిన గ్రాఫిక్ అని తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసినట్లు దావాలో పేర్కొన్నారు. అయితే ఆ సమాచారం ఇతరులు కూడా ప్రచారం చేశారని భాటియా ఆరోపించారు. ఆశుతోష్ రాంకా కూడా దాస్ ఖాతా నుంచి ఆ గ్రాఫిక్ను తిరిగి పోస్టు చేసి, భారతీయ జనతా పార్టీ నేతలను ఎగతాళి చేసే కామెంట్ను జత చేసినట్లు దావాలో ఆరోపించారు.ఉద్దేశపూర్వకంగా ప్రచారం!తనపై తప్పుడు, కల్పిత, తప్పుదోవ పట్టించే, పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురించి ప్రసారం చేశారని భాటియా ఆరోపించారు. ఆ పోస్టుల్లో ఒకదాన్ని ప్రచురించిన కొద్దిసేపటికే 1.32 లక్షలకు పైగా మంది చూశారని దావాలో పేర్కొన్నారు. ఈ ప్రచారం తన ప్రతిష్ఠ, వృత్తిపరమైన స్థాయిపై ప్రతికూల ప్రభావం చూపిందని భాటియా తెలిపారు.సౌరవ్ దాస్ గతంలో ఉమర్ ఖలీద్, న్యాయవ్యవస్థపై చేసినట్లు ఆరోపించిన కొన్ని పోస్టులను కూడా దావాలో ప్రస్తావించారు. నిర్దిష్ట న్యాయ వ్యవహారంపై న్యాయమైన విమర్శల పరిధిని ఆ పోస్టులు దాటి న్యాయవ్యవస్థపై విస్తృత దాడిగా మారాయని భాటియా ఆరోపించారు.రిజిస్టర్కాని సంఘం పేరుతో ప్రతివాదులు న్యాయవ్యవస్థ సహా రాజ్యాంగ సంస్థలకు వ్యతిరేకంగా సమాచారాన్ని ప్రచురిస్తూ, ప్రసారం చేస్తున్నారని దావాలో ఆరోపించారు. అయితే ఇవన్నీ పౌర దావాలో చేసిన ఆరోపణలే. వాటిపై ఢిల్లీ హైకోర్టు ఇంకా విచారణ జరిపి నిర్ణయం తీసుకోలేదు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హౌరా- చెన్నై కారిడార్లో భాగంగా విశాఖ, విజయవాడ మీదుగా నాలుగు లేన్ల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ముంబై- చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది. అదే విధంగా దేశంలో 7 హై డెన్సిటీ రైల్వే కారిడార్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు భారతీయ రైల్వేల భారీ ప్రణాళికలో భాగంగా ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ముంబై కారిడార్లకు ప్రాధాన్యం ప్రకటించింది. ఢిల్లీ–చెన్నై మార్గంలో విజయవాడ కీలక స్టేషన్గా అదేవిధంగా హౌరా–చెన్నై కారిడార్లో విశాఖపట్నం స్టేషన్కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ముంబై–చెన్నై మార్గంలో రేణిగుంట, గుంతకల్ అభివృద్ధి కి ఊతం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ అంశమై రైల్వేశాఖ మంత్రి మాట్లాడుతూ పలు మార్గాల్లో నాలుగో లైన్ పనులు చేపట్టడంతో పాటు మరికొన్ని కారిడార్లు డీపీఆర్, ఆమోద దశలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర నిర్ణయాలతో సరుకు రవాణా, ప్రయాణికుల సేవల సామర్థ్యం పెరగనుందని రైళ్ల సమయపాలన మెరుగుపడుతుందని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో పాల్గొన్న ఒక విద్యార్థికి గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. CJP నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన అన్ని FIRలను కొట్టివేస్తూ, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేజిస్ట్రేట్ నోటీసు ఎలా ఇస్తారని కోర్టు ప్రశ్నించింది.. తీర్పు స్పష్టంగా ఉన్నప్పటికీ నోటీసు ఎలా ఇస్తారంటూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ల నుంచి ఈ ఘటనపై వివరణ కోరనున్నట్లు తెలిపారు.ఈ ఏడాది జూలైలో జరిగిన సీజేపీ నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లకు సంబంధించి తామిచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ నోటీసు ఎలా జారీ చేస్తారు? మేజిస్ట్రేట్కు అంత ధైర్యమా?" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది!గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ రెండో సంవత్సరం విద్యార్థి అక్షత్ త్రిపాఠికి సెప్టెంబర్ 4న గ్రేటర్ నోయిడా మేజిస్ట్రేట్ నోటీసు పంపారు. నిరసనల్లో పాల్గొనమని విద్యార్థులను ప్రోత్సహించినట్లు అందులో ఆరోపించారు. (ఈ నోటీసును మరుసటి రోజే ఉపసంహరించు కున్నట్లు కోర్టుకు తెలిపారు). ఇందుకు రూ. 5 లక్షల వ్యక్తిగత బాండ్ను అందించాలనికోరారు.అయితే ఆర్టికల్ 142 ప్రత్యేక అధికారాలను ఉపయోగించి, జూలై 20 - 25 మధ్య CJP నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులన్నింటినీ సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలాగే కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కూడా స్పష్టం చేసింది.ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసుకాగా సీజేఐ సూర్యకాంత్ అనూహ్య వ్యాఖ్యల తరువాత పుట్టుకొచ్చిన సీజేపీ నీట్ ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యంగా జెన్-జీ నుంచి ఈ పోరాటానికి లభించిన ఆదరణ, మద్దతు విశేషంగా నిలిచింది.
ఎన్ఆర్ఐ
జయ పీసపాటి గౌరవార్థం సింగపూర్లో ఆత్మీయ సమ్మేళనం
సింగపూర్: హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి సింగపూర్ పర్యటన సందర్భంగా, శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సింగపూర్లో ఘనంగా జరిగింది. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్లో సుమారు 25 మంది తెలుగు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.సుబ్బు వి. పాలకుర్తి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి జయ పీసపాటి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరైనారు. ఈ సందర్భంగా జయ పీసపాటి మాట్లాడుతూ, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు, గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.మహిళలు మీడియా సహా వివిధ రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలవగలరని జయ పీసపాటి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఆదివారం కూడా ఇంతమంది తెలుగువారు ఒకచోట చేరి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సింగపూర్, హాంగ్ కాంగ్ తెలుగు సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న సత్సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.సింగపూర్తో 2016 నుంచే ప్రత్యేక అనుబంధంహాంగ్ కాంగ్లో తెలుగు సమాఖ్యను నిర్వహిస్తున్న తనకు విదేశాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం 2016లో సింగపూర్లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సింగపూర్లోని తెలుగువారి ఐక్యత, చురుకుదనం తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని ఆమె నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.ఇటీవల మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు ఒక మార్గదర్శకంగా, బెంచ్మార్క్గా నిలిచాయని ఆమె అభినందించారు. ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడటంతో పాటు పద్యాలు, గద్యాలను స్పష్టంగా చదివి వినిపించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.మలేషియా తెలుగు సమాజం చూపించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు భాష మరింతగా అభివృద్ధి చెంది, భావితరాల్లో సజీవంగా కొనసాగాలని జయ పీసపాటి ఆకాంక్షించారు.తమకు ఆత్మీయ‘జయక్క’గా మారిన“జయ పీసపాటి ఈ సందర్భంగా రత్న కుమార్ మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలుఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లితో పాటు సింగపూర్ తెలుగు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు.
మిస్సిసాగాలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మిస్సిసాగా: కెనడాలోని మిస్సిసాగా నగరంలో శనివారం(సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం 6 గంటలకు వైఎస్సార్సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, వైఎస్సార్సీపీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమ నిర్వాహకులు (వైఎస్సార్సీపీ కెనడా టీమ్):* సుబ్బారావు – వైఎస్సార్సీపీ కెనడా కో-కన్వీనర్* నూర్ గారు – వైఎస్సార్సీపీ కెనడా యూత్ వింగ్ కన్వీనర్ముఖ్య అతిథులు మరియు వక్తలుచల్లా మధుసూదన్ రెడ్డి గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ) – జూమ్ ద్వారా హాజరయ్యారుపాండుగాయల రత్నాకర్ గారు (మాజీ వైఎస్సార్సీపీ యూఎస్ఏ/ఎన్ఆర్ఐ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి) – జూమ్ ద్వారా హాజరయ్యారు. డాక్టర్ ప్రదీప్ చింత గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఎన్ఆర్ఐ వ్యవహారాలు) – జూమ్ ద్వారా హాజరయ్యారు. కొండం వెంకట్ రెడ్డి గారు (కెనడా కమ్యూనిటీ నాయకులు) – ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడారు.ఎగ్జిక్యూషన్ టీమ్: కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు: అస్లాం, సుమంత్, యశ్వంత్ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్, డాక్టర్ నిరంజన్ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్ కొరపోరలు.అడ్వైజర్ కమిటీ: కార్యక్రమానికి విలువైన మార్గదర్శకత్వం అందించిన సలహాదారుల కమిటీ సభ్యులు:* కృష్ణారెడ్డి పసల* రాజగోపాల్ గుంటక* విశ్వనాథ్ రెడ్డి* విజయభాస్కర్ రెడ్డి* కృష్ణ ఆలంపాటి* డాక్టర్ శివ రెడ్డిఈ కార్యక్రమంలో మిస్సిసాగాతో పాటు పరిసర ప్రాంతాల నుండి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్ కమిటీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూషన్ టీమ్కు, అడ్వైజర్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్న కిరణ్ రెడ్డి
జార్జియాలోని డగ్లస్కు చెందిన 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థిని కిరణ్ రెడ్డి మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుంది. అమెరికా జాతీయ పోటీల్లో ఈ ఘనత సృష్టించిన తొలి భారత సంతతి అమెరికన్గా చరిత్ర సృష్టించింది. ఫ్లోరిడాలోని మయామిలో ఉన్న అడ్రియెన్ ఆర్ష్ట్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఆగస్టు 26న జరిగిన 44వ వార్షిక పోటీల్లో కిరన్ రెడ్డి మొత్తం 50 మంది పోటీదారులతో పోటీపడి ఈ కిరీటం దక్కించుకుంది. ఈపోటీల్లో ఆర్కాన్సాస్కు చెందిన రాక్వెల్ ఓలియా మొదటి రన్నరప్గా నిలవగా, న్యూయార్క్కు చెందిన ఎలిసా అకిన్, ఇండియానాకు చెందిన కీర్స్టెన్ అల్వరాడో, టెక్సాస్కు చెందిన క్లో బెల్లా డీట్జ్ టాప్ ఫైవ్లో నిలిచారు. ఈ ఈవెంట్కి మాజీ మిస్ రోడ్ ఐలాండ్ యూఎస్ఏ కెల్సీ స్వాన్సన్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. గత నెలలోనే మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ టైటిల్ను గెలుచుకున తొలి అమెరికన్గా నిలిచిందామె. అంతేగాదు జార్జియా రాష్ట్రంకి ఈ పోటీ చరిత్రలో తొలి విజయాన్ని అందించిన ఘనత కూడా కిరణ్దే. ఈ మేరకు కిరణ్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ని స్వీకరించడంపై స్పందిస్తూ..ఇది తన అదృష్టంగా పేర్కొంది. తనకు చిన్నప్పటి నుంచి ఆదర్శంగా నిలవడం ఇష్టమని ఈ గెలుపుతో అది నిజమైందని అంటోంది.ఎవరామె..కిరణ్ విద్యా నేపథ్యం వచ్చేసి డగ్లస్లోని కాఫీ హైస్కూల్లో వాలెడిక్టోరియన్గా పట్టభద్రురాలయ్యారు. హైస్కూల్ విద్య పూర్తి చేసిన తర్వాత, రెడ్డి జార్జియా విశ్వవిద్యాలయంలో చేరారు, అక్కడ ఆమె ప్రీ-మెడికల్ ట్రాక్లో జీవశాస్త్రాన్ని అభ్యసిస్తోంది. ఆమె 15 ఏళ్ల వయసులో అందాల పోటీలోకి ప్రవేశించింది. 2024లో జరిగిన మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ పోటీలో ఆమె మొదటి రన్నరప్గా నిలిచింది, ఆ తర్వాత ఈ ఏడాది జూలైలో మిస్ జార్జియా టీన్ యూఎస్ఏగా గెలుపొందడంతోనే ఈ జాతీయ టైటిల్కు ఆమె ప్రయాణం సుగమమైంది. ఇక ఆమె త్వరలోనే మిస్ టీన్ యూఎస్ఏగా బాధ్యతలు తీసుకోనుంది. అలాగే అక్టోబర్ 2026లో కంబోడియాలోని ఫ్నామ్ పెన్లో జరిగే మిస్ టీన్ యూనివర్స్ పోటీలో కిరణ్ రెడ్డి యునైటెడ్ స్టేట్స్కు ప్రాతినిధ్యం వహించనుంది కూడా. వీటి తోపాటు తన అండర్ గ్రాడ్యుయేట్ ప్రీ-మెడ్ చదువుని కూడా కొనసాగించాలని చూస్తోంది.(చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)
టోక్యో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు
జపాన్లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని, భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు. భారతీయులు, జపాన్ స్థానికులు కలిసి పండుగను జరుపుకోవడం రెండు సంస్కృతుల మధ్య స్నేహం, సాంస్కృతిక పరస్పర అవగాహనకు ప్రతీకగా నిలిచింది.శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.“ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే” అనే భావనతో, జపాన్లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు మరియు సంప్రదాయాలను పరిచయం చేస్తూనే, స్థానిక జపాన్ సమాజంతో కూడా సాంస్కృతిక అనుబంధాలను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు, జపాన్ స్థానికుల భాగస్వామ్యం, భక్తి మరియు సమాజ ఐక్యత కలగలిసి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు, చిన్నారులు, TAJ సభ్యులు మరియు జపాన్ స్థానికులు పరస్పరం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం అందరికీ ప్రసాద వితరణ నిర్వహించారు.జపాన్లో భారతీయ మరియు తెలుగు సంస్కృతిని కొనసాగిస్తూ, జపాన్ సమాజంతో స్నేహపూర్వక సాంస్కృతిక వారధులను నిర్మించడంలో TAJ కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు.సంస్కృతి మన మూలం — స్నేహం మన బలం.జై శ్రీకృష్ణ! 🙏రాధే రాధే! 🌸
క్రైమ్
భర్తను వదలి మరో వ్యక్తితో సహజీవనం!
అనుమానాస్పద రీతిలో చైత్ర (28) అనే వివాహిత చనిపోయిన ఘటన తాలూకా పరిధిలోని చొక్కహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం తాలూకా ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్ ఆమె మొబైల్ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్ కోసం గాలిస్తున్నారు.-బెంగళూరు చదవండి: నాకేం తెలియదు.. అంతా నా భర్తే చూసుకుంటాడు
భార్య కోసం పోలీసు వాహనమే ఎత్తుకెళ్లాడు!
కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం చోరీకి గురైంది. మద్యానికి బానిసైన రజీ్వచమన్కు చెందిన ఎండీ.ఇజాజ్ భార్య గొడవ కారణంగా కాపురానికి రావడంలేదు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి అతడు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన భార్యను తీసుకొచ్చేందుకు సహకరించాలని పోలీసులను కోరాడు. ఈ సమయంలో పోలీసులు అతడిని పట్టించుకోవడంలేదనే కోపంతో అక్కడే పార్కింగ్ చేసిన పెట్రోలింగ్ ఇన్నోవా వాహ నాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. అప్రమత్తమైన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ నిరంజన్రెడ్డి సీసీ కెమెరాలు పరిశీలించి వరంగల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్పర్తి పోలీసులకు సమాచారం అందించారు. ఇజాజ్ వరంగల్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న క్రమంలో ఎల్కతుర్తి శివారులో వాహనం ప్రమాదానికి గురైంది. బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఏసీపీ, సీఐలు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. చదవండి: ఇందిరమ్మ టవర్స్ డిపాజిట్ వాపస్
చిన్న ఖర్చుకూ మామనే అడగాలా?..
సంపన్న కుటుంబానికి ఆమె కోడలిగా వెళ్లింది. అయితే అత్తింట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఆమెను మనశ్శాంతి కరువైందట. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా. ఏం చేసినా ఓ కన్నేసి చూసే పిసినారి మామ. నచ్చిన దుస్తులు వేసుకుంటే.. సూటిపోటి మాటలు. కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే ప్రశ్నలు. చిన్న ఖర్చుకూ భార్యభర్తలిద్దరూ ఆయన్నే డబ్బులు అడగాల్సిన పరిస్థితి.. ఇవన్నీ ఆమెలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఆ అసహనం.. కోపంగా మారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్కు చెందిన 63 ఏళ్ల ఫార్మాస్యూటికల్ వ్యాపారి వినీత్ మినోచా దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఆయన కోడలే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చేశారు. మాజీ పనిమనుషులకు సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలిసింది. నేరాంగీకారంలో ఆమె విస్తుపోయే విషయాలే వెల్లడించింది. సెప్టెంబర్ 5 శనివారం రాత్రి తన ఇంట్లో వినీత్ దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఆ కుటుంబానికి గతంలో పనిచేసిన విశాల్ (30), అతడి సహచరుడు రాజ్ కిశోర్పై అనుమానం వచ్చింది. ఆదివారం రాత్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో విశాల్ ఇచ్చిన సమాచారంతో కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వినీత్ కోడలు షాలు (36) తన మామను హత్య చేయాలని తమను సంప్రదించిందని విశాల్ పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం రూ.6 లక్షలు ఇస్తానని ఆమె ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు షాలును అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆమె.. ఆ తర్వాత తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.షాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మామ తన కదలికలను నిరంతరం గమనించేవారు. రాత్రిళ్లు పార్టీలకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ.. తనకు, తన భర్తకు సంబంధించిన చిన్న ఖర్చులకు కూడా మామను డబ్బులు అడగాల్సి వచ్చేదని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.ఆ రాత్రి..జూలై 28న పార్టీ నుంచి షాలు ఆలస్యంగా ఇంటికి రావడంతో మామతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన తర్వాతే ఆమె మామపై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత వినీత్ దగ్గర గతంలో పని చేసిన విశాల్ను ఆమె సంప్రదించింది. సెప్టెంబర్ 6న రూ.2 లక్షలు, మిగిలిన రూ.4 లక్షలను 15 రోజుల తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు హత్య కోసం ఫ్లాట్ డూప్లికేట్ తాళం చెవిని కూడా షాలు ఏర్పాటు చేసి విశాల్ చేతికి అందించింది. జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4న అతడిని ఇంటికి పిలిచి.. హత్య స్కెచ్ను వివరించింది. గుండెపోటుగా..శనివారం రాత్రి షాలు తన భర్త సుబ్రత్, కుమారుడితో కలిసి పార్టీకి వెళ్లింది. వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే విశాల్, రాజ్ కిశోర్ ఫ్లాట్కు చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డు మదన్ వారిని అడ్డుకోవడంతో.. విశాల్ వెంటనే షాలుకు ఫోన్ చేశాడు. వాళ్లిద్దరూ మందులు తెచ్చారని.. లోపలికి అనుమతించాలని గార్డుకు ఆమె చెప్పింది. అయితే వినీత్ను దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేయడం.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలన్నది వాళ్ల ప్లాన్. అయితే జరిగింది వేరు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరూ.. బెడ్రూమ్లో దాక్కున్నారు. వినీత్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఏకంగా 26 సార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.రక్తపు మడుగులో మామ..పార్టీ ముగించుకుని షాలు, ఆమె భర్త సుబ్రత్ రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. బెడ్రూమ్లో వినీత్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులేవీ దొంగిలించకపోవడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. దీంతో తొలినుంచే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని.. కుటుంబంలో వ్యక్తిగత విభేదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.ప్రస్తుతం షాలు జైలులో ఉంది. మరోవైపు ఆమె భర్త సుబ్రత్ ఈ కుట్ర గురించి ముందే తెలుసా? హత్యలో అతడి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం అతడి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: యూట్యూబర్ రమా నందన సంచలన వాంగ్మూలం
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. సర్పవరం పోలీసుల తొలిరోజు విచారణలో నిందితుడు సాధిక్ఖాన్ ఇచ్చిన సమాధానాలు దాదాపుగా ఇవే. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు అనుమానాస్పద మృతిలో కీలక నిందితుడు సాధిక్ ఖాన్ను మంగళవారం కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు తొలిరోజు విచారణ ప్రారంభించారు. అతడి న్యాయవాది సమక్షంలో అదనపు ఎస్పీ మహంతి కిషోర్కుమార్ ఆధ్వర్యంలో రూరల్ పీఎస్ ఆవరణలో ఉన్న ప్రత్యేక గదిలో అతన్ని విచారిస్తున్నారు.ఉదయం ప్రారంభమైన విచారణ, రాత్రి 9.30 సమయానికి కూడా కొనసాగుతోంది. పోలీసు వర్గాల నుంచి తెలిసిన సమాచారం మేరకు.. సాధిక్ను విచారించేందుకు 200 ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు తొలిరోజు 60 ప్రశ్నలు అడిగారు. అందులో ఎక్కువ మేరకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సాధిక్ సమాధానం ఇవ్వడం గమనార్హం. సాంకేతిక ఆధారాలతో సాధిక్ను అడిగిన ప్రశ్నలకు వాస్తవ సమాధానాలు కనిపెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. విచారణకు పూర్తి స్థాయి సహకారం లేకపోవడం వల్ల సాంకేతిక అంశాలపై ఆధారపడి కేసు విచారణ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. మీరట్లో ఏం జరిగింది... సాధిక్ మీరట్ వెళ్లడం వెనుక కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కకుండా సాధిక్ అక్కడి పోలీసుల ద్వారా అరెస్టయ్యాడని తెలిసింది. స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వల్లే ఆంధ్రా పోలీసులు వెళ్లి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకురావలసి వచ్చిందని స్పష్టమైంది. ఆంధ్ర పోలీసులకు చిక్కే సమయానికి సాధిక్కు చెందిన స్థానికులు మీరట్ పోలీసులకు సమాచారం అందించి కావాలనే అరెస్టు చేయించారని, నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే గుర్తించిన సాధిక్ తన మార్గదర్శి ద్వారా ఈ పన్నాగం పన్నాడని చెబుతున్నారు. అతడి వెనకున్నదెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా దేశంలో ఏ మూల ఉన్నా నిందితులను పోలీసులు ఆయా ప్రాంతాలను వెళ్లి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువస్తారు. కాని సాధిక్ విషయంలో అలా జరగలేదు. ట్రాన్సిట్ వారెంట్ తప్పనిసరి అయింది. అవును రసాయనం తెచ్చాను... సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకు వినియోగించాడని చెబుతున్న ప్రాణాంతక రసాయనం ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావన్న ప్రశ్నకు రసాయనం తేవడం నిజమేనని అంగీకరించినట్టు తెలిసింది. అయితే, ఆ రసాయనం ఉపయోగించి తాను చంపలేదని చెబుతున్నాడు. ఈ విషయాన్ని నిరూపించడం పోలీసులకు ఓ సవాల్గా మారింది. ఇప్పటికే జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి ఆరోగ్య నివేదికలు సేకరించారు. వాటిని నిపుణుల పరిశీలనకు పంపారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో.. మంగళవారం నాటి విచారణలో పోలీసులు కీలక విషయం రాబట్టారు. మోసం చేయడం ఆది నుంచి సాధిక్కు ఓ అలవాటైన విషయమని మరోసారి నిర్ధారించుకున్నారు. ఇంత డాబు, దర్పాన్ని ప్రదర్శిస్తున్న సాధిక్ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. నకిలీ సర్టిఫికెట్ ఒకటి తయారు చేయించుకొని వివిధ పోటీలలో పాల్గొనడం దగ్గర నుంచి, కోచ్గా పాఠశాలల్లో చేరడం వరకు చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని స్వయానా సాధిక్ అంగీకరించాడు. ఇద్దరు సెంటు వ్యాపారస్తుల విచారణ... సా«ధిక్ ఖాన్ను కస్టడీకి తీసుకొచ్చే కొద్ది రోజుల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగదీశ్వర్రెడ్డిని హతమార్చేందుకు సాధిక్ సర్వ ప్రయత్నాలు చేశాడన్న విషయం రూఢీ అయింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం గాం«దీపురంలో ఉన్న ఓ సెంటు వ్యాపారస్తుడు అబ్దుర్ రెహమాన్ సాధిక్ సంప్రదించాడు. తనకు హానికారక రసాయనం కావాలని, ఒక వ్యక్తిని హతమార్చాలని చెప్పాడు. అది ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పిన రెహమాన్ హైదరాబాద్కు చెందిన అబ్దుల్ ఖాదిర్ను సంప్రదించాలని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చాడు. పోలీసులు వీరిద్దరినీ విచారిస్తుండగా వారి న్యాయవాది వచ్చి విడుదల చేయించారని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి తీసుకెళ్లారని తెలిసింది. సాధిక్ విచారణ కొనసాగుతుండడంతో వారిద్దరినీ మరో మారు పిలిపించే అవకాశం ఉంది. ఆ పార్సిల్లో ఏముంది? అబ్దుల్ ఖాదిర్ హైదరాబాద్ నుంచి సెంట్ల తయారీలో వినియోగించే ఓ హానికర రసాయనాన్ని సాధిక్కు పంపాడని సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పంపిన మార్గాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ ట్రావెల్ బస్సులో కొద్ది రోజుల క్రితం సాధిక్కు ఓ పార్సిల్ అందిందన్న సమాచారం పోలీసులకు తెలియడంతో డీఎంహెచ్వో కార్యాలయం ఎదురుగా ఉన్న సదరు ట్రావెల్స్ ఆఫీసులో విచారణ చేశారు. అక్కడి వారు పార్సిల్ రావడం నిజమేనని నిర్ధారించారు. ఆ పార్సిల్లో ఏమొచ్చిందో పోలీసులకు అంతుబట్టడం లేదు. అది ఖాదిర్ పంపిన విషపూరిత రసాయనం అయి ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులలో ఉన్నాయి. -కాకినాడచదవండి: బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు
వీడియోలు
బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్
నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు
నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ
కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది
మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్
బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్
కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్
అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు
పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

