గల్లంతైన మత్స్యకారులలో ఒక్కరి ఆచూకే లభించింది: బొత్స
విశాఖ: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతు కావడం బాధాకరమని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులలో.. కేవలం ఒక్కరి ఆచూకీ మాత్రమే లభించిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ని కనుగొనాలని అన్నారు. బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కాగా, వైఎస్సార్సీపీ నేతల బృందం ఆదివారం ఫిషింగ్ హార్బర్కు వెళ్లి పరిశీలించింది. బాధిత మత్స్యకార కుటుంబాలను విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు, వైసీపీ నేతలు పరామర్శించారు.ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. ‘‘గల్లంతయిన వారికోసం ప్రభుత్వం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టేలా చేయాలి. సమాచారం అందిన వెంటనే గాలింపు ప్రారంభించి ఉంటే మత్స్యకారుల ఆచూకీ దొరికేది. బాధిత మత్స్యకార కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుంది. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని మత్స్యకారులు చెబుతున్నారు’’ అని తెలిపారు.
ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతున్న రష్యా..!!
నాలుగేళ్ల క్రితం.. 2022 ఫిబ్రవరి 24న మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక సంచలన మలుపు తిరిగింది. ఒకప్పుడు ఉక్రెయిన్ను కేవలం మూడు రోజుల్లో లొంగదీసుకుంటామని భావించిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు, ఇప్పుడు 2026లో కోలుకోలేని షాక్ తగిలిందా? ఐదో ఏట అడుగుపెట్టిన ఈ యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తోందా? రష్యా సైనిక వ్యవస్థతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే స్థితికి చేరుకుందా?రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ వేసినట్లు 2026 చివరి నాటికి డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పుతిన్ ముందు రెండే దారులు ఉన్నాయి. ఆ దారులు ఏంటి? ఉక్రెయిన్ భారీ గ్రౌండ్ అటాక్స్కు బదులుగా ఏ కొత్త యుద్ధ వ్యూహాన్ని అమలు చేస్తోంది? ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థలో ఏ ప్రధాన రంగం ఎక్కువగా దెబ్బతింది? పూర్తి వివరాలు ఈ కింది వీడియో(సాక్షి డిజిటల్ పాడ్కాస్ట్ ఆన్ జియోపాలిటిక్స్) లో చూడండి..
గత జన్మలో స్మగ్లర్... ఇప్పుడు ప్రొఫెసర్! వింత కేసు..
‘‘తాతా! ఆగ్రాలో ఉన్న నా భార్యాపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. నన్ను అక్కడకు తీసుకెళ్లు’’ అన్న మాటలు వినేసరికి ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ మాటలు అన్నది యూపీలోని బాద్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు తోరణ్ సింగ్ టిటూ. రెండేళ్ల వయసు నుంచి టిటూ చెబుతున్న మాటలను మొదట్లో పిల్లచేష్టలుగా భావించి పట్టించుకోలేదు. అయితే, నాలుగేళ్లు వచ్చాక ఓ రోజు.. ‘‘నాకు ఆగ్రాలోని సదర్ బజార్లో పెద్ద రేడియో షాప్ ఉంది, పెద్ద బంగళా ఉంది, కార్లు ఉన్నాయి. నా పేరు సురేష్ వర్మ, నేను ‘సురేష్ రేడియో’ అధిపతిని. స్మగ్లింగ్ కూడా చేసేవాడిని. నన్ను తుపాకీతో కాల్చి చంపేశారు’’ అని చెప్పడంతో టిటూ కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.ఈ సంగతేమిటో తేల్చుకోవాలని టిటూ అన్నయ్య ఆగ్రాలోని సదర్ బజార్కు వెళ్లాడు. అక్కడ ‘సురేష్ రేడియో’ షాప్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ షాప్ యజమాని సురేష్ వర్మను 1983లో ఎవరో కాల్చి చంపేశారని, ప్రస్తుతం అతని భార్య ఉమా వర్మ ఒంటరిగా ఉంటోందని తెలిసి షాక్కు గురయ్యాడు.విషయం తెలుసుకున్న సురేష్ వర్మ కుటుంబ సభ్యులు టిటూను చూడటానికి వచ్చారు. వారిని చూడగానే టిటూ గుర్తుపట్టాడు. గత జన్మలో తమకు సంబంధించిన బోలెడు విషయాలను ఏకరువు పెట్టాడు. వ్యాపారంలో ఎవరెవరికి ఎంత అప్పు ఇచ్చాడో, ఆ డైరీ ఎక్కడ దాచాడో కూడా చెప్పాడు. అయితే, గత జన్మలోని సురేష్ వర్మ భార్య ఉమ.. టిటూకు కొన్ని పరీక్షలు పెట్టారు. ఇరవై మంది పిల్లల మధ్యలో తమ ఇద్దరి పిల్లలను కూర్చోబెట్టి గుర్తుపట్టమని అడిగితే, టిటూ ఇద్దరినీ గుర్తించి పేర్లు కూడా చెప్పాడు..‘‘నువ్వు చనిపోవడానికి ముందు మనం ఎక్కడికి వెళ్లాం?’’ అడిగింది ఉమ. ‘‘ఓ తిరునాళ్లకు వెళ్లాం. నువ్వు కారు బానెట్పై కూర్చుని జిలేబీ కూడా తిన్నావు’’ అని టిటూ చెప్పడంతో ఆమె నోరెళ్లబెట్టారు. టిటూ కుడి కణత భాగంలో ఒక చిన్న గుండ్రటి మచ్చ ఉంది. అలాగే తల వెనుక భాగంలో మరికొన్ని గుర్తులు ఉన్నాయి. సురేష్ వర్మ పోస్ట్మార్టం నివేదికను పరిశీలించిన శాస్త్రవేత్తలు, వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, సురేష్ వర్మను కాల్చినప్పుడు బుల్లెట్ కుడి కణత నుంచి లోపలికి వెళ్లి, తల వెనుక భాగం నుంచి బయటకు వచ్చింది. టిటూ ఒంటిపై ఉన్న మచ్చలు సరిగ్గా అవే స్థానాల్లో ఉన్నాయి.టిటూ మిస్టరీని పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలకు ఓ చిక్కుముడి ఎదురైంది. రికార్డుల ప్రకారం సురేష్ వర్మ 1983 ఆగస్టు 28న మరణించాడు. కానీ టిటూ అంతకు ముందే డిసెంబర్ 1982లో (కొన్ని రికార్డుల ప్రకారం డిసెంబర్ 1983లో) జన్మించాడు. టిటూ 1983 డిసెంబర్ 12న జన్మించింది నిజమైతే, అప్పటికే సురేష్ వర్మ చనిపోయాడు కాబట్టి ఇది పునర్జన్మ అవుతుంది. ఒకవేళ టిటూ 1982లో జన్మించి ఉంటే, సురేష్ చనిపోయే సమయానికి అతడి వయసు ఎనిమిది నెలలు. అంటే, సురేష్ వర్మ ఆత్మ– టిటూ శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి ఉండాలని భావించాలి. ఎందుకంటే టిటూకి సరిగ్గా 8 నెలల వయసులో తీవ్ర అనారోగ్యానికి గురై చావు అంచుకు వెళ్లాడు. ఆ సమయంలోనే టిటూ శరీరంలోకి సురేష్ వర్మ ఆత్మ ప్రవేశించి ఉండవచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు.ఈ వింత కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటిష్ మ్యాగజైన్ ‘రీఇ¯Œ కార్నేషన్ ఇంటర్నేషనల్’ దీనిపై ప్రత్యేక కథనం రాసింది. బీబీసీ 1990లో ఒక డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. ఇటీవల ప్రసిద్ధ ‘దేశీ క్రైమ్ పాడ్కాస్ట్’ టిటూను ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న డాక్టర్ తోరణ్ సింగ్ యోగా, నేచురోపతిలో ఎండీ పూర్తి చేసి, వారణాసిలోని ప్రతిష్ఠాత్మక బెనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు."నాకు పూర్వజన్మకు సంబంధించిన అన్ని విషయాలూ గుర్తున్నాయి. షాప్ మూసేసి నా వైట్ ఫియట్ కారులో ఇంటికి వెళ్తున్నాను. అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఒకడు ‘నమస్తే’ అన్నాడు, ఇంకొకడు నన్ను కాల్చేశాడు. ఆ రోజుల్లో నేను వారితో కలిసి స్మగ్లింగ్ చేసేవాడిని. నన్ను చంపినవాళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిదేళ్ల శిక్ష కూడా అనుభవించారు. తొమ్మిదేళ్ల వయసులో వారిని చూసినప్పుడు భయం వేసింది. గత పదేళ్లుగా నా పూర్వజన్మ కుటుంబంతో ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఇప్పుడు నాకు భార్య, కొడుకు ఉన్నారు. నేను నా ప్రస్తుత జీవితంలో సంతోషంగా ఉన్నాను." - పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో డాక్టర్ తోరణ్ సింగ్సత్యకిశోర్
ప్రియురాలితో అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ఇవాళ అఫీషియల్గా ఒక్కటయ్యారు. ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఆమిర్ నివాసంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తమ వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ పెళ్లికి కేవలం దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.కాగా.. గతేడాది అమిర్ ఖాన్ తన బర్త్ డే సందర్భంగా ప్రియురాలిని పరిచయం చేశారు. తాను 25 ఏళ్లుగా తెలిసినప్పటికీ.. గత రెండేళ్లుగా డేటింగ్ ప్రారంభించామని అమిర్ ఖాన్ వెల్లడించారు. గతంలో అమిర్ ఖాన్ రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2021లో విడిపోగా.. ఓ కుమారుడు ఆజాద్ ఉన్నారు.మరోవైవు బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్.. వెల్నెస్ అండ్ బ్యూటీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో సెలూన్ యజమాని అయిన రీటా స్ప్రాట్ కుమార్తెనే గౌరీ. గతంలో 2004లో లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్లో ఫోటోగ్రఫీలో కోర్సును గౌరీ అభ్యసించారు. ఆమె ప్రస్తుతం ముంబైలో ఒక బిబ్లంట్ అనే సెలూన్ నడుపుతున్నారు.
గల్లంతైన మత్స్యకారులలో ఒక్కరి ఆచూకే లభించింది: బొత్స
నాగదుర్గ విచిత్రమైన లవ్ స్టోరీ.. తెలుగు ట్రైలర్
పాక్ ఎయిర్ఫోర్స్ కెప్టెన్ అసీమ్ తారిక్ను కాల్చి చంపిన దుండగులు
రవి బిష్ణోయ్ చెత్త రికార్డు.. టీ20ల్లో తొలి ప్లేయర్గా
ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు
జియో రూ.448 Vs ఎయిర్టెల్ రూ.469 ప్లాన్.. ఏది బెస్ట్?
అవార్డులకు ఎన్నో దారులు.. చిరు వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్
రూ.2.3 కోట్ల జాబ్.. అందుకే వదిలేశాడు!
ఇంగ్లండ్ వర్సెస్ ఆసీస్ ఫైనల్ పోరు.. తుది జట్లు ఇవే
రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ
తరం మారినా.. ముంబై వాన పాట మారలేదు!
‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
హీరోయిన్గా మాజీ డీజీపీ కూతురు.. సినిమా రెడీ
అప్పులకు బ్రాండ్ అంబాసిడర్నని కాదయ్యా..! అభివృద్ధికి అన్నారు!!
‘అపార్ట్మెంట్ కొన్నాను.. చింతిస్తున్నాను’
సాక్షి కార్టూన్ 04-07-2026
ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా
‘స్పెషల్ క్లాస్’ వద్దు ‘సేఫ్ క్లాస్’ చాలు
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రచ్చ.. స్పందించిన బీసీసీఐ
సాక్షి కార్టూన్ : 03-07-2026
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
మూసీపై హెరిటేజ్ ఫుడ్స్ పడగ
ఇంటి రుణానికి తొందరగా ఇడుపు కాయితం!.. ఇదో మార్గం
సాక్షి కార్టూన్ : 04-07-2026
నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రిక్వార్టర్స్కు పోర్చుగల్
పెళ్లిపై భయం.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది: హీరోయిన్
పాకిస్తాన్కు ఊహించని శత్రువు.. పెంచిన పామే కాటేసిందా?
నాగబంధం మూవీ.. ఆ క్యారెక్టర్పై నెటిజన్ల ప్రశంసలు.!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
గల్లంతైన మత్స్యకారులలో ఒక్కరి ఆచూకే లభించింది: బొత్స
నాగదుర్గ విచిత్రమైన లవ్ స్టోరీ.. తెలుగు ట్రైలర్
పాక్ ఎయిర్ఫోర్స్ కెప్టెన్ అసీమ్ తారిక్ను కాల్చి చంపిన దుండగులు
రవి బిష్ణోయ్ చెత్త రికార్డు.. టీ20ల్లో తొలి ప్లేయర్గా
ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు
జియో రూ.448 Vs ఎయిర్టెల్ రూ.469 ప్లాన్.. ఏది బెస్ట్?
అవార్డులకు ఎన్నో దారులు.. చిరు వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్
రూ.2.3 కోట్ల జాబ్.. అందుకే వదిలేశాడు!
ఇంగ్లండ్ వర్సెస్ ఆసీస్ ఫైనల్ పోరు.. తుది జట్లు ఇవే
రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ
తరం మారినా.. ముంబై వాన పాట మారలేదు!
‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
హీరోయిన్గా మాజీ డీజీపీ కూతురు.. సినిమా రెడీ
అప్పులకు బ్రాండ్ అంబాసిడర్నని కాదయ్యా..! అభివృద్ధికి అన్నారు!!
‘అపార్ట్మెంట్ కొన్నాను.. చింతిస్తున్నాను’
సాక్షి కార్టూన్ 04-07-2026
ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా
‘స్పెషల్ క్లాస్’ వద్దు ‘సేఫ్ క్లాస్’ చాలు
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రచ్చ.. స్పందించిన బీసీసీఐ
సాక్షి కార్టూన్ : 03-07-2026
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
మూసీపై హెరిటేజ్ ఫుడ్స్ పడగ
ఇంటి రుణానికి తొందరగా ఇడుపు కాయితం!.. ఇదో మార్గం
సాక్షి కార్టూన్ : 04-07-2026
నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రిక్వార్టర్స్కు పోర్చుగల్
పెళ్లిపై భయం.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది: హీరోయిన్
పాకిస్తాన్కు ఊహించని శత్రువు.. పెంచిన పామే కాటేసిందా?
నాగబంధం మూవీ.. ఆ క్యారెక్టర్పై నెటిజన్ల ప్రశంసలు.!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఫొటోలు
మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు)
ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు)
బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
30ల్లో ఫ్రెండ్షిప్ ఇలా.. ఈ హీరోయిన్ గుర్తుందా? (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 05 - 12)
హైదరాబాద్లో జోరు వాన (ఫొటోలు)
వండర్ కిడ్ ఎంట్రీ.. భారత క్రికెట్ సరికొత్త అధ్యాయం (ఫొటోలు)
ముంబైలో వర్ష బీభత్సం (ఫొటోలు)
సినిమా
నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా
ప్రతివారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ, ఇతర భాషలకు చెందిన మూవీస్ కూడా ఉంటూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం స్టార్స్ నటించినవి కూడా నేరుగా ఓటీటీలో రిలీజైపోతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ వివాదాస్పద చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ)పంజాబ్కి చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా 'పంజాబ్ 95' పేరుతో దర్శకుడు హనీ టెహ్రాన్ ఓ సినిమా తీశారు. ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. పంజాబ్లో 25,000 మందిని అన్యాయంగా పోలీసులు చంపిన సంగతి.. తన పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో హత్యకు గురయ్యారు. ఈయన్ని పోలీసులే చంపారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ సినిమాని మూడేళ్ల క్రితమే తీసినప్పటికీ సెన్సార్ బోర్డ్.. తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏకంగా 127 కట్స్ సూచించింది. మూవీ టీమ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఫలితం లేకపోవడంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయలేదు. దీంతో 'సత్లుజ్'గా టైటిల్ మార్చి నేరుగా జీ5 ఓటీటీలోకి రెండు రోజుల క్రితమే స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. నార్త్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ దక్షిణాది ఆడియెన్స్కి నచ్చుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)
ఈషా రెబ్బా క్యూట్.. సంయుక్త వెరీ ఘాటు
క్యూట్ లుక్స్తో మాయ చేస్తున్న ఈషా రెబ్బాఎర్రని డ్రస్లో హాట్నెస్ పెంచేసిన సంయుక్తయంగ్ అందం మిథిలా పాల్కర్ని చూశారాబీచ్ వెకేషన్లో హీరోయిన్ మాళవిక మోహనన్పసుపు చీరలో మందారంలా భాగ్యశ్రీ బోర్సేబీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న శ్రీదేవి View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Siri (@srideviactor) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Esther (@_estheranil)
ప్రియురాలితో అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ఇవాళ అఫీషియల్గా ఒక్కటయ్యారు. ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఆమిర్ నివాసంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తమ వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ పెళ్లికి కేవలం దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.కాగా.. గతేడాది అమిర్ ఖాన్ తన బర్త్ డే సందర్భంగా ప్రియురాలిని పరిచయం చేశారు. తాను 25 ఏళ్లుగా తెలిసినప్పటికీ.. గత రెండేళ్లుగా డేటింగ్ ప్రారంభించామని అమిర్ ఖాన్ వెల్లడించారు. గతంలో అమిర్ ఖాన్ రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2021లో విడిపోగా.. ఓ కుమారుడు ఆజాద్ ఉన్నారు.మరోవైవు బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్.. వెల్నెస్ అండ్ బ్యూటీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో సెలూన్ యజమాని అయిన రీటా స్ప్రాట్ కుమార్తెనే గౌరీ. గతంలో 2004లో లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్లో ఫోటోగ్రఫీలో కోర్సును గౌరీ అభ్యసించారు. ఆమె ప్రస్తుతం ముంబైలో ఒక బిబ్లంట్ అనే సెలూన్ నడుపుతున్నారు.
'ఇంకా ఎంతకు దిగజారుతారు.. కొత్తగా ఏదైనా ట్రై చేయండి'
టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ మరో వీడియో రిలీజ్ చేశారు. నా గొంతుతో పాటు.. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని క్లియర్ కట్గా తెలిసిపోతోందని అన్నారు. ఆడియోను ఎడిట్ చేసి గాలి మాటలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇలాంటి గాలి మాటలను సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు దౌర్జన్యాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా??! అని ప్రశ్నించారు.ఇదంతా జనాలు గమనిస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ఆడియో మీకు ఎక్కడి నుంచి వచ్చింది?.. సోషల్ మీడియాలో దీన్ని ఎవరు లీక్ చేశారని కౌంటరిచ్చారు. మీరు చేస్తున్న ఈ నాటకం అందరికీ తెలుసని అన్నారు. ఇలా కాకుండా కొత్తగా ఇంకేదైనా ట్రై చేయండని హితవు పలికారు. పదవి ఉందన్న అహంకారంతో ఒక వ్యక్తిని ఇలా అరెస్టు చేయించడం సిగ్గుగా లేదా? అని నిలదీశారు ప్రకాశ్ రాజ్.కాగా..యూట్యూబర్ ప్రశ్న రావణ్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రావణ్పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ రాగా.. తాజాగా మరో కేసులో అరెస్ట్ చేశారు. రావణ్పై గన్నవరం పోలీసు స్టేషన్లో జనసేన నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.Editing voice messages of me asking for spelling corrections in telugu and a minister claiming it as an act of conspiracy to destabilise a government shows your desperation to silence voices of dissent. From where did you this audio ? who leaked it on social media ? #justasking pic.twitter.com/b9r9YaT8WF— Prakash Raj (@prakashraaj) July 5, 2026
క్రీడలు
బంగ్లాదేశ్ వేదికగా ఆసియా కప్..!
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆసియాకప్-2027 టోర్నీకి సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. వచ్చే ఏడాది ఆసియాకప్ జూన్ 18 నుండి జూలై 4 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా ఈ ఈవెంట్ ఉపయోగపడనుంది. కాగా ఈ ఖండాంతర టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. అయితే రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆసియా కప్ వేదిక బంగ్లాదేశ్ నుంచి మారుతుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాత్రం బంగ్లాదేశ్ వేదికగా నిర్వహించేందుకు సముఖత చూపినట్లు తెలుస్తోంది. బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయి.అదేవిధంగా ఈ ఏడాది ఆరంభంలో భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ పాల్గోలేదు. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్గా మాజీ క్రికెట్ తమీమ్ ఇక్భాల్ ఎంపిక కావడంతో.. బీసీసీఐతో కూడా సంబంధాలు మెరుగుపడ్డాయి. దీంతో ఈ ఏడాది ఆగస్టులో భారత్-బంగ్లా మధ్య వైట్బాల్ సిరీస్లు కూడా జరిగే అవకాశముంది. ఇక రొటేషన్ పాలసీ ప్రకారం.. ప్రస్తుతం ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడిగా ఉన్న మోహసిన్ నఖ్వీ పదవీ కాలం 2027 ఏప్రిల్తో ముగియనుంది.ఆ తర్వాత కొత్త అధ్యక్షుడిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తరపున ఎవరో ఒకరు ఎంపికయ్యే అవకాశముంది. కాబట్టి ఆసియాకప్ దాదాపుగా బంగ్లా వేదికగా జరగనుంది. కాగా ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది.
వైభవ్ తప్పు చేశాడు.. అస్సలు ఊహించలేదు: సునీల్ గవాస్కర్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఘనమైన అరంగేట్రం లభించలేదు. శనివారం మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో డెబ్యూ చేసిన వైభవ్.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండు సిక్సర్లు కొట్టి మంచి టచ్లో కనిపించిన ఈ చిచ్చర పిడుగు, విల్ జాక్స్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన జాక్స్.. ఐదో బంతిని వైభవ్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన వైభవ్, ఫ్రంట్ ఫుట్కు వచ్చి కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్స్ అయ్యి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతికి వెళ్లింది. బట్లర్ స్టంప్స్ను గిరాటేశాడు. దీంతో వైభవ్ తొలి మ్యాచ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ నేపథ్యంలో కామెంటరీ బాక్స్లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో వైభవ్ అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం లేదని, బౌలర్ ట్రాప్లో చిక్కుకున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు."అది వైభవ్ ఆడే షాట్ కాదు. అనవసరంగా క్రీజు వదలి బయటకు వచ్చాడు. కట్షాట్ ఆడుతాడని ఊహించలేదు. అతడి అసలైన బలం కవర్ డ్రైవ్" అని ఆయన అన్నారు. అంతకుముందు మ్యాచ్ ప్రారంభంలో గవాస్కర్ మాట్లాడుతూ.. సూర్యవంశీ ఇప్పుడు భారత్ ముద్దుబిడ్డగా మారాడు. ప్రతి ఒక్కరూ అతడి రాణించాలని కోరుకుంటున్నారు.అతడు తనదైన శైలిలో మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడుతాడని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. కాగా సంజూ శాంసన్ స్ధానంలో వైభవ్కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ బిహార్ క్రికెటర్కు మరో అవకాశమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో టీ20లో కూడా వైభవ్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూలై 7న మూడో టీ20 ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరగనుంది.
పసికూన చేతిలో పరాభవం.. ఇంగ్లండ్లోనూ అదే తడబాటు
టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్, వరుసగా రెండు పొట్టి ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న టీమిండియాకు ఏమైంది? తమకు కలిసొచ్చిన టీ20 ఫార్మాట్లో ఎందుకు విఫలమవుతోంది? ఒకప్పుడు పసికూనలను ఆటాడుకున్న భారత్,..ఇప్పుడు ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో సైతం ఘోర పరాభవాన్ని మూట కట్టుకుని అబాసుపాలైంది. ఐర్లాండ్ టూర్లో ఎదురైన ఓటముల నుంచి టీమిండియా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. ఇంగ్లండ్ గడ్డపై అదే తీరును భారత్ కొనసాగిస్తోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో మెన్ ఇన్ బ్లూ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. అసలు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ సరికొత్త ‘టమిండియా’ ఎందుకు తడబడుతోంది? లోపాలు ఎక్కడున్నాయి? వాటిపై ఓ లుక్కేద్దాం.కెప్టెన్సీ మార్పు కొంపముంచిందా?ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు ముందు భారత్కు టీ20 ప్రపంచకప్ను అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి మాత్రమే కాకుండా జట్టు నుంచే సూర్యను తప్పించింది. పేలవ ఫామ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ అజిత్ అగార్కర్ తెలిపాడు. అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు భారత టీ20 జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కెప్టెన్గా విజయవంతమైన అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్లో కూడా టీమిండియాను అదేవిధంగా నడిపిస్తాడని అంతా భావించారు. కానీ అయ్యర్ ఆరంభంలోనే అందరి అంచనాలను తారు మారు చేశాడు. కెప్టెన్గా తన తొలి మూడు మ్యాచ్లలోనూ ఓటమి చవిచూశాడు. అయితే సూర్య విషయానికి వస్తే.. అతడి ఫామ్ దిగజారిన మాట వాస్తవే. కానీ కెప్టెన్గా మాత్రం అతడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ సుమారు 80 శాతం విజయాలను సాధించింది. ఆసియాకప్, ప్రపంచకప్లతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి ప్రధాన టీ20 సిరీస్లో కూడా భారత్ గెలుపొందింది. దీంతో ఇప్పుడు సూర్యను అంతా గుర్తు చేసుకుంటున్నారు. సూర్య వుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో కనీసం మూడో టీ20లోనైనా అయ్యర్ కెప్టెన్గా తొలి విజయాన్ని అందుకుంటాడో లేదో వేచి చూడాలి.సరిపోని స్కోర్లు.. స్ట్రైక్ రేట్ పెంచాల్సిందేఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 190 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. ఆధునిక టీ20 క్రికెట్లో అది ఏ మాత్రం సరిపోదని మరోసారి రుజువైంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చెప్పినట్లు, ఈ మ్యాచ్లో భారత్ మరో 20 పరుగులు తక్కువగా చేసింది. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోతున్నారు. అభిషేక్ శర్మ తనదైన శైలిలో పవర్ప్లేలో దుమ్ములేపుతుంటే.. ఆ తర్వాత రన్రేట్ను అదే వేగంతో కొనసాగించడంలో మన బ్యాటర్లు విఫలమవుతున్నారు. ఐర్లాండ్ సిరీస్లో కూడా ఇదే జరిగింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు కాపాడుకునే క్రమంలో డాట్ బాల్స్ ఎక్కువగా ఆడుతున్నారు. దీంతో స్కోర్ వేగం తగ్గి భారీ టార్గెట్లను ప్రత్యర్ధి ముందు భారత్ ఉంచలేకపోతుంది. కచ్చితంగా భారత బ్యాటర్లు తమ స్ట్రైక్ రేట్ పెంచాల్సిందే.తేలిపోతున్న బౌలర్లుమరోవైపు భారత బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. పరుగులను కట్టడి చేయలేక తేలిపోతున్నారు. మాంచెస్టర్ టీ20లో కూడా అదే జరిగింది. 190 పరుగులను డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఇంగ్లండ్ బ్యాటర్లు స్వీప్లు, రివర్స్ స్పీప్లు ఆడుతుంటే.. మన బౌలర్లు కనీసం లెంగ్త్ను కూడా మార్చలేదు.కీలక సమయాల్లో చెత్త బంతులు వేసి మ్యాచ్ను ఇంగ్లండ్కు అప్పగించారు. అర్ష్దీప్ మినహా ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లలో విజయం సాధించాలంటే కచ్చితంగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో మెరుగ్గా రాణించాల్సిందే. లేదంటే యూకే పర్యటనలో మరో సిరీస్ ఓటమి తప్పదు.
శ్రీలంక చిత్తు.. 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
గాలే వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన రెండో అనాధికారిక టెస్ట్లో 10 వికెట్ల తేడాతో భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0తో ఇండియా సొంతం చేసుకుంది. తొలి టెస్ట్ డ్రా అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక-ఎ తమ మొదటి ఇన్నింగ్స్లో 366 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సహాన్ అరాచిగే శతక్కొట్టగా (127).. నువానిదు ఫెర్నాండో 44, అంజల బండారా 42 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, సారాన్ష్ జైన్ నాలుగేసి వికెట్లతో సత్తా చాటగా.. యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 543 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ (267 బంతుల్లో 168; 22 ఫోర్లు) భారీ సెంచరీ చేయగా... దేవదత్ పడిక్కల్ (94) , కెప్టెన్ ధ్రువ్ జురేల్ (88 బంతుల్లో 53; 6 ఫోర్లు), సారాన్ష్ జైన్ (137 బంతుల్లో 70; 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీలతో మెరిశారు.శ్రీలంక బౌలర్లలో కేశర నువాంత నాలుగు, సుదీరా తిలకరత్నే మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది. మరోసారి గుర్నూర్ బ్రార్ 6 వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించాడు. దీంతో ఆతిథ్య శ్రీలంక భారత్ ముందు కేవలం 33 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఈ లక్ష్యాన్ని ఇండియా-ఎ జట్టు వికెట్ నష్టపోకుండా 6.2 ఓవర్లలో చేధించింది.
న్యూస్ పాడ్కాస్ట్
ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించాం. పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించాం. ప్రధాని మోదీ వెల్లడి
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ మైలురాయి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
రాజధానిలో ఒకే నెలలో జరిగిన రెండు మరణాల వెనుక పెద్ద కుట్ర...
చంద్రబాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
రగిలిన రైతన్నలు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు దగాపై దద్ధరిల్లిన విజయవాడ ధర్నాచౌక్
తెలంగాణలో వానల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతన్నలు. పలు జిల్లాల్లో లోటు వర్షపాతం
విత్తనం నుంచి బీమా వరకు అన్నింటా సమస్యలే... ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
ఏపీ రాజధానిలో గూండారాజ్... రైతుల ఆహ్వానం మేరకు భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో తెలుగుదేశం మూకల దాడి
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ ‘అప్పుల క్యాలెండర్’ విడుదల... నెలకు 7 వేల 266 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేయబోతున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు. యాప్లో ఓటీపీలు రాక.. వేలిముద్రలు మ్యాచ్ కాక తిప్పలు
బిజినెస్
ఒక్క రూ.15వేలు ఉంటే చాలు.. స్మార్ట్ఫోన్లపై భలే ఆఫర్లు
స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ మంచి అవకాశంగా మారింది. మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు పెరగడంతో గత కొంతకాలంగా స్మార్ట్ఫోన్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.15 వేలలోపు మంచి ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సేల్లో పలు ప్రముఖ బ్రాండ్లు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రైమ్ డే 2026 సేల్ జూలై 4 నుంచి 6 వరకు కొనసాగుతుండగా, ఇది ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది.ఈ సేల్లో శాంసంగ్, రెడ్మీ, ఐక్యూఓ, రియల్మీ, లావా వంటి బ్రాండ్లకు చెందిన పలు బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్లు తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా రూ.15 వేలలోపు విభాగంలో బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే, 5జీ కనెక్టివిటీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు ఇవి మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి.అంతేకాదు, ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఎంపిక చేసిన ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తోంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే 5 శాతం అపరిమిత క్యాష్బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన మోడళ్లపై 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ బోనస్లు కూడా వర్తిస్తాయి.ఇదిగో ఇవన్నీ రూ.15000 లోపే..రియల్మీ నార్జో 80 లైట్ లిస్టింగ్ ధర రూ. 16,999, ఆఫర్ ధర రూ. 11,499 రెడ్ మీ ఏ7 ప్రో 5జీ లిస్టింగ్ ధర రూ. 15,999, ఆఫర్ ధర రూ. 12,999 ఐక్యూ జెడ్10 లైట్ 5జీ లిస్టింగ్ ధర రూ. 27,999, ఆఫర్ ధర రూ. 13,749 శాంసంగ్ గెలాక్సీ M17 5G లిస్టింగ్ ధర రూ. 16,499, ఆఫర్ ధర రూ. 14,499రియల్మీ నార్జో 100 లైట్ 5జీ లిస్టింగ్ ధర రూ. 24,999, ఆఫర్ ధర రూ. 14,499లావా బోల్డ్ ఎన్2 లిస్టింగ్ ధర రూ. 15,999, ఆఫర్ ధర రూ. 11,249 శాంసంగ్ గెలాక్సీ M17e 5G లిస్టింగ్ ధర రూ. 16,999, ఆఫర్ ధర రూ. 12,999రెడ్ మీ 15సీ 5జీ లిస్టింగ్ ధర రూ. 29,999, ఆఫర్ ధర రూ. 14,999గమనిక: కొన్ని మోడళ్లలో చూపిస్తున్న "లిస్టింగ్ ధర"లో బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, ఎక్స్చేంజ్ బోనస్లు లేదా వేరియంట్ ఆధారిత ధరలు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు సంబంధిత ఉత్పత్తి పేజీలో తుది ధరను ఒకసారి పరిశీలించడం మంచిది.
ఈ హైదరాబాద్ ఐటీ దంపతుల సంపాదన పెరిగిందిలా..
మెట్రో నగరాల్లో నామ మాత్రపు సంపాదనతో నెట్టుకురావడం కష్టం. దంపతులిద్దరి సంపాదన తోడైతేనే సిటీ జీవనం సాఫీగా సాగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్న కెరీర్ అనుభవం ప్రస్తుతం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను, తన భార్య కలిసి గత ఎనిమిదేళ్లలో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్న విధానాన్ని వివరిస్తూ చేసిన పోస్టు వేలాది మంది దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సలహాలపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా వ్యక్తమవుతున్నాయి.అభిషేక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరూ ఐటీ రంగంలో కెరీర్ను ప్రారంభించిన సమయంలో వారి ఉమ్మడి నెలవారీ టేక్హోమ్ జీతం సుమారు రూ.66 వేలు మాత్రమే. ప్రస్తుతం ఎనిమిదేళ్ల తర్వాత అప్పటి కంటే ఊహించని స్థాయిలో ఆదాయం పొందుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో రెండు కీలక నిర్ణయాలు తమ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమయ్యాయని చెప్పారు.ఉద్యోగ మార్పులే కీలకంకెరీర్ ప్రారంభ దశలో ఉద్యోగ మార్పులను తప్పనిసరిగా పరిగణించామని అభిషేక్ వెల్లడించారు. తక్కువ జీతంతో సంపద సృష్టించడం కష్టమని, మెరుగైన వేతనం కోసం సంస్థలను మార్చడం వేగవంతమైన మార్గంగా భావించామని వివరించారు. అలాగే, తమలో ఒకరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, మరొకరు కూడా అదే సమయంలో అవకాశాలు వెతకడం ఒక అలవాటుగా మార్చుకున్నామని చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడటమే కాకుండా, వేతన చర్చల్లో కూడా పరస్పర అనుభవం ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. వేర్వేరు టెక్నాలజీ విభాగాల్లో పనిచేసినా, మార్కెట్లో ఉన్న వేతన ధోరణులపై స్పష్టమైన అవగాహన ఏర్పడేదని వివరించారు.తొలి పదేళ్లు నేర్చుకోవడానికే..యువ ఐటీ ఉద్యోగులు కెరీర్ ప్రారంభ దశలో ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి కొత్త అవకాశాలను పరిశీలించాలని అభిషేక్ సూచించారు. ఇలా చేయడం ద్వారా కొత్త టెక్నాలజీలు, విభిన్న సంస్థల పని విధానం, నాయకత్వ శైలులు తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువు, గృహ రుణాలు వంటి అంశాల కారణంగా ఉద్యోగ భద్రత, స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. "మొదటి పదేళ్లు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత మంచిది. అదే సమయంలో సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం సంపాదించాలి. తర్వాత దశలో సంపాదించిన ఆర్థిక భద్రతను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.ఇది చదివారా? బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులుసోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలుఅభిషేక్ పోస్టుకు స్పందించిన పలువురు ఐటీ నిపుణులు ఆయన సూచనలకు మద్దతు పలికారు. కెరీర్ ప్రారంభ దశలో ఉద్యోగ మార్పులు వేతన పెరుగుదలకు దోహదపడతాయని కొందరు పేర్కొన్నారు. అయితే మరికొందరు దీనిపై విభేదించారు. తరచూ ఉద్యోగాలు మారితే దీర్ఘకాలిక నిబద్ధతపై సంస్థలకు సందేహాలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రస్తుత మార్కెట్లో అనేక కంపెనీలు తరచూ ఉద్యోగాలు మారిన అభ్యర్థుల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కుటుంబ బాధ్యతలు, రుణాలు, వ్యక్తిగత పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటాయని గుర్తుచేశారు.మార్కెట్ ధోరణి ఏమంటోంది?ఇటీవలి కాలంలో భారత ఐటీ రంగంలో భారీ నియామకాల వేగం కొంత మందగించినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు ఇప్పటికీ మంచి డిమాండ్ కొనసాగుతోంది. హెచ్ఆర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉద్యోగ మార్పు ఒక్కటే అధిక వేతనానికి మార్గం కాదు. నైపుణ్యాల పెంపు, పనితీరు, నాయకత్వ సామర్థ్యం, వ్యాపార అవగాహన వంటి అంశాలు కూడా దీర్ఘకాలిక కెరీర్ విజయాన్ని నిర్ణయించే కీలక అంశాలుగా మారుతున్నాయి.#CandidMorning 🤷♂️My wife and I both work in IT, and in just 8 years, we’ve reached income levels we never thought possible when we started out, maybe 50% of where we are.Looking back, two things made the biggest difference.First, we treated job switches like a must, not a… https://t.co/BbFhBc7B1q— Abhishek Singh (@ChaiAndMiles) July 1, 2026
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో రెండు రోజుల భారీగా పెరుగుదల తర్వాత స్వల్పంగా క్షీణించిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
థాయ్లాండ్ వెళ్లేవారికి కొత్త రూల్స్.. ముఖ్యంగా ‘క్యాష్’
భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన విదేశీ గమ్యస్థానాల్లో థాయ్లాండ్ ఒకటి. అయితే తాజాగా అక్కడి ప్రవేశ నిబంధనలు కఠినతరం కావడంతో ప్రయాణానికి ముందు అవసరమైన పత్రాలు, వీసా, ఇతర షరతులను తప్పనిసరిగా పరిశీలించాలని బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. జూలై 2న విడుదల చేసిన తాజా అడ్వైజరీలో భారతీయులు థాయ్లాండ్కు బయలుదేరే ముందు పాటించాల్సిన కీలక మార్గదర్శకాలను వెల్లడించింది. ఇటీవల భారతీయ పాస్పోర్ట్దారులకు అమల్లో ఉన్న వీసా-రహిత ప్రవేశ విధానంలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది.రాయబార కార్యాలయం సూచనల ప్రకారం.. థాయ్లాండ్ చేరుకునే తేదీ నుంచి కనీసం ఆరు నెలల గడువు ఉన్న చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ తప్పనిసరి. అలాగే కన్ఫర్మ్ అయిన రిటర్న్ విమాన టికెట్, హోటల్ బుకింగ్, స్పష్టమైన ట్రావెల్ ఇటినరరీ (ప్రయాణ ప్రణాళిక) వెంట ఉండాలి. ప్రయాణికులు దేశంలో అడుగుపెట్టే 72 గంటల ముందు థాయ్లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ (TDAC)ను ఆన్లైన్లో తప్పనిసరిగా పూర్తి చేయాలి. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో చూపించాల్సి ఉంటుంది.వీసా, నగదు నిబంధనలుప్రయాణ ఉద్దేశానికి అనుగుణంగా సరైన వీసా పొందాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్ (VOA) లేదా వర్తించే ప్రవేశ సదుపాయాన్ని వినియోగించే ప్రయాణికులు ఒక్కొక్కరు కనీసం 20,000 థాయ్ బాట్లు (సుమారు రూ.57,000–58,000) నగదు వెంట ఉంచుకోవాలని సూచించింది. అవసరమైతే దీనికి సంబంధించిన ఆధారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉద్యోగం కోసం వెళ్తుంటే జాగ్రత్తథాయ్లాండ్లో ఉద్యోగం పొందిన వారు పర్యాటక వీసా లేదా వీసా ఆన్ అరైవల్పై దేశంలోకి ప్రవేశించకూడదని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఉపాధి కోసం వెళ్లేవారు ముందుగానే తగిన వర్క్ లేదా సంబంధిత వీసా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్థానిక ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది. అలాగే థాయ్లాండ్ మీదుగా మరో దేశానికి వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికులు తమ తుది గమ్యస్థానానికి అవసరమైన వీసాలు, టికెట్లు, ఇతర పత్రాలను కూడా వెంట ఉంచుకోవాలని సూచించింది.ముఖ్యమైన చెక్లిస్ట్ ఇదే..చేరుకునే తేదీ నుంచి కనీసం 6 నెలల గడువు ఉన్న పాస్పోర్ట్.కన్ఫర్మ్ అయిన రిటర్న్ టికెట్.ధ్రువీకరించిన హోటల్ బుకింగ్.పూర్తి ప్రయాణ ప్రణాళిక.ప్రయాణానికి 72 గంటల ముందు పూర్తి చేసి TDAC క్యూఆర్ కోడ్ప్రయాణ ఉద్దేశానికి తగిన వీసావెంట కనీసం 20,000 థాయ్ బాట్ల నగదు.ఇమ్మిగ్రేషన్ కౌంటర్కు వెళ్లే ముందు అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం.గ్రూప్గా వెళ్లినా ప్రతి ప్రయాణికుడు తన సొంత పత్రాలు కలిగి ఉండడం.ఉద్యోగం కోసం వెళ్తుంటే టూరిస్ట్ ఎంట్రీ సదుపాయాలను ఉపయోగించకపోవడం.ట్రాన్సిట్ ప్రయాణికులు తుది గమ్యస్థానానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవడం.ప్రయాణానికి ముందు తాజా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా అర్హతలు, అవసరమైన పత్రాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. దీంతో థాయ్లాండ్లో ప్రవేశ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, ప్రయాణం సాఫీగా సాగుతుందని పేర్కొంది.Advisory for Indian nationals visiting Thailand. pic.twitter.com/wEAMyH7H0D— India in Thailand (@IndiainThailand) July 2, 2026
ఫ్యామిలీ
Fashion: పోగు పెట్టుకో... పోజు కొట్టుకో!
ఒకప్పటి రాజుల ఫొటోలు చూస్తే, ఒంటినిండా నగలతో మెరిసిపోతూ కనిపించేవారు. మధ్యలో ఏమైందో ఏమో మగవాళ్లు జ్యూలరీకి కాస్త దూరమయ్యారు. అయితే, ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్ ప్రపంచం పెద్ద యూటర్న్ తీసుకుంది. రాజుల కుండలాలు కాస్త కూల్ ఇయర్రింగ్స్గా మారి కుర్రాళ్ల స్టయిల్కు కొత్త మెరుపు తెస్తున్నాయి. మగాళ్లను మళ్లీ మహారాజుల్లా మెరిపిస్తున్న ఈ ఇయర్రింగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం!స్టడ్స్సింపుల్గా ఉండాలనుకునే వారికి ఇవి బెస్ట్. చిన్న రాయి లేదా మెటల్ డిజైన్ తో నల్లటి చుక్కలా ఉండే స్టడ్స్ ఎలాంటి దుస్తులతోనైనా సెట్ అయిపోతాయి. సైలెంట్గా స్టయిల్ మెయింటైన్ చేయాలంటే స్టడ్స్ పెట్టుకోవాల్సిందే!రింగ్స్కొంచెం రఫ్ అండ్ టఫ్ లుక్ కావాలంటే ఇవి పర్ఫెక్ట్. స్పోర్ట్స్ బైక్ మీద కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్తుంటే... ఆ రింగ్ గాలికి ఊగుతూ మెరుస్తుంటే.. అబ్బా, ఆ కిక్కే వేరు! చిన్న రింగ్స్ నుంచి పెద్ద రింగ్స్ వరకు ఎన్నో డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.డాంగ్లర్స్ ఇవి పెట్టుకుంటే స్టయిల్ మీటర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. చెవికి కిందకి వేలాడే ఇవి సాధారణ లుక్ను క్షణాల్లో ట్రెండీగా మార్చేస్తాయి. ముఖ్యంగా క్రాస్ డిజైన్లు, ఫంకీ పెండెంట్లు ఉన్న డాంగ్లర్స్ పూల్ పార్టీలు, బీచ్ వెకేషన్లు, వీకెండ్ ట్రిప్స్లకు, ఇవి పెట్టుకున్న వెంటనే తెలియకుండా అందంగా కనిపిస్తారు.మ్యాగ్నెటిక్ పోగులు ‘ఫ్యాషన్ కావాలి. కాని, సూదితో చెవి కుట్టించుకునే ధైర్యం లేదు’ అనుకునే సుకుమారుల కోసం దేవుడు సృష్టించిన, భయస్తుల బ్రహ్మాస్త్రాలు ఇవి. అంటించుకుంటే అతుక్కుంటాయి, తీసేస్తే వచ్చేస్తాయి.పోగు పెట్టుకుంటే... స్టార్ అయిపోరు!సినిమా హీరోలు, క్రీడాకారులు చెవికి పోగు పెట్టుకున్నారని చాలామంది సేమ్ స్టయిల్ ఫాలో అవుతుంటారు. అయితే, చెవి పోగు పెట్టుకున్న వెంటనే బ్యాక్గ్రౌండ్లో హీరో ఇంట్రో మ్యూజిక్ మొదలవుతుందని మాత్రం అనుకోవద్దు! అసలు మ్యాజిక్ పోగులో కాదు... దాన్ని ఎలా క్యారీ చేస్తారన్న దాంట్లో ఉంది. మీ ముఖాకారం, హెయిర్ స్టయిల్, దుస్తులకు సరిపోయే డిజైన్ ను ఎంచుకుంటేనే లుక్ అదిరిపోతుంది.స్కిన్ టోన్ కు తగ్గట్టు బ్లాక్, సిల్వర్ లేదా గోల్డ్ కలర్ను ఎంచుకోండి. కనిపించిన ప్రతీ డిజైన్ను ఒకేసారి ట్రై చేస్తే క్రిస్మస్ ట్రీలా తయారవుతారు. అలాగే మరీ బరువైన పోగులు పెట్టుకుని చెవులకు జిమ్ వర్కౌట్ ఇవ్వొద్దు. అలాగే రోజుకో పోగు, గంటకో స్టయిల్ మార్చేస్తే కన్ఫ్యూజన్ మీకే. మీ ఫేస్కు ఏది బాగా సెట్ అవుతుందో అదే ఫిక్స్ చేసుకోండి. తర్వాత అద్దం ముందు నిలబడి ఒక్కసారి చూసుకోండి... మీరే మీకు ఫ్యాన్ అయిపోతారు! - కొండి దీపిక
బిర్యానీ భోజనంబు..ఎలా వచ్చిందంటే..!
కరోనా కాలంలో, లాక్డౌన్ కష్టకాలంలో ఒక భక్తుడు నర్సాపూర్ అడవుల్లోకి వెళ్లి తపస్సు చేశాడట. దేవుడు ప్రత్యక్షమై... ‘మణులు కావాలా? మాణిక్యాలు కావాలా? బంగారు గనులు కావాలా?’ అని అడిగాడు. ‘అవన్నీ నాకెందుకు స్వామీ... వేడి వేడి బిర్యానీ కావాలి. ఈ కరోనా పుణ్యమా అని బిర్యానీ తినక రెండు నెలలు అవుతోంది’ అన్నాడట ఆ భక్తుడు. ఇది జోకే కావచ్చుగానీ బిర్యానీ అభిమానుల వీరాభిమానం గురించి చెప్పే జోకు. ఈరోజు బిర్యానీ డే. ‘నాకు ప్రతిరోజూ బిర్యానీ డేనే’ అనేవాళ్లు ఉంటారనేది వేరే విషయంగానీ ఈ సండే వేడి వేడిగా బిర్యానీ కుబుర్లు చెప్పుకుందాం...అలనాటి బెరియనే... నేటి బిర్యానీ!బిర్యానీకి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దీని మూలాలు మెసొపుటేమియాలోని ప్రాచీన నాగరికతలో ఉన్నాయి. ఆ కాలంలో ‘బెరియన్’ అని పిలిచేవారు.‘బిర్యానీ’ అనేది పర్షియన్ పదం ‘బిర్యాన్’ నుండి వచ్చింది. దీని అర్థం... వండడానికి ముందు వేయించినది.మొఘల్ రాజుల కాలంలో బిర్యానీకి ప్రాచుర్యం వచ్చి ప్రజాదరణ పొందింది. సామాన్యుల నుంచి చక్రవర్తుల వరకు రకరకాల బిర్యానీ రుచులను ఇష్టంగా ఆస్వాదించేవారు.ఎన్నో బిర్యానీలు... వాటిలో కొన్ని...బంగాళదుంపలను ఉపయోగించి చేసే బిర్యానీ... కల్కత్తా బిర్యానీ. ఆహార కొరత సమయంలో బియ్యాన్ని పొదుపుగా వాడేందుకు వచ్చిన వంటకమే ఈ కల్కత్తా బిర్యాని.కేరళలో తలస్సేరి బిర్యానీ ఫేమస్. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో అంబూర్ బిర్యానీ ఫేమస్. అంబూర్ అనే సిటీలో పుట్టిన బిర్యానీ ఇది.జపాన్లో ‘సుషీ బిర్యానీ’ మెక్సికోలో ‘క్వెసడిల్లో బిర్యానీ’లు రుచికరమైన క్రియేటివ్ బిర్యానీలుగా పేరు తెచ్చుకున్నాయి.బిర్యానీ బుక్బిర్యానీపై నోరూరించే పుస్తకాలు ఎన్నో వచ్చాయి. అందులో ఒకటి ప్రతిభా కరణ్ రాసిన... బిర్యానీ. బిర్యానీ ఫ్లాష్బ్యాక్తోపాటు నారింజ పండ్లతో చేసే బిర్వానీ, రోజ్ బిర్యానీ, కబాబ్ బిర్యానీలాంటి అరుదైన పాతకాలపు బిర్యానీలను పరిచయం చేశారు. హైదరాబాద్లో ప్రసిద్ధి పొందిన దూద్ బిర్యానీ(పాలతో చేసే బిర్యానీ), కీమా బిర్యానీ, బటేర్ బిర్యానీ... మొదలైన బిర్యానీ రకాల గురించి చెప్పారు.తమిళనాడులో ప్రసిద్ధి పొందిన సేలం, అంబూర్, దిండిగల్...మొదలైన బిర్యానీలను కూడా పరిచయం చేశారు. కేరళలో రొయ్యలు, కరివేపాకు, సోంపుతో తయారుచేసే రొయ్యల బిర్యానీ, అనాస పువ్వులతో చేసే మటన్ బిర్యానీల గురించి చెప్పారు. వెనిగర్, ఆలివ్ ఆయిల్ను ఉపయోగించి చేసే గోవా బిర్యానీ, చేపలు, ఆవాలు ఉపయోగించే చేసే బెంగాలి స్టైల్ బిర్యానీలు, అస్సాం బిర్యానీలు... ఇలా ఎన్నెన్నో బిర్యానీలు పుస్తకంలో నోరూరిస్తాయి.నవాబ్బాయ్ బిర్యానీదిల్లీలో జరిగిన నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఆటగాళ్లకు వేడి వేడి బిర్యానీ వడ్డించాడు నవాబుద్దీన్. ఎన్నో సంవత్సరాలుగా షూటింగ్ స్పోర్ట్స్లో పాల్గొనే ఆటగాళ్లకు బిర్యానీ వడ్డిస్తున్న నవాబ్ భాయ్ ఒకప్పుడు షూటర్. ఎంతోమంది షూటర్లకు ఆయన వడ్డించే బిర్యానీ అంటే ఇష్టం. ఈ బిర్యానీ ‘నవాబ్ భాయ్ బిర్యానీ’గా ప్రసిద్ధి పొందింది.బిర్యానీ అండ్ అజిత్హీరో అజిత్కు బిర్యానీ అంటే చాలా ఇష్టం. తాను తినడమే కాదు ఇతరులతో తినిపించడం అంటే కూడా ఇష్టం. షూటింగ్లలో ఆయనే స్వయంగా బిర్యానీ చేసి అక్కడున్న వాళ్లకు వడ్డించిన సందర్భాలు ఉన్నాయి. అజిత్కు బిర్యానీపై ఉన్న అంతులేని ఇష్టానికి ముగ్ధుడైన దర్శకుడు వెంకట్ ప్రభు తాను తీసిన బ్లాక్ కామెడీ సినిమాకి ‘బిర్యానీ’ అని పేరు పెట్టాడు. (చదవండి: తొమ్మిదేళ్లకే ప్రపంచ గుర్తింపు..! ఏకంగా ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఆహ్వానం ..)
చేదు మేసి నెమరేసిన రచయిత!
‘నా దృష్టిలో శిశిరం ఎప్పుడూ విషాదాన్ని మిగిల్చే రుతువు కాదు. రాలిన ఆకులూ, బక్కచిక్కిన పగళ్ళూ అంతిమ ఘడియలకు ప్రతీకలుగా కనిపించవు నాకు. అవి నా కళ్ళకు భవిష్యత్తు గురించిన ఆశల్లా కనిపిస్తాయి. అక్టోబరు మాసపు అసురసంజ వేళల్లో ఏదో విద్యుద్వాహిని ప్యారిస్ వీథుల్లో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. అలాంటప్పుడు ముసురుపట్టి చినుకులు పడుతున్నా, నా మనసేం కుంగిపోదు! అలాగని కాలం పిట్ట రెక్కలమీద ఎగురుతున్నట్లూ అనిపించదు!!అలాంటి వేళల్లో ఏం జరిగినా జరగొచ్చని మాత్రమే అనిపిస్తుంది నాకు. నా వరకూ నాకు, అక్టోబరులోనే నూతన సంవత్సరానికి తెర తీస్తున్నట్లు భావిస్తాన’న్న రచయిత ఏ భావకవిగారో కాదు సుమా! అతగాడు ఫక్తు నవలా రచయిత! 2014లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న ప్యాట్రిక్ మొద్యానా చారిత్రక కాల్పనిక నవలలు రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందినవాడు. ఆయన రాసిన నాలుగు పదులకు మించిన పుస్తకాలన్నింటా ప్రాథమిక ఇతివృత్తం దాదాపు ఒకటే! రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్ ప్రజలు పడ్డపాట్లకే ఒకింత కాల్పనికత మేళవించి, మొద్యానా ఈ నవలలు రాశాడు. ‘చేజారిన యవ్వనం కెఫేలో...’ అనే నవలలో రాసినవే పైన ఉట్టంకించిన మాటలు.రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు ఎనిమిది కోట్లమంది జనం ఉన్నవూరికీ, కన్నవారికీ, కట్టుకున్నవారికీ, కన్న బిడ్డలకూ, చేసుకునే వృత్తులకూ దూరమై అలమటించారు. ఈ యుద్ధానికి ప్రధాన రణక్షేత్రంగా ఉండిన యూరపులోనే ఇలాంటి బాధితుల సంఖ్య సగానికి సగం వుంటుంది. యుద్ధబాధితుల్లో సగానికి సగం మంది స్త్రీ– శిశు– వృద్ధులే! ముఖ్యంగా, వేర్వేరు నిర్బంధ శిబిరాల్లో బంధితులైన స్త్రీపురుషుల సంతానం అకస్మాత్తుగా అనాథలుగా మారి, నడివీథిలో నిలబడవలసి వచ్చింది. అలాంటి వారిలో, 1945లో పుట్టిన మొద్యానా కూడా ఒకడు.ఈ యుద్ధం సందర్భంగానే, అరవై లక్షలమంది యూదులను ఊచకోత కోశారు. మొద్యానా తండ్రి ఆల్బెర్ట్ కూడా యూదు మతస్థుడే; ఇటాలియన్ కులీన వంశానికి చెందిన ఆల్బెర్ట్ నాజీలతో చేతులు కలిపినవాడు. అతని తల్లి లూయిజా ఫ్లెమిష్ (బెల్జియన్–డచ్) సాంప్రదాయిక నర్తకి. ఫ్రాన్స్ విదేశీ దురాక్రమణకు గురైన రోజుల్లో, 1942లో, వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రణయానికీ, పరిణయానికీ దారితీసింది. యుద్ధకాలంలో, మొద్యానా తండ్రి కార్లాంగ్ అనే ఫ్రెంచ్ గెశ్టాపో ఆశీర్వాద బలంతో– బ్లాక్ మార్కెట్లో వీరవిహారం చేశాడంటారు. కార్లాంగ్ సారథులు, నేర ప్రపంచంలో కొమ్ములు తిరిగిన దున్నపోతులై వుండడం వల్లనే, ఇది సాధ్యమైందని కూడా చెప్తారు!రెండో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు మొద్యానా తల్లితండ్రులు కారనేది వాస్తవం! అయితే ఆ యుద్ధ పరిణామాల వల్ల, మొద్యానా మాదిరిగా, ‘పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని కూనలు’ ఎందరో అత్యంత తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చిందనే మాట కూడా వాస్తవమే మరి! అందుకే, మొద్యానా తన తల్లిదండ్రుల తరాన్ని జీవితంలో ఎన్నడూ క్షమించలేదు!! ఫ్రాన్స్లో చిన్నాపెద్దా ఊళ్ళకు కూడా మొద్యానా పేరును పరిచయం చేసిన ‘మాయమైన మనిషి’ లాంటి నవలలు మొదలుకొని ‘డారా బ్రూడర్’, ‘ముక్కలైన వాక్యాలు (మూడు నవలల సంపుటి)’, ‘కనిపించని సిరా’– ఇలా ఏ నవలను చూసినా ఇదే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.నోబెల్ ప్రైజ్ పొందిన తర్వాత, అనేక భాషల్లోకి అనువాదమైన మొద్యానా 139 పుస్తకాలలో దేన్ని చూసినా ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. పైపైన చూస్తే మొద్యానా రాసింది అపరాధ పరిశోధన సాహిత్యం అనిపిస్తుంది. అయితే, ఆ ‘అపరాధం’ చట్టాలు నిషేధించిన నేరాలు చేయడమే కాదు– స్త్రీలనూ, బాలలనూ– వృద్ధులనూ వేధించిన కండకావరం! దాన్ని నిరసించడానికే మొద్యానా తన సాహిత్య జీవితాన్ని మొత్తం అంకితం చేశాడు. అయితే, ఆ విషయం వాచ్యంగా చెప్పకుండా, సాహిత్య మర్యాదలన్నీ పాటించడంలో మొద్యానా శిల్ప పరిణతి కనిపిస్తుంది. అందువల్లనే ఈ అపరాధ పరిశోధక రచయితకు నోబెల్ పురస్కారం దక్కింది!మొద్యానా చవిచూసిన చేదు అనుభవాల్లో, ఘోరాతి ఘోరమైన విషయాలున్నాయి. అతన్ని పెంచి పెద్ద చేయడం ‘పెనుభారం’గా అటు తల్లీ, ఇటు తండ్రీ కూడా భావించడం వాటిలో మొదటిది. సదరు భారాన్ని తమ నెత్తిమీంచి దించి, ఎదుటివారి నెత్తిన మోపేందుకు నానా పాట్లూ పడ్డం రెండో ఘోరం. సహాయం కోరి ఆశ్రయించిన పాపానికి, మొద్యానాను తాము విదిలించి పారేయడమే కాకుండా, తమ బాయ్ ఫ్రెండ్సూ– గర్ల్ ఫ్రెండ్సూ చేత కూడా అదే సత్కారం జరిపించడం ఘోరాతి ఘోరం! ఇంత జరిగిన తర్వాత, తన తల్లితండ్రుల తరాన్ని అసహ్యించుకున్నందుకు మొద్యానాను ఎవరైనా తప్పు పట్టగలరా? సొంత అనుభవాలే పూర్వరంగంగా ఆనాటి ఫ్రాన్స్లో రచయితగా మనగలగడం మజాకా కాదు.ఆధునిక ఫ్రెంచ్ వాడుకభాషను ఓ మలుపుతిప్పిన రేమన్ కెనో, మొద్యానా తల్లికి నేస్తం; మొద్యానాకు గురువు. అతని చలవతోనే, మొద్యానా తన తొలినవల ‘నక్షత్ర కూడలి’ అచ్చువేయించుకున్నాడు. అందులో ప్రధాన పాత్రలు మొద్యానా తండ్రిని పోలివుండడం మింగుడు పడనందువల్లనే ఆ పెద్దమనిషి సదరు నవల కాపీలు దొరికినన్ని కొనేసి తగలబెట్టేశాడట!‘దురాక్రమణ పాలైన ప్రాంతాల్లో జీవప్రపంచం అనుభవించిన స్థితిగతులనూ, ఎవరికీ బోధపడని మానవాళి భవితనూ సొంత జ్ఞాపకాల ప్రాతిపదికగా మన కళ్ళముందు ఉంచిన కళ మొద్యానా సొంతమ’న్నారు స్వీడిష్ ఎకాడెమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్. ఫ్రాన్సులో సుప్రసిద్ధుడైన మొద్యానా మరెక్కడా ప్రాచుర్యానికి నోచుకోలేదని 2014లో పీటర్ ఇంగ్లండ్ అన్నమాట వాస్తవమే. అయితే యేం? నోబెల్ పురస్కారం కోసం నామినేట్ అయిన తొలిసారే, అతన్ని ఆ బహుమతి వరించడం కూడా వాస్తవమే మరి! - మందలపర్తి కిషోర్
గొలుసు ఉత్తరం..
ఒకప్పటి కాలం ఉత్తరాల కాలం. అప్పట్లో చాలా ఉత్తరాలు వచ్చేవి. కాని జాగృత్ ఆ కాలానికి సంబంధించినవాడు కాదు. ఉత్తరాల అవసరం ఆగిపోయిన, ఎలక్ట్రానిక్ కాలానికి చెందినవాడు. అతను నివసించే అపార్ట్మెంట్లో అతని మెయిల్ బాక్స్లో అరుదుగా ఉత్తరాలు పడుతూంటాయి. చిట్ఫండ్ కంపెనీ ఇంటిమేషన్, ఎల్.ఐ.సి. రసీదులు, రిమైండర్స్, నవరాత్రులలో పూజకి డబ్బు పంపమని అతని గ్రామ పూజారి నుంచి ప్రింటెడ్ బ్రోచర్ లాంటివి.ఆరోజు అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక, అలవాటుగా తన మెయిల్ బాక్స్ ట్రా¯Œ ్సపరెంట్ అద్దం తలుపులోంచి చూస్తే లోపల ఓ కవర్ కనిపించింది. తాళం తెరిచి దాన్ని తీసుకుని చూశాడు. అది ఐదు రూపాయల పోస్టల్ కవర్. ఫ్రమ్ అడ్రస్ లేదు. టు అడ్రస్ అందమైన చేతిరాతలో ఉంది.అతను దాన్ని తీసుకుని లిఫ్ట్లో ఆరో అంతస్తులోని తన అపార్ట్మెంట్కి చేరుకుని దాన్ని బల్ల మీద పడేశాడు. రాత్రి పడుకోబోయే ముందుదాకా అతని దృష్టి దాని మీద పడలేదు. పడుకోబోయే ముందు దాన్ని అందుకుని చింపి చదివాడు. అది చేతిరాతలో ఉన్న ఓ హెచ్చరిక. ఆ ఉత్తరాన్ని అది చదివిన 24 గంటల్లోగా మొత్తం కాపీ చేసి కనీసం ఒకరికి పంపాలని, దాన్ని కాపీ చేసి పంపకపోతే ఒకతని భార్య ఆత్మహత్య చేసుకుందని, మరొకరికి ఆస్తి నష్టం వచ్చిందని, కాబట్టి ఆ చై¯Œ ని బ్రేక్ చేయొద్దని దాని సారాంశం. అందులో షిరిడీ బాబా చెప్పిన పన్నెండు బోధనలు ఉన్నాయి.జాగృత్ కొలిచేది ఒక్క షిరిడీ సాయినే. ప్రతి ఉగాదికి షిరిడీకి వెళ్తాడు. ప్రతి నవరాత్రులలో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర చదువుతాడు. అయితే అతనిది మూఢ భక్తి కాదు. దేన్నయినా హేతువాదంతో ఆలోచిస్తాడు. తను ఆ చై¯Œ ని బ్రేక్ చేస్తే ఆపద వాటిల్లుతుందని జాగృత్ క్షణకాలం కూడా నమ్మలేదు. ఓ మనిషికి కీడుని కలిగించే గొప్ప శక్తి ఆ గొలుసు ఉత్తరానికి ఉండదని అతని స్థిరనమ్మకం.అయినా, జాగృత్ కాగితం, కలం తీసుకుని ఆ ఉత్తరాన్ని కాపీ చేశాడు. అందుకు కారణం, కొత్తవాళ్ళకి ఆ ఉత్తరం అందితే వారి దృష్టిని తను కొలిచే సాయి మీదకి మళ్ళించినవాడు అవుతాడు. వాళ్ళు సాయి భక్తులు కాకపోతే ఇప్పుడు అయ్యే అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో దాన్ని కాపీ చేశాడు.మర్నాడు దాన్ని ఆఫీస్కి తీసుకెళ్ళాడు. అది ఎవరికి పంపాలా అని ఆలోచించాడు. లంచ్ అవర్లో అతను తిరిగి తన సీట్కి వస్తూంటే, ఆ మల్టీస్టోరీడ్ కమర్షియల్ ఆఫీస్ బిల్డింగ్ లోని ఓ ఆఫీస్ తలుపు బయట ఆ కంపెనీ ఫైనాన్షియల్ మేనేజర్ పేరు కనిపించింది. జాగృత్ తన సీట్కి వెళ్ళాక ఆఫీస్ కవర్ తీసుకుని, ఆ కవర్ మీద అతని పేరు, డిజిగ్నేషన్, అతని ఆఫీస్ చిరునామా రాశాడు. మధ్యాహ్నం మూడున్నరకి బాత్రూమ్కి వెళ్ళడానికి లేచినప్పుడు డిస్పాచ్ క్లర్క్కి ఆ కవర్ ఇచ్చి చెప్పాడు.‘‘దయచేసి దీన్ని పోస్ట్ చెయ్యి.’’జాగృత్ ఆ సంగతి అంతటితో మరిచిపోయాడు.∙∙ కొన్ని వారాల తర్వాత జాగృత్ దగ్గరకి ఓ కొత్త వ్యక్తి వచ్చి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అడిగాడు.‘‘ఈ ఆదివారం ఫ్రీగా ఉంటారా?’’‘‘ఏమిటి విశేషం?’’ అతను అడిగాడు.‘‘ఈ ఆదివారం మా ఇంట్లో సాయి భజన జరుగుతుంది. ఎందుకో మిమ్మల్ని పిలవాలని అనిపించింది.’’‘‘నేను సాయి భక్తుడిని. తప్పకుండా వస్తాను. లొకేషన్ షేర్ చేయండి.’’ జాగృత్ చిరునవ్వుతో అంగీకరించాడు.‘‘నెహ్రూ నగర్లో ఇండియన్ బ్యాంక్ తెలుసుగా. దాని పక్కన ఫస్ట్ ఫ్లోర్. కాబట్టి తేలిగ్గా రాగలరు.’’జాగృత్ ఆదివారం కొబ్బరికాయ, పూలున్న కేరీ బ్యాగ్తో ఆ ఇంటికి చేరుకున్నాడు.‘‘ఇంకా ఎవరూ రాలేదు. ఐదు నిమిషాల్లో అంతా ఇక్కడ ఉంటారు. ఈలోగా మీరు దీన్ని తాగండి. అందరికీ కలిపాను.’’జాగృత్ రూహఫ్జా తాగాక అతను చెప్పాడు.‘‘మీరో ఘోరమైన పొరపాటు చేశారు.’’‘‘పొరపాటా? నేనా? ఏమిటది?’’ జాగృత్ ఆశ్చర్యంగా అడిగాడు.అతను జాగృత్ పంపిన గొలుసు ఉత్తరాన్ని చూపించాడు.‘‘ఇదే మీరు చేసిన ఘోరమైన పొరపాటు.’’‘‘ఏం పొరపాటు?’’ జాగృత్ అర్థం కాక అడిగాడు.‘‘నేను ఒరియావాడిని. నాకు తెలుగు చదవడం వచ్చి, అప్పుడే దీన్ని చదివి ఉంటే ఇరవై నాలుగు గంటల్లో ఈ ఉత్తరాన్ని కాపీచేసి పంపేవాడిని. కాని నిన్నటి దాకా ఇందులో ఏముందో నాకు తెలీదు. నిన్న మా ఇంటికి వచ్చిన తెలుగు తెలిసిన ఓ బంధువు చదివి చెప్పారు. ఇది అందిన నాలుగో రోజున నా భార్య ఆత్మహత్య చేసుకుంది.’’‘‘అయ్యో. ఐ యాం వెరీ సారీ.’’‘‘ఆ తర్వాత రెండు రోజులకి ఊళ్ళోని మా ఉమ్మడి ఆస్తిలోంచి నా జ్ఞాతులు నా భాగాన్ని కొట్టేశారు.’’‘‘అరెరే.’’‘‘నన్ను నా మానాన బతకనివ్వకుండా నువ్వు అనవసరంగా నా జీవితంలో జోక్యం చేసుకున్నావు. ఈ ఉత్తరం ద్వారా నాకు నష్టాన్ని కలిగించావు.’’ అతను కోపంగా చెప్పాడు.‘‘కాదు. నేను దీన్ని నమ్మలేదు. సరదాకి దీన్ని పంపాను. ఈ ఉత్తరానికీ, మీకు జరిగిన నష్టాలకి ఎలాంటి సంబంధం లేదు. హేతువాదంతో ఆలోచించండి.’’‘‘నాకు జరిగిన నష్టాలకి నేను ఆవేదనతో కుమిలిపోతూండగా, ఈ ఉత్తరం నువ్వు పంపావని తెలిసి నా మనసు కుతకుతలాడిపోతోంది. కవర్ మీద నీ ఆఫీస్ ఎడ్రస్ పైన కేరాఫ్ అని నీ పేరు రాసి ఉండటంతో నిన్ను తేలిగ్గా కనుక్కున్నాను. అందుకే భజన నెపంతో నిన్ను ఇక్కడికి రప్పించాను. నువ్వు తాగిన రూహఫ్జాలో విషం ఉంది. ఇంకో పావుగంట తర్వాత నువ్వు జీవించవు.’’డిస్పాచ్ క్లర్క్ కవర్ మీద తన పేరు రాసి ఉంటాడని స్పృహ తప్పేముందు జాగృత్కి తోచింది. - మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com
అంతర్జాతీయం
వోయేజర్-1… ‘కాంతి రోజు’!
ఓ బాటసారి... ఇది విశ్వపు రహదారి... ఏది అంతమో... ఎంత దూరమో... ఎవరూ ఎరుగని దారి ఇది.. వినడానికే అబ్బురపరచే దూరం అది! ‘ద స్కై లైవ్’ సమాచారం ప్రకారం 2026 జులై 4 నాటికి తన సుదీర్ఘ యానంలో భూమి నుంచి కచ్చితంగా 2,547 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది నాసా అంతరిక్ష నౌక ‘వోయేజర్-1’. భూమి నుంచి అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఇదే. 2,547 కోట్ల కిలోమీటర్లు అంటే భూమి నుంచి 170 సార్లు సూర్యుడి వద్దకు వెళ్లినంత దూరం.2012 ఆగస్టులో ‘ఇంటర్స్టెల్లార్ స్పేస్’ (నక్షత్రాంతర రోదసి)లో ప్రవేశించిన ‘వోయేజర్-1’… అలుపూ సొలుపూ లేని తన 49 సంవత్సరాల అనంత యాత్రలో రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 1,583 కోట్ల మైళ్ల దూరం ప్రయాణించింది. శాస్త్రవేత్తలు పంపే ఆదేశాలు ఈ నౌకను చేరడానికి 23.5 గంటలు పడుతోంది. వాటికి ప్రతిస్పందించి ‘వోయేజర్-1’ పంపే సందేశాలు భూమిని చేరడానికి కూడా అంతే సమయం పడుతోంది. అంటే ఈ ‘ఉత్తర ప్రత్యుత్తరాలకు’ దాదాపు రెండు రోజులు పడుతోంది. ‘వోయేజర్-1’ స్పేస్ క్రాఫ్ట్ తదుపరి లక్ష్యం... ‘కాంతి రోజు’ను చేరడం. ఈ ఏడాది నవంబరు 26న అది ‘కాంతి రోజు’ లక్ష్యాన్ని అధిగమిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఏమిటీ ‘కాంతి రోజు’?అంతరిక్ష దూరాలను ‘ఆస్ట్రనామికల్ యూనిట్స్’లో కొలుస్తారు. భూమికి, సూర్యుడికి మధ్య దూరం సుమారు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ (AU). ఒక నక్షత్రానికి, మరో నక్షత్రానికి మధ్య మరీ ఎక్కువగా ఉండే నక్షత్రాంతర దూరాలను కాంతి సంవత్సరాల్లో వర్ణిస్తారు. కాంతి సంవత్సరం అంటే... కాంతి ఏడాది కాలంలో ప్రయాణించే దూరం. ఒక సెకనులో కాంతి ప్రయాణించే దూరం మూడు లక్షల కిలోమీటర్లు. ‘వోయేజర్-1’ను నాసా 1977 సెప్టెంబరు 5న ప్రయోగించింది. గురుడు, శని గ్రహాల అధ్యయనంతోపాటు నక్షత్రానంతర మాధ్యమం అన్వేషణ నిమిత్తం నాసా ఈ మిషన్ చేపట్టింది.2027 సంవత్సరంలో ఈ వ్యోమనౌక 50వ పడిలో పడుతుంది. ఈ ‘గోల్డెన్ జూబిలీ ఇయర్’లోపు మరో మరపురాని అద్భుత ఘట్టం సాక్షాత్కరించబోతోంది. ఈ ఏడాది నవంబరు 26న ఈ స్పేస్ క్రాఫ్ట్ తన ఇల్లు అయిన భూమి నుంచి 1,610 కోట్ల మైళ్లు లేదా 2,590 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 173 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరం... కాంతి ఒక రోజులో (One Light Day) ప్రయాణించే దూరంతో సమానం. కాంతి సంవత్సరాల యూనిట్ పరంగా ఇదొక మైలురాయి లాంటిది. కాంతి వేగంతో ప్రయాణించే రేడియో సంకేతాలు భూమి నుంచి ఆ నౌకను చేరాలంటే ఇకపై కచ్చితంగా ఒక రోజు పడుతుంది. నౌక నుంచి భూమికి తిరుగు సమాచారం అందాలంటే మరో రోజు వ్యవధి అవసరం.‘గోల్డెన్ రికార్డు’లో మానవ చరిత్ర!మూడు ప్లూటోనియం-238 రేడియో ఐసోటోప్ జనరేటర్ల సాయంతో ‘వోయేజర్-1’ పనిచేస్తోంది. ప్రయోగ సమయంలో అవి 470 వాట్ల శక్తిని ఉత్పత్తి చేయగా, ప్రస్తుతం 250 వాట్ల శక్తిని మాత్రమే తయారు చేస్తున్నాయి. నౌక ప్రతియేటా 4 వాట్ల చొప్పున శక్తిని కోల్పోతోంది. అలా ‘వోయేజర్-1’ శక్తిస్థాయులు నానాటికీ సన్నగిల్లుతున్న తరుణంలో... అది ఇప్పుడున్న దూరానికి అదనంగా వచ్చే రెండేళ్ల కాలంలో మరో 90 కోట్ల కిలోమీటర్ల దూరం అంతరిక్షంలో ప్రయాణించాలంటే నాసా ఇంజినీర్లు నౌకలోని కొన్ని శాస్త్రీయ పరికరాలను పనిచేయించడం నిలిపివేసి పవర్ ఆదా చేయాల్సివుంటుంది. నౌకను బతికించుకోవడానికి కొన్ని దశాబ్దాలుగా వారు అందులోని హీటర్లు, ఇతర పరికరాలు, కీలకం కాని వ్యవస్థలను ఒకదాని వెంట ఒకటిగా షట్ డౌన్ చేస్తూ వస్తున్నారు.పరిస్థితులు అనుకూలిస్తే మరికొన్నాళ్లపాటు ‘వోయేజర్-1’ ప్రయాణం సవ్యంగా ముందుకు సాగుతుందని, 2030వ దశకంలో ఏదో ఒక రోజు అది చివరి సందేశం పంపి శాశ్వత నిద్రలోకి జారుకుని వీడ్కోలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇంటర్నెట్ రాకముందే, స్మార్ట్ ఫోన్ కనిపెట్టక మునుపే, ఆధునిక సాంకేతికత ఇంకా ఎదగని రోజుల్లోనే మానవుడు సృష్టించిన ఓ చిన్న యంత్రం ఇన్నేళ్లుగా అల్లంత దవ్వున వినువీధి గాఢాంధకారాల్లో ఒంటరి బాటసారిలా రివ్వున దూసుకుపోతూ ఎన్నో స్పేస్ మిషన్లకు ఓ ఆశాకిరణంలా, స్ఫూర్తిగా నిలుస్తోంది. అబ్బో... భూమికి ‘వోయేజర్-1’ ప్రస్తుతం 2,547 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందని మనం అచ్చెరువొందుతాం గానీ.. ఇంటర్స్టెల్లార్ దూరాలతో పోల్చి చూస్తే అదేమంత దూరం కాబోదు.ఎందుకంటే... మన సౌరవ్యవస్థ వెలుపల భూమికి అతి సమీపంగా ఉన్న నక్షత్రం పేరు ‘ప్రాగ్జిమా సెంటారై’. అది భూమికి 4.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ‘వోయేజర్-1’ ప్రస్తుతం గంటకు 1.28 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి నుంచి దూరంగా వెళుతోంది. ఆ వేగంతో అది ‘ప్రాగ్జిమా సెంటారై’ను చేరాలంటే ఇంకా సుమారు 73 వేల ఏళ్లు ప్రయాణించాలి! ‘వోయేజర్-1’ మిషన్ ముగిసినా, భూమితో సమాచార సంబంధాలు తెగిపోయి అది శాశ్వతంగా మూగబోయినా, ఆ తర్వాత కూడా నౌక కొన్ని వందల కోట్ల ఏళ్లపాటు నక్షత్రాంతర రోదసిలో ఎటోకటు కొట్టుకుపోతూనే ఉంటుంది.ఒకవేళ గ్రహాంతర జీవులేవైనా ‘వోయేజర్-1’ను గుర్తిస్తే మానవాళి చరిత్ర వాటికి తెలిసేలా నౌకలో నాసా శాస్త్రవేత్తలు ఓ ‘గోల్డెన్ రికార్డు’ను అమర్చారు. ఇదొక గోల్డ్ ప్లేటెడ్ ఫోనోగ్రాఫ్ రికార్డు. 55 భాషల్లో శుభాకాంక్షలు, ప్రపంచవ్యాప్తంగా వినిపించే సంగీతం, వర్షం కురిసే శబ్దం, పక్షుల కిలకిలారావాలు, చిత్రాలు వంటివి అందులో ఉన్నాయి. - జమ్ముల శ్రీకాంత్(Courtesy: Interstellar Traveller, The Sky Live, NASA, CNN)
హార్మూజ్పై ఇరాన్ షాకింగ్ కామెంట్స్.. స్ట్రాంగ్ వార్నింగ్
టెహ్రాన్: హార్మూజ్ జలసంధి అంటే ప్రాంతీయేతర శక్తులు సైనిక బలప్రదర్శన చేసే వేదిక కాదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిపై బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై స్పందించిన ఘరీబాబాది.. సంక్షోభాలు సృష్టించే వారే వాటి పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు.ఘరీబాబాది ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. "హార్మూజ్ జలసంధి ప్రాంతీయేతర శక్తుల సైనిక బలప్రదర్శన వేదిక కాదు. హార్మూజ్ భద్రతకు హామీ ఇచ్చే బాధ్యతాయుత శక్తిగా ఇరాన్ ఈ జలమార్గంలో జరిగే ఏ సైనిక కదలికనైనా అత్యంత అప్రమత్తంగా గమనిస్తోంది. హార్మూజ్ భద్రత తీరప్రాంత దేశాల చేతుల్లోనే ఉంటుంది. సంక్షోభాలు సృష్టించే వారు తమ సాహసోపేత చర్యల పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది తీవ్రమైన హెచ్చరిక" అని పేర్కొన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ ఏమన్నాయి? ఒమాన్ తన సార్వభౌమ ప్రాదేశిక జలాల్లో నౌకల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో కలిసి పని చేయడానికి అంగీకరించిందని కీర్ స్టార్మర్, ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. "హార్మూజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలక సముద్ర మార్గం. అన్ని దేశాల నౌకలు ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించే పరిస్థితిని పునరుద్ధరించడం ప్రపంచ ఆందోళనగా మారింది. తన సార్వభౌమ ప్రాదేశిక జలాల్లో నౌకల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో కలిసి పనిచేయడానికి ఒమాన్ సుల్తానేట్ అంగీకరించింది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.అంతేగాక, "హార్మూజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి మద్దతుగా సైనిక మిషన్ను మోహరించడానికి బ్రిటన్, ఫ్రాన్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రాంతీయ స్థిరత్వం, అన్ని దేశాల సార్వభౌమాధికారానికి గౌరవం, ప్రపంచ భద్రత, నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణం, అంతర్జాతీయ చట్టాన్ని పరిరక్షించేందుకు తమ భాగస్వామ్య దేశాలతో సన్నిహిత సహకారం కొనసాగించాలనే నిబద్ధతను బ్రిటన్, ఫ్రాన్స్ మరోసారి స్పష్టం చేశాయి" అని పేర్కొన్నారు.జూలై 2న బహ్రెయిన్లో జరిగిన అమెరికా నేతృత్వంలోని ప్రాంతీయ భద్రతా సదస్సును ఇరాన్ తీవ్రంగా విమర్శించింది. ఆ సైనిక సదస్సు చట్టబద్ధతను, ఆ ప్రాంతంలో అమెరికా కమాండ్ వ్యవస్థ అధికారాన్ని ఘరీబాబాది తిరస్కరించారు. "హార్మూజ్పై అధికారం సెంట్కామ్(అమెరికా సెంట్రల్ కమాండ్)ది కాదు, ఇరాన్దే" అని పేర్కొన్నారు. బహ్రెయిన్లో జరిగే సైనిక సదస్సు పర్షియన్ గల్ఫ్కు చట్టబద్ధ వ్యవస్థను, భద్రతను ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. تنگه هرمز میدان نمایش نظامی قدرتهای فرامنطقهای نیست. ایران بهعنوان قدرت مسئول و ضامن امنیت تنگه، نسبت به هر حرکت نظامی در این آبراه حساس هشدار میدهد. امنیت هرمز با دولتهای ساحلی است؛ بحرانسازان مسئول پیامدهای ماجراجویی خود خواهند بود؛ این هشدار جدی است. pic.twitter.com/v9n2GdHnb6— Gharibabadi (@Gharibabadi) July 4, 2026
హ్యాట్రిక్ ఓటముల తర్వాత.. చరిత్ర సృష్టించిన కీకో
పెరూ రాజకీయాల్లో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్నో సంవత్సరాల పోరాటం.. మూడు వరుస అధ్యక్ష ఎన్నికల ఓటములు, వివాదాలు, ఆరోపణల మధ్య నిలిచిన కీకో ఫుజిమోరి Keiko Fujimori.. ఎట్టకేలకు దేశ అత్యున్నత పదవిని దక్కించుకుని చరిత్ర సృష్టించారు.నెలల తరబడి సాగిన ఉత్కంఠభరిత కౌంటింగ్ ప్రక్రియ తర్వాత పెరూ ఎన్నికల కోర్టు అధికారికంగా కీకో ఫుజిమోరి(51)ని అధ్యక్ష ఎన్నిక విజేతగా ప్రకటించింది. జూన్ 7న జరిగిన రెండో దశ ఎన్నికల్లో ఆమె 50.135 శాతం ఓట్లతో స్వల్ప ఆధిక్యం సాధించగా, ప్రత్యర్థి వామపక్ష నేత రోబర్టో సాంచెజ్ 49.865 శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు. దాదాపు 1.8 కోట్ల ఓట్లలో 50 వేల కంటే తక్కువ తేడా ఈ ఎన్నికను దేశ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరిత పోటీల్లో ఒకటిగా నిలిపింది.ఫలితాలపై సాంచెజ్ వర్గం అక్రమాల ఆరోపణలు చేస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఎన్నికల అధికారులు అన్ని ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఫలితాన్ని ధృవీకరించారు. దీంతో కీకో ఫుజిమోరి అధికారికంగా పెరూ అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.కీకో ఎవరంటే..కీకో ఫుజిమోరి పెరూ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేత. మాజీ అధ్యక్షుడు అల్బర్టో ఫుజిమోరి (Alberto Fujimori) పెద్ద కుమార్తె. 1990 నుంచి 2000 వరకు పెరూ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, దేశంలో ఉగ్రవాదంపై కఠిన చర్యలతో ప్రసిద్ధి పొందినప్పటికీ, తరువాత అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించారు.అల్బర్టో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కీకో చాలా చిన్న వయసులోనే దేశ రాజకీయ వాతావరణాన్ని దగ్గరగా చూసారు. తండ్రి అధ్యక్షుడిగా ఉన్న చివరి సంవత్సరాల్లో.. కేవలం 19 ఏళ్ల వయసుకే ఆమె ‘‘ఫస్ట్ లేడీ’’ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇది ఆమెను రాజకీయాల్లోకి ప్రవేశించడానికి దారి తీసిన కీలక దశగా భావిస్తారు. తర్వాత ఆమె పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి పాపులర్ ఫోర్స్ పార్టీకి నాయకత్వం వహించారు. 2011, 2016, 2021 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి ప్రతి సారి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ పరాజయాలు ఆమె రాజకీయ ప్రయాణాన్ని ఆపలేదు, కానీ మరింత బలమైన మద్దతు బేస్ నిర్మించుకునేలా చేశాయి. అదే సమయంలో ఆమెపై ఎన్నికల నిధుల అక్రమాల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుల కారణంగా కొంతకాలం జైలు జీవితం గడపాల్సి రావడం ఆమె రాజకీయ జీవితంలో పెద్ద మలుపుగా నిలిచింది. అయినప్పటికీ రాజకీయాల నుంచి తప్పుకోకుండా మళ్లీ పునరాగమనం చేశారు.విజయం.. రాజకీయ ప్రాధాన్యంఈసారి ఎన్నికల్లో కీకో “కఠిన చట్టాలు, నేరాల నియంత్రణ, పెట్టుబడుల ఆకర్షణ” వంటి అంశాలపై ప్రచారం నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న నేరాలు, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో ఆమె వాదనలు ఓటర్లలో గణనీయంగా ప్రభావం చూపించాయి. విజయం అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ముందున్న సవాళ్లు..అయితే కొత్త అధ్యక్షురాలిగా ఆమె ముందున్న సవాళ్లు పెద్దవి. పెరూ గత దశాబ్దంలో అనేక రాజకీయ సంక్షోభాలను చూసింది. వరుస ప్రభుత్వ మార్పులు, సామాజిక విభేదాలు, ఆర్థిక ఒత్తిడులు దేశాన్ని ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో స్థిరమైన పాలన అందించడం ఆమెకు ప్రధాన పరీక్షగా మారనుంది. అయినప్పటికీ దీర్ఘకాల పరాజయాల తర్వాత చివరకు అధికారం దక్కించుకున్న కీకో ఫుజిమోరి విజయం, పెరూ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
యూఎస్లో రూ. 85 వేల టాబ్లెట్, ఇండియాలో రూ.35లకే
భారతదేశం, అమెరికా మధ్య వైద్య ఖర్చుల్లో తేడాలపై గతంలో అనేక కథనాలు చూశాం. తాజాగా ఒక అమెరికన్ మహిళ మరో ఇంట్రస్టింగ్ స్టోరీని పోస్ట్ చేశారు. ఇండియా, యూఎస్లోని వైద్య ధరల మధ్య భారీ వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ అమెరికాలో తమని దోచుకుంటున్నారంటూ ఆమె పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.వైరల్ వీడియో విశేషాలు'లిజ్' అనే అమెరికన్ మహిళ "ఇండియన్ వర్సెస్ అమెరికన్ హెల్త్కేర్" అనే టైటిల్తో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అమెరికాతో పోలిస్తే భారతదేశంలో వైద్య ఖర్చులు చాలా తక్కువని, అమెరికాలో ప్రజలను 'దోచుకుంటున్నారని' ఆరోపించింది. ఇందుకు 'రెవ్లిమిడ్' (Revlimid) అనే టాబ్లెట్ ధరను ఆమె ఉదాహరణగా చూపింది.తన అత్తగారి బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు వాడే టాబ్లెట్ ధర అమెరికాay 900 డాలర్లు (సుమారు రూ. 85,000) ఉండగా, భారతదేశంలో దీని జెనరిక్ ప్రత్యామ్నాయం కేవలం 30 సెంట్ల నుండి 3 డాలర్ల (రూ. 35 నుండి రూ. 300) లోపే లభిస్తోందని వెల్లడించింది. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. భారతదేశంలోని చౌకైన వైద్య విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అలాగే ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత క్యాన్సర్ చికిత్స కూడా అందుబాటులో ఉందని ఒక యూజర్ పేర్కొనగా, అమెరికన్లు భారత్కు వచ్చి మందులు కొనుగోలు చేసినా ప్రయాణ ఖర్చులు పోను డబ్బులు మిగులు తాయని మరొకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: కేతన్ హత్య : కోడ్వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’ View this post on Instagram A post shared by Liz & Shiv (@spicygori)గత నెలలో 'విక్టోరియా' అనే మరో అమెరికన్ మహిళ కూడా యూఎస్ హెల్త్కేర్ సిస్టమ్ను ఒక "స్కామ్" అని అభివర్ణించింది. అమెరికాలో ఆమెకు అత్యవసరమైన మందును ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయకపోవడంతో, అక్కడ వెయ్య డాలర్లు పలికే ఆ మందును, ఇండియాలోని తయారీదారు నుండి నేరుగా కేవలం 25 డాలర్లకే కొనుగోలు చేయగలిగింది. అమెరికాలో సామాన్య ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని, ఇంత భారీ మొత్తంలో అదనపు డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!
జాతీయం
‘జరగని పెళ్లికి టికెట్లు ఎందుకో’..
ముంబై: తన కాబోయే భర్త, వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, ఆమె స్నేహితురాలి మధ్య జరిగినట్లుగా భావిస్తున్న ఒక స్నాప్చాట్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్షాట్స్ మహారాష్ట్ర పోలీసులు సంపాదించారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇక ఆ చాట్లో కేతన్తో తన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోదని ఒక స్నేహితురాలితో సియా చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్నాప్ చాట్ యాప్లో స్నేహితురాలు, సియా మధ్య జరిగిన చాటింగ్ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇన్ని రోజులు సియా దాచిపెట్టిన మరో ఫోన్లో డేటాను వెలికితీయగా ఈ చాటింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.పెళ్లి, రిసెప్షన్ వేడుకలకు హాజరయ్యే అతిదులకు విమాన టికెట్లు బుక్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా సియా తన ఫ్రెండ్కు చాటింగ్లో ఒక మెసేజ్ పెట్టింది. 'నీ ఆధార్కార్డ్ ముందువైపు వెనుకవైపు ఫోటో తీసి నాకు పంపు. విమాన టికెట్లు నీరు బుక్ చేయాలి . అయినా జరగని పెళ్లికి ఈ టికెట్ల బుకింగ్ గోల ఏంటో. అయినా ఫర్లేదు. ముందయితే నీ ఆధార్ ఫొటోలు పంపు’ అని అందులో రాసింది. అందుకు ‘సరే. నీకు వాట్సాప్ పంపాను. చూసుకో’ అని స్నేహితురాలు బదులిచ్చింది.ఈ చాటింగ్ మే 25వ తేదీన జరిగింది. ఆ తర్వాత జూన్ 18వ తేదీన కేతన్ హత్య జరిగింది. అంటే చాలా రోజుల ముందు నుంటే కుట్రకు సియా పథక రచన చేసిందని పోలీసులు చెబుతున్నారు.కోట నుంచి కేతన్ పారపాటున పడిపోయాడని అందర్నీ నమ్మించేందుకు సియా ఇలా చివరి నిమిషందాకా విమాన టికెట్ల బుకింగ్ వంటి పెళ్లిపనుల్లో బిజీగా ఉన్నట్లు నటించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సియా, చేతన్లతో పాటు చేతన్ క్లాస్మెట్ ఒకరికి ఈ హత్యకుట్రతో సంబంధం ఉండని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఎన్కౌంటర్లో ఇద్దరు బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లు హతం
బహదూర్గఢ్: హర్యానాలోని బహదూర్గఢ్లో ఆదివారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఇద్దరు షూటర్లు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. మృతులను పర్వేష్, హిమాన్షుగా గుర్తించామని, గత నెలలో హన్సిలో ఒక జిమ్ యజమాని కపిల్ హత్య కేసులో వీరిద్దరే ప్రధాన నిందితులని ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ భూషణ్ తెలిపారు. వీరు ఆయుధాలతో ఏదో నేరానికి పాల్పడేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్ఛార్జ్ మంజీత్కు అందిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు.పోలీసులు నిందితులను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు షూటర్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పులలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కాలికి గాయమమయ్యింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు షూటర్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన కానిస్టేబుల్ను మెరుగైన చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు, ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
పుంజుకున్న నైరుతి
ముంబై/ఈటానగర్/బిలాస్పూర్/ కోల్కతా/తిరువనంతపురం: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు భారత్పై కరుణ చూపడం మొదలుపెట్టాయి. కేరళ, మహారాష్ట్ర, పశి్చమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా రానున్న ఒకట్రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. పలుచోట్ల నదులు పొంగిపొర్లుతుండగా వరద ముప్పును తట్టుకునేందుకు కొన్ని రాష్ట్రాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నదీ పరీవాహక ప్రాంతాలు, డ్యామ్ల వద్ద నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా పశ్చిమ బెంగాల్ మొత్తానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు.ముంబైతోపాటు మహారాష్ట్రలో భారీ వర్షాలను సూచిస్తూ అధికారులు రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేశారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. థానే, పాల్ఘర్ జిల్లాల్లోనూ శనివారం భారీ వర్షాలు కురిశాయి.థానేలో ఐదు గంటల్లోనే 65.79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పాల్ఘర్లో ఇది 97.7 మిల్లీమీటర్లుగా ఉంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. థానే జిల్లాలో 35 ఏళ్ల మహిళ విద్యుత్ షాక్తో మరణించింది. కాల్వా ప్రాంతంలో చెట్టు మీదపడటంతో ఇద్దరు గాయపడ్డారు. పాల్ఘర్ ప్రాంతంలోని తండ్లువాడీ కోటలో దట్టమైన మంచు కారణంగా దారితప్పిన ఆరుగురు పర్యాటకులను రక్షించినట్లు పాల్ఘర్ ఎస్పీ యతీశ్ దేశ్ముఖ్ తెలిపారు. వీరంతా పాల్ఘర్లోని దండేకర్ కాలేజీ విద్యార్థులని చెప్పారు.ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదల బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంఐ–172 హెలికాప్టర్ను రంగంలోకి దించింది. ఆహారం, వైద్యసామగ్రిని సరఫరా చేస్తోంది. లోయర్ సియాంగ్ జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి అనేక గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వంతెనలు కూలిపోవడం, రోడ్లు మూసుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అకాజన్–లికాబాలి–బమే రహదారిపై శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లా కర్యాల్ గ్రామంలో భారీ వర్షాలకు భూమి కుంగిపోతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పగుళ్లు, నేల జారిపోవడంతో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
తప్పు చేసి ప్రైవసీ అంటే కుదరదు
న్యూఢిల్లీ: భర్త తప్పు చేసి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని చెప్పజాలరని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విడాకుల కోసం వ్యభిచారం ఆరోపణలు రుజువు చేసే కాల్డేటా, హోటల్ బుకింగ్ వంటి ఆధారాలు సేకరించేందుకు భార్య న్యాయస్థానం సాయం తీసుకోవడంలోనూ తప్పులేదని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యభిచారాన్ని వ్యక్తిగత ప్రైవసీ పేరుతో రక్షణ కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. 2023 మే 10వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.వ్యక్తిగత గోప్యతకు రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ దానిపై కొన్ని పరిమితులున్నాయని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాహమైనప్పటికీ ఇతర మహిళతో అక్రమ సంబంధం నెరపిన వ్యక్తి తాలూకూ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాల కిందకు రావు అని కోర్టు స్పష్టం చేసింది. తన భర్త ఇంకో స్త్రీతో కూతురిని కన్నాడని, మరో మహిళతోనూ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ ఒక మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఒక హోటల్లో భర్త, ఒక మహిళ కలిసి ఉన్నారని ఇందుకు సంబంధించిన వివరాలు, హోటల్ రిజర్వేషన్, పేమెంట్ రికార్డులను కాపాడాలని అభ్యర్ధించింది.విచారణ జరిపిన న్యాయస్థానం వివరాలను జాగ్రత్త చేయాలని, సీల్డ్ కవర్లో తమకు అందజేయాలని 2022లో∙ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆధారాలు ఆ వ్యక్తి అక్రమ సంబంధాన్ని రుజువు చేసేందుకు సరిపోతాయా? అని ఫ్యామిలీకోర్టు స్పష్టం చేయలేదు. ఇదే విషయమై భర్త ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లాడు. వివరాలు సేకరించడంతో తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు వ్యక్తిగత గోప్యత కంటే సాక్ష్యాల కోసం భార్య అభ్యర్థన ముఖ్యమని స్పష్టం చేసింది.అక్రమ సంబంధాన్ని రుజువు చేసే ఇలాంటి ఆధారాలు చాలా అరుదుగా లభిస్తాయని తెలిపింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనుమతించని సాక్ష్యాలను పరిగణలోకి తీసుకునేందుకు ఫ్యామిలీ కోర్టు నిబంధనలు సెక్షన్ 14 అనుమతిస్తుందని తెలిపింది. హోటల్ రిజర్వేషన్, గుర్తుంప కార్డులతో ఉంటే భర్త మరో మహిళతో ఉన్నట్లు తెలుపుతుందని, కాల్ రికార్డులు ఎన్నిసార్లు ఆ మహిళకు కాల్ చేశారు? అసాధారణంగా ఎంతసేపు మాట్లాడారు అన్నది స్పష్టం చేస్తుందని కోర్టు వివరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం అక్రమ సంబంధం కలిగి ఉండటం విడాకుల మంజూరుకు ప్రాతిపదిక అని, వ్యక్తిగత గోప్యత పేరుతో భర్తను కాపాడటంలో ప్రజా ప్రయోజనమేమీ లేదని స్పష్టం చేస్తూ భర్త పిటిషన్ను కొట్టివేసింది.
ఎన్ఆర్ఐ
అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం
మరో తెలుగు విద్యార్థి డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యంతో ఆకస్మికంగా కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.మహబూబ్నగర్కు చెందిన అరుణ్ సాయిరెడ్డి (జననం: ఆగష్టు 21, 1999) వెంకట్ రెడ్డి, సరళా దంపతుల ఏకైక కుమారుడు. అరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఫ్లోరిడాలోని టెంపా నగరంలో ఉంటూ, స్టెమ్ ఓపీటీ (STEM OPT)లో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. అంతలోనే అతని అకాల మరణం కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. అతని పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు గాను నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు.
అద్భుతం.. అదిత్రి అరంగేట్రం
హైదరాబాద్: అమెరికాలో పుట్టి పెరిగిన అదిత్రి వైష్ణవి చేపూర్ కూచిపూడి అరంగేట్రం నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. బేగంపేటలోని సెస్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రముఖులతో పాటు ఆమె రెండు తరాల కుటుంబసభ్యుల మధ్య అరంగేట్రం చేసి తన కలను సాకారం చేసుకుంది. గురువు రేవతి కొమండూరి వద్ద నృత్యం నేర్చుకున్న ఆమె వేదికపై అద్భుతమైన హావభావాలు పలికించి అబ్బురపరిచారు. అన్నమాచార్య కీర్తనతో సాగిన అరంగేట్ర నృత్య ప్రయాణం శివుని స్తుతిస్తూ తాండవేశ్వర..చివరగా థిల్లానాతో ముగిసింది. అదిత్రి వెష్ణవి తల్లిదండ్రులు భానుచందర్, సరితలు అమెరికన్ సిటిజన్స్ కాగా..వారి కూతురు అదిత్రి లా అండ్ సైకాలజీ శాస్త్రంలో విద్యనభ్యసిస్తున్నారు. తన ఏడేళ్ల ప్రాయం నుంచి కూచిపూడి నృత్య శిక్షణ తీసుకుంటూ వచ్చారు. నగరంలో ఉండే తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మలు ముందు తన అరంగేట్రం జరగాలన్న ఆమె కోరికను నెరవేర్చుకున్నారు. మనవరాలి కూచిపూడి అరంగేట్రం తిలకించిన నాన్నమ్మ, తాతయ్య దేవి, జనార్దన్రావు, అమ్మమ్మ, తాతయ్య మంజులత, శ్యాంసుందర్లు ఆనందం వ్యక్తం చేశారు.
గల్ఫ్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత
హైదరాబాద్: గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ప్రతినిధులు ఆదివారం చర్చించారు. తెలంగాణ రాష్ట్ర 'గల్ఫ్ కాంగ్రెస్' ప్రతినిధి సుతారి సత్యనారాయణ పటేల్, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఆదివారం హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం వేళ.. విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై పొన్నం ప్రభాకర్ తో వారు చర్చించారు.ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటరు నమోదును కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆన్లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్వీకరించినట్లు వారు తెలిపారు. అలాగే తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు, గల్ఫ్ కార్మికులతో ప్రత్యక్షంగా మమేకమయ్యేందుకు గల్ఫ్ దేశాల్లో పర్యటించాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. స్వయంగా గల్ఫ్ దేశాల్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని, వారి సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
సోషల్ మీడియా పుణ్యమా అని తమకెదురైన ప్రతి సమస్యను షేర్ చేసుకుంటూ సలహాలు సూచనలు పొందడం ఓ ట్రెండ్గా మారింది. ఒకరకంగా దీనివల్ల ఇతరుల ఎంత పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నారో తెలియడమేగాక, వ్యక్తిగతంగా ఒక సమస్యకు ఎలా సంయమనంగా ఓపిగ్గా ఉండాల్లో తెలుసుకునే వీలు లభించడం విశేషం. అలానే ఈసారి నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఎన్నారై రెడిట్ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు ఆలోచింప చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..ఆ ఎన్నారై రెడిట్ పోస్ట్లో ఇలా ఉంది. తన వయసు 39 ఏళ్లు అని, తాను దాదాపు 15 ఏళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చాడు. తాను ప్రేమించి పెళ్లి చూసుకున్నానని, తామిద్దరం ఉద్యోగాల్లో మంచి ఉన్నతిని సాధించామని, సుమారు 46 కోట్లు ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఇటీవల తన భార్య కేన్సర్ బారిన పడిందని, ప్రస్తుతం ఆ వ్యాధి మరింతగా ముదిరిందని రాసుకొచ్చారు. తమకు పిల్లలు కూడా లేరని అన్నారు.దాదాపు ఐదేళ్లుగా తర భార్య కేన్సర్తో పోరాడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఒకవేళ ఆమె ఆరోగ్యం క్షీణించి.. దాంతో మానసికంగా అలిసిపోయి ఇక పనిచేయకూడదు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే.. భారత్లో జీవించడానికి తన వద్ద ఉన్న ఆ రూ. 46 కోట్ల ఆస్తి సరిపోతుందా అని ప్రశ్నించాడు. అందుకు నెటిజన్ల నుంచి ఆచరణాత్మక ఆర్థిక సలహాలతో పాటు వ్యక్తిగత ధైర్యాన్ని నింపే సలహాలు సూచనలు కూడా అందించారు.వినడానికి బాధగా ఉన్నా.. తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆమె చెంతే ఉండండి. మంచి వైద్యం అందించేలా ప్రముఖ వైద్యులను కలిసి సలహాలు సూచనలు తీసుకోండి. భారత్లో మెట్రో నగరాల్లో జీవించాలనుకున్నా అంత మొత్తం సరిపోతుందని అన్నారు. అంతేగాదు మీ భార్య కోసం చేయగలిగిందంతా ఇప్పుడే చేయండి. ఇది ఆర్థిక భద్రతకు సంబంధించింది కాదు.. అంతకుమించిన బంధానికి, భావోద్వేగానికి సంబంధించిందంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..
క్రైమ్
ఇంటి రుణం తీరే వరకు వ్యభిచారం చెయ్యి
తిరుపతి క్రైం: కట్టుకున్న భర్తే బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపి సంవత్సరాలుగా పడుపువృత్తి చేయించాడని, ఇప్పుడు ఆ పనికి నిరాకరించడంతో విచక్షణారహితంగా దాడి చేశాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి రుణం తీరేవరకు వ్యభిచారం చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాడని కన్నీరుమున్నీరైంది. తనకు ప్రాణహాని ఉందని 112కు ఫోన్ చేసి పోలీసుల రక్షణ కోరింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలచేనులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి కథనం ప్రకారం.. చింతలచేనుకు చెందిన దంపతులకు 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వివాహమైన తొలి రెండేళ్లు అత్తమామ సంపాదనతో కుటుంబ జీవితం సజావుగా సాగింది. అనంతరం భర్త బాధితురాలిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు. పదేళ్లుగా పడుపువృత్తి చేయిస్తున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురికావడంతో ఇకపై ఆ పని చేయలేనని బాధితురాలు స్పష్టం చేయడంతోపాటు పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన భర్త, అతని బంధువులు బాధితురాలి కుటుంబంపై తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టడంతోపాటు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు 112కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఇంటి నిర్మాణానికి తీసుకున్న రూ.50 లక్షల రుణం తీరే వరకు తిరిగి వచ్చి వ్యభిచారం కొనసాగించాలని భర్త ఒత్తిడి తెస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.
నా కొడుకు శవమైనా ఇవ్వండి
కోరుట్ల: ‘నెల రోజులు గడిచిపోతోంది.. నా కొడుకును ఎవరైనా చంపారా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం ఆంధ్రా పోలీసులు తేల్చడం లేదు.. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. కనీసం నా కొడుకు శవమైనా ఇప్పించండి.. లేకుంటే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తా’అని తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన తల్లి అంకం వనిత కన్నీరుమున్నీరవుతోంది. వనిత –రాజేశ్వర్ దంపతుల కుమారుడు రాహుల్ హైదరాబాద్లో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.మే 27న టూర్ వెళ్తున్నానని ఇంటికి ఫోన్చేసి చెప్పాడు.కాచిగూడ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్ నుంచి శబరి వెళ్లే ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో కనిపించాడు. మే 30న ఒంగోలు జిల్లా సింగరాయకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ బావిలో బండకట్టి ఉన్న రాహుల్ మృతదేహం లభించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు.. రాహుల్ మృతిపై ఎక్కడా లేని ఉదాసీనత చూపినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. రాహుల్ మృతి మిస్టరీ ఛేదించాలని విద్యార్థి, కుల సంఘాల ఆందోళనలు నిర్వహించాయి. దీంతో మృతదేహాన్ని పాతిపెట్టిన పోలీసులు.. మళ్లీ విచారణకు ఉపక్రమించారు. పాతిపెట్టిన సమయంలో తొడఎముకను భద్రపరిచిన పోలీసులు డీఎన్ఏ టెస్టుకు పంపించారు. వారం క్రితం డీఎన్ఏ టెస్టు తల్లిదండ్రులతో సరిపోయినట్లు తేలడంతో శుక్రవారం రాహుల్ మృతదేహం అప్పగిస్తామని చెప్పారు. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లగా.. మరోరెండు రోజుల వరకు ఆగాలని పోలీసులు చెప్పడం గమనార్హం.
దొంగ సొమ్ము.. దొంగకే దక్కలేదు!
హైదరాబాద్: దొంగిలించిన సొత్తుతో ఓ వ్యక్తి హోటల్లో బస చేయగా అక్కడికి వచ్చిన ఓ యువతి అందులో నుంచి రూ. లక్ష ఎత్తుకెళ్లింది. జల్సాల కోసం చోరీ చేసిన సొత్తులో కొంత మరో దొంగ కొట్టేయడంతో ఓ నిందితుడు లబోదిబోమంటూ పోలీసుల ముందు తనగొడు వెల్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని జైన్ కన్స్ట్రక్షన్స్లో గుంటూరు జిల్లా గుడిపాడు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ ఫణీంద్ర(29) గత మూడేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పని చేస్తున్నాడు.నమ్మకంగా పని చేస్తున్నట్లు యజమాన్యాన్ని నమ్మించి గత నెల 26వ తేదీన యజమాని కళ్లుగప్పి కార్యాలయంలో రూ.12.33 లక్షల నగదు ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లాడు. బస్సులో ఒంగోలుకు వెళ్లి చోరీ చేసిన సొత్తుతో ఒక కేటీఎం బైక్ కొనుగోలు చేశాడు. అక్కడే ఒక ఐఫోన్ కూడా కొన్నాడు. బైక్పై నెల్లూరు వెళ్లి ఓ హోటల్లో బస చేసి ఆ రాత్రికి ఓ యువతిని రప్పించుకున్నాడు. తెల్లవారి ఫణీంద్ర కళ్లుగప్పిన ఆ యువతి బ్యాగులో ఉన్న రూ.లక్ష సొత్తుతో ఉడాయించింది. నిందితుడు అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి జల్సాలకు అలవాటుపడ్డాడు. దొంగిలించిన సొత్తును ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాడు. అప్పటికే పోలీసులు ఫణీంద్ర కదలికలపై నిఘా పెట్టారు. ఫోన్ నెంబర్ ఆధారంగా బెంగళూరుకు 130 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సులో వెళ్తున్న నిందితుడిని బంజారాహిల్స్ క్రైమ్ ఎస్ఐ యాసిన్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న ఫణీంద్ర మధ్య తరగతి జీవితంతో విసుగు చెంది సంపన్నులు మాదిరిగా ఉండాలని ఇప్పుడున్న జీతం సరిపోకపోవడంతో దొంగగా మారాడు. చోరీ చేసిన సొత్తుతో కేటీఎం బైక్తో పాటు ఐఫోన్ కొనుగోలు చేసి అంతకుముందు చేసిన అప్పులు తీర్చి స్టార్ హోటళ్లలో బస చేస్తూ జల్సాలు చేస్తూ అయిదు రోజుల పాటు బెంగళూరులోనే తిరిగాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కొంత సొత్తును రికవరీ చేశారు.
మేడారంలో విషాదం.. కారు ఢీకొని బాలుడి మృతి
హైదరాబాద్: వరంగల్ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి కుటుంబంతో వచ్చిన ఓ బాలుడిని ప్రమాదవశాత్తు కారు ఢీకొనడంతో మృతి చెందాడు. నార్లాపూర్ ఎస్ఐ అచ్చ కమలాకర్ తెలిపిన మేరకు.. అమీర్పేటకు చెందిన అలిమేకల పురుషోత్తం కుటుంబంతో కలిసి శుక్రవారం మేడారానికి వెళ్లి ఎంఎస్ఆర్ గదిలో దిగారు.చేవెళ్ల మండలం ఏలూరు గ్రామానికి చెందిన అరకటిక అరుణ్ కుటుంబం కూడా పక్కగదిలో దిగింది. ఈ క్రమంలో అరుణ్ నాలుగేళ్ల కుమారుడు తండ్రి వద్ద ఉన్న కారు తాళాలు తీసుకుని కారు స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలింది. ఆ సమయంలో గది ముందు ఆడుకుంటున్న కౌశిక్ (7)పైకి కారు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం కంటతడి పెట్టించింది. మరోవైపు, ప్రమాదానికి కారణమైన చిన్నారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మృతుడి తండ్రి పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు.
వీడియోలు
ఆ మార్ఫింగ్ వీడియోలు ఏంటండీ.. ప్రశ్న రావణ్ భార్య సంచలనం వీడియో
గేటెడ్ కమ్యూనిటీ.. గ్రేటర్ రాజధాని! అమరావతిలో అసలు జరుగుతుంది ఇదే.!
ఉగ్రరూపం దాల్చనున్న ఎల్ నినో.. WMO హెచ్చరిక
చేతికి బ్యాండేజ్.. నాని కి ఏం జరిగిందంటే.?
డీమార్ట్ స్టాక్ భారీ పతనం.. ఒక్క అప్డేట్ తో వేల కోట్లు ఆవిరి
పొలిటికల్ గజిని.. తిక్కుంది.. కాని లెక్క లేదు
SIRపై అనుమానాలు..YSRCP ఓట్లు తొలగించే కుట్ర! RDOలతో చంద్రబాబు వీడియో కాల్
నాది రావణ్ ది ఆడియో లీక్.. ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్
విశాఖ మత్స్య కారులు గల్లంతుపై వైఎస్ జగన్ ఆందోళన
గన్నవరంలో రావణపై పెట్టిన కేసు దారుణం ఉరిశిక్ష పడే సెక్షన్లు..


