యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ ప్లాన్ బీ.. వారికి బంపరాఫర్?
లక్నో: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ కూడా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీతో సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్న వేళ.. అభ్యర్థుల ఎంపికలోనూ కొత్త విధానాన్ని అనుసరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.బలమైన ప్రజాదరణతో పాటు ఎన్నికల ప్రచారాన్ని సొంతంగా నిర్వహించగల ఆర్థిక సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు టికెట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు ‘ఇండియా టుడే’ కథనం వెల్లడించింది. ఎన్నికలను ఈసారి కాంగ్రెస్ అత్యంత సీరియస్గా తీసుకుంటోందని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. నియోజకవర్గంలో ప్రజాదరణ, గెలుపు అవకాశాలు, ప్రచారానికి అవసరమైన వనరులు ఉన్న నేతలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.అయితే.. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ గెలిచే సత్తా ఉన్న బలమైన అభ్యర్థులకు మాత్రం మినహాయింపు ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. అదే సమయంలో అభ్యర్థులు పార్టీ నిధికి కూడా తమ వంతు సహకారం అందించాలని పార్టీ ఆశిస్తోంది. గతంలో ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ నుంచి నిధులు తీసుకున్న కొందరు అభ్యర్థులు వాటిని పూర్తిగా ప్రచారానికి వినియోగించకుండా తమ వద్దే ఉంచుకున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ అంశంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.2022 ఫలితాల నేపథ్యంలో కొత్త వ్యూహం2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 399 స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పలువురు అభ్యర్థులకు పార్టీ నుంచి ఎన్నికల ప్రచారం కోసం భారీగా నిధులు అందించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అనుభవం నేపథ్యంలోనే ఈసారి అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలతో పాటు ఆర్థిక సామర్థ్యానికీ ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.ఎస్పీతో సీట్లపై కాంగ్రెస్ పట్టుమరోవైపు.. సమాజ్వాదీ పార్టీతో సీట్ల పంపకాల అంశం కాంగ్రెస్కు కీలకంగా మారింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 115 నుంచి 120 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ ఏకంగా 50 శాతం సీట్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకోవడం, ఉత్తర భారతదేశంలో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ తమకు అనుకూలంగా మారుతుందని పార్టీ అంచనా వేస్తోంది. దళితులు, మైనారిటీలు, యాదవేతర ఓబీసీ వర్గాలు రాహుల్ వైపు మొగ్గుచూపుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఇక వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై యాంటీ ఇన్కంబెన్సీ తమకు కలిసొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ మొత్తం 403 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తోంది. సీట్ల పంపకాల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు.. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్.. ఫాలోవర్ల మోజు!.. పార్టీని పట్టించుకోరా?
పుతిన్ ధీమా.. ఉక్రెయిన్పై బిగ్ స్టేట్మెంట్
ఉక్రెయిన్పై యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు మాస్కో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని అన్నారాయన. అయితే వ్లాదిమిర్ జెలెన్స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ నాయకత్వాన్ని ‘ఉగ్రవాదులు’గా అభివర్ణిస్తూ.. వారితో చర్చలు జరపడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా దూసుకెళ్తోందని పుతిన్ ప్రకటించారు. రష్యా సేనల పురోగతి వేగం పెరిగిందని, ఉక్రెయిన్ బలగాలు త్వరలో కుప్పకూలుతాయని ధీమా వ్యక్తం చేశారు. జెలెన్స్కీ ఉన్నంతకాలం శాంతి చర్చలు జరగడం అనుమానమే అని వ్యాఖ్యానించారాయన. చర్చలనేవి జరిగితే.. ఉక్రెయిన్ నాయకత్వం మారిన తర్వాతే అనే సంకేతాలు ఇచ్చారు.ముందుకు దూసుకెళ్తున్నాం..ఆగస్టులో డొనెట్స్క్ ప్రాంతంలో 270 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నామని పుతిన్ ఈ సందర్భంగా ప్రకటించారు. రష్యా సైన్యం చాకచక్యంగా 4,500–4,800 మంది, మరో 2,000 మంది ఉక్రెయిన్ సైనికులతో కూడిన రెండు బృందాలను చుట్టుముట్టిందని పేర్కొన్నారు. స్లోవియాన్స్క్, క్రామటోర్స్క్ నగరాల వైపు రష్యా బలగాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ వాదనలను స్వతంత్రంగా నిర్ధారించలేదని రాయిటర్స్ తెలిపింది.‘డ్రోన్లతో ఉగ్రవాదం’రష్యాలోకి ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడులను పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఉగ్రవాదం మరో స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపించారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులతో నష్టం జరిగినట్లు తొలిసారిగా అంగీకరించిన ఆయన.. తమ రిఫైనరీల్లో కేవలం 10 శాతం మాత్రమే మరమ్మతులు అవసరమని చెప్పారు.చర్చలకు ఓకే.. కానీ!యుద్ధాన్ని పూర్తిగా ముగించే ఉద్దేశంతో జరిగే చర్చలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధులతో చర్చలకు కూడా తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే చర్చల ప్రక్రియను సాగదీస్తూ కాలయాపన చేయడం మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.కొత్త సైనిక సమీకరణ ఉండదురష్యాలో మరోసారి సైనిక సమీకరణ చేపట్టాల్సి వస్తుందన్న ప్రచారాన్ని పుతిన్ కొట్టిపారేశారు. అదంతా ‘పచ్చి అర్ధంలేని మాటలు’ అని వ్యాఖ్యానించారు. రష్యా సైనిక పరిస్థితి బలంగానే ఉందన్న సందేశాన్ని పుతిన్ తాజా వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు.
‘డాడీ గుర్తొస్తున్నావ్..’.. కన్నీటితో తడిపేస్తున్న ఇన్స్టా పోస్ట్!
అర్ధరాత్రి వేళ కుమార్తె పంపిన ఆ సందేశం చూసి, ఆమె తండ్రి ఏకంగా 14 గంటల పాటు ప్రయాణించి, ఆమె దగ్గరకు చేరుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ఆపిల్.కైవల్య’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన తండ్రి ముకేశ్ హీరో తనపై చూపిన అనురాగాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు.రాత్రి సుమారు 1:50 గంటల సమయంలో ఆమె తన తండ్రికి ‘డాడీ చాలా గుర్తొస్తున్నావ్’ అంటూ ఓ సందేశం పంపారు. కుమార్తె నుంచి వచ్చిన ఆ ఒక్క మాటే ఆయనను వెంటనే ప్రయాణానికి పురికొల్పింది. మరుసటి రోజు ఉదయం ఆమె తలుపు తీసి చూసేసరికి, వీపున బ్యాగ్తో తండ్రి గుమ్మం ముందు నిల్చుని కనిపించారు. కేవలం ఎనిమిది గంటల పాటు కుమార్తెతో గడపడం కోసం ఆయన 14 గంటల పాటు ప్రయాణించి వచ్చారు. ఆయన తిరిగి తాను ఉండే చోటుకు వెళ్లడానికీ మరో 14 గంటల సమయం పడుతుంది.ఆ కొద్దిపాటి సమయంలోనే ఆ తండ్రీకూతుళ్లు ఎంతో విలువైన క్షణాలను పంచుకున్నారు. ఆమెతో కలిసి బైక్ రైడ్కు వెళ్తూనే ఆయన ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడారు. వినోద కేంద్రానికి వెళ్లి సరదాగా సమయం గడిపారు. అనంతరం రెస్టారెంట్లో భోజనం చేశారు. కేవలం బయటకు వెళ్లడమే కాకుండా, కుమార్తె వంటగదిలోని గిన్నెలు కడగడం సహా పలు చిన్నపాటి పనులను ఆయనే స్వయంగా చేసిపెట్టారు.ఈ వీడియోను పంచుకుంటూ.. ‘నిన్ను చూడాలని ఉందని చెప్పాను.. వెంటనే వచ్చేశారు. 14 గంటల ప్రయాణం, ఒక్క రోజు కలయిక, అడగకుండానే చేసిపెట్టిన ఎన్నో పనులు’ అని ఆ యువతి రాసుకొచ్చారు. తల్లిదండ్రులు తమ మాటల్లో ఎప్పుడూ తోడుంటామని చెప్పకపోవచ్చు కానీ, చేతల్లో ఆ ప్రేమను చాటుతారని ఆమె భావోద్వేగంతో వివరించారు. అనంతరం ఆయన స్లీపర్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మాటల కంటే చేతలే గొప్పవని నిరూపించిన ఈ వీడియో నెటిజన్ల మనసులను అమితంగా హత్తుకుంటోంది.ఇది కూడా చదవండి: ఆ ముగ్గురిలో అయోధ్య సీఈవో.. నేడు వెల్లడి?
దమ్ముంటే రారా చూసుకుందాం!
‘‘నేను నీపేరు వాడుకున్నానా...నీ బతుక్కి అనంతపురంలో పార్టీ కార్యాలయం పెట్టే పరిస్థితి లేకపోతే నా ఇళ్లు ఇచ్చా. నీ కోసం కేసులు మోసుకున్నా..జైలుకు వెళ్లా...ఇంత చేస్తే...నన్ను వాడు...వీడు అంటావా...దమ్ముంటే రారా చూసుకుందాం’’ అంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్పై అతని నమ్మినబంటు, వరుసకు మామ అయిన గంగారాం రెచ్చిపోయారు. మంగళవారం రాత్రి టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యాలయంలో గంగారాం తన అనుచరులతో హల్చల్ చేసినట్లు తెలిసింది. ఏకంగా ఎమ్మెల్యే దగ్గుపాటిని ఉద్దేశించి బండబూతులు తిట్టినట్లు సమాచారం. ‘‘ఆ్రఫ్టాల్ ఎంపీపీవి.. ఎమ్మెల్యే స్థాయికి రావడానికి నేనే కారణం’’ అంటూ గంగారాం బాహాటంగానే విమర్శించినట్లు టీడీపీ వర్గాల్లో భారీగా చర్చ నడుస్తోంది. అసలు వివాదం ఏమిటంటే ఇటీవల బెంగళూరులో ఓ సామాజికవర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న నగరానికి చెందిన టీడీపీ నేత ఒకరు...‘‘ గంగారాంను వాడుకుని జైలు పాలు చేశావు కదయ్యా’’ అని అన్నారు. దీంతో సహనం కోల్పోయిన దగ్గుపాటి ప్రసాద్ అందరిముందే గంగారామ్ను బండబూతులు తిట్టినట్లు చర్చ జరుగుతోంది. ‘‘గంగారాం ఎంత అతని బతుకెంత... నా పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడతాడా‘‘ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి రెచ్చిపోయినట్లు సమాచారం. ఈ విషయం అక్కడున్న వారి ద్వారా తెలుసుకున్న గంగారామ్ తీవ్ర అవమాన భారానికి లోనయ్యారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఉన్నట్లు తెలిసి అనుచరులతో కలిసి అక్కడికే వెళ్లాడు. అయితే ఎమ్మె ల్యే పార్టీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ గంగారామ్ వస్తున్నట్లు తెలిసి తాను లేనట్లు అనుచరులతో చెప్పించారు. దీంతో కోపోద్రిక్తుడైన గంగారామ్ ఎమ్మెల్యే దగ్గుపాటి.. చేసిన మేలు మరచిపోయాడంటూ చిందులు తొక్కారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అప్పటికప్పుడు తన అనుచరులను పిలిపించి గంగారామ్పై ఫిర్యాదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అక్రమ వసూళ్లు...జైలు ఎమ్మెల్యే దగ్గుపాటికి నమ్మిన బంటుగా ఉన్న గంగారామ్.. నగరంలో విచ్చలవిడిగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. నగరంలో ఒక వైన్ షాప్లో వాటాలు ఇవ్వలేదని నిప్పు పెట్టిన ఘటనలో గంగారాం అరెస్ట్ అయ్యారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపైనా డబ్బులు ఇవ్వాలని బెదిరించిన ఘటనలోనూ గంగారాం ప్రధానంగా ఉన్నారు. గంగారాంను కరివేపాకులా తీసి పారేసిన ఎమ్మెల్యే వైఖరిపై భగ్గుమంటున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే.. గంగారాం వైఖరి టీడీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అనంతపురం నగరంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల ఏకంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దగ్గుపాటి వైఖరిపై ప్రెస్మీట్ పెట్టి ఏకిపారేశాడు. దగ్గుపాటి రూ.200 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఆధారాలతో సహా అధిష్టానానికి ఇచ్చామంటూ పేర్కొనడంతో నగరంలో టీడీపీ కేడర్ ఆత్మరక్షణలో పడింది. -అనంతపురం చదవండి: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్డ్రింక్ తాగుదాం!’
జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా..
భారీగా పడిన స్టాక్ మార్కెట్ సూచీలు
జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్.. ఇచట ఇన్స్పెక్టర్ లేరు!
యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ ప్లాన్ బీ.. వారికి బంపరాఫర్?
‘డాడీ గుర్తొస్తున్నావ్..’.. కన్నీటితో తడిపేస్తున్న ఇన్స్టా పోస్ట్!
ఆయన పేరు చెబితే వదిలెయ్యాలి!
మా తప్పేంటి?.. భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!
ఐటమ్ సాంగ్లో ట్రెండింగ్ హీరోయిన్ కాయదు?
ఐస్క్రీమ్ మార్కెట్లోకి రిలయన్స్
'నీవొక డమ్మీ కెప్టెన్.. వెంటనే రాజీనామా చేయ్'
ఆ తండ్రీకొడుకులది... అసలు పని ఈ తండ్రీ కొడుకులది.. క్రెడిట్ చోరీ!
బేరాలాడకండి.. ఇదేమీ డీఎస్సీ ఉద్యోగం కాదు చౌకగా దొరికేదానికి..!!
ఆమె కన్నీటి శాపమే.. నేపాల్ను వెంటాడుతోందా?
శుభవార్త చెప్పిన హీరోయిన్ నిత్యామేనన్
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు 57 ఏళ్ల రికార్డ్ బ్రేక్
'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’
తమ్ముడితో మూవీ.. అన్నతో పెళ్లి.. హాట్టాపిక్గా బలగం బ్యూటీ..!
మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో
'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్డ్రింక్ తాగుదాం!’
...మన ‘కష్టమంతా’ వృథా అయినట్లేనా సార్!
రవితేజ ఇరుముడి.. డైరెక్టర్ రాసిన సాంగ్ రిలీజ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి గంగ్వార్ అరెస్ట్
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
IND vs AFG: టీమిండియాలోకి ఊహించని ప్లేయర్!
జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా..
భారీగా పడిన స్టాక్ మార్కెట్ సూచీలు
జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్.. ఇచట ఇన్స్పెక్టర్ లేరు!
యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ ప్లాన్ బీ.. వారికి బంపరాఫర్?
‘డాడీ గుర్తొస్తున్నావ్..’.. కన్నీటితో తడిపేస్తున్న ఇన్స్టా పోస్ట్!
ఆయన పేరు చెబితే వదిలెయ్యాలి!
మా తప్పేంటి?.. భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!
ఐటమ్ సాంగ్లో ట్రెండింగ్ హీరోయిన్ కాయదు?
ఐస్క్రీమ్ మార్కెట్లోకి రిలయన్స్
'నీవొక డమ్మీ కెప్టెన్.. వెంటనే రాజీనామా చేయ్'
ఆ తండ్రీకొడుకులది... అసలు పని ఈ తండ్రీ కొడుకులది.. క్రెడిట్ చోరీ!
బేరాలాడకండి.. ఇదేమీ డీఎస్సీ ఉద్యోగం కాదు చౌకగా దొరికేదానికి..!!
ఆమె కన్నీటి శాపమే.. నేపాల్ను వెంటాడుతోందా?
శుభవార్త చెప్పిన హీరోయిన్ నిత్యామేనన్
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు 57 ఏళ్ల రికార్డ్ బ్రేక్
'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’
తమ్ముడితో మూవీ.. అన్నతో పెళ్లి.. హాట్టాపిక్గా బలగం బ్యూటీ..!
మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో
'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్డ్రింక్ తాగుదాం!’
...మన ‘కష్టమంతా’ వృథా అయినట్లేనా సార్!
రవితేజ ఇరుముడి.. డైరెక్టర్ రాసిన సాంగ్ రిలీజ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి గంగ్వార్ అరెస్ట్
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
IND vs AFG: టీమిండియాలోకి ఊహించని ప్లేయర్!
ఫొటోలు
హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
పులివెందుల : భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ (ఫొటోలు)
‘మిర్జాపూర్ : ది మూవీ’ తెలుగు ప్రెస్మీట్ (ఫొటోలు)
ట్రేడిషనల్ శారీలో బిగ్బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు
మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)
తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)
కీర్తి సురేశ్ కలర్ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)
యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)
సినిమా
తమ్ముడితో మూవీ.. అన్నతో పెళ్లి.. హాట్టాపిక్గా బలగం బ్యూటీ..!
బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో ఏడడుగులు వేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా ప్రకటించింది. కాల భైరవతో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది.అయితే కావ్య కల్యాణ్ రామ్ బలగం మూవీతో ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. ఉస్తాద్ మూవీలో కాల భైరవ తమ్ముడు సింహా సరసన హీరోయిన్గా మెప్పించింది. ఇప్పుడేమో హీరో అన్న కాల భైరవతో పెళ్లికి రెడీ అయిపోయింది. ఇది కాస్తా టాలీవుడ్లో ఆసక్తికర విషయంగా మారింది.తమ్ముడితో సినిమా చేసిన బ్యూటీ.. రియల్ లైఫ్లో అన్నతో జోడీ కట్టడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కొందరు హీరోయిన్లు కూడా ఇలానే చేశారని చర్చించుకుంటున్నారు. శ్రీదేవి–బోనీ కపూర్, శ్రియా రెడ్డి–విక్రమ్ రెడ్డి, సోనియా అగర్వాల్–సెల్వరాఘవన్ జంటలు కూడా ఇలానే చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
రవితేజ ఇరుముడి.. డైరెక్టర్ రాసిన సాంగ్ రిలీజ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఏకంగా రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మౌత్టాక్తోనే ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది.ఇప్పటికే ఈ మూవీ నుంచి అయ్యప్ప సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా మరో పాట విడుదల చేశారు మేకర్స్. కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కంపోజ్ చేయడంతో పాటు ఆలపించారు.
'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని
'పుష్ప' రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. మిగతా తెలుగు హీరోలకు అందనంత ఎత్తులోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం 'రాకా' అనే భారీ బడ్జెట్ మూవీతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే రీసెంట్గా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై బన్నీ ఫొటో పడింది. ఈ క్రమంలోనే సదరు మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చిన అల్లు అర్జున్.. 'పుష్ప' గురించి, ప్రస్తుతం వస్తున్న మూవీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?)ఫోర్బ్స్ ఇంటర్వ్యూలోని తాను మాట్లాడిన కొన్ని విషయాల్ని ఇన్ స్టాలో ఫొటోల రూపంలో బన్నీ షేర్ చేశాడు. వీటిలో ఎక్కువ ఆకర్షిస్తున్నది అయితే 'పుష్ప'లో లేడీ గెటప్ ధరించడం గురించి ఇతడి చెప్పిన మాటలు. 'నా జీవితంలో నేను చేసిన అత్యంత ఆల్ఫా(మగతనం/పవర్ఫుల్) పని.. 'పుష్ప'లో మహిళలా చీరకట్టుకుని నటించడమే' అని అన్నాడు.'ఒత్తిడి అనేది అరుదుగా దొరికే ఒక గొప్ప వరం. దేశంలో కొద్దిమందికి మాత్రమే అలాంటి అవకాశం లభిస్తుంది. నా దృష్టిలో ఒత్తిడి అనేది అదృష్టం. ఇప్పుడు యావరేజ్ కంటెంట్ని ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తే, మిగిలిన బాక్సాఫీస్ లెక్కలన్నీ అదే చూసుకుంటుంది. 'పుష్ప' సాధించిన విజయం.. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా నన్ను రోజూ ప్రేరేపిస్తోంది' అని కూడా బన్నీ చెప్పాడు.(ఇదీ చదవండి: ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)
సినీ సెప్టెంబర్
ఆగస్టులో విడుదలైన రవితేజ ‘ఇరుముడి’ సినిమా బ్లాక్బస్టర్ తో సినిమా ఇండస్ట్రీకి మరింత ఊపిరి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్కు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. ఇది తెలుగు బాక్సాఫీస్కు మరింత ఊపునిచ్చింది. తాజాగా సెప్టెంబరులో కూడా ప్రతి వారం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఓ సినిమా రిలీజ్కు సిద్ధం అవుతోంది. ఆశ్చర్యకరంగా స్ట్రయిట్ చిత్రాలతో పాటు సెప్టెంబరులో ప్రతివారం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఓ డబ్బింగ్ సినిమా కూడా ఉంది. లవ్, యాక్షన్, డివోషన్, ఎమోషన్, యూత్ఫుల్... ఇలా డిఫరెంట్ జానర్స్లో సెప్టెంబరులో సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి... ఏ వారం ఏయే సినిమా రిలీజ్ కానుందో, ఏ డబ్బింగ్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఓ లుక్ వేయండి.రంభ... ఊర్వశి... మేనక భూలోకానికి వస్తే! సినిమా హీరో అవ్వాలన్నది సూరి ఆశయం. కానీ సూరి ఏ మాత్రం కష్టపడకుండా సినిమా హీరో అవ్వాలనుకుంటాడు. షార్ట్కట్ లో తాను హీరో కావాలనుకునే ప్రయత్నంలో భాగంగా ఓ మాయా పుస్తకం సాయంతో ఏకంగా రంభ... ఊర్వశి... మేనకలను భూలోకానికి తీసుకువస్తాడట సూరి. మరి... ఆ తర్వాత ఏం జరిగింది? సూరి ఆశయం నెరవేరి అతను సినిమా హీరో అయ్యాడా? ‘రంభ... ఊర్వశి... మేనక డ్రామా కంపెనీ’ సూరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది... అనేది ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో చూడొచ్చు. అల్లరి నరేశ్, సురభి హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ చింతాడ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబరు 4న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ప్రేమ... హాస్యం... ఉత్కంఠ ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాల్లో మంచి ఇంటెన్స్ అండ్ బోల్డ్ సీన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, యాక్షన్ అంశాలను ఆడియన్స్ చూశారు. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది సందీప్ రెడ్డి వంగా అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆయన ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘రోమాంచకం’ సినిమా మాత్రం ఎక్కువగా ఫన్ ఎలిమెంట్స్తో రూపొందడం విశేషం. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఈ యూత్ఫుల్ సినిమాకు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరించగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ‘‘కాలేజీ స్టడీస్ పూర్తయిన తర్వాత కొంతమంది యువత లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంటుంది. సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేని విభిన్నమైన పరిస్థితుల్లో ఉంటారు. ఈ కాంప్లిసిటీ నేపథ్యంలో ‘రోమాంచకం’ సినిమా కథనం సాగుతుంది’’ అని ఇటీవల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ గురువారం ఈ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఒకరోజు ముందుగానే అంటే... నేడే ఈ సినిమా ప్రీమియర్స్ను ప్రదర్శించనున్నట్లు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. లైఫ్ ఆఫ్ సంజు ప్రేమ, అనుబంధాలు, జ్ఞాపకాలు, జీవితంలో ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘సహా’ (లైఫ్ ఆఫ్ సంజు). శివకుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిశాంత్ కోదాటి దర్శకత్వంలో సుమైరా స్టూడియోస్ బ్యానర్పై తేజ వేల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న రిలీజ్ కానుంది. ‘‘సంజు జీవితంలోని వివిధ దశలను ఈ సినిమా ప్రజెంట్ చేస్తుంది. ప్రేమ, విడిపోవడం, మధురమైన జ్ఞాపకాలు, కష్టాలను అధిగమించేందుకు అవసరమైన మనోధైర్యం వంటి అంశాలను కథలో చూపిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ తదితరులు ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్ ఎంటర్టైనర్ సాయికుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్టైనర్ ‘ధర్మస్థల నియోజక వర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 4న రిలీజ్ కానుంది. పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారట మేకర్స్. అవినీతి, డ్రగ్ మాఫియాలపై ఓ సామాన్యుడు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. నటి కస్తూరి ఈ సినిమాలో ఓ విలన్ రోల్ చేశారని టాక్. వారాహి అమ్మవారి శాపం ఎందుకు? సుమంత్ హీరోగా నటించిన ఆధ్యాతి్మక మిస్టరీ థ్రిల్లర్ సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఐశ్వర్య రాజేష్, సిద్దు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాల్విక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. దాదాపు 150 ఏళ్లుగా మహేంద్రగిరి రాజకుటుంబానికి చెందినవారు వరుసగా మరణిస్తుంటారు. ఈ మరణాలన్నీ వారాహి మాత శాపం కారణంగానే జరుగుతున్నాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ శాపాన్ని ఛేదించి, వరుస మరణాల వెనక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునేందుకు హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేస్తోంది.మధ్యతరగతి జీవితాలు ‘బేబీ’ వంటి సూపర్హిట్ మూవీ తర్వాత హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య జంటగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మధ్య తరగతి యువతీయువకులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ పడే కష్టాలు, వారి కుటుంబాల ఇబ్బందులు ... వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అలాగే లవ్, ఎమోషన్ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. విలేజ్ యాక్షన్ డ్రామా నటుడు–నిర్మాత రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. ఈ విలేజ్ యాక్షన్ డ్రామా సినిమాకు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించగా, దీపా బాలు హీరోయిన్గా నటించారు. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వీఎస్ రూపాలక్ష్మి ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది. తెలంగాణలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఓ గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి. దీంతో ఆ ఊరి గ్రామదేవతకు ఓ ఆంబోతును సమరి్పస్తారు గ్రామస్థులు. కానీ సడన్గా, అది అదృశ్యం అవుతుంది. మరి... ఆ తర్వాత ఏం జరిగింది..? అన్నదే ఈ సినిమా కథనం అని సమాచారం. ప్రేమకథ వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లు గా నటించిన లవ్స్టోరీ సినిమా ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం లో కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఈ సెపె్టంబరు 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ‘‘మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. మా సినిమా చూస్తే మీ ప్రేమకథ గుర్తుకు వస్తుంది’’ అని ఈ సినిమా గురించి దర్శకుడు ఎంజీఆర్ తుకారాం చెప్పారు. స్పై డ్రామా నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని కీలక పాత్రలు పోషించారు. దేశభక్తి, యాక్షన్, థ్రిల్, స్పై యాక్షన్ డ్రామా, హ్యూమర్ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమాని సెప్టెంబరు 18న విడుదల చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. జడల్ జమానా నాని హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘దిప్యారడైజ్’. ఈ చిత్రంలో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని కపిస్తారు. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రలో కయాదు లోహర్ నటించగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని ‘ఏష నాగుల గట్టుపైన..’ అనే స్పెషల్ సాంగ్లో కీర్తీ సురేష్ డ్యాన్స్ చేశారు. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసిన సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ఆడియన్స్లో ఆసక్తి నెలకొని ఉంది. ‘దిప్యారడైజ్’ సినిమాలో రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎమోషన్స్ కు కూడా పెద్ద పీట వేశారట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఐడెంటిటీ, ఆధిపత్య పోరు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబరు 24న థియేటర్స్లో రిలీజ్ కానుంది.వీటితో పాటు మరికొన్ని సినిమాలు సెప్టెంబరు నెలలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.⇒ ఈ సెప్టెంబరు నెలలో వారానికొక డబ్బింగ్ సినిమా కూడా తెలుగు తెరకు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా ‘ఐయామ్ గేమ్’. నహాస్ హిదాయత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్ వంటి అంశాలతో రూపొందిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సెప్టెంబరు 3న విడుదలæ కానుంది. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు –దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జిమ్ వర్గీస్తో కలిసి దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ⇒ మలయాళ నటుడు నివిన్ పౌలి హీరోగా, మమితాౖ బెజు హీరోయిన్గా నటించిన లవబుల్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ‘బెత్లెహోమ్ కుటుంబయూనిట్’. సూపర్హిట్ ‘ప్రేమలు’ ఫేమ్ దర్శకుడు గిరీష్ ఏడీ తెరకెక్కించిన ఈ సినిమాను ఫాహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. మలయాళంలో ఆగస్టు 21న విడుదలైన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ చిత్రం సూపర్హిట్గా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో సెప్టెంబరు 4న రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. వయసు వ్యత్యాసంతో కూడిన లవ్స్టోరీగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ⇒ సూపర్హిట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఆధారంగా ‘మిర్జాపూర్:ది మూవీ’ అనే హిందీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, జితేంద్ర కుమార్, రవి, అభిషేక్. బి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 4న విడుదల కానుంది. ⇒ తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఆల్మోస్ట్ తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. తాజాగా కార్తీ హీరోగా నటించిన తమిళ సినిమా ‘సర్దార్ 2’. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘సర్దార్’కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది. ఎస్జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్లు ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో నటించారు. ఇందులో తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు కార్తీ. దేశభక్తి, తండ్రీ కొడుకుల భావోద్వేగం ప్రధానంగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా కలిసి ‘సర్దార్ 2’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 10న విడుదలæకానుంది. ⇒ తెలుగు హీరో సుహాస్ నటించిన తొలి తమిళ సినిమా ‘మండాడి’. ఈ చిత్రంలో సూరి, సుహాస్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. సుహాస్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. మహిమా నంబియార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. సముద్రంపై సాగే పడవల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది. ⇒ కీర్తీ సురేష్ ప్రధాన పాత్రధారిగా సనంత్, రిషికాంత్ ఇతర కీలక పాత్రధారులుగా నటించిన పీరియాడికల్ విలేజ్ డ్రామా ‘డొరోతి’. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్పాండే, గునీ™Œ æమోంగా, అచిన్ జైన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 25న విడుదల కానుంది. స్నేహం, ఆశ, ఆశయం, పక్షపాత ధోరణి వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని కోలీవుడ్ టాక్.ఈ సినిమాలే కాకుండా... జీవీ ప్రకాష్కుమార్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘ఇమ్మోర్టల్’, ‘డీమాంటీ కాలనీ 3’ వంటివి సెప్టెంబరు నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కోవలో మరికొన్ని పరభాషా సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు
క్రీడలు
మరో స్టార్ ఫుట్బాలర్ రిటైర్మెంట్
అంతర్జాతీయ ఫుట్బాల్కు మరో స్టార్ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన గంటల వ్యవధిలోనే జర్మనీ స్టార్ డిఫెండర్ ఆంటోనియో రూడిగర్ కూడా అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2026 ప్రపంచకప్లో జర్మనీ తరఫున చివరిసారిగా ఆడిన 33 ఏళ్ల రూడిగర్, తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 86 మ్యాచ్లు ఆడాడు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు జాతీయ జట్టును వీడుతున్నట్లు రూడిగర్ తెలిపాడు. ఇకపై తన క్లబ్ జట్టు రియల్ మాడ్రిడ్పై పూర్తిగా దృష్టి సారించనున్నట్లు రూడిగర్ వెల్లడించాడు.2014లో జర్మనీ తరఫున అరంగేట్రం చేసిన రూడిగర్.. 2017లో కాన్ఫెడరేషన్స్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే రియల్ మాడ్రిడ్తో పాటు చెల్సీ తరఫున కూడా ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు సాధించాడు. డిఫెండర్ కావడంతో రూడిగర్ తన అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో కేవలం మూడే గోల్స్ చేశాడు. చదవండి: అంతర్జాతీయ ఫుట్బాల్కు మెస్సీ గుడ్ బై
థాయ్లాండ్ నిష్క్రమణ
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నీ నుంచి థాయ్లాండ్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. సెమీఫైనల్ రేసులో ఉండాలంటే పాకిస్తాన్పై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో థాయ్లాండ్ జట్టు ఓడిపోయింది. ఫాతిమా సనా సారథ్యంలోని పాక్ జట్టు 35 పరుగుల తేడాతో థాయ్లాండ్ను ఓడించి శుభారంభం చేసింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు చేసింది.మునీబా అలీ (54; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. థాయ్లాండ్ బౌలర్ థిపాచా పుథావోంగ్ 3 వికెట్లు తీసి అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక వికెట్లు (173) తీసిన బౌలర్గా రికార్డు నెలకొల్పింది. 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన థాయ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితమైంది. మూడో నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్లో ఇండోనేసియాతో శ్రీలంక తలపడతుంది.
భారత చెస్ నంబర్వన్ ప్రజ్ఞానంద
చెన్నై: నెల రోజుల వ్యవధిలో రెండు టోర్నీల్లో టైటిల్ సాధించి, మరో టోర్నీలో రన్నరప్గా నిలిచిన తమిళనాడు గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద భారత నంబర్వన్ చెస్ ప్లేయర్గా అవతరించాడు. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ ర్యాంకింగ్స్లో 20 ఏళ్ల ప్రజ్ఞానంద నాలుగు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్ నుంచి 8వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఇటీవల సెయింట్ లూయిస్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద... సింక్ఫీల్డ్ కప్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. ఆ తర్వాత గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టోర్నీలో అమెరికా గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రజ్ఞానంద వద్ద 2761 ఎలో రేటింగ్ పాయింట్లున్నాయి. గత రెండు నెలలుగా తొమ్మిదో ర్యాంక్లో నిలిచి భారత నంబర్వన్గా ఉన్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ భారత రెండో ర్యాంకర్గా మారిపోయాడు. తొమ్మిదో ర్యాంక్లో కొనసాగుతున్న అర్జున్ వద్ద 2759 ఎలో రేటింగ్ పాయింట్లున్నాయి. భారత ఇతర గ్రాండ్మాస్టర్లు విశ్వనాథన్ ఆనంద్ 14వ ర్యాంక్లో, నిహాల్ సరీన్ 25వ ర్యాంక్లో, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ 32వ ర్యాంక్లో, విదిత్ 33వ ర్యాంక్లో ఉన్నారు. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 2823 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్వన్గా కొనసాగుతున్నాడు. 2011 జూలై నుంచి కార్ల్సన్ ర్యాంక్లో మార్పులేదు. ర్యాపిడ్ ఫార్మాట్లో ఇరిగేశి అర్జున్ ప్రపంచ మూడో ర్యాంక్లో, ప్రజ్ఞానంద ఏడో ర్యాంక్లో... బ్లిట్జ్ ఫార్మాట్లో అర్జున్ ప్రపంచ ఆరో ర్యాంక్లో, నిహాల్ సరీన్ 15వ ర్యాంక్లో ఉన్నారు. ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలోనూ కార్ల్సన్ ప్రపంచ నంబర్వన్గా కొనసాగుతున్నాడు.
డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి భారత్
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): రెండేళ్ల క్రితం అసాధారణ ఆటతీరుతో ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో ఓపెన్ విభాగంలో, మహిళల విభాగంలో భారత జట్లు చాంపియన్స్గా అవతరించాయి. అప్పటి జోరును ఈసారీ పునరావృతం చేసి రెండు విభాగాల్లోనూ టైటిల్స్ నిలబెట్టుకోవాలని భారత జట్లు ఈ మెగా ఈవెంట్కు సిద్ధమవుతున్నాయి. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ పట్టణంలో ఈనెల 16 నుంచి 27వ తేదీ వరకు చెస్ ఒలింపియాడ్ జరగనుంది. ఓపెన్, మహిళల విభాగాల్లో స్విస్ ఫార్మాట్లో 11 రౌండ్ల చొప్పున నిర్వహిస్తారు. సెప్టెంబర్ 15న ప్రారంభోత్సవం జరుగుతుంది. సెప్టెంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు ఆరు రౌండ్లు జరుగుతాయి. 22వ తేదీన విశ్రాంతి దినం. సెపె్టంబర్ 23 నుంచి 27 వరకు మిగతా ఐదు రౌండ్లను నిర్వహిస్తారు. ఓపెన్ విభాగంలో 208 దేశాలు... మహిళల విభాగంలో 190 దేశాలు పోటీపడనున్నాయి. ఓపెన్ విభాగంలో ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, దొమ్మరాజు గుకేశ్, విదిత్... మహిళల విభాగంలో కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్, వైశాలి, వంతిక అగర్వాల్, సవితాశ్రీ భారత జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరిగిన 2024 చెస్ ఒలింపియాడ్లో ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్లతో కూడిన భారత మహిళల జట్టు... దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత ఓపెన్ జట్టు టైటిల్స్ సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత విభాగాల్లో బోర్డు–1పై గుకేశ్, బోర్డు–3పై అర్జున్ స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల వ్యక్తిగత విభాగంలో బోర్డు–3పై దివ్య దేశ్ముఖ్, బోర్డు–4పై వంతిక అగర్వాల్ పసిడి పతకాలు గెలిచారు. 2024లో ఓపెన్ విభాగంలో ఆడిన పెంటేల హరికృష్ణ స్థానాన్ని ఈసారి నిహాల్ సరీన్ భర్తీ చేయనున్నాడు. 2024లో మహిళల విభాగంలో పోటీపడ్డ ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్ ఈసారి బరిలోకి దిగడంలేదు. హారిక స్థానంలో కోనేరు హంపి, తానియా స్థానంలో సవితాశ్రీ ఆడనున్నారు.
న్యూస్ పాడ్కాస్ట్
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
బిజినెస్
సుభాష్ చంద్రకు చుక్కెదురు!
న్యూఢిల్లీ: జీ/ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు ఎన్సీఎల్టీలో చుక్కెదురైంది. రూ. 22,006 కోట్ల రుణదాతల బకాయి క్లెయిమ్లకు గాను సుమారు రూ. 6.5 కోట్లతో సెటిల్మెంట్ చేసుకునేందుకు ఇటీవల ఆమోదించిన సెటిల్మెంట్ ప్రణాళికపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) స్టే విధించింది. అంతేకాకుండా తన వ్యక్తిగత గ్యారంటీలకు సంబంధించిన దివాలా కేసులో ఆస్తులను బదిలీ చేయకుండా నిషేధం విధించింది. ఎన్సీఎల్టీ ప్రెసిడెంట్ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘కంపెనీల చట్టంలోని సెక్షన్ 419 (5) ప్రకారం రీపేమెంట్ ప్రణాళికను అమలు చేయడానికి స్పష్టమైన మెజారిటీ అభిప్రాయం లేనందున గత తీర్పు అమల్లోకి రాదు. కాబట్టి, ఈ ఏడాది ఆగస్ట్ 25న ఎన్సీఎల్టీ మూడో మెంబర్ (జ్యుడీషియల్) ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం’ అని బెంచ్ పేర్కొంది. ‘వ్యక్తిగత గ్యారంటార్గా ఉన్న చంద్ర తన ఆస్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరికీ కట్టబెట్టకూడదు’ అని ట్రిబ్యునల్ ఆదేశించింది. అలాగే, ఈ కేసులో అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. ఎల్ఐసీ హౌసింగ్ పైనాన్స్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ సహా రీపేమెంట్ ప్లాన్ను వ్యతిరేకిస్తున్న రుణదాతల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్టే ఇవ్వాల్సిందిగా కోరారు. కాగా, చంద్రతో పాటు రుణదాతల వాదనలను పూర్తి స్థాయిలో ట్రిబ్యునల్ విచారిస్తుందని జస్టిస్ గ్రేవాల్ పేర్కొన్నారు. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది. మరోపక్క, రుణదాతలు ఎన్సీఎల్టీ రీపేమెంట్ ప్రణాళికను ఆమోదిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించారు.
జీఎస్టీ వసూళ్లు 15% జూమ్
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు దుమ్మురేపుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు్టలో 14.8 శాతం జంప్చేసి, రూ. 1,99,853 కోట్లకు చేరాయి. ప్రధానంగా దేశీ లావాదేవీలు, దిగుమతులు దీనికి దోహదం చేశాయి. పశ్చిమాసియా సంక్షోభ ప్రతికూలతలు, టారిఫ్ అడ్డంకులు నెలకొన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయ్యేందుకు దేశీ వినియోగమే దన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, దేశీ లావాదేవీల నుంచి జీఎస్టీ ఆదాయం 9.3 శాతం ఎగసి రూ. 1.37 లక్షల కోట్లను తాకగా.. దిగుమతుల నుంచి ఆదాయం 29 శాతం దూసుకెళ్లి రూ.62,604 కోట్లుగా నమోదైంది. ⇒ ఆగస్టులో స్థూల కేంద్ర జీఎస్టీ వసూళ్లు రూ.38,413 కోట్లుగా ఉన్నాయి. రాష్ట్ర జీఎస్టీ 46,316 కోట్లు కాగా, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.1,15 లక్షల కోట్లకు చేరుకుంది. ⇒ రిఫండ్లు 68 శాతం పెరుగుదలతో రూ. 31,795 కోట్లుగా నమోదయ్యాయి. ⇒ నికర జీఎస్టీ వసూళ్లు రూ.1,68 లక్షల కోట్లు. 8.3 శాతం వృద్ధి చెందాయి. ⇒ ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు ఐదు నెలల కాలంలో జీఎస్టీ ఆదాయం 11% ఎగబాకి రూ.10.43 లక్షల కోట్లను తాకింది. గతేడాదితో పోలిస్తే వసూళ్లలో నిలకడకు ఇది అద్దం పడుతోంది. ⇒ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు జీఎస్టీ వసూళ్లే నిదర్శమని ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ పేర్కొన్నారు. రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో వినియోగదారుల వ్యయం మరింత పెరుగుతుందని, ఈ దన్నుతో వచ్చే రెండు నెలల్లో పన్ను వసూళ్లు మరింత పుంజుకుంటాయని ఆయన చెప్పారు.
యూపీఐకి రాఖీ ‘రక్ష’
న్యూఢిల్లీ: రాఖీ పండుగ దన్నుతో ఆగస్టులో యూపీఐ మాధ్యమం ద్వారా చెల్లింపు లావాదేవీలు సరికొత్త రికార్డులకు చేరాయి. గత నెలలో రూ. 29.8 లక్షల కోట్ల విలువ చేసే 2,451 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. గతేడాది ఆగస్టులో నమోదైన రూ. 24.85 లక్షల కోట్లతో పోలిస్తే విలువ దాదాపు 20 శాతం పెరిగింది. అలాగే, లావాదేవీల పరిమాణం 1,963 కోట్ల నుంచి దాదాపు 22 శాతం వృద్ధి చెందింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విలువపరంగా మే, జూలైలో నమోదైన రూ. 29.9 లక్షల కోట్లకు దాదాపు చేరువలో ఆగస్టు గణాంకాలు ఉన్నాయి. పరిమాణంపరంగా జూలైలో లావాదేవీలు 2,366 కోట్లుగా, జూన్లో 2,272 కోట్లుగా, మే నెలలో 2,320 కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్టులో రక్షా బంధన్ పండుగ సందర్భంగా బహుమతుల కింద చిన్న మొత్తాల చెల్లింపులు పెరగడమనేది, లావాదేవీల భారీ వృద్ధికి తోడ్పడినట్లు క్యాష్ఫ్రీ పేమెంట్స్ సహ వ్యవస్థాపకుడు రీజు దత్తా తెలిపారు. క్రెడిట్ ఆన్ యూపీఐలాంటి ఆప్షన్లు కూడా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే పండుగల సీజన్లో ట్రాన్సాక్షన్స్ మరింతగా వృద్ధి చెందే అవకాశాలున్నాయని నెట్వర్క్ పీపుల్ సరీ్వసెస్ టెక్నాలజీస్ (ఎన్పీఎస్టీ) సహ వ్యవస్థాపకుడు దీపక్ చంద్ ఠాకూర్ చెప్పారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా 2026 ఆగస్టు 25న ప్రవేశపెట్టిన ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్ తదితర 11 దేశాలకు విస్తరించింది. 2016–17లో రూ. 70 వేలు విలువ చేసే 1.78 కోట్ల లావాదేవీలు నమోదు కాగా.. తాజాగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 314 లక్షల కోట్ల విలువ చేసే 24,162 కోట్ల లావాదేవీలకు ఎగిశాయి.
బెర్త్ బుక్ చేసినా.. పడుకోకూడదు!
రైలు ప్రయాణంలో మిడిల్ బెర్త్, లోయర్ బెర్త్ ప్రయాణికుల నడుమ వివాదాలు రావడం సర్వసాధారణం. ఇటీవల సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఒక రైలులో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. సురేష్ అనే ప్రయాణికుడు లోయర్ బెర్త్ బుక్ చేసుకోగా, రమేష్ అనే వ్యక్తి మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రమేష్ తన మిడిల్ బెర్త్ను ఓపెన్ చేసి పడుకుంటానని పట్టుబట్టగా లోయర్ బెర్త్లో కూర్చోవాలనుకున్న సురేష్ దానికి నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి టీటీఈ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ రైల్వే నిబంధనలు స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తున్నాయి.రైల్వే నిబంధనలు - వేళలురాత్రి పూట 10:00 నుంచి ఉదయం 6:00 వరకు నిద్రపోయే వేళగా రైల్వే వర్గీకరించింది. ఈ సమయంలో మిడిల్ బెర్త్ ప్రయాణికుడు తన బెర్త్ను తెరచి పడుకునే పూర్తి హక్కు కలిగి ఉంటాడు.పగటి పూట అంటే ఉదయం 6:00 నుంచి రాత్రి 10:00 వరకు సీటింగ్ (కూర్చోవడానికి) కోసం కేటాయించారు. ఈ సమయంలో మిడిల్ బెర్త్ను తప్పనిసరిగా కిందకు దించి ఉంచాలి (ఫోల్డ్ చేయాలి). మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ ప్రయాణికులు లోయర్ బెర్త్పై కూర్చోవడానికి అవకాశం ఇవ్వాలి.పైన పేర్కొన్న ఉదాహరణలో మధ్యాహ్నం 2 గంటలకు మిడిల్ బెర్త్ తెరవాలని రమేష్ కోరడం రైల్వే నిబంధనలకు విరుద్ధం. సురేష్ ఆ సమయంలో లోయర్ బెర్త్పై కూర్చునే హక్కు కలిగి ఉంటాడు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మిడిల్ బెర్త్ ప్రయాణికుడు పడుకోవాలని భావిస్తే అది లోయర్ బెర్త్ ప్రయాణికుడి పరస్పర అంగీకారంతో మాత్రమే జరగాలి.అలాగే, గర్భిణులు, వయోవృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న ప్రయాణికులకు అనధికారికంగా సీట్లు సర్దుబాటు చేసుకోవడంలో తోటి ప్రయాణికులు మానవత్వంతో సహకరించాలని రైల్వే కోరుతోంది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే టీటీఈ దృష్టికి తీసుకెళ్తే ఆయన నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరిస్తారు. ప్రయాణికులు ఈ ప్రాథమిక నిబంధనలు తెలుసుకోవడం వల్ల అనవసర గొడవలను నివారించి సుఖవంతమైన ప్రయాణాన్ని సాగించవచ్చు.ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే..
ఫ్యామిలీ
47 ఏళ్ల వయసులో చెప్పులు లేకుండా మారథాన్..గెలిచిన అమ్మ!
తల్లి తన పిల్లల కోసం ఏదైనా చేయగలదు అని మరోసారి రుజువైంది. ఓ తల్లి తన కుమార్తెల కోసం మారథాన్లో పాల్గొంది. కనీసం అనువైన డ్రెస్, షూలు లేకపోయినా..పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయం అన్నట్లుగా రేసులోకి దిగింది. మరి ఆ తల్లి గెలిచిందా అంటే..మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగైకి చెందిన వంటమనిషి రమాబాయి చెప్పలు లేకుండా మారథాన్లో పరిగిఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచేలా గెలిచింది. ఓ అమ్మ తలుచుకుంటే పిల్లల కోసం ఎంతటి అనితర సాధ్యమైనదైనా.. చేధించగలదని ప్రపంచానికి చూపించింది. ఇంతలా మారథాన్లో పాల్గొని గెలిచి తీరాల్సినంత అవసరం ఆమెకు ఎందుకంటే..ముంబైలో జరిగిన ఒక ప్రమాదంలో భర్తని కోల్పోయింది రమాబాయి. దాంతో తన ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచుతూ వారి బాగోగులను చూసుకుంటూ వచ్చింది. అయితే తన పిల్లలకు మంచి చదువు అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనేదే ఆమె ప్రగాఢ ఆకాంక్ష. అయితే ఆర్థిక వనరులు ఏమాత్రం సహకరించడం లేదామెకు. అయినా సరే ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అంతేగాదు కుమార్తె చదివే చోట అంబాజోగైలోని అకాడమీలో వంటమనిషిగా పనిలో చేరి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోందామె. ఆమె అకాడమీలో వంట చేస్తూ కాలం వెళ్లదీస్తుండగా, ఆమె కుమార్తెలు చదువులు, పోటీపరీక్షలపై దృష్టి సారిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా..ఇద్దరు కుమార్తెలకు మెరుగైన భవిష్యత్తు అందించాలనే పట్టుదలతో రమాబాయి ముందుకు సాగుతోంది. ఆ క్రమంలోనే ఒక స్థానిక సంస్థ నిర్వహించిన 'అమృత్ దౌడ్' మారథాన్లో పాల్గొంది రమాబాయి. ఆ మారథాన్లో అంతా ట్రాక్సూట్లు, షూలు ధరించిన యువ పోటీదారుల మధ్య సాధారణ చీర కట్టుకుని పాల్గొంది రమాబాయి. ఆమె మొదట చెప్పులు వేసుకుని పరుగుని ప్రారంభించింది. కానీ పరిగెత్తేటప్పుడు అవి జారిపోతుండటంతో వాటిని తీసేయక తప్పలేదు. దాంతో ఆమె చేతిలో చెప్పులు పట్టుకుని చీరను జాగ్రత్తగా సర్దుకుంటూ..చల్లని రోడ్డుపై పరిగెత్తిందామె. కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇదర పోటీదారుల కంటే వేగంగా దూసుకుపోయి..ముగింపు రేఖను చేరుకుంది. రమబాయి అచంచలమైన పట్టదలను చూసి ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందించారామెను. రేసు తదనంతరం రమాయి మాట్లాడుతూ..ఈ పోటీలో చాలామంది పాల్గొన్నారని తెలసుని కానీ బహుమతి గెలవాలనే పట్టుదలతో ఉన్నానని చెప్పారామె. పరిగెత్తేటప్పుడు తాను నిరంతరం తన కుమార్తెల గురించి, వారి భవిష్యత్తునే ఆలోచిస్తూ పరుగు ప్రారంభించానని అన్నారామె. మరి గెలిచిన సోమ్ముని ఏం చేస్తావంటే..వారి పుస్తకాలు కొనడానికి ఉపయోగిస్తానని చెప్పింది. అంతేగాదు మరోఅద్భుతం ఏంటంటే ఇదే మారథాన్లో పాల్గొన్న ఆమె కుమార్తె పూజా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. తానే తల్లిని పాల్గొనమని ప్రోత్సహించానని, కానీ ప్రథమ స్థానంలో నిలుస్తుందని అస్సలు ఊహించలేదని ఆనందంగా చెబుతోంది. ఇక పూజా పోలీస్ రిక్రూట్మెంట్ కోసం సిన్నద్ధమవుతోంది. ఇక ఆమె సోదరి బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతంది. చాలా కఠినమైన పరిస్థితులను తట్టుకుని మమ్మల్ని ఎంతో ప్రయాస పడి పెంచిందని చెబుతోంది ఆమె కూతురు పూజా. అంతేగాదు పూజా అంకితభావానికి ముగ్ధుడైన అకాడమీ డైరెక్టర్ ఆమె ఫీజును కూడా మాపీ చేశారు. కాగా, రమాబాయి కుటుంబం గతంలో వ్యవసాయ పనులపై ఆధారపడి జీవిస్తుండేది. అయితే పిల్లల చదువుకి సాయం అందించేందుకు ఇలా కూతురి అకాడమీలోనే చేరి వంటమనిషిగా పనిచేస్తోందామె. ఈ తల్లికి కుమార్తెల కలను నెరవేర్చడానికి మారథాన్ను ఒక అవకాశంగా ఉపయోగించుకుంది. పైగా ఆమె పోటీలో వేసిన ప్రతిఅడుగు అపురూపమైనది. ఎందుకంటే ఆ రేసులో వేసిన అడుగులన్నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని అందించాలనే ఆశతో వడివడిగా నడిచినవే. View this post on Instagram A post shared by Avani (@avaniarya) (చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..)
ఏడు రోజుల్లో ఐదు కిలోలు .? నో జిమ్..జస్ట్ ఇలా చేస్తే చాలు..
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన విధానంలో వ్యాయామలు, స్ట్రిక్ట్ డైట్ని అనుసరించడం అతి పెద్ద సవాలు చాలామందికి. పైగా కొన్ని రోజులు చేసి, ఆ తర్వాత స్కిప్ చేసేస్తుంటారు. నిలకడగా చేయాలంటే సమయం ఉండక ఇబ్బంది పడుతుంటారు. అదీగాక ప్రస్తుతం చాలామటుకు ఉద్యోగాలు గంటలు గంటలు పనిచేసే డెస్క్ ఉద్యోగాలే. బాగా తినకపోయినా..లావుగానే ఉండటం, పోనీ వర్కౌట్లు చేద్దామా అంటే సమయం కుదరక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ల కోసం సులభంగా ఎంజాయ్ చేస్తూ చేసే వ్యాయామాలు నెట్టింట ట్రెండ్గా మారాయి. వాటిని వర్కౌట్లు అనేకంటే అందమైన డ్యాన్స్ అనొచ్చు. చూడటానికే కాదు, చేయడానికి కూడా చాలా అనువైనవి, సులువైనవి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా వర్కౌట్లు అంటే..జస్ట్ నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో కనిపిస్తున్న వర్కౌట్లు చేస్తే ఒక్క వారంలో ఐదు కిలోలు తగ్గడం ఖాయం అట. ప్రస్తుతం ఈ వ్యాయామాలు జపాన్లో బాగా ట్రెండ్గా మారింది. డంబెల్క్ కూడ పక్కనే పడేసి ఇవి ప్రయత్నించండి అని పిలుపునిస్తున్నారు. పైగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే శరీరానికి మంచి కదలిక, కొలస్ట్రాల్ని కరిగించి ఫిట్గా ఉండేందుకు బెస్ట్ వర్కౌట్లు కూడా అని అంటున్నారు. చాలామంది నెటిజన్లు దీన్ని కొట్టిపారేస్తున్నా..జస్ట్ నాలుగు నిమిషాలు ఎంజాయ్చేస్తూ వేగంగా చేసేవి ప్రయత్నిస్తే నష్టమేమి ఉండదు కదా అని అడుగుతున్నారు. పైగా ఏ వ్యాయామమైనా..ఆరోగ్యకరమైనదే తప్ప హానికరం అంటూ ఉండదు. పైగా ఇవి కష్టతరమైనవి కాదు ఎవ్వరైనా సులభంగా ఆడుతూ పాడుతూ చేసేవే కదా ట్రై చేస్తే పోలే అని సపోర్టు చేస్తూ మాట్లాడటం విశేషం. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని చూసి..చకచక నాలుగే నాలుగు నిమిషాల్లో చేసి స్లిమ్గా మారిపోండి మరి..!.영상은 길이는 고작 4분.일주일동안 매일 루틴으로 하면 -5kg이 빠진다는 일본 다이어트 영상.지금 일본에서 엄청난 유행임.마운자로 집어 던지고 이거하자.부작용 따위 없다. pic.twitter.com/J5ewOHbnui— rrace🇰🇷 (@junssi1982) August 31, 2026 (చదవండి: శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!)
పదే.. పదే..చేసిందే..? ఆ వ్యాధి తీరు అలానే ఉంటుందా?
ఓ ఆలోచన వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంది. ‘అబ్బా... ఆ ఆలోచన ఎందుకొచ్చిందో... రాకపోతే బాగుండు’ అని మనసు చెబుతుంది. కానీ ఎంత సముదాయించినప్పటికీ అదే అదే ఆలోచన పదే పదే వస్తుంటుంది. ‘రాకూడదని ఆలోచన కదా ఇదీ, మళ్లీ మళ్లీ ఎందుకొస్తోంది?’ అనే ఆందోళన మొదలవుతుంది. ఆ ఆందోళనతో... ఆలోచనా... అలాగే ఆ ఆలోచనతో ఆందోళన... ఇదో విష వలయంలా వచ్చేస్తూ ఉంటాయి. దాంతో మనసుపై మరింత ఒత్తిడి కలుగుతుంది. మరింత పర్ఫెక్ట్గా చేస్తే దాంతో ఆ ఆందోళన తప్పుతుందేమో అని చేసిందే చేస్తుంటారు. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ, ఆందోళన పడుతూ, చేస్తున్న పనే మళ్లీ మళ్లీ చేస్తూ చేస్తూ విసిగిపోతుంటారు. అలసిపోతుంటారు. అయినా ఆ పరంపర ఆగదు. అలాంటి మానసిక రుగ్మత పేరే ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’. ఈ పేరుకంటే ‘ఓసీడీ’ అనే మాట చాలామందికి అర్థమవుతుంది. అసలీ జబ్బు తీరుతెన్నులేమిటో, అలా పదే పదే చేస్తున్న పనులూ, ఆలోచనలూ ఎన్ని రకాలుగా వస్తుంటాయో, వాటిని అధిగమించడమెలాగో తెలిపేదే ఈ కథనం.గతంతో పోలిస్తే ఇటీవల మానసిక వ్యాధులపై అవగాహన పెరిగి ఓసీడీ చికిత్స కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మహిళలూ, పురుషులూ ఇద్దరిలో కనిపించే ఈ వ్యాధి వ్యాప్తినీ, విస్తృతిని చూస్తే... సాధారణంగా 0.6 నుంచి 1 శాతం మందిలో కనిపించే ఈ మానసిక రుగ్మత విద్యార్థి వర్గాల్లో (స్టూడెంట్స్ గ్రూప్)లో అత్యధికంగా 3.3 శాతం కనిపిస్తుండటం ఆందోళనకరం. అందుకే దీని గురించి సమగ్రంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవసరం కూడా.కుటుంబ సభ్యులకూ వేదనే... ఒక ఓసీడీ బాధితుడి వల్ల కేవలం అతడు మాత్రమే కాదు... వాళ్ల కుటుంబ సభ్యులంతా ఇబ్బంది పడుతుంటారు. తాము ఎంత సముదాయించినప్పటికీ వినకుండా... బాధితుడు పదే పదే అదే పని చేస్తుండటంతో వాళ్లు కూడా ఎంతో వేదనకు గురవుతుంటారు. తాము చేస్తున్న పని కుటుంబ సభ్యులనూ, బంధువులనూ, మిత్రుల్నీ ఇలా ఎంతోమందిని ఇబ్బంది పెడుతోందని గ్రహించాక వాళ్లలో తమ మీద తమకే కోపం పెరుగుతుంది. నిరాశ, నిస్పృహ పెరుగుతుంటాయి. అయినప్పటికీ ఈ పనుల పరంపరం అలా కొనసాగుతూనే ఉంటుంది. అలా తామూ, కుటుంబసభ్యులూ, మిత్రులూ వేదనకు గురవుతుంటారు.ఓసీడీతో మూఢ నమ్మకాలూ పెరిగే అవకాశం... మామూలుగానే మన సమాజంలో మూఢ నమ్మకాలు చాలా ఎక్కువ. మనం ఒక పని లేదా పూజ లేదా ప్రార్థన లేదా ఇంకేదైనా రిట్యువలిస్టిక్ క్రతువు చేయడం వల్ల మనకు లాభం జరుగుతుందనే సెంటిమెంట్ ఉందనుకుందాం. ఇక ఆ పని/ పూజ / రిట్యువల్ను చేయడం మొదలు పెడతారు. ముందు చేసిన పని సక్రమంగా చేయలేదేమో అంటూ మళ్లీ మళ్లీ కొనసాగిస్తారు. ఇలా ఓసీడీతో ఉన్నవారిలో రిట్యువలిస్టివ్ బిహేవియర్ పెరుగుతుంది. దానివల్ల చాదస్తం ఎక్కువైనట్లు కనిపిస్తుంది.అవగాహన ఉన్నవారికీ... లేనివారికీ ఇబ్బందే... ఓసీడీ ఉన్నవారిలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. కొందరికి తాము చేస్తున్న పని అంత సరికాదనీ, దాని కారణంగా ఎంతో సమయం వృథా అవుతోందని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దాంతో తమ ఇబ్బందిని అధిగమించడానికి నిపుణుల సహాయం తీసుకుంటారు. అయితే మన సమాజంలోనే చాలామందికి ఇది ఒక తీవ్రమైన జబ్బనీ, దీనికి చికిత్స ఉందనే అవగాహన చాలా తక్కువ. ఇలాంటి ఓ జబ్బు ఉందన్న విషయం కొంతమందికి తెలియనే తెలియదు. అలా తెలియక΄ోవడంతో చేసిన పనే చేస్తూ, తమకు ఇబ్బంది కలిగించే ఆ ఆలోచనలను అదేపనిగా కొనసాగిస్తూ తమను తాము ఇబ్బంది పెట్టుకుంటూ జబ్బు తీవ్రతను పెంచుకుంటారు. సాధారణంగా ఇది అవగాహన లేనివారిలో కనిపించే పరిస్థితి.లక్షణాలు... మన సమాజంలో సాధారణంగా కడిగిన దాన్నే కడగటం అనే లక్షణంతో కనిపించే ఓసీడీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం కడగడానికీ, పరిసరాలనూ, వస్తువులనూ శుభ్రంగా ఉంచడానికి మాత్రమే కాకుండా అనేక రూపాల్లో వ్యక్తమవుతుంటుంది. వాటిలో కొన్ని చాలా ఆసక్తికరంగానూ, విచిత్రంగానూ అనిపిస్తుంటాయి. అలాంటి కొన్నింటిని చూద్దాం. తీవ్రమైన అబ్సెషన్ : కొందరిలో కొన్ని అంశాల పట్ల తీవ్రమైన భయం ఉంటుంది. ఎవరైనా మనకు హాని చేస్తారేమోననే ఆలోచన వస్తుంటుంది. అది అర్థం లేని ఆలోచన అని తెలిసినప్పటికీ ఆ తరహా ఆలోచనలు అదేపనిగా వస్తూ ఒత్తిడిని పెంచేస్తాయి. దాంతో ఆందోళనా పెరుగుతుంది. మనం మన సంస్కారం కారణంగా ఒక పని ఎప్పటికీ చేయబోమని తెలిసినప్పటికీ అది చేసేస్తామేమో అన్న ఆందోళన మనసును కుదురుగా ఉండనివ్వదు. ఉదాహరణకు మనం ఎప్పటికీ దొంగతనం చేయం. లేదా అసభ్యంగా ప్రవర్తించబోం. కానీ ఆ పని చేస్తామేమో అనే ఆలోచన వచ్చి అది మనలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. కంటామినేషన్ అబ్సెషన్ : దేనినైనా తాకడం వల్ల మనకు జబ్బు వస్తుందేమో అనే ఆలోచన మనల్ని కుదిపేస్తుంది. ఉదాహరణకు మనం మూత్రవిసర్జన, మలవిసర్జనలు శుభ్రమైన చోటనే చేసినప్పటికీ.. అక్కడ అపరిశుభ్రత ఉందేమో... ఆ అపరిశుభ్రమైన ప్రదేశంలో విసర్జన చేసినందుకు ఏవైనా వ్యాధులు వచ్చేస్తాయేమోననే ఆందోళన కలుగుతుంది.సెక్స్పరమైన అబ్సెషన్ : మనలోని అంతర్గత సెక్స్ ఆలోచనలు, మనం రాకూడదని కోరుకుంటున్న సెక్స్ ఆలోచనలు రావడమే కాకుండా... మనమెంతో గౌరవంగా, పూజనీయంగా చూసేవాళ్ల పట్ల చెడు ఆలోచనలు వస్తూ... అవి ఎంత నియంత్రించుకుందామనుకున్నా ఆగకుండా అదేపనిగా కొనసాగుతూ మనసును ఒత్తిడికీ, తీవ్రమైన అపరాధభావనకూ గురిచేస్తుంటాయి. దేవుళ్లు, దేవతల గురించి ఆవాంఛిత ఆలోచనలు : కొందరిలో దేవుళ్లు, దేవతల గురించి రాకూడని ఆలోచనలు వస్తుంటాయి. దాంతో తాము ఏదైనా తీవ్రమైన పనికి ఒడిగడుతున్నామేమో అన్న ఆందోళన పెరిగిపోయి వారు మరింత ఉద్విగ్నతకూ, భయానికీ, అపరాధభావనకూ గురవుతుంటారు. పనికిరాని వస్తువులను సేకరించి దాచడం : కొందరు తమకు ఏమాత్రం ఉపయోగపడని వస్తువులను దాచుకుంటూ ఉంటారు. దాంతో తమకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని తెలిసినా వాటిని వదిలేయలేరు. పారేయలేరు. సిమెట్రీ / ఎగ్జాక్ట్నెస్ : కొందరు తాము ఆఫీస్లో చేసే పనుల్లో గానీ లేదా ఇతర పనుల్లో గానీ పూర్తి స్థాయి పర్ఫెక్షన్ ఇంకా సాధించలేదనే అభిప్రాయంతో మరింత పర్ఫెక్షన్ కోసం చేసిందే చేస్తూ, మెరుగులు దిద్దుతూ సమయం వృథా చేస్తుంటారు. సొమాటిక్ అబ్సెషన్ : ఈ సమస్య ఉన్నవాళ్లలో తమకు ఏదైనా జబ్బు ఉందేమో, తమ దేహంలోనో, అవయవాల్లో ఏదైనా లోపం ఉందేమో అనే అనుమానం వాళ్లను వెంటాడుతూ ఉంటుంది. దాంతో వాళ్లు అదేపనిగా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, డాక్టర్లు సమస్య ఏదీ లేదని చెప్పాక కూడా చేయించిన పరీక్షలే మళ్లీ మళ్లీ చేయిస్తూ... డబ్బూ, సమయం వృథా చేసుకుంటారు.కంపల్షన్ పనుల జాబితాలో ఇవి కొన్ని... కడిగిందే మళ్లీ మళ్లీ కడగడం తాళం వేశాక అది సరిగ్గా పడిందా లేదా అని మాటిమాటికీ చూడటం, స్టవ్ ఆర్పేశారా లేదా అన్ని మళ్లీ మళ్లీ వెళ్లి చూస్తుండటం, తాము చేసే పని ఎవరికీ హాని చేయకూడదంటూ, దాన్ని కన్ఫర్మ్ చేసుకోడానికి మళ్లీ మళ్లీ చేసిన పనే చేయడం (ఉదాహరణకు పారేసిన పాత బ్లేడు ఎవరికైనా హాని చేస్తుందని అనిపించి, దాన్ని ఎవరికీ తగలని చోట పడేశామా లేదా అని పదే పదే చూస్తూ, దాన్ని ఎవరికీ అందనిచోటకు నెడుతూ ఉండటం), రాసినదాంట్లో ఏదైనా తప్పు వచ్చిందేమో అని మళ్లీ మళ్లీ రాస్తూ ఉండటం, లెక్కపెట్టిన డబ్బుల్ని మళ్లీ మళ్లీ లెక్కపెట్టడం లాంటివి.ఓసీడీ కారణంగా దుష్ప్రభావాలివి.. ఓసీడీ వల్ల చాలామందిలో ఒత్తిడీ, ఆందోళనా పెరుగుతాయి. నిరాశ, నిస్పృహలు ఫ్రస్ట్రేషన్ రూపంలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. తమపై తమకు నమ్మకమూ, ఆత్మవిశ్వాసం తగ్గి΄ోతాయి. రోజువారీ పనుల్లో సమయం ఎంతగానో వృథాకావడంతో సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది. అది పనిలో, జీవితంలోని నాణ్యతనూ, డబ్బునూ, కుటుంబసభ్యులూ, బంధువులూ, స్నేహితులతో తమ మానవ సంబంధాలనూ తీవ్రంగా దెబ్బతీస్తుంది.ఓసీడీకి కారణమిది... మెదడులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మెదడు అనేది ఒక కంప్యూటర్ అనుకుంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు... ఆ ఆలోచనను ఆపేయడానికి ఒక స్విచ్ / సర్క్యూట్ ఉంటుంది. అది పనిచేయనప్పుడు అదే ఆలోచన పదే పదే వస్తూ ఆ ఆలోచన వల్ల వచ్చే పనిని కొనసాగిస్తుంటారు. కొన్ని జన్యుపరమైన మార్పులతో ఇది కుటుంబంలోనూ, వంశపారంపర్యంగా కొందరిలో మెదడులోని సర్క్యూట్స్లో లోపాలు కనిపిస్తుంటాయి.నిర్ధారణ... ఓసీడీ జబ్బును వారిలో కనిపించే లక్షణాల ద్వారానూ, బాధితుల పరిస్థితిని బంధువులు, స్నేహితులు చెప్పడం ద్వారా తెలుసుకోవచ్చు.చివరిగా... ఓసీడీ లక్షణాలు కనిపించినప్పుడు అవి ముదిరే వరకు నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే... ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇటీవల ప్రజల్లో కొంత అవగాహన పెరగడంతో ఈ జబ్బు తగ్గడంలో గణనీయమైన మెరుగుదల కనిపించడమన్నది చాలా సానుకూల అంశం. అసలు ఓసీడీ అంటే ఏమిటంటే...‘ఓసీడీ’ సంక్షిప్త రూపంలోని అక్షరాల్లో... ‘ఓ’ అంటే అబ్సెషన్ అనీ, ‘సీ’ అంటే కంపల్షన్ అనీ, ‘డీ’ అంటే డిజార్డర్ అనే పదాలను సూచిస్తాయి. ఇందులో ‘అబ్సెషన్’ అంటే... ఓ ఆలోచన మనసులోకి వచ్చాక అది... పదే పదే వస్తుండటం. ఆ ఆలోచనను ఎంతగా వదిలించుకోవాలని చూసినా ఆగకుండా మళ్లీ మళ్లీ అదే ఆలోచన రావడం. ఈ ఆలోచన అన్నది ఒక చిత్రం (ఇమేజ్) కావచ్చు లేదా మనం కోరుకోని అంశం కావచ్చు. దాంతో మనసులో తీవ్రమైన అసౌకర్యం, ఇబ్బంది, మనసు మీద ఒత్తిడి పెరుగుతాయి. ఇక కంపల్షన్ (సీ) అంటే... ఆ ఆలోచనను వల్ల వచ్చే ఆందోళనను తగ్గించడానికి తప్పనిసరిగా పదే పదే చేసే పనిని ‘కంపల్షన్’ అంటారు. దాంతో ఒక పనిని మళ్లీ మళ్లీ చేయాల్సి రావడంతో సమయం వృథా అవుతుంది. విసుగు పడుతుంది. అలసిపోయినప్పటికీ ఏదో లోపముందనే ఆలోచనతో... మళ్లీ మళ్లీ పనిచేసేలా ఆ కంపల్షన్ను పురిగొల్పుతుంది. ఇందుకు పాపులర్ ఉదాహరణ ఏమిటంటే.., ఎవరికైనా తమ చేతులు శుభ్రంగా లేవని అనిపించే ఓ ఆలోచన మనసులోకి వస్తే... ఇక వాటిని శుభ్రపరిచేందుకు అతడు పదే పదే చేతుల్ని కడుగుతుంటాడు. ఎంత కడిగినా ఇంకా శుభ్రం కాలేదనే ఆలోచనతో కడిగిన చేతుల్నే మళ్లీ మళ్లీ కడిగిస్తూ ఉంటుంది. ఆ విధమైన ఆలోచనలు... డిప్రెషన్లో కనిపించే ఆత్మహత్యాధోరణులు ఓసీడీలోనూ కనిపిస్తాయి. కొన్ని రకాల ఆలోచనలు అదేపనిగా వస్తుండటంతో అపరాధ భావన (గిల్ట్), ఆందోళనతో వీళ్లలో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు (సూసైడల్ టెండెన్సీస్) పెరుగుతాయి.చికిత్స...ఓసీడీ చికిత్సలో బిహేవియర్ థెరపీ లేదా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో పాటు రెస్పాన్స్ ప్రివెన్షన్ అనే ప్రక్రియలతో బాధితుల్లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. తాము భయపడే అంశాలకే... బాధితుడిని నెమ్మది నెమ్మదిగా గురిచేస్తూ... వాటి వల్ల అతడికి ఎలాంటి హానీ ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడమనేది ఈ చికిత్సల్లో అవలంబించే ఒక పద్ధతి. ఈ సమస్యకు కొన్ని మందులూ అందుబాటులో ఉన్నాయి. ఈ మందులతో దుష్ప్రభావాలు ఉంటాయనే అపోహలు చాలామందిలో ఉన్నాయి. వాస్తవానికి అవి ఇతర మందుల్లాగానే చాలా సేఫ్. కానీ అవగాహన లోపం వల్ల చాలామంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఎస్ఎస్ఆర్ఐస్, ట్రైస్లైక్లిక్స్ వంటి మందుల్ని ఓసీడీ తగ్గించడానికి వాడుతుంటారు. అయితే ఇతర ఔషధాల్లాగే.. ఈ మందుల్ని డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి. డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై, సీనియర్ సైకియాట్రిస్ట్నిర్వహణ యాసీన్ (చదవండి: శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!)
కోకోపోనిక్స్ కూరగాయలు
ఎల్నినో తీవ్ర ప్రభావంతో ఆరుబయట పొలాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగు పెను సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ను నగర/పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో చేర్చాల్సిన ఆవశ్యకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) అభివృద్ధి చేసిన ‘కోకోపోనిక్స్’ బహుముఖ ప్రయోజనాలను అందించే అత్యాధునిక అర్బన్ వ్యవసాయ పద్ధతిగా రూపుదాల్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, శిక్షణ ఇస్తున్న ఐఐహెచ్ఆర్ కృషి ఫలితంగా ఇప్పటికే బెంగళూరు తదితర ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలను మరింత శాస్త్రీయంగా కొందరు సాగు చేస్తున్నారు. ఆరోగ్యాభిలాషులైన మిద్దెతోటలు, ఇంటిపంటల సాగుదారులతో పాటు మహానగరాల్లో, నగర పరిసరాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల నిర్వహణ సంఘాల ద్వారా పార్కులు, ప్రభుత్వ/ప్రైవేటు స్థలాల్లో కచ్చితమైన ఫలితాలు లక్ష్యంగా సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకాన్ని మరింత విస్తృతంగా చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ దిశగా పాలకులు యువతను, మహిళా సంఘాలను, విశ్రాంత ఉద్యోగులను అర్బన్ అగ్రికల్చర్లో నిమగ్నం చేసే దిశగా విధాన నిర్ణయాలు తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ‘కోకోపోనిక్స్’ ప్రయోజనాలు, ప్రత్యేకతలు, యోగ్యతలేమిటో ఈ కథనంలో పరిశీలిద్దాం...సాంప్రదాయ సాగులో మట్టి, ఎరువుల మిశ్రమంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుతారు. అయితే, మట్టి లేకుండానే మొక్కలు బలంగా పెరిగేలా చేసే సాయిల్ లెస్ సాగు పద్ధతి కోకో΄ోనిక్స్. కొబ్బరి పీచు నుంచి తయారయ్యే కొబ్బపొట్టే కోకోపీట్. మట్టికి బదులుగా దీన్ని కుండీలు, మడుల్లో విస్తృతంగా ఉపయోగించే ఒక సేంద్రియ పదార్థం ఇది. సిల్పాలిన్ బ్యాగ్లలో శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎరువును నింపి, నిర్ధారిత పరిమాణాల్లో వివిధ రకాల సూక్ష్మ, స్థూల పోషకాలతో కూడిన ద్రావణాన్ని డ్రిప్ ద్వారా అందించడమే ఈ పద్ధతిలో ప్రత్యేకత. వాణిజ్య స్థాయిలో నాణ్యమైన, ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సులువుగా పండించేందుకు అవసరమైన శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువు(అర్కా ఫెర్మెంటెడ్ కోకోపిట్)ను, పోషకాలతో కూడిన ద్రావణాన్ని (అర్కా సస్యపోషక్ రస్ను) రూపొందించిన ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులోకి తెచ్చారు.తక్కువ ఖర్చు.. తక్కువ శ్రమకోకో΄ోనిక్స్ పద్ధతిలో అతి తక్కువ పెట్టుబడితో రకరకాల పండ్లు, కూరగాయలు, ఔషధ, పూల పంటలను పండించవచ్చని బెంగళూరులోని ఐసీఏఆర్–ఐఐహెచ్ఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జి. సెల్వకుమార్ తెలిపారు. మట్టి ఆధారిత సాగుతో పోలిస్తే, కోకో΄ోనిక్స్ పద్ధతిని టెర్రస్లు/బాల్కనీలలో తక్కువ శ్రమతో చేపట్టవచ్చు. సూర్యరశ్మి తక్కువగా ఉండే బాల్కనీలలో నీడను ఇష్టపడే ఔషధ మొక్కలు, ఆకుకూరలను సులభంగా పెంచటం సాధ్యమవుతుందన్నారాయన. రోజుకు 30–45 నిమిషాలు చాలుసాధారణంగా ఎక్కువ మంది వినియోగించే ఆకుకూరలు, కూరగాయలను ఆరు బయట నేల మీద, గచ్చు మీద, మేడ మీద లేదా గ్రీన్/ పాలీహౌస్లలో గ్రోబ్యాగ్స్లలో పెంచే సాయిల్ లెస్ సాగు పద్ధతులపై ఐఐహెచ్ఆర్ ఒక రోజు శిక్షణ ఇస్తోంది. ఆకు కూరలు, టమాటా, మిరప కాయలు, క్యాబేజీ, దోసకాయలు, ఫ్రెంచ్ బీన్స్, బఠానీలు, పొట్లకాయలు, గుమ్మడికాయలతో పాటు విదేశీ రకాలైన రంగు క్యాబేజీ, జుకిని వంటి రకాలపై ఐఐహెచ్ఆర్లో మట్టి రహిత సేద్య పద్ధతిలో గ్రోబ్యాగ్స్లో ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలు సాధించామని ఐఐహెచ్ఆర్ సీనియర్ శాస్త్రవేత్త డా. డి. కలైవనన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కూరగాయ మొక్కల పెరుగుదలకు అవసరమైన అన్ని పోషక ద్రావణాలను సమతులంగా, సకాలంలో అందించడం వల్ల పోషక లోపం లేని కూరగాయలను, ఆకుకూరలను పిండించగలుగుతున్నామని ఆయన అన్నారు. అనేక రకాల స్థూల, సూక్ష్మ పోషకాలను ద్రావణం ద్వారా అందిస్తుండగా, మరికొన్ని పోషకాలు కొబ్బరి పొట్టు ఎరువు ద్వారా, మరికొన్ని నీటి ద్వారా అందుతాయన్నారు. ఈ పద్ధతిలో కూరగాయల పెంచటానికి రోజుకు 30–∙45 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఉద్యోగం చేసే దంపతులకు ఇది అనుకూలంగా ఉంటుందన్నారు.కోకోపిట్ ఎంత వాడాలి?గ్రో బ్యాగ్లో శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువును నింపి.. విత్తనాలు లేదా మొక్కలు నాటి పోషకాలతో కూడిన ద్రవాన్ని డ్రిప్ ద్వారా అందించాలి. 12“12 అంగుళాలు లేదా 15“15 అంగుళాల సైజు గ్రో బ్యాగ్లో 8 నుంచి 10 కిలోల వరకు శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువును వాడాల్సి ఉంటుంది. వంగ, టమాటా, మిరప, చిక్కుడు, బఠాణీ, బెండ మొక్కలతోపాటు.. సొర, బీర, ఆనప, గుమ్మడి వంటి తీగ జాతి మొక్కల్ని సైతం ఈ సైజు గ్రోబ్యాగ్లో ఒక్కొక్కటి పెంచి, వాణిజ్య స్థాయిలోనూ మంచి దిగుబడులు పొందవచ్చని డా. కలైవనన్ తెలిపారు. అదేవిధంగా, ఒక అడుగు ఎత్తు, అడుగు వెడల్పు, 4 అడుగుల పొడవు ఉండే సిల్పాలిన్ గ్రో బెడ్లో అయితే 45 కిలోల శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు ఎరువు ΄ోసి కూరగాయలు పెంచుకోవచ్చన్నారు. కొబ్బరి పొట్టు ఎరువు ఒక్కసారి కొని వేసుకుంటే చాలు. ప్రతి పంట పూర్తయ్యాక 5–10 శాతం కొబ్బరి పొట్టు ఎరువు వేసి, కలియదిప్పి, కొత్త పంటను వేసుకోవచ్చు. కొబ్బరిపొట్టు కొన్ని పంటల తర్వాత పూర్తిగా చివికి చక్కని ఎరువుగా మారుతుంది. పాతదాన్ని మార్చాల్సిన అవసరం ఉండదని డా. కలైవనన్ స్పష్టం చేశారు. పది రోజులు ముందే పూత, కాతవాణిజ్య స్థాయిలో మట్టి లేని సేద్యంలో కూరగాయలు, ఆకుకూరలను నేల మీద గానీ, మేడ/గచ్చు మీద గానీ గ్రోబ్యాగ్స్లో సాగులో మంచి దిగుబడులు తీయవచ్చని డా. కలైవనన్ తెలిపారు. జుకిని, ఆకుకూరలు, గ్రీన్ క్యాబేజీ, కీరదోస, బఠాణీ వంటివి మట్టిలో కన్నా కోకోపిట్లోనే ఎక్కువ దిగుబడి వచ్చింది. బీన్స్, చిక్కుడు, మిరప, కలర్ క్యాబేజీ వంటి పంటల్లో మంచి దిగుబడులు వచ్చాయన్నారు. అన్ని పంటల్లోనూ పది రోజులు ముందే పూత, కాత రావటం గమనించామన్నారు. కూరగాయల రకాన్ని బట్టి 1 రూపాయి పెట్టుబడికి రూ. 2–11 వరకు ఆదాయం వస్తుందన్నారు. ఇందులో కలుపు సమస్య అసలు ఉండదని, భూమిని దుక్కి చేసే ఖర్చు కూడా ఉండదన్నారు. నీటిలో కలిపే పోషకాలు అత్యంత శుద్ధమైనవి. ఇవి నూటికి నూరు శాతం నీట కరిగి మొక్కల వేర్లకు చప్పున అందుతాయి. మట్టిలో వేసిన రసాయనిక ఎరువుల మాదిరి 50–75% వరకు ఏదో ఒక రకంగా వృథా కావటం.. భూమిని, నీటిని కలుషితం చేయటం అనే సమస్యలు ఇందులో ఉండవని ఆయన అన్నారు. మట్టి లేని సేద్యంలో పండిన కూరగాయలు, ఆకుకూరలు రుచిగా, ఎక్కువ కాలం తాజాగా ఉంటాయన్నారు. సారవంతమైన భూమి అందుబాటులో లేని చోట్లలో, నగరాలు, పట్టణాల్లో మిద్దెలపైన, గేటెడ్ కమ్యూనిటీల్లో ఐఐహెచ్ఆర్ సూచిస్తున్నట్లు మట్టి లేని సేద్యం ఎంతో ఉపయోగకరం. సులభంగా కూరగాయల సాగుస్థలం పరిమితంగా ఉండే మెట్రో నగరాల్లో సేంద్రియ కూరగాయల తోట పెంచటం ఒక సవాలుగా ఉంటుంది. సిమ్లాకు చెందిన హర్ప్రీత్ కౌర్ బెంగళూరులోని తన అపార్ట్మెంట్లో ఒక బాల్కనీ కూరగాయల తోట పెంచాలని కలలు కన్నారు. ఆమె తన బాల్కనీలో వివిధ రకాల మొక్కలను పెంచటానికి ప్రయత్నించారు. కానీ, కుండీల్లో మట్టి గట్టిపడటం, పిండి నల్లి వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆ తదనంతరం కోకోపోనిక్స్ పద్ధతిలో సులభంగా కూరగాయల సాగు చేస్తున్నారు. అలాగే, మట్టి ద్వారా సంక్రమించే తెగుళ్లు, మట్టిని సమకూర్చుకోవటం, కలుపు వంటి సమస్యలను పరిష్కరిస్తుందని తెలుసుకున్నారు. నీటి వినియోగం సగానికి పైగా తక్కువగా ఉండే ఇటువంటి వినూత్న సాంకేతికతలను ఆమె ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు.చికిత్సాత్మకమైన కార్యకలాపం‘తోట పని ఒక చికిత్సాత్మకమైన కార్యకలాపం. తోట పనిని సులభతరం చేసే కోకోపోనిక్స్ వంటి కొత్త సాంకేతికతలు రావటం ఒక శుభ పరిణామమ’ని బెంగళూరులోని ‘పాఖీ లైఫ్ అండ్ హెల్త్కేర్ సర్వీసెస్’ వ్యవస్థాపకురాలు రేఖా గోపీనాథ్ అంటున్నారు. విత్తనాలు మొక్కలుగా పెరిగే క్రమాన్ని గమనించటం, పువ్వులు వికసించడాన్ని గమనించటం, పండ్లు, కూరగాయలు కోయటం వంటి పనులు ఏదో సాధించిన భావనను కలిగిస్తాయని గోపినాథ్ తెలిపారు. ‘కోకోపోనిక్స్ ద్వారా మంచి దిగుబడిని పొందొచ్చు. అంతేకాకుండా, ఉత్పత్తులు అధిక నాణ్యతను కలిగి ఉంటాయ’ని బెంగళూరులోని క్యాప్స్బర్ అగ్రిసైన్స్ వ్యవస్థాపకురాలు, సీఈఓ రూప మనోజ్ కుమార్ అన్నారు. డా డి కలైవనన్ఐఐహెచ్ఆర్, సీనియర్ శాస్త్రవేత్తపతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్(చదవండి: గరగాయతో బోలెడన్ని ఉపయోగాలు..!)
అంతర్జాతీయం
ఉగ్రవాద పోషకులను సహించడానికి వీల్లేదు
బిష్కెక్: ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుంటున్న దేశాలను సహించడానికి వీల్లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాద మూకలను ఒక సాధనంగా వాడుకుంటున్నాయని పరోక్షంగా పాకిస్తాన్పై మండిపడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సామూహిక పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. మంగళవారం కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సహా వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాద వ్యవస్థను పూర్తిగా పెకిలించివేయడానికి ఎస్సీఓ కూటమి ఐక్యంగా పని చేయాలని, నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని మోదీ సూచించారు. ఉగ్రవాదాన్ని ఒక విధానపరమైన సాధనంగా వాడుకుంటున్న దేశాలకు గట్టి హెచ్చరిక జారీ చేయాలని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎవరికీ ఎప్పటికీ ‘వ్యూహాత్మక ఆస్తి’కాజాలదని స్పష్టంచేశారు. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమాన్ని(బీఆర్ఐ) పరోక్షంగా ప్రస్తావించారు. ఎస్సీఓ చార్టర్ మౌలిక స్ఫూర్తి ప్రకారం.. ఇలాంటి అనుసంధాన ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా ఉండాలని స్పష్టంచేశారు. ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే.. పరిష్కారం యుద్ధ భూమిలో కాదు ‘‘ఉగ్రవాద భూతం మొత్తం మానవాళికి తీవ్ర సవాలుగా మారింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో మనం కేవలం చర్య–ప్రతిచర్య విధానానికే పరిమితం కాకూడదు. ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడం, నియామకాలు, ఉగ్రవాద భావజాల వ్యాప్తి, ముష్కరుల సురక్షిత స్థావరాలకు సంబంధించిన మొత్తం వ్యవస్థను నిర్మూలించాలి. మనం ఒకే గళం వినిపించాలి. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టం చేయాలి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలకు తగిన బుద్ధి చెప్పాలి. నేడు పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో ఒక ప్రాంతంలో తలెత్తే సంఘర్షణ కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తోంది. ఇది ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల గ్లోబల్ సౌత్ దేశాలు అత్యధికంగా నష్టపోతున్నాయి. ఉద్రిక్తతలు, సంఘర్షణలను యుద్ధభూమిలో కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని భారతదేశం నిరంతరం పిలుపునిస్తోంది. శాంతి, స్థిరత్వంలో కూడిన యురేషియా(యూరప్–ఆసియా) మన ఉమ్మడి ఆకాంక్ష. ఇది అప్గానిస్తాన్లోని శాంతి, స్థిరత్వంతో కూడా ముడిపడి ఉంది. అఫ్గానిస్తాన్ ప్రజల అభివృద్ధికి భారత్ తోడ్పాటు అందిస్తూ వస్తోంది. ఇకపైనా అందిస్తూనే ఉంటుంది. అన్ని ప్రయత్నాలకూ భారత్ మద్దతు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. మా ర్కెట్లను అనుసంధానించే, వాణిజ్యాన్ని సులభతరం చేసే, అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకూ భారత్ మద్దతు ఇస్తోంది. అయితే, అటువంటి ప్రయత్నాలు అన్ని దేశాల సార్వబౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం కూడా అంతే అవసరం. భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే మూడు ప్రధాన అంశాలపై మనం దృష్టి పెట్టాలి. ఈ మూడు మూలస్తంభాలను కేవలం ఆశయాలకే పరిమితం చేయకుండా.. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది’’అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మోదీ, పుతిన్, జిన్పింగ్ ఆత్మియ సంభాషణ ఎస్సీఓ సదస్సు సందర్భంగా అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. చాలాకాలం తర్వాత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్పింగ్ కలుసుకున్నారు. ముగ్గురు నేతలు వేదికపై కరచాలనం చేసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ కొద్దిసేపు ఆత్మియంగా సంభాషించుకున్నారు. జిన్పింగ్, పుతిన్లతో మోదీ ఒకేసారి కరచాలనం చేశారు. పాక్ ప్రధాని కార్యాలయం వక్రబుద్ధిన్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. కిర్గిజిస్తాన్లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా 10 దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలంతా కలిసి ఆనవాయితీ ప్రకారం గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోలను ఆయాన దేశాల ప్రభుత్వాలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ఈ ఫొటోలో నరేంద్ర మోదీని తొలగించి, తమ అధికారిక ఖాతాలో పోస్టుచేసింది. షెహబాజ్ షరీఫ్, పుతిన్, జిన్పింగ్లతోపాటు మోదీ కనిపించకుండా జాగ్రత్తపడింది. ఇందులో పుతిన్, జిన్పింగ్, షెహబాజ్ షరీఫ్ కనిపిస్తున్నారు. మోదీతోపాటు మరికొందరు దేశాధినేతలు లేరు. ఎస్సీఓ సదస్సు గ్రూప్ ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో పాక్ ప్రధాని షరీఫ్ సహా దేశాధినేతలందరూ కనిపిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ నీచ బుద్ధిపై భారతీయులు మండిపడ్డారు.
విమానాశ్రయంపై దాడి.. రష్యాపై జర్మనీ ఆరోపణ
లైప్జిగ్ విమానాశ్రయంపై గత నెల జరిగిన డ్రోన్ దాడి వెనుక రష్యా ఉందని జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 4న పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ను విమానాశ్రయంలో గుర్తించారు. అది పేలకపోవడానికి డిటోనేటర్లో లోపమే కారణమని దర్యాప్తులో తేలింది.మరో డ్రోన్ సమీపంలోని ఉక్రెయిన్ కార్గో విమానాన్ని ఢీకొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 10 రోజుల తర్వాత విమానాశ్రయం సమీపంలో మూడో డ్రోన్ను కూడా గుర్తించారు.ఈ దాడి యూరప్లో రష్యా చేపడుతున్న హైబ్రిడ్ ఆపరేషన్లకు నమూనాలా ఉందని జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలెగ్జాండర్ డోబ్రిండ్ట్ తెలిపారు. పరికరాల పరిశీలన, నిఘా సమాచారంతో రష్యా ప్రమేయానికి ఆధారాలు లభించాయని ఆయన చెప్పారు.అయితే రష్యా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. బెర్లిన్లోని రష్యా రాయబార కార్యాలయం ఆరోపణలను అసంబద్ధమైనవిగా పేర్కొంది.రష్యాపై జర్మనీ కీలక చర్యలువిమానాశ్రయంపై దాడిలో రష్యా ప్రమేయం నేపథ్యంలో బాన్లోని రష్యా కాన్సులేట్ను మూసివేయాలని జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వేడ్ఫుల్ ప్రకటించారు. బెర్లిన్లోని రష్యన్ హౌస్ ఒప్పందాన్ని కూడా రద్దు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
రెండోసారి జాంబియా అధ్యక్షుడిగా హిచిలెమా ప్రమాణం
జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలెమా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం రాజధాని లుసాకాలోని నేషనల్ హీరోస్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఆగస్టు 13న జరిగిన ఎన్నికల్లో హిచిలెమా (60 శాతం ఓట్లు) తన సమీప ప్రత్యర్ది బ్రయాన్ ముండుబిలేపై (38 శాతం ఓట్లు) విజయం సాధించాడు. అయితే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ముండుబిలే ఆరోపించారు.ముండుబిలే ప్రస్తుతం దేశద్రోహం ఆరోపణలపై జైలులో ఉన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించడంతో పాటు, ఫలితాలను కోర్టులో సవాలు చేయాలని ఆయన ప్రయత్నించారు. ఎన్నికల ఫలితాలను ప్రశ్నించిన సుమారు డజను మంది ప్రతిపక్ష నేతలను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.కాగా, జాంబియా కోర్టులను అధికారులు గత వారం అకస్మాత్తుగా మూసివేశారు. దీనిపై అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలను సవాలు చేసేందుకు ప్రతిపక్షానికి న్యాయపరమైన మార్గాలను అడ్డుకున్నారని విమర్శించింది.చదవండి: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు భారీ ఊరట
అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా తాజా దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది.ఇరాన్ మంగళవారం రాత్రి జోర్డాన్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. జోర్డాన్లో సైరన్లు మోగగా, ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించిన 13 ఇరాన్ క్షిపణుల్లో పదింటిని వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మిగిలిన మూడు క్షిపణులు జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పడినట్లు జోర్డాన్ సాయుధ దళాలు వెల్లడించాయి.జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఇరాన్కు చెందిన IRGC మాత్రం జోర్డాన్లోని క్యాంప్ టిటిన్పై దాడి చేసి భారీ సంఖ్యలో అమెరికా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది.మరోవైపు బహ్రెయిన్లోని షేక్ ఇసా ఎయిర్ బేస్ వద్ద అమెరికా సైనికులు, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని కామికేజ్ డ్రోన్లతో భారీ దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే ఈ దాడిపై బహ్రెయిన్ లేదా అమెరికా నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు.బహ్రెయిన్, కువైట్కు హెచ్చరికలుఅమెరికా దాడులు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి తీవ్ర హెచ్చరికలు చేశారు. బహ్రెయిన్, కువైట్ విషయంలో ఇకపై ఇరాన్ సంయమనం పాటించబోదని తెలిపారు. “బహుమతులు దారిలో ఉన్నాయి” అంటూ హెచ్చరించారు.అమెరికా దాడులకు ఇదే కారణంఇరాన్పై తాజా దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. హర్మూజ్ జలసంధిలో సముద్రపు మైన్లు అమర్చేందుకు ఇరాన్ ప్రయత్నించడం, అమెరికా సైనిక స్థావరంపై ఎనిమిది క్షిపణులు ప్రయోగించడం తమ దాడులకు కారణమని ట్రంప్ తెలిపారు.చదవండి: ఇరాన్పై మళ్లీ దాడులు మొదలుపెట్టిన అమెరికా
జాతీయం
ఆ ముగ్గురిలో అయోధ్య సీఈవో.. నేడు వెల్లడి?
అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎంపికపై బుధవారం తుది నిర్ణయం తీసుకోనుంది. 5,500కి పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ తుది జాబితాను రూపొందించింది. అయోధ్యలోని మణిరాందాస్ చావనీలో ట్రస్ట్ అధ్యక్షుడు నృత్యగోపాల్ దాస్ నివాసంలో జరిగే సమావేశంలో సీఈవోతో పాటు ఖాళీగా ఉన్న ఇతర కీలక పదవుల నియామకాలనూ ఖరారు చేయనున్నారు.రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుల కమిటీ సభ్యుడు సురేష్ హవ్డేలతో కూడిన ప్యానెల్ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. మొత్తం 5,585 దరఖాస్తులను క్షుణ్ణంగా సమీక్షించి, 16 మంది అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించినట్లు ట్రస్ట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. జులై 11 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 600 మార్కుల మూల్యాంకన విధానం ద్వారా అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 3,577 మందికి ఫారాలు పంపగా, కనీసం 470 మార్కులు సాధించిన 108 మంది అర్హత పొందారు.వీరికి నాలుగు రోజుల పాటు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వారి ప్రతిభ ఆధారంగా 17 మందిని గ్రేడ్లుగా విభజించారు. చివరికి నిబద్ధత, దార్శనికత ఆధారంగా అత్యుత్తమమైన ముగ్గురిని ఎంపిక చేసి ట్రస్ట్కు సమర్పించారు. ట్రస్ట్ సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం, కానుకల చోరీ ఆరోపణలు, మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాల అనంతరం ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా ట్రస్ట్ తొలి కార్యదర్శిగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి జగదీశ్ ఆఫ్లే నియమితులయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే వీహెచ్పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాంగ్డాను కూడా ట్రస్ట్లోకి తీసుకునే అవకాశముంది. తుది నిర్ణయాన్ని బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ప్రకటిస్తుందని ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు.ఇది కూడా చదవండి: నేపాల్: టన్నెళ్లలో భారత రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు
రీల్స్.. ఫాలోవర్ల మోజు! పార్టీని పట్టించుకోరా?
పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాలన సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతుందనుకున్న వేళ.. ఓ ఎమ్మెల్యే సొంత పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలోపేతం చేయడం, ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాల్సిన నేతలు.. రీల్స్ చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడం, సొంత ప్రచారానికే పరిమితమవుతున్నారని ఆరోపించారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే కొందరు నాయకులు ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు.బంకురా జిల్లా ఓండా నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అమర్నాథ్ షాకా(Amarnath Sakha).. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని కొందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో ఏళ్లుగా బీజేపీతో కొనసాగుతున్నానని, తప్పు అనిపించిన విషయాలపై మౌనంగా ఉండలేనని పేర్కొన్నారు. ‘‘ఎవరినీ సంతోషపెట్టేందుకు నేను ప్రయత్నించను. తప్పు అనిపించిన దానిని వ్యతిరేకిస్తాను. అందుకే చాలామంది శత్రువులయ్యారు. అది నాకు సమస్య కాదు’’ అని ఆయన పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ నేతలు వాటిని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టడం లేదని షాకా విమర్శించారు. ‘‘ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కొందరు నేతలు సొంత ప్రచారంలోనే మునిగిపోతున్నారు. సీపీఐ(ఎం)కు కౌంటర్ లేదు.. నిరసన లేదు.. ఏమీ లేదు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకంటే బయటి ఈవెంట్లలో ఎక్కువ పాల్గొంటున్నారు. అందరూ రీల్స్ చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడం, ఫ్యాన్ క్లబ్లు ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు’’ అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పార్టీని పతనం దిశగా..’బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నేతల వైఖరిలో మార్పు వచ్చిందని షాకా ఆరోపించారు. పదవులు, అధికారంతో వచ్చే ప్రయోజనాలపైనే వారి దృష్టి ఉందని విమర్శించారు. ‘‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా.. అందరూ దాని ప్రయోజనాలను అనుభవించడంలో బిజీగా ఉన్నారు. సొంత కడుపులు నిండితే చాలు.. పార్టీ నరకానికి పోయినా పట్టించుకోరు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘సంపాదన మీదే దృష్టా?’’బీజేపీ కార్యకర్తలు వ్యక్తిగత నాయకుల అభిమానులుగా కాకుండా పార్టీ కోసం పనిచేయాలని షాకా పిలుపునిచ్చారు. ‘‘ఫలానా నాయకుడి అనుచరుడు అవ్వడం బదులు ముందుగా పార్టీకి అనుచరులుగా మారండి. నాయకులు వస్తారు.. పోతారు.. పార్టీ మాత్రం శాశ్వతంగా ఉంటుంది’’ అని సూచించారు.తాను పార్టీ కోసం వ్యక్తిగత జీవితాన్ని, యవ్వనాన్ని, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టానని షాకా చెప్పుకున్నారు. సీపీఐ(ఎం) పాలనలో 34 ఏళ్ల హింస, రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొన్నానని, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పాలనలోనూ ఎన్నో ఇబ్బందులు చూశానని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని అన్నారు.అయితే ఇప్పుడు కొందరి వ్యవహారశైలితో పార్టీ నష్టపోతోందని ఆరోపించారు. ‘‘పార్టీ బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. డబ్బు సంపాదించడంపైనే అందరి దృష్టి’’ అని వ్యాఖ్యానించారు.వామపక్షాల పునరాగమనంపై చర్చమమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసింది. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం టీఎంసీ పార్టీని పతన స్థితికి తీసుకెళ్లింది. ఇదే అదనుగా బెంగాల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష కూటమి మరోసారి సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. యువ నాయకులను ముందుకు తీసుకురావడంతో పాటు వీధి పోరాటాలను ముమ్మరం చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నాయకత్వంపై షాకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అయితే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. వామపక్ష కూటమి కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. 2021తో పోలిస్తే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి ఓటు శాతం దాదాపు నాలుగు శాతం తగ్గింది. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు నెలల పాలన పూర్తి చేసుకోబోతున్న వేళ.. ప్రస్తుత పరిస్థితులు మాత్రం లెఫ్ట్ పార్టీల జనాదరణ కాస్త పెరిగిందనే చెబుతున్నాయి.పార్టీ వేదికపైనే మాట్లాడాలి: బీజేపీ నేతషాకా సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలపై బీజేపీ స్పందించింది. ఓ సీనియర్ నేత మాట్లాడుతూ.. పార్టీకి సంబంధించిన అంశాలను బహిరంగంగా కాకుండా అంతర్గత వేదికల్లో చర్చించాలని సూచించారు. షాకా పార్టీకి నమ్మిన బంటని.. సీనియర్ నాయకుడని, ఆయన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉందని, పార్టీ అంతర్గతంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తే పరిశీలిస్తామని పేర్కొన్నారు.ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని కొందరు నేతలు పార్టీ కార్యకర్తలు, నాయకులు వసూళ్లు, కట్మనీ వంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో షాకా తాజా వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తంగా బెంగాల్లో వామపక్షాలు తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. బీజేపీ అంతర్గతంగా నాయకత్వం, సంస్థాగత పనితీరు, సోషల్ మీడియా ప్రచారం చుట్టూ మొదలైన ఈ వివాదం పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది.ఇదీ చదవండి: పాక్ ప్రధాని సమక్షంలో మోదీ స్ట్రాంగ్ కౌంటర్
ఎన్ఆర్సీ? లేదా జనగణన?.. మణిపూర్లో కొత్త రచ్చ!
ఈశాన్య భారతంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ల ఉన్నత స్థాయి సమావేశం అనంతరం మణిపూర్లో రాబోయే 2027 జనాభా లెక్కల సేకరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను పకడ్బందీగా అమలు చేసి, అక్రమ చొరబాటుదారులను గుర్తించిన తర్వాతే జనాభా గణన చేపట్టాలన్న డిమాండ్కు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.జనగణనపై అభ్యంతరాలు: అసలు చిక్కు ఎక్కడ?రాష్ట్రంలో జనగణనను నిలిపివేయాలనే డిమాండ్ వెనుక మూడు ప్రధాన కారణాలు ముడిపడి ఉన్నాయి. మయన్మార్ తదితర సరిహద్దు ప్రాంతాల నుంచి కొనసాగుతున్న అక్రమ చొరబాట్లు రాష్ట్ర జనాభా సమతుల్యతను దెబ్బతీశాయని లోయ ప్రాంత మైతేయిలు, కొండ ప్రాంత నాగాల ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది. ముందుగా స్థానిక పౌరులను గుర్తించి, చొరబాటుదారులను వేరు చేశాకే లెక్కలు తీయాలని వారు పట్టుబడుతున్నారు. దీనికితోడు 2023 నుంచి చెలరేగిన జాతి హింస కారణంగా వేలాది మంది ప్రజలు నిర్వాసితులై ఇంకా పునరావాస శిబిరాల్లోనే ఉన్నారు. ప్రజలు తమ సొంత ప్రాంతాలకు చేరకముందే గణన చేపడితే అది వాస్తవ జనాభాను కాక, కేవలం స్థానభ్రంశాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎన్ఆర్సీ డిమాండ్కు ఏళ్ల చరిత్రఎన్ఆర్సీ అమలు చేయాలన్న ఆందోళనలు కేవలం ఇటీవల మొదలైనవి కావు. 2022 జూన్లో మైతేయి సంస్థల సమాఖ్య ‘కోకోమి’, యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్సీ)సంయుక్తంగా రాష్ట్ర జనాభా కమిషన్, ఎన్ఆర్సీల కోసం వినతిపత్రం సమర్పించాయి. 1971 నుంచి 2001 మధ్య కొండ ప్రాంత జిల్లాల జనాభా 153.3 శాతం, 2001 నుంచి 2011 మధ్య 250.9 శాతం అనూహ్యంగా పెరగగా, లోయలో ఈ పెరుగుదల వరుసగా 94.8, 125.4 శాతంగానే నమోదైంది. ఈ భారీ వ్యత్యాసం ఆధారంగా 2022 ఆగస్టులో, అనంతరం 2024 మార్చిలో మణిపూర్ అసెంబ్లీ ఎన్ఆర్సీ కోసం తీర్మానాలు చేసింది. 2021లో మయన్మార్లో సైనిక తిరుగుబాటు తర్వాత పెద్దఎత్తున శరణార్థులు సరిహద్దు దాటి రావడం ఈ పరిస్థితులను మరింత సున్నితంగా మార్చింది.బీజేపీ, కాంగ్రెస్ల అనూహ్య కలయికసాధారణంగా పరస్పరం తీవ్రంగా విభేదించే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ అంశంలో అనూహ్యంగా ఒకే తాటిపైకి వచ్చాయి. 1951ని ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని ఎన్ఆర్సీని ప్రకటించిన తర్వాతే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని యూఎన్సీ తేల్చిచెప్పడమే కాక, క్షేత్రస్థాయి సిబ్బందికి సహాయ నిరాకరణ పిలుపునిచ్చింది. రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి మాజీ ముఖ్యమంత్రి, మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక్రామ్ ఇబోబి సింగ్ సైతం జనగణనకు ముందే ఎన్ఆర్సీ జరగాలని స్పష్టమైన మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా భద్రతా కారణాల దృష్ట్యా మయన్మార్తో ఉన్న ‘ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్’ (ఎఫ్ఎంఆర్)ను రద్దు చేయడంతో ఈ డిమాండ్కు మరింత ఊపొచ్చింది.కుకీ-జో కౌన్సిల్ తీవ్ర వ్యతిరేకతమరోవైపు కుకీ-జో వర్గాలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అధికారిక డేటా లేకుండా కేవలం తమపై తప్పుడు ఆరోపణలతోనే ఎన్ఆర్సీని ముందుకు తెస్తున్నారని ‘కుకీ-జో కౌన్సిల్’ పేర్కొంది. ఎన్ఆర్సీ అనేది దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టాల్సిన ఒక సమగ్ర ప్రక్రియ అని, ఏదో ఒక వర్గం లేదా రాష్ట్రం తన ఇష్టానుసారంగా వేరుగా అమలు చేయడానికి చట్టంలో ఆస్కారం లేదని వారు స్పష్టం చేశారు. తరతరాలుగా భారత్లోనే స్థిరపడినప్పటికీ, సరిహద్దుల ఇరువైపులా విస్తరించి ఉన్న తమ సామాజిక వర్గాలను పాత తేదీల పత్రాల పేరిట వేధించే ప్రమాదం ఉందని, శాస్త్రీయమైన జనగణన తర్వాతే పునర్విభజన జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.అసెంబ్లీ సీట్లపై పునర్విభజన నీడలుప్రస్తుతం మణిపూర్ శాసనసభలో మొత్తం 60 స్థానాలు ఉండగా, లోయ ప్రాంతానికి 40, కొండ ప్రాంతాలకు 20 సీట్లు కేటాయించారు. ఈ పంపకం 1971 జనాభా ఆధారంగా 1973లో నిర్ణయించిన పరిమితి ప్రకారమే కొనసాగుతోంది. జనాభా గణనలో కొండ ప్రాంతాల సంఖ్య పెరిగితే, భవిష్యత్ డీలిమిటేషన్లో లోయ ప్రాంతం తన రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రస్తుతం ఉన్న 40:20 నిష్పత్తి కాస్తా 35:25 లేదా 30:30కి మారవచ్చని మైతేయి నాయకులలో భయాందోళనలు ఉన్నాయి. అందుకే జనాభా లెక్కల నమోదు, ఎన్ఆర్సీ, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు పరస్పరం అత్యంత క్లిష్టంగా మారాయి.చట్టబద్ధంగా మణిపూర్లోనే ఎన్ఆర్సీ సాధ్యమా?సాధారణంగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) పునరుద్ధరణ జరిగిన తర్వాతే దేశవ్యాప్త ఎన్ఆర్సీ మొదలవుతుంది. అయితే భారత పౌరసత్వ చట్టం 1955 లోని సెక్షన్ 14A ప్రకారం దేశంలోని ఏ నిర్దిష్ట రాష్ట్రం లేదా సరిహద్దు ప్రాంతానికైనా ప్రత్యేకంగా పౌరుల తప్పనిసరి నమోదు ఆదేశాలను జారీ చేసే పూర్తి చట్టబద్ధమైన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేవలం ఎన్ఆర్సీ మాత్రమే కాకుండా, అక్రమ చొరబాట్లను కట్టడి చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు, ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన (సర్), సరిహద్దు నిఘా పెంపు, బయోమెట్రిక్ నమోదు వంటి ప్రత్యామ్నాయ కఠిన చర్యలను కేంద్రం పరిశీలిస్తోంది.ఇది కూడా చదవండి: భూమిలో రంధ్రాలు పడని 2,000 అండర్వేర్లు.. భూసార రహస్యాలు వెల్లడి!
అన్ని ఎఫ్ఐఆర్లూ కొట్టివేత
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందుకు రాజ్యాంగం ప్రకారం తమకు దక్కిన ప్రత్యేక అధికారాలను న్యాయస్థానం ఉపయోగించుకుంది. ఈ కేసులు విద్యార్థులపై భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదని స్పష్టంచేసింది. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లోగా పరిహారం అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కేంద్రం అభ్యర్థన మేరకు నిరసనకారులపై క్రిమినల్ విచారణను ముగించింది. ‘‘యువ నిరసనకారుల భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, వారికి సంపూర్ణ న్యాయం చేయడానికి మేము రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద మాకు లభించిన అధికారాలను ఉపయోగిస్తున్నాం’’అని స్పష్టంచేసింది. కక్షిదారులకు సంపూర్ణ న్యాయం చేకూర్చడానికి ఎలాంటి ఉత్తర్వులైనా జారీ చేసే అధికారాన్ని ఆరి్టకల్ 142 సర్వోన్నత న్యాయస్థానానికి కలి్పస్తుంది. తమ ముందు కుదిరిన అవగాహనకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాలని సూచించింది. 2,873 మందిపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు మహారాష్ట్ర, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కోరినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం నిరసనకారులపై అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ ధర్మాసనం ఉత్తర్వు జారీచేసింది. ప్రభుత్వ అభ్యర్థనను మన్నిస్తూ, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న తీవ్రమైన నేర చరిత్ర కలిగిన 2,873 మంది వ్యక్తులపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చంది. ప్రజలపై దాడులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిపై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు కూడా సమ్మతి తెలియజేసింది. ఈ ఎఫ్ఐఆర్ల పరిధి కేవలం ఆ రెండు రకాల నేరాలకు మాత్రమే పరిమితం కావాలని వెల్లడించింది. సీజేపీ నిరసన ర్యాలీ రద్దు ఢిల్లీలో సెపె్టంబర్ 5న చేపట్టాల్సిన నిరసన ర్యాలీ రద్దు చేసున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ మంగళవారం ప్రకటించింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీజేపీ కో–కన్వీనర్ సౌరవ్ దాస్ ఈ మేరకు కోర్టులో ఒక ప్రకటన చదివి వినిపించారు. ఉపసంహరించుకుంటాం: నడ్డా నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, వారిలో ఎవరిపైనా కఠిన చర్యలు తీసుకోబోమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సెప్టెంబర్ 5న జరగాల్సిన నిరసన ర్యాలీని రద్దు చేయాలన్న సీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. నీట్ పేపర్ లీక్ అనంతరం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు 90 రోజు ల్లోగా తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సంపూర్ణ న్యాయం జరిగింది: దీప్కే సుప్రీంకోర్టు తాజా ఉత్త ర్వును సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే స్వాగతించారు. తమ గళాన్ని వినిపించడానికి వీధులు, సోషల్ మీడియాను ఆశ్రయించిన విద్యార్థులకు, పౌరులందరికీ ఎట్టకేలకు న్యాయం చేకూరిందని అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లన్నీ నెరవేరాయి కాబట్టి పాదయాత్రను విరమిస్తున్నామని తెలిపారు. సంపూర్ణ న్యాయం జరిగిందన్నారు. తమ ఆందోళన విజయవంతమైందని వెల్లడించారు. సుప్రీంకోర్టుకు దీప్కే కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు మద్దతు ఇచ్చిన ప్రజలకు ఈ తీర్పును అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇది కేవలం జంతర్ మంతర్ వద్దే కాకుండా, దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి విజయమని అభివరి్ణంచారు. ప్రజలంతా గళం విప్పకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యే దని కాదని వివరించారు.
ఎన్ఆర్ఐ
స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు
ప్రపంచ రికార్డు సాధించడమే జీవితాశయంగా పెట్టుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన పుష్పజ్యోతి రవికుమార్ (29). రికార్డులోకెక్కడానికి ఒక చిన్న స్టిక్కీ నోట్పై ఏకంగా 150 పదాలను స్పష్టంగా రాసి, గిన్నిస్బుక్లోకెక్కింది. మొదటి ప్రయత్నంలోనే పుష్పజ్యోతి ఈ రికార్డుని సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మనలో చాలామంది స్టిక్కీ నోట్ను కేవలం షాపింగ్ జాబితాలకో లేదా చిన్న విషయాలు గుర్తుంచుకోవడానికో వాడతాం. కానీ, దుబాయ్లో సీనియర్ క్లౌడ్ ఇంజనీర్గా పనిచేస్తున్న పుష్పజ్యోతికి మాత్రం అది ఒక ప్రపంచ వేదికగా కనిపించింది. అదే చిన్న కాగితం ముక్కపై ఏకంగా 150 పదాలను అత్యంత స్పష్టంగా రాసి, ఒకే స్టిక్కీ నోట్పై అత్యధిక పదాలు రాసిన రికార్డును తన పేరుపై లిఖించుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే..ఈ సవాలులో కేవలం పదాలను ఇరికించి రాయడం మాత్రమే కాదు, అవి చదవడానికి వీలుగా ఉండడం కూడా ముఖ్యం. తక్కువ స్థలంలో ఎక్కువ పదాలను పట్టించడానికి ఆమె జాగ్రత్తగా చిన్న చిన్న పదాలను ఎంచుకున్నారు. అందులోనూ ఎక్కువ శాతం కేవలం మూడు అక్షరాలు ఉన్న పదాలనే ఉపయోగించారు. వేర్వేరు చేతిరాత శైలులలో ప్రయోగాలు చేయడం పుష్పజ్యోతికి అలవాటు. అందువల్ల తక్కువ స్థలంలో స్పష్టంగా రాయడం ఆమెకు సులువైంది. బాల్యం నుంచే గిన్నిస్ బుక్లో రికార్డు సాధించాలని పుష్పజ్యోతి ఆకాంక్ష. అలా ఆమె తన తొలి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించింది.ప్రశంసల జల్లులుపుష్పజ్యోతి తన విజయానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోగానే ఆమెపై ప్రశంసల జల్లులు కురిసాయి. సుమారుగా పది లక్షల వ్యూస్ వచ్చాయి. ఆశయానికి అంకితభావం తోడైతే, సాధించలేనిది ఏదీ లేదని పుష్పజ్యోతి నిరూపించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డు విజేతగా మారడం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత గానో పెంచింది. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుంది. దానిని వెలికితీసి ప్రపంచానికి ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలు దోహదపడతాయి. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించడమే నా లక్ష్యం. View this post on Instagram A post shared by Varnam MY (@varnammalaysia)– పుష్యజ్యోతి రవికుమార్ (చదవండి: కంటతడి పెట్టించే ప్రేమకథ..! ఆఖరికి విధి సైతం..)
అమెరికా నుంచి వచ్చిన యువతి అదృశ్యం
హైదరాబాద్: అమెరికాలో నివాసం ఉంటున్న యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు..పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన బుడిగె శైలజ కుమార్తె బుడిగె విహారిక (27), అల్లుడు హరీష్ లు ఈ ఏడాది జనవరి 26 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. అయితే ఈ నెల 20న విహారిక కనిపించడం లేదంటూ భర్త కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకోగా... విహారిక అమెరికా నుంచి తన పాస్పోర్ట్తో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమె హైదరాబాద్కు వస్తుందని భావించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లగా ఆమె అక్కడికి చేరుకోలేదు. అయితే ఆగస్టు 21న విహారిక ముంబై విమానాశ్రయంలో ఉన్నట్లు సమాచారం అందింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ కలవకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. మేడిపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.
ప్రేయసి దూరమైందని అమెరికాలో ఆత్మహత్య..!
హైదరాబాద్: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్(29) 2024లో మాస్టర్స్ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్తో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకున్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇదిఆ ఉండగా ప్రదీప్కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్ తల్లిదండ్రులను కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిగౌడ్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాదీ యువకుడి ఆత్మహత్య
కోటి కలలతో రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయిన ఒక యువకుడి జీవితం విషాదంతమైంది. ఉన్నత చదువులు చదివినా కూడా ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాద్కు చెందిన సాయిప్రదీప్ ఆత్మహత్య చేసుకున్న దిగ్బ్రాంతి రేపింది. హైదరాబాద్లోని దమ్మాయిగూడలోని శ్రీనివాసనగర్ కాలనీ చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం, సాయి ప్రదీప్ 2024లో అమెరికాకు వెళ్లారు. ఇటీవల 'యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ శాన్ ఆంటోనియో'లో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అతనికి సప్లై చైన్ అనలిస్ట్గా 5 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఫలితం దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనాడు. దీంతో ఈ డిప్రెషన్తో ఆగస్టు 21న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని మృతదేహాన్ని భారతదేశానికి రప్పించడానికి మరియు అంత్యక్రియల ఖర్చులను భరించడానికి అతని కుటుంబం నిధుల సేకరణను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా అమెరికా కఠినమైన వలస విధానాలలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం, ఎన్నారైలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భవిష్యత్ అనిశ్చితి కెరీర్ కలలు, ఆర్థిక ఒత్తిడి వేలాది మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు
క్రైమ్
ఢిల్లీలో నిర్భయ-2.. కదులుతున్న బస్సులో 47 కిలోమీటర్లు రాక్షసత్వం
ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో చోటుచేసుకున్న మరో నిర్భయ తరహా దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్, బాధితురాలిపై దారుణం జరిగిన ప్రైవేట్ స్లీపర్ బస్సును ఎన్హెచ్ఆర్సీ సభ్యులు స్వయంగా పరిశీలించారు. ఈ ఘోరానికి సంబంధించి ఢిల్లీ పోలీస్ కమిషనర్, గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్, మైన్పురి ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. విచారణ పురోగతి, బాధితురాలికి అందించిన పరిహారం వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోపు సమర్పించాలని ఆదేశించింది.అసలేం జరిగింది?ఉత్తరప్రదేశ్లోని మైన్పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని (16) ఆగస్టు 4న తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. నోయిడా సెక్టార్-63లోని బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పొరపాటున గ్రేటర్ నోయిడా పరిచౌక్ వద్ద బస్సు దిగింది. జోరు వానలో సెక్టార్-63 వైపు వెళ్లే వాహనం కోసం వేచి చూస్తుండగా, సుర్జాపూర్ నుంచి వస్తున్న 'విశ్వనాథ్' అనే ప్రైవేట్ స్లీపర్ బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26)లు తాము సెక్టార్-63 వైపే వెళ్తున్నామని నమ్మబలికి ఆమెను బస్సులోకి ఎక్కించుకున్నారు.47 కిలోమీటర్లు నరకంబాధితురాలు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన నిందితులు, బస్సు కర్టెన్లు మూసివేసి లైట్లు ఆర్పివేశారు. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి, కశ్మీరీ గేట్ వద్ద ఆమెను దింపివేసి పరారయ్యారు.తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న బాధితురాలు ధైర్యం చేసి ఆటోలో సమీప పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బస్సులోని సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో, మార్గమధ్యలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ పోలీసులు పక్కా ఆధారాలతో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్లను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు.నాటి నిర్భయ ఘటనను గుర్తు చేసేలా ఈ ఘోరకలి 2012 నాటి ‘నిర్భయ’ దారుణాన్ని తలపించింది. ఢిల్లీ-నోయిడా ఎక్స్ప్రెస్ వే, రింగ్ రోడ్డు వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన నిఘా మార్గాల్లో బస్సు అంత దూరం ప్రయాణిస్తున్నా పెట్రోలింగ్ వాహనాలు గానీ, పోలీసులు గానీ గుర్తించకపోవడంపై మీడియా భద్రతా లోపాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల మహిళా భద్రతా దావాల డొల్లతనాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్, ఆప్ వంటి ప్రతిపక్షాలు మండిపడటంతో రాజకీయంగానూ పెద్ద దుమారమే రేగింది.మరోవైపు, వివాదాలకు తావివ్వకుండా కశ్మీరీ గేట్ స్టేషన్కు వచ్చిన బాధితురాలికి ఢిల్లీ పోలీసులు తక్షణమే స్పందించి జీరో-ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్తో పాటు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించాయి.ఆగస్టు 4న ఘటన జరగగా.. ఆగస్టు 31న జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 1న జాతీయ మానవ హక్కుల కమీషన్ చర్యలకు ఉపక్రమించింది.
కాలి బూడిదైన రూ.6 లక్షల నగదు
మహబూబ్ నగర్ జిల్లా: మండలంలోని తిర్మలాపూర్లో సోమవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ కుటుంబం దాచుకున్న నగదు, బంగారం, వెండి వస్తులతోపాటు తిండిగింజలు ఆహుతయ్యాయి. తిర్మలాపూర్కు చెందిన అజ్జమోని పార్వతమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో పాత గుడిసెను తొలగించి ఆ స్థలంలోనే నూతనంగా నిర్మించుకుంటున్నారు. ఇల్లు నిర్మాణం పనులు మొదలుపెట్టడంతో గ్రామంలోనే ఉన్న ముదిరాజ్ భవనంలో ఉంటున్నారు.ప్రమాదవశాత్తు సోమవారం షార్ట్ర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుంచి తెచ్చుకున్న రూ.6లక్షల నగదు, బంగారు, వెండి వస్తువులు, బియ్యం బస్తాలతోపాటు ఇంట్లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్తులు ఫైర్ ఇంజిన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని వస్తువులతోపాటు నగదు కాలిపోయాయి. ఇల్లు నిర్మించుకుంటున్న సమయంలో భగవంతుడు మాకీ పరీక్ష ఎందుకు పెట్టాడోనంటూ బాధిత కుటుంబ సభ్యులు రోధించారు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా భరోసా కల్పించాలని కోరారు.చదవండి: 'ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్డ్రింక్ తాగుదాం!'
‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్డ్రింక్ తాగుదాం!’
పల్నాడు: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి స్నేహితుడురా... నీకు కూల్డ్రింక్ ఇప్పిస్తా..రా’ అంటూ బాలుడికి మాయమాటలు చెప్పి సైకిల్తో ఉడాయించిన ఘటన గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకునూరి నాగేశ్వరరావు కుమారుడు పవన్కుమార్ స్థానిక జెడ్పీహైస్కూలులో ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులతో ఆడుకునేందుకు సైకిల్పై ఇంటి నుంచి బయలుదేరాడు. సినిమాహాల్ రోడ్డులో వెళ్తుండగా ఓ యువకుడి ఎదురై పవన్కుమార్ను ఆపాడు. మీ నాన్న నాకు తెలుసు.. బజారుకు వెళ్దాం రా అంటూ మాటలు కలిపాడు. పవన్కుమార్ను సైకిల్పై వెనుక కూర్చొబెట్టుకుని మెయిన్రోడ్డులోని ఓ బడ్డీ దుకాణం వద్దకు తీసుకెళ్లాడు.పవన్కుమార్కు కూల్డ్రింక్ ఇప్పించి, గ్లాసులు తీసుకొనివస్తా ఇక్కడే ఉండమని చెప్పి సైకిల్ తీసుకొని వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగిరాకపోయేసరికి బాలుడు పవన్కుమార్ ఇంటికి వెళ్లి విషయాన్ని తండ్రికి వివరించాడు. అగంతక వ్యక్తి కోసం గ్రామంలో వెతికినా ఫలితం లేకపోవటంతో ఓ ఇంటి సీసీ కెమేరాల ఫుటేజీని పరిశీలించారు. బాలుడిని సైకిల్పై ఎక్కించుకుని వెళ్తున్న సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అవటంతో బాలుడి తండ్రి నాగేశ్వరరావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.చదవండి: పల్నాడులో కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు!
ప్లేస్కూల్లో మూడేళ్ల బాలుడిపై అమానుషం, సీఎం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని మౌజ్పూర్లో మకూన్స్ ప్లే స్కూల్లో మూడేళ్ల బాలుడిని టీచర్, కేర్ టేకర్ దారుణంగా కొట్టిన ఉదంతంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. ఆ ప్లేస్కూల్ ప్రాంగణాన్ని తక్షణమే సీల్ చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) స్పందిస్తూ, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా స్కూల్ సీలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.ఢిల్లీలో ఒక ప్లేస్కూలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రిళ్లు నిద్రపోకుండా, భయంతో వణికిపోతున్న తమ బిడ్డను చూసి అనుమానం వచ్చిన తల్లితండ్రులు ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. భయంతో గడిచిన 15 రోజులుగా సరిగ్గా స్నానం కూడా చేయలేకపోతున్నాడని, వాష్రూమ్లోకి వెళ్లడానికి భయపడుతున్నాడని బాలుడి తండ్రి వాపోయారు. A three-and-a-half-year-old boy was allegedly physically and sexually assaulted and mentally harassed at a private playschool in northeast Delhi's Maujpur, with CCTV footage purportedly showing him being tied to a chair, kicked and held by his ears.Police have registered a case… pic.twitter.com/TaLzjs8XNk— Hate Detector 🔍 (@HateDetectors) August 31, 2026 ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు? Delhi Government has taken serious cognisance of the deeply disturbing incident reported from a play school in Maujpur.On the directions of Chief Minister Smt. Rekha Gupta, the District Magistrate has initiated proceedings to seal the premises of the school. Police…— CMO Delhi (@CMODelhi) August 31, 2026అంతేకాదు బాలుడిని ఆసుపత్రికి తీసుళ్లడంతో మరో ఘోరం బయటపడింది. బాలుడి రెండు చెవుల కర్ణభేరిలువాచినట్లు వైద్యులు తెలిపారు. అతని ముఖం, చేతులపై స్పష్టమైన గాయాల గుర్తులు కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. తమకేం తెలీదంటూ యాజమాన్యం బుకాయించడంతో తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ కావాలని డిమాండ్చేశారు. అది ఇవ్వాలంటే రూ.1,500 చెల్లించాలని స్కూల్ యాజమాన్యం చెప్పింది. ఆ నగదు చెల్లించి ఫుటేజీ తెప్పించి ఆగస్ట్ 16, 17, 18 తేదీల దృశ్యాలను పరిశీలించగా అసలు సంగతి బయటపడింది. బాలుడిని చిన్న చైర్కు కట్టేసి మూడు గంటల వ్యవధిలో పలుమార్లు కొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇదేంటని స్కూలు యాజమాన్యాన్ని నిలదీస్తే పిల్లాడు బాగా అల్లరి చేస్తుంటే మందలించామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.#WATCH | Delhi | On play school Attendant arrested for allegedly abusing 3-year-old boy in Maujpur, Navneet Chaudhary, father of 3-year-old boy, says, “…The child had been troubled for several days… Then, suddenly, on 18 August, my son came home from school. As soon as he got… https://t.co/wu7RfIAjo0 pic.twitter.com/vmILhjfgcC— ANI (@ANI) August 31, 2026 దీనిపై బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదుచేశారు. కేర్టేకర్ను అరెస్ట్చేసి స్కూల్ డైరెక్టర్ సునీతా బన్సల్, ప్రిన్సిపల్ నీలమ్, ఉపాధ్యాయులు సిమ్రాన్, పూజలపై కేసు నమోదుచేశారు. పోక్సో చట్టంతోపాటు భారతీయ న్యాయసంహిత సెక్షన్ల కింద కేసు వేసి దర్యాప్తు ఆరంభించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలమేరకు పాఠశాల ప్రాంగణాన్ని సీజ్చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఘటనలో అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించేందుకు పాఠశాల ప్రాంగణాన్ని పోలీసులు సీజ్చేశారు. పాఠశాల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాదీనంచేసుకున్నారు. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
వీడియోలు
భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు
పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా
అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్
ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు
YS జగన్ కు ఘన స్వాగతం
AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్
కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

