‘అమ్మనా కోడలా?’.. స్టెప్పులేస్తూ.. మామ ప్రాణం తీయించింది
లక్నో: ప్రముఖ వ్యాపారి వినీత్ మనోచా హత్య కేసులో కోడలు షాలు(30) దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుఫారీ గ్యాంగ్ మనోచాను కత్తితో పొడుస్తున్న సమయంలో కోడలు షాలు బాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు తేలింది. సంబంధిత దృశ్యాలు వెలుగులోకి రాగా.. పోలీసులు విచారణలో కోడలు షాలు సైతం అంగీకరించింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారి వినీత్ మీనోచా హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కుటుంబ వ్యాపారంలో తగిన స్వేచ్ఛ లేకపోవడం, చిన్న ఖర్చులకు కూడా మామను అడగాల్సి రావడం, ఇంట్లో సీసీటీవీల ద్వారా తన కదలికలపై నిరంతరం నిఘా పెట్టడంపై కోడలు షాలు తీవ్ర కక్ష పెంచుకుంది. అర్ధరాత్రి వరకు పార్టీలకు వెళ్లనివ్వకపోవడం, ఆలస్యంగా రావడాన్ని ప్రశ్నించడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని తేలింది.పోలీసులు నిందితుల కాల్ డీటెయిల్ రికార్డ్స్ పరిశీలించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. హత్యకు ముందు కేవలం 21 రోజుల్లో మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్తో కుటుంబ సభ్యులు విపరీతంగా సంప్రదింపులు జరిపారు. కోడలు షాలు సుమారు 30 సార్లు, ఆమె భర్త సుబ్రత్ సుమారు 300 సార్లు విశాల్తో ఫోన్లో మాట్లాడారు. మొత్తం కలిపి ఈ సంఖ్య 330కి చేరింది. హత్య జరిగిన రోజు ఒక్కరోజే ఉదయం నుంచి రాత్రి వరకు షాలు, విశాల్ మధ్య ఏకంగా 14 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.జూలై 28న ఆలస్యంగా ఇంటికి వచ్చిన షాలు మామతో గొడవ పడిన తర్వాతే ఈ హత్యకు ప్లాన్ వేసింది. మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్కు రూ.6 లక్షలకు సుపారీ ఇచ్చి, ముందుగా రూ.2 లక్షలు చెల్లించి డూప్లికేట్ తాళం చెవిని అందజేసింది. పథకం ప్రకారం హత్యకు గురైన రోజు షాలు, ఆమె భర్త తమ బిడ్డతో కలిసి కాన్పూర్లోని కాస్మోజిన్ లాంజ్లో జరిగిన పార్టీకి వెళ్లారు.అక్కడ షాలు తన స్నేహితులతో కలిసి బాలీవుడ్ పాటలకు స్టెప్పులెస్తోంది. మరోవైపు మామను ఎలా హత్య చేయాలో నిందితులకు గైడెన్సీ ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో విశాల్, మరో నిందితుడు రాజ్ కిషోర్ మందులు ఇవ్వడానికి వచ్చామంటూ సెక్యూరిటీ గార్డ్ను నమ్మి లోపలికి వెళ్లారు. 63 ఏళ్ల వినీత్ మీనోచాను కత్తితో పొడిచి చంపారు.పోలీసుల అరెస్టుఅర్ధరాత్రి 3 గంటలకు షాలు దంపతులు ఇంటికి తిరిగి వచ్చేసరికి వినీత్ మీనోచా రక్తపు మడుగులో పడి ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్లు, కాల్డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, ఎన్కౌంటర్ తర్వాత నిందితులు విశాల్, రాజ్ కిషోర్లతో పాటు సూత్రధారైన కోడలు షాలును అరెస్టు చేశారు. మొదట అమాయకురాలిగా నటించినప్పటికీ, పోలీసుల విచారణలో షాలు తన నేరాన్ని అంగీకరించింది.
‘సర్దార్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సర్దార్ 2నటీనటులు: కార్తి, ఎస్.జే. సూర్య, మాళవిక మోహన్, ఆశికా రంగనాథ్, యోగిబాబు, రజిషా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్నిర్మాత: ఎస్. లక్ష్మణ్ కుమార్దర్శకత్వం: పీఎస్ మిత్రన్సంగీతం: సామ్ సి.ఎస్ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టివిడుదల తేది: సెప్టెంబర్ 10, 2026కార్తి..పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం మనవాడిగానే చూస్తారు. ఊపిరి, సత్యం సుందరం లాంటి చిత్రాలతో ఆయనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఆయన చిత్రాలన్నీ ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం సర్దార్ 2. 2022లో వచ్చిన బ్లాక్ బస్టక్ మూవీ ‘సర్దార్’కి కొనసాగింపు ఇది.నేడు(సెప్టెంబర్ 10) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ‘సర్దార్’ముంగింపే ఈ చిత్రానికి ప్రారంభం. ఇన్స్పెక్టర్ నుంచి రా ఏజెంట్గా మారిన విజయ్ ప్రకాశ్(కార్తి).. రా చీఫ్ మనోజ్ బొమ్మై (ఆశిష్ విద్యార్థి)కి తెలియకుండా ఓ రహస్య ఆపరేషన్ చేపడతాడు. అందులో భాగంగా మాజీ రా ఏజెంట్ వాల్రస్ (అచ్యుత్ కుమార్)ని కలుస్తారు. అయితే అప్పటికే ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ బ్లాక్ డగ్గర్ (ఎస్.జె.సూర్య) మనుషులను అతనిపై దాడి చేస్తారు. చనిపోయే ముందు , విజయ్ కు తన దగ్గర ఉన్న ఓ 'కీ'ని ఇస్తాడు. అలాంటి మరో కీని మరో రా ఏజెంట్ (మాళవిక మోహనన్) తన కూతురు ఫైజా (ఆషిష్ రంగనాథ్)కు ఇస్తుంది. డి.ఆర్.డి.వో. ఛీఫ్ టైగర్ హరిశ్చంద్ర (బాబు ఆంటోనీ) దగ్గర ఇంకో కీ ఉందదే విషయం తెలుస్తుంది. దానిని సంపాదిస్తే.. ఓ భారీ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని రక్షించొచ్చు అని విజయ్ భావిస్తాడు.(చదవండి: మండాడి మూవీ రివ్యూ)అయితే విజయ్ కంటే ముందే బ్లాక్ డగ్గర్ ఆ 'కీ'ని సొంతం చేసుకుని, ఈ దేశాన్ని నాశనం చేయడానికి సిద్థమవుతాడు. సరిగ్గా అదే సమయంలో రంగంలోకి దిగుతాడు సర్దార్(కార్తి). ప్రభుత్వం దృష్టిలో చైనాలో చనిపోయిన సర్ధార్ తిరిగి ఎలా వచ్చాడు? బ్లాక్ డగ్గర్ మిషన్ ఏంటి? మూడు ‘కీ’ల వెనుక ఉన్న రహస్య కథేంటి? బ్లాక్ దగ్గర్ మిషన్ని అడ్డుకునేందుకు తన కొడుకు విజయ్తో కలిసి సర్దార్ చేసిన సాహసాలేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘సర్దార్’లో నీటి సమస్యను, వన్లైన్ పైప్లైన్ ప్రాజెక్ట్ ద్వారా జరిగే కుట్రను చూపించిన దర్శకుడు.. సీక్వెల్లో యాంటి బయాటిక్ మందుల్ని మితిమీరి వాడటం వల్ల జరగబోయే అనర్థాల్ని చూపించాడు. అయితే పార్ట్ 1 మాదిరి ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో మాత్రం దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. కథ, కథనం రొటీన్గా ఉంటూ.. చాలా వరకు సర్దార్ సినిమాతో పాటు పలు స్పె యాక్షన్ సినిమాలను గుర్తుకు చేస్తాయి. తర్వాత ఏ జరుగుతుందన్న ఉత్కంఠ కూడా రేకెత్తించదు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కథను పక్కకు పెట్టి ఎక్కువగా స్టైలీష్ మీదే దృష్టిపెట్టాడు దర్శకుడు . ఫస్టాఫ్ అంతా డోకు బయోవెపన్ చుట్టే తిరుగుతుంది. దాన్ని తెరిచేందుకు మూడు తాళాలు అవసరం..వాటి కోసం హీరో ఒకవైపు.. విలన్ మరోవైపు ప్రయత్నాలు చేస్తారు. ఆయా సీన్లను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దితే బాగుండేది. కానీ చాలా సింపుల్గా, సాగదీతగా ఆ సన్నివేశాలు సాగుతాయి. ఒకానొక దశలో చిరాకు కలిగిస్తాయి కూడా. అలాగే సర్దార్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సిల్లీగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో అయినా కథనం ఉత్కంఠభరితంగా సాగుతుందా అని ఆశించిన ప్రేక్షకుడికి.. కాసేపటికే నిరాశ తప్పదు. కోటలో ఉన్న ప్రమాద కర ఆయుదాన్ని వెతికిపట్టుకునేందుకు తండ్రి,కొడుకులు ప్రయత్నించడం.. బ్లాక్ డగ్గర్ దాన్ని స్వాధీనం చేసుకొని దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించడం.. చివరిలో తండ్రి కొడుకులు కలిసి ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడం.. సెకండాఫ్ అంతా ఇలానే సాగుతుంది. చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉండడం.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడంతో సెకండాఫ్ మరింత చిరాకు పెట్టిస్తుంది. ఇక చివరిలో పార్ట్ 3 కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. అయితే అది తెరపైకి వస్తుందా లేదా అనేది చూడాలి. ఎవరెలా చేశారంటే.. కార్తి నటన గురించి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఇందులో కూడా తండ్రి కొడుకులుగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలను పోషించి మెప్పించాడు. అయితే కథ, కథనం బలంగా లేకపోవడంతో కార్తి పడిన కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయిపోయింది. ఇక విలన్గా ఎస్.జే సూర్య నటన చాలావరకు అతిగా అనిపించింది. అయితే తెరపై మాత్రం స్టైలీష్గా కనిపించాడు. మాళవిక మోహన్, ఆశికా రంగనాథ్, నాజర్, అచ్యుత్ కుమార్, ఆషిష్ విద్యార్థి యోగిబాబుతో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. సామ్ సీఎస్ బీజీఎం పర్వాలేదు. చాలా వరకు హలీవుడ్ సినిమాలను ఇమిటేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులో ఒకే ఒక పాట ఉంది. అది కూడా అంతగా ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. వాటికి ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సిందే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ
ముంబై- గోవా హైవే విస్తరణ పనులు నత్త నడకన సాగుతుండటంపై కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల ఆలస్యంపై ఇక ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పనుల్లో విపరీతమైన ఆలస్యం జరగడం పట్ల సిగ్గుపడుతున్నానని, అందుకే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను హాజరుకాబోవడం లేదని ఆయన కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. గోవాలోని పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ వద్ద ఆరు లేన్ల ఎలివేటెడ్ రోడ్డు కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు తన హెచ్చరికలను కార్యరూపంలోకి తెచ్చేందుకు, గడ్కరీ అక్టోబర్లో ముంబై నుండి గోవా వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి ఈ హైవే పనుల పూర్తి పొడవును స్వయంగా తనిఖీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆలస్యానికి, నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. తన శాఖకు ఏడు ప్రపంచ రికార్డులు ఉన్నాయి కానీ ఇపుడు ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో కాంట్రాక్టర్లను బ్లాక్లిస్ట్లో పెట్టడం, అధికారులను సస్పెండ్ చేయడంలో సరికొత్త రికార్డు సృష్టించాలనుకుంటున్నానంటూ కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అదే సమయంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యాలకు, నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని గడ్కరీ తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు మహారాష్ట్రలోని తీరప్రాంత కొంకణ్ గుండా వెళుతుంది. భూసేకరణ వివాదాలు, న్యాయపరమైన చిక్కులు, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, అటవీ శాఖ అనుమతులు లభించడంలో ఆలస్యం కావడం వంటి అంశాలు పనుల పురోగతిని దెబ్బతీశాయని గడ్కరీ వివరించారు. ప్రస్తుతం అటవీ శాఖ అనుమతుల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గడ్కరీ వివరాల ప్రకారం ఈ హైవే పనులు ప్రస్తుతం సుమారు 93-94 శాతం పూర్తయ్యాయి. గణేష్ ఉత్సవాలకు ముందే సుమారు 90-95 శాతం పనులు పూర్తయ్యాయని మహారాష్ట్ర అధికారులు అంచనా వేశారు. అలాగే చిప్లున్ బైపాస్ వర్షాకాలం తర్వాత ప్రారంభమవుతుందని, మంగావ్ బైపాస్ పనులు జనవరి 2027 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు ఉన్నాయని అంచనా. ఇటీవలి నివేదికల ప్రకారం, ముంబై-గోవా హైవే ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 16,000 కోట్లు ఖర్చు చేశారు.🚨 Union Minister Nitin Gadkari says he feels “ashamed” over the prolonged delay in widening the Mumbai–Goa Highway.- He says he will not attend the highway’s inauguration when the project is finally completed and blacklist the contractors pic.twitter.com/5R89KCHuNg— Radio India 🇮🇳 (@Radio_India_) September 10, 2026కాగా ముంబై-గోవా హైవే విస్తరణ ప్రాజెక్ట్ దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. పాత రెండు లేన్ల హైవేను నాలుగు లేన్లుగా మార్చడం ద్వారా ముంబై - గోవా మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 12 గంటల నుండి ఆరు గంటలకు తగ్గించే లక్ష్యంతో 2011లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ మొదట 2016 నాటికి పూర్తవుతుందని భావించినప్పటికీ, ఇంకా అసంపూర్తిగానే ఉంది.ఇదీ చదవండి: రూ. 2.5 లక్షల అప్పు, 19 మంది పేర్లు : సివిల్స్ విద్యార్థి ఆత్మహత్య
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే జుట్టు పెరుగుదల.. డా.స్తుతి ప్రత్యేక చికిత్స
భారతదేశంలో ప్రముఖ డెర్మటాలజిస్ట్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హెయిర్ స్పెషలిస్ట్ డా. స్తుతి ఖరే శుక్లా జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్న వారికి ఆశాకిరణంగా నిలుస్తున్నారు. ఆమెను చాలామంది ప్రేమగా 'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రత్యేక చికిత్సా విధానాలతో ఆమె దేశ, విదేశాల్లో ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు. ఆమె సెప్టెంబర్ 26, 27 తేదీల్లో హైదరాబాద్లో ఎలిమెంట్స్ ఆప్ ఏస్థటిక్స్ క్లినిక్, 2వ అంతస్తు, మెడ్9 హెల్త్ కేర్, ఇండస్ఇండ్ బ్యాంక్ పక్కన, ఫేస్ 1, కమలపురి కాలనీ, బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణ, 500073 చిరునామాలో అందుబాటులో ఉంటారు.Address: Elements of Aesthetics Clinic, 2nd Floor, Med9 Health Care, beside INDUSIND Bank, Phase 1, Kamalapuri Colony, Banjara Hills, Hyderabad, Telangana 500073హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్డా. స్తుతి రూపొందించిన ప్రత్యేకమైన.. హెయిర్ గ్రోత్ బూస్టర్ నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలకు పరిష్కారంగా నిలుస్తోంది. కేవలం 5 నిమిషాల్లో నిర్వహించే ఈ ప్రత్యేకమైన చికిత్స.. శస్త్రచికిత్సతో కలిగే నొప్పి, కోలుకునే సమయం వంటి ఇబ్బందులు లేకుండా జుట్టు పెరుగుదలకు తోడ్పడేలా రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ చికిత్స ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా ఇంటి నుంచే పొందే అవకాశం కూడా ఉంది.శస్త్రచికిత్స లేకుండా జుట్టు తిరిగి పెరిగేలా చేయడంలో ఆమె చూపిన అద్భుతమైన ఫలితాలకు గాను, డాక్టర్ స్తుతి ప్రఖ్యాత హెల్త్ కేర్ లీడర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆమె ఇటీవల సుష్మితా సేన్, సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలాలతో పాటు మిస్ యూనివర్స్ ఇండియా 2026కు జ్యూరీగా వ్యవహరించారు. ఆమె హెయిర్ కేర్ నిపుణురాలు కూడా.డెర్మటాలజీలో అంతర్జాతీయ అనుభవండా. స్తుతి ఖరే శుక్లా విద్యా, వైద్య రంగాల్లో అంతర్జాతీయ అనుభవాన్ని సంపాదించారు. ఆమె భారతదేశంలో డెర్మటాలజీలో పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో పాటు, ప్రపంచంలోని ప్రముఖ వైద్యులు, ప్రసిద్ధ ఆసుపత్రుల నుంచి నాలుగు అంతర్జాతీయ ఫెలోషిప్లు ఉన్నాయి. లాస్ ఏంజెల్స్లోని డా. జైన్ ఒబాగీ సెంటర్లో అడ్వాన్స్డ్ స్కిన్ హెల్త్ ట్రీట్మెంట్, నాష్విల్లేలోని డా. గోల్డ్ స్కిన్ కేర్ సెంటర్లో కాస్మెటిక్ డెర్మటాలజీ, సింగపూర్లోని నేషనల్ స్కిన్ సెంటర్లో డెర్మటోసర్జరీ, బ్యాంకాక్లోని సిరిరాజ్ హాస్పిటల్లో లేజర్స్కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ పొందారు.హైదరాబాద్తోపాటు ప్రధాన నగరాల్లో..అంతర్జాతీయ అనుభవాన్ని సంపాదించిన తరువాత భారత్కు తిరిగి వచ్చిన డా. స్తుతి జుట్టు పెరుగుదల చికిత్స రంగంలో తనదైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఆమె నిర్వహిస్తున్న 'ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్థెటిక్స్' క్లినిక్లు ముంబై, హైదరాబాద్, నాగ్పూర్ మొదలైన నగరాల్లో ఉన్నాయి.డాక్టర్ స్తుతి ఖరే శుక్లా.. జుట్టు పెరుగుదల చికిత్స అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్న ఎందరో రోగుల జీవితాలను ఈమె మార్చివేశారు. దీంతో చికిత్సల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం, ఆసియా తదితర ప్రాంతాల నుంచి కూడా చాలామంది సంప్రదిస్తుంటారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న రోగులకు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా చికిత్సా మార్గదర్శకాలు అందించడం సాంకేతికత ద్వారా సాధ్యమవుతోంది.బట్టతలకు చెక్బట్టతలతో బాధపడుతూ, కొన్ని సందర్భాల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కు అనుకూలంగా లేని రోగులు కూడా నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ను ఆశ్రయిస్తున్నారు. వారసత్వంగా వచ్చే జుట్టు రాలడం, తీవ్రమైన బట్టతల, అరుదైన జన్యుపరమైన జుట్టు సమస్యలు, హార్మోన్ల కారణంగా వచ్చే హెయిర్ లాస్, పీసీఓడీకు సంబంధించిన జుట్టు రాలడం వంటి వివిధ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆమె సేవలు అందిస్తున్నారు.ఒకప్పుడు బట్టతలతో.. కానీ ఇప్పుడుఅమెరికాలోని టెక్సాస్కు చెందిన హరీష్ రెడ్డి ఒకప్పుడు తీవ్రమైన బట్టతల సమస్యతో బాధపడ్డారు. జుట్టు పెరుగుదలకు గతంలో చాలా చికిత్సలు తీసుకుని నిరాశ చెందారు. కానీ స్తుతి అందించిన హెయిర్ ట్రీట్మెంట్ ద్వారా జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పు కనిపించిందని ఆయన తన అనుభవాన్ని సంతోషంగా వెల్లడించారు.డాక్టర్ స్తుతి ఖరే శుక్లా చికిత్స గురించి మరింత తెలుసుకోవడానికి, @dr.stutikhareshukla ఇన్స్టాగ్రామ్ సందర్శించండి.అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి +91 626 196 7835 నంబర్కు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ చేయవచ్చు.Instagram Page : https://instagram.com/dr.stutikhareshuklaWebsite : https://www.drstutikhareshukla.in/YouTube : https://youtube.com/@DrStutiKhareShuklaEmail : drstutikhareshukla@gmail.comDisclaimer : ఈ సమాచారాన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఏస్థటిక్స్ క్లినిక్స్ రూపొందించింది.
ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం.. మూడో టెస్ట్లోనూ పాక్కు మూడినట్టే..!
'ఐడీ కార్డులు చెక్ చేయండి.. మతాన్ని కాదు'
‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?
12 నిమిషాల్లో 97 శాతం ఛార్జ్.. BYD కొత్త టెక్నాలజీ!
మిరాకిల్.. బస్సులో పడి బతికిపోయాడు!
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
టీమిండియా బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..!
ENG vs PAK: ఫిక్సింగ్ ఆరోపణలు.. నోటీసులు జారీ!
గూగుల్ కీలక ప్రకటన.. దేశం కోసం 5 కార్యక్రమాలు!
ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
ప్రభుత్వాన్ని మూసెయ్యడం కాదయ్యా! ఓన్లీ కళాశాలలనే!
ఆ మాత్రం దానికే కరువు ప్రాంతంగా ప్రకటించ లేను!
ఎంత వెతికినా నీటి జాడ దొరకదు కానీ.. ఇక పైకి రండి
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
యూకే వీసా స్కామ్.. ‘మాస్టర్ మైండ్ అతడే’ : యూట్యూబర్ నందన
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఏసీపీ దామోదర్పై సీపీకి వల్లభనేని వంశీ లాయర్ ఫిర్యాదు
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’
సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే జుట్టు పెరుగుదల.. డా.స్తుతి ప్రత్యేక చికిత్స
ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం.. మూడో టెస్ట్లోనూ పాక్కు మూడినట్టే..!
'ఐడీ కార్డులు చెక్ చేయండి.. మతాన్ని కాదు'
‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?
12 నిమిషాల్లో 97 శాతం ఛార్జ్.. BYD కొత్త టెక్నాలజీ!
మిరాకిల్.. బస్సులో పడి బతికిపోయాడు!
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
టీమిండియా బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..!
ENG vs PAK: ఫిక్సింగ్ ఆరోపణలు.. నోటీసులు జారీ!
గూగుల్ కీలక ప్రకటన.. దేశం కోసం 5 కార్యక్రమాలు!
ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
ఇవ్వడానికి ఏమీ లేదంటే కుదరదు.. ఉన్నదివ్వాల్సిందే!!
నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
ప్రభుత్వాన్ని మూసెయ్యడం కాదయ్యా! ఓన్లీ కళాశాలలనే!
ఆ మాత్రం దానికే కరువు ప్రాంతంగా ప్రకటించ లేను!
ఎంత వెతికినా నీటి జాడ దొరకదు కానీ.. ఇక పైకి రండి
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
యూకే వీసా స్కామ్.. ‘మాస్టర్ మైండ్ అతడే’ : యూట్యూబర్ నందన
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఏసీపీ దామోదర్పై సీపీకి వల్లభనేని వంశీ లాయర్ ఫిర్యాదు
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’
సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే జుట్టు పెరుగుదల.. డా.స్తుతి ప్రత్యేక చికిత్స
ఫొటోలు
ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)
వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ లుక్స్.. షూటింగ్ ఫొటోలు వైరల్
వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)
కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)
‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)
అప్పటి కాలేజ్ లుక్.. ఇప్పటి స్టార్ హీరోయిన్స్! (ఫోటోలు)
కాఫీ కప్తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్! (ఫోటోలు)
సింపుల్ లుక్లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు
స్టార్ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్
ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్సిరీస్ (ఫొటోలు)
సినిమా
మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: మండాడినటీనటులు: సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులునిర్మాణ సంస్థ: ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్నిర్మాత:ఎల్రెడ్ కుమార్దర్శకుడు: మతిమారన్ పుగళేందిసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్సినిమాటోగ్రఫీ:ఎస్.ఆర్. కథిర్ఎడిటింగ్: ప్రదీప్ ఇ.రాఘవ్విడుదల తేది: సెప్టెంబర్ 10, 2024వైవిధ్యమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలుగు నటుడు సుహాస్ నటించిన తొలి తమిళ సినిమా మండాడి. ఇందులో ఆయన విలన్ పాత్రను పోషించగా.. కోలీవుడ్ యాక్టర్ సూరి హీరోగా నటించాడు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో టాలీవుడ్లోనూ ‘మండాడి’పై హైప్ క్రియేట్ అయింది. మరి మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేటంటంటే.. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు. ఈ సారి టీమ్లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు. రాజీ కోసం మల్లేష్ని తీసుకొని కళింగపట్నం వస్తాడు కాళి. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన ఆ ఊరిలోకి అడుగుపెడతాడు. రాజీలో భాగంగా పడవ పోటీలకు దిగుతారు. అందులో ఎవరు గెలిస్తే వాళ్లు కళింగపట్నానికి అధికారిక జట్టు, ఓడిపోయిన వాళ్లు పోర్ట్ ని వదిలివెళ్లిపోవాల్సి ఉంటుందని కండీషన్ పెడతారు. మరి ఈ పోటీలో కాళి తన కళింగ వారియర్స్ టీమ్ని ఎలా గెలిపించాడు? కాళిని ఓడించేందుకు పులి చేసిన కుట్రలు ఏంటి? అసలు కాళి ఊరి వదిలివెళ్లిపోవడానికి గల కారణం ఏంటి? ఎప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న కాళి, పులి ఇప్పుడు బద్ద శత్రువులుగా ఎలా మారారు? ఈ కథలో ఏంజిల్(మహిమా నంబియార్), మునయ్య(సత్యరాజ్)పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పడవ పోటీల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇది. దానికి స్నేహబంధాన్ని, పల్లెటూరి ఎమోషన్ని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సముద్రంలో పడవల పోటీ అనే పాయింట్ కొత్తగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న కథ, సన్నివేశాలన్నీ రొటీన్గానే ఉన్నాయి. హీరో, విలన్ ఒకప్పుడు స్నేహితులుగా ఉండడం.. ఓ కారణంగా విడిపోయి బద్ద శత్రువులుగా మారడం.. చివరకు ఇద్దరి మధ్య పోటీ జరగడం..హీరో గెలవడం.. ఇలాంటి నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ చిత్రం నేపథ్యం కూడా ఇలానే సాగుతుంది. ముగింపులో వచ్చే పడవ పోటీ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. అయితే సినిమా ప్రారంభం అయిన కాసేపటికే ప్లాష్బ్యాక్ స్టోరీతో పాటు క్లైమాక్స్ కూడా ఊహించొచ్చు. అయినప్పటికీ ఒకటి రెండు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ కథనం చాలా వరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్లో అసలు కథ ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. హీరో హైదరాబాద్ నుంచి కళింగపట్నం వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. పంచాయితీ పెట్టడం.. పడవల పోటీకి రెడీ అవ్వడం ఇవన్నీ రొటీన్గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్తో సెకండాఫ్ పూర్తిగా ఊహించొచ్చు. అయితే కథను ఊహించినా..కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే పడవల పోటీ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అలాగే ప్లాష్బ్యాక్లో సాగే కాళీ, ఏంజల్ ప్రేమ సన్నివేశాలు, కోచ్ ముని జట్టుని నడిపించే తీరు.. ఎమోషన్ కూడా ఆకట్టుకుంటుంది. ఫస్టాప్తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. ముఖ్యంగా పడవ పోటీలకు సంబంధించిన సన్నివేశాలే ఈ సినిమాకు ప్రధానబలం అని చెప్పొచ్చు. ఎవరెలా చేశారంటే.. కాళి పాత్రకి సూరి పూర్తి న్యాయం చేశాడు. ఎలాంటి ఎలివేషన్స్, హంగులు లేకుండా చాలా సింపుల్గా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. దానికి తగ్గట్లుగానే సూరి నటించాడు. యాక్షన్తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక సుహాస్ విలన్గా మెప్పించాడు. తెరపై కొత్త గెటప్లో కనిపిస్తూనే.. మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఏంజల్గా మహిమా నంబియార్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. చక్కగా నటించింది. ఇక సత్యరాజ్ కూడా మంచి పాత్రను పోషించాడు. కోచ్ మునయ్య పాత్రలో ఒదిగిపోయాడు. మల్లేష్ పాత్ర పోషించిన నటుడితో పాటు మిగిలినవారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం కథను ఎలివేట్ చేసేలా ఉంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రపీ బాగుంది. సముద్రపు సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్లో చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!
ఇటీవలే ప్రకృతిపై బాధ్యతను చాటేలా రూపొందించిన ‘సీడ్ గణేశ’ ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు సంబంధించిన ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ బాటలో విజయ్ దేవరకొండ చేరారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆయనకు ఇచ్చిన విత్తన గణపతిని ఆయనకు అందజేసింది. ఈ మేరకు ఈ వినాయక చవితిని పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించుకోవాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. ‘నగరం కలుషితం కాకుండా మట్టి లేదా విత్తన గణపతిని పూజిద్దాం. దీంతో మొక్కలు పెరుగుతాయి’ అని విజయ్ సూచించారు. మొక్కగా ఎదుగుతాయి..‘కెమెకిల్స్తో కూడిన కలర్స్తో వినాయకుడి విగ్రహాలను నిమర్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినండంతో పాటు పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో నా మిత్రుడు తెలంగాణ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్థాలు, విత్తనాలతో ‘సీడ్ గణేశ’ విగ్రహాలను రూపొందించారు. పూజ అనంతరం ఈ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అనంతరం సరైన విధంగా నీరు పోస్తూ సంరక్షిస్తే.. అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఇలా వినాయకుడిని పూజించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’ అని ఈ విగ్రహాల ప్రాముఖ్యతను గతంలో మెగాస్టార్ చిరంజీవి వివరించారు. Actor Vijay Deverakonda received a Seed Ganesha (Vittana Ganapati) from Green India Challenge team and appealed to all to celebrate Ganesh Chaturthi with eco-friendly Matti Ganapati and Vittana Ganapati.“Use safe clay and seed idols so we don’t pollute our city. After the… pic.twitter.com/NBHq2unlkK— Milagro Movies (@MilagroMovies) September 10, 2026
Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్లో ప్రచారం.. కంటెస్టెంట్పై ఫిర్యాదు
బిగ్బాస్ తెలుగు10 రియాలిటీ షోకు సంబంధించిన ఓటు ప్రచారంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఓ కంటెస్టెంట్కు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారంటూ ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డికి, కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రికి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.18 ఏళ్లు నిండిన వారికే..‘నల్గొండ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మమేకమైనట్లు కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ పాఠశాలలు విద్య కోసమే తప్పా రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారం కోసం కాదు. ఇది విద్యా వాతావరణాన్ని భంగపరచడం, పిల్లల భద్రతకు ప్రశ్నార్థకం చేయడమే. భవిష్యత్తులో పాఠశాలల్లో ఇలాంటి ప్రచారాలు జరగకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలి’ అని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారికే బిగ్ బాస్ రియాలిటీ షో ఓటింగ్ కి అర్హులను చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: వర్షిణికి వాష్రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష?
ఎవరూ ముందుకు రాలేదు.. శృతిహాసన్ పోరాడి గెలిచారు!
ఇండియన్ సినిమాలో అతి తక్కువ మంది బోల్డ్ అండ్ బ్యూటీ హీరోయిన్లలో నటి శృతిహాసన్ ఒకరిని చెప్పవచ్చు. ఈమె ఫెయిర్ నెస్, డేరింగ్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. నటి వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసినా, ఆ తరువాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు కమలహాసన్ పుత్ర రత్నం ఈ బహుముఖ ప్రతిభావంతురాలు శృతిహాసన్. గాయనిగా, సంగీత దర్శకురాలిగా, కథానాయకిగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ బ్యూటీ బహుభాషా కథానాయకి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే ఈమె సంచలన నటి ఏ విషయంలోనైనా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు.. చూస్తారు అని ఎదురు చూడటం శృతిహాసన్ నైజం కాదు. ఇందుకు చిన్న ఉదాహరణ ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాని వల్ల ప్రయోజనం ఎంత కలుగుతుందో, అదే స్థాయిలో దు్రష్పచారం జరుగుతోందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎక్కువగా సాధింపులకు గురౌతున్నారు. ఇక సినిమా రంగంలో కథానాయికలు డీఫేమ్ చర్యలతో మానసిక వేదనకు గురౌతున్నారు. తమ ప్రమేయం లేకుండానే తమ రూపాలు, వ్యాఖ్యలను మార్పింగ్ చేస్తున్నారు. దీంతో మనోవేదనకు గురౌతున్న పలువురు నటీమణులు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారే కానీ ఎవరూ కార్యాచరణకు ముందడుగు వేయడం లేదు. అయితే నటి శృతిహాసన్ మాత్రం ధైర్యంగా ముందడుగు వేసి ఏఐ టెక్నాలజీతో మహిళలను డీఫేమ్ చేస్తున్న వారికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి గెలిచారు. ఏఐ టెక్నాలజీతో అక్రమాలకు పాల్పడే చర్యలపై ఇటీవల ముంబై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు నటి శృతిహాసన్ చాలా మందికి రోల్ మోడల్ అయిపోయారు. సినీ ఇండస్ట్రీలో చాలా మందికి మార్గదర్శిగా నిలిచారని ప్రశంసలను అందుకున్నారు.
క్రీడలు
దంచికొట్టిన డుప్లెసిస్.. లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు..!
యూరపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఆరంభ ఎడిషన్లో (2026) సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ (42) చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో రోట్టర్డామ్ డాకర్స్కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 అర్ద సెంచరీల సాయంతో 300కు పైగా పరుగులు చేశాడు. తద్వారా ఈ టోర్నీలో 300 పరుగుల మార్కును దాటిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు.గ్లాస్గో కాస్మిక్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో డుప్లెసిస్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతడి జట్టు 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డుప్లెసిస్తో పాటు ఓపెనింగ్ చేసిన రస్సీ వాన్ డర్ డస్సెన్ డకౌట్ కాగా.. మైఖేల్ లెవిట్ 19, విక్రమ్జిత్ సింగ్ 33, హెన్రిచ్ క్లాసెన్ 30 (నాటౌట్), డేవిడ్ వీస్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఖర్లో క్లాసెన్ బ్యాట్ ఝులిపించాడు (3 సిక్సర్లు). కాస్మిక్ బౌలర్లలో తైమాల్ మిల్స్ 2, డేవిడ్సన్, లివింగ్స్టోన్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను తలో 19 ఓవర్లకు కుదించారు.కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోట్టర్డామ్ డాకర్స్ నాలుగు, గ్లాస్గో కాస్మిక్ చివరి స్థానంలో ఉన్నాయి. ఎడిన్బర్గ్ కాసిల్ రాకర్స్ టాప్ ప్లేస్లో ఉండగా.. ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్, బెల్ఫాస్ట్ వోల్వ్స్, డబ్లిన్ గార్డియన్స్ రెండు, మూడు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఫిన్ అలెన్కు జాక్పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు
ఒక్క పరుగు ఇవ్వకుండానే మూడు వికెట్లు
టీమిండియా స్టార్ మానవ్ సుతార్ అదరగొట్టాడు. వార్విక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు గ్లామోర్గాన్తో మ్యాచ్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే మానవ్ సుతార్ మూడు వికెట్లు పడగొట్టాడు.అరంగేట్రంలోనే అదుర్స్కాగా రాజస్తాన్కు చెందిన 24 ఏళ్ల మానవ్ సుతార్ ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అఫ్గానిస్తాన్తో స్వదేశంలో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్లో ఏడు వికెట్లు తీసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీలంకతో ఇటీవల జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ సత్తా చాటాడు.ఇప్పటికి మొత్తంగా మూడు టెస్టులు ఆడిన మానవ్ సుతార్ 23 వికెట్లు పడగొట్టడంతో పాటు.. 79 పరుగులు సాధించాడు. ఇక శ్రీలంక పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన మానవ్.. కౌంటీ చాంపియన్షిప్ -2026 ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లాడు. వార్విక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు గ్లామోర్గాన్తో మ్యాచ్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.69 పరుగులకే ఆలౌట్ఇరుజట్ల మధ్య కార్టిఫ్లో మంగళవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గ్లామోర్గాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 69 పరుగులకే కుప్పకూలింది. వార్విక్షైర్ బౌలర్లలో ఇథాన్ బాంబర్ ఐదు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ ఎడ్ బర్నార్డ్ మూడు వికెట్లు కూల్చాడు. మానవ్ సుతార్, ఒలివిర్ హనాన్ డాల్బీ చెరో వికెట్ పడగొట్టారు.ఈసారి 65 పరుగులకే కుప్పకూలిందిఅనంతరం వార్విక్షైర్ తమ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో గ్లామెర్గాన్ కంటే 322 పరుగుల ఆధిక్యం సంపాదించిన వార్విక్షైర్.. గ్లామెర్గాన్ను ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో మరోసారి బ్యాటర్లు విఫలం కావడంతో గ్లామోర్గాన్ 65 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా వార్విక్షైర్ ఇన్నింగ్స్ 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.వార్విక్షైర్ బౌలర్లలో కెప్టెన్ ఎడ్ బార్నార్డ్ ఈసారి ఐదు వికెట్లు కూల్చగా.. మానవ్ సుతార్, ఒలివర్ తలా రెండు.. క్రిస్ వోక్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో మానవ్ సుతార్ మొత్తంగా 2.3 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క పరుగు ఇవ్వకుండానే మూడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్What a spell 🪄🐻 #YouBears pic.twitter.com/uEnQTrFixs— Bears (@WarwickshireCCC) September 9, 2026
ఫిన్ అలెన్కు జాక్పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు
న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ జాక్పాట్ కొట్టాడు. బిగ్బాష్ లీగ్లో అతడికి భారీ మొత్తం లభించనుంది. మెల్బోర్న్ స్టార్స్తో మూడేళ్ల ఒప్పందం చేసుకున్న అలెన్.. తొలి సీజన్లోనే కనీసం 6 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు అందుకోనున్నాడు. బిగ్బాష్ లీగ్ చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన కాంట్రాక్ట్.కొద్ది రోజుల ముందే ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అడిలైడ్ స్ట్రయికర్స్తో 5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లకు (ఏడాది కాంట్రాక్ట్) ఒప్పందం చేసుకొని, బిగ్బాష్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా అలెన్ స్టోక్స్ రికార్డును బద్దలు కొట్టాడు.27 ఫిన్ అలెన్కు ఫ్రాంచైజీ క్రికెట్లో విధ్వంసకర వీరుడిగా పేరుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని లీగ్ల్లో అతడు మెరుపులు మెరిపించాడు. అలెన్ ఖాతాలో ఇప్పటికే 7 టీ20 సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది అలెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బీబీఎల్లోనే పెర్త్ స్కార్చర్స్ తరఫున సుడిగాలి శతకం బాదాడు. అలాగే మేజర్ లీగ్ క్రికెట్లో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే శతక్కొట్టి, పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. గత ఎడిషన్ ఐపీఎల్లోనూ అదరగొట్టాడు. కేకేఆర్ తరఫున 11 మ్యాచ్ల్లో 214.11 స్ట్రైక్రేట్తో 349 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై 47 బంతుల్లోనే సెంచరీ చేయడంతో పాటు.. గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లో 93 పరుగులు చేశాడు. మెల్బోర్న్ స్టార్స్ జట్టులో అలెన్తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, పీటర్ సిడిల్ వంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా ఉన్నారు.మెల్బోర్న్ స్టార్స్ జట్టు..ఫిన్ అలెన్, ఆస్టిన్ అన్లెజార్క్, హిల్టన్ కార్ట్రైట్, సామ్ హార్పర్, లియామ్ హ్యాచర్, క్యాంప్బెల్ కెల్లవే, గ్లెన్ మ్యాక్స్వెల్, టాడ్ మర్ఫీ, టామ్ రోజర్స్, పీటర్ సిడిల్, మార్కస్ స్టోయినిస్, మిచ్ స్వెప్సన్.చదవండి: గెలుపు జోష్లో హల్చల్ చేసిన ఇషాన్, వైభవ్
ODI WC 2027: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడా? లేదా?... ఇప్పటికీ ఈ విషయంపై స్పష్టత రాలేదు. భారత జట్టును 2023లో వన్డే వరల్డ్కప్ ఫైనల్కు చేర్చిన ఈ లెజెండరీ బ్యాటర్.. 2025లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.అయితే, అనూహ్య రీతిలో చాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు వన్డే పగ్గాలు అప్పగించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్.. వన్డే జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కానీ గత కొంతకాలంగా రోహిత్ వన్డే రిటైర్మెంట్పై కూడా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు.. అతడు 2027 వరల్డ్కప్ ఆడతాడని తమకు కచ్చితంగా చెప్పలేదంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో రోహిత్ శర్మ.. ‘non-committal?’ (నిబద్ధత లేదా అన్న అర్థంలో) అనే అక్షరాలు రాసి ఉన్న టీ-షర్టు ధరించడం వైరల్గా మారింది. జట్టు తరఫున ఆడేందుకు తాను పూర్తి నిబద్ధతో ఉన్నానని హిట్మ్యాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.ఇటీవల ఇంగ్లండ్లో జరిగిన లార్డ్స్ వన్డే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో చివరి మ్యాచ్ అనే ప్రచారం జరుగగా.. బ్యాట్తోనే హిట్మ్యాన్ ఇందుకు సమాధానం ఇచ్చాడు. ప్రఖ్యాత లార్డ్స్లో శతక్కొట్టి మరీ.. విమర్శకుల నోళ్లు మూయించాడు. అయితే, సెలక్టర్లే లీకులు ఇచ్చి మరీ ఈ వదంతులు వ్యాప్తి చేయించారన్న వార్తలు వచ్చాయి.ఇలాంటి తరుణంలో రోహిత్ ఇలాంటి టీ షర్టు ధరించడం విశేషం. ఇదిలా ఉంటే.. గురువారం నాటి ఈవెంట్లో ఓ ప్రేక్షకుడు.. ‘మీరు వన్డే వరల్డ్కప్-2027 ఆడతారా?’ అన్న ప్రశ్న అడుగగా.. ‘‘అక్టోబరు 2027కు ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం’’ అని 39 ఏళ్ల రోహిత్ శర్మ బదులిచ్చాడు. కాగా సౌతాఫ్రికా-జింబాబ్వే- నమీబియా వన్డే వరల్డ్కప్ తాజా ఎడిషన్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. Aa raha hai Hitman! 🤩Family Full House With Rohit Sharma!Shuru ho raha hai 19th September se raat 9:30 baje, sirf #SonyEntertainmentTelevision aur Sony LIV par.@ImRo45 #RohitSharma #FamilyFullHouse #ComingSoon #SonyTV pic.twitter.com/HIaw43il3d— sonytv (@SonyTV) September 8, 2026
న్యూస్ పాడ్కాస్ట్
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
బిజినెస్
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్
గురువారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 138.37 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 74,902.59 వద్ద, నిఫ్టీ 46.30 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,477.80 వద్ద నిలిచాయి.స్వాన్ కార్ప్ లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సాయి లైఫ్ సైన్స్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కొత్త ఫొటోకు.. పాత లుక్: ChatGPTతో ఇలా..
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటుంది. వాటిలో కొన్ని ట్రెండ్స్ కొద్దిరోజుల్లోనే మాయమైపోతాయి. మరికొన్ని మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ట్రెండ్స్లో ఒకటి 1980ల ఏఐ ఫొటో ట్రెండ్. ఈ ట్రెండ్లో ఇప్పటి యువత తమ ఫొటోలను 1980ల కాలం నాటి వింటేజ్ ఫొటోలుగా మార్చుకుంటున్నారు. ఇప్పుడివే నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.1980ల కాలం అంటే ఓ ప్రత్యేకమైన ఫ్యాషన్, హెయిర్స్టైల్స్, రంగురంగుల దుస్తులు, పెద్ద ఆభరణాలు, సాఫ్ట్ లైటింగ్, ఫిల్మ్ కెమెరా ఫొటోలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఏఐ సహాయంతో మన ఫొటోలను కూడా అదే కాలానికి చెందినవిగా మార్చుకోవచ్చు. దీంతో మనం అప్పటి కాలంలో ఎలా కనిపించేవాళ్లమో ఊహించుకోవచ్చు.సాధారణంగా వింటేజ్ ఫిల్టర్లు ఫొటోలోని రంగులు, కాంట్రాస్ట్ లేదా లైటింగ్ను మాత్రమే మారుస్తాయి. కానీ.. ఏఐ వింటేజ్ ట్రెండ్లో మాత్రం ఊహించినదాని కంటే ఎక్కువ మార్పులు చేస్తుంది. ఫోటోలను అందంగా రూపొందిస్తోంది.ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. మన ముఖాన్ని వీలైనంత వరకు అలాగే ఉంచి, ఆ కాలానికి సరిపోయే హెయిర్స్టైల్, దుస్తులు, ఆభరణాలు, బ్యాక్గ్రౌండ్, లైటింగ్ను మారుస్తుందన్నమాట. ఫొటోకు పాతకాలపు ఫిల్మ్ కెమెరా లుక్, గ్రెయిన్, కలర్ టోన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సరైన ప్రాంప్ట్ ఇవ్వడం చాలా అవసరం.చాట్జీపీటీలో 1980ల ఫొటో ఎలా తయారు చేసుకోవాలి?➤ముందుగా మీ మొబైల్లో చాట్జీపీటీ ఓపెన్ చేయండి.➤కొత్త చాట్ను ప్రారంభించి, మీకు నచ్చిన మంచి క్వాలిటీ ఫొటోను అప్లోడ్ చేయండి.➤ఆ తర్వాత, మీ ఫొటోను 1980ల కాలంలో తీసిన ఫొటోలాగా మార్చమని చాట్జీపీటీని అడగండి.➤ఫొటో ఎలా ఉండాలో స్పష్టంగా చెప్పండి. ఉదాహరణకు1980ల నాటి హెయిర్స్టైల్అప్పటి కాలానికి సరిపోయే రంగురంగుల దుస్తులువింటేజ్ ఆభరణాలుపాతకాలపు బ్యాక్గ్రౌండ్సాఫ్ట్ లైటింగ్పాత ఫిల్మ్ కెమెరా లాంటి ఫిల్మ్ గ్రెయిన్, టెక్స్చర్➤మీకు కావాల్సిన ప్రత్యేకమైన స్టైల్ను కూడా చెప్పవచ్చు. ఉదాహరణకుపాత బాలీవుడ్ స్టూడియో పోర్ట్రెయిట్పాతకాలపు ఫ్యామిలీ ఆల్బమ్ ఫొటోకాలేజ్ ఫొటోవింటేజ్ మ్యాగజైన్ షూట్మొదట వచ్చిన ఫొటో మీకు నచ్చకపోతే, మళ్లీ సూచనలు ఇచ్చి హెయిర్స్టైల్, దుస్తులు, లైటింగ్ లేదా ఫిల్మ్ టెక్స్చర్లో మార్పులు చేయమని అడగవచ్చు. ఇలా మీకు నచ్చిన విధంగా మీ ఫోటోను రెడీ చేసుకోవచ్చు.
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్.. కెమెరాలో అదిరిపోయే మార్పులు!
ప్రీమియం ఫోన్ మేకర్ యాపిల్ తన కొత్త ప్రో సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పేరుతో వచ్చిన ఈ రెండు మోడళ్లలో కెమెరా, పనితీరు, బ్యాటరీ, ఏఐ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తాజాగా జరిగిన యాపిల్ ఈవెంట్లో వీటిని ఆవిష్కరించగా.. భారత్లో ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి, సాధారణ విక్రయాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి.వేరియబుల్ అపెర్చర్తో 48MP కెమెరాఐఫోన్ 18 ప్రో సిరీస్లో అతిపెద్ద అప్గ్రేడ్ కెమెరా విభాగంలో కనిపిస్తుంది. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరాకు తొలిసారిగా ‘మెకానికల్ వేరియబుల్ అపెర్చర్’ను యాపిల్ తీసుకొచ్చింది. దీంతో పరిస్థితులకు అనుగుణంగా కాంతి ప్రవేశాన్ని మార్చడంతో పాటు ఫొటోల్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్పై ఎక్కువ నియంత్రణ లభిస్తుంది. తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.మెయిన్ కెమెరాతో పాటు 48MP అల్ట్రా వైడ్, 48MP టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. 8x వరకు ఆప్టికల్-క్వాలిటీ జూమ్, 40x వరకు డిజిటల్ జూమ్ లభిస్తుంది. కెమెరా యాప్లో అపెర్చర్, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్, హిస్టోగ్రామ్ వంటి ప్రొఫెషనల్ కంట్రోల్స్ను కూడా వినియోగదారులు మార్చుకోవచ్చు.వీడియో విషయానికి వస్తే 4K డాల్బీ విజన్ను 120fps వరకు రికార్డ్ చేయొచ్చు. 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరాను కూడా యాపిల్ అందించింది.ఫొటోలు నిజమైనవో.. మార్చినవో గుర్తించే టెక్నాలజీఐఫోన్ 18 ప్రోలో Apple Reference Image అనే కొత్త ఫీచర్ను యాపిల్ ప్రవేశపెట్టింది. కెమెరా నుంచి వచ్చిన పిక్సెల్ డేటాకు క్రిప్టోగ్రాఫిక్ సిగ్నేచర్ జతచేసి, అసలు చిత్రానికి సంబంధించిన రిఫరెన్స్ను భద్రపరచే విధంగా దీనిని రూపొందించారు. దీంతో ఫొటోపై తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయో గుర్తించడంలో సహాయపడుతుంది. AI ద్వారా రూపొందించిన లేదా మార్చిన చిత్రాలను గుర్తించే విధంగా SynthID సపోర్ట్ను కూడా యాపిల్ ప్రకటించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ఫీచర్ల లభ్యత భిన్నంగా ఉండొచ్చు.A20 ప్రో చిప్రెండు కొత్త ప్రో మోడళ్లలోనూ A20 Pro చిప్ ఉంటుంది. 2nm ప్రాసెస్పై తయారైన ఈ చిప్లో సిక్స్-కోర్ CPU, న్యూరల్ యాక్సిలరేటర్లతో ఏడు-కోర్ GPU, డ్యూయల్ 16-కోర్ Neural Engine ఉన్నాయి. హార్డ్వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ కూడా అందుబాటులో ఉంది. మెరుగైన పనితీరును కొనసాగించేందుకు కొత్త తరం ‘వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్’ను కూడా యాపిల్ తీసుకొచ్చింది. A20 Pro, కొత్త థర్మల్ డిజైన్ కలయికతో ఐఫోన్ చరిత్రలోనే అత్యుత్తమ స్థిరమైన పనితీరును అందిస్తామని కంపెనీ పేర్కొంది.కొత్త కనెక్టివిటీ చిప్స్వైర్లెస్ కనెక్టివిటీ కోసం కొత్త N1 చిప్ను ఉపయోగించారు. ఇది Wi-Fi 7, Bluetooth 6, Thread నెట్వర్కింగ్కు మద్దతు ఇస్తుంది. సెల్యులార్ కనెక్టివిటీ కోసం యాపిల్ రూపొందించిన C2 మోడెమ్ ఉంది.120Hz డిస్ప్లే.. చిన్నదైన డైనమిక్ ఐలండ్ఐఫోన్ 18 ప్రోలో 6.3 అంగుళాల, ప్రో మ్యాక్స్లో 6.9 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ OLED డిస్ప్లేలు ఉన్నాయి. రెండింటిలోనూ 120Hz వరకు ప్రోమోషన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, డైనమిక్ ఐలండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈసారి డైనమిక్ ఐలండ్ పరిమాణాన్ని తగ్గిస్తూ మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దినట్లు యాపిల్ తెలిపింది. ఒకేసారి మూడు లైవ్ యాక్టివిటీస్ను ప్రదర్శించే సామర్థ్యం కూడా ఉంది.43 గంటల వరకు బ్యాటరీబ్యాటరీ సామర్థ్యాన్ని పెంచేందుకు అంతర్గత డిజైన్లో మార్పులు చేశారు. ముఖ్యంగా eSIM-ఓన్లీ వేరియంట్లలో సిమ్ ట్రే కోసం ఉపయోగించే స్థలాన్ని పెద్ద బ్యాటరీకి కేటాయించగలిగారు. యాపిల్ ప్రకారం ఐఫోన్ 18 ప్రోలో 34 గంటల వరకు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో 43 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లభిస్తుంది. MagSafe, Qi2 వైర్లెస్ ఛార్జింగ్తో పాటు USB-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. 60W లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అడాప్టర్తో సుమారు 15 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.iOS 27తో AI ఫీచర్లుకొత్త ప్రో మోడళ్లు iOS 27తో వస్తాయి. యాపిల్ ఇంటెలిజెన్స్లో భాగంగా మెరుగైన సిరి ఏఐ, స్క్రీన్పై కనిపిస్తున్న సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం, యాప్ల మధ్య సందర్భాన్ని కొనసాగించే ఫీచర్లు, కెమెరా ఆధారిత విశ్లేషణ వంటి కొత్త సామర్థ్యాలను యాపిల్ అందిస్తోంది.భారత్లో ధరలు ఇవేఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB ధర రూ.1,89,900, 1TB ధర రూ.2,39,900, 2TB ధర రూ.3,14,900.ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,79,900. 512GB రూ.2,04,900, 1TB రూ.2,54,900, 2TB రూ.3,29,900గా ఉన్నాయి.బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, కొత్త బర్గండీ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. భారత్లో సెప్టెంబర్ 12న సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు మొదలవుతాయి.ఇదీ చదవండి: ఐఫోన్ ధరలు.. ఈ దేశాల్లో కాస్త చౌక!
బొజ్జ గణపయ్య.. బిలియనీర్ సీక్రెట్స్!
విఘ్నాలను తొలగించి, విజయాన్ని ప్రసాదించే లంబోదరుడి ఆగమనం ప్రతి ఇంటా సంతోషాలను అందిస్తుంది. బొజ్జ గణపయ్య రూపం కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాదు.. అందులో లోతైన జీవిత సత్యాలతో పాటు క్రమశిక్షణతో కూడిన పర్సనల్ ఫైనాన్స్ సూత్రాలు నిగూఢమై ఉన్నాయి. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి అనే చందంగా, ఆర్థిక కష్టాలు దరిచేరక ముందే జాగ్రత్త పడటానికి వినాయకుడి శారీరక లక్షణాలు అద్భుతమైన మార్గదర్శకాలుగా నిలుస్తాయి.పెద్ద తల.. విస్తృత ఆలోచనగజాననుడి పెద్ద తల సుదూర ఆలోచనకు ప్రతీక. ఆర్థిక జీవితంలో కూడా స్వల్పకాలిక లాభాలకే పరిమితం కాకుండా దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించుకోవాలి. రూపాయి పొదుపు – వంద రూపాయిల ఆదాయం అనే రీతిలో కష్టపడి సంపాదించిన సొమ్మును కాంపౌండింగ్ పవర్ ద్వారా దీర్ఘ కాలంలో సంపదగా మార్చడానికి ఇది పునాది వేస్తుంది.చిన్న కళ్లు.. సూక్ష్మ పరిశీలనగణపతి చిన్న కళ్లు దేనినైనా లోతుగా, సూక్ష్మంగా పరిశీలించడాన్ని సూచిస్తాయి. మార్కెట్లో కనిపించే మెరుపులన్నీ బంగారం కావు. పక్కవారి మాటలు విని గుడ్డిగా పెట్టుబడులు పెట్టకూడదు. ఏదైనా పథకంలో లేదా షేర్లలో ఇన్వెస్ట్ చేసే ముందు దాని రిస్క్, రాబడిని నిశితంగా విశ్లేషించాలి.పెద్ద చెవులు.. శ్రద్ధగా వినడంఏనుగు చెవుల వలే పెద్దగా ఉండే వినాయకుని చెవులు మనకు అవసరమైన అంశాలను శ్రద్ధగా వినాలని నేర్పుతాయి. పర్సనల్ ఫైనాన్స్లో మార్కెట్ వార్తలు, ఆర్థిక నిపుణుల సలహాలు జాగ్రత్తగా వినాలి. మంచి చెడులను బేరీజు వేసి మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలి.తొండం.. అనుకూలతతొండం ఫ్లెక్సిబిలిటీకి ప్రతీక. భారీ వృక్షాలను కూల్చగలదు.. అలాగే చిన్న గడ్డిపరకను కూడా సున్నితంగా పట్టుకోగలదు. అన్ని గుడ్లను ఒకే గంపలో పెట్టకూడదు అనే సామెతలాగా, మన పెట్టుబడులను ఈక్విటీలు, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి వివిధ రకాల ఆస్తుల్లో విభజించాలి (డైవర్సిఫికేషన్). ఇది అత్యవసర సమయాల్లో ఆర్థిక రక్షణను ఇస్తుంది.పెద్ద బొజ్జ.. ఆర్థిక క్రమశిక్షణగణనాథుడి లంబోదరం అన్ని మంచి చెడులను మింగి జీర్ణించుకునే శక్తికి సంకేతం. మన ఆర్థిక ప్రయాణంలో ఎదురయ్యే ఆకస్మిక నష్టాలు, ఆర్థిక అత్యవసర పరిస్థితులు (ఉద్యోగం పోవడం, వైద్య ఖర్చులు) తట్టుకోవడానికి తగినంత అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) ఏర్పాటు చేసుకోవాలి.చిన్న ఎలుక.. ఖర్చులపై నియంత్రణభారీ ఆకారం ఉన్న గణనాథుడు చిన్న మూషికాన్ని వాహనంగా ఉపయోగిస్తాడు. అంటే ఎంతటి భారీ ఆదాయం ఉన్నా చిన్న ఆశలను, అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలని ఇది సూచిస్తుంది. ఆదాయం చూసి ఖర్చు చేయాలి అన్నట్లుగా చిన్న అప్పులు లేదా అనవసరపు ఖర్చులు సుడిగుండాల్లా మారి సంపదను దెబ్బతీయకుండా చూసుకోవాలి.ఇదీ చదవండి: ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్.. కెమెరాలో అదిరిపోయే మార్పులు!
ఫ్యామిలీ
సంతానం.. క్షేమం కోసం పోలాల అమావాస్య పూజ
సంతానం లేనివారు సంతానం కలిగే వరకు పరితపిస్తూనే ఉంటే, సంతానం ఉన్నవారు తమ పిల్లలకు ఎటువంటి అంటువ్యాధులు, రోగాలు రాకుండా ఉండాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేసే వ్రతమే పొలాల అమావాస్య వ్రతం. శ్రావణ బహుళ అమావాస్య నాడు చేసే ఈ వ్రతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఉద్దేశంతో... ఒక్కోవిధంగా చేస్తారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో పశువులను పూజిస్తే మరికొన్ని తాలలో కంద మొక్కను పూజించి, కలగలపు పులుసు చేసుకుని తింటారు.రేపు పోలాల అమావాస్య సందర్భంగా ఆ వ్రత విధానం ...పూజకు పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, పండ్లు. దీపారాధన కుందులు, నూనె/నెయ్యి, వత్తులు, అగరు బత్తీలు, కర్పూరం సిద్ధం చేసుకోవాలి. మరీ ముఖ్యమైనవి: కంద మొక్క (లేదా కంద పిలక), తోరాలు (పసుపు రాసి, పసుపు కొమ్ములు కట్టిన దారాలు). నైవేద్యం: పూర్ణం బూరెలు, 9 రకాల కూరగాయలతో చేసిన కలగాయ కూర/పులుసు. పూజ చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, పీటపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్నిపరచాలి. దానిపై కంద మొక్కను ఉంచి మంగళగౌరీ దేవి లేదా పోలేరమ్మ తల్లిగా భావించాలి.గణపతి ప్రార్థన: ఏ పూజ అయినా విఘ్నాలు లేకుండా సాగడానికి ముందుగా వినాయకుడిని మనసు లో స్మరించుకోవాలి.‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ‘దీపారాధన: దీపాలను వెలిగించి, దానికి పసుపు, కుంకుమలు పెట్టాలి. ‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా’ అంటూ మూడుసార్లు నీటిని తీసుకోవాలి. ప్రధాన పూజ – తోర పూజ కంద మొక్కకు పసుపు, కుంకుమలు పెట్టి, పూలతో అలంకరించాలి. అమ్మవారిని షోడశోపచారాలతో (ధ్యానం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాలు) పూజించాలి. తోర పూజ: పసుపు కొమ్ములు కట్టిన తోరాలను (దారాలను) అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించాలి. తోరం కట్టుకునేటప్పుడు ‘పోలాయ నమస్తుభ్యం సర్వ సౌభాగ్యదాయిని... పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం బధ్నామి తవ తోరకమ్’ అని భక్తి శ్రద్ధలతో చదువుతూ తోరం కట్టుకోవాలి. ‘నైవేద్యం: తయారు చేసుకున్న పూర్ణం బూరెలు, కలగాయ (ఇరుగు పొరుగు ఇళ్లనుంచి సేకరించిన లేదా స్వయంగా సమకూర్చుకున్న రకరకాల కూరగాయలతో చేసిన పులుసు)ను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పోలాల అమావాస్య వ్రత కథ. (ఈ కథను కూడా ఒక్కో ్ర΄ాంతంలో ఒక్కో విధంగా చెప్పుకుంటారు. అధిక ప్రాచుర్యం పొందిన కథలలో ఇదొకటి) పూజ పూర్తయిన తర్వాత చేతిలో అక్షతలు, పూలు పట్టుకుని ఈ కింది కథను భక్తితో చదువుకోవాలి లేదా వినాలి. వ్రతకథ: పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. వారందరికీ వివాహాలై, పిల్లలు కలిగారు. అయితే అందరికంటే చిన్నవాడి భార్యకు పుట్టిన పిల్లలందరూ పుట్టిన వెంటనే చనిపోతుండేవారు. ప్రతి ఏటా శ్రావణ లేదా భాద్రపద అమావాస్య రోజున పెద్దకోడళ్లు అందరూ కలిసి ఎంతో వైభవంగా పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించేవారు. కానీ చిన్నకోడలికి పిల్లలు చనిపోతుండటం వల్ల, ఆమెను సూతకం (మైల) కారణంతో పూజకు రానిచ్చేవారు కాదు. ఒక సంవత్సరం అమావాస్య నాడే చిన్నకోడలికి మళ్లీ బాబు పుట్టాడు, కానీ ఆ బాబు కూడా వెంటనే చనిపోయాడు. ఆ దుఃఖాన్ని భరించలేక, పూజకు ఆటంకం కలుగుతుందనే భయంతో ఆమె ఆ చనిపోయిన బిడ్డను ఎవరికీ చెప్పకుండా గదిలో ఒక చాట కింద దాచిపెట్టింది. తోడికోడళ్లు పూజ ముగించుకుని, కందమొక్కకు కట్టిన తోరాలను చిన్నకోడలికి ఇవ్వడానికి వచ్చారు. ఆమె తోరాన్ని తీసుకుని, మనసులో ఎంతో బాధపడుతూ గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లిని మనసారా ప్రార్థించింది. అనంతరం చిన్నకోడలు చనిపోయిన తన బిడ్డను ఎత్తుకుని ఎవరికీ తెలియకుండా ఊరి చివర ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్లి, దేవత పాదాల చెంత బిడ్డను ఉంచి బోరున విలపించింది. ఆమె నిష్కల్మషమైన భక్తికి, మాతృత్వపు వేదనకు కరిగిపోయిన పోలేరమ్మ తల్లి ప్రత్యక్షమైంది. తన అమృత హస్తంతో ఆ చనిపోయిన బాలుడిని తాకగానే, ఆ బిడ్డ ప్రాణాలతో లేచి బోసినవ్వులు నవ్వాడు. అంతేకాకుండా, గతంలో చనిపోయిన ఆమె మిగతా పిల్లలందరినీ కూడా అమ్మవారు బతికించి ఆమెకు అప్పగించింది. తన పిల్లలందరితో కలిసి చిన్నకోడలు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె భక్తిని చూసి ఊరివారంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి సంతాన రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని నిష్టగా చేయడం ప్రారంభించారు. ఉద్యాపన లేదా ముగింపుకథ పూర్తయిన తర్వాత చేతిలోని అక్షతలను తలపై వేసుకోవాలి. పూజించిన తోరాలను తీసుకుని తల్లి తన పిల్లల కుడి చేతికి కట్టాలి. ఆ తర్వాత ముత్తయిదువులకు వాయనాలు (తాంబూలం, బూరెలు) ఇచ్చి, పెద్దల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. దీనితో వ్రతం సంపూర్ణమవుతుంది. ఆ తర్వాత యథాశక్తి దాన ధర్మాలు చేయాలి. పూజించిన కంద మొక్కను ఏం చేయాలి?ఈ వ్రతంలో పూజించిన కంద మొక్కను ΄ోలాల అమావాస్య మరుసటి రోజు ఇంటి ఆవరణలో కానీ, పూల కుండీల్లో కానీ నాటాలి. ప్రతిరోజూ నీళ్లు ΄ోస్తూ మొక్కను సంరక్షించాలి. కొద్ది రోజులకు ఈ మొక్క పక్కనే మరికొన్ని పిలకలు వస్తాయి. అలా రావడం శుభసూచకం. కంద మొక్కకు పిలకలు వస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అప్పటికే సంతానం ఉన్నవారికి వారి సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుందని ప్రతీతి. – పి.సాయికృష్ణ ప్రణతి(చదవండి: అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!)
అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు విద్యారంగానికి భారీ విరాళం అందించారు. టెక్సాస్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్కు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు ఏకంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.167 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళం అందించిన అనురాధ, వికాస్ సిన్హా దంపతుల పేరుతోనే కొత్త కాలేజీకి ‘అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్’ అని పేరు పెట్టనున్నారు.AI, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విద్య, పరిశోధనలకు ఈ కాలేజీ కేంద్రంగా పనిచేయనుంది. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ సైన్స్, లెర్నింగ్ టెక్నాలజీస్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ కాలేజీ ఉపయోగపడుతుందని వర్సిటీ అధ్యక్షుడు హారిసన్ కెల్లర్ తెలిపారు.ఈ విరాళంతో కాలేజీ నాయకత్వం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ప్రొఫెసర్షిప్లు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతుగా ఆరు శాశ్వత ఎండోమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే *అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్*ను కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇది వర్సిటీలోని వివిధ విభాగాల మధ్య AI, డేటా సైన్స్ పరిశోధనలకు సమన్వయం చేస్తూ పరిశ్రమలతో భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనుంది.చదువు కోసం అమెరికాకు.. ఇప్పుడు భారీ విరాళంవికాస్, అనురాధ ఇద్దరూ భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. వికాస్ సిన్హా నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీలోనూ చదివి, 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచే పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాడ్కామ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు.సిన్హా దంపతులు ఇప్పటికే UNTకు పలు సందర్భాల్లో భారీగా అండగా నిలిచారు. 2024లో వారు అందించిన విరాళంతో అనురాధ అండ్ వికాస్ సిన్హా డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, అధ్యాపకులు, పరిశోధనలకు మద్దతుగా ఎండోమెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదికే మరో భారీ విరాళంతో సిన్హా ఇన్నోవేషన్ ల్యాబ్ ఫర్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు.“మాకు ఈ విరాళం అంటే అవకాశాన్ని మరో తరానికి అందించడం. వలస వచ్చినవారు అమెరికన్ డ్రీమ్లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. దాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్య మా జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరికొందరికి తెరిచి ఉంచాలనుకుంటున్నాం” అని వికాస్ సిన్హా తెలిపారు.AI, డేటా ఆధారంగా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్త తరం విద్యార్థులను అందుకు సిద్ధం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం ఈ కొత్త కాలేజీ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!)
జీర్ణించుకోలేకపోయా అందుకే..!నికితా పోర్వాల్ భావోద్వేగభరిత లేఖ
ఇటీవల ముగిసిన మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నికితా పోరాల్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరితమైన లేఖ రాశారు. కిరీటాన్ని అందుకోలేకపోయినా..ఆ విస్ వరల్డ్ తనకు అందించి అనుభవం, ఆ ప్రయాణంలో తనకు లభించిన ప్రేమ, నేర్చుకున్న పాఠాలను గురించి లేఖలో పంచుకుంది. తన మిస్వరల్డ్ జర్నీకి సంబంధించిన ఫోటోల తోపాటు ఈపోస్ట్ని కూడా జోడించి షేర్ చేసింది. ఆ లేఖలో నికితా ఇలా రాసుకొచ్చింది. "మిస్ వరల్డ్ ఫైనల్ తర్వాత కిరీటం లేకుండా ఇంటికి రావడం అత్యంత కష్టమైన విషయం, అయినా అక్కడ పొందిన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అక్కడ తనకు లభించిన ప్రేమ, మద్దతు..ఇలా ప్రతీదాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. మీరంతా నేను కిరీటాన్ని గెలుచుకోవాలని కొండంత ఆశతో ఎదురుచూశారు. అలా ఇంతకుమందెన్నడూ చూడని ఎన్నో కుటుంబాల ప్రేమను సంపాదించుకున్నాను. అందాల పోటీల ప్రపంచంలో అత్యంత విచిత్రమైన మరియు అందమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మీకు మద్దతు ఇచ్చే అకౌంట్ల వెనుక ఉన్న ముఖాలు మనకు తెలియవు. తెల్లవారుజామున 2 గంటలకు ఆ ఎడిట్ ఎవరు చేస్తున్నారో, ఆ సుదీర్ఘ సందేశం ఎవరు రాస్తున్నారో, కామెంట్ సెక్షన్లో నాకోసం ఎవరు పోరాడుతున్నారో, అప్డేట్ కోసం పేజీని ఎవరు రిఫ్రెష్ చేస్తున్నారో కూడా తెలియదు... కానీ ఎలాగోలా వారి ప్రేమ మనకు తెలుస్తుంది అంటూ అభిమానులను ఉద్దేశించి రాసింది.". ఆ తర్వాత తన ఓటమి గురించి ఇలా పేర్కొంది. " ‘ఇండియా' అని పిలిచే అదృష్టం దక్కించుకున్నా. అసలు ఆ వారాల పాటు, నా పేరు దాదాపు కనుమరుగైపోయింది, మర్చిపోయా. ఎవరైనా 'ఇండియా!' అని పిలవగానే ఏదో తెలియని పులకింత, ఒక అటెన్షన్ వచ్చేసేవి. నిజానికి నేను కిరీటాన్ని దక్కించుకోవాలని అనుకున్నా..బలంగా కోరుకున్నా..అందుకోసం ఎంతో కష్టపడ్డా. కానీ ఓటమిని ఎదుర్కొన్నా..అయినప్పటికీ ఈ జర్నీలో ఎన్నో జ్ఞాపకాలు, స్నేహాలు, ప్రేమలు సంపాదించుకుని సరికొత్త నికితాగా ఇంటికి తిరిగి వచ్చా. కొన్ని విజయాలు వరించలేకపోయినా..హృదయంలో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతాయి. ప్రేమతో మీ నికితా అంటూ తన పోస్ట్ని ముగించింది నికితా పోర్వాల్. View this post on Instagram A post shared by Nikita Porwal (@nikitaporwal_) (చదవండి: అమ్మాయి నిజంగా బంగారం! ఆ డ్రెస్ అక్షరాల రూ. 4 కోట్లుపైనే..)
రియల్ టు రీల్
కల్పిత కథలు కాదు... నిజజీవిత కథలు వెండితెరపై ఆదరణ పొందుతున్న కాలం ఇది. ఈ వరుసలో ఇప్పుడు ‘దైరా’ చేరింది. ఈ కథకు మూలం... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరి«ధిలో ఏడేళ్ల క్రితం చోటు చేసుకున్న ‘దిశ’పై హత్యాచారం, నిందితుల ఎన్ కౌంటర్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ‘దైరా’ పేరుతో సినిమాగా తెరకెక్కింది. కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీసు అధికారులుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది...హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ టోల్ప్లాజా వద్ద 2019 నవంబర్ 27 రాత్రి... వెటర్నరీ వైద్యురాలు (26) స్కూటర్ను పార్క్ చేసి మరో చోటుకి వెళ్లారు. అది గమనించిన నలుగురు దుండగులు పథకం ప్రకారం ఆమె స్కూటర్ టైర్ పంక్చర్ చేశారు. తిరిగి వచ్చిన ఆమెకు సాయం చేస్తున్నట్లు నమ్మించి, సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. మృత దేహాన్ని లారీలో చటాన్ పల్లి సమీపంలోని అండర్పాస్ వద్దకు తీసుకెళ్లి తగులబెట్టారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.24 గంటల్లో నిందితుల అరెస్ట్... మృతదేహం మర్నాడు (2019 నవంబర్ 28) వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 29న నిందితులైన హమ్మద్ ఆరిఫ్ (లారీ డ్రైవర్), జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులను (క్లీనర్) అరెస్టు చేశారు. ఈ నిందితులను షాద్నగర్ పోలీసుస్టేషన్ కు తీసుకొచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని, నిందితులను తమకు అప్పగించాలని, వెంటనే కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టాల్సి వచ్చింది.చటాన్ పల్లి ఎన్ కౌంటర్... తెలంగాణ ప్రభుత్వం దిశ కేసు విచారణకు 2019 డిసెంబర్ 4న ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. దిశ అదృశ్యంపై కేసు నమోదు, దర్యాప్తులో పోలీసుల స్పందనలో జాప్యం జరిగిందనే ఆరోపణలతో ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది. డిసెంబర్ 6 తెల్లవారుజామున నలుగురు నిందితులను క్రైమ్ సీన్ రీ–కన్ స్ట్రక్షన్ కోసం చటాన్ పల్లి తీసుకువచ్చారు. అక్కడ జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురూ చనిపోయారు. నిందితులు తమ వద్ద ఉన్న ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని, అలా పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామన్నది పోలీసుల కథనం.కమీషన్ నుంచి కోర్టుకు... నిందితుల్లో మైనర్ ఉన్నారని, నిజమైన ఎన్ కౌంటర్ కాదని వివాదం చెలరేగింది. దీంతో 2019 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని కమిషన్ లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా సోందూర్ బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు. 2022లో కమిషన్ 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. కీలక అంశాలు‘దైరా’లో కరీనా డీసీపీ అజూనీ కోహ్లీగా, పృథ్వీరాజ్ డీసీపీ రమణ్ కుమార్గా నటించారు. ఓ కేసు విషయంలో వీరిద్దరి ఆలోచనలు, దర్యాప్తు విధానాలు విభేదిస్తాయి. అజూనీ కేసును లోతుగా దర్యాప్తు చేస్తుంది అజూనీ. రమణ్ చేసిన ఎన్ కౌంటర్లపై ప్రశ్నలు తలెత్తుతాయి. మైనర్ నిందితులపై చట్టం ఎలా వ్యవహరించాలి? తీవ్రమైన నేరాలకు పాల్పడిన మైనర్లకు కూడా అదే రక్షణ వర్తించాలా? ఈ కీలక అంశాలు ‘దైరా’లో ప్రస్తావనకు వస్తాయి.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్
అంతర్జాతీయం
జెలెన్స్కీ ఫ్యామిలీకి తప్పిన పెను ప్రమాదం.. పుతిన్ ప్లానేనా?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మోల్డోవా నుంచి నార్వేకు బయలుదేరిన ఆయన విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ఓ డ్రోన్ దాదాపు ఢీకొట్టేంత దగ్గరగా వచ్చింది. దీంతో కొద్దిసేపు దేశ గగనతలాన్ని మూసివేసి విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆ డ్రోన్ రష్యాకు చెందినదిగా భావిస్తున్న నేపథ్యంలో.. జెలెన్స్కీ విమానానికి ఇంత దగ్గరగా అది ఎలా వచ్చింది? దీని వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహం ఉందా? అనే చర్చ మొదలైంది. అయితే డ్రోన్ ఉద్దేశపూర్వకంగా జెలెన్స్కీ విమానాన్ని లక్ష్యంగా చేసుకుందా అన్నది మాత్రం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.ఈ ఘటన సెప్టెంబర్ 8, మంగళవారం చోటుచేసుకుంది. జెలెన్స్కీ మోల్డోవా రాజధాని చిసినావ్ నుంచి నార్వే రాజధాని ఓస్లోకు బయలుదేరాల్సి ఉండగా.. అదే సమయంలో ఓ డ్రోన్ మోల్డోవా గగనతలంలోకి ప్రవేశించింది. విమానాల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే ఎయిర్స్పేస్ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో జెలెన్స్కీ విమానంతో పాటు మరో మూడు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ముప్పు తొలగిన తర్వాతే జెలెన్స్కీ విమానం నార్వేకు బయలుదేరింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో జెలెన్స్కీతో పాటు ఆయన భార్య, ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ ఒలెనా జెలెన్స్కా కూడా విమానంలో ఉన్నారు.కూలిన డ్రోన్.. మంటలు.. మోల్డోవా అధికారుల ప్రకారం రెండు రష్యన్ డ్రోన్లు ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించాయి. వాటిలో ఒకటి రిస్కానీ జిల్లాలోని ఓ గ్రామ శివార్లలోని సన్ఫ్లవర్ పొలంలో కూలిపోయి పేలింది. దీంతో నాలుగు చోట్ల మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రాంతం చిసినావ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో డ్రోన్ పొరుగున ఉన్న నాటో సభ్యదేశం రొమేనియా గగనతలంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.A Russian drone breached Moldovan and Romanian airspace this afternoon, causing major disruptions, including the closure of Iași Airport.NATO CAP was launched to hunt down the drone, with Spanish EF-18 Hornets scrambled from Mihail Kogălniceanu Air Base. pic.twitter.com/jfCb9ORV5s— OSINTtechnical (@Osinttechnical) September 8, 2026డ్రోన్ కదలికలను పర్యవేక్షించేందుకు స్పెయిన్కు చెందిన రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించారు. కూలిపోయిన డ్రోన్ శకలాలను పరిశీలించిన నిపుణులు.. దాని ప్రొపల్షన్ వ్యవస్థ, నిర్మాణ లక్షణాలు రష్యా యుద్ధంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న ‘గెరాన్’ తరహా డ్రోన్ను పోలి ఉన్నట్లు గుర్తించారు. అయితే అందులో ఉన్న పేలుడు పదార్థం రకం, పరిమాణంపై దర్యాప్తు కొనసాగుతోంది.నార్వే ప్రధాని స్పందన.. మరోవైపు నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ బుధవారం స్పందిస్తూ.. మోల్డోవా నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో జెలెన్స్కీ విమానం దాదాపు డ్రోన్ బారిన పడిందని తెలిపారు. అయితే డ్రోన్ విమానానికి ఎంత దూరంలో ఉందన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. జెలెన్స్కీ ఓస్లోకు వెళ్లడానికి ప్రధాన కారణం నార్వే రాజు హరాల్డ్-5 అంత్యక్రియలకు హాజరుకావడం. సెప్టెంబర్ 8న రాత్రి ఓస్లో చేరుకున్న ఆయన మరుసటి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నార్వే నేతలతో రక్షణ, వైమానిక రక్షణ సహకారంపై చర్చలు జరిపారు.మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ మోల్డోవా, రొమేనియా గగనతలాల్లో డ్రోన్ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ విమానం టేకాఫ్ సమయంలోనే డ్రోన్ ముప్పు ఎదురవడం కలకలం రేపుతోంది. అయితే ఇది జెలెన్స్కీని లక్ష్యంగా చేసుకున్న పుతిన్ ఆపరేషనా? లేక యుద్ధ ప్రభావంతో జరిగిన మరో డ్రోన్ చొరబాటా? అనేది దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టత రానుంది.ఇదీ చదవండి: ఏం చేసేది.. పాకిస్తాన్కు కొత్త కష్టం?
సైనిక విన్యాసంలో పేలిపోయిన చైనా ట్యాంక్!
బంగ్లాదేశ్లో సైనిక విన్యాసం విషాదాంతంగా మారింది. ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్లో భాగంగా ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతుండగా అకస్మాత్తుగా అందులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ సైనిక అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ట్యాంక్.. చైనాకు చెందిందిగా తెలుస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 9) చట్టోగ్రామ్లోని హాత్హజారీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ రేంజ్లో సైనిక విన్యాసం కొనసాగుతున్న సమయంలో ట్యాంక్ నుంచి గోలాలు(మందు గుండు బాల్స్) ప్రయోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన అధికారికి తొలుత అత్యవసర చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (సీఎంహెచ్)కు తరలించారు. బంగ్లాదేశ్ సైన్యం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ (ఐఎస్పీఆర్) ఈ ప్రమాదంపై ప్రకటన చేసింది. అసలు ఏం జరిగింది?ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ట్యాంక్లోని మందుగుండు సామగ్రి కారణమా? లేదంటే ట్యాంక్లోని ఫైరింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.చైనా తయారీ ట్యాంక్..!ప్రమాదానికి గురైన ట్యాంక్ చైనాకు చెందినదిగా తెలుస్తోంది. అది టైప్–59 అని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోనూ ఇదే తరహా ట్యాంక్ కనిపిస్తోంది. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ట్యాంక్ మోడల్ను వెల్లడించలేదు. టైప్–59ను బంగ్లాదేశ్ ఆర్మీ చాలాకాలంగా వినియోగిస్తోంది. పాత ట్యాంకులను చైనా సాయంతో ఆధునికీకరించి ‘డుర్జోయ్’గా కూడా అప్గ్రేడ్ చేసింది.Bangladesh Army’s Chinese-origin Type 59 tank reportedly exploded during a firing exercise, killing 2 crew members and injuring an officer.Made in China. Used in Bangladesh. Deadly outcome. pic.twitter.com/Gn0FRx5ul4— Shadow IND (@ShadowIND_IN) September 9, 2026దశాబ్దాలుగా బంగ్లా ఆర్మీలో..చైనాలో తయారైన టైప్–59.. సోవియట్ కాలం నాటి టీ–54 ట్యాంక్ ఆధారంగా అభివృద్ధి చేసిన ప్రధాన యుద్ధ ట్యాంక్. బంగ్లాదేశ్ ఆర్మీ చాలా కాలంగా ఈ తరహా చైనా తయారీ ఆర్మర్డ్ వాహనాలను వినియోగిస్తోంది. పాతబడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా తొలగించకుండా.. ఆధునికీకరణ, అప్గ్రేడ్ల ద్వారా మరికొంతకాలం సేవల్లో కొనసాగిస్తోంది. అందులో భాగంగా 40 టైప్–59 ట్యాంకుల అప్గ్రేడ్, మరో 58 టైప్–69ఐఐజీ ట్యాంకుల ఆధునికీకరణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినట్లు అక్కడి రక్షణ రంగ నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే బంగ్లాదేశ్ ఆర్మీకి ఇవి కేవలం పాత ట్యాంకులు మాత్రమే కాకుండా.. ఇప్పటికీ దాని ఆర్మర్డ్ ఫ్లీట్లో భాగంగా ఉన్న కీలక ప్లాట్ఫారమ్లన్నమాట!.దర్యాప్తు ప్రారంభంఈ ఘటనపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్లు చెబుతోంది. అయితే పేలుడు ఎలా సంభవించింది? ఫైరింగ్ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? మందుగుండు సామగ్రికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా? ట్యాంక్ పనితనం వంటి అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. ఫీల్డ్ ఫైరింగ్ వంటి సైనిక శిక్షణ కార్యక్రమాల్లో అనుకోని ప్రమాదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చూపించింది.ఇదీ చదవండి: మిడిల్ఈస్ట్లో పాక్కు బిగ్ టెస్ట్
పాకిస్తాన్కు బిగ్ టెన్షన్.. సౌదీ కోసం యుద్ధం తప్పదా?
హౌతీలపై పాకిస్తాన్ నేరుగా యుద్ధానికి దిగుతోందా?.. సౌదీ అరేబియాపై జరిగిన భారీ దాడి మూడు దేశాల సైనిక కూటమిని రంగంలోకి దించే పరిస్థితి తెచ్చిందా?.. యెమెన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులు సౌదీ నగరాలు, చమురు కేంద్రాలను తాకడంతో గల్ఫ్లో యుద్ధ వేడి పెరిగింది. ఈ సమయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సౌదీపై దాడి జరిగితే అది పాకిస్తాన్, టర్కీపైనా జరిగిన దాడిగానే పరిగణిస్తామని ఆయన స్పష్టం చేయడంతో.. గత నెలలో ఏర్పాటైన ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అలయన్స్’ తొలిసారి అసలు పరీక్షను ఎదుర్కొంటోంది.సెప్టెంబర్ 8న హౌతీ దళాలు సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం 73 మంది గాయపడగా.. కొన్ని చమురు, ఇంధన కేంద్రాల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆగస్టు 7న పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య కుదిరిన మక్కా జాయింట్ డిఫెన్స్ ఒప్పందంపై చర్చ మొదలైంది. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా.. దాన్ని మిగతా సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలన్నది ఈ ఒప్పందంలోని కీలక నిబంధన. ఖ్వాజా ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యెమెన్ ఘర్షణ సౌదీ భూభాగంలోకి విస్తరించినా, సౌదీపై దాడి జరిగినా మక్కా ఒప్పందం అమల్లోకి రావచ్చన్నారు. అవసరమైతే పాకిస్తాన్ తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని తెలిపారు. దీంతో హౌతీల దాడులు కొనసాగితే పాక్, టర్కీ సౌదీ రక్షణకు ముందుకొచ్చే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.జాగ్రత్తగా పాక్ వ్యూహం..ఇదే సమయంలో అసలు ట్విస్ట్ తెరపైకి వచ్చింది. యెమెన్లోని హౌతీ స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోందని భద్రతా వర్గాలను ఉటంకిస్తూ EFE వార్తా సంస్థ తెలిపింది. అయితే దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇస్లామాబాద్ బహిరంగ వైఖరి కూడా జాగ్రత్తగానే ఉంది. సౌదీని రక్షించడం ఒకటైతే.. యెమెన్లోకి వెళ్లి నేరుగా యుద్ధం చేయడం మరో అంశమని పాక్ స్పష్టం చేస్తోంది. హౌతీలను అదుపులో పెట్టాలని ఇరాన్ను హెచ్చరించినప్పటికీ.. తన పాత్రను ప్రధానంగా సౌదీ రక్షణకే పరిమితం చేయాలని చూస్తోందని రాయిటర్స్ పేర్కొంది.మరోవైపు టర్కీ కూడా హౌతీ దాడులను ఖండిస్తూ.. సౌదీ సార్వభౌమత్వానికి మద్దతు ప్రకటించింది. అయితే యెమెన్లో ప్రత్యక్ష సైనిక చర్యకు దిగుతామని మాత్రం ప్రకటించలేదు. దీంతో మక్కా ఒప్పందానికి అసలు పరీక్ష ఏంటన్నది స్పష్టమవుతోంది. హౌతీలు సౌదీపై దాడి చేస్తే పాక్, టర్కీ ఎంతవరకు ముందుకొస్తాయి?.. సౌదీ యెమెన్లో హౌతీలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తే ఈ రెండు దేశాలు అదే స్థాయిలో మద్దతు ఇస్తాయా? అన్నదే కీలకంగా మారింది.వైమానిక దాడులు చేస్తుందా?ఇక హౌతీలకు ఇరాన్ మద్దతు ఉండటం, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ పరిణామాలను మరింత సున్నితంగా మార్చాయి. పాకిస్తాన్, టర్కీ నేరుగా హౌతీలకు వ్యతిరేకంగా రంగంలోకి దిగితే.. ఇప్పటివరకు యెమెన్ పరిధిలో ఉన్న ఘర్షణ విస్తృత గల్ఫ్ సంక్షోభంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అందరి చూపు ఇస్లామాబాద్పైనే. పాకిస్తాన్ సౌదీ రక్షణకే పరిమితమవుతుందా?.. హౌతీ స్థావరాలపై నేరుగా వైమానిక దాడులు చేస్తుందా? అన్నదే కీలకం. పాక్ నిజంగా హౌతీలపై దాడులకు దిగితే.. అది మక్కా డిఫెన్స్ అలయన్స్కు తొలి పెద్ద పరీక్ష మాత్రమే కాదు.. యెమెన్ యుద్ధం గల్ఫ్ ప్రాంతానికి విస్తరించే కీలక మలుపుగా మారొచ్చు.ఇదీ చదవండి: ఇజ్రాయెల్ నెతన్యాహుకు కొత్త కష్టాలు..
Philippines: ఫెర్రీలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
పాలావాన్: ఫిలిప్పీన్స్లోని పాలావాన్ ప్రావిన్స్లో పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఓ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 87 మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 134 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు కోస్ట్గార్డ్ గురువారం వెల్లడించింది. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ‘ఎంవీ జూన్ ఆస్టర్’ (M/V June Aster) ఫెర్రీలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. పాలావాన్ తీరానికి సుమారు 2.2 కిలోమీటర్ల (1.3 మైళ్ల) దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు కోస్ట్గార్డ్ తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చినట్లు పేర్కొంది.అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను కోస్ట్గార్డ్ ఫేస్బుక్లో విడుదల చేసింది. అందులో ఫెర్రీ పూర్తిగా మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 42 మందిని రక్షించినట్లు కోస్ట్గార్డ్ కెప్టెన్ నోమీ కయాబ్యాబ్ స్థానిక రేడియోకు తెలిపారు. వీరిలో 38 మంది ప్రయాణికులు కాగా.. నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే 87 మంది ఆచూకీ తెలియడం లేదని ఆమె చెప్పారు. ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి?
జాతీయం
సబ్కలెక్టర్గా శుభ్ర పండా
ఒడిశా : జయపురం సబ్ కలెక్టర్గా శుభ్ర పండా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న జాదుమణి నాయిక్ను బదిలీ చేసి ఆమె స్థానంలో శుభ్ర పండాను నియమించారు. కొత్త సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జయపురం మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారి (ఈఓ) బాధ్యతలను కూడా అదనంగా అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.జయపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో సబ్ కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తారు. మునిసిపాలిటీ ఈఓ బాధ్యతలు కూడా అప్పగిస్తే పట్టణ పరిపాలనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.ఇదిలా ఉండగా, ప్రస్తుతం సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న జాదుమణి నాయిక్కు తదుపరి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆమె బదిలీకి సంబంధించిన తదుపరి నియామక వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.చదవండి: ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
రూ. 2.5 లక్షల అప్పు, 19 మంది పేర్లు : సివిల్స్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, ముంబై: పూణేలోని శనివార్ పేట్ ప్రాంతంలో విషాదంచోటు చేసుకుంది. కేవలం రూ. 2.5 లక్షల అప్పు తీర్చలేక సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న 28 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో తన అప్పులపై రాసిన రెండు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతుడిని ధారాశివ్ జిల్లాలోని పరందా తహసీల్ పరిధిలోని ఖసాపురి గ్రామానికి చెందిన ప్రథమేష్ దేశ్ముఖ్గా గుర్తించారు. గత ఎనిమిది నెలలుగా పూణేలోని ఒక భవనంలో మూడవ అంతస్తులో ఉన్న వన్-BHK ఫ్లాట్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలతో సహా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు.బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు దేశ్ముఖ్ రాసినట్లు భావిస్తున్న లేఖ సూచిస్తోందని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నవనాథ్ జగ్తాప్ తెలిపారు.MPSC ची तयारी करणाऱ्या परांडा तालुक्यातील (जि. धाराशिव) विद्यार्थी प्रथमेश देशमुख याने पुण्यात आत्महत्या केल्याची घटना अत्यंत दुःखद आहे.गेल्या काही काळात पेपरफुटीसह विविध गैरप्रकार होत असल्याने एक स्वप्न उराशी बाळगून अभ्यास करणाऱ्या विद्यार्थ्यांमध्ये डावलल्याची भावना निर्माण… pic.twitter.com/UWiw9vcyVQ— Riven (@R1v3n_0x) September 9, 2026ఇదీ చదవండి: కేవలం రూ.15 కోసం ప్రొఫెసర్పై కత్తితో దాడిసొంత ఖర్చుల కోసం దేశ్ముఖ్ రూ. 2.5 లక్షలు అప్పు తీసుకున్నానని, అందులో అతను ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాడో వారి పేర్లను కూడా అందులో పేర్కొన్నాడు. అతను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, తల్లిదండ్రులను కూడా విచారించనున్నామని డీసీపీ (జోన్-1) రుషికేష్ రావలే చెప్పారు.మరోవైపు మార్చిలో జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి) స్క్రీనింగ్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో సహా, నియామక పరీక్షలలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై పూణే , మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో MPSC అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్న తరుణంలోనే అతని బలవన్మరణం పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. An MPSC aspirant died by suicide. Exam delays, irregularities and years of uncertainty have made the pressure unbearable for many students.How many more students have to suffer before the government takes accountability?https://t.co/SbWkzoej5h— Cockroach Janta Party - CJP (@Cockroachisback) September 9, 2026ఇంకా ఎంతమంది బలికావాలి - సీజేపీమరోవైపు ఈ ఘటనపై సీజేపీ కూడా స్పందించింది. పరీక్షల ఆలస్యం, అక్రమాలు , సంవత్సరాల అనిశ్చితి ఒత్తిడి చాలా మంది విద్యార్థులను బలితీసుకుంటోంది. ఇంకా ఎంతమంది బలికావాలి? ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాన్ని కలుసుకున్న సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు
ముంబై పేలుళ్ల కేసు.. అబూ సలేంకు సుప్రీంకోర్టు ఝలక్!
న్యూఢిల్లీ: ముంబై 1993 వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ అబూ సలేం ముందస్తు విడుదలకు చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. 25 ఏళ్ల జైలు శిక్షను ఇప్పటికే పూర్తి చేశానంటూ సలేం దాఖలు చేసిన పిటిషన్ను గురువారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు ఏప్రిల్ 2026లో ఇచ్చిన తీర్పును సమర్థించింది.పోర్చుగల్ నుంచి భారత్కు అప్పగించే సమయంలో అక్కడి ప్రభుత్వానికి భారత్ ఇచ్చిన హామీని సలేం తన పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించాడు. తనను భారత్కు అప్పగిస్తే మరణశిక్ష విధించబోమని, అలాగే 25 ఏళ్లకు మించి జైలులో ఉంచబోమని 2002లో భారత్ హామీ ఇచ్చిందని పేర్కొన్నాడు. 2005 నవంబర్ 11న అతడిని పోర్చుగల్ నుంచి భారత్కు తీసుకొచ్చారు. తాను విచారణ ఖైదీగా గడిపిన కాలం, శిక్ష అనుభవించిన కాలం, మంచి ప్రవర్తనకు లభించిన రిమిషన్ అన్నింటినీ కలిపితే 2025 మార్చి 31 నాటికే 25 ఏళ్లు పూర్తయ్యాయని సలేం వాదించాడు. అందువల్ల ఇకపై తనను జైలులో ఉంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ముందస్తు విడుదల కోరాడు.అయితే, ఈ వాదనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. సలేం పిటిషన్ ముందుగానే దాఖలైందని, 25 ఏళ్ల వ్యవధి 2030లో పూర్తవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సలేం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గతంలో 2022లో ఇదే అంశంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. సలేం 25 ఏళ్ల జైలు కాలాన్ని పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అతడి ముందస్తు విడుదలను నిర్ధారించాలని పేర్కొన్నప్పటికీ.. అతడి శిక్షను కమ్యూట్ చేయడం లేదని స్పష్టం చేసింది. పోర్చుగల్లో పాస్పోర్టు మోసం కేసులో గడిపిన జైలు కాలాన్ని 25 ఏళ్ల వ్యవధిలో లెక్కించరాదని కూడా తేల్చింది.కాగా, అబూ సలేం 2002లో పోర్చుగల్లో అరెస్టయ్యాడు. 1993 ముంబై పేలుళ్ల కేసుతో పాటు మరో టాడా కేసులో అతడికి వరుసగా 2015, 2017లో జీవిత ఖైదు పడింది. ఈ నేపథ్యంలో 2025కే 25 ఏళ్లు పూర్తయ్యాయన్న అబూ సలేం వాదనను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించడంతో.. తక్షణ విడుదలకు అతడి ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడింది.ఇదీ చదవండి: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్కు బంపరాఫర్
కేవలం రూ.15 కోసం ప్రొఫెసర్పై కత్తితో దాడి
బిహార్లోని ఛప్రా నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ. 15 కోసం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్పై అమానుషంగా దాడిచేసిన ఘటన కలకలం రేపింది.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రొఫెసర్ చికిత్స పొందుతుండగా, పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.నంద్లాల్ సింగ్ కాలేజీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న భగవాన్ ఠాకూర్, ఎప్పటిలాగే అర లీటరు పాలు కొనుగోలు చేయడానికి ఒక దుకాణానికి వెళ్లారు. దీనికోసం ఆయన రూ. 500 నోటును దుకాణదారుడికి ఇచ్చాడు. అతను తిరిగి రూ. 450 మాత్రమే ఇచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, తనకు రావాల్సిన చిల్లరలో రూ. 15 తక్కువగా వచ్చాయని ఠాకూర్ గమనించారు. దాంతో ఆయన తిరిగి దుకాణానికి వెళ్లి, ఆ డబ్బును దుకాణదారుడికి చూపించి, రూ. 15 కూడా తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే షాప్ ఓనర్ కుమారుడు వెనకనుంచి ఉన్నట్టుండి దాడి చేశాడు. కత్తితో ఆయన చెవిలో పొడిచాడు. ఈ హఠాత్పరిణామానికి ఠాకూర్ కింద పడిపోయారు. ఎలాగోలా తన సహోద్యోగికి ఫోన్ చేయగలిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న సహోద్యోగి ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది మరియు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు
ఎన్ఆర్ఐ
జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
బెర్లిన్: జర్మనీలోని మ్యూనిచ్, స్టుట్గార్ట్, బెర్లిన్ నగరాల్లో ఈ రోజు సోమవారం దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు తరలివచ్చి, ఆయన సేవలను కొనియాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేడు తామంతా ఉన్నత స్థాయిలో ఉండగలుగుతున్నామని ఆయన సేవలను స్మరించుకున్నారు.17వ వర్ధంతి సందర్భంగా మ్యూనిచ్ నగరంలో నిర్వహించిన “YSR Chess Tournament” విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం కృష్ణ తేజ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కోర్ కమిటీ సభ్యులు నాగార్జున రెడ్డి ఆవుల (జనరల్ సెక్రటరీ), గురు (కో-కన్వీనర్), విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల (ఐటీ కోఆర్డినేటర్), Dr. మల్లికార్జున రెడ్డి బండి (మీడియా స్పోకెస్పర్సన్), మనోజ్ కామసాని (మీడియా స్పోకెస్పర్సన్), నవీన్ రెడ్డి కలమకూరి (సోషల్ మీడియా కోఆర్డినేటర్), సాయి సూర్య చౌదరి (ఎగ్జిక్యూటివ్ మెంబర్), మంజునాథ్ రెడ్డి చవ్వాబాలన్న (ఎగ్జిక్యూటివ్ మెంబర్), వినోద్ అమలదాసు (ఎగ్జిక్యూటివ్ మెంబర్), షాలిని అక్షింతల (ఎగ్జిక్యూటివ్ మెంబర్), ఉపేంద్ర జలది, ప్రదీప్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ బాధ్యతని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలిపారు.
వైఎస్సార్ వర్ధంతి: వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ రక్తదానం
ఫీనిక్స్ (అరిజోనా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ, వైటలెంట్ సహకారంతో సెప్టెంబర్ 6న రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజాసేవకు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడానికి డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన జీవితం, ప్రజాసేవ, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన నిర్వహించారు.కమిటీ సభ్యులు డాక్టర్ వైఎస్సార్తో తమకున్న వ్యక్తిగత అనుభవాలను, ఆయనలోని నిరాడంబరత, ధైర్యం, ప్రజాకేంద్రిత పాలనా విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివ రెడ్డి డాక్టర్ వైఎస్సార్ను “ప్రజల నాయకుడు”గా అభివర్ణిస్తూ, సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేశారు. డాక్టర్ వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆ ఆశయాలను కొనసాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఫీనిక్స్ ఎన్నారై కమిటీని ఆయన అభినందించారు. రక్తదానం అనేది సులభమైనదైనా, అత్యంత విలువైన సేవా కార్యక్రమమని, ఒకరి రక్తదానం నేరుగా మరొకరి ప్రాణాలను కాపాడగలదని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని ధీరజ్ పోలా, వంశీ ఎరువరం, చెన్నా రెడ్డి మద్దూరి, రుక్మన్, శ్రీధర్ చెమిడితి, అంజి రెడ్డి,నాగేష్ పొర్ల, వేమ శేఖర్, విఘ్నేష్, కొండా రెడ్డి , శ్రీనివాస్ మామిడి, హేమ కుమార్, అజయ్ కాల్వ , కుడుముల సుధీర్, సుజన్, రాజేశ్వరరావు బండారు, రాజశేఖర్ అవుదూరి, హితేష్ తదితరులు నిర్వహించి, పాల్గొన్నారు. పలువురు వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైటలెంట్, రక్తదాతలు, వాలంటీర్లు, నిర్వాహకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ, మానవతా విలువలు, సమాజ సంక్షేమం పట్ల డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను కొనసాగిస్తూ, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగల సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫీనిక్స్ ఎన్నారై కమిటీ తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించింది.
జయ పీసపాటి గౌరవార్థం సింగపూర్లో ఆత్మీయ సమ్మేళనం
సింగపూర్: హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి సింగపూర్ పర్యటన సందర్భంగా, శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సింగపూర్లో ఘనంగా జరిగింది. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్లో సుమారు 25 మంది తెలుగు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.సుబ్బు వి. పాలకుర్తి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి జయ పీసపాటి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరైనారు. ఈ సందర్భంగా జయ పీసపాటి మాట్లాడుతూ, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు, గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.మహిళలు మీడియా సహా వివిధ రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలవగలరని జయ పీసపాటి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఆదివారం కూడా ఇంతమంది తెలుగువారు ఒకచోట చేరి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సింగపూర్, హాంగ్ కాంగ్ తెలుగు సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న సత్సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.సింగపూర్తో 2016 నుంచే ప్రత్యేక అనుబంధంహాంగ్ కాంగ్లో తెలుగు సమాఖ్యను నిర్వహిస్తున్న తనకు విదేశాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం 2016లో సింగపూర్లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సింగపూర్లోని తెలుగువారి ఐక్యత, చురుకుదనం తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని ఆమె నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.ఇటీవల మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు ఒక మార్గదర్శకంగా, బెంచ్మార్క్గా నిలిచాయని ఆమె అభినందించారు. ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడటంతో పాటు పద్యాలు, గద్యాలను స్పష్టంగా చదివి వినిపించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.మలేషియా తెలుగు సమాజం చూపించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు భాష మరింతగా అభివృద్ధి చెంది, భావితరాల్లో సజీవంగా కొనసాగాలని జయ పీసపాటి ఆకాంక్షించారు.తమకు ఆత్మీయ‘జయక్క’గా మారిన“జయ పీసపాటి ఈ సందర్భంగా రత్న కుమార్ మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలుఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లితో పాటు సింగపూర్ తెలుగు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు.
మిస్సిసాగాలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మిస్సిసాగా: కెనడాలోని మిస్సిసాగా నగరంలో శనివారం(సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం 6 గంటలకు వైఎస్సార్సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, వైఎస్సార్సీపీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమ నిర్వాహకులు (వైఎస్సార్సీపీ కెనడా టీమ్):* సుబ్బారావు – వైఎస్సార్సీపీ కెనడా కో-కన్వీనర్* నూర్ గారు – వైఎస్సార్సీపీ కెనడా యూత్ వింగ్ కన్వీనర్ముఖ్య అతిథులు మరియు వక్తలుచల్లా మధుసూదన్ రెడ్డి గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ) – జూమ్ ద్వారా హాజరయ్యారుపాండుగాయల రత్నాకర్ గారు (మాజీ వైఎస్సార్సీపీ యూఎస్ఏ/ఎన్ఆర్ఐ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి) – జూమ్ ద్వారా హాజరయ్యారు. డాక్టర్ ప్రదీప్ చింత గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఎన్ఆర్ఐ వ్యవహారాలు) – జూమ్ ద్వారా హాజరయ్యారు. కొండం వెంకట్ రెడ్డి గారు (కెనడా కమ్యూనిటీ నాయకులు) – ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడారు.ఎగ్జిక్యూషన్ టీమ్: కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు: అస్లాం, సుమంత్, యశ్వంత్ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్, డాక్టర్ నిరంజన్ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్ కొరపోరలు.అడ్వైజర్ కమిటీ: కార్యక్రమానికి విలువైన మార్గదర్శకత్వం అందించిన సలహాదారుల కమిటీ సభ్యులు:* కృష్ణారెడ్డి పసల* రాజగోపాల్ గుంటక* విశ్వనాథ్ రెడ్డి* విజయభాస్కర్ రెడ్డి* కృష్ణ ఆలంపాటి* డాక్టర్ శివ రెడ్డిఈ కార్యక్రమంలో మిస్సిసాగాతో పాటు పరిసర ప్రాంతాల నుండి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్ కమిటీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూషన్ టీమ్కు, అడ్వైజర్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
కన్నబిడ్డనే అమ్మాలనుకుంది..
హైదరాబాద్: నవజాత శిశువును విక్రయించడానికి యత్నించిన మహిళపై కేసు నమోదు చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎన్టీఆర్ నగర్కు చెందిన ముఖ్తార్ బేగ్ (62) చిన్న కుమార్తెకు సంతానం లేకపోవడంతో చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలనుకున్నారు. ఈ నెల 7న ఓ అపరిచిత మహిళ 8 రోజుల వయసున్న శిశువుతో వచ్చింది. రూ.లక్షకు పాపను అమ్ముతానంది. ఆమె ప్రవర్తనపై అనుమానంతో ముఖ్తార్ బేగ్ తిరస్కరించారు. 8న రాత్రి సదరు మహిళ మళ్లీ వచ్చి తన పెద్ద కుమార్తె పెళ్లికి డబ్బులు కావాలంటూ రూ.30 వేలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. ఆమె ప్రవర్తనతో అనుమానించిన ముఖ్తార్ బేగ్.. వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించి, శిశువుతో సహా మహిళను పోలీసులకు అప్పగించారు. విచారణలో సదరు మహిళ బిహార్ రాష్ట్రం కిషన్గంజ్ జిల్లా దిఘల్బ్యాంక్ మండలం పలాస గ్రామానికి చెందిన లాల్మోన్ ఖాటూన్ (34), భర్త ఎండీ సుల్తాన్గా తేలింది. ప్రస్తుతం ఈమె పహాడీషరీఫ్లో కూలిపనులు చేస్తూ నివసిస్తోందని, విచారణలో ఆ మహిళే నవజాత శిశువుకు తల్లి అని నిర్ధారించారు. తల్లీబిడ్డలను రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణ పర్యవేక్షణలో ఉంచినట్లు ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం!
11 ఏళ్ల సహజీవనం.. మరో యువతిని పెళ్లాడిన కానిస్టేబుల్!
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఏకంగా పదకొండేళ్లు సహజీవనం చేసి మోసం చేసిన కానిస్టేబుల్ అరుణ్ కుమార్పై ఉప్పల్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తనకు ఇష్టం లేకుండా రెండుసార్లు గర్భస్రావం చేయించాడని, పెళ్లికి ముహూర్తాలు పెట్టి కూడా మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గత నెల ఆఖరి వారంలో ఈ కేసు నమోదు కాగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ ప్రశాంత్నగర్కు చెందిన యువతితో అరుణ్కుమార్కు 2013లో పరిచయమైంది. 2014లో అరుణ్కుమార్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నమ్మిన తాను అతడితో సన్నిహితంగా మెలిగానని తెలిపారు. ఈ ఏడాది నవంబరు 1న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అరుణ్కుమార్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో ఆగస్టు 24న ఉదయం సుమారు 7.30 గంటలకు అతడి ఇంటికి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ వాచ్మెన్తో పాటు కుటుంబ సభ్యులను ఆరా తీయగా..అరుణ్కుమార్కు అప్పటికే పెళ్లయిపోయిందనే విషయం తెలిసిందని పేర్కొన్నారు. అతడు ఈ ఏడాది జూలై 1న మరో యువతిని వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని యువతి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం!
పుట్టింటికి పంపడం లేదని నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: తనను పుట్టింటికి పంపడానికి భర్త నిరాకరిస్తున్నాడని మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ముద్దం నాగలక్ష్మీ (18) వివాహం ఏడు నెలల క్రితం అదే జిల్లా తూడికుర్తి మండలానికి చెందిన మాదగాని శేఖర్ (32)తో జరిగింది. ఓ హోటల్లో పనిచేస్తున్న శేఖర్ భార్యతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–4లోని సుఖ్దేవ్నగర్లో ఉంటున్నాడు. కొంతకాలంగా నాగలక్ష్మీ పుట్టింటికి వెళ్తానని భర్తను అడుగుతోంది. కొద్ది రోజుల తర్వాత వెళ్లాలని శేఖర్ సర్దిచెప్పి డ్యూటీకి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల రాఖీల పండుగ, బోనాల పండుగ సందర్భంగా అల్లుడు శేఖర్ తన కూతురిని పుట్టింటికి పంపలేదని, దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఎస్ఐ సంధ్యారాణి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం!
సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం!
రాంగోపాల్పేట్: సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి అదృశ్యమైంది. రాంగోపాల్పేట్ పోలీసులు తెలిపిన మేరకు.. కేరళకు చెందిన అధిరా అనీష్ (24) కిమ్స్లో నర్సుగా పనిచేస్తూ పీజీరోడ్లోని హాస్టల్లో ఉంటుంది. అధిరా అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కేరళ నుంచి పరామర్శించేందుకు వచ్చారు. ఆస్పత్రి వద్దను ఆమెను కలువగా చిన్న విషయానికి వాగ్వవాదం జరిగింది. తాను హాస్టల్కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయింది. అన్ని చోట్ల వెతికినా ఎక్కడా ఆచూకీ తెలియకపోవడంతో పాటు మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తల్లి రాంగోపాల్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చదవండి: వర్షిణికి వాష్రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష?
వీడియోలు
మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్
ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్
ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!
దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్
రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!
గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్
జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు
Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!
ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్
నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

