త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండానే.. ‘మహిళలను అవమానిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొనసాగుతున్న త్రిష వివాదానికి మరింత వేడి పెంచాయి. ఉదయనిధి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలు తాజా వివాదాన్ని ఉద్దేశించేలా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్..‘భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నామో మనం ఆలోచించాలి. మన ప్రజలను, మహిళలను కించపరిచేలా మాట్లాడకూడదు. మన ఇళ్లలో మహిళలు తల్లులు, సోదరీమణులుగా ఉన్నారు. మహిళలను అవమానిస్తే చట్టం చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.రాజకీయ విమర్శ వేరు.. అయితే విజయ్ మాత్రం రాజకీయ విమర్శలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. మహిళలను అవమానించే వ్యాఖ్యలకు ఆ స్వేచ్ఛను అడ్డుపెట్టుకోలేమని స్పష్టం చేశారు. గతంలో అసెంబ్లీలో మాజీ సీఎం జయలలిత ఎదుర్కొన్న అవమానాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపైనా విజయ్ మాట్లాడారు. పోలీసులు కేవలం నేరస్తులను అరెస్టు చేయడానికే పరిమితం కాకూడదని, నేరాలు జరగకుండా ముందే అడ్డుకోవడమే అసలు లక్ష్యమని చెప్పారు. చట్టాన్ని పాటించే వారికి పోలీసులు స్నేహితులుగా.. ఉల్లంఘించే వారికి శత్రువులుగా ఉండాలని పేర్కొన్నారు.TN Assembly: “If anyone talks in a derogatory manner about women, stern action is assured.”- TN CM Vijay, recalls 'humiliation' of former CM Jayalalithaa in the Assembly pic.twitter.com/c7Y6bD1kCo— News Arena India (@NewsArenaIndia) September 7, 2026పోలీసులకు హెచ్చరికలు.. తమ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై నేరాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని విజయ్ తెలిపారు. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. నేరాలను ముందుగానే నిరోధించేందుకు పోలీసులు పనిచేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సైబర్ నేరాలపై కూడా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై కూడా విజయ్ కఠిన వైఖరి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ.. తమ ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు. పోలీసులపై ఆరోపణలు వచ్చినా వారిని కాపాడే ప్రసక్తి లేదని, లాకప్లో జరిగే నేరాలపై పారదర్శక దర్యాప్తు చేపడతామని తెలిపారు.దీంతో త్రిష వివాదం నేపథ్యంలో విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. పేర్లు ప్రస్తావించకుండా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఆగస్టు 3న తంజావూరులో జరిగిన కావేరీ నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్న సమయంలో కొందరు త్రిష పేరును నినాదించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు కావేరీ సమస్యకు మాత్రమే సంబంధించినవని ఉదయనిధి వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఆగస్టు 4న పోలీసులు ఉదయనిధిని అరెస్టు చేసి తంజావూరుకు తీసుకెళ్లారు. అనంతరం అదే రోజు స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. తనపై కేసు నమోదు చేయడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా ఆయన అభివర్ణించారు.
బిగ్బాస్లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?
బిగ్బాస్ సీజన్ 10లో అసలు ఆట మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే హౌస్లో తొలినాళ్లలోనే విభేదాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం ఆసక్తిని పెంచుతోంది.బిగ్బాస్ సూచనల మేరకు..తొలి టాస్క్లో భాగంగా ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు కీలను సొంతం చేసుకున్నారు. మిగిలిన వారిలో మరో ఇద్దరికి ఆ రెండు కీలను ఎవరు ఇవ్వాలనేది నిర్ణయించుకోవాలని బిగ్బాస్ సూచించినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో ఎవరికి ఆ అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది.మరోవైపు కీల విషయంలో కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముకేశ్.. రాంప్రసాద్, త్రిగుణ్తో వాదిస్తున్నట్లు ప్రోమోలో కనిపించింది. ‘నాకు అన్నీ తెలిసినట్లు ముందే వెళ్లిపోవడానికి తొందరపడ్డారు’ అంటూ ముఖేశ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్బాస్లో ప్రత్యర్థులవుతారా..?మీతో ఆడితే గెలవచ్చు..ఇక త్రిగుణ్ మరో టీమ్తో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రోమోలో కనిపించాయి. ‘మీతో ఆడితే గెలవచ్చు’ అంటూ టెంపర్ వంశీని త్రిగుణ్ దూరం పెట్టినట్లుగా చూపించారు. దీంతో హౌస్లో గ్రూపులు ఏర్పడుతున్నాయా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఆ రెండు కీలను ఎవరికి ఇస్తారు? కీలక నిర్ణయం ఎవరికి అనుకూలంగా మారుతుంది? తెలియాలంటే ఈరోజు జగరబోయే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.ఇదీ చదవండి: టాలీవుడ్ 'చిన్న' హీరో.. బిగ్బాస్ 10లోకి వచ్చేశాడు View this post on Instagram A post shared by STAR MAA (@starmaa)
సురేఖ ఎపిసోడ్.. కాంగ్రెస్లో రేవంత్ బలపరీక్ష నెగ్గినట్టేనా?
రాజకీయాలలో సరైన వ్యూహం లేకుండా పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన తీరు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ మొత్తం ఉదంతంలో ఆమె రాజకీయంగా నష్టపోయారు. అదే టైమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను కొంతవరకు దెబ్బతీశారు. విపక్షాలకు ఆమె కొన్ని ఆయుధాలు అందించారు. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు పార్టీలో పట్టు ఉందని నిరూపించడానికి శ్రమించాల్సి వచ్చింది.కొండా సురేఖతో గత కొన్ని నెలలుగా రేవంత్కు కారణం ఏమైనా విభేదాలు ఏర్పడ్డాయి. అయినా ఆమెను మంత్రిగా కొనసాగించవలసి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనను పదవి నుంచి తప్పించారని సురేఖ ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉందా, లేదా అన్నది పక్కనబెడితే దాదాపు రెండువారాల పాటు సాగిన ఈ డ్రామా వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పరపతి కొంత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే డైలాగులకు ఈ ఎపిసోడ్ ద్వారా ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ టీడీపీ వాసన వదలుకోలేకపోతున్నారన్న భావన పలువురిలో ఉంది. కాకపోతే పైకి అనడం లేదు.సురేఖ, ఆమె భర్త మురళీ ఉమ్మడి వరంగల్ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. అందువల్లే ఆయా పార్టీలు వారిని ఆదరించక తప్పలేదు. అంతవరకు ఓకే కాని కొండా దంపతులు దానిని సద్వినియోగం చేసుకోవడంలో సఫలం కాలేకపోతున్నారు. 1999లో తొలిసారి శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు వారిది ఘర్షణాత్మక రాజకీయమే. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డితో తప్ప, ఆయా పార్టీల నేతలు పలువురితో గొడవలు ఉండేవి. రెండున్నర దశాబ్దాల తర్వాత, లక్కీగా మంత్రి అయిన తర్వాత కూడా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సఖ్యత లేకపోవడం పెద్ద మైనస్గా కనిపిస్తుంది. పోనీ రాష్ట్ర స్థాయిలో ఎవరితోనైనా అవగాహనతో ఉన్నారా అంటే అదీ కనిపించదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తేడా వచ్చాక, తెలివిగా వేరే ముఖ్యమైన నేతలు, మంత్రుల మద్దతు పొందే యత్నం చేయాలి. కాని వీరు రేవంత్ సోదరులపైన, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితర నేతలు పలువురిపైన ఆరోపణలు గుప్పించారు. దాంతో ఈమెకు అండగా నిలవడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారనిపిస్తుంది. గతంలో కూడా వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్లో ఏర్పడిన పరిణామాలలో తొలుత వైఎస్సార్ కుమారుడు జగన్కు మద్దతుగా ఉన్నా, తదుపరి ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో అనవసర విమర్శలు చేశారు. రోశయ్య క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఆయనను వ్యతిరేకించారు. నిజానికి అప్పట్లో రఘువీరారెడ్డి వంటి వారు కూడా రోశయ్య క్యాబినెట్ లో చేరడానికే ఇష్టపడలేదు. కాని తదుపరి సర్దుకుపోయారు. కొండా సురేఖ మాత్రం అలా వ్యూహాత్మకంగా చేయలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా, మళ్లీ అక్కడే గొడవే అయింది. కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యే, మంత్రి అవ్వడం విశేషమే. రేవంత్తో మొదట సత్సంబంధాలు ఉన్నా, కారణం ఏమిటో కాని తేడా వచ్చింది. ఈమె భర్త కొండా మురళీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్న అసంతృప్తి ఉండవచ్చు. ఇంకేదైనా కావచ్చు. పరకాలలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి తిరిగి టిక్కెట్ ఇస్తామని రేవంత్ ప్రకటించడం వీరికి ఆగ్రహం తెప్పించింది. కొండా కుమార్తె సుస్మిత దానిపై ఒక సభలో తీవ్రమైన భాషలో ప్రసంగం చేయడం, రేవంత్పై ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది. దానికి ముందు ఒఎస్డి కేసులో మంత్రి ఇంటిని సోదా చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఈమె పరుష వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎలాగో రాజీ చేశారు. కాని ఈసారి రేవంత్ సీరియస్గా తీసుకున్నారు.నిజానికి తన కుమార్తె సీఎంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వెంటనే సురేఖ నిలువరించి ఉండాల్సింది. లేదా ఆ వెంటనే ఖండించి ఉండాల్సింది. ఎందువల్లో సురేఖ ఆ పని చేయలేదు. దాంతో వివాదం ముదిరింది. ఎంత కాదన్నా ముఖ్యమంత్రికి ఉండే పవర్ వేరు. ఆమె తన మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని, ఇతరత్రా విమర్శలు చేసినా, ప్రయోజనం ఉండదు. క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇచ్చినప్పుడు సారీ చెబితే అయిపోయేదానికి మంత్రి పదవి పోయేవరకు తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏఐసీసీకి ఇచ్చిన లేఖ బయటపెట్టినా పెద్దగా ప్రకంపన ఏమీ రాలేదు.బహుశా ఆమె భర్త మురళీ ఆమె రాజకీయ ఎదుగలకు, అలాగే పతనానికి కూడా కారణమా అన్న విశ్లేషణ వస్తుంది. దానికి తగినట్లే మురళీ ఇంత జరిగిన తర్వాత మీడియాకు కనిపించేలా మీసం మెలి తిప్పుతూ కన్పించారు. అంటే జనంలో తనకు అంత పట్టు ఉందని చెప్పదలిచి ఉండవచ్చు. కాని వర్తమాన రాజకీయాలలో ఎన్నికలు వచ్చేవరకు అధికారంలో ఉన్నవారిదే పెత్తనం అవుతుంది. ఇవన్ని వారికి అనుభవమే అయినా, ఏ ధైర్యంతో ఇలా చేశారో తెలియదు. వారి ప్లాన్ బి ఏమిటో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతామని సురేఖ ప్రకటించడం కాస్త తెలివైన చర్యగానే కనిపిస్తుంది. సమయం మించిపోయాక రక్షాబంధన్ రాఖీని రేవంత్కు కట్టినా ప్రయోజనం కలగలేదనుకోవాలి.ఇక రేవంత్ వైపు చూస్తే సురేఖ ఇష్యూ మొదలు కాగానే పదవి నుంచి తప్పించి ఉంటే ఆయన పవర్ పుల్ గా ఉన్నారన్న అభిప్రాయం కలిగేది. సురేఖపై కొంతమంది ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడంతో పార్టీలో వివాదాలు రచ్చకెక్కినట్లయింది. అధిష్టానం వద్దే పంచాయతీ జరగడం, ఆ పైన మరికొన్ని రోజులు జాప్యం జరగడంతో రేవంత్ కూడా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందేనన్న అభిప్రాయం కలుగుతుంది. అందువల్లే రేవంత్ హైకమాండ్ను బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ ఆరోపించగలిగారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. సురేఖ రాఖీ కట్టిన తర్వాత రాజీ కుదిరిందేమోనని అనుకున్నారు. కాని రేవంత్ అందుకు సిద్దపడలేదన్నమాట.బీసీ వర్గానికి చెందిన మహిళ సురేఖను పదవినుంచి తప్పించడంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే తుది నిర్ణయం జరిగి ఉంటుంది. ఈ వివాదం తొలుత రేవంత్ వ్యాఖ్యలతోనే ఆరంభమైన సంగతిని కూడా కాంగ్రెస్ క్యాడర్ గుర్తించి ఉంటారు. గతంలో పవర్ ఫుల్ ముఖ్యమంత్రులన్న పేరున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు సైతం బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేసేవారుకాదు. మరో బలమైన నేత చెన్నారెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి పదవి కోల్పోయారు. అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన ఒక మంత్రి విమర్శలు చేసిన వెంటనే పదవి నుంచి తప్పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాటికొండ రాజయ్య, ఈటెల రాజేందర్ లను బర్తరఫ్ చేశారు.కాగా తాను ఎవరికి భయపడనని, స్నేహంగా అడిగితే అన్నీ చేసి పెడతానని రేవంత్ అంటున్నారు. ఇది అచ్చంగా గతంలో కొన్నిసార్లు ఆయన గురువు చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం మాదిరే కనిపిస్తుంది. అయితే చంద్రబాబు ప్రాంతీయ పార్టీ అధినేత కాబట్టి కొంతవరకు చెల్లవచ్చు. అయినా ఆయన అన్నీ అంచనా వేసుకున్నాకే ధైర్యం చేసేవారు. కొన్నిసార్లు ఏమి జరగనట్లు రాజకీయం సాగించేవారు. కాంగ్రెస్లో అది అంత తేలికకాదు. ఎవరికి ఉండే బలం వారికి ఉంటుంది. ప్రస్తుతానికి కర్ణాటకలో మాదిరి ఒక నేత ఎవరూ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడే దశ తెలంగాణలో రాలేదు. అది ఆయనకు కలిసివచ్చే అంశం. అయితే తన కుటుంబ సభ్యులపైన, సన్నిహితులు కొందరిపైన సురేఖ చేసిన ఆరోపణల వల్ల కాంగ్రెస్కు కొంత నష్టం జరుగుతుంది. వాటిపై అసెంబ్లీలో చర్చ జరగాలని విపక్షం పట్టుపట్టవచ్చు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అదొక సమస్య అయ్యే అవకాశం ఉంది. కాగా సౌమ్యుడుగా పేరొందిన చిన్నారెడ్డి అనూహ్యంగా వివాదంలో చిక్కుకుని పదవి పోగొట్టుకోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. బీసీ నేత పదవినే తీసేశారన్న విమర్శ రాకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. ఓవరాల్గా ఈ పరిణామాలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలలో పలచన కావచ్చు. సురేఖ రాజకీయం ముళ్లబాటగా మారే అవకాశం ఉంటుంది. కాగా, రేవంత్ తన పరపతి నిలబెట్టుకున్నప్పటికీ, కొంత డామేజీని భరించక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: విజయసాయి మాట ఎందుకు మార్చారు?
జట్టు కడతారా.. గట్టునుంటారా!
అన్నమయ్య జిల్లా టీడీపీ నేతలు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగానే ముందుకు సాగుతున్నారా? పలు నియోజకవర్గాలకు ఇన్చార్జ్లు మార్చినా వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయా..? జిల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అధిష్టానానికి తలనొప్పులుగా మారాయా? అంటే..అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.అన్నమయ్య జిల్లా టీడీపీ రాజకీయాల్లో వర్గ విభేదాలు సమసిపోలేదు. నిన్నటిదాకా జిల్లా టీడీపీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు కొనసాగి.. బలాబలాలు సమానంగానే ఉన్నాయి. ఇటీవల తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్లను మార్చడంతో ఇప్పుడు అందరి దృష్టి కొత్త నేతలపై పడింది. వీరు మంత్రి మండిపల్లి శిబిరంలో చేరుతారా లేక నల్లారి కిశోర్ పక్షాన వెళ్తారా అన్నది జిల్లా టీడీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జిల్లా రాజకీయాల్లో కీలకమైన మంత్రి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారన్నది ఉత్కంఠగా కనిపిస్తోంది. మొన్నటిదాకా రెండు వర్గాలుజిల్లా టీడీపీ రాజకీయాల్లో జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ నియామకం కాక ముందు వరకు జిల్లా మంత్రి చుట్టూ రాజకీయాలు నడిచాయి. అప్పటివరకు పుంగనూరు ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఇన్చార్జి జయచంద్రారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, మాజీ ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు మండిపల్లి వర్గంగా ముద్రపడ్డారు. ఈ పరిస్థితుల్లో కొంతకాలం న్యూట్రల్ గా ఉన్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంత్రిపై అసంతృప్తితో పీలేరు ఎమ్మెల్యే కిశోర్ కుమార్ రెడ్డితో జతకట్టారు. తర్వాత కొంతకాలానికి ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు కావడంతో ఈ ముగ్గురు ఒక వర్గంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు. జిల్లాలో వీరంతా మంత్రితో కలిసి పాల్గొన్న సందర్భమే లేదు.చల్లా, దాసరిపల్లి తొలగింపుతంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఇరుక్కోవడంతో ఆయనను పార్టీ నుంచి అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. పుంగనూరు నియోజవర్గంలో చల్లాపై వచ్చిన ఆరోపణలతో ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. మంత్రి మండిపల్లికి రెండు నియోజకవర్గాల నుంచి అండగా ఉన్న ఇద్దరు నేతల బలం తగ్గిపోయింది.ఆ ఇద్దరు ఎవరి వైపు..కొత్తగా వచ్చిన ఇన్చార్జీలు ఏ వర్గం వైపు ఉంటారన్నది పార్టీ నేతల్లో అమితాసక్తి నెలకొంది. పుంగనూరు, తంబళ్లపల్లె గత ఇన్చార్జిలు ఉండగా రెండు వర్గాల బలం సమంగా ఉండేది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, మధుసూదన్ నాయుడు ఇన్చార్జిలు కావడంతో వీరు ఎవరి వైపు వెళ్తారన్నది చర్చనీయాంశమైంది.శంకర్ విషయానికి వస్తే..గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన ఆవేదనతో ఉన్న శంకర్ యాదవ్ తిరిగి ఇంచార్జ్ అయ్యారు. జయచంద్రారెడ్డి నకిలీ మద్యం తయారు కేసులో నిందితుడు కాకపోయి ఉంటే శంకర్కు తిరిగి అవకాశం వచ్చేది కాదు. కాగా గత పరిస్థితులను పరిశీలిస్తే శంకర్ కిశోర్ వైపు వెళ్తారన్నది అనుమానమే. ఎందుకంటే శంకర్ కాంగ్రెస్ పారీ్టలో చేరి రాజకీయాల్లోకి వచ్చాక అప్పటి కిరణ్ సర్కార్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొన్నారు. తాజాగా టీడీపీ ఇన్చార్జిగా శంకర్కి బాధ్యత అప్పగించే విషయంలో కిశోర్ పలు సందర్భాల్లో చంద్రబాబు ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారని పారీ్టలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శంకర్ కిశోర్తో జత కడతారా అన్నది అనుమానమే. అలాగే మంత్రి మండిపల్లి విషయంలోనూ శంకర్ సానుకూలంగా ఉండే అవకాశాలు లేవు. దాసరిపల్లి జయచంద్రారెడ్డిపై నియోజకవర్గ టిడిపిలో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ మంత్రి అండగా నిలిచారని శంకర్ వర్గం రెండేళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉంది.మధు ఎటు వైపు.. పుంగనూరు ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు ఇన్చార్జిగా నియమితులయ్యాక కిశోర్, చల్లాను కలవగా, మంత్రి మండిపల్లిని, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవలేదని తెలుస్తోంది. దాసరిపల్లి, చల్లా ఇద్దరూ మంత్రి వర్గీయులుగా కొనసాగిన కారణంతో శంకర్, మధులు మంత్రితో జత కట్టేందుకు మొగ్గచూపకపోతే..జిల్లాలోని ఐదు నియోజకవర్గ నేతల్లో నలుగురు ఓ వర్గమై, జిల్లాలో రాజకీయాల్లో మంత్రి ఒంటరిగా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు ఏ జట్టులో చేరుతారో.. గట్టునుండి చూస్తుండిపోతారో వేచిచూడాలి.చదవండి: ఏళ్లుగా కష్టపడ్డాం.. పదవి మాత్రం లంకకు!
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు: వైఎస్ అవినాష్రెడ్డి
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!
పాక్ సెలక్టర్ పదవికి రాజీనామా.. టీమిండియాపై ప్రశంసలు!
జట్టు కడతారా.. గట్టునుంటారా!
భారత్తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్
హర్ముజ్లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
పెళ్లి బాజాలకు స్వల్ప విరామం
మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్డౌన్!
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
సాక్షి కార్టూన్ 07-09-2026
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
జియో రీచార్జ్ ప్లాన్: 200 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్లు!
సాక్షి కార్టూన్: 05-09-2026
వాటిని మర్చిపోలేక ఇప్పుడు డీఎస్సీ దెబ్బలతో రియాక్షన్ చూపిస్తున్నారా సార్!
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఇంట్లో బంగారు కడ్డీలు.. లెక్కల్లో లేని కోట్ల నగదు
తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు
ఈ రాశి వారికి పనుల్లో విజయం.. ఆస్తులు కొంటారు
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు: వైఎస్ అవినాష్రెడ్డి
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!
పాక్ సెలక్టర్ పదవికి రాజీనామా.. టీమిండియాపై ప్రశంసలు!
జట్టు కడతారా.. గట్టునుంటారా!
భారత్తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్
హర్ముజ్లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
పెళ్లి బాజాలకు స్వల్ప విరామం
మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్డౌన్!
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
సాక్షి కార్టూన్ 07-09-2026
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
జియో రీచార్జ్ ప్లాన్: 200 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్లు!
సాక్షి కార్టూన్: 05-09-2026
వాటిని మర్చిపోలేక ఇప్పుడు డీఎస్సీ దెబ్బలతో రియాక్షన్ చూపిస్తున్నారా సార్!
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఇంట్లో బంగారు కడ్డీలు.. లెక్కల్లో లేని కోట్ల నగదు
తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు
ఈ రాశి వారికి పనుల్లో విజయం.. ఆస్తులు కొంటారు
ఫొటోలు
‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సారీలో సారా.. ధురుంధర్ భామ (ఫొటోలు)
పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు
సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు
తెలుగు బిగ్బాస్ సీజన్ 10... కంటెస్టెంట్స్ వీళ్లే (ఫొటోలు)
ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)
నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్ సెలెబ్రెటీలు (ఫోటోలు)
ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)
'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
బిగ్బాస్ 10: హాట్ టాపిక్గా నాగార్జున రెమ్యునరేషన్
బిగ్బాస్ షో అనగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికి గుర్తొచ్చే ఏకైన పేరు ‘కింగ్’ నాగార్జున. తెలుగులో ఇప్పటివరకు 9 సీజన్లు పూర్తవ్వగా..మొదటి రెండు తప్ప మిగిలిన సీజన్లన్నింటికీ ఆయనే హోస్ట్గా చేశాడు. తెరపై స్టైలీష్ ఎంట్రీ ఇస్తూనే తనదైన మాటతీరుతో దారితప్పుతున్న ఆటను గాడిలో పెడుతూ..బిగ్బాస్ షోని విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయితే సీజన్ 10కి కొత్త హోస్ట్ వస్తాడని ప్రచారం జరిగినప్పటికీ..మళ్లీ నాగార్జుననే బరిలోకి దింపారు నిర్వాహకులు. దీని కోసం భారీగా పారితోషికం అందించారట. ఇప్పుడు నాగార్జున రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.సీజన్ 3కి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకున్న నాగార్జున.. సీజన్ 9కి వచ్చేసరికి రూ. 35 కోట్ల వరకు తీసుకున్నాడట. తెలుగు బిగ్బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డు నాగార్జునకే దక్కింది. ఇక సీజన్ 10కి వచ్చేసరికి పారితోషికం మరింత పెరిగినట్లు సమాచారం. బిగ్బాస్ 10 కోసం నాగార్జునకి రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులోనే స్పెషల్ ప్రోమోలు, ప్రమోషనల్ షూట్స్ కూడా ఉన్నాయట. దాదాపు 15 వారాల పాటు బిగ్బాస్ షో కొనసాగుతుంది. ఫినాలతో కలిపి మొత్తం 30 రోజుల పాటు నాగార్జున షోలో కనిపిస్తాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పారితోషికం విషయం నిజమే అయితే.. ఒక్కో రోజు రూ. కోటికిపైనే తీసుకుంటున్నల్లు లెక్క. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమే. అసలు పారితోషికం ఎంత అనేది అధికారికంగా ప్రకటించలేరు.కాబట్టి ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు.
Bigg Boss 10: బిగ్బాస్లోకి నిజామాబాద్ కుర్రాడు
ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు.
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. కేవలం మౌత్ టాక్తో వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ల మార్క్ దాటేసింది.తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీకమాసం ఫుల్ వీడియో పాటను ఇరుముడి టీమ్ విడుదల చేసింది. ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ పాడడంతో పాటు కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించగా.. సాయి కుమార్ కీలక పాత్రలో మెప్పించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
Bigg Boss 10: హౌస్లోకి అడుగుపెట్టిన 16 మంది వీళ్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 10వ సీజన్ గ్రాండ్గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్గా సందడి చేశాడు. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్ నుంచి 6 మంది హౌస్లోకి వెళ్లారు. ఈ సారి హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ జాబితా, వారి నేపథ్యంతో పాటు లాంచ్ ఎపిసోడ్ ఎలా జరిగిందో పూర్తి వివరాలు ఇదిగో...బిగ్బాస్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే1) దేబ్జానీ మోదక్2) త్రిగుణ్3) సింగర్ ఝాన్సీ4) సుధీర్రెడ్డి5) అమన్6) చైత్ర రాయ్7) రాంప్రసాద్8) షాలిని9) టెంపర్ వంశీ10) సృష్టి11) జబర్దస్త్ నరేశ్12) చరణ్13) కృష్ణుడు14) వర్షిణి15) రోహిత్16 నిహర్ ముకేశ్పదహారో కంటెస్టెంట్గా నిహర్ ముకేశ్ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్బాస్ హౌస్లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్ వచ్చేశాడు. 16వ కంటెస్టెంట్గా లోపల అడుగుపెట్టేశాడు. ‘రయ్ రయ్ రారా’ సాంగ్కు డ్యాన్స్ వేస్తూ పదహారో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు నిహర్ ముకేశ్. ‘సామాన్య కుటుంబం నుంచి వచ్చా. 10 సంవత్సరాల కిందట యాక్టర్ అవ్వాలనుకున్నా. ఇప్పుడు సినిమాలో హీరో వరకు వచ్చా. యాక్టర్గా ప్రతి ఒక్కరు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అలా బిగ్బాస్లో కూడా నాకో అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుని ప్రేక్షకుల మనసును గెలుచుకుంటా. తెలుగు నాకు మాట్లాడటం రాదు. ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. తెలుగు నా నాలుక మీద కాదు గుండెలో ఉంటుంది‘ అని తెలిపాడు.ముఖేశ్ విషయానికి వస్తే..రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేశ్ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్గా 10వ సీజన్లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుందిపదిహేనో కంటెస్టెంట్గా రోహిత్పదిహేనో కంటెస్టెంట్గా ఎంపిక చేసేందుకు బిందు మాధవి వచ్చారు. రోహిత్ని ఎంపిక చేశారు. నాగార్జున రోహిత్కి టాస్క్ ఇచ్చారు. గ్లాస్ తీసుకెళ్లి హౌస్లో ఉన్నవారిలో ఒకరి మీద వాటర్ వేయమన్నారు. అయితే ఇలా చేయలేనని రోహిత్ చెప్పాడు. అనంతరం వైట్ గోల్డ్ మెడల్ తీసుకుని హౌస్లోకి వెళ్లాడు. పద్నాలుగో కంటెస్టెంట్గా వర్షిణివిశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలోని ‘పుట్టా ముద్దుగా’. పాటకు డ్యాన్స్ వేస్తూ బిగ్బాస్లోకి అడుగెపెట్టింది యాంకర్ వర్షిణి. ‘ఇదొక మంచి ఫ్లాట్ఫాం. నేను ఇక్కడ ఫిట్ అవుతానని అనుకోలేదు.రోజు నిద్రపోయే ముందు నాకు నేను ప్రశ్నించుకున్నా. తర్వాత కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది.వర్షిణి విషయానికి వస్తే..వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్బాస్లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి?పదమూడో కంటెస్టెంట్గా కృష్ణుడుతెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.'బిగ్బాస్' హౌస్లో 13వ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. ‘నాలో చాలా యాంగిల్స్ అన్నీ హౌస్లో చూపిస్తా’ అని కృష్ణుడు తెలిపారు. కృష్ణుడు విషయానికి వస్తే.. అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి?పన్నెండో కంటెస్టెంట్గా చరణ్ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం బిగ్బాస్ హౌస్కి ఎంపికయ్యాడు చరణ్. ‘నేను ఉండే విధానమే నా బలం. చుట్టు ఉన్నవాళ్లని నవ్విస్తా. తండ్రి చిరంజీవిగారికి, మీకు పెద్ద అభిమాని‘ అని చరణ్ నాగార్జునతో తెలిపారు. నాగార్జున లైవ్లో తన తండ్రికి నమస్కారాలు తెలిపారు. వైట్ గోల్డ్ మెడల్ అందుకున్న అనంతరం చరణ్ హౌస్లోకి వెళ్లాడు. ఎవరీ చరణ్..ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు.పదకొండో కంటెస్టెంట్గా జబర్దస్త్ నరేశ్పంజా సినిమాలోని భూమికి జానడు సాంగ్కి డ్యాన్స్ వేస్తూ బిగ్బాస్ హౌస్లోకి నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గూగుల్లో నరేశ్ అని వెతికితే బిగ్బాస్ నరేశ్ వచ్చేలా కష్టపడతానని తెలిపాడు. నరేశ్ విషయానికి వస్తే.. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్ ఆడిషన్స్కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.పదో కంటెస్టెట్గా సృష్టిమరో కంటెస్టెట్ని ఎంపిక చేసేందుకు జ్యూరీ ద్వారా ఎంపిక చేసేందుకు శ్రీముఖి వచ్చారు. సృష్టిని ఎంపిక చేశారు. ఈమెకు సైతం నాగార్జున వైట్ గోల్డ్ మెడల్ అందించారు. తొమ్మిదో కంటెస్టెంట్గా టెంపర్ వంశీటెంపర్ సినిమాలో విలన్గా నటించి ఆకట్టుకున్న వంశీ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లాడు. తన సినీ కష్టాలను తెలియజేసేలా ఏవీని రెడీ చేసుకొని స్టేజ్పైకి ఎంట్రీ ఇచ్చాడు. ‘చిరంజీవి మీద ఉన్న ఇష్టం.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కాలేజీ పుస్తకాలు చదవలేదు. కానీ చిరంజీవి ఉన్న సినిమా పుస్తకాల్ని ఒక్కటీ విడిచిపెట్టలేదు’ అని వంశీ చెప్పారు. సినిమా కష్టాల కోసం వివరించారు. కట్టేకాలేంత వరకు సినిమాలు చేస్తూ ఉంటానన్నారు. దాదాపు 50 సినిమాలు చేశానని చెప్పారు. తర్వాత పలు పాటలకు డ్యాన్స్ చేశారు. వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు.చూడటానికి రఫ్ అండ్ టఫ్గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి?ఎనిమిదో కంటెస్టెంట్గా షాలినీఎనిమిదో కంటెస్టెంట్గా కామనర్స్ నుంచి ఒకరి పంపే అవకాశం జ్యూరీకి ఇచ్చాడు నాగార్జున. దీంతో నవదీప్ .. దీపక్, హేమంత్, షాలినీలను పిలిచాడు. వీళ్లలో నుంచి చివరగా షాలినీని సెలెక్ట్ చేసినట్లు నవదీప్ ప్రకటించాడు. నవదీప్ సార్ నన్ను ఎంపిక చేసినప్పుడు ఇది నిజంగానే జరిగిందా అని ఆశ్చర్చపోయానని షాలనీ తెలిపారు.ఏడో కంటెస్టెంట్గా జబర్దస్త్ రాంప్రసాద్రాంప్రసాద్కు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లను చూసి వాళ్లు ఎం మాట్లాడుకుంటున్నారో మాకు లిప్ మూమెంట్ చెప్పాలని నాగార్జున అడిగారు. ఎలాగైనా మమ్మల్ని నవ్వించాలన్నారు. రాంప్రసాద్ నవ్వించే ప్రయత్నం చేశారు. రాంప్రసాద్ విషయానికొస్తే ..ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్కి రైటర్గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్తో కలిసిపోయాడు. ఇతడి టీమ్లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.ఆరో కంటెస్టెంట్గా చైత్ర రాయ్ అష్టాచెమ్మా సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అసలు పేరు చైత్రరాయ్. భర్త పేరు ప్రశన్న శెట్టి. రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో అమ్మగా, అక్కగా, భార్యగా పాత్రలు పోషిస్తున్నాను. ఒక నెగిటివ్ కామెంట్ వల్ల చాలా బరువు తగ్గారు . చిన్న బేబిని వదిలి బిగ్బాస్ హౌస్కి వచ్చినట్లు తెలిపారు. చైత్ర విషయానికొస్తే.. సీరియల్స్తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.బిగ్బాస్ గ్రాండ్ లాంచ్లో తమిళ యాక్టర్స్ సూర్య, కార్తీ సందడి చేశారు. సర్దార్2 మూవీ ప్రమోషన్స్ కోసం వాళ్లు బిగ్బాస్ షోకి వచ్చారు. ఐదో కంటెస్టెంట్గా అమన్బిగ్బాస్ 10వ సీజన్లో 5వ కంటెస్టెంట్స్గా కామనర్స్ నుంచి అమన్ వెళ్లాడు. ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా గెలిచి హౌస్లోకి వెళ్లాడు. సీక్రెట్ టాస్క్హోస్ట్ నాగార్జున అమన్కు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఒక రెడ్ బాక్స్ ఇచ్చి.. అందులో రెడ్ డాట్ ఉందని, హౌస్లోకి వెళ్లాక..వచ్చే ముగ్గురిలో కనీసం ఒకరికైనా ఇది తెలియకుండా పెట్లాలని అమన్కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. అమన్ కోసం ఒక స్వీట్ మెమోరీ అంటూ చిరిగిపోయిన టీషర్టును నాగార్జున అందించారు. వచ్చే శనివారానికి ఎన్ని హోల్స్ ఉన్నాయో చెప్పాలన్నారు. ఓ గోల్డ్ మెడల్ అందిచారు. నాలుగో కంటెస్టెంట్గా సుధీర్ రెడ్డినాలుగో నాలుగో కంటెస్టెంట్గా సుదీర్ వచ్చారు. సోషల్మీడియాలో ఇంటర్వ్యూ చేస్తూ అందరికి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం 'సుధీర్ టాక్స్' పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ(నంద్యాల)లో పుట్టి పెరిగిన సుధీర్.. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటూ పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు. తనకు ఇంటర్వ్యూ చేయమని నాగార్జున కోరగా..‘నాకు మీలో బాగా నచ్చేది. బిజినెస్ మ్యాన్గా, హీరోగా బాగా రాణిస్తున్నారు. లైఫ్లో ఎదైనా వెలితి ఉందా?’ అని అడగ్గా టైమ్ సరిపోవడం లేదని నాగార్జున అన్నాడు.సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి.. ఇప్పుడు బిగ్బాస్ 10లో ఓ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టడు. మరి బుల్లితెరపై అలరించిన ఇతడు ఈ రియాలిటీ షోలో ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి? మూడో కంటెస్టెంట్గా సింగర్ ఝాన్సీ గోల్డేన్ టికెట్ సాధించి సింగర్ ఝాన్సీ మూడో కంటెస్టెంట్గా వచ్చారు. ‘మూడో తరగతి నుంచే పాటలు పాడటం మొదలు పెట్టా. అందరికీ తెలిసేలా నన్ను నేను నిరూపించుకునేందుకు ‘బిగ్బాస్’కువచ్చా. అనుకోకుండా గోల్డెన్ టికెట్ సొంతం చేసుకున్నా.‘ అని తెలిపిందిఝాన్సీ కోసం కొన్ని విషయాలు..తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్తో గెలిచి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?రెండో కంటెస్టెంట్స్గా యాక్టర్ త్రిగున్ రెండో కంటెస్టెంట్స్గా యాక్టర్ త్రిగూన్ ఎంట్రీ ఇచ్చాడు. ది ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే శనివారానికి హౌస్కి వచ్చేసరికి కనీసం ముగ్గిరికి హౌస్లో దెయ్యం ఉందని నమ్మించాలి అని నాగార్జున అతనికి టాస్క్ ఇచ్చారు. త్రిగున్ నేపథ్యం ఇదే.. తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్ అరుణ్.. జెనీలియా 'కథ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.ప్రస్తుతానికైతే అదిత్ చేసిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా తెలుగులో రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో సెకండ్ హీరోగానూ నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్బాస్ 10 హౌస్లోకి అడుగుపెట్టాడు. వ్యక్తిగత విషయానికొస్తే 2023లో నివేదిత అనే అమ్మాయిని అదిత్ అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గతేడాది ఓ ఆడపిల్ల పుట్టింది. ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంటింటికి మళ్లీ పలికే పేరు కావాలి’ అని బిగ్బాస్లోకి వస్తున్నాని త్రిగున్ చెప్పాడు. అంతేకాదు. 2.0 స్టార్ట్ చేశానని.. ఇకపై త్రిగున్ని కొత్తగా చూశారని కూడా చెప్పాడు. మరి నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. ఈ షోలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.మొదటి కంటెస్టెంట్ దేబ్జానీ మోదక్‘గిరిగిర గింగిరానివే’ పాటకి చిందులు వేస్తూ మొదటి కంటెస్టెంట్గా దేబ్జానీ మోదక్ వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘మొదటి కంటెస్టెంట్గా అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. నా గురించి మూడు ముక్కల్లో చెప్పమంటే ఫన్ లవింగ్, నిజాయతీ, డే డ్రీమర్ను. నేను ఎక్కువగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడతా. ఎక్కడ వర్క్ చేసినా, రాత్రయితే ఇంటికి వచ్చేయాల్సిందే’ అని అన్నారు. దేబ్జానీకి నాగార్జున టాస్క్ ఇచ్చారు. హౌస్లోకి వచ్చే వాళ్ల ప్రవర్తన బట్టి వాళ్లకు పేర్లు పెట్టాలని కొన్ని బ్యాడ్జ్లను అందించారు.ఎవరీ దేబ్జానీ మోదక్ కోల్కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టింది.ఓ మ్యాజిక్ కీ ని నాగర్జున చూపించారు దాని కథ తెలుసుకునేందుకు బిగ్బాస్ హౌస్లోకి వెళ్లారు. హౌస్ అంతా కలియతిరిగిన నాగార్జునకు బిగ్బాస్ స్వాగతం పలికారు. తిరిగి స్టేజీపైకి వచ్చేశారు.బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్బాస్ సీజన్ 10’ ఎట్టకేలకు గ్రాండ్గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి షోకు మరింత జోష్ తీసుకొచ్చారు. పాటకు స్టెప్పులేస్తూ అలరించిన ఆయన.. ఈ సీజన్లో ఆట మరింత ఆసక్తికరంగా, సవాళ్లతో సాగబోతుందనే ఆయన చెప్పిన మాటలు, సరికొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక అసలు సందడి మొదలైంది. బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. షో ప్రారంభం అయితే చాలు టీవీకి అతుక్కుపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ షోకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 10వ సీజన్తో అలరించడానికి రేడీ అయింది. ఈ రోజు(సెప్టెంబర్ 6) బిగ్బాస్ 10 ప్రారంభం కానుంది. బిగ్బాస్ 10 ప్రోమో వచ్చేసిందిబిగ్బాస్ సీజన్ 10 మరికాసేపట్లో(సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ లాంచింగ్ ఎపిసోడ్ ప్రోమోని వదిలారు.గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా లాంచింగ్ గ్రాండ్గా ఉండబోతున్నట్లు పోమో చూస్తే అర్ధమవుతుంది. రైతు బిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలోనే చూపించారు.అలాగే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది. ఈ మూడు భాషల బిగ్బాస్ హోస్టులు(విజయ్ సేతుపతి, మోహన్ లాల్, సుదీప్) నాగార్జునతో వర్చువల్గా భేటీ అయ్యారు.‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్’ ఓటీటీలో సాయత్రం 7 గంటల నుంచి ప్రసారం అవుతుంది. ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు సీజన్ 10పై మరింత ఆసక్తిని పెంచేశాయి. పదో సీజన్ కు తగ్గట్టుగా దశావతారం అనే కాన్సెప్ట్తో సరికొత్త సర్ప్రైజ్లు ఇవ్వడానికి నిర్వాహకులు భారీ ప్లాన్ చేశారట. మరి షో ఎలా ఉండబోతుంది. కంటెస్టెంట్స్ ఎవరనేది మరికాసేపట్లో తెలిసిపోతుంది. అయితే షో ప్రారంభానికి ముందే నెట్టింట సీజన్ 10పై భారీ చర్చ జరుగుతోంది.తెలుగు బుల్లితెరపై ఇతర భాషల ‘బిగ్ బాస్’ హోస్ట్స్ సందడిబిగ్గాస్ 10 లాంచింగ్ని మరింత గ్రాండ్గా ప్లాన్ చేశారట. ఈ సారి అనేక సర్ప్రైజ్లతో లాంచింగ్ ఎపిసోడ్ని రూపొందించారట.అందులో భాగంగా ఇతర భాషల బిగ్బాస్ హోస్టులంతా తెలుగు బిగ్బాస్ వ్యాఖ్యాత నాగార్జునతో వర్చువల్గా భేటీ అవుతారట. ఈ సారి తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది.గెస్టులుగా కార్తీ, ఆనంద్ దేవరకొండబిగ్బాస్ 10 గ్రాండ్ లాంచ్కి తమిళ హీరో విజయ్తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ గెస్టులుగా వచ్చి ప్రేక్షకులను అలరించబోతున్నారట. ఎపిక్ సినిమా ప్రమోషన్స్ భాగంగా హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటు ఆనంద్ దేవరకొండ స్టేజ్పైకి రాబోతున్నారు. ఇక సర్దార్ 2 మూవీ ప్రమోషన్స్ కోసం కార్తీ కూడా బిగ్బాస్ షోకి వచ్చారట.బిగ్బాస్ 10లోకి 16 మందిఈ సారి హౌస్లోకి తొలి రోజే మొత్తం 16 మందిని పంపించబోతున్నారట. వారిలో సామాన్యుల కోటా నుంచి ఆరుగురు, సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది ఉన్నారు.హౌస్లోకి వెళ్లే సెలెబ్రెటీలు వీళ్లే..?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా ప్రకారం బిగ్బాస్ 10లోకి వెళ్లే సెలెబ్రెటీల లిస్ట్ ఇదే. 1) ఆటో రాంప్రసాద్2) టెంపర్ వంశీ3) దేబ్జానీ మోదక్4)యాంకర్ వర్షిణి5) ముఖేష్ గౌడ6)చైత్రా రాయ్7) నటుడు కృష్ణుడు8) జబర్దస్త్ నరేశ్9) టెంపర్ వంశీ10)యాంకర్ సుధీర్ రెడ్డిఅగ్ని పరీక్ష నుంచి వెళ్లే ఆరుగురు వీళ్లే.. 1) ఝాన్సీ2) రోహిత్ నాయుడు3)శ్రష్టి4) చరణ్5)అమన్ మసూద్6)షాలిని పటేల్
క్రీడలు
సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు
చైనా మాస్టర్స్ సూపర్-750 టైటిల్ నెగ్గిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ రెడ్డి-చిరాగ్ శెట్టికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. "చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్స్గా నిలిచినందుకు మీకు అభినందనలు. మీ కమ్బ్యాక్ నిజంగా ఒక అద్భుతం. మీ పట్టుదల, దృడ సంకల్పం, పోరాట స్ఫూర్తి యావత్ దేశానికి గర్వకారణం. రాబోయే సంవత్సరాల్లోనూ మీ జోడీ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on becoming the first Indians to win the China Masters Super 750 title with a spectacular comeback. Your grit, resilience, and fighting spirit have made the entire nation proud. Wishing you both many more… pic.twitter.com/Rm9Ia0Vzew— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2026ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్కు చేరింది.Read: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా!
రింకూ సింగ్ అట్టర్ ప్లాప్.. అయినా టైటిల్ కొట్టేశాడు
యూపీ టీ20 లీగ్-2026 విజేతగా రింకూ సింగ్ సారధ్యంలోని మీరట్ మేవరిక్స్ నిలిచింది. ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో లక్నో ఫాల్కన్స్ను 94 పరుగుల తేడాతో చిత్తు చేసిన మీరట్.. రెండో యూపీ టీ20 టైటిల్ను ముద్దాడింది. ఈ తుది పోరులో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ ఓపెనర్ దివ్యాన్ష్ జోషి(40 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 105) విధ్వంసకర సెంచరీతో కదం తొక్కాడు. అయితే కెప్టెన్ రింకు సింగ్ ఈ మ్యాచ్లో 2 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. లక్నో బౌలర్లలో అభినందన్ సింగ్ మూడు, భువనేశ్వర్ కుమార్, అజిత్ వర్మ, విప్రజ్ నిగమ్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో ఫాల్కన్స్ 16 ఓవర్లలోనే 109 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్ విశాల్ చౌదరి నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు.కేకేఆర్ కెప్టెన్గా రింకూ?ఇక మీరట్ను జట్టును రెండో సారి ఛాంపియన్గా నిలపడంతో కేకేఆర్ కెప్టెన్సీ రేసులోకి రింకూ దూసుకొచ్చాడు. గత రెండు సీజన్లలో అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అయితే అతడు ఇటీవల ఆల్ఫార్మాట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కోల్కతా కెప్టెన్సీ పోస్ట్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో కేకేఆర్ యాజమాన్యం తమ జట్టు పగ్గాలను ఎవరికి అప్పగిస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితుల బట్టి తదుపరి కేకేఆర్ కెప్టెన్గా రింకూ సింగ్నే ఎంపిక చేసే అవకాశముంది. అతడు ఈ యూపీ టీ20 లీగ్లో జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్లకు సారథ్యం వహించి 9 విజయాలు అందించాడు.చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్ప్లాప్ ప్లేయర్కు చోటు
51 ఏళ్ల హీరోయిన్తో టీమిండియా స్టార్ డేటింగ్?!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. వరుస గాయాల కారణంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతడు చాన్నాళ్లుగా పునరావాసం పొందుతున్నాడు. ఈ క్రమంలో ముంబై నుంచి కొంతకాలం పాటు బెంగళూరుకు పూర్తిగా మకాం మార్చాడనే వార్తలు వచ్చాయి.ముందుగా నటాషాఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించిన ఈ బరోడా ప్లేయర్.. పెళ్లికి ముందే తండ్రయ్యాడు. ఆ తర్వాత కుమారుడు అగస్త్య సమక్షంలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో హార్దిక్- నటాషా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం మహీకతో రిలేషన్షిప్అయితే, కొంతకాలానికే తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు హార్దిక్- నటాషా ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో హార్దిక్ అభిమానులు నటాషాపై సోషల్ మీడియా వేదికగా విద్వేష విషం చిమ్మారు. డబ్బు కోసమే ప్రేమ, పిల్లాడు, పెళ్లి అంటూ ఆమెను అవమానించారు.ఇక నటాషాతో విడిపోయిన కొన్ని నెలల వ్యవధిలోనే మరో మోడల్ మహీక శర్మతో ప్రేమలో ఉన్నట్లు హార్దిక్ పాండ్యా ప్రకటించాడు. ఇద్దరూ వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు విడుదల చేశాడు. దీంతో నటాషాపై కాస్త ట్రోలింగ్ తగ్గి.. ఈసారి మహీకను టార్గెట్ చేశారు చాలామంది. అయినా వీరి బంధం ఇప్పటి వరకైతే సజావుగా కొనసాగుతోంది.51 ఏళ్ల హీరోయిన్తో డేటింగ్ అంటూఇలాంటి తరుణంలో 32 ఏళ్ల హార్దిక్ పాండ్యా... తాజాగా 51 ఏళ్ల బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్తో డేటింగ్ చేస్తున్నాడనే వదంతులు వ్యాపించాయి. తాజ్ మహల్ ప్యాలెస్లో హార్దిక్- అమీషా కలిసి కనిపించడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.The way Ameesha Patel put her hand on Hardik Pandya’s shoulder during the party at a hotel in Bengaluru. 👀All the Reddit rumours seem to be coming true. pic.twitter.com/VJ7945fHus— Sonu (@Cricket_live247) September 5, 2026నిజమే రొమాంటిక్గానే చేయి వేశానుఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా యూజర్.. ‘‘హార్దిక్ పాండ్యా భుజం మీద అమీషా పటేల్ చేయి వేసిన తీరు చూస్తుంటే రెడిట్ రూమర్లు నిజమే అనిపిస్తోంది’’ అంటూ వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే అర్థంలో కామెంట్ చేశాడు. ఇందుకు అమీషా పటేల్ గట్టిగానే బదులిచ్చింది.సదరు యూజర్ పోస్టును తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘అవును అది నిజమే యార్!! (వ్యంగ్యంగా).. నేను రొమాంటిక్గానే అతడిపై చేయి వేశాను కదా!.. నాకు తెలిసి నీతో కనీసం ఒక్క అమ్మాయి కూడా స్నేహం చేసి ఉండదేమో!..ఇలాంటి చెత్త పోస్ట్ చేసేముందు కనీసం ఒక్క అమ్మాయితోనైనా స్నేహం పెంచుకో.. అప్పుడే నీకు అన్నీ అర్థమవుతాయి’’ అంటూ అమీషా పటేల్ ఘాటుగా స్పందించింది. తద్వారా తాము స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేసింది.చదవండి: ‘అందమైన సాయంత్రం.. చెన్నైలో మాకు మరో కుటుంబం’
మళ్లీ చీఫ్ గెస్ట్ అతడే.. భారత్ గెలిస్తే ట్రోఫీ తీసుకుంటుందా?
భారత పురుషుల క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 విజేతగా నిలిచి ఏడాది అవుతున్నప్పటికీ, ట్రోఫీ ఇంకా వారి చేతికి అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆ ట్రోఫీని అందుకోకపోవడంతో.. అది ఇప్పటికీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉండిపోయింది.అయితే ఇప్పుడు భారత మహిళల జట్టుకు అటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న మహిళల ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా నఖ్వీ హాజరుకానున్నట్లు సమాచారం. గతంలో జరిగినట్లుగానే విజేతలకు ట్రోఫీని స్వయంగా అందించాలని నఖ్వీ భావిస్తున్నారు. ప్రస్తుత భారత జట్టు ఫామ్ను చూస్తుంటే మరోసారి ఆసియా విజేతగా నిలిచేందుకు ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే నఖ్వీ చేతుల మీదగా భారత అమ్మాయిల జట్టు ట్రోఫీ తీసుకుంటుందా లేదా? మెన్స్ టీమ్ మాదిరిగానే బాయ్కట్ చేస్తుందో వేచి చూడాలి. ఏదేమైనప్పటికి ఆసియాకప్లో మరోసారి హైడ్రామా చోటు చేసుకోవడం ఖాయమన్పిస్తోంది.కాగా ఈ టోర్నీలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. టీమిండియా ఇప్పటికే తమ సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్ షేక్ చేసుకోలేదు. ఈ రెండు జట్లు ఫైనల్కు చేరినా ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్ప్లాప్ ప్లేయర్కు చోటు
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
బిజినెస్
మూలధన ఆస్తులంటే..
మూలధన ఆస్తులు.. వాటి క్రయ విక్రయాలు.. వాటి వెనుక పన్నుభారం తెలుసుకోవాలంటే ఆషామాషీ కాదండోయ్. కొంచెం ఓపిక, శ్రద్ధ, గ్రహించగలిగే శక్తి కావాలి. పాత చట్టం .. కొత్త చట్టంగా మారినా .. ప్రాథమిక అంశాలు మారలేదు. సెక్షన్లు ప్రస్తావించకుండా సారాంశం తెలుసుకుందాం.‘ఒక మూలధన ఆస్తి అమ్మినా, బదిలీ చేసినా ఏర్పడ్డ లాభాలు (చట్టంలో ప్రాఫిట్ / గెయిన్స్ అని ఆంగ్లంలో చెప్పారు) ఆదాయంగా భావించి ‘క్యాపిటల్ గెయిన్స్’ కింద వర్గీకరించి పన్ను విధిస్తారు. ఈ వాక్యం మర్రిచెట్టు విత్తనంలాగా చిన్నగా ఉంది. కానీ ఆ విత్తనం మొక్కగా మారి, శాఖోపశాఖలుగా విస్తరించి, చెట్టుగా మారడం ఎలా జరుగుతుందో ఈ వాక్యం వెనుక వందల సెక్షన్లు, రూల్స్, వివరణలు, జడ్జిమెంట్లు ఉన్నాయి. ఏది క్యాపిటల్ ఆస్తి? ఆస్తి కానిదేమిటి? బదిలీ అంటే ఏమిటి.. ఏది బదిలీ కాదు? ఎన్నో రకాల క్యాపిటల్ ఆస్తులు ఉన్నాయి. తెలుసుకోండి. ఏది క్యాపిటల్ ఆస్తి? ఒక అసెస్సీ చేతిలో ఉన్న ఆస్తి.. వ్యాపారానికి సంబంధించినదైనా.. సొంతానికి సంబంధించినదైనాసెబీ రూల్స్ ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఉన్న సెక్యూరిటీలుసెబీ వారు పేర్కొన్న ఇన్వెస్టుమెంటు నిధుల్లో ఉన్న సెక్యూరిటీలుషెడ్యూల్ ఐఐలో ఉన్న మినహాయింపులకు అర్హత లేని యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలుఈ నాలుగూ క్యాపిటల్ ఆస్తులు. ఇలాగే ఉంటాయి, చట్టాల్లో నిర్వచనాలు. చెప్పదల్చుకున్నది చెప్పలేరు. వారు అనుకున్నది చెప్పడానికి చెప్పాలి కాబట్టి ఎన్నో మార్గాలు వెతుక్కుంటారు. నత్తనడక ముచ్చట్లు లేదా లిటిగేషన్ రాకుండా జాగ్రత్త పడటం.. లేదా ముక్కు ఎక్కడంటే తలచుట్టూ చేతిని తిప్పి చూపించినట్లుగా ఉంటుంది.ఏది క్యాపిటల్ ఆస్తి కాదు?పైన చెప్పి, అలా వదిలి పెట్టారా అంటే అలా చేయలేదు. పైవన్నీ క్యాపిటల్ ఆస్తులు. కాని వాటివీ జాబితా ఇచ్చారు. మినహాయింపులన్న మాట. వ్యాపారంలో ఉంటే స్టాక్లు, స్టోర్స్, ముడిపదార్థాలు (కానీ, సెబీ పేర్కొన్న సెక్యూరిటీలు మినహా)పర్సనల్ అసెట్స్, వ్యక్తిగత చరాస్తులు, దుస్తులు, ఇంటి ఫర్నిచర్, వంట పాత్రలు, వ్యక్తిగత వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు.వీటి అమ్మకాల మీద పన్నుండదు. కానీ అశ్వత్థామ హతః కుంజరః లాగా నగలు, బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలు, రత్నాలు, మాణిక్యాలు, కెంపులు, పురాతన వస్తువులు, చిత్ర లేఖనాలు, డ్రాయింగ్లు, శిల్పాలు, ఏవైనా కళాఖండాలు.. ఇవన్నీ పర్సనల్ అసెట్స్ కావు. ఇవి అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. వ్యవసాయ భూములుగోల్డ్ డిపాజిట్ బాండ్లు (గవర్నమెంటు నోటిఫై) ఇంతవరకు అర్థం చేసుకుందాం. కానీ, కొసమెరుపులాగా, వ్యవసాయ భూముల విషయంలో వ్యవసాయమెంత కష్టమో.. అంత కష్టపడేలా వివరణ ఇచ్చారు. లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం జనాభా సంఖ్య, మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి వైమానిక దూరం ప్రాతిపదికల మీద ఆలోచించారు.మున్సిపాలిటీలో జనాభా సంఖ్య 10,000 కన్నా తక్కువ ఉంటే, భూములన్నీ సాగు జరిగితే వ్యవసాయ భూమి.జనాభా 10,000–1,00,000 ఉంటే వైమానిక దూరం 2 కి.మీ. దాటిన తర్వాత భూమినే వ్యవసాయ భూమి అంటారు.జనాభా 1,00,000–10,00,000 ఉంటే ఈ దూరం 6 కి.మీ. 10,00,000 దాటితే 8 కి.మీ.ఇదీ చదవండి: మీ వీధిలోనే ఉన్నారు ఫైనాన్స్ గురువులుఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటే సరి. ఇవే కాకుండా ఆ భూమి సాగు చేయాలి. వ్యవసాయ శిస్తు చెల్లిస్తుండాలి. ఆదాయాన్ని ఇన్కం ట్యాక్స్ లెక్కల్లో చూపించాలి.
గత 30 ఏళ్లు వేరు.. రాబోయే 30 ఏళ్లు వేరు!
గత అనేక సంవత్సరాలుగా చూస్తే, ‘‘కొన్ని అంచనాలను ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు, వాటినే ప్రాతిపదికగా చేసుకుని పోర్ట్ఫోలియోను నిర్మించుకోవచ్చు’’ అనే విధంగా పెట్టుబడుల ధోరణులు ఉంటున్నాయి. ఆ అంచనాలేమిటంటే, ‘‘గ్లోబలైజేషన్ మరింతగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం చాలా మటుకు అదుపులోనే ఉంటుంది. సరఫరా వ్యవస్థలు మరింత సమర్ధవంతంగా మారతాయి. వృద్ధి బలహీనపడినప్పుడల్లా సెంట్రల్ బ్యాంకులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతాయి.’’ ఇదిగో, అచ్చం ఇలాగే జరుగుతుందనే ఊహలే, మొత్తం ఒక తరం ఇన్వెస్టర్ల పెట్టుబడుల అలవాట్లు, పోర్ట్ఫోలియో నిర్మాణానికి ప్రాతిపదికగా నిల్చాయి. అయితే, ఇక్కడ ప్రధాన సమస్యేమిటంటే, భవిష్యత్తు కూడా గతంలోలాగానే ఉంటుందనుకోవడమే. నిజానికి రాబోయే 30 ఏళ్లు.. గత 30 ఏళ్లకు పూర్తి భిన్నంగా ఉండొచ్చు. కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో.. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు ఎంత బలహీనమైనవో బట్టబయలైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలనేవి .. వాణిజ్య సంబంధాలను మార్చివేశాయి. అన్ని దేశాలు మిగతా విషయాల కన్నా, ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోగలిగే సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు, గ్లోబల్ వ్యవస్థలపై ఆధారపడటం కన్నా దేశీయంగా తయారీకి, తమ తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతోంది. ఇవేవో తాత్కాలిక పరిణామాలు కావు. ఇవి వ్యవస్థ స్వరూపంలో చోటు చేసుకుంటున్న మార్పులను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత చరిత్రే ప్రాతిపదికగా పోర్ట్ఫోలియోని నిర్మించుకోవచ్చన్న అభిప్రాయాన్ని కూడా ఇన్వెస్టర్లు పునఃసమీక్షించుకోవాలి. నేటి పరిస్థితుల్లో వైవిధ్యం ఆవశ్యకతఒకప్పుడు ఏదైనా అసాధారణ పరిస్థితి తలెత్తితే తప్ప తీవ్ర హెచ్చుతగ్గులు ఉండేవి కావు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఇవి సర్వసాధారణంగా మారిపోయాయి. ఎప్పుడైనా సరే ఈ ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు డైవర్సిఫికేషన్ అనేది చక్కని ఇన్వెస్ట్మెంట్ సూత్రం. కానీ ప్రస్తుతం దీన్ని పాటించే తీరులో మార్పులు వచ్చేశాయి. గత కొద్ది దశాబ్దాలుగా వ్యాపారాలు, మార్కెట్ వృద్ధి అవకాశాలు కాస్త ఊహలకు అందే విధంగా ఉండేవి. వాటిని బేరీజు వేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు ప్రయోజనాలు పొందుతూ వచ్చారు. కానీ ప్రస్తుత బహుళధృవ ప్రపంచంలో, చాలా మటుకు వృద్ధికి ఊతమిచ్చే అంశాలపై అనిశ్చితి ఉంటోంది. వివిధ ప్రాంతాలవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి విషయంలో అంతరాలు మరింత పెరుగుతున్నాయి.ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమనేది ఊహించిన దానికన్నా కష్టంగా ఉంటోంది. పాలసీపరమైన నిర్ణయాలు, మార్కెట్లపై మరింత ప్రభావం చూపుతున్నాయి. భౌగోళిక–రాజకీయ పరిణామాలు రాత్రికి రాత్రే ఇన్వెస్టర్ల సెంటిమెంటును మార్చేసే విధంగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబడుల కోసం ఒకే వనరుపై ఆధారపడటమనేది రిస్కీ వ్యవహారంగా మారుతోంది. ఇప్పుడు ఇన్వెస్టర్లకు ప్రధాన సవాలేమిటంటే, రాబోయే రోజుల్లో బాగా రాణించే పెట్టుబడి సాధనాన్ని గుర్తించడం కాదు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలనేవి ఏ ఒక్క ఆర్థిక పరిణామంపైనో, పాలసీ నిర్ణయంపైనో, మార్కెట్ వలయాలపైనో లేదా ఇన్వెస్ట్మెంట్ థీమ్పైనో ఆధారపడినదై ఉండకుండా చూసుకోవడమే అతి పెద్ద సవాలుగా మారింది. ప్రధాన లక్ష్యం ఏంటంటే..సాధారణంగా రిస్క్ని తగ్గించుకునేందుకు ఉపయోగపడే విధానంగా డైవర్సిఫికేషన్ని నిర్వచిస్తారు. ఈ నిర్వచనం సరైనదే అయినప్పటికీ, సంపూర్ణమైనది కాదు. వాస్తవానికి భవిష్యత్తులో అనిశ్చితి ఉంటుందని, రాబోయే దశాబ్దంలో ఏ ఆర్థిక విధానాలు, మార్కెట్ సెగ్మెంట్, సెక్టార్ లేదా భౌగోళిక ప్రాంతం ఆధిపత్యం ఉంటుందనేది ఏ ఇన్వెస్టరు కూడా స్థిరంగా అంచనా వేయలేరనే విషయాన్ని గుర్తించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో మార్కెట్ ధోరణులకు అనుగుణంగా డైవర్సిఫికేషన్ ఉండాలి. దీన్ని ఆకళింపు చేసుకుంటే, భవిష్యత్తనేది గతం తరహాలోనే ఉండకపోవచ్చనేది గుర్తించి, కేవలం ఒకే అంచనా మీద ఆధారపడకుండా, రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా, నిలబడగలిగేలా పోర్ట్ఫోలియో ఉండేలా జాగ్రత్తపడేందుకు వీలవుతుంది. సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటే వృద్ధి ఆధారిత అసెట్స్ ప్రయోజనం పొందుతాయి. అలాగే అనిశ్చితిలో ఫిక్స్డ్ ఇన్కం సాధనం స్థిరత్వాన్ని అందించవచ్చు.ఇక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు, పెట్టుబడి విలువ కోల్పోకుండా భద్రంగా కాపాడే సాధనంగా పసిడికి చరిత్ర ఉంది. దేశీయ మార్కెట్లలో దొరకని అవకాశాలను అంతర్జాతీయ పెట్టుబడి సాధనాలు అందుబాటులోకి తేవచ్చు. గతంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సాంకేతిక ఆవిష్కరణల్లాంటి పరిణామాలు దాదాపు ఒకేసారి కలిసికట్టుగా వచ్చేవి. పెట్టుబడులపై రాబడులకు చోదకాలుగా నిలిచేవి. కానీ ఇప్పుడు అన్నీ ఏకకాలంలో జరగడం లేదు. పరిస్థితులను బట్టి ఒక్కో సాధనం ఒక్కో సమయంలో ఒక్కో రకం పనితీరు కనపరుస్తోంది. కనుక ప్రస్తుతం ఏదో ఒకే అసెట్పై అతిగా ఆధారపడి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను వేసుకోవడం, రిసు్కతో కూడుకున్న వ్యవహారంగా ఉంటుంది.ఇదీ చదవండి: మీ వీధిలోనే ఉన్నారు ఫైనాన్స్ గురువులుభవిష్యత్తులో వృద్ధి కేవలం ఒకే మార్కెట్, ఒకే ప్రాంతం, లేదా ఒకే రంగం నుంచే వచ్చే అవకాశాలు లేవు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, హెల్త్కేర్, క్లీన్ ఎనర్జీ, అధునాతన తయారీ, ఆర్థిక సాంకేతికత, డిజిటల్ మౌలిక సదుపాయాలవ్యాప్తంగా ఏకకాలంలో అనేక ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రకాల డెమోగ్రాఫిక్స్, సాంకేతిక, ఆర్థిక పోకడలతో వివిధ ప్రాంతాలు ప్రయోజనం పొందుతున్నాయి. దీనితో రేపటి భవిష్యత్తులో అవకాశాలనేవి, చిరపరిచితమైన కొద్ది అంశాలకే పరిమితం కాకుండా బహుళ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్ థీమ్లవ్యాప్తంగా విస్తృతంగా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఒక రక్షణాత్మక వ్యూహంగానే కాకుండా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఒక చక్కని మార్గంగా కూడా ఉపయోగపడుతుంది. డైవర్సిఫికేషన్ వల్ల కచ్చితమైన లాభాలు వస్తాయని కాదు కానీ, గతంతో పోలిస్తే భిన్నంగా ఉండే భవిష్యత్తు కోసం ఇన్వెస్టర్లు సర్వసన్నద్ధంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.
ఈ వారం 11 ఐపీవోలు
ప్రైమరీ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. గత నెల(ఆగస్ట్)లో ఏకంగా 23 కంపెనీలు లిస్టింగ్కాగా.. వచ్చే వారం మరో 11 ఐపీవోలు ప్రారంభకానున్నాయి. 7–15 మధ్య చేపట్టనున్న ఇష్యూల ద్వారా ఇవి ఉమ్మడిగా రూ. 7,055 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. మొత్తం రూ. 7,055 కోట్లలో రూ. 2,722 కోట్లు(39 శాతం) తాజా ఈక్విటీ జారీకాగా.. మరో రూ. 4,333 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. మంగళ, బుధ వారాల్లో అధిక ఇష్యూలు మార్కెట్లను పలకరించనున్నాయి. జాబితాలో రియల్టీ డెవలపర్స్, ఇంజినీరింగ్, తయారీ, పేమెంట్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫామ్ తదితర కంపెనీలున్నాయి. వీటితో కలిపి ఈ ఏడాది 75 కంపెనీలు నిధుల సమీకరణ బాటలో సాగినట్లు నమోదుకానుంది. వివరాలు చూద్దాం.. ప్రణవ్ కన్స్ట్రక్షన్స్తో షురూ నేడు(7న) ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఐపీవో ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 351 కోట్లు సమీకరించనుంది. రేపు(8న) కనోహర్ ఎలక్ట్రికల్స్, ప్రసోల్ కెమికల్స్, గ్లాస్వాల్ సిస్టమ్స్(ఇండియా) ఇష్యూలు షురూకానుండగా.. 9న స్టీమ్హౌస్ ఇండియా, 10న వీగాలాండ్ డెవలపర్స్ మార్కెట్లను తాకనున్నాయి. ధరల శ్రేణి తీరిలా ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఐపీవోకు ధరల శ్రేణి రూ. 118–124కాగా.. రూ. 316 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 35 కోట్ల విలువైన మరో 28.57 లక్షల షేర్లను ఆఫర్ చేయనుంది. కనోహర్ ఎలక్ట్రికల్స్ రూ. 601–632 ధరల శ్రేణిలో రూ. 1,056 కోట్ల సమీకరణపై కన్నేసింది. ప్రసోల్ కెమికల్స్ రూ. 643–676 ధరల శ్రేణి నిర్ణయించడం ద్వారా రూ. 500 కోట్లు అందుకోనుంది. ఈక్విటీ జారీతో రూ. 80 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో రూ. 420 కోట్లు సమీకరించనుంది. గ్లాస్వాల్ సిస్టమ్స్ రూ. 172–182 ధరల శ్రేణితో రూ. 428 కోట్ల సమీకరణకు రెడీ అయ్యింది. వీగాలాండ్ సైతం ఆర్సిల్ రూ. 132–139 ధరల శ్రేణిలో రూ. 733 కోట్ల సమీకరణకు సిద్ధపడింది. పూర్తిగా ప్రస్తుత వాటాదారు సంస్థలు షేర్లను విక్రయించనున్నాయి. ఇక రూ. 427 కోట్ల సమీకరణకుగాను ఎల్సీసీ ప్రాజెక్ట్స్ రూ. 139–146 ధరల శ్రేణి నిర్ణయించింది. స్టీమ్హౌస్ ఇండియా ఇష్యూలో భాగంగా రూ. 353 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా రూ. 61 కోట్ల విలువైన షేర్లు ఆఫర్ చేయనుంది. వెరసి రూ. 414 కోట్లు అందుకోవాలని చూస్తోంది. ఈ నెల 10న ప్రారంభమై 15న ముగియనున్న ఐపీవో ద్వారా వీగాలాండ్ డెవలపర్స్ రూ. 210 కోట్లు సమీకరించనుంది. → ఈక్విటీ జారీ నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించడంతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం కేటాయించనున్నాయి. → రేస్ ఆఫ్ బిలీప్, దీపా జ్యువెలర్స్ ఐపీవోలతో ఈ నెల(సెపె్టంబర్)లో ఐపీవోల సందడి జోరందుకున్న విషయం విదితమే. పర్పుల్ ల్యాబ్స్తో ప్రారంభించి నేటి(7) నుంచి రెండు వారాలపాటు వరుసగా ఈ కంపెనీలన్నీ స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్ట్కానుండటం గమనార్హం!రెంటోమోజో @ రూ. 384–404ఐపీవో ద్వారా రూ. 1,256 కోట్ల సమీకరణపై దృష్టి పెట్టిన రెంటోమోటో రూ. 384–404 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇందుకు రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు రూ. 1,106 కోట్ల విలువైన 2.73 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. కరంటారా ఇంజినీరింగ్ ఐపీవోకు ధరల శ్రేణి రూ. 241–254కాగా.. రూ. 675 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 200 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ ఇష్యూకి రూ. 322–339 ధరల శ్రేణి ప్రకటించింది. రూ. 805 కోట్లు సమకూర్చుకోనుంది. ఇందుకు రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీ జారీసహా రూ. 485 కోట్ల విలువైన 1.43 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది.
చమురు మంటలతో మార్కెట్కు ముప్పే!
ముంబై: ముడిచమురు ధరలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, పశ్చిమాసియా పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల వేలం, యూరప్ దేశాల నుంచి వెలువడే ఆర్థిక గణాంకాలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. దేశీయంగా వచ్చే వారం (సెపె్టంబర్ 7–10 తేదీల మధ్య) ఏకంగా 11 కంపెనీలు ఐపీఓలకు రానుండటంతో ప్రైమరీ మార్కెట్పైనా ఫోకస్ ఉంటుంది. ఈ ఇష్యూల ద్వారా మొత్తం రూ.7,055 కోట్ల వరకు సమీకరించనున్నారు. ఈ నేపథ్యంలో దలాల్ స్ట్రీట్లో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) అంశం అత్యంత కీలకంగా మారనుంది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు, రూపాయి విలువ ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపనున్నాయి. ‘‘వడ్డీ రేట్లపై ఆయా దేశాల ద్రవ్య పరపతి విధాన వైఖరి, క్రూడాయిల్ ధరల కదలికలు, భౌగోళిక పరిమాణాలకు మార్కెట్ స్పందించే అవకాశం ఉంది. అంతర్జాతీయ పెరిగిన చమురు ధరలు భారత్లో ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్య మారక ద్రవ్యం, కార్పొరేట్ లాభాలపై ప్రభావం చూపనుంది’’ అని హెచ్ఎస్టీ వెల్త్ సీఈవో, వ్యవస్థాపకుడు హరిసెల్వన్ రాధాకృష్ణన్ తెలిపారు. యూఎస్ ద్రవ్యోల్బణంపైనే ప్రధాన దృష్టి అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సమీప భవిష్యత్ గమనాన్ని నిర్దేశించడంలో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకంగా మారనున్నాయి. అమెరికా ఆగస్టు ఉద్యోగాల గణాంకాలు అంచనాల కంటే బలంగా నమోదైన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్ల అంచనాలు మారుతున్నాయి. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరిపై ప్రభావం చూపే అమెరికా పీపీఐ గణాంకాలు గురువారం, సీపీఐ గణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ద్రవ్యోల్బణం నెలవారీగా 0.4 శాతం పెరగవచ్చని, వార్షికంగా 3.4 శాతం వద్ద ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంచనాలకు మించి ద్రవ్యోల్బణం నమోదైతే ఫెడ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని కొనసాగించవచ్చన్న ఆందోళనలు పెరిగి.. ప్రపంచ మార్కెట్లలో హెచ్చుతగ్గులు అధికమయ్యే అవకాశం ఉంది.చమురు మంటలతో కంగారు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల దిశను నిర్దేశించడంలో ముడిచమురు ధరలు ఈ వారం అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో హార్మూజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనలతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 96 డాలర్ల స్థాయికి చేరింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో భౌగోళిక రాజకీయ రిస్క్ పెరగడం దీనికి ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. క్రూడ్ ధర 100 డాలర్లకు చేరువ కావడంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అమ్మకాల బాటలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) మళ్లీ అమ్మకాల బాట పట్టారు. జూలైలో రూ.20,200 కోట్లకు, ఆగస్టులో రూ.29,600 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన ఎఫ్పీఐలు.. సెపె్టంబర్ తొలి వారంలో రూ.7,443 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. క్రూడాయిల్ ధరల పెరుగుదల, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలోపేతం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే ప్రాథమిక మార్కెట్పై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, చమురు ధరలు, ఫెడ్ విధాన నిర్ణయాలు విదేశీ నిధుల ప్రవాహాన్ని ప్రభావితం చేయనున్నాయి.గతవారంలో రూ.15 లక్షల కోట్లు ఆవిరి క్రూడ్ సెగలు, ద్రవ్యోల్బణ భయాలతో ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలకు దిగారు. దీంతో సూచీలు వరుసగా నాలుగో వారమూ నష్టపోయాయి. సెన్సెక్స్ 749 పాయింట్లు, నిఫ్టీ 276 పాయింట్లు నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ గత వారంలో రూ.15 లక్షల కోట్లు తగ్గి రూ.414 లక్షల కోట్లకు దిగొచి్చంది.సాంకేతిక అంశాలు సాంకేతికంగా నిఫ్టీకి 23,800 స్థాయి అత్యంత కీలకంగా కనిపిస్తోంది. ఈ స్థాయికి దిగువన అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువన 23,950 వద్ద తక్షణ నిరోధం ఉండగా.. దాన్ని అధిగమిస్తే 24,130 వద్ద మరో కీలక నిరోధం ఎదురుకానుంది. ఈ స్థాయినీ దాటి 24,250 పైన స్థిరపడితే మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ మరింత బలపడే అవకాశం ఉంది. సెన్సెక్స్కు 76,100–75,800 శ్రేణి కీలక మద్దతు ప్రాంతంగా కనిపిస్తోంది. 76,100 స్థాయి పైన నిలబడితే సూచీలో రికవరీకి అవకాశం ఉందని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫ్యామిలీ
కులం, మతం లేని న్యాయవాది..! ఏకంగా తొమ్మిదేళ్లు..
ఏదైనా జాబ్కి అప్లై చేయాలన్న, ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయాలన్న కుల ధృవీకరణ పత్రం మస్ట్. కనీసం పెళ్లికైనా అది ఉండాల్సింది. కులం, మత ధృవీకరణ పత్రం ఉన్నట్లే..అవేమి లేకుండా నాస్తికుల్లా ఉండేవాళ్లకి కుల, మత రహిత అధికారిక ధృవీకరణ పత్రం ఉండదు. ఇంత వరకు అలాంటి పత్రాలు ఏ ప్రభుత్వ ఆఫీసులు జారీ చేయలేదు, ఉండవు కూడా. దాన్ని ఒక మహిళ కష్టపడి పోరాడి, తన గోడు వినిపించి మరి మొట్టమొదటిసారిగా కుల మత రహిత ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా పొందింది. కేవలం ఆమె ఎలా జీవించిందో దానికి అనుగుణంగా డాక్యుమెంట్ మాత్రమే కావాలని కోరి మరి సాధించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలించింది ఆమె. ఆ మహిళే తమిళనాడుకు చెందిన ఎం.ఏ స్నేహ. స్నేహకు చిన్నప్పటి నుంచి రెండే రెండు సమాధానాలు ఎదురయ్యేవి. అవేంటంటే..తన కులం, మతం గురించి. తన పేరెంట్స్ ఆ గుర్తింపు ఇవ్వలేదు. ఆమె జనన ధృవీకరణ పత్రంలో గానీ, పాఠశాల రికార్డులలో గానీ వాటి ప్రస్తావన లేనేలేదు. ఆమె చిన్నప్పటి నుంచి అలానే పెరిగింది. ఆమె ప్రస్తుతం తమిళనాడులోని తిరుపత్తూరులో న్యాయవాదిగా పనిచేస్తోంది. అయితే ప్రభుత్వపరమైన పత్రాల వ్యవహారాలు వచ్చినప్పుడూ ఆ వివరాలేమి నింపకుండా ఖాళీగా వదిలేయాల్సి వచ్చేది. కానీ అలా ఫిల్ చేయకుండా వదలడంతో అప్లికేషన్ సబ్మిట్ చేయడం కుదిరేది కాదు. అప్పుడే తను ఎలా జీవించిందో అలా అధికారికంగా ధృవీకరించే పత్రం తప్పనిరి అయ్యింది. తనకు కులంగానీ, మతం గానీ లేదు అని చెప్పేలా అధికారికి పత్రం కావాలంటూ అధికారులు చుట్టూ తిరిగింది. అలా తొమ్మిదేళ్లు పోరాడి ఫిబ్రవరి 5, 2019న, తిరుపత్తూరు తహసీల్దార్ టి.ఎస్. సత్యమూర్తి, స్నేహకు కులం మతలం లేవని పేర్కొంటూ ఒక ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. దాంతో అలాంటి గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్నేహ. ఆమె నేపథ్యం..ఆమె తల్లిదండ్రులు పివి ఆనందకృష్ణన్, మణిమొళి న్యాయవాదులు. వారి ఇంటికి కమ్యూనిస్ట్ మిత్రులు తరుచుగా వచ్చేవారు. అలా స్నేహ, ఆమె సోదరీమణులు పెరిగే క్రమంలో కమ్యూనిజం, హేతువాదం, నాస్తికత్వానికి సంబంధించిన పుస్తకాలను చదివారు. మతం, దేవుడిని గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించడం పిల్లలకు నేర్పించారు. అందువల్ల వాళ్ల స్నేహితులు మీది ఏ కులం అని ప్రశ్నించినప్పుడూ స్నేహ, ఆమె సోదరిమణులు కులం లేదు, మతం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేసేవారు. ఆఖరికి వాళ్ల పేర్లతో తమ జీవన విధానం ఏంటో చూపించేవారు. ఇక్కడ స్నేహ ఇద్దరు సోదరిమణులు పేర్లు ముంతాజ్ సూర్య, జెన్నిఫర్ కాగా, స్నేహ ఆమె భర్త తమిళ ప్రొఫెసర్ కె పార్థిబరాజ దంపతులుకు ముగ్గురు కుమార్తెలు. వాళ్ల పేర్లు విభిన్న మత సంప్రదాయాలు కలిసేలా.. ఆదిరై నస్రీన్, ఆదిల ఐరీన్, ఆరిఫా జెస్సీ అని పెట్టారు. అయితే ఆమెకు న్యాయ పరీక్షల పోటీకి, నోటరీ వంటి వాటిల్లో కుల దృవీకరణ పత్రం ఓ పెద్ద సమస్యగా మారడంతో..అందుకోసం కులంగానీ, మతం గానీ లేని పత్రం కావాలన్నా ఆలోచన మొదలైంది దాని కోసం 2010లో పొందే ప్రయత్నంలో భాగంగా పోరాటం చేసింది. అలా 2019 వరకు పోరాడి ఆ గుర్తింపుని దక్కించుకునేలా కుల మత రహిత ధృవీకరణ పత్రం పొందింది. ఇక్కడ స్నేహ తనను నాస్తికురాలిగా ప్రకటించమని ప్రభుత్వాన్ని కోరలేదు, అలాగే ప్రత్యేక ప్రయోజనాన్ని కూడా అడగలేదు. తాను గడుపుతున్న జీవితమే అధికారక రికార్డులకు సరిపోలాలని ఆమె కోరుకుంది. ఇక స్నేహ కుటుంబం తరతరాలు ఎలాంటి కుల, మత గుర్తింపు లేకుండా జీవించినట్లు తెలిపింది. ఇక ఈ సర్టిఫికెట్ ఆ వాస్తవాన్నే ధృవీకరించే ఒక చట్టపరమైన పత్రమని చెబుతోంది స్నేహ. ఇక ఆమె భర్త పార్థిబరాజు స్వయంగా మతపరమైన కుటుంబంలో పెరిగాడు, కానీ ఆ తర్వాత పెరియార్ బి. ఆర్ అంబేద్కర్ తత్వశాస్త్రలపై ఆసక్తిని పెంచుకుని నాస్తికుడిగా మారారు. మరో విచిత్రం ఏంటంటే..ఆమెకు ఈ సర్టిఫికేట్ ఒకటి వచ్చిందని బహిర్గతం కావడంతో..ఆ పత్రం ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఆమెను సంప్రదించారు. ఆ విషయమై ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయని చెబుతోంది స్నేహ. ఇక తన నిర్ణయం రిజర్వేషన్కు వ్యతిరేకం కాదని, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్కు మద్దతు ఇస్తానని అంటోంది. అలాగే ఇతర హక్కులను హరించడం కాదని కూడా నొక్కి చెప్పిందామె.(చదవండి: మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్న కిరణ్ రెడ్డి)
ధృతరాష్ట్ర కౌగిలి
ఎంతో ఆప్యాయతను, ప్రేమనూ నటిస్తూ, తియ్యగా పలకరిస్తూ లోలోపల తీవ్రహాని తలపెట్టే సందర్భాలను, ప్రమాదకర పరిస్థితులను ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులు పట్టాభిషేకం నిర్వహించుకోవడానికి ముందు తమ పెదనాన్న ధృతరాష్ట్రుని కలవడానికి వెళ్లారు. తన నూరుగురు కుమారులను పాండవులలో రెండోవాడైన భీముడు చంపాడన్న కోపాన్ని లోలోపలే ఉంచుకొని కక్షతో రగిలిపోతున్న ధృతరాష్ట్రుడు పైకి మాత్రం ప్రేమను నటిస్తూ అందరినీ కౌగిలించుకొని ప్రత్యేకంగా భీముడిని తన ఉక్కుకౌగిలిలో బంధించి చంపి వేయాలని భావిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణ పరమాత్మ ఉక్కుతో భీముని విగ్రహాన్ని తయారు చేయిస్తాడు. తనను కలవడానికి వచ్చిన పాండవులను ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకొంటాడు. అయితే ధృతరాష్ట్రుడు ప్రత్యేకంగా భీముడేడి అని అడుగుతున్న సమయంలో శ్రీ కృష్ణ పరమాత్మ భీముడి ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్రుని వద్దకు తీసుకెళ్లగా దానినే భీముడుగా భావిస్తూ ధృతరాష్ట్రుడు తన ఉక్కుకౌగిలిలో బంధించగా ఆ విగ్రహం తుక్కు తుక్కు అయిపోయింది.ధృతరాష్ట్రునికి ఎందుకంత బలం?పుట్టుకతో అంధుడైనా, వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల ధృతరాష్ట్రునికి సుమారు పదివేల ఏనుగుల బలం సిద్ధించింది. తనకున్న బలంతో తన నూరుగురు కొడుకులను చంపిన భీముడిని కౌగిలించుకుని చంపాలన్నది ధృతరాష్ట్రుని ప్రణాళిక. దీనిని గమనించిన శ్రీకృష్ణుడు ఇనుముతో తయారుచేసిన విగ్రహాన్ని ఉంచగా ఆ విగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు కౌగిలించుకొని తన బలాన్నంతా ఉపయోగించి ఇనుప విగ్రహాన్ని నుగ్గు నుగ్గు చేశాడు. దీంతో శ్రీ కృష్ణుని వల్ల భీముడికి ప్రాణాపాయం తప్పింది. అప్పటినుండి ధృతరాష్ట్ర కౌగిలి అనే నానుడి వచ్చింది.– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు
నిర్మల హృదయమే గర్భగుడి
ఒక చిన్న పల్లెటూరి చివరన, ఒక పాత పూరి గుడిసెలో రామయ్య అనే వృద్ధ మట్టి శిల్పి ఉండేవాడు. వయసు పైబడినా ఆయన చేతుల్లో ఏదో ఇంద్రజాలం ఉండేది. ఆయన చేసే మట్టి విగ్రహాలు ప్రాణం ఉన్నట్టుగా ఉండేవి. కానీ రామయ్యకు అహంకారం అంటే ఏమిటో తెలియదు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ భగవంతుడి స్వరూపం గా భావించి, ఎంతో వినయంగా నమస్కరించేవాడు. ఆ ఊరిలోనే భుజంగరావు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. దర్పం, అహంకారం ఆయనకు ఆభరణాలు. తన ఇంట్లో కొత్తగా కట్టించిన పెద్ద పూజామందిరంలో ప్రతిష్టించడానికి ఒక అద్భుతమైన వినాయకుడి విగ్రహం కావాలని రామయ్య దగ్గరకు వచ్చాడు.రామయ్య శిల్పం చెక్కుతుండగా చూసి భుజంగరావు ‘రామయ్యా! నా హోదాకు తగ్గట్టు గా ఈ విగ్రహం ఉండాలి. రంగులు, అలంకరణలు అత్యంత ఖరీదైనవిగా ఉండాలి. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ నా విగ్రహం చూసి ఊరంతా నోరెళ్లబెట్టాలి!’ అన్నాడు. రామయ్య చేతులు జోడించి, వినయంగా తలవంచి... ‘అలాగే బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అన్నాడు. మరుసటి రోజు, రామయ్య విగ్రహాన్ని తయారు చేస్తుండగా... రాజీ అనే ఎనిమిదేళ్ల పేద బాలిక అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో కేవలం ఒక రూపాయి నాణెం ఉంది. ఎంతో ఆశగా రామయ్య వైపు చూస్తూ...‘తాతా! మా అమ్మకు ఒంట్లో అస్సలు బాగోలేదు. మా ఇంట్లో పూజ చేసుకుని, అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుకోవడానికి ఒక చిన్న వినాయకుడి బొమ్మ ఇస్తావా.’ అని అడిగింది. అప్పుడే అక్కడకు వచ్చిన భుజంగరావు అది చూసి ఈసడించుకుంటూ... ‘ఏయ్ పిల్లా! పక్కకు పో. నా పెద్ద విగ్రహం పని పాడు చేయకు. అయినా ఈ నాణేనికి మట్టి కూడా రాదు’ అని గద్దించాడు. కానీ రామయ్య మనస్సు కరిగింది. ఆ అమ్మాయి అమాయకత్వంలో, నిష్కపటమైన ప్రేమలో ఆయనకు సాక్షాత్ ఆ దేవుడే కనిపించాడు. రామయ్య ఎంతో భక్తితో తను చేసిన ఒక చిన్న ముద్దుల వినాయకుడి విగ్రహాన్ని ఆ బాలిక చేతిలో పెట్టాడు. ఆ చిన్నారి కళ్లలో కనిపించిన ఆనందం రామయ్య హృదయాన్ని నింపేసింది.కొన్ని రోజులకు భుజంగరావు పురమాయించిన పెద్ద విగ్రహం తయారైంది. అది నిజంగానే ఎంతో భవ్యంగా, రంగురంగుల ఆభరణాలతో మెరిసిపోతోంది. భుజంగరావు కూలీలతో కలిసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. కానీ విచిత్రం! నలుగురు బలాఢ్యులైన మనుషులు ఆ విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించినా కనీసం అంగుళం కూడా కదపలేకపోయారు.భుజంగరావు కోపంతో ఊగిపోతూ... ‘రామయ్యా! ఏంటిది? ఇందులో ఏమైనా ఇనుము, రాళ్ళు పెట్టి చేశావా? ఎందుకు ఇంత బరువుగా ఉంది?’ అని గద్దించాడు.రామయ్య ఏమాత్రం కలత చెందకుండా, ఎంతో వినమ్రంగా చేతులు జోడించి ‘అహంకారం’, ‘హోదా’ అనే బరువులు కూడా ఇందులో చేరాయి స్వామీ! అహంకారం ఎప్పుడూ మోయలేనంత బరువుగానే ఉంటుంది. ఆ బరువును దేవుడు కూడా ఇష్టపడడు’’ అన్నాడు. ఆ మాటలు భుజంగరావు గుండెల్లో తూటాల్లా పేలాయి. అదే సమయంలో పక్కనే ఉన్న చిన్న గుడిసెలో రాజీ అనే చిన్నారి... రామయ్య ఇచ్చిన చిన్న విగ్రహాన్ని ఎంతో సులువుగా చేతుల్లో పట్టుకుని, భక్తితో పూజ చేయడం ఆయన కంట పడింది. ఆయనలోని గర్వం కరిగిపోయింది. కళ్లల్లో నీళ్లతో, ‘నన్ను క్షమించు రామయ్యా! ఈ రోజు నుంచి నా అహంకారాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను’ నమస్కరించి అన్నాడు. ఆశ్చర్యకరంగా... మరుక్షణమే ఆ విగ్రహం ఎంతో తేలిక గా మారిపోయింది. భుజంగరావుకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. దైవత్వం అనేది బాహ్య ఆడంబరాలలో, డబ్బులో లేదు. అది అంతరంగంలోని వినయం, నిష్కపటత్వం, భక్తిలోనే ఉంటుందని గ్రహించాడు.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి
పశ్చాత్తాపం... ప్రాయశ్చిత్తం
ఏదైనా పాపం గానీ, నేరం గానీ తెలియకుండానో, అనుకోకుండానో చేయడం మానవ సహజం. తెలిసో తెలియకనో మనం ఇతరులకు బాధ కలిగిస్తుంటాం. ఆ తర్వాత అది తప్పు అని తెలుసుకోగలగటం, అందుకు మనసులో బాధతో దహించుకుపోవటాన్నే పశ్చాత్తాపం అంటారు. ఇదే మానవత్వపు ఔన్నత్యం!మళ్ళీ ఆ తప్పు తనవల్ల జరగకుండా జాగ్రత్త పడటం, తనవల్ల వేదనకు గురైన బాధితులకు తగిన మేలు చేయడమే ప్రాయశ్చిత్తం, అదే మానవ ధర్మం. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు పాప పరిహారం లేదు’ అని ఎవరో అన్నారని ‘నేను పశ్చాత్తాప పడుతున్నాను’ అని ఒక మాట చెప్పేసి ‘నేను పశ్చాత్తాప పడ్డాను కాబట్టి నేను చేసిన నేరానికి శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు’ అని తప్పించుకోవటానికి అవకాశం లేదు. ఆదిశంకరాచార్యులవారు కూడా అలా అడ్డదారులలో సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల ఫలితాల నుండి విముక్తం అవటం సాధ్యం కాదు అనీ జ్ఞానబుద్ధితో మాత్రమే ప్రాయశ్చిత్తం లభిస్తుందని అన్నారు. ‘తెలిసి చేసిన తప్పును ఏ దేవుడూ క్షమించడు’ అని తరతరాలుగా పెద్దలు చెబుతున్న మాట కూడా ఆమోద యోగ్యమే. ‘ఎవ్వరికీ అపకారం చేయని ఆ ఆవు చావుకి కారణమయ్యాను. ఇక నేను కూడా బతకను’ అని.. ఆత్మాహుతి చేసుకునేందుకు పరుగులు తీసే మనసున్న మనిషికి మాత్రమే .... కేవలం పశ్చాత్తాపం తో పరిహారం అయినట్లు భావించాలి. పశ్చాత్తాపపు బాధతో దహించుకుపోతున్న మనస్సుతో అతను జీవితం మొత్తం గడుపుతాడు. ఆ వ్యథనే అతడు శిక్షగా భావిస్తాడు.పై వివరణ కేవలం ఒక ఘటన, ఉదాహరణ మాత్రమే. పశ్చాత్తాపం అంటే పై విధంగా ఉండాలి.దేశం ఏదైనా, మతం ఏదైనా సమాజంలో మానవుని జీవితంలో తప్పు జరగటం అనివార్యం, అయితే అటువంటి తెలిసీ తెలియని తప్పులకు కూడా పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం వంటివాటిని పెద్దలు ఎప్పుడో చెప్పారు. వ్యక్తిగతంగా పశ్చాత్తాపపడటం క్షమాపణ చెప్పటం నైతికత. ప్రవర్తనను సంస్కరించుకొనటం, ఆపై పరిహారం అందించటం ద్వారా ప్రాయశ్చిత్తం. చట్టపరమైన.. న్యాయం నష్టపరిహారం అందేలా ప్రయత్నం చేయటం, శిక్షద్వారా పశ్చాత్తాపం పొందేలా చేయటం ప్రాయశ్చిత్తం జరిపించడం ఆచరణీయాలుగా ఉన్నాయి.క్రైస్తవ్యంలో.. మెటానోయియా అనబడుతూ పశ్చాత్తాపం, దైవశాస్త్ర ప్రాయశ్చిత్తం ఉన్నాయియూదు మతంలో.. తెషువా అనబడే ప్రాయశ్చిత్తం ఉన్నాయి. ఇస్లాంలో.. తౌబా అనబడే ఆచారం.. పశ్చాత్తాప భావనను, ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తుంది. లౌకికవాదంలో... పశ్చాత్తాపం అంటే వ్యక్తం చేయటంతో పాటు, క్షమించ బడటానికి సమాజంలో విశ్వాసం పొందడానికి తగిన పారదర్శకతతో కూడిన పరిహార చర్యలను ప్రాయశ్చిత్తంగా భావిస్తుంది.ప్రభావవంతమైన నైతిక పునరుద్ధరణకు పునరావృతం కాకుండా నిరోధించడానికి నిజమైన పశ్చాత్తాపంతో పాటు స్పష్టమైన తత్సమానమైన ప్రాయశ్చిత్తం అవసరం అంటుంది. ధర్మశాస్త్రం, పురాణాలూ, నిఘంటువులు, మతాలూ, చట్టాలూ ఏమిచెబుతున్నా... ఇతరులను బాధ పెట్టడమనేదే మహాపాపం. తప్పు. అలాంటి తప్పులకు పాపాలకు ఏ మాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుక గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుందిఅపరాధ భావంతో తెలియక చేసిన ఆ పొరపాటును తలచుకొని బాధ పడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగపాపం తొలగిపోతుంది. పశ్చాత్తాపంలో భాగంగా పాటించవలసిన కట్టుబాటులో బాధితుల్ని శరణు వేడటం, మెప్పించటం వంటి నిబంధనలు ఉంటాయి.చేసిన పాపాన్ని మనసులో తలచుకొని సిగ్గుతో తలవంచుకొని కుంగిపోయినట్లయితే, ఆ పాపం పటాపంచలవుతుందని పురాణాలు చెపుతున్నాయి. దానినే..‘మనః ప్రాయశ్చిత్త’మని అంటారు. ఇట్టి మనః ప్రాయశ్చిత్తం బాధితులకు భౌతికంగా, మానసికంగా కూడా సహాయకారియై పరస్పరం ఇరువర్గాలకు మనశ్శాంతిని ఇస్తుందని జ్ఞానులు నమ్ముతారు.– డా.గాదిరాజు మధుసూదన రాజు
అంతర్జాతీయం
ఇలాంటి పనులు ట్రంప్కు మాత్రమే సాధ్యం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే కనిపించింది. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న ఆయన.. తాజాగా ఏకంగా ఇరాన్ మ్యాప్పై తన ముఖాన్ని పెట్టారు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు.. ‘ఇరాన్ ఓ విఫల దేశం’ అంటూ సందేశం ఇచ్చారు. ఆదివారం ట్రూత్ సోషల్లో గంట వ్యవధిలో ఇరాన్కు సంబంధించిన ఏడు పోస్టులు పెట్టిన ట్రంప్.. ఆ దేశంపై అమెరికా ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో చూపించేందుకు మ్యాప్లు, గ్రాఫిక్స్ను ఉపయోగించారు. తాజా పోస్టుల్లో ఒకదానిలో ఇరాన్ మ్యాప్ కనిపించగా.. దానిపై ట్రంప్ ముఖాన్ని ఉంచారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని చెప్పేందుకు ఈ చిత్రాన్ని ఉపయోగించారు. మరో పోస్టులో ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయని పేర్కొన్నారు. ఇరాన్కు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని క్షిపణులతో పేల్చేసినట్లు ఓ పోస్ట్ చేశారు. అలాగే హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ పెరిగిందంటూ మరో గ్రాఫిక్ను పోస్ట్ చేశారు. హర్ముజ్కూ ‘ట్రంప్’ ముద్ర?ట్రంప్ ఇంతటితో ఆగలేదు. వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’ అని పేరు మార్చాలని గతంలో వ్యాఖ్యానించారు. ఆ వెంటనే వైట్హౌజ్ వర్గాలు అదే పేరుతో ఓ మ్యాప్ను రిలీజ్ చేశారు. ఇక ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలమార్గం ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఘర్షణకు ప్రధాన కేంద్రంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకా దిగ్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా చెబుతుండగా.. హర్ముజ్పై తన ప్రభావాన్ని కొనసాగిస్తామని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది. ట్రంప్తో మాములుగా ఉండదుట్రంప్కు ఇలాంటి పనులు కొత్తేం కాదు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా, అలాస్కాలోని ‘డెనాలి’ పేరును ‘మౌంట్ మెకిన్లీ’గా మార్చేందుకు ఏకంగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ వినియోగంలో ఈ పేర్లు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. ఇటీవల మరో అడుగు ముందుకేసి కెనడా లేక్ ఒంటారియోను ‘లేక్ అమెరికా’గా పేరు మార్చాలంటూ యాపిల్ మ్యాప్స్కు ట్రంప్ సూచించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. గూగుల్ ఇప్పటికే అమెరికా వినియోగదారుల కోసం ఆ పేరును చూపించడం ప్రారంభించింది. ట్రంప్ రాజకీయ అస్త్రంట్రంప్ తాజా ఇరాన్ పోస్టులను గమనిస్తే.. మ్యాప్లు కేవలం భౌగోళిక వివరాల కోసం కాకుండా రాజకీయ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే సాధనంగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ మ్యాప్పై తన ముఖం, ‘ఫెయిలింగ్ నేషన్’ అనే వ్యాఖ్య.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై చమురు ఎగుమతులు, కరెన్సీ పతనం, హర్ముజ్ సంక్షోభాన్ని కలిపి చూపించే గ్రాఫిక్స్.. ఇవన్నీ ఒకే సందేశాన్ని బలపరిచేలా ఉన్నాయి. ఇరాన్పై ఆర్థిక, సైనిక ఒత్తిడిని పెంచుతున్న సమయంలో ట్రంప్ సోషల్ మీడియా పోస్టులు కూడా అదే దూకుడును ప్రతిబింబిస్తున్నాయి. అయితే టెహ్రాన్ మాత్రం అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని చెబుతోంది. దీంతో ట్రంప్ తాజా ‘మ్యాప్ పోస్టు’ కూడా అమెరికా-ఇరాన్ ఘర్షణలో మరో రాజకీయ సందేశంగా మారింది.ఇదీ చదవండి: అంతులేని వెతుకులాట!
రన్వే దాటి రోడ్డెక్కిన విమానం.. ఐదుగురి దుర్మరణం
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరం జరిగింది. ఓ కార్గో ప్రమాదం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి బయటకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో రోడ్డు మీద ఉన్న వాహనాల్ని ఢీ కొట్టి పేలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ ఎయిర్కు చెందిన కార్గో విమానం ఆదివారం ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి మియామికి వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాండింగ్ చేస్తుండగా అదుపుతప్పి రన్వేను దాటింది. అనంతరం విమానం విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న గోదాములు, ఇతర వ్యాపార సంస్థలకు వెళ్లే రహదారిపైకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది.మియామి-డేడ్ కౌంటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో కమ్ముకుంది. విమానం కాక్పిట్లో పైలట్, కో-పైలట్ చిక్కుకుపోయారు. కొన్ని వాహనాల్లోని వ్యక్తులు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక వ్యక్తి వాహనం కింద ఇరుక్కుపోవడంతో సహాయక సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి బయటకు తీశారు.భారీ రెస్క్యూ ఆపరేషన్సమాచారం అందుకున్న వెంటనే సుమారు 200 మంది అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. 60కిపైగా అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విమానంలోని ఇంధనం లీకవుతుండటంతో దాన్ని నియంత్రించే చర్యలు కూడా చేపట్టారు. ప్రమాదం కారణంగా విమానాశ్రయంలో కొంతసేపు విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.రాకపోకలపై ప్రభావంప్రమాదం కారణంగా మియామి విమానాశ్రయంలో 160కిపైగా విమానాలు రద్దయ్యాయి. దాదాపు 325 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని విమానాలను 320 కిలోమీటర్ల దూరంలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం విమానాశ్రయ కార్యకలాపాలను దశలవారీగా పునరుద్ధరించారు.ఏం జరిగిందసలు?ప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ప్రమాదం సమయంలో ఆ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు, గంటకు సుమారు 48 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అమెరికా జాతీయ వాతావరణ సేవ తెలిపింది. అయితే వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.32 ఏళ్ల బోయింగ్ విమానంప్రమాదానికి గురైన కార్గో విమానం బోయింగ్ 767. ఇది తొలుత ప్రయాణికుల విమానంగా నిర్మించబడింది. రెండు దశాబ్దాలకు పైగా పలు విమానయాన సంస్థల్లో సేవలందించిన తర్వాత 2015లో కార్గో విమానంగా మార్చారు. ఈ విమానాన్ని అమెజాన్ తరఫున అమెరికాకు చెందిన కార్గో క్యారియర్ 21 Air నిర్వహిస్తోంది.దర్యాప్తు ప్రారంభంప్రమాదంపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) దర్యాప్తు ప్రారంభించాయి. NTSB చైర్పర్సన్ జెన్నిఫర్ హోమెండీ నేతృత్వంలో ప్రత్యేక బృందం మియామికి చేరుకుని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించనుంది. విమానం రన్వేపై ఎక్కడ ల్యాండ్ అయింది? ల్యాండింగ్ సమయంలో వేగం ఎంత ఉంది? రన్వే చివరికి చేరుకునేలోపు ఎందుకు నియంత్రణలోకి రాలేదు? వంటి అంశాలపై దర్యాప్తులో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఇటు ఈ ఘటనపై అమెజాన్ సంస్థ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.🚨 Update: Deadly Cargo Plane Crash at Miami International AirportAt least five people have died and five others were injured after an Amazon Prime Air cargo aircraft overran the runway at Miami International Airport on Sunday afternoon, striking multiple vehicles and bursting… pic.twitter.com/6XLpT6mVaP— FL360aero (@fl360aero) September 7, 2026
అంతులేని వెతుకులాట
కఠ్మాండు: నేపాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తి 11 రోజులు గడిచిపోయాయి. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల గుర్తింపులో అధికారులు ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలిస్తూనే ఉన్నాయి. మృతుల సంఖ్య దాదాపు 1,400కు చేరుకుంది. 589 మంది విదేశీయులు సహా 5 వేల మందికిపైగా గల్లంతయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్ ఆదివారం సహాయక, పునరావాస చర్యలపై చర్చించారు. మరోవైపు బాధిత మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. ఆకలితో ఉన్న తమ బిడ్డలకు ఆహారం అందించలేకపోతున్నామని చెబుతున్నారు. తల్లులు పాలివ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. సమస్య తలెత్తితే ఆసుపత్రికి ఎలా వెళ్లాలనే దానిపై గర్భిణిలు ఆందోళన చెందుతున్నారు.
హార్మూజ్లో అమెరికా నౌకపై ఇరాన్ దాడి!
కైరో: హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న అమెరికాకు చెందిన మానవ రహిత నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ఆదివారం ప్రకటించింది. అయితే, ఈ విషయాన్ని అమెరికా సైన్యం ఖండించింది. ఇరాన్ చెప్పిందంతా అబద్ధమేనని కొట్టిపారేసింది. తమ నౌకపై ఎలాంటి దాడి జరగలేదని వివరించింది. హార్మూజ్లో ఇరాన్కు చెందిన మూడు చమురు నౌకలపై అమెరికా దాడికి దిగిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగా మరుసగా రోజే అమెరికా నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును పెంచుకొనేందుకు ప్రయత్నిస్తోంది.
జాతీయం
టీచర్స్డే.. ఐటెం సాంగ్!
టీచర్స్ డే వేడుకల్లో.. అదీ పెద్ద సంఖ్యలో విద్యావేత్తలు, మేధావులు హాజరైన కార్యక్రమంలో అమ్మాయిలు చేసిన ఓ డ్యాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీచర్స్ ఐకాన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటో బ్యాక్గ్రౌండ్లో ఉండగా.. దేశాన్ని ఊపేసిన ఓ ఐటెం సాంగ్కు వాళ్లు హుషారుగా ఊగిపోయారు. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట రచ్చకు కారణమైంది.డెహ్రాడూన్లోని జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెప్టెంబర్ 5న నిర్వహించిన కార్యక్రమం వీడియో ఎక్స్లో వైరల్ అయ్యింది. మొత్తం 46 మంది ఉపాధ్యాయులను సత్కరించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే ఎంచుకున్న పాటపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. డర్టీ పిక్చర్ చిత్రంలోని ‘ఊ లా లా.. ఊ లా లా.. తూ హై మేరీ ఫ్యాంటసీ’ అంటూ ఆ అమ్మాయిలు హుషారుగా స్టెప్పులేశారు. అది చూసి అక్కడే ఉన్న కొందరు కుర్రాళ్లు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే టీచర్స్ డే వేడుకలకు ఇలాంటి పాట సరిపోతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం దీనిపై వస్తున్న విమర్శలను అతిగా స్పందించడం అని కొట్టిపారేస్తున్నారు. కళాశాల కార్యక్రమాల్లో విద్యార్థులు తమకు నచ్చిన పాటలకు సరదాగా డ్యాన్స్ చేయడం సాధారణమేనని, దీనిని సంప్రదాయాలకు వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. యువత వేడుకలను చూసే దృక్పథంలో వచ్చిన మార్పుగా మరికొందరు అభివర్ణిస్తున్నారు.ఈ వీడియో వైరల్ కావడంతో టీచర్స్ డే వేడుకల్లో సంప్రదాయ విలువలకే ప్రాధాన్యమివ్వాలా? లేదంటే విద్యార్థుల ఆధునిక శైలికీ చోటివ్వాలా? అనే చర్చ మొదలైంది. ఒక చిన్న నృత్య ప్రదర్శన కాస్తా సంప్రదాయం, ఆధునికత మధ్య సోషల్ మీడియాలో వాదనకు దారితీసింది.Dr. Sarvepalli Radhakrishnan be like "Thank god, i didn't live long enough to see this"pic.twitter.com/ypB3p27XaH— Keh Ke Peheno (@coolfunnytshirt) September 7, 2026
5 నిమిషాల్లో అమ్ముడైన దీపావళి రైలు టిక్కెట్లు
దీపావళి పండుగను నవంబర్ 8వ తేదీన జరుపుకుంటారు. ఈ సందర్భంగా, నవంబర్ 5వ తేదీన తమ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం రైళ్లుకు ఆదివారం బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున బుకింగ్ కోసం రైల్వే స్టేషన్ల వద్ద భారీగా జనం గుమిగూడారు. ఉదయం 8 గంటలకు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. కన్యాకుమారి ఎక్స్ప్రెస్లోని 2వ తరగతి స్లీపర్ కంపార్ట్మెంట్ కోసం వెయిటింగ్ లిస్ట్లో 33 మంది ఉన్నారు. ఏసీ క్లాసులలో పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి.గురువాయూర్ రైలు టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. తూత్తుకుడి ఎక్స్ప్రెస్ వెయిటింగ్ లిస్ట్ కూడా క్లియర్ చేయబడింది.అనంతపురి, నెల్లై, పుదుచ్చేరి వెళ్లే రైళ్లలో కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. నెల్లై, నాగర్కోయిల్కు వెళ్లే వందే భారత్ రైళ్ల బుకింగ్లు కూడా ముగిశాయి. పర్యాటకులకు అత్యంత రద్దీగా ఉండే రోజులు దీపావళి. ఈక్రమంలో దీపావళి టిక్కెట్లను మొబైల్ ఫోన్లో కూడా అధికసంఖ్యలో బుకింగ్ చేసుకోవటం తో 5 నిమిషాల్లో హాట్ కేక్ లా అమ్ముడైపోయాయి. నవంబర్ 6వ తేదీ వెళ్లే వారు సోమవారం బుక్ చేసుకోవాలని ప్రారంభమవుతాయి, నవంబర్ 7వ తేదీకి బుకింగ్లు మరుసటి రోజు ప్రారంభమవుతాయని రైల్వేఅధికారులు వెల్లడించారు. -తమిళనాడు చదవండి: మిమ్మల్ని క్షమించేది లేదు
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండానే.. ‘మహిళలను అవమానిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొనసాగుతున్న త్రిష వివాదానికి మరింత వేడి పెంచాయి. ఉదయనిధి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలు తాజా వివాదాన్ని ఉద్దేశించేలా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్..‘భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నామో మనం ఆలోచించాలి. మన ప్రజలను, మహిళలను కించపరిచేలా మాట్లాడకూడదు. మన ఇళ్లలో మహిళలు తల్లులు, సోదరీమణులుగా ఉన్నారు. మహిళలను అవమానిస్తే చట్టం చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.రాజకీయ విమర్శ వేరు.. అయితే విజయ్ మాత్రం రాజకీయ విమర్శలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. మహిళలను అవమానించే వ్యాఖ్యలకు ఆ స్వేచ్ఛను అడ్డుపెట్టుకోలేమని స్పష్టం చేశారు. గతంలో అసెంబ్లీలో మాజీ సీఎం జయలలిత ఎదుర్కొన్న అవమానాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపైనా విజయ్ మాట్లాడారు. పోలీసులు కేవలం నేరస్తులను అరెస్టు చేయడానికే పరిమితం కాకూడదని, నేరాలు జరగకుండా ముందే అడ్డుకోవడమే అసలు లక్ష్యమని చెప్పారు. చట్టాన్ని పాటించే వారికి పోలీసులు స్నేహితులుగా.. ఉల్లంఘించే వారికి శత్రువులుగా ఉండాలని పేర్కొన్నారు.TN Assembly: “If anyone talks in a derogatory manner about women, stern action is assured.”- TN CM Vijay, recalls 'humiliation' of former CM Jayalalithaa in the Assembly pic.twitter.com/c7Y6bD1kCo— News Arena India (@NewsArenaIndia) September 7, 2026పోలీసులకు హెచ్చరికలు.. తమ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై నేరాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని విజయ్ తెలిపారు. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. నేరాలను ముందుగానే నిరోధించేందుకు పోలీసులు పనిచేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సైబర్ నేరాలపై కూడా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై కూడా విజయ్ కఠిన వైఖరి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ.. తమ ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు. పోలీసులపై ఆరోపణలు వచ్చినా వారిని కాపాడే ప్రసక్తి లేదని, లాకప్లో జరిగే నేరాలపై పారదర్శక దర్యాప్తు చేపడతామని తెలిపారు.దీంతో త్రిష వివాదం నేపథ్యంలో విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. పేర్లు ప్రస్తావించకుండా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఆగస్టు 3న తంజావూరులో జరిగిన కావేరీ నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్న సమయంలో కొందరు త్రిష పేరును నినాదించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు కావేరీ సమస్యకు మాత్రమే సంబంధించినవని ఉదయనిధి వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఆగస్టు 4న పోలీసులు ఉదయనిధిని అరెస్టు చేసి తంజావూరుకు తీసుకెళ్లారు. అనంతరం అదే రోజు స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. తనపై కేసు నమోదు చేయడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా ఆయన అభివర్ణించారు.
నీట్ నిరసనలతో వైరల్.. ‘బిగ్బాస్’లో రియాకు చుక్కెదురు
నీట్ నిరసనల సందర్భంగా వైరల్గా మారిన ఇన్ఫ్లుయెన్సర్, నటి రియా అహిర్కు ‘బిగ్బాస్ 20’లో నిరాశ ఎదురైంది. ముంబైలోని శివాజీ పార్క్లో జరిగిన విద్యార్థుల ఆందోళన సమయంలో విద్యార్థులతో కూడిన పోలీసు వ్యాన్ను ఆపేందుకు రియా ఒంటరిగా దాని ముందు నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పలువురు ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు.ఈ నేపథ్యంలో రియాకు ‘బిగ్బాస్ 20’లో పాల్గొనే అవకాశం లభించింది. అయితే ఆమెను షోలోకి పంపాలా? వద్దా? అనే నిర్ణయాన్ని నిర్వాహకులు ప్రేక్షకులకే అప్పగించారు. రియాతో పాటు పంజాబీ నటి లవ్ గిల్ పోటీలో నిలిచారు. వీరిద్దరిలో ఒకరిని షోలోకి పంపేందుకు ప్రేక్షకులు ఓటు వేయాల్సి వచ్చింది. ప్రజాభిప్రాయంలో లవ్ గిల్ విజయం సాధించారు. అధిక ఓట్లు రావడంతో ఆమె సల్మాన్ ఖాన్ షోలోకి ప్రవేశించారు. రియా మాత్రం నిరాశతో స్టేజ్ నుంచే తిరిగి వెళ్లాల్సి వచ్చింది.అయితే ఫలితం వెల్లడికాకముందే రియా, లవ్ గిల్ మధ్య వేదికపైనే వాగ్వాదం చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ సమక్షంలో ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. బస్సును ఆపేంత ధైర్యం ఉందా అంటూ లవ్ చేసిన వ్యాఖ్యపై రియా స్పందిస్తూ.. తాను ఆపింది బస్సు కాదని, వ్యాన్ అని స్పష్టం చేశారు. డ్రైవర్ ఆపకపోతే రియా పరిస్థితి మరోలా ఉండేదని లవ్ వ్యాఖ్యానించారు. తన జీవిత ఉద్దేశం అక్కడే నెరవేరేదని రియా బదులిచ్చారు. ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని సల్మాన్ ఖాన్ చూస్తూ ఉండిపోయారు. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నారు. చివరకు రియాకు ప్రేక్షకుల మద్దతు లభించలేదు. రెండు నిమిషాల్లోనే ఆమె షో నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.ఇది కూడా చదవండి: బిగ్బాస్ హౌస్లోకి బాక్సింగ్ దిగ్గజం.. వణికిపోతున్న పోటీదారులు!
ఎన్ఆర్ఐ
జోహన్నెస్బర్గ్లో వైఎస్సార్ వర్ధంతి.. ప్రత్యేక సేవా కార్యక్రమం
జోహన్నెస్బర్గ్: మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్బర్గ్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్రెడ్డి పెట్లూరు ఆధ్వర్యంలో ఈడెన్వేల్లోని ‘ది లిటిల్ ఈడెన్’లో కార్యక్రమం జరిగింది. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి సంక్షేమం, సహాయార్థం నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో పలువురు పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించారు. సేవా భావం, మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించి, స్వయంగా పాల్గొని విజయవంతం చేసిన నరసింహరెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్రెడ్డి ఏనుముల, హరీష్ గోరంట్ల, శ్రావణి పెట్లూరు, కరుణా బసిరెడ్డి, సుమన్ చిట్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.వైఎస్ రాజశేఖరరెడ్డి సేవా స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడంతో పాటు ఆయన ఆశయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు తెలిపారు.
NRI: తెలుగు భాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలి..
డాలస్, టెక్సస్: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమంలో భాగంగా 95వ అంతర్జాల సమావేశం ‘తెలుగే మన వెలుగు’ అనే అంశంపై నిర్వహించారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలో సలహా కమిటీ ఏర్పాటు చేసి భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. తెలుగు భాషకు విశేష సేవలందించిన ప్రముఖుల జ్ఞాపకాలను భావితరాలకు అందించేందుకు విగ్రహాలు, స్మారక చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఆంగ్ల భాష ప్రాధాన్యతను గుర్తిస్తూనే మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ పరిపాలనలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని, ఆంగ్లంలో వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే తెలుగులోకి అనువదించాలని సూచించారు. కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరిగితే పిల్లలకు భాషపై మంచి పట్టు ఏర్పడుతుందని అన్నారు.ఆచార్య శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ.. ఇతర భాషల పదాలను సులభంగా తనలో కలుపుకునే ప్రత్యేకత తెలుగు భాషకు ఉందన్నారు. తెలుగు భాష వైభవాన్ని అనేక మంది ప్రముఖులు ప్రశంసించారని, భాషను విస్తరించడంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి ప్రతి సంవత్సరం తెలుగు భాషా, కళారత్న పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు. గిడుగు రామమూర్తి మునిమనుమరాలు గిడుగు లక్ష్మీకాంతికృష్ణ మాట్లాడుతూ తన ముత్తాత ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గ్రాంథిక భాష స్థానంలో వ్యవహారిక భాషకు ప్రాధాన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు.ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్కుమార్ మాట్లాడుతూ.. తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చినప్పటికీ కేంద్రం నుంచి తగిన నిధులు సాధించడంలో మరింత కృషి అవసరమన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలకు తెలుగు నేర్పేందుకు ఆధునిక పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. కేవలం మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థులకు భాష ఎంతవరకు అర్థమవుతోందో చూడాలని అన్నారు.సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల మాట్లాడుతూ.. కాలానుగుణంగా తెలుగు భాషలో మార్పులు వస్తున్నాయని, అందరూ కలిసి భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం చేసేందుకు సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.ఇవి కూడా చదవండి: అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
దుబాయ్లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా దుబాయ్లోని బిన్ సనత్ లేబర్ క్యాంప్, సోనాపూర్లో అన్నదాన సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా, ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజా రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, కోటేశ్వర రెడ్డి, నరేష్ చౌదరి, జనార్దన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రమణ రెడ్డి , ఇషాల్ , వెంకట్ రెడ్డి, షరీఫ్, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రియతమ మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా..ఆయన చేసిన సేవలు, అమలు చేసిన కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు. అంతేగాదు వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా.(చదవండి: మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్)
అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది.వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా తదితర రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. Run4Telugu పోటీలను రెండు విభాగాలలో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనబడి ధృవపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాలలో పాల్గొన్న వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేగాదు “తెలుగు నేర్చుకుందాం… తెలుగు మాట్లాడుదాం… తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం” అనే మనబడి సందేశాన్ని అమెరికా వ్యాప్తంగా ధ్వనింపచేసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. (చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)
క్రైమ్
పబ్లో అర్ధరాత్రి ఘర్షణ
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒక స్టార్ హోటల్ పబ్లో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒక వర్గంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ సోదరుడు సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్లోని ఎనిమిదో అంతస్థులో ‘కారా కారా’ పేరుతో పబ్ ఉంది. శనివారం రాత్రి దాదాపు 2.10 గంటల ప్రాంతంలో పబ్లో దాదాపు 200 మందికిపైగా ఉన్నారు. అదే సమయంలో పబ్లో గోడకు, టేబుల్కు మధ్యలో ఉన్న అనిల్ కుమార్యాదవ్ సోదరుడు అరవింద్ యాదవ్ (టిల్లు)ను దాటుకొని వెళ్లడానికి మరో యువకుడు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న అరవింద్ యాదవ్ స్నేహితులు యువకుడిపై దాడికి దిగారు. ఇది గమనించిన యువకుడి స్నేహితులు సైతం ఒక్కసారిగా రెచ్చిపోయి అరవింద్తోపాటు అతని స్నేహితులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పబ్లో రణరంగం చోటచేసుకొంది. బీరు సీసాలతో చేతులు, కాళ్లతో దాడికి దిగబడటంతో చుట్టు ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉద్రిక్త వాతవారణం చోటుచేసుకొంది. ఈ గొడవలో ఒక యువతి కింద పడిపోయింది. అదే సమయంలో పబ్లోని బౌన్సర్లు వచ్చి ఇరువర్గాలను అడ్డుకొని అక్కడి నుంచి కిందకు పంపారు. వీరంతా హోటల్ సెల్లార్లోకి చేరుకుని అక్కడా ఘర్షణకు దిగారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల్లో కొందరికి గాయాలయ్యాయి. ఈ దాడుల్లో దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. హోటల్ నిర్వాహకులతోపాటు అక్కడే ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఇరువర్గాలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్లో అద్దాలు పగిలి ఉండటంతోపాటు, బల్లలు, కురీ్చలు దెబ్బతిని ఉండటాన్ని గుర్తించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీల్లో అరవింద్ యాదవ్ టోపీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు పబ్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని విచారిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సమయానికి మించి పబ్ను నడపడంతో మరో కేసు సైతం సుమోటోగా నమోదు చేశారు.
బుల్తో ఫైట్
గత ఏడాది నవంబరులో జరిగిన ‘వారణాసి’ ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్ని గుర్తు చేసుకుంటే... ఆ వేడుకలో మహేశ్బాబు ఒక మెకానికల్ బుల్పై కూర్చుని వేదిక మీదకు వచ్చిన విషయం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... బుల్తో ఫైట్ చేయడానికి మహేశ్బాబు సిద్ధం అవుతున్నారట. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్లో మహేశ్బాబు పాత్రకు సంబంధించిన ఎలివేషన్ షాట్లో బుల్ విజువల్ కూడా కనిపించింది. ఇప్పుడు ఈ ఫైట్ చిత్రీకరణ కోసమే హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ని రూపొందించారని సమాచారం. ఈ ఫైట్ షూట్కి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నారట చిత్రదర్శకుడు రాజమౌళి. ఈ వారంలో ఈ ఫైట్ చిత్రీకరణను ఆరంభించనున్నారని తెలిసింది. ‘వారణాసి’ సినిమాకి హైలైట్స్గా నిలిచేవాటిలో ఈ ఫైట్ది ప్రముఖ స్థానం అని టాక్. ఇక పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్బాబు. ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మట్టి మాఫియాకు యువకుడు బలి
ఏర్పేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద బైక్పై వెళుతున్న ఓ యువకుడిని మట్టి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. శ్రీకాళహస్తి టూటౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తొట్టంబేడు మండలం గుండేలుగుంటకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుబ్బరత్నమ్మ కుమారుడు చంద్రశేఖర్ (25) ఆదివారం బైక్పై శ్రీకాళహస్తికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. పట్టణ సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద ఎదురుగా మట్టి లోడుతో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చంద్రశేఖర్ శ్రీకాళహస్తి ఆలయంలో స్వచ్ఛంద సేవకుడిగా చిన్నపాటి ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉండగా, ట్రాక్టర్కు కనీసం నంబరు ప్లేట్ కూడా లేకపోవడం విశేషం. ప్రమాద విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతుని కుటుంబీకులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అక్కడున్న వారిని ఆరా తీశారు. మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని తీరుతో శ్రీకాళహస్తిలోని ప్రతి గ్రామంలోనూ మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతోందన్నారు. నంబరు ప్లేట్లు లేకుండా ట్రాక్టర్లు నడుపుతుంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిందిపోయి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కాగా.. శ్రీకాళహస్తి మండలం నారాయణపురానికి చెందిన ఉపాధ్యాయుడు కావలి మురళి జూలై 1వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి బైక్పై వస్తుండగా బైపాస్రోడ్డులోని అండర్పాస్ వంతెన వద్ద మట్టి లోడుతో వెళుతున్న ఇదే ట్రాక్టర్ ట్రక్ ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..!
ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిపోడ్ మరింత ముదిరింది. ఈ వివాదంలో మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు మాధురిని కాపాడారు. ఈశ్వర్ సాయిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంటున్న మాధురిని కుటుంబ సభ్యులు కాపాడారు. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోనే మాధురి రాథోడ్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. మాధురి రాథోడ్ ఫిర్యాదు..అంతకుముందు ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై డ్యాన్సర్ రమావత్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈశ్వర్సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాసింగ బలాలే జానపద నృత్యంలో నటించి ఈశ్వర్సాయి పాపులర్ అయ్యారు. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వీడియోలు
త్రిష వివాదం పై స్టాలిన్ కి ఇచ్చి పడేసిన విజయ్
ఢిల్లీలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం CCTV ఫుటేజ్ విజువల్స్
పిల్ల చేష్టలు ఇంకా పోలేదు... సీఎం కుర్చీ కోసం బాగా ఆశపడుతున్నట్టున్నావ్!
తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి సమాధానం
జర్మనీలో సంచలనం అతిపెద్ద శక్తిగా AFD
కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ వాయిదా.. చంద్రబాబు నిర్ణయంపై అనుమానాలు
కాబినెట్ లోకి రాజగోపాల్ రెడ్డి? రేవంత్ సభతో పెరిగిన హీట్!
ఇదేం ప్రజాపాలన చీర ఎలా లాగేస్తారు? సునీత లక్ష్మారెడ్డి ఎమోషనల్
ఉద్యోగులు ఉద్యమానికి దిగితే నీ పరిస్థితి... కేకేరాజు మాస్ వార్నింగ్
అసెంబ్లీ ఘటన తర్వాత తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు

