టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్!
కొలంబో వేదికగా శ్రీలంకతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి టెస్టులో ఓటమి పాలైన ఆతిథ్య శ్రీలంక.. కొలంబోలో గెలిచి సిరీస్ సమం చేయాలని వ్యూహాలు రచిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. తొలి రోజు కొలంబోలో వర్షం కురిసేందుకు 60 శాతం అస్కారముంది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురవనున్నట్లు పలు వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా తొలి టెస్టు జరిగిన గాలేలో కూడా ఆటకు వర్షం ఆటంకం కలిగించింది.పిచ్ రిపోర్ట్(అంచనా)ఇక కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ పిచ్ మొదటి రెండు రోజులు బ్యాటింగ్కు బాగా అనుకూలించే ఛాన్స్ ఉంది. మ్యాచ్ గడుస్తున్న కొద్దీ పిచ్ క్రమంగా పొడిగా మారి, మూడో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుంది.దీంతో నాలుగో ఇన్నింగ్స్లో స్పిన్నర్లను ఎదుర్కోవడం కాస్త కష్టమవుతోంది. అయితే కొలంబోలో వాతావరణ పరిస్థితుల కారణంగా ఫస్ట్ సెషన్లో కొత్త బంతితో పేసర్లు కొంతవరకు పట్టు సాధించవచ్చు.కాగా చారిత్రాత్మక సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో టీమిండియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ వేదికలో తొమ్మిది టెస్టు మ్యాచ్లు ఆడిన భారత్.. మూడింట విజయం, రెండింట ఓటమి పాలైంది. మరో నాలుగు మ్యాచ్లను డ్రాగా ముగించింది.తుది జట్లు(అంచనా)భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, సరాంశ్ జైన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంక: లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూరియబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, సోనాల్ దినుషా, కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, లహిరు కుమార.
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్లో శనివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వాతావరణశాఖ తెలిపిన విధంగా ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది.
'ఇరుముడి'తో జాక్పాట్ కొట్టిన రవితేజ
చాన్నాళ్ల తర్వాత హీరోగా రవితేజ హిట్ కొట్టాడు. రెండు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'ఇరుముడి'కి దాదాపుగా పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో షోలన్నీ ఫుల్ అవుతున్నాయి. దీంతో రవితేజ ఫుల్ హ్యాపీస్. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం ఇతడు తక్కువే రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ అదిరిపోయే జాక్ పాట్ కొట్టినట్లు మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమాలో నటించినందుకుగానూ రవితేజ.. సాధారణంగా అందుకునే పారితోషికంలో మూడో వంతు మాత్రమే తీసుకున్నాడట. అదనంగా నైజాం థియేట్రికల్ హక్కులు దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు సక్సెస్ దక్కేసరికి రవితేజ రెగ్యులర్గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువనే రాబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.20 కోట్ల వరకు రవితేజకు దక్కనున్నట్లు సమాచారం.'ఇరుముడి' విషయానికొస్తే.. సీలేరు దగ్గర పల్లెటూరిలో ఉండే త్రినాథ్ (రవితేజ) లగేజీ ఆటో డ్రైవర్. భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్), కూతురు మణి(నక్షత్ర)తో కలిసి హ్యాపీగా బతికేస్తుంటాడు. ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఉంటాడు. ఏం జరిగినా తనతో చెప్పాలని కూతురితో చెబుతాడు. ఆమె కూడా ప్రతిదీ నాన్నకు చెబుతూ ఉంటుంది. త్రినాథ్ అయ్యప్ప మాల వేసిన తర్వాత తాను చదువుతున్న స్కూల్లో జరుగుతున్న ఓ సంఘటన గురించి కూతురికి తెలుస్తోంది. దానిని ఎలాగైనా నాన్నకు చెప్పాలనుకుంటుంది. ఇంతకీ మణి చెప్పాలనుకుంటున్న విషయమేంటి? త్రినాథ్కి వాటి గురించి ఎప్పుడు ఎలా తెలిసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
అమిత్ షా (కేంద్ర మంత్రి) రాయని డైరీ
ఎండన పడి వచ్చిన వాళ్లకే కాదు, ఏ వేళన పడిలేస్తూ వచ్చిన వారికైనా ఎదురెళ్లి మంచినీళ్ల గ్లాసును చేతికి అందించటం భారతీయ సంస్కృతికే ప్రత్యేకమైన ఒక గొప్ప ఆతిథ్యం. నేను గుజరాతీని కాబట్టి, ఒకవేళ ఎవరైనా నాకు – ముఖ్యంగా ఆదివారం ఉదయం – అల్పాహారంగా తియ్యటి రసం ఊరే వేడి వేడి జిలేబీలను, వాటి అనంతరం కారం కారంగా కరకరలాడుతుండే ఫాఫ్డాను; మధ్యాహ్నం భోజనంలోకి రొట్టెలు, అన్నం లేదా పెసర పప్పు కిచిడీని; సాయంత్రపు స్వల్పాహారంగా ఆవిరిపై ఉడికించి, ఆవాలు, పచ్చిమిర్చి తాలింపుతో మెత్తటి స్పాంజీలా చేసిన ఢోక్లాను... నాకోసం సిద్ధం చేయటమన్నది కూడా ఒక గొప్ప ఆతిథ్యం కంటే తక్కువేమీ కానప్పటికీ... వాళ్లు అందించిన మంచి నీళ్ల గ్లాసుకే మొదట నేను రుణపడి ఉంటాను. సిలిగురిలో గత మూడు రోజులూ మహానంద నది నీళ్లే నా అమృతాహారం. ఢిల్లీలో ఈ రోజు గంగా జల వరప్రసాదం. రేపు మరొక నది కావచ్చు. ఆ మరునాడు ఇంకొక నది. ప్రాంతాలు ఏవైనా ‘జల’సత్వం ఒక్కటే. గురువారం, ఐదు దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి మహాబలిపురం వెళ్లినప్పుడు... బహుశా అక్కడ నేను కృష్ణ లేదా కావేరీ నీళ్లు తాగి ఉంటాను. మీటింగ్కి, ఆ తర్వాత లంచ్కి ఏర్పాటు చేసిన నీళ్ల బాటిళ్లు చెన్నైలోని కృష్ణా, కావేరీ పైపుల నుంచి పట్టితెచ్చినవై ఉండాలి. ‘‘అమిత్ జీ, మీకోసం మా తమిళ వంటకాలను ఇంట్లో చేయించి తెచ్చాను’’ అన్నారు సీఎం విజయ్, లంచ్ మీట్లో! నదుల మధ్య రాష్ట్రాలకు సరిహద్దులు ఉంటే ఉండొచ్చు. నదీ జలాలు వంటగదులలో ఆ హద్దులను చెరిపేస్తాయి! భోజనం బల్ల ముందు కూర్చున్నంత సేపూ నేను గుజరాతీనిగానీ, ఢిల్లీవాలానుగానీ కాకుండా పూర్తిగా తమిళ ఆహారిని అయిపోయాను. విజయ్ తనే స్వయంగా అందరికీ వడ్డించడం మొదలు పెట్టారు! తక్కిన నలుగురు ముఖ్యమంత్రులు కూడా ఒకరికి ఒకరు పాత్రలు అందించుకుంటున్నారు. పక్కన ఉన్నవారి గాజు గ్లాసులలో ఖాళీ అయిన మేరకు నీళ్లను నింపుతున్నారు. ‘‘మరికాస్త తినండి’’ అని గిన్నెలను ముందుకు జరుపుతున్నారు. ఇది కదా సమైక్య దేశం! ఇదే కదా భిన్నత్వంలో ఏకత్వం! కానీ, భోజనానికి ముందు జరిగిన కీలకమైన సమావేశంలో ఆ ఐదుగురు ముఖ్యమంత్రులు, నీళ్లలో తమ వాటా కోసం పట్టుపట్టిన వాళ్లే! ఒకరి గొంతు ఒకరు పట్టుకున్నవారే. కావేరి నదిపై మేకేదాటు జలాశయ నిర్మాణానికి కేంద్రం వెంటనే అనుమతులు ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి. కావేరి నది నుండి న్యాయంగా తమకు రావలసిన నీటి వాటాను విడుదల చేయాలని, ఎగువన కొత్త డ్యామ్ల నిర్మాణాలను ఆపాలని తమిళనాడు ముఖ్యమంత్రి.గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కృష్ణా జలాల ట్రిబ్యునల్ పరిధిలో తమ రాష్ట్రానికి రావలసిన నీటి వాటాను చట్టబద్ధంగా త్వరగా ఖరారు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. కేరళ ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా ముల్లపెరియార్ వద్ద కొత్త డ్యామ్ నిర్మించ డానికి తమిళనాడు, కేంద్రం అంగీకరించాలని కేరళం ముఖ్యమంత్రి. మీటింగ్కి, ఆ తర్వాతి డిన్నర్ మీటింగ్కి మధ్య ఎంత వ్యత్యాసం! ఎంత వైరుధ్యం?!మీటింగ్లో ‘‘మా నీళ్లు మాక్కావాలి’’ అని అడిగినవాళ్లు... డిన్నర్ మీటింగ్లో ఒకరికి ఒకరు నీళ్లందించుకున్నారు! మీటింగ్ అయ్యాక, సిలిగురి బయల్దేరే ముందు – ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల వివాదాలకు మహాబలిపురంలో నాకు పరిష్కారం కనిపించింది! నీళ్లు ఇస్తే తప్ప, నీళ్లు తీసుకుంటే తీరేది కాదు నీళ్ల సమస్య!
తడిసినా సమస్యలేదిక!
వడాపావ్కు అరవయ్యేళ్లు
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
ఇరుముడి మీ మనసులో నిలిచిపోతుంది: రవితేజ
ఈ కర్ణుడికి మాటే ప్రాణం!
అవకాశం వస్తే వదులుకోను!
తండ్రి గొప్పదనం నేపథ్యంలో...
మరో సిరీస్కి సై?
అమిత్ షా (కేంద్ర మంత్రి) రాయని డైరీ
భారతీయ బాక్సాఫీస్పై విదేశీ దండ యాత్ర
అయ్యో! వెన్నుపోటు పొడిచారని కాదయ్యా
ఈసారి కూడా జగన్ను తిట్టే కార్యక్రమమే పెట్టుకున్నాం! నెక్ట్స్ టైమ్ నీ సంగతి ఆలోచిస్తాం!!
అర్జున్ టెండూల్కర్ కీలక నిర్ణయం
రవితేజ ఇరుముడి.. సందీప్ రెడ్డి వంగా రివ్యూ
సాక్షి కార్టూన్: 22-08-2026
‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఎల్ నినో: మనకు ముప్పు తట్టుకోలేని విధంగా ఏ స్థాయిలో అంటే?
మీకంటే వైఎస్ జగన్పాలన వంద రెట్లు బాగుంది
53 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'ధురంధర్' విలన్
ఈ రాశి వారికి ధనలాభం.. వ్యాపారాలు లాభిస్తాయి
టాటా కార్లు.. భారీ తగ్గింపు ఆఫర్లు
పసిడి మోత.. మూడో రోజూ మరింత..
ఓటీటీలోకి మరో థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేరుగా ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
కోలజెమ్మెడు.. పంటగా మారితే.. మెట్ట రైతులకు కొత్త ఆదాయ మార్గం!
జియో రీచార్జ్ ప్లాన్: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్!
మాట్లాడతా.. అన్ని విషయాలు చెబుతా: కొండా సురేఖ
యాక్షన్ థ్రిల్లర్ 'మ్యూటిని' సినిమా రివ్యూ
‘తులసి వనంలో గంజాయి మొక్క’.. పోలికలు అవసరమా!
3 నెలల గరిష్టానికి పసిడి
తడిసినా సమస్యలేదిక!
వడాపావ్కు అరవయ్యేళ్లు
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
ఇరుముడి మీ మనసులో నిలిచిపోతుంది: రవితేజ
ఈ కర్ణుడికి మాటే ప్రాణం!
అవకాశం వస్తే వదులుకోను!
తండ్రి గొప్పదనం నేపథ్యంలో...
మరో సిరీస్కి సై?
అమిత్ షా (కేంద్ర మంత్రి) రాయని డైరీ
భారతీయ బాక్సాఫీస్పై విదేశీ దండ యాత్ర
అయ్యో! వెన్నుపోటు పొడిచారని కాదయ్యా
ఈసారి కూడా జగన్ను తిట్టే కార్యక్రమమే పెట్టుకున్నాం! నెక్ట్స్ టైమ్ నీ సంగతి ఆలోచిస్తాం!!
అర్జున్ టెండూల్కర్ కీలక నిర్ణయం
రవితేజ ఇరుముడి.. సందీప్ రెడ్డి వంగా రివ్యూ
సాక్షి కార్టూన్: 22-08-2026
‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఎల్ నినో: మనకు ముప్పు తట్టుకోలేని విధంగా ఏ స్థాయిలో అంటే?
మీకంటే వైఎస్ జగన్పాలన వంద రెట్లు బాగుంది
53 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'ధురంధర్' విలన్
ఈ రాశి వారికి ధనలాభం.. వ్యాపారాలు లాభిస్తాయి
టాటా కార్లు.. భారీ తగ్గింపు ఆఫర్లు
పసిడి మోత.. మూడో రోజూ మరింత..
ఓటీటీలోకి మరో థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేరుగా ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
కోలజెమ్మెడు.. పంటగా మారితే.. మెట్ట రైతులకు కొత్త ఆదాయ మార్గం!
జియో రీచార్జ్ ప్లాన్: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్!
మాట్లాడతా.. అన్ని విషయాలు చెబుతా: కొండా సురేఖ
యాక్షన్ థ్రిల్లర్ 'మ్యూటిని' సినిమా రివ్యూ
‘తులసి వనంలో గంజాయి మొక్క’.. పోలికలు అవసరమా!
3 నెలల గరిష్టానికి పసిడి
ఫొటోలు
ఫ్రెండ్స్తో ఫుల్ జోష్లో ఆనంది..(ఫోటోలు)
చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు)
‘హాయ్’ అంటున్న నయన‘తార’.. (ఫోటోలు)
బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు
శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు
హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు)
‘ఇరుముడి’మూవీ ప్రెస్మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?
నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)
హైదరాబాద్ : హైటెక్స్లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు)
సినిమా
'టాక్సిక్' హైదరాబాద్ ఈవెంట్లో ప్రమాదం
యష్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. వచ్చే బుధవారం (ఆగస్టు 26) పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు రిలీజ్ చేశారు. తాజాగా హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో యష్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరమ్మాయిలకి గాయలవగా.. వీళ్లలో ఒకామె స్పృహ కోల్పోయింది. వీళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.గ్యాంగ్స్టర్ డ్రామాగా తీసిన 'టాక్సిక్' సినిమాలో తండ్రికొడుకులుగా యష్ ద్విపాత్రాభినయం చేశాడు. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి హీరోయిన్లు. రవి బస్రూర్ సంగీతమందించాడు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు.
నిజంగా ‘టాక్సిక్’ రూ.2,000 కోట్లు కొల్లగొడుతుందా?
పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.2,000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ ప్రకటించగా, నిర్మాత దిల్ రాజు కూడా ఇదే మాటను రిపీట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రం నిజంగా రూ.2,000 కోట్లు సాధించాలంటే ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ వంటి భారీ పాన్ ఇండియా హిట్ చిత్రాలను మించి సినిమా ఆడాల్సి ఉంటుంది. అయితే ‘టాక్సిక్’పై ఉన్న క్రేజ్ కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే కాదని అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్లో యశ్కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు భారీ ప్లస్గా మారుతోంది.అయితే ఈ రూ.2,000 కోట్ల స్టేట్మెంట్తో టాక్సిక్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు హీరో యశ్ మాత్రం ఇలాంటి అతిశయోక్తి వ్యాఖ్యలకు దూరంగా ఉన్నాడు. అయితే ‘టాక్సిక్’తో తన టార్గెట్ ఏంటో మాత్రమే స్పష్టంగా చెబుతున్నాడు. ఇక ఈ భారీ అంచనాలను ‘టాక్సిక్’ నిజం చేస్తుందా? లేక రూ.2,000 కోట్లు కేవలం ప్రచార మాటగానే మిగిలిపోతుందా? అన్నది ఈ చిత్రం బాక్సాఫీస్ రిజల్ట్తోనే తేలనుంది.
తృప్తి నెవ్వర్ బిఫోర్ గ్లామర్.. 'డ్యూడ్' బ్యూటీని చూశారా?
బ్లాక్ డ్రస్లో రచ్చ లేపుతున్న తృప్తి దిమ్రితెల్లచీరలో అందంగా హీరోయిన్ నయనతార'డ్యూడ్' ఫేమ్ ఐశ్వర్య శర్మ క్రేజీ గ్లామర్డ్యాన్స్ ప్రాక్టీసులో దుమ్మురేపుతున్న దివిపూల చీరలో మెరిసిపోతున్న అదితీ శంకర్ View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Aishwarya sharma (@aishwaryasharma_5) View this post on Instagram A post shared by Sri devi (@srideviactor) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Divi (@actordivi)
యాక్షన్ థ్రిల్లర్ 'మ్యూటిని' సినిమా రివ్యూ
ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్లకు జేసన్ స్టాథమ్ సుపరిచితమే. ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేసే ఇతడి నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం 'మ్యూటిని'. ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే బిగ్స్క్రీన్ పైకి రావడానికి ఒక్కరోజు ముందే పొరపాటున ఓటీటీలో దీన్ని అప్లోడ్ చేసేశారు. కొన్ని గంటల తర్వాత తీసేశారు. దీంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైపోయింది. మరి ఈ ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది? యాక్షన్, థ్రిల్ అంశాలతో ఏ మేరకు మెప్పించిందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కోల్ రీడ్ (జేసన్ స్టాథమ్) బ్యాంకాక్లోని ఓ పెద్ద బిజినెస్మ్యాన్కి పర్సనల్ సెక్యూరిటీగా పనిచేస్తుంటాడు. ఓ రోజు కారులో వెళ్తుండగా బిజినెస్మ్యాన్ని కొందరు దుండగులు చంపేస్తారు. డ్రైవ్ చేస్తున్న రీడ్ ప్రాణాలతో బయటపడతాడు. అయితే యజమానిని చంపేసి పారిపోయాడని ఇతడిపై హత్యానేరం మోపుతారు. దీంతో పగ తీర్చుకునేందుకు రీడ్ బయలుదేరతాడు. మారుపేరుతో ఓ కార్గో షిప్లోకి ప్రవేశిస్తాడు. తర్వాత ఏమైంది? చివరకు ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మ్యూటిని అంటే తెలుగులో తిరుగుబాటు అని అర్థం. ఇక సినిమా గురించి చెప్పాలంటే ఏమంత గొప్పగా అయితే లేదు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇప్పటికే చాలా వచ్చాయి. వాటితో పోల్చి చూసినా సరే ఓ మాదిరిగానే అనిపిస్తుంది తప్పితే కొత్తగా లేదు. తర్వాత సీన్ లో ఏం జరుగుతుందనేది కూడా మనం ఊహించగలిగేలా ఉంటుంది.యాక్షన్ సినిమా అన్నారు కదా అని ఫైట్స్ ఉంటాయేమోనని ఊహించుకుని థియేటర్కి వెళ్తే కచ్చితంగా నిరాశపడతారు. రెండు ఫైట్స్ ఉన్నప్పటికీ అవి సింపుల్గానే తేలిపోతాయి. రెగ్యులర్ రివేంజ్ యాక్షన్ స్టైల్ మూవీ అయినప్పటికీ కొత్తగా తీయొచ్చు. కానీ ఈ మూవీ దర్శకుడు మాత్రం చాలా సాధారణంగా తీసేశాడు.నిడివి గంటన్నరే కావడం ప్లస్ అయినప్పటికీ ఎమోషన్స్ పెద్దగా కనెక్ట్ కావు. యజమాని, హీరో మధ్య ఫ్యామిలీ టైపు బాండింగ్ ఉందన్నట్లు సీన్ చూపిస్తారు. కానీ మనం దాన్ని ఫీల్ కాలేకపోతాం. విలన్ పాత్ర కూడా చాలా వీక్గా ఉంటుంది. విలన్ని బలంగా చూపించినప్పుడే ఎదురుగా ఉన్న హీరో పాత్ర పవర్ఫుల్గా కనిపిస్తుంది. ఇందులో రెండూ తేలిపోయాయి. మానవ అక్రమ రవాణా అని కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు విలన్ ఇది ఎందుకు చేస్తున్నాడు? అనే విషయానికి సరైన ముగింపు లాంటిది ఏం ఇవ్వలేదు.జేసన్ స్టాథమ్ తనకు అలవాటైన స్టైల్లో నటించేశాడు. పెద్దగా గుర్తించుకునేలా అయితే ఏం లేదు. నిర్మాత కూడా ఇతడే. మూవీలో చాలా సీన్స్ సముద్రంలోని ఓ కార్గో షిప్లో ఉంటాయి. ఇవి సహజంగా ఉంటాయి గానీ పెద్దగా ఉత్సుకత కలిగించవు. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. ఓవరాల్గా చెప్పుకొంటే బిలో యావరేజ్ రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ ఇది.- చందు డొంకాన
క్రీడలు
ఇలా అయితే టెస్టు, వన్డేలను మర్చిపోవడమే: చమింద వాస్
టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం చమింద వాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 లీగ్ల హవా పెరుగుతున్న నేపథ్యంలో సాంప్రదాయ ఫార్మాట్ ఉనికిని కాపాడుకోవడానికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ముందుకు రావాలని ఈ మాజీ పేసర్ పిలుపునిచ్చాడు. గాలే వేదికగా భారత్తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘోర ఓటమి అనంతరం వాస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం."టెస్ట్ క్రికెట్ రోజురోజుకు ఆదరణ కోల్పోతుంది. ఈ సుదీర్ఘ ఫార్మాట్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మనం ఏదో ఒకటి చేయాలి. ఐసీసీ, అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కలిసికట్టుగా పనిచేయకపోతే టెస్ట్ క్రికెట్ పూర్తిగా కనమరుగు అవుతోంది. కేవలం టెస్టు ఫార్మాటే కాదు వన్డే క్రికెట్ పరిస్థితి కూడా అంతే. ప్రతీ క్రికెటర్ మూడు ఫార్మాట్లలోనూ రాణించలేడు.టెస్టు క్రికెట్కు సరిపోయే ఆటగాళ్లను గుర్తించి, వారికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. దేశవాళీ క్రికెట్లో నాలుగు రోజుల మ్యాచ్లను పెంచాలి" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా చమిందానే కాదు సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా టెస్టు క్రికెట్ ఆదరణ పెంచేందుకు ఐసీసీ 2019లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పేరిట సరికొత్త టోర్నీని తీసుకొచ్చింది. అయినప్పటికి ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో సంప్రాదాయ క్రికెట్ను ఆదరించే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.చదవండి: BAN vs AUS: స్టీవ్ స్మిత్ తొండాట.. వార్నింగ్ ఇచ్చిన అంపైర్
‘కుల్దీప్ను హెచ్చరించా.. అది మేనేజ్మెంట్ ఇష్టం’
శ్రీలంకతో తొలి టెస్టులో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సేవలను సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. గాలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కుల్దీప్ మొత్తంగా 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.సారాంశ్ జైన్ అరంగేట్రం!మొత్తంగా 103 పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొలంబోలో జరిగే నిర్ణయాత్మక రెండో టెస్టు నుంచి అతడిని తప్పిస్తాడనే ప్రచారం జరుగుతోంది. కుల్దీప్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ అరంగేట్రం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ కుల్దీప్ గురించి స్పందించాడు. ‘‘టెస్టు మ్యాచ్లో ఐదుగురు బౌలర్లను ఆడించినపుడు ఎవరో ఒకరికి తక్కువ ఓవర్లు వస్తాయి. దీనర్థం ఆ బౌలర్ సరిగ్గా ఆడటం లేదని కాదు.కుల్దీప్ను హెచ్చరించానుఎవరిని ఎప్పుడు పంపాలనేది కెప్టెన్, మేనేజ్మెంట్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక సమయంలో ఈ బౌలర్ వద్దు అని అనుకుంటే.. అతడిని పక్కనపెట్టి వేరే వాళ్లతో బౌలింగ్ చేయిస్తారు. నేను కుల్దీప్తో మాట్లాడాను. వికెట్లు తీయాలనే తొందరతో కాకుండా.. పొదుపుగా బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టమని, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వమని చెప్పాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.ఐదుగురు ఉంటే మంచిదేఅదే విధంగా.. ఐదుగురు బౌలర్లను ఆడించడంపై స్పందిస్తూ.. ‘‘టస్టు మ్యాచ్లో వెయ్యి పరుగులు చేసినా.. ఆ స్కోరుతో గెలుస్తామనే గ్యారెంటీ ఉండదు. అయితే, అదే మ్యాచ్లో మనం 20 వికెట్లు కూల్చినట్లయితే గెలుస్తామనే నమ్మకమైనా వస్తుంది.ఫ్లాట్ పిచ్లపై మాత్రం బౌలర్లు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మా జట్టులో ఐదుగురు ప్రాపర్ బౌలర్లు ఉండటం సానుకూలాంశం. కాబట్టి పిచ్ పరిస్థితిని బట్టి పేసర్లు, స్పిన్నర్లను మారుస్తూ ఉంటాము. ఐదుగురు బౌలర్లు ఉన్నపుడు రక్షణాత్మక ధోరణిలో కాకుండా.. ప్రభావం చూపే విధంగా ఆడటం సాధ్యమవుతుంది’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబో వేదిక.చదవండి: స్మిత్ తొండాట.. అంపైర్ వార్నింగ్!
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌదీ ప్రో లీగ్లో భాగంగా అల్ రియాద్తో జరిగిన మ్యాచ్లో (అల్ నస్ర్ తరఫున) గోల్ చేయడంతో వరుసగా 25 సీజన్లలో గోల్ చేసిన తొలి ఫుట్బాలర్గా చరిత్ర సృష్టించాడు.రొనాల్డో 2002-03 సీజన్ నుంచి ఇప్పటివరకు ప్రతి సీజన్లో కనీసం ఒక గోల్ చేశాడు. రొనాల్డోకు ముందు ఈ రికార్డు స్వీడన్ దిగ్గజం జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ పేరిట ఉండేది. ఇబ్రహిమోవిచ్ 1999-2000 నుంచి 2022-23 వరకు వరుసగా 24 సీజన్లలో గోల్ చేయగా.. తాజాగా రొనాల్డో ఆ రికార్డును బద్దలు కొట్టాడు.మరో 23 గోల్స్ దూరంలో..!అల్ రియాద్పై సాధించిన గోల్ రొనాల్డో కెరీర్లో 977వ అధికారిక గోల్. దీంతో చారిత్రాత్మక 1,000 గోల్స్ మైలురాయికి అతను కేవలం 23 గోల్స్ దూరంలో ఉన్నాడు.రొనాల్డో సాధించిన గోల్స్:* రియల్ మాడ్రిడ్: 450* మాంచెస్టర్ యునైటెడ్: 145* జువెంటస్: 101* స్పోర్టింగ్: 5* అల్ నస్ర్: 130* పోర్చుగల్ (జాతీయ జట్టు): 146మొత్తం: 977 గోల్స్2026-27 సీజన్ తన ప్రొఫెషనల్ కెరీర్లో చివరి సీజన్ కావచ్చని రొనాల్డో ఇటీవల సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో 1,000 గోల్స్ మైలురాయిని అందుకోవాలన్న అతని ప్రయత్నం నెరవేరుతుందో లేదో చూడాలి.కాగా, అల్ రియాద్తో జరిగిన మ్యాచ్లో అల్ నస్ర్ 4-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తద్వారా సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అల్ నస్ర్ తరఫున రొనాల్డోతో పాటు అబ్దులెలాహ్ అల్ అమ్రీ, గాబ్రియేల్ ఏంజెలో, జోవో ఫెలిక్స్ గోల్స్ చేశారు.
అదరగొట్టిన అమ్మాయిలు.. భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు
స్లోవేకియా వేదికగా జరుగుతున్న అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు వచ్చి చేరాయి. మహిళల విభాగంలో మాన్సీ లాథర్ రజతం.. తన్వి తన్వీ మగ్దుమ్, కోమల్ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.గోల్డ్.. జస్ట్ మిస్68 కేజీల స్వర్ణ పతక పోరులో మాన్సీ లాథర్ చైనాకు చెందిన చెన్లింగ్ సాంగ్తో తలపడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ గేమ్లో మాన్సీ 1-2 తేడాతో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది. 57 కేజీల కాంస్య పతక పోరులో తన్వి.. కెనడాకు చెందిన అగ్నియా క్రాకోవ్స్కాపై 10-4 తేడాతో తిరుగులేని విజయం సాధించి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది. మరోవైపు 59 కేజీల విభాగంలో కోమల్ 5-2తో ఎడా బాలాజ్ (హంగేరీ)ని చిత్తుచేసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆరు పతకాలు సాధించింది. శుక్రవారం 76 కేజీల విభాగం ఫైనల్లో కాజల్ దోచాక్ గెలిచి ఛాంపియన్గా నిలిచింది.
న్యూస్ పాడ్కాస్ట్
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
బిజినెస్
ఈ జలుబు మందులు బ్యాన్.. నిషేధించిన కేంద్రం
చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరామైన్ మేలేట్ (Chlorpheniramine Maleate), ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) కలిగిన అన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులను నాలుగేళ్లలోపు పిల్లలకు వినియోగించకుండా కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ రెండు పదార్థాలతో కూడిన మందుల తయారీ, విక్రయం, పంపిణీపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది.ఇక ప్యాక్పై హెచ్చరిక తప్పనిసరితాజా ఆదేశాల ప్రకారం.. ఈ కాంబినేషన్తో కూడిన మందుల తయారీదారులు లేబుల్, ప్యాకేజీ ఇన్సర్ట్, ప్రచార సామగ్రిపై ‘నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ను ఉపయోగించకూడదు’ అనే హెచ్చరికను స్పష్టంగా ముద్రించాలి. ఈ నోటిఫికేషన్ అధికారిక గెజిట్లో ప్రచురితమైన తేదీ నుంచే అమల్లోకి వస్తుంది.2025లోనే తొలిసారి ఆంక్షలుఈ నిర్ణయం పూర్తిగా కొత్తదేమీ కాదు. 2025 ఏప్రిల్ 15న కేంద్రం ఇదే క్లోర్ఫెనిరామైన్ మేలేట్–ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్పై ఆంక్షలు విధించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB) సిఫార్సుల మేరకు నాలుగేళ్లలోపు పిల్లల్లో వీటి వినియోగం వల్ల ప్రమాదాలు ఉండొచ్చని, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది.తాజా చర్య ద్వారా గత ఆంక్షల పరిధిని మరింత స్పష్టం చేస్తూ ఈ రెండు పదార్థాలు కలిగిన అన్ని సంబంధిత ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఫార్ములాలకు నాలుగేళ్లలోపు పిల్లల విషయంలో ఇదే నిషేధం/వినియోగ పరిమితిని వర్తింపజేశారు.జలుబు, ముక్కుదిబ్బడకు ఉపయోగించే కాంబినేషన్క్లోర్ఫెనిరామైన్ మేలేట్ అనేది యాంటీహిస్టమైన్ కాగా, ఫినైలెఫ్రైన్ ముక్కులోని రక్తనాళాల వాపును తగ్గించేందుకు ఉపయోగించే డీకంజెస్టెంట్. ఈ రెండింటినీ కలిపిన మందులను సాధారణంగా జలుబు, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ వంటి లక్షణాల ఉపశమనానికి ఉపయోగిస్తారు. అయితే చిన్నారుల్లో ఇలాంటి కాంబినేషన్ మందులను ఉపయోగించే విషయంలో వయస్సు, మోతాదు, వైద్యుడి సూచనలను అత్యంత జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది.నిపుణుల సిఫార్సుల ఆధారంగా నిర్ణయంఈ కాంబినేషన్ వల్ల నాలుగేళ్లలోపు పిల్లలకు సంభావ్య ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉండవచ్చని నిపుణుల కమిటీ, DTAB అభిప్రాయపడటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పిల్లలకు అందుబాటులో ఉన్న సురక్షితమైన ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ ఆంక్షలను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 26A కింద ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం అమలు చేస్తోంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన చక్కెర ధరలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రముఖ కార్ల కంపెనీ సంచలన నిర్ణయం!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఏకంగా 40 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం.డోర్ హ్యాండిల్ భద్రతకు సంబంధించిన సమస్య కారణంగా.. అమెరికా కార్ల తయారీ సంస్థ మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ సహా చైనాలో తయారైన, దిగుమతి చేసుకున్న సుమారు 29.8 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తోందని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ తెలిపింది.చైనా మీడియా ప్రకారం.. ఈ సంవత్సరంలో ఇదే అతిపెద్దదైన ఈ రీకాల్. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు, అనేక చైనీస్ ఈవీ మోడళ్లలో సాధారణంగా కనిపించే లోపలికి ఉన్న కార్ డోర్ హ్యాండిల్స్ను వచ్చే ఏడాది నుంచి నిషేధిస్తామని చైనా అధికారులు ఫిబ్రవరిలో ప్రకటించిన తర్వాత ఈ భారీ రీకాల్ ప్రకటన వెల్లడైంది.దేశంలో అనేక చోట్ల జరిగిన ఈవీల ప్రమాదాల నేపథ్యంలో.. చైనా ఇటీవల ఫ్లష్ కార్ డోర్ హ్యాండిల్స్పై నిఘాను ముమ్మరం చేసింది. ఈ ప్రమాదాలలో కార్లలోని ఎలక్ట్రానిక్ డోర్లు విఫలమై, ప్రజలు లోపల చిక్కుకుపోయారు.చైనా నియంత్రణ సంస్థ వెబ్సైట్లోని ఒక ప్రకటనలో.. భద్రతకు సంబంధించిన ప్రమాదాన్ని ప్రస్తావించింది. ఎలక్ట్రిక్ వ్యవస్థ వైఫల్యానికి కారణమయ్యే తీవ్రమైన ప్రమాదం వంటి తీవ్రమైన పరిస్థితులలో.. కారు హ్యాండిల్స్, కారు వినియోగదారులు తప్పించుకోవడానికి తలుపులు త్వరగా ఓపెన్ కాకుండా అడ్డుకోవచ్చని, లేదా కారు బయట ఉన్న సహాయక సిబ్బంది లోపలికి ప్రవేశించకుండా నిరోధించవచ్చని ఆ ప్రకటన పేర్కొంది. పరిశ్రమలోని కొంతమంది నిపుణులు వాహన తయారీదారులు డిజైన్ కంటే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్ అధిపతి కుయ్ డోంగ్షు, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధిలో ఈ రీకాల్ను 'ఒక అనివార్యమైన అడుగు' అని అభివర్ణించారు. వాహన తయారీదారులు మరింత విశ్వసనీయమైన, భద్రతకు ప్రాధాన్యతనిచ్చే విధానం వైపు పయనిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.ప్రమాదాలను తగ్గించడానికి టెస్లా వాహనాలకు సాఫ్ట్వేర్ అప్డేట్లను నిర్వహిస్తుంది. ఇదే సమయంలో బీజింగ్కు చెందిన చైనా టెక్నాలజీ దిగ్గజం షియోమీ, 3,90,000కు పైగా వాహనాలను రీకాల్ చేస్తోంది. హాంగ్జౌకు చెందిన లీప్మోటార్ 3,70,000కు పైగా కార్లను రీకాల్ చేస్తోంది. గీలీ, ఎక్స్పెంగ్ సహా ఇతర చైనా కార్ల తయారీ సంస్థలు కూడా కొన్ని వాహనాలను రీకాల్ చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ రీకాల్ ప్రకటించడానికి కారణం కారు డోర్ హ్యాండిల్స్కు సంబంధించిన సమస్యలే అని తెలుస్తోంది.
1 పైసా బిడ్తో రూ.755 కోట్ల కాంట్రాక్ట్
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తాయ్మామన్ తంగ మోదిరం’ (మేనమామ బంగారు ఉంగరం) పథకానికి సంబంధించి నిర్వహించిన గ్లోబల్ టెండర్లలో ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ సంచలన బిడ్తో ఎల్1 స్థానాన్ని కైవసం చేసుకుంది. సుమారు రూ.755.83 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్లో ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారు ఉంగరానికి కేవలం ‘1 పైసా’ మాత్రమే సర్వీస్ / తయారీ రుసుము (మేకింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, హాల్మార్కింగ్)గా ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ పోటీలో పాల్గొన్న 11 ప్రముఖ సంస్థల్లో జీఆర్టీ జ్యువెలర్స్ రూ.410.97 (L2), వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ రూ.822.97 (L3) ప్రతిపాదించగా జోయాలుక్కాస్ కోట్ చేసిన వ్యయం ఎవరికీ ఊహకందని విధంగా నిలిచింది. తమిళనాడు టెండర్ల పారదర్శకత చట్టం ప్రకారం, తక్కువ ధరను మ్యాచ్ చేసేందుకు ఇతర కంపెనీలకు అవకాశం ఇవ్వగా ఒక్క కల్యాణ్ జ్యువెల్లర్స్ మాత్రమే ముందుకు వచ్చింది. దాంతో ఈ మొత్తం ఆర్డర్లో 70 శాతం కోటాను జోయాలుక్కాస్కు, మిగిలిన 30 శాతాన్ని కల్యాణ్ జ్యువెలర్స్కు కేటాయిస్తూ టీఎన్ఎంఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది.తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే దాదాపు 4.41 లక్షల మంది నవజాత శిశువులకు ఒక్కో గ్రాము బంగారు ఉంగరాన్ని సెప్టెంబర్ 15 నుంచి పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం బంగారం అసలు ధరకు అయ్యే వ్యయాన్ని భరిస్తుండగా తయారీ, పంపిణీ బాధ్యతలను ఈ సంస్థలు నిర్వర్తిస్తాయి. వాణిజ్య లాభాల కంటే ప్రజారోగ్య సంక్షేమ పథకానికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రూపాయి రహిత లాభాల మార్జిన్తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోయాలుక్కాస్ అధినేత జోయ్ ఆలుక్కాస్ వెల్లడించారు.మరోవైపు, ఒక పైసాకే ఎలా పనులు చేపడతారంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఈ ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేయగా, తమిళనాడు ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా అత్యంత నాణ్యమైన బీఐఎస్ హాల్మార్క్ బంగారాన్ని సేకరిస్తున్నామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్పై నిషేధం
రూ.450 కోట్ల ఇష్యూ.. ఐపీవో బాటలో ఆటమ్బర్గ్
న్యూఢిల్లీ: గృహోపకరణాల(హోమ్ అప్లయెన్సెస్) తయారీ కంపెనీ ఆటమ్బర్గ్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 7.65 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఏ91 పార్ట్నర్స్, వీసైన్స్ ఇన్వెస్ట్మెంట్స్(టెమాసెక్), జంగిల్ వెంచర్స్, స్టెడ్వ్యూ క్యాపిటల్ మారిషస్ తదితర సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. నిధుల వినియోగమిలా ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 150 కోట్లు బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్కు కేటాయించనుండగా.. మరో రూ. 100 కోట్లు పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పైనా వెచి్చంచనుంది. ఈ బాటలో రుణ చెల్లింపులకు రూ. 90 కోట్లు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2012లో మనోజ్ మీనా కంపెనీని ఏర్పాటు చేయగా.. 2013లో శివవ్రత దాస్ సహవ్యవస్థాపకుడిగా చేరారు. కంపెనీ ప్రధానంగా టెక్నాలజీ ఆధారిత కన్జూమర్ అప్లయెన్సెస్ రూపొందిస్తోంది.మిక్సర్ గ్రైండర్స్, వాటర్ ప్యూరిఫయర్స్, కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్స్ తదితరాలను ఆటమ్బర్గ్ బ్రాండ్తో తయారు చేస్తోంది. అనుబంధ సంస్థ ఆటమ్బర్గ్ ఇన్నొవేషన్స్ మోటార్లు, కంట్రోలర్లు తదితర కీలక విడిభాగాల డిజైన్, సరఫరా చేపడుతోంది. కంపెనీ కస్టమర్లలో వోల్టాస్, గోద్రెజ్, బ్లూ స్టార్ తదితర దిగ్గజాలున్నాయి. గతేడాది(2025–26)లో ఆదాయం రూ. 1,294 కోట్లకు చేరగా.. రూ. 149 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ ప్రధానంగా కన్జూమర్ అప్లయెన్సెస్, కీలక విడిభాగాల విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’!
ఫ్యామిలీ
థ్రిల్ కన్నా ప్రాణాలే ముఖ్యం.. టూరిస్టులకు కీలక సూచనలు!
విహారం ఆహ్లాదాన్నిస్తుంది.. సాహసం ధైర్యాన్నిస్తుంది. కానీ ఒక చిన్న ఏమరపాటు ప్రాణాలమీదికి తెస్తుంది. మన దేశపు యువతలో కూడా ట్రెక్కింగ్ కల్చర్ పెరుగుతోంది. రిషికేశ్లో వైట్–వాటర్ రాఫ్టింగ్, బీర్ బిల్లింగ్లో పారాగ్లైడింగ్, దాండేలిలో జిప్లైన్, హిమాలయాల్లో ట్రెక్కింగ్.. ఇలా సాహస క్రీడల వైపు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే, ఈ క్రేజ్కు తగినట్లుగా పర్యాటకుల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల కర్ణాటకలోని దాండేలి రిసార్ట్లో జరిగిన ఒక తీవ్రమైన ప్రమాదం ఈ భద్రతా లోపాలను మరోసారి కళ్లకుకట్టింది. జూలై 3న 24 ఏళ్ల కుబేర్ సుర్పూర్ అనే యువకుడు దాండేలిలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో జిప్లైన్ చేస్తుండగా, సగం దూరంలో ఉండగానే ‘సేఫ్టీ లాక్’ ఊడిపోయింది. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి అతను కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.వెళ్లే‘ముందు’ జాగ్రత్తలు..గుడ్డిగా నమ్మవద్దు: మీరు ఎంచుకున్న ఆపరేటర్ పర్యాటక శాఖ లేదా అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యాడో లేదో తెలుసుకోండి. వెబ్సైట్లో రాసింది నమ్మకుండా, వారి ఒరిజినల్ భద్రతా సర్టిఫికెట్లను చూపించమని అడగండి.స్వయంగా చూడండి: బెల్టులు, హెల్మెట్లు, తాళ్లు, లాకింగ్ సిస్టమ్స్ పాతబడిపోయాయా లేదా తుప్పు పట్టి ఉన్నాయా అనేది స్వయంగా చూసుకోండి. అనుమానం వస్తే ఆ రైడ్ మానడమే మంచిది.సేఫ్టీ బ్రీఫింగ్: యాక్టివిటీ మొదలయ్యే ముందు నిపుణులైన ఇన్ స్ట్రక్టర్ ఇచ్చే భద్రతా సూచనలు స్పష్టంగా వినండి. సేఫ్టీ లాక్స్, ఎమర్జెన్సీ బ్రేక్స్ ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకోండి.దాచవద్దు: మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, ఇటీవలి ఆపరేషన్ల వివరాలను ముందే చెప్పండి. బరువు, ఎత్తు పరిమితులను కచ్చితంగా పాటించండి.ప్యాకేజీలకు మోసపోవద్దు: తక్కువ ధరకే ప్యాకేజీలు ఇస్తున్నారంటే వారు పరికరాల నిర్వహణ, సిబ్బంది శిక్షణలో లోపం ఉందేమో అని గమనించాలి.వాతావరణం బాగున్నప్పుడే: భారీ వర్షం, బలమైన ఈదురు గాలులు ఉన్నప్పుడు ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి యాక్టివిటీలు చేయవద్దు. ప్రతికూల వాతావరణం వల్ల రోప్ల పట్టు సడలి ప్రమాదాలు జరుగుతాయి.రివ్యూలు ముఖ్యం: కేవలం పక్కన ఉన్న లొకేషన్ బాగుందని కాకుండా, ఆపరేటర్ భద్రతా పద్ధతులు, ఇన్స్ట్రక్టర్ల ప్రవర్తనపై ఇతర పర్యాటకులు ఇచ్చిన రివ్యూలను చదవండి.స్టంట్స్ వద్దు: రైడ్ లేదా రాఫ్టింగ్ మధ్యలో బెల్టులు తీయడం, స్టంట్స్ చేయడం వంటివి ప్రాణాలకే ప్రమాదం తెస్తాయి. సరదాగా గడిపే క్షణాలు జీవితాంతం బాధింపకూడదంటే సాహస యాత్రల్లో ఉత్సాహంతో పాటు కాస్త అప్రమత్తత కూడా చాలా అవసరం. థ్రిల్ కన్నా మీ ప్రాణాల భద్రతే ముఖ్యం!అమలులో లోపం!భారత పర్యాటక శాఖ, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిపి నేల, నీరు, ఆకాశంలో చేసే సాహస క్రీడలకు కఠిన నిబంధనలు రూపొందించాయి. కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. క్రమం తప్పకుండా పరికరాల తనిఖీలు, సర్టిఫైడ్ గైడ్లు, క్వాలిటీ హార్నెస్ సిస్టమ్స్ వాడాలని నిబంధనలు చెప్తున్నాయి. కానీ స్థానిక స్థాయిలో వీటి పర్యవేక్షణ చాలా బలహీనంగా ఉంది. దీనివల్ల అనుమతులు, భద్రతా తనిఖీలు లేని ఆపరేటర్లు పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఆసై దోసై అప్పళం వడై..
ప్రతి ఇంటిలో మనం మరచి΄ోయిన ఒక నిధి ఉంటుంది. కొద్దిమందికి ఆ నిధి అకస్మాత్తుగా గుర్తుకు వచ్చి వెలుగులోకి తెస్తారు. ఆ వెలుగులు పిల్లల ప్రపంచంలోకి వస్తే ఎంత బాగుంటుంది? ఎంత బాగుంటాయో చెబుతున్నాయి అమ్మ చెప్పిన కథలు. ‘ఫోక్టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో వచ్చిన పుస్తకం సోషల్ మీడియాలో ఎట్రాక్షన్గా మారింది. ‘నాకు కూడా మా అమ్మ చెప్పిన కథలు గుర్తుకు వస్తున్నాయి’ అంటూ కలం పడుతున్నారు నెటిజనులలో కొందరు...చిన్నప్పుడు తల్లి తనకు చెప్పిన జానపద కథలను ఈతరం పిల్లలకు ‘ఫోక్ టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో చేరువ చేస్తున్నారు నారాయణ్.అమ్మ చెప్పిన ఆ కథలు ఎలా ఉంటాయి?ఏనుగు పక్కింటి అబ్బాయిలా పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది.పులి గాండ్రిస్తూనే ‘హాయ్’ చెబుతుంది.గర్జిస్తూనే సింహం మన యోగక్షేమాలు అడుగుతుంది.ఒక్కటా రెండా... ఎన్నెన్ని చిత్రవిచిత్రాలో! ఈ పుస్తకంలో 21 కథలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. నైతిక విలువలు అంటే ఏమిటో చెప్పకనే చెబుతాయి. తెల్లగుర్రంపై ఎక్కించి మేఘాలపై స్వారీ చేయిస్తాయి.పనిదొంగ పక్షులుఅనగనగా ఒక కోడి. ఆ కోడి పిండి కలిపి చపాతీలు చేస్తుండగా, దాని పొరుగున ఉన్న కాకి, పిచ్చుక, బాతు, చిలకలాంటివి కోడికి సహాయం చేయకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటాయి.అయితే, వేడి వేడి చపాతీలు రెడీ అయిన వెంటనే...‘మాకు కూడా’ అంటూ ఆత్రుతగా కోడి చుట్టూ చేరతాయి. అప్పుడు కోడి నోటి నుండి...‘ఆసై దోసై అప్పళం వడై’ అనే పాట వినిపిస్తుంది. పిల్లలకు తెగ నవ్వొస్తుంది.ఇక ‘కా...కా’ కథ విషయానికి వస్తే, ఒక సోమరి కాకి తన ఆహారాన్ని వెదుక్కోవడానికి బద్దకించి, పిచ్చుకల నుండి దొంగిలిస్తుంటుంది. ఆహారాన్ని దొంగిలించడంలో అపారమైన తెలివితేటలు చూపే కాకి అత్యంత సులువుగా ఉచ్చులో పడుతుంటుంది. తన మూర్ఖత్వాన్ని చాటుకుంటుంది.పాటల కథలు!అమ్మ చెప్పిన కథలలో పాటలు, కవితలు ఉండడం మరో విశేషం. చందమామను పిలిచే పాట ‘నిల నిల ఓడి వా’ ను పిల్లలు గట్టిగా పాడుకుంటారు. ఈ కథలు పిల్లలకు తమిళ సాంస్కృతిక విశేషాలు, ఆహారపు అలవాట్ల గురించి కూడా తెలియజేస్తాయి.‘మా అమ్మ చెప్పే కథలు వింటూ పెరిగాను. ఈ కథలను నేను మరెక్కడా వినలేదు. తన ముందుతరాల నుండి అమ్మకవి వారసత్వ సంపదగా వచ్చాయి. సంగీతంపై నాకు అవగాహన ఉన్నప్పటికీ అమ్మకు ఉన్నంత లోతైన అవగాహన లేదు. తాను కథ చెప్పే విధానానికి సంగీతం బలం అయింది. కథలను మరింత ఆసక్తికరంగా వినేలా చేసింది’ అంటారు నారాయణ్.కథాచిత్ర ప్రపంచంఅందమైన కథలకు, అద్భుతమైన చిత్రాలు తోడైతే పిల్లలకు ఎంత సంతోషం కలిగిసాయో ఈ పుస్తకంలోని కనువిందు చేసే కలర్ పెయింట్స్ సాక్ష్యం. జానపద కథలు పుస్తకరూపంలోకి వచ్చినప్పుడు ఎన్నో రకాల మార్పులకు గురవుతుంటాయి.‘అసలు మార్పులు అవసరమా?’ అనే ప్రశ్నకు నారాయణ్ ఇచ్చే జవాబు...‘అవసరమే లేదు’ ఎందుకంటే జానపద కథలు ఊహల ద్వారానే పాఠకులతో అనుసంధానం అవుతాయి.‘కొన్ని విషయాలు శాశ్వతమైనవి. ఊహాలోకంలో విహరించాలనే మన ప్రేమ కూడా అందులో ఒకటి. ప్రతీదాన్ని సమకాలీకరించాల్సిన అవసరం లేదు. జానపద కథలు యథాతథ రూపంలోనే బాగుంటాయి’ అంటున్నారు నారాయణ్.- సృజనఇవి చదవండి: పిల్లల్లో హింసాత్మక ఆలోచనలకు అసలు కారణాలేంటో తెలుసా?
పిల్లల్లో హింసాత్మక ఆలోచనలకు అసలు కారణాలేంటో తెలుసా?
‘‘పిల్లలకు ఏదైనా మంచి చెబితే వినే రోజులు కావు ఇవి..’’ ‘‘అంతా ఫోన్ల వల్లే, ఇలా తయారవుతున్నారు..’’ ‘‘జల్సాలకు అలవాటు పడ్డారు. అందుకే అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు..’’ ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తనకు సంబంధించి ఇలాంటి మాటలు.. తరచూ వింటున్నాం.ఈ మాటలను బలపరుస్తూ...ఇటీవల తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఓ స్కూల్ ప్రిన్సిపల్ని విద్యార్థులే అతి దారుణంగా చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీచర్ పట్ల ఉండాల్సిన గౌరవం, భక్తి.. స్థానంలో కక్షపూరితమైన ఆలోచన ఎలా వచ్చింది? మైనర్ పిల్లల్లో అంతటి హింసాత్మక ప్రవృత్తి పెరగడానికి కారణం ఏంటని.. నివ్వెరపోయారు. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంగా భావించే మన సంస్కృతిలో ఇలాంటి అమానుష ఘటనలు చోటుచేసుకోవడానికి గల కారణాలు.. మరో సంఘటనకు తావు ఇవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఈ విధంగా సూచిస్తున్నారు..‘సాధారణంగా ఈ రోజుల్లో పిల్లల చదువులో ర్యాంకులే చూస్తున్నాం. కానీ, వారి ప్రవర్తన లో వస్తున్న మార్పులను గమనిస్తున్నామా.. అనేది ప్రశ్నించుకోవాలి. నేటి తరాన్ని మార్చేది శిక్ష రూపంలో కాదు.. ప్రేమ, శ్రద్ధ, అవగాహనయే ప్రధానంగా చూపాల్సింది’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు డాక్టర్ జ్యోతిరాజ.ఒకప్పుడు పిల్లల ప్రపంచం చదువు, ఆటలు, స్నేహాలు, కుటుంబంతో గడిపే సమయంతో నిండి ఉండేది. కానీ నేటిరోజులు అరచేతిలో రంగుల ప్రపంచాన్ని చూపే సోషల్ మీడియా, ఖరీదైన వస్తువులపై ఆకర్షణ, ఏదో ఒక దారిలో త్వరగా డబ్బు సంపాదించి ఆనందించాలనే ఆలోచన, వ్యసనాలు.. పిల్లల మెదళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. కష్టపడటం కన్నా తాత్కాలిక ఆనందాన్నిచ్చే వాటిని అందుకోవడంవైపే మొగ్గుచూపుతున్నారు. కారణాలు ఏవైనా కుటుంబంలో ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవడం అనేది ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది. దీనివల్ల పిల్లల ప్రవర్తనల్లో వచ్చే మార్పులను పసిగట్టలేకపోతున్నారు. ఫలితంగా సరిదిద్దలేకపోతున్నారు.ఇలాంటి క్రమంలో...ఒక పిల్లవాడు తప్పు చేసినప్పుడు తోటివాళ్లముందు ‘ఈ పిల్లవాడు చెడ్డవాడు’, ‘సరిదిద్దుకోకపోతే పనిష్మెంట్ తప్పదు...’ అనే హెచ్చరికలు సమస్యకు పరిష్కారాన్ని చూపవు.పిల్లలు స్కూల్కి సరిగా రావడం లేదు, చదవడం లేదు అని ఎప్పటికప్పుడు టీచర్లు తల్లిదండ్రులకు తెలియజేస్తుంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు దండనతో కాకుండా ‘వారి ప్రవర్తన వెనుక కారణం ఏమిటో..’ తెలుసుకోవాలి. ప్రేమతోనే మార్పును తీసుకురావాలి.స్కూళ్లలో చదువు మాత్రమే కాకుండా విలువలు నేర్పేలా ప్రవర్తనకు సంబంధించి నిపుణులచే కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించాలి. పిల్లలు శారీరకంగా అలసిపోయేలా క్రీడలు ఉండాలి, అలాగే మానసిక వికాసం పెంపొందే వాతావరణమూ వారి చుట్టూతా ఉండాలి.వదిలేయకూడదు...కుటుంబంలో సరైన శ్రద్ధ చూపకపోవడం, స్కూల్లో వేధింపులు, స్నేహితుల ప్రభావం, ఫోన్లలో హింసాత్మక కంటెంట్ ఎక్కువ చూడటం, పదే పదే అవమానించబడుతున్నాననే భావన.. ఇవన్నీ పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంటాయి. పిల్లల్లో తీవ్రమైన కోపావేశాలు, స్కూల్లో గొడవలు, వస్తువులను పగలగొట్టడం, ఇతరులను గాయపరచడం, వ్యసనాలు.. ఇలాంటివి గుర్తిస్తాం. కానీ, పెద్దయ్యాక వాళ్లే మారుతారులే అని వదిలేయకూడదు. మార్పు తీసుకురాలేకపోతున్నాం అనిపిస్తే తల్లిదండ్రులు, టీచర్లు... నిపుణులను సంప్రదించాలి.– డా. జ్యోతిరాజ, సైకాలజిస్ట్పిల్లలు చెప్పేది ముందుగా వినాలి...పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు వెంటనే అరుస్తారు లేదా కొట్టడం, అవమానించడం కూడా చేస్తుంటారు. దానికి బదులుగా ...‘‘నువ్వు ఇలా ఎందుకు చేశావు?’’, ‘‘ఆ సమయంలో నీకు ఎలా అనిపించింది?’’, ‘‘ఇలా చేయడం వల్ల ఇంకొకరికి ఎలా అనిపించి ఉండొచ్చు?’’.. అనే ప్రశ్నలు ప్రైమరీ పాఠశాల స్థాయి నుంచే పిల్లలను అడుగుతూ ఉండటం, సమాధానాలు రాబట్టడం వల్ల వారిలో ఆత్మపరిశీలన, బాధ్యత, దయ పెరుగుతాయి.ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది నేరుగా వారిని కాకుండా తప్పుడు ప్రవర్తనను విమర్శించాలి. ‘నువ్వు చెడ్డవాడివి’ అని చెప్పడం అంటే ఆ వ్యక్తిని రెచ్చగొట్టడమే అవుతుంది. ‘నువ్వు చేసిన పని తప్పు, నువ్వు కాదు. దీనిని సరిదిద్దుకునే అవకాశం ఉంది..’ అని చెప్పే మాటలు మరింత ప్రభావ వంతంగా పనిచేస్తాయి.నెగెటివిటీని ఎలా మార్చాలంటే...పిల్లలలో వచ్చే ప్రతి నెగెటివ్ ఆలోచనను బలవంతంగా ఆపాల్సిన అవసరం లేదు. దాని వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకుని, దాన్ని సరైన దిశలోకి మళ్లించాలి. ఉదాహరణకు... ‘నాకు చేతకాదు’ అంటే – ‘ప్రయత్నిస్తే నువ్వూ నేర్చుకోగలవు.’‘ఎవరూ నన్ను పట్టించుకోరు’ అంటే – ‘నీ భావాలను మాతో స్వేచ్ఛగా పంచుకోవచ్చు.’‘‘అందరూ చేస్తున్నారు కాబట్టి నేనూ చేస్తాను’’ అంటే – ‘‘అందరూ చేసే పని సరైనదే కావాల్సిన అవసరం లేదు. సరైన నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం పెద్ద కష్టమైనది ఏమీ కాదు.. అని చెప్పగలగాలి.పాఠశాల అంటే పుస్తకాలు, పరీక్షలు, మార్కులు మాత్రమే కాదు అది వ్యక్విత్వాన్ని నిర్మించే కేంద్రాలు కూడా. పిల్లలు ఒంటరిగా గడపడం, చదువు పట్ల అనాసక్తి, కోపం, అసహనం.. వంటివి గమనించాలి. మామూలే అని వదిలేయకుండా సీరియస్గా తీసుకోవాలి. తల్లిదండ్రుల మద్దతుతో కౌన్సెలింగ్ ఇవ్వాలి. తప్పుడు దారుల్లోకి వెళ్లకుండా కాపాడగలగాలి. అప్పుడే రేపటి తరం భవిష్యత్తు అంధకారం కాకుండా చూడగలం.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: ఏజ్–టెక్తో స్కామ్స్పై ఎటాక్
మోయకూడని బరువు..
ఒక వ్యక్తి, ఒక ముని వద్దకు వచ్చాడు. ‘అయ్యా! ఈ భారాన్ని, భయాన్ని నేను భరించ లేకపోతున్నాను. నాకు విముక్తి ప్రసాదించండి’ అని ఆవేదన చెందాడు. ముని అతనితో ‘సరే, నీకు దారి చెబుతాను. దానికి ముందు, ఈ దారిలో ఉన్న రెండు పెద్ద రాళ్లను నీ రెండు చేతుల్లో పట్టుకుని, ఈ తోట చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి రా’ అన్నాడు.అతను రెండు చేతుల్లో రాళ్లను ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. మొదటి చుట్టులోనే చేతులు వణికి పోయాయి. రెండో చుట్టులో నరాలు ఉబ్బిపోయాయి. మూడో చుట్టులో నొప్పితో అరిచాడు. నాలుగో చుట్టులో ‘గురుదేవా, నా వల్ల కావడం లేదు. చేతులు పడిపోతున్నాయి, నా ప్రాణం పోతోంది’ అన్నాడు. ముని ప్రశాంతంగా, ‘అయితే, ఆ రాళ్లను కింద పడేయ్’ అన్నాడు. అతను వెంటనే ఆ రెండు రాళ్లను కింద పడేశాడు. మరుక్షణమే, అతని చేతుల్లో భారం తగ్గి, శరీరమూ మనస్సూ తేలికపడినట్లు అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.‘రాళ్లను పట్టుకుని నొప్పితో అరిచిందీ నువ్వే, వాటిని కింద పడేసి ప్రశాంతతను పొందిందీ నువ్వే. రాళ్లు నిన్ను బలవంతం చేసి నీ చేతులకు అతుక్కున్నాయా? నువ్వే వాటిని పట్టుకున్నావు కదా. అలాగే నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు కూడా. గడిచిపోయిన కాలం ఎప్పుడో ముగిసిపోయింది, రాబోయే కాలం ఇంకా రాలేదు. రాళ్లను కింద పడేయడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు కదా? అలాగే నిన్ను గాయపరిచే జ్ఞాపకాలను, అనవసరమైన భారాన్ని మనస్సు నుంచి వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది’ అని వివరించాడు ముని.– యామిజాల జగదీశ్
అంతర్జాతీయం
గ్రీన్కార్డు కోసం కొత్త దరఖాస్తు ఫారం
వాషింగ్టన్: అమెరికా గ్రీన్కార్డు కోసం కొత్త దరఖాస్తు ఫారం వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. పాత వెర్షన్లను ఉపయోగించి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 18 తర్వాత తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. శాశ్వత నివాసాన్ని నమో దు చేసుకోవడానికి లేదా హోదాను మార్చుకోవడానికి ఉద్దేశించిన కొత్త ఫారం ఐ–485 అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇది సెపె్టంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పబ్లిక్ చార్జ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని స్పష్టంచేసింది. 2025 జనవరి 20 నాటి వెర్షన్ ఫారం ఐ–485ని తిరస్కరిస్తా మని పేర్కొంది. ఈ పాత వెర్షన్ను సెప్టెంబర్ 18కి ముందే పోస్ట్మార్క్ చేసినా లేదా ఎల్రక్టానిక్ పద్ధతిలో సమరి్పంచినా ఆమోదం పొందుతుందని తెలియజేసింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ‘పబ్లిక్ చార్జ్’నిర్వచనాన్ని విస్తరించింది. మెడికేడ్, ఫుడ్ స్టాంపులు, ప్రభుత్వం నుండి ఏదైనా ప్రయోజనాలను పొందుతున్న వారి వలసదార్ల గ్రీన్కార్డు దరఖాస్తులను తిరస్కరిస్తోంది.
ఏనుగు చర్మం టైల్తో కూల్ కూల్ కూల్!
ఏసీల్లాంటివి లేకుండానే ఇల్లు చల్లగా ఉంటే భలే బాగుంటుంది కదా? కొంచెం ఖర్చు, శ్రమకోరిస్తే ఇందుకు ఎన్నో మార్గాలు న్నాయి కానీ... పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్ర వేత్తలు తాజాగా ఇంకో సరికొత్త మార్గాన్ని ఆవిష్క రించారు. అడవి ఏనుగుల ను స్ఫూర్తిగా తీసుకుని వాటి చర్మాలను పోలిన సిమెంట్ టైల్స్ తయారు చేశారు వీరు. బయటి గోడలకు వీటిని వాడితే ఇంటిలోపల ఉష్ణోగ్రతలు 6 నుంచి 11 డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గుతాయని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది కూడా. ఆసక్తికరమైన ఈ పరిశోధన వివరాలు... ఆఫ్రికాలోని ఏనుగులు మటమటలాడే ఎండల్లోనూ భేషుగ్గా బతికేయగలవు. ఏనుగు చర్మం మందంగా ఉండటం ఒక్కటే కారణం కాదు. చర్మం పైభాగంలో ఉండే పగుళ్లలో నీరు చేరిపోయి... నెమ్మదిగా ఆవిరవుతూ చల్లదనం అందిస్తుంది. ఇదే విషయాన్ని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు భవన నిర్మాణ సామగిర తయారీకి వాడారు. సిమెంట్, డైఆటమేషియస్ మట్టి (కీటకనాశినులుగా చల్లే తెల్లటి పొడిలాంటి మట్టి) సాయంతో పలకల్లాంటివి తయారు చేశారు. వీటిలోనూ పగుళ్లు ఉంటాయి. కాకపోతే అవి ఎలా ఉండాలన్నది మనం నిర్ణయించవచ్చు. ఇలా చేయడం వల్ల వాటిల్లోకి నీరు చేరడమే కాకుండా... ఉపరితలం మొత్తమ్మీద నెమ్మదిగా వ్యాపిస్తుంది కూడా. ఎండ వేడికి ఈ నీరు నెమ్మదిగా ఆవిరవుతూ వేడిని విడుదల చేస్తుంది. తద్వారా లోపలి ప్రాంతం చల్లగా మారుతుంది. శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో ఈ టైల్స్ దిగువన ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటే, పగుళ్లు ఉన్న టైల్స్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగానూ, పగుళ్లు లేని టైల్స్ ఉపరితలంపై ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్గానూ ఉన్నట్లు తెలిసింది. పగుళ్లు లేని టైల్స్లో ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే.. ఉన్నదాంట్లోని నీరు కారణంగా ఉష్ణోగ్రత పది డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉందన్నమాట. పైగా ఈ చల్లదనం దాదాపు 20 గంటలపాటు అలాగే ఉండటం విశేషం. ఈ రకమైన టైల్స్ వాడితే ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి ఏసీ, కూలర్ల వంటివాటి వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడల్లా ఈ టైల్స్పైకి ఆటోమెటిక్గా నీరు చిమ్మేలా ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయోగం ప్రాముఖ్యత ఏమిటంటే...భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎండాకాలం వేడి ఏటికేడు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతోపాటే ఏసీల వాడకం.. ఫలితంగా విద్యుత్తు వినియోగం కూడా కొండెక్కుతోంది. ఈ ఏడాది మే నెల వరకూ భారత్లో సుమారు కోటీ యాభై లక్షల ఏసీలు అమ్ముడుపోయినట్లు సమాచారం. వడగాడ్పులు, రుతుపవనాల ఆలస్యం వంటి కారణాలతో ఏసీలు ఎక్కువగా వాడటం వల్ల మే నెలలోనే దేశ గరిష్ట విద్యుత్తు వినియోగం 22 గిగావాట్లకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌక పద్ధతుల్లో ఇళ్లలో చల్లదనాన్ని అందించే ఏర్పాట్లు ఎంతైనా ఆహ్వానించదగ్గవి.– సాక్షి, నేషనల్ డెస్క్
ప్లీజ్ భారత్ మా చక్కెర కొనవా?: పాకిస్థాన్
సాక్షి,న్యూఢిల్లీ: పండగల సీజన్లో అమాంతం పెరుగుతున్న చక్కెర ధరల్ని నియంత్రించేందుకు సరఫరాను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 31, 2026 వరకు ఎలాంటి సుంకం లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను దిగుమతి చేసుకునేందుకు వీలుగా విధానాన్ని సవరించింది. గత ఏడాదితో పోలిస్తే రిటైల్ ధరలు సుమారు 13 శాతం పెరగడం, మిల్లుల వద్ద ఎక్స్-మిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడం దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఇదే అంశంపై పాక్.. భారత్ను అర్రులు చాస్తోంది. తమ వద్ద ఉన్న షుగర్ కొనులు చేసి ఆర్థికంగా తమని ఆదుకోవాలనే ప్రతిపాదనలు చేసే యోచనలో ఉందంటూ ఆదేశ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. .భారత్ దిగుమతికి మార్గం సుగమం చేయడంతో పాకిస్థాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ దీనిని ఒక అవకాశంగా మలచుకోవాలని భావిస్తోంది. ఈక్రమంలో హుంజా షుగర్ మిల్స్ ప్రతినిధి పీఎస్ఎంఏ సీనియర్ సభ్యుడు చౌదరి ముహమ్మద్ వహీద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్లో ప్రస్తుతం 12 లక్షల టన్నులకు పైగా మిగులు నిల్వలు ఉన్నాయి. వచ్చే చెరుకు పంట చేతికొచ్చే సమయానికి ఈ నిల్వలను విక్రయించకపోతే కొత్త పంట కొనుగోలు చేయడానికి మిల్లులకు ఇబ్బందులు ఎదురవుతాయి.భారత్కు సమీపంలో ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని. మిల్లుల ద్రవ్యత మెరుగుపడి రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించడానికి వీలవుతుందని పాకిస్థాన్ వర్గాలు భావిస్తున్నాయి.వాణిజ్య సంబంధాల సవాళ్లుఇరు దేశాల మధ్య గతంలోనే రాజకీయ, భద్రతా ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య మార్గాలు (అటారీ-వాఘా సరిహద్దు, విమాన మార్గాలు) మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ప్రకారం పాకిస్థాన్ నేరుగా భారత్కు చక్కెర ఎగుమతి చేయడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మిల్లులు తమ ప్రభుత్వాన్ని ప్రత్యేక అనుమతులు కోరుతున్నాయి. అందువల్ల భారత్ తీసుకున్న దిగుమతి నిర్ణయం తక్షణ వాణిజ్య ఒప్పందంగా కాకుండా, కేవలం ఒక ఆరంభంగానే చూడాల్సి ఉంది.ఇథనాల్ ప్రభావం..ప్రభుత్వ వాదనభారత్లో చక్కెర ధరల పెరుగుదలకు కేవలం ఇథనాల్ వైపు చెరకు మళ్లింపు మాత్రమే కారణం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోల్లో 20శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్, బయోఫ్యూయల్ రంగాన్ని బలోపేతం చేయడానికి గత కొన్ని సీజన్లలో లక్షలాది టన్నుల చక్కెరను ఇథనాల్ వైపు మళ్లించింది. అయితే ప్రస్తుత ధరల అస్థిరతకు మార్కెట్లో కొంతమంది చేసే అసాధారణ నిల్వలు, ఊహాజనిత లావాదేవీలే కారణమని ఆహార, ప్రజా పంపిణీ శాఖ పేర్కొంది.
షిప్లలో భారతీయులు.. హైజాక్ చేసిన సముద్రపు దొంగలు
న్యూఢిల్లీ: యెమెన్, సోమాలియా తీర ప్రాంతాల్లో వేర్వేరు ఘటనల్లో రెండు వాణిజ్య నౌకలను సాయుధ సముద్రపు దొంగలు (పైరేట్స్) హైజాక్ చేసినట్లు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ రెండు నౌకల్లో మొత్తం 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారంతా ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి ఘటన ఆగస్టు 17న జరిగింది. కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంవి లుటుఫ్' అనే నౌకను సోమాలియాలోని పుంట్లాండ్ తీరంలో సముద్రపు దొంగలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నౌకలో ఆరుగురు భారతీయులతో సహా మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నారు.ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత, అంటే ఆగస్టు 20న యెమెన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో రెండో నౌక హైజాక్కు గురైంది. ఎరిట్రియా జెండాతో వెళ్తున్న ‘ఎంటి. సిబు 1’ అనే ఈ నౌకలో 16 మంది భారతీయులతో సహా మొత్తం 20 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. భారతీయ సిబ్బంది భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
జాతీయం
తేజస్ ఎంకే-2 సరిపోవు.. వాయుసేన మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
భారతీయ వాయుసేన (IAF) మాజీ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2030ల మధ్య నాటికి సర్వీసులోకి రానున్న 'తేజస్ ఎంకే-2' యుద్ధ విమానాలు ఫ్రంట్లైన్ పాత్రలో ఆపరేషనల్గా అంతగా ఉపయోగపడవని ఆయన స్పష్టం చేశారు .చైనా,పాక్ లు అత్యాధునిక 5,6వ తరగతి యుద్ధ విమానాలను సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, కేవలం 4వ తరగతికి చెందిన తేజస్ ఎంకే-2పై భారత్ పూర్తిగా ఆధారపడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో స్వదేశీ యుద్ధ విమానాల తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత సరిహద్దుల్లో వ్యూహాత్మక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, హెచ్ఏఎల్ (HAL) సంస్థ తీవ్రమైన జాప్యం ప్రదర్శిస్తోందని ఎయిర్ మార్షల్ మండిపడ్డారు. తేజస్ ఎంకే-1ఏ (Tejas Mk-1A) విమానాల సరఫరాలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, అమెరికాకు చెందిన జీఈ ఎఫ్404 ఇంజిన్ల డెలివరీలో వైఫల్యం విడిభాగాల అనుసంధాన సమస్యలే దీనికి కారణమని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం నిర్దేశిత సమయానికి విమానాలను అందించడంలో హెచ్ఏఎల్ విఫలమవుతోందని, వాయుసేనకు ఉన్న అత్యవసర పరిస్థితి ఆ సంస్థలో కనిపించడం లేదని ఆరోపించారు.తేజస్ ఎంకే-2 మొదటి విమాన ప్రయోగం అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చి, ప్రస్తుతం 2027 మధ్యకాలానికి మళ్లింది. ఈ నేపథ్యంలో భారత్ కేవలం స్వదేశీ అభివృద్ధి కోసం దశాబ్దాల పాటు వేచి చూడకుండా, అంతర్జాతీయ భాగస్వామ్యాల వైపు మొగ్గాలని ఎయిర్ మార్షల్ సూచించారు. యూరప్కు చెందిన ఎఫ్సీఏఎస్ (FCAS) లేదా జీసీఏపీ (GCAP) వంటి ప్రతిష్టాత్మక 6వ తరగతి యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్లలో భారత్ భాగస్వామి కావాలని ఆయన గట్టిగా వాదించారు.మరోవైపు, భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి స్వదేశీ స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్ 'ఏఎంసీఏ' (AMCA) నుంచి హెచ్ఏఎల్ సంస్థను తొలగించడం గమనార్హం. ఆర్థిక, పారిశ్రామిక అర్హతల ప్రాతిపదికన ప్రైవేట్ రంగ కంపెనీలకే ప్రాధాన్యం దక్కింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్&టీ-బీఈఎల్,భారత్ ఫోర్జ్-బీఈఎల్ కన్సార్టియమ్లు ఈ ప్రాజెక్ట్ రేసులో ముందుకు దూసుకెళ్లాయి.మొత్తంగా చూస్తే, సరికొత్త సాంకేతికతతో కూడిన 5వ, 6వ తరగతి విమానాలను సమీకరించడంలో భారత్ వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే రాబోయే దశాబ్దాల్లో గగనతల రక్షణ రంగంలో సాంకేతిక అంతరాలు ఏర్పడే ప్రమాదం ఉందని యుద్ధ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. స్వదేశీ తయారీ అత్యంత కీలకమైనప్పటికీ, కాలానికి తగినట్లుగా వేగంగా స్పందించాల్సిన అవసరం సైతం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు.హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏకైక ప్రభుత్వ రంగ విమాన తయారీ సంస్థ.రక్షణ రంగంలో భారతదేశాన్ని స్వయంసమృద్ధ (ఆత్మనిర్భర్) దేశంగా మార్చడానికి, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా యుద్ధ విమానాలను తయారు చేయిస్తుంది. విదేశాల (రష్యా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల) నుండి యుద్ధ విమానాలను భారీ వ్యయంతో కొనుగోలు చేయడం కంటే, దేశీయంగానే సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం దీని ప్రధాన లక్ష్యం
పెళ్లిలో అనూహ్య పరిణామం : పెళ్లి దుస్తుల్లోనే వధువు చికిత్స
కేరళలోని పనూర్లో డా. షిరీన్, డా. రిజాజ్ల వివాహ వేడుకలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. తన వివాహ వేడుకలో అనారోగ్యానికి గురైన ఇద్దరు కేటరింగ్ సిబ్బందికి ప్రథమ చికిత్స అందించేందుకు పెళ్లి వేడుకలను కాసేపు నిలిపివేయడం విశేషంగా నిలిచింది. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న వధువు డా. షిరీన్ సకాలంలో వైద్యం అందించి అందరి మన్ననలు అందుకున్నారు. అంతేకాదు కొత్త పెళ్లికొడుకు, భర్త రిజాజ్ కూడా ఆమెనుకొనియాడారు కేరళమ్లోని కన్నూర్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.కన్నూర్ జిల్లా పనూర్కు చెందిన డాక్టర్ షిరిన్ సుబాయిర్కు డాక్టర్ రియాజ్తో పెళ్లి జరుగుతోంది. ఆ సమయంలో విందు వడ్డించే బృందంలో ఉన్న ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది తెలిసిన వెంటనే పెళ్లి దుస్తుల్లో ఉన్న డాక్టర్ షిరిన్ అక్కడికి చేరుకున్నారు. ఇద్దరిలో ఒకరికి ముక్కు నుంచి రక్తం వస్తుండగా మరొకరు స్పృహతప్పి పడిపోయారు. ముక్కు నుంచి రక్రస్రావం ఆగేందుకు ముందుకు వంగి ముక్కులోని మెత్తడి భాగాన్ని 15 నిమిషాలు గట్టిగా పట్టుకోవాలని, ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస పీల్చుకోవాలని సూచించారు. మరో మహిళను వెల్లకిలా కాళ్లు కాస్తంత ఎత్తులో ఉంచి పడుకోవాలని సూచించారు. వారిద్దరికీ కాస్త స్వస్తత చేకూరాక, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వారికి పురమాయించారు.ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడు ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది. ‘ఆ సమయంలో వారికి అక్కడ ఏది అత్యవసరమో అదే చేశా. ఇందులో నా గొప్పతనమేదీ లేదు. ఎవరికైనా ఇలా చేస్తా. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే ముందుగా ఇలాంటి చిన్నచిన్న పనులు చేస్తే, వారికి ప్రమాదం చాలా వరకు తప్పుతుంది’అని డాక్టర్ షిరీన్ అంటున్నారు. ప్రస్తుతం ఈమె ఒట్టపాలెంలోని వల్లువనాడ్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఎండీ ఫస్టియర్ చేస్తున్నారు. భర్త డాక్టర్ రియాజ్ ఆంధ్రప్రదేశ్లోని ఓ ఆస్పత్రిలో మెడిసిన్ పీజీ చేస్తున్నారు. ఇదీ చదవండి: మూడేళ్ల నుంచే వేధింపులు, చివరికి 70 కిలోలు తగ్గింది కానీ నరకం
సీజేపీ ఎఫెక్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి!
కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమంతో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులపై కొత్త చర్చ మొదలైంది. స్కూల్ ఠీక్ కరో పేరిట చేపట్టిన ఆ కార్యక్రమం.. నిన్న రాజస్థాన్లో తీవ్ర దుమారం రేపింది. జైపూర్ శివారులోని బాగ్రు గ్రామానికి వెళ్లిన ఆ బృందంపై దాడి జరిగింది. ఇది బీజేపీ చేయించిన పనేనని సీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తమపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డెడ్లైన్ కూడా విధించింది. ఈలోపు.. అక్కడి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీజేపీ తనిఖీ ఎఫెక్ట్ ఇప్పుడు అక్కడ రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు రాష్ట్ర విద్యా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టాయి. రాష్ట్రంలోని వందల ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని ప్రభుత్వం స్వయంగా అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బాగ్రు స్కూల్ గురించి కూడా ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. అక్కడి ప్రభుత్వ పాఠశాల భవనం ప్రమాదకరంగా మారడంతో గతంలో అధికారులు దానిని వినియోగానికి అనర్హంగా ప్రకటించారట. దీంతో విద్యార్థులను తాత్కాలిక ఏర్పాట్లలోకి తరలించారు. అయితే తరగతులు పశువుల కొట్టం తరహా ప్రదేశంలో కొనసాగుతున్నాయన్న ఆరోపణలతోనే CJP బృందం అక్కడికి వెళ్లింది. ఈ ఘటన తర్వాతే సంచలన విషయాలు బయటపడ్డాయి. సమగ్ర శిక్షా అభియాన్ కింద యూడీఐఎస్ఈ (UDISE) 2025–26 గణాంకాల ప్రకారం.. రాజస్థాన్లో 611 ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలు లేకుండా కొనసాగుతున్నాయి. అందునా.. రాజధాని జైపూర్లోనే 38 పాఠశాలలకు భవనాలు లేవు. జలావర్ జిల్లాలోని అక్లేరా బ్లాక్లో అత్యధికంగా 23 పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఖాన్పూర్లో 16, ఝల్రాపటన్లో 11 పాఠశాలలు భవనాల కోసం ఎదురుచూస్తున్నాయి. మొత్తం బడులలో.. 10 బాలికల పాఠశాలలకు భవనాలు లేవని తేలింది. భవనాలు ఉన్నా.. సదుపాయాల కొరతకేవలం భవనాల కొరత మాత్రమే కాకుండా.. ఉన్న పాఠశాలల్లోనూ మౌలిక వసతుల లోపాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని 64,484 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ.. 2,047 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మరో 1,049 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో బన్స్వారా జిల్లా ముందంజలో ఉంది. అక్కడ 188 పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం లేదు. దుంగర్పూర్లో 124, ఉదయ్పూర్లో 98 పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. తాగునీటి సౌకర్యం లేని పాఠశాలలు దౌసా జిల్లాలో అత్యధికంగా 96 ఉన్నాయి.దిద్దుబాటు చర్యలుపాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ.550 కోట్లు, భవనాలు లేని లేదంటే శిథిలావస్థలో ఉన్న పాఠశాలల నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా వివిధ పథకాల ద్వారా వచ్చే ఐదేళ్లలో పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.12,500 కోట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.బీజేపీ సర్కార్పై ఆగ్రహంభజన్లాల్ శర్మ సర్కార్పై ప్రతిపక్షం మండిపడుతోంది. వివరాలు దాస్తూ ప్రభుత్వం నీళ్లు నములుతోందని మండిపడింది. ఆడిట్ వివరాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేత టీకారామ్ జూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల పరిస్థితిపై సర్కార్కు స్పష్టమైన కార్యాచరణ లేదని విమర్శించారు. రాష్ట్రంలో 3,768 ప్రభుత్వ పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, 83,783 తరగతి గదులు వినియోగానికి అనర్హంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల పరిస్థితి కారణంగా కొన్ని చోట్ల తరగతులు నిలిపివేయాల్సి వచ్చిందని, విద్యార్థుల చేరికలపై ప్రభావం పడుతోందని ఆరోపించారు.అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భద్రత, పాఠశాలల ప్రమాణాల మెరుగుదల తమ ప్రాధాన్య అంశాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం CJP తనిఖీల ఘటన నేపథ్యంలో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ తనిఖీలపై సర్కారీ ఆంక్షలుఇంతేకాదు.. కొద్ది రోజుల ముందే రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఓ ఉత్తర్వు కూడా చర్చకు దారితీసింది. ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని స్పష్టం చేసింది.విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. అనుమతి లేకుండా ఎవరూ పాఠశాలల్లోకి ప్రవేశించకుండా, అనధికారిక చిత్రీకరణను నియంత్రించేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాలు, విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సీజేపీ తనిఖీల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఆగమేఘాల మీద తీసుకొచ్చారని మండిపడ్డారు. పాఠశాలల వాస్తవ పరిస్థితులను పరిశీలించే అవకాశం తగ్గించేలా ఈ ఆదేశాలు ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే CJP ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం, బాగ్రు ఘటన, ఆ తర్వాత బయటపడిన 611 పాఠశాలల గణాంకాలు మరింత చర్చకు దారితీశాయి. దీంతో వివాదాస్పద ఉత్తర్వులను సైతం ప్రభుత్వం వెనక్కి తీసుకునే నిర్ణయంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ మీటింగ్.. కొట్టుకున్న స్టూడెంట్ యూనియన్లు
గృహిణి నుంచి జాతీయ అవార్డు వరకు.. ఎవరీ పుష్ప ప్రసాద్?
పట్నా: బిహార్లోని గోపాల్గంజ్ జిల్లా కుచాయ్కోట్ కన్యా మధ్య విద్యాలయ సహాయ ఉపాధ్యాయురాలు పుష్ప ప్రసాద్ ప్రతిష్ఠాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సత్కారం అందుకోనున్న 11 మంది ఉపాధ్యాయుల్లో ఆమె ఒకరు. బిహార్ నుంచి గోపాల్గంజ్కు చెందిన పుష్ప ప్రసాద్తో పాటు బాంకా జిల్లాకు చెందిన ఖుష్బూ కుమారి కూడా ఈ జాబితాలో నిలిచారు.కంప్యూటర్ ఎడ్యుకేషన్లో డిప్లొమా పూర్తి చేసిన పుష్ప తొలుత కంప్యూటర్ సెంటర్ ప్రారంభించి, పిల్లలకు శిక్షణ ఇవ్వాలని భావించారు. అయితే ఆమె భర్త బాల్మీకి ప్రసాద్ ప్రోత్సాహంతో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. వైమానిక దళ నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించిన పుష్ప, తొలినాళ్లలో బెంగళూరు కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి వరకు చదివారు. తండ్రి బదిలీపై హర్యానాలోని నజఫ్గఢ్కు వెళ్లడంతో అక్కడ 10, 12 తరగతులు పూర్తి చేశారు. 2004లో బీపీఎస్సీ ఉపాధ్యాయుడైన బాల్మీకి ప్రసాద్తో ఆమె వివాహం జరిగింది. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత కూడా ఆమె చదువును కొనసాగించారు.2006లో గోపాల్గంజ్ పంచాయతీ నియామక ప్రక్రియ ద్వారా ప్రాథమిక పాఠశాల బలివాన్ సాగర్లో పుష్ప ఉపాధ్యాయురాలిగా చేరి ఏడేళ్లు పనిచేశారు. పాఠశాల నిర్వహణ, బోధనలో విశేష ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందారు. 2013లో కుచాయ్కోట్ కన్యా మధ్య విద్యాలయానికి బదిలీ అయ్యారు. అక్కడ గణితం, హిందీ, ఆంగ్ల పాఠాలు బోధించడమే కాకుండా, సెలవు రోజుల్లో బాలికలకు పెయింటింగ్ వంటి అదనపు నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. గతంలో ఆమెకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సత్కారంతో పాటు రెండుసార్లు రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి. జాతీయ పురస్కారానికి ఎంపికవడంపై పుష్ప ఆనందం వ్యక్తం చేస్తూ, మారుమూల గ్రామీణ ప్రాంత పాఠశాలలో తాను చేసిన కృషికి ఈ గుర్తింపు దక్కడం గర్వకారణమని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘అందరికీ షుగర్ ఉందిగా..’.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఎన్ఆర్ఐ
బ్రిటన్ ప్రధాని సలహాదారుగా ఎన్నారై
లండన్: భారతీయ మూలాలున్న వ్యూహకర్త, మీడియా ఎగ్జిక్యుటివ్ గౌతమ్ రంగరాజన్ను బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. యూకే ప్రధాని ఆయన్ను స్ట్రక్చర్ అండ్ ప్రాసెసెస్ (రాజ్యాంగ వ్యవస్థలు, వ్యవహారాలు)పై ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వార్తా సంస్థ బీబీసీలో వ్యూహకర్తగా పనిచేసిన అనుభవమున్న రంగరాజన్ ఇప్పటికే కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించారని అని యూకే ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. లేబర్ పార్టీ నేత బర్న్హామ్ గత నెల ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన వికేంద్రీకరణ చర్యల్లో భాగంగా మ్యాంచెస్టర్లో ‘నంబర్ 10 నార్త్’ను ప్రారంభించారు. పలు ప్రభుత్వ విభాగాల పునర్వవ్యవస్థీకరణ చేపటాట్టరు.ఎవరీ గౌతమ్ రంగరాజన్?గౌతమ్ రంగరాజన్ (Gautam Rangarajan) బీబీసీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1993లో బీబీసీ రేడియో క్లాసికల్ మ్యూజిక్లో ట్రెయినీ ప్రొడ్యూసర్గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత బీబీసీ వేల్స్, బీబీసీ రేడియోలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో గౌతమ్ రంగరాజన్ గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ పెర్ఫార్మెన్స్గా నియమితులయ్యారు. 2025 ఏప్రిల్ వరకు ఈ పదవిలో కొనసాగారు. గ్రూప్ డైరెక్టర్గా బీబీసీ మొత్తానికి సంబంధించిన వ్యూహరచనకు 10 సంవత్సరాల పాటు బాధ్యత వహించారు.2025లో బీబీసీని వీడిన తర్వాత ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా పనిచేశారు. 2025 జనవరి నుంచి గ్లైండ్బోర్న్లో బోర్డ్ ట్రస్టీగా కూడా కొనసాగుతున్నారు. టెంపుల్ చర్చ్ క్వైర్తో కలిసి ఆయన పాటలు పాడారు. అలాగే పాలీఫోనీతో పాటు వెస్ట్మినిస్టర్ అబ్బే, సెయింట్ పాల్స్ కేథడ్రల్, విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్ గాయక బృందాలతో డిప్యూటీగా కూడా పనిచేశారు. రికార్డింగ్ ప్రొడ్యూసర్గా కూడా ఆయన పనిచేశారు. 2012లో విడుదలైన A Festival of Psalms అనే సీడీకి కూడా ఆయన రికార్డింగ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.చదవండి: విజయ్ పార్టీలో చేరిన యువనేత
చాట్జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్
అమెరికాలో జంట హత్యలు కలకలం రేపాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబాన్ని ఎలా హత్య చేయాలనే విషయాలను ఏఐలో వెతికి మరీ ఈ దురాగతానికి పాల్పడటం మరింత ఆందోళ రేపింది. గోతిక్ నవల (Gothic novel) తరహా కథలు, పాత్రలను రూపొందించడంలో సాయం చేయాలని AI ఛాట్బాట్ను కోరినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.మసాచుసెట్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోని మాసాచుసెట్స్ సబర్బన్ ఏరియాలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్ అర్జున్ అరవింద్, తల్లి సుధా వెంకటేశన్ (45), సోదరుడు సిద్ధార్త్ (14) దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు.Accused killer 17 year old Arjun Aravind of Acton was taken into custody in Wayland overnight and tomorrow he’s expected in adult court charged with murdering his mother and younger brother…his dad was at work when the murders took place #7News pic.twitter.com/ljpT6lNZGR— Steve Cooper (@scooperon7) August 12, 2026 మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన ట్యూటర్ లోపలికి వెళ్లలేక అర్జున్ తండ్రికి సమాచారం అందించారు. తండ్రి ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ‘వెల్ బీయింగ్ చెక్’ చేయాల్సిందిగా కోరారు. పోలీసులు వచ్చి చూడగా తల్లీ కొడుకులిద్దరూ మృతి చెంది ఉన్నారు. ఆక్టన్ ప్రాంతంలోని వారి ఇంట్లోనే ఈ హత్యలు జరిగాయి.నేరం జరిగిన తర్వాత అర్జున్ తన తల్లికి చెందిన హోండా కార్లో పరారైనట్టు పోలీసులు గుర్తించారు. మృత దేహాలపై తీవ్రమైన గాయాలున్నాయనీ, తల్లి మృతదేహం బేస్మెంట్లో, తమ్ముడి మృతదేహం మొదటి అంతస్తులో లభ్యమయ్యాయనీ వెల్లడించారు. దీంతో అర్జున్పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడి, కారు దొంగతనం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాలింపు చర్యల అనంతరం వేలాండ్ (Wayland) ప్రాంతంలోని ఒక పార్కింగ్ లాట్లో కారులో అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు.ఛాట్జీపీటీ వాడకంపై పోలీసుల ప్రకటనఅర్జున్ కొంతకాలంగా విచిత్రమైన ప్రవర్తన కనబరుస్తున్నాడు. కుటుంబాన్ని చంపేందుకు సంబంధించిన ఊహాజనిత కథనాలు, ఆలోచనల కోసం ఇంటర్నెట్, ChatGPTని ఉపయోగించినట్లు విచారణలో తేలిందని మిడిల్సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీసీ నెట్వర్క్ ఏర్పాటు..
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్వర్క్ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు 'ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్'(AAA) మరియు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ(ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లుబొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.నాయకత్వం, నెట్వర్కింగ్కు ప్రాధాన్యంAAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బలమైన నెట్వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
యూరప్లో ఘోర రోడ్డు ప్రమాదం..జగిత్యాల యువకుడు దుర్మరణం
జగిత్యాల: బతుకుదెరువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. యూరప్లోని మాల్టా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన 27 ఏళ్ల మహ్మద్ జావెద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆయన మరణించడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ జావెద్ గత ఏడాది కాలంగా మాల్టాలోని పావోలా పట్టణంలో ఒక సేల్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ మాల్టాలోని కోర్మి ప్రాంతంలో జావెద్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక భారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జవ్వద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మహ్మద్ జావెద్కు మూడు నెలల క్రితమే స్వదేశానికి వచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకల అనంతరం జీవితంలో స్థిరపడాలనే ఆశతో ఆయన తిరిగి మాల్టాకు వెళ్లాడు. ఇంతలోనే ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో జావెద్ మృతి చెందారనే వార్త వినడంతో భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
క్రైమ్
భార్య, సోదరి హత్యకు అదే కారణమా?.. లక్నో కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఒకవైపు విడాకుల కేసు.. మరోవైపు రూ.1.5 కోట్ల భరణం డిమాండ్.. ఇంకోవైపు కుటుంబ కలహాలు.. ఇవన్నీ కలిసి ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయా?. లక్నోలో ఓ బ్యాంకర్ భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపి, ఇంటికి వెళ్లి సొంత సోదరినీ హతమార్చి చివరకు తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన సంచలనంగా మారింది. మూడు ప్రాణాలను బలిగొన్న ఈ దారుణం వెనుక అసలు కారణమేంటి?. మూడు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న విషయాలు మరింత కలవరపెడుతున్నాయి.దివ్యా మిశ్రా, మానస్ బాజ్పాయ్ 2017లో వివాహం చేసుకున్నారు. మొదట వారి వైవాహిక జీవితం సాఫీగానే సాగినప్పటికీ, కొంతకాలానికి కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో దివ్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.ఆగస్టు 18న కోర్టులో ఏం జరిగింది?విడాకుల కేసు విచారణలో దివ్య రూ.1.5 కోట్ల భరణం కోరిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విచారణ అనంతరం మానస్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు పోలీసులు విచారణలో తేలింది. అయితే రూ.1.5 కోట్ల డిమాండ్ ఒక్కటే హత్యకు కారణమని పోలీసులు ఇప్పటివరకు తేల్చలేదు. దంపతుల మధ్య ఉన్న గొడవలు, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా మానస్ చెల్లెలు షీబాతో ఉన్న విభేదాలను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.ఒక్కరోజే మూడు కాల్పులుగురువారం మధ్యాహ్నం గోమతీనగర్లోని తన కార్యాలయం వెలుపల దివ్యపై మానస్ కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం అతడు తన ఇంటికి వెళ్లాడు. అక్కడ తన 28 ఏళ్ల చెల్లెలు షీబాను కాల్చి చంపిన అనంతరం, తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత మానస్ గదికి తాళం వేసుకుని టీవీ శబ్దాన్ని గట్టిగా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల శబ్దం బయటకు వినిపించకుండా చేసేందుకే ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్లో సంచలన ఆరోపణలుదివ్యను హత్య చేసిన తర్వాత మానస్ పెట్టినట్లు చెబుతున్న వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. దివ్య తనను మోసం చేసిందని ఆరోపిస్తూ, తాను భార్యను చంపినట్లు అందులో పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, తాను, తన చెల్లెలు చనిపోతామని కూడా ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. దివ్య సోదరి, యూట్యూబర్ ప్రగ్యా మిశ్రా, ఆమె భర్త భరత్ పేర్లు కూడా ఆ సందేశంలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రగ్యా, భరత్కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని దివ్య బంధువు మయాంక్ దీక్షిత్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: నీ తల్లి కోసమైనా బతకాలి కదరా.. ఇది ముందే పన్నిన పథకమా?ఇప్పుడు పోలీసుల ముందు ఉన్న మరో కీలక ప్రశ్న ఇదే. మానస్ దివ్యను హత్య చేసేందుకు ముందుగానే ప్రణాళిక రూపొందించాడా?. మూడు తుపాకుల స్వాధీనం, సీసీటీవీ దృశ్యాలు, దివ్య కదలికలపై అతడు రెండు రోజుల పాటు నిఘా పెట్టినట్లు వచ్చిన సమాచారం.. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, పొరుగువారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్, వాట్సాప్, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా విశ్లేషిస్తున్నారు. రూ.1.5 కోట్ల భరణం వివాదమే హత్యలకు కారణమా? కుటుంబ కలహాలే అసలు కారణమా? లేక మానస్ చివరి సందేశంలో పేర్కొన్న ఆరోపణల వెనుక మరేదైనా కథ ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమే పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.
వాషింగ్మిషన్ ప్లగ్ తీసేందుకు వెళ్లి..
శ్రీకాకుళం: పెద్దమురహరిపురం గ్రామానికి చెందిన వివాహిత గొరకల చామంతి(35) విద్యుత్ షాక్కు గురై గురువారం మృతి చెందింది. చామంతి ఉదయం 11 గంటల సమయంలో వాషింగ్ మిషన్లో దుస్తులు ఉతకడం పూర్తయ్యాక ప్లగ్ తీసేందుకు వెళ్లింది. చేతులు తడిగా ఉండటంతో విద్యుత్ షాక్కు గురైంది. ఆ సమయంలో పక్కనే ఉన్న కిటికీ ఐరన్ గ్రిల్స్ను పట్టుకోవడంతో కుడిచెయ్యి కాలిపోయి అక్కడికక్కడే మృత్యువాతపడింది. చామంతి ఎప్పటికీ బయట కనిపించకపోవడంతో ఎదురింట్లో ఉంటున్న గొరకల హైమావతి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే చామంతి భర్త కృష్ణారావు, ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చింది. బంధువుల సహకారంతో చామంతిని పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. చామంతికి గొరకల కృష్ణారావుతో 16 ఏళ్లు కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. గీతిక ఇంటర్ చదువుతుండగా, ఢిల్లేశ్వరి తొమ్మిదో తరగతి చదువుతోంది. వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే జాగ్రత్త అని చెప్పి భర్త కృష్ణారావు సొంత పనులపై బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కృష్ణారావు ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు
సాక్షి,న్యూఢిల్లీ: భార్యతో జరిగిన తీవ్ర వాగ్వాదం ఒక యువ టెకీని బలితీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి తన భార్యతో ఇంట్లో వచ్చిన వివాదంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో అది తీవ్రరూపం దాల్చింది. వీరి దాడిలో 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణంగా హత్యకు గురైన సంఘటన ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ప్రాథమిక పోలీసు విచారణ ప్రకారం మృతుడిని లక్ష్మీ పార్క్ నివాసి, నోయిడాలోని 'అడోబ్' (Adobe) సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వినయ్ గుప్తా (31)గా గుర్తించారు. కాగా వినయ్కి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నాలుగున్నర నెలల వయసున్న కవల పిల్లలు (ఒక బాబు, ఒక పాప) ఉన్నారు.ఏం జరిగింది?ఉదయం దంపతుల మధ్య కుటుంబ విషయమై గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటి వారికి సమాచారం అందించగా, వారు నిహాల్ విహార్లోని వినయ్ నివాసానికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన విజిటర్స్ కోసం నీళ్లు, అల్పాహారం తీసుకురావడానికి వినయ్ తల్లి బయటకు వెళ్లిన సమయంలో, భార్య తరఫు బంధువులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. తల్లి వచ్చి అడ్డుపడి, ఆపమని బ్రతిమాలినా వినకుండా దాడిని కొనసాగించారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన వినయ్ను ఆస్పత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదీ చదవండి: కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !మృతుడి భార్యతో పాటు మరో ఆరేడుగురిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించింది. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’
భార్య కళ్లెదుటే భర్త మృతి.. వరలక్ష్మీవ్రతం రోజున విషాదం
రాయవరం (తూర్పుగోదావరి): వరలక్ష్మీవ్రతం చేసుకునేందుకు భార్య సిద్ధమవుతుండగా.. జ్యూస్ షాప్లో భర్త విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన విషాద ఘటన రాయవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన జి.వెంకటేశ్వర్లు (42) కొన్నేళ్లుగా రాయవరం బస్టాండ్ సెంటర్లో భార్య భవానీతో కలిసి ఫ్రూట్ జ్యూస్షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో శుక్రవారం మిక్సర్లో జ్యూస్ తయారు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. వరలక్ష్మీవ్రతం కోసం సిద్ధమవుతున్న భవానీ ఈ విషయాన్ని గమనించి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేందుకు ప్రయత్నించింది. చీపురుతో వెంకటేశ్వర్లును తప్పించేందుకు ప్రయత్నించినా అప్పటికే పరిస్థితి విషమించి ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. భర్త మృతితో భవానీ బోరున విలపించింది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడంటూ కన్నీరుమున్నీరైంది. ఇద్దరు చిన్నారులతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఆమెకు స్థానికులు అండగా నిలిచారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కావలికి తరలించేందుకు వ్యాపారులు, ఆటో యూనియన్ నాయకులు, స్థానికులు కలిసి రూ.30 వేలు సేకరించి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. పుట్టెడు దుఃఖంతో భర్త మృతదేహాన్ని తీసుకుని భవానీ కావలికి బయలుదేరింది.
వీడియోలు
గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు
చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది..
ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు
నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి
జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?
రెండోసారి అండర్-20 ప్రపంచ ఛాంపియన్ గా కాజల్
Viral Video: పెళ్లి కూతురి మానవత్వం.. పీటలపై నుంచి లేచి వచ్చి చికిత్స
Big Breaking: గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం
రష్యా షాడో ఫ్లీట్ కేసులో భారత నావికుడి అరెస్ట్..
కొడాలి నాని ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు


