పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. 28ఏళ్లలో తొలిసారిగా దీదీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సంచలనం చోటు చేసుకుంది. రోజుల వ్యవధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వందలమంది కౌన్సిలర్లు టీఎంసీని వీడి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. అయితే, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నాయకులు, ముఖ్యంగా లోక్సభ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ వంటి వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.టీఎంసీ నియంత్రణలో ఉన్న మున్సిపల్ సంస్థల్లో వరుస రాజీనామాలు చోటు చేసుకున్నాయి. భట్పారా మున్సిపాలిటీలో 35 మందిలో 30 మంది, హాలిసహర్లో 23 మందిలో 16 మంది, కంచరపారాలో 14 మంది కౌన్సిలర్లు వైదొలిగారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం, పార్టీ నాయకత్వం మార్గదర్శకత్వం ఇవ్వకపోవడం వంటి కారణాలతో కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.అవినీతి, దోపిడీ ఆరోపణలు పార్టీపై మరింత ఒత్తిడి తెచ్చాయి. ఇటీవల ముగ్గురు కౌన్సిలర్లు అరెస్టు అయ్యారు. సౌత్ డుమ్ డుమ్ కౌన్సిలర్ సంజయ్ దాస్ మర్మమైన మరణం ఆందోళనను పెంచింది. మాజీ టీఎంసీ మంత్రి సుజిత్ బోస్ను ఈడీ అరెస్టు చేయడం, మాజీ ఎమ్మెల్యే అదితి మున్షీ భర్త దేబ్రాజ్ చక్రవర్తిపై విచారణ కొనసాగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది.కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా గందరగోళంలో ఉంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు జారీ కావడం, బీజేపీ 43 ఆస్తుల జాబితాను విడుదల చేయడం అంతర్గత కలహాలకు దారితీసింది. మేయర్ ఫిర్హాద్ హకీమ్ పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి. ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.మే 22న మేయర్తో సహా కౌన్సిలర్లు ప్రధాన ఛాంబర్ వెలుపల సమావేశం నిర్వహించవలసి రావడం, ఎన్నికైన ప్రతినిధులకు అవమానకరంగా మారింది. వరుస రాజీనామాలు మున్సిపల్ సేవలను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. రాబోయే వర్షాకాలం ముందు డ్రైనేజీ, పారిశుధ్యం, అత్యవసర సన్నద్ధతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.కౌన్సిలర్లు అందుబాటులో లేని చోట బీజేపీ ప్రభుత్వం నిర్వాహకులను నియమించడం ప్రారంభించింది. దీంతో, టీఎంసీ సంక్షోభం కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా, మొత్తం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలు 1998లో కాంగ్రెస్ నుండి విడిపోయి మమతా బెనర్జీ స్థాపించినప్పటి నుండి టీఎంసీ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
పీకల్లోతు కష్టాల్లో గుజరాత్
ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్8.2వ ఓవర్- 65 పరుగుల వద్ద గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది. డఫీ బౌలింగ్లో హాజిల్వుడ్కు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (8) ఔటయ్యాడు. 51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన గుజరాత్5.4వ ఓవర్- 51 పరుగుల వద్ద గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. రసిక్ సలాం దార్ బౌలింగ్లో హాజిల్వుడ్కు క్యాచ్ ఇచ్చి జేసన్ హోల్డర్ డకౌటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో గుజరాత్255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. హాజిల్వుడ్ బౌలింగ్లో బట్లర్ (29) మూడో వికెట్గా, రసిక్ సలాం దార్ బౌలింగ్లో నిషాంత్ సింధు (5) నాలుగో వికెట్గా వెనుదిరిగారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్3.1వ ఓవర్- 27 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.సాయి సుదర్శన్ హిట్ వికెట్2.3వ ఓవర్- 17 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. గుజరాత్ను దరిద్రం వెంటాడంతో సాయి సుదర్శన్ (14) హిట్ వికెట్గా వెనుదిరిగాడు. డఫీ బౌలింగ్లో బంతి బౌండరీకి వెళ్లినా సుదర్శన్ బ్యాట్ చేజారి వికెట్లకు తాకింది. పాటిదార్ ఊచకోత.. ఆర్సీబీ భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. రజత్ పాటిదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పాటిదార్తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాటిదార్ క్యాచ్ను రబాడ మిస్ చేయడంతో గుజరాత్ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. క్యాచ్లు, రనౌట్లు మిస్ చేయడంతో పాటు లేని పరుగులను సమర్పించుకున్నారు. బౌలర్లు ఓ మోస్తరుగా బౌలింగ్ చేసినా ఫీల్డర్ల పొరపాట్ల కారణంగా గుజరాత్ భారీ మూల్యం చెల్లించుకుంది. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ17.6వ ఓవర్- 214 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో టిమ్ డేవిడ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ఆర్సీబీ స్కోర్: 204/4భారీ స్కోర్ దిశగా ఆర్సీబీఆర్సీబీ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 16 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్ పాండ్యా(43), పాటిదార్(49) ఉన్నారు.మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ9వ ఓవర్లో ఆర్సీబీ మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి జేసన్ హోల్డర్ బౌలింగ్లో విరాట్ కోహ్లి (43) క్లీన్ బౌల్డ్ కాగా.. నాలుగో బంతికి వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ (30) పెవిలియన్కు చేరాడు. పవర్ ప్లేలో దుమ్మురేపిన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలో దుమ్మురేపింది. సుడిగాలి ఇన్నింగ్స్ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (19) ఔటైనా, విరాట్ కోహ్లి (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (23 నాటౌట్) మెరుపులు కొనసాగించారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 76-1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ1.6వ ఓవర్- 21 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెంకటేశ్ అయ్యర్ (19) ఔటయ్యాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 26) జరుగుతున్న తొలి క్వాలిఫయర్ పోటీలో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ సలాం దార్
సైలెంట్గా స్కెచ్.. పెద్ద రిస్క్ చేస్తున్న విజయ్
వాడిపోతున్న చెట్టు నుంచి ఒక్కో ఆకు రాలినట్టు.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కదలికే అధికార సమీకరణాలను మార్చేస్తోంది. మొన్నటిదాకా కూటముల చుట్టూ తిరిగిన అక్కడి రాజకీయం.. ఇప్పుడు “ఎవరి వద్ద ఎంత సంఖ్యాబలం?” అనే లెక్క దిశగా పయనిస్తోంది. రాజకీయ వర్గాలు దానికి ముద్దుగా పెట్టిన పేరు “ఆపరేషన్ L”. ఎల్ అంటే లాటరీ? లీవ్? ఏదైనా రాజకీయ సెటైర్నా?.. ఏ అర్థం తీసుకున్నా… ఈ ఆపరేషన్ మధ్యలో నిలిచింది మాత్రం విజయ్ రాజకీయ దూకుడే! అదెలా సాగుతుందంటే.. తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కగళం పార్టీ ఇప్పుడు సాధారణ పార్టీ విస్తరణ దశను దాటి, స్వతంత్ర మెజారిటీ లక్ష్యంగా అడుగులు వేస్తోందన్న చర్చ బలపడుతోంది. మొదట్లో ఇది కూటమి నిర్వహణలా కనిపించినా… ఇప్పుడు మాత్రం “సోలో పవర్” కోసం సాగుతున్న రాజకీయ ఆపరేషన్లా మారిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ పరిణామాలకు తెరలేపింది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలే. పెరందురై ఎమ్మెల్యే ఎస్ జయకుమార్, మధురాంతకం ఎమ్మెల్యే కె. మరగతం కుమరవేల్, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి.. ఆ తర్వాత టీవీకే నాయకత్వాన్ని(ఆధవ్ అర్జునను) కలవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అధికారికంగా వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా.. రాజకీయంగా మాత్రం విజయ్ “విజిల్” గుర్తుపై మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.“ఆపరేషన్ L” అలా మొదలైందా?అన్నాడీఎంకే వర్గాల్లో ఈ పేరుకు అనేక అర్థాలు వినిపిస్తున్నాయి. కొందరు “Lottery” అంటుంటే… మరికొందరు “Leave” అంటున్నారు. కానీ పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సెటైర్ మాత్రం వేరే — అన్నాడీఎంకే రెండాకులలో(Two Leaves గుర్తు) ఒక్కో “ఆకు” ఇప్పుడు ఊడిపోతోందన్న వ్యాఖ్య.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీకే లెక్క కూటమి నుంచి మెజారిటీకి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం టీవీకేకి సుమారు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వం స్థిరంగానే ఉన్నా… ఒకే నాయకుడి చుట్టూ నిర్మితమైన పార్టీ శాశ్వతంగా మిత్రపక్షాలపై ఆధారపడకూడదన్న భావన టీవీకేలో బలపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.. 234 స్థానాల అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే.. “కూటమి ప్రభుత్వం” క్రమంగా “ఒకే పార్టీ ప్రభుత్వం”గా మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. అంటే.. తాజాగా మూడు స్థానాలు, ఫస్ల్ 1.. మొత్తంగా నాలుగన్నమాట. పోను పోను ఆ సంఖ్యా పెరగవచ్చనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. అయితే ఈ రాజకీయ లెక్క అంత సులభం కాదు. ఎందుకంటే..మిత్రపక్షాలు ఊరుకుంటాయా?అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, విడుదలై చిరుత్తైగల్ కట్చి వంటి పార్టీలు ఇప్పుడు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొదట అన్నాడీఎంకే రెబెల్స్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చలపై వామపక్షాలు, వీసీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది తెలిసిందే. అదే ఒత్తిడితో విజయ్ చివరి నిమిషంలో వ్యూహం మార్చి… “కేబినెట్లో చోటు కాదు, కానీ పార్టీ తలుపులు తెరిచి ఉంచడం” అనే మార్గాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్… టీవీకే పూర్తి మెజారిటీ దిశగా సాగితే భవిష్యత్తులో తన రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుందా? అనే ఆందోళనలో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే టీవీకేని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కూడా కాంగ్రెస్కు లేదు. దీంతో మిత్రపక్షాలు ఇప్పుడు “మద్దతు ఇస్తూనే దూరం పాటించే” రాజకీయ ధోరణిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక అన్నాడీఎంకే పరిస్థితి చూస్తే… అది ఇప్పుడు రెండు సమాంతర యుద్ధాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండగా… మరోవైపు ఎడప్పాడి పళనిస్వామి వర్గం తిరుగుబాటు నేతలను మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీని కాపాడేందుకు ఇప్పుడు యాంటీ-డిఫెక్షన్ చట్టమే చివరి రక్షణగా మారిందన్న చర్చ జరుగుతోంది.చట్టపరమైన చిక్కుల్లేకుండా..అయితే టీవీకే మాత్రం ఆ అడ్డంకిని కూడా రాజకీయంగా చాకచక్యంగా దాటే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరుగా పార్టీ మార్పు కాకుండా… ముందుగా రాజీనామా.. తర్వాత ఉపఎన్నికలో మళ్లీ పోటీ అనే మోడల్ను అనుసరించడం ద్వారా చట్టపరమైన చిక్కులను తగ్గించాలనే వ్యూహం అమలవుతోందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఇందులో మరో ఆసక్తికర అంశం సామాజిక సమీకరణాలు.టీవీకే టార్గెట్ చేస్తున్న వారిలో రాజకీయంగా బలహీనంగా ఉన్నవారు, పార్టీ లోపల ఒంటరితనంలో ఉన్నవారు, ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ ఆపరేషన్ మాత్రమే కాదు… సామాజిక లెక్కతో కూడిన వ్యూహమన్న మాట.అసలు సమస్య అదే..అయితే ఈ వ్యూహంలో మరో కీలక కోణం కూడా ఉంది. ఉపఎన్నికల రాజకీయ, ఆర్థిక భారం. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగితే… అది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, భారీ ఖర్చుతో కూడిన ప్రక్రియ కూడా. ఒక్కో ఉపఎన్నిక నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం, భద్రత, ఎన్నికల సిబ్బంది, ప్రచార వ్యయాలు కలిపి కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఒకేసారి పలుచోట్ల ఉపఎన్నికలు వస్తే ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మలచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. “రాజకీయ లాభాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు” అన్న విమర్శలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉపఎన్నిక అనేది గెలుపు గ్యారెంటీ ఉన్న రాజకీయ గేమ్ కాదు. అధికార ప్రభావం, విజయ్ ఇమేజ్ బలంగా కనిపిస్తున్నా… రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మళ్లీ ప్రజల తీర్పు కోరాల్సిందే. స్థానిక అసంతృప్తి, కుల సమీకరణాలు, తిరుగుబాటు నేతల ప్రభావం వంటి అంశాలు ఫలితాలను తారుమారు చేసే అవకాశమూ ఉంది.అందుకే ఈ వ్యూహాన్ని రాజకీయ వర్గాలు “హై రిస్క్ – హై రివార్డ్” ఆపరేషన్గా విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ ఈ లెక్క సక్సెస్ అయితే… టీవీకే కూటమి రాజకీయాల నుంచి బయటపడి స్వతంత్ర మెజారిటీ దిశగా అడుగులు వేయొచ్చు. కానీ విఫలమైతే మాత్రం అదే వ్యూహం రాజకీయంగా తిరుగుదెబ్బ అయ్యే ప్రమాదం కూడా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఒకప్పుడు ద్రావిడ పార్టీల బలం అనుకున్న కూటములే, ఇప్పుడు అస్థిరతకు సంకేతాలుగా మారుతున్నాయి. విజయ్ నిజంగానే ముందుగానే ఈ వ్యూహాన్ని రచించారా? లేక పరిస్థితులే ఆయనకు అనుకూలంగా మారాయా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో రాజకీయ మార్పులు ఒక్కసారిగా రావడం లేదు. నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి, ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యేకు సమీకరణాలు నెమ్మదిగా మారిపోతున్నాయి.
లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఎంఆర్వో సుచరిత
సాక్షి,హైదరాబాద్: ఏసీబీ అధికారులకు శామీర్ పేట్ ఎమ్మెఆర్వో సుచరిత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. భూమి నాలా కన్వెర్షన్కి సుచరిత ఎకరాకు లక్షరేట్ కార్డ్ ఫిక్స్ చేశారు. 30ఎకరాల భూమి కన్వెర్షన్కి 30లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అడ్వాన్స్గా సుచరిత కారు డ్రైవర్ రూ.2లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును సుచరితకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. డబ్బు గురించి ప్రశ్నింగా సుచరిత, ఆమె డ్రైవర్ నీళ్లు నమిలారు.ఎమ్మార్వో సుచరిత శామీర్పేట్ ఆఫీస్నే అవినీతికి అడ్డాగా మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. శామీర్పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని, ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డీఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.2024లో శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
త్వరలో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్
పాటిదార్ మహోగ్రరూపం.. ఆల్టైమ్ రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ
ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సమం
హనుమంతుడిలా రామ్ చరణ్.. ‘పెద్ది’లో అదే పెద్ద మలుపు!
సుగాలీ ప్రీతి కేసులో బాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం
గ్యాస్ వినియోగదారులకు ఊరట!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. 28ఏళ్లలో తొలిసారిగా దీదీ
బండెనుక బండికట్టి రేపిస్టు పోతుంటే.. కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్
చరిత్ర సృష్టించిన రబాడ
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు
’వద్దే వద్దు’.. త్రిషాకు సీఎం విజయ్ చెక్..!
‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త పద్ధతి!
పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం
‘వచ్చే పదేళ్లు మామూలుగా ఉండదు’
చక్కనమ్మకు ముక్కెరందం
తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు
మా సిద్ధాంతాలను కాంగ్రెస్ కాపీ కొడుతుంటే చూస్తూ ఊరుకోం!
వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
దేవతల రాజధాని అంటే మన ఆలయాల భూములు కూడా ఆక్రమించి అమ్మేసి కట్టేది అని ఇప్పుడే అర్థమైంది స్వామి!!
అర్జున్ టెండూల్కర్కు ఘోర అవమానం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు
ఇరాన్ సంచలన ప్రకటన
హార్ముజ్ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్
త్వరలో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్
పాటిదార్ మహోగ్రరూపం.. ఆల్టైమ్ రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ
ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సమం
హనుమంతుడిలా రామ్ చరణ్.. ‘పెద్ది’లో అదే పెద్ద మలుపు!
సుగాలీ ప్రీతి కేసులో బాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం
గ్యాస్ వినియోగదారులకు ఊరట!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. 28ఏళ్లలో తొలిసారిగా దీదీ
బండెనుక బండికట్టి రేపిస్టు పోతుంటే.. కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్
చరిత్ర సృష్టించిన రబాడ
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు
’వద్దే వద్దు’.. త్రిషాకు సీఎం విజయ్ చెక్..!
‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త పద్ధతి!
పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం
‘వచ్చే పదేళ్లు మామూలుగా ఉండదు’
చక్కనమ్మకు ముక్కెరందం
తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు
మా సిద్ధాంతాలను కాంగ్రెస్ కాపీ కొడుతుంటే చూస్తూ ఊరుకోం!
వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
దేవతల రాజధాని అంటే మన ఆలయాల భూములు కూడా ఆక్రమించి అమ్మేసి కట్టేది అని ఇప్పుడే అర్థమైంది స్వామి!!
అర్జున్ టెండూల్కర్కు ఘోర అవమానం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు
ఇరాన్ సంచలన ప్రకటన
హార్ముజ్ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్
ఫొటోలు
‘సిస్టమ్’ మేకింగ్ ఫోటోలను షేర్ చేసిన జ్యోతిక (ఫొటోలు)
పలుచని చీరలో కుందనపు బొమ్మలా వైష్ణవి (ఫొటోలు)
ఓ మై శ్రీలీల.. వాట్ ఏ గ్లామర్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు (ఫొటోలు)
యా అల్లా... సబ్ కా భలా కరో! (ఫొటోలు)
చీరలో యువరాణిలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
కళ్లు జిగేల్ అనిపించేలా కాజల్ ఫోటో షూట్
'చెన్నై లవ్స్టోరి' మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
రుక్మిణి వసంత్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
‘సింగిల్ రాజు’ కథ ఆసక్తికరంగా ఉంది: వేణు ఊడుగుల
విశ్వాస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సింగిల్ రాజు’. ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శక–నిర్మాత వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా హాజరై టైటిల్ పోస్టర్, గ్లింప్స్ను విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా కథ చాలా ఆసక్తిగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలి’’ అని తెలిపారు. ఎస్.ఎస్. వర్మ మాట్లాడుతూ–‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమా కోసం నాకంటే ఎక్కువగా మా అమ్మానాన్నలు కష్టపడ్డారు. ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్టైనర్గా ‘సింగిల్ రాజు’ నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘వర్మ, మేము ఎంతో ప్యాషన్తో చేస్తున్న చిత్రమిది’’ అన్నారు విశ్వాస్. ఈ చిత్రానికి కెమెరా: సాయితేజ కుందారపు, నితీష్.
ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్పై సముద్రఖని కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నిరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హీరో విజయ్.. తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆయన గెలుపు గురించి ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా తనదైన శైలిలో సీఎం విజయ్ గురించి మాట్లాడారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన సముద్రఖని.. విజయ్ రాజకీయ అనుభవంపై వచ్చిన విమర్శలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'తమిళనాడు ప్రజలు సినీ ఇండస్ట్రీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అందించారు. దీనిపై నాకు చాలా ఆనందంగా ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు(విజయ్) ఏం అర్హత ఉందని చాలామంది ప్రశ్నించారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకొనే వాళ్లు ప్రజల కోసం ఏం చేశారు? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాళ్లు మరింత జాగ్రత్తగా, ప్రజల కోసం మంచి చేస్తారనే నమ్మకం నాకు ఉంది' అని అన్నారు.తమిళనాడు ఎన్నికల ఫలితాలని సునామీతో పోల్చిన ఈయన..'ఈ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, అహంకారం ఏమీ గెలవలేదు. ప్రజలు అజ్ఞానులు అని కొందరు భావించారు. కానీ వాళ్లే ఎంతో తెలివిగా వ్యవహరించారు. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని చివరకు డబ్బు ఇవ్వని పార్టీకి ఓటేశారు. అయితే ఈ ఫలితాల్లో స్టాలిన్ సర్, పళనివేళ్ త్యాగరాజ్ అన్న, సీమన్ అన్న ఓడిపోవడం నాకు బాధ కలిగించింది. తిరుమావళన్ అన్నకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అప్పుడు గెలిచేవారు. అన్నామలై ఇంకొంత కాలం ప్రజల్లో తిరుగుంటే బాగుండేది. ఈ సునామీ కొన్ని మంచి విషయాల్ని కూడా తీసుకెళ్లిపోయింది' అని సముద్రఖని చెప్పుకొచ్చారు.తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా వరస సినిమాలు చేస్తున్న సముద్రఖని ప్రస్తుతం వెట్రిమారన్ 'అరసన్' మూవీలో నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం 'కార్మేని సెల్వం' మూవీతో వచ్చారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)“பெரிய சுனாமி வந்தது மாதிரி...பணம், ஜாதி, மதம், அகங்காரம் உடைக்கப்பட்டது..”- தேர்தல் முடிவு குறித்து இயக்குநர் சமுத்திரக்கனி#Samuthirakani | #TVK | #Vijay | #CMVijay pic.twitter.com/bh2Q5p4cZt— PttvOnlinenews (@PttvNewsX) May 26, 2026
జాన్వీ కపూర్ చెప్పిన బెస్ట్ వెయిట్ లాస్ టిప్
సాధారణ ప్రజలు నచ్చినవి నచ్చినట్లు తినేస్తుంటారు కానీ సినిమా సెలబ్రిటీలకు ఇలాంటివి కుదరదు. మూవీల్లో చేసే పాత్ర కోసం పక్కా డైట్ మెంటైన్ చేస్తూ బాడీ ఫిట్గా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. జాన్వీ కపూర్ కూడా ఇప్పుడు అలాంటి ఓ బెస్ట్ వెయిట్ లాస్ టిప్ చెప్పింది. 'పెద్ది' చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం)జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న సినిమా 'పెద్ది'. రామ్ చరణ్ హీరో కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. కొన్నిరోజుల క్రితం ముంబైలో ట్రైలర్ లాంచ్ చేయగా.. రీసెంట్గా భోపాల్లో ఐటమ్ గీతాన్ని ఆవిష్కరించారు. సోమవారం బెంగళూరులోని మరో ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమంలోనే హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'రామ్ చరణ్ సర్తో ఓ పాటలో గనక మీరు డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తే సగం రోజులోనే బక్కగా అయిపోతారు' అని చెప్పుకొచ్చింది.జాన్వీ ఇలా చెబుతున్నప్పుడు ఎదురుగా కూర్చుని ఉన్న రామ్ చరణ్ సిగ్గు పడిపోతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కొందరిని మాత్రమే ఆకట్టుకుంది. మాస్ మూమెంట్స్ కంటే స్టోరీని చూపించడంతో కొందరు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఐటమ్ సాంగ్కి కూడా మిశ్రమ స్పందనే వచ్చింది.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)Best Weight Loss Tip by #JanhviKapoor:"Try Dancing with #RamCharan...You'll Become Skinny in Half a Day!" 😂🔥#PEDDI pic.twitter.com/Wxg7sTPC5i— Shubh Naam TV (@VaibhavRaj99329) May 25, 2026
అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన స్వతహాగా నటుడే కాబట్టి ఇండస్ట్రీకి అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటారని సినీ ప్రముఖులు అంతా భావించారు. ఎవరికి వాళ్లే పలు సూచనలతో విజయ్ని ఇదివరకే వెళ్లి కలిశారు కూడా. ఇప్పడు సినీ పరిశ్రమకు మొత్తానికి కలిసొచ్చేలా విజయ్ శుభవార్త చెప్పేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్.. ఇండస్ట్రీ గురించి ప్రకటన చేశారు. ఇకపై ఏ తమిళ సినిమా అయినా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని పేర్కొన్నారు. 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి లభించింది.గత కొన్నేళ్లలో తమిళనాడులో ఏ కొత్త సినిమా అయినా సరే మార్నింగ్ షోతోనే మొదలయ్యేది. బెన్ఫిట్ షోలు లాంటివి ఉండేవి కావు. ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల స్టార్ హీరోల చిత్రాలకు కలెక్షన్స్ పరంగా కలిసొచ్చే అవకాశముంటుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ల ట్రెండ్ కూడా త్వరలో తమిళనాడులో మొదలైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఇకపోతే విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగణ్' రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తేలట్లేదు. కొన్నిరోజుల క్రితం తమిళనాడులోని ఓ ఆలయాన్ని దర్శించుకున్న ఈ చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఇంకా సెన్సార్ కాలేదని చెప్పారు. మరోవైపు జూన్ 19న మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రోజుకు ఐదు షోల నిర్ణయం.. 'జన నాయగణ్'కి ఎక్కువగా లాభించే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం)
క్రీడలు
ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఎలిమినేటర్లో భాగంగా ఎస్ఆర్హెచ్ బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు సన్రైజర్స్కు భారీ షాక్ తగిలింది.ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ ఎస్ఆర్హెచ్ క్యాంప్ను వీడి శ్రీలంకకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మెండిస్ జాతీయ జట్టు కమిట్మెంట్స్ కారణంగా జట్టును వీడినట్లు సమాచారం. శ్రీలంక జట్టు త్వరలోనే ఆల్ఫార్మాట్ సిరీస్లలో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన శ్రీలంక జట్టులో మెండిస్ భాగంగా ఉన్నాడు. ఈ కారణంతో అతడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు ముందు తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పటికే లంక జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మెండిస్కు ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. గత సీజన్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టులో విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఉండడంతో మెండిస్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. ట్రావిస్ హెడ్, క్లాసెన్, కమ్మిన్స్, మలింగ రూపంలో నలుగురు విదేశీ ఆటగాళ్లగా తుది జట్టులో కొనసాగుతున్నారు.రాజస్తాన్తో ఎలిమినేటర్ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అంబరీష్, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. ఇంపాక్ట్ సబ్: ప్రఫుల్ హింగే.
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్గా భారత్కు టీ20 ప్రపంచకప్ను అందించిన సూర్యకుమార్.. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్-2026లో కూడా సూర్య తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.13 ఇన్నింగ్స్లలో అతడు కేవలం 270 పరుగులు సాధించాడు. ఇప్పుడు అతడు తన పేలవ ఫామ్ కారణంగా భారత టీ20 కెప్టెన్సీని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటన తర్వాత కెప్టెన్గా అతడి భవిత్యవం తేలిపోనుంది. ఈ సిరీస్లోనూ సూర్య విఫలమైతే భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ రావడం ఖాయం కానుంది. ఇక తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి సూర్యకుమార్కు మరో అద్భుత అవకాశం లభించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ముంబై టీ20 లీగ్-2026లో ‘ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్’ ఫ్రాంచైజీ తరఫున సూర్య బరిలోకి దిగనున్నాడు.ఉగాండా పై ఆడనున్న సూర్యకాగా ఈ టోర్నీ కంటే ముందు సూర్యకుమార్ యాదవ్ ఉగాండాపై ఆడనున్నాడు. ఉగాండా జట్టు ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా వారు 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడుతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ను ఉగాండా 4-0తో క్లీన్స్వీప్ చేసింది. ముంబై లీగ్లోని నాలుగు వేర్వేరు జట్లతో ఉగాండా టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ఉగాండా తమ తొలి మ్యాచ్లో మే 30న ‘ట్రయంఫ్ నైట్స్’ జట్టుతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో ట్రయంఫ్ నైట్స్ తరపున సూర్య ఆడనున్నట్లు తెలుస్తోంది.సూర్యకుమార్ ట్రయంఫ్ నైట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. కాబట్టి ఉగాండాపై అతడు ఆడే అవకాశముంది. సూర్య ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్గా ఉన్నాడు. అతడు ఏ జట్టుపై ఆడినా, అది ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అని ఎంసీఎ కార్యదర్శి ఉన్మేష్ ఖాన్విల్కర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.
టీమిండియాతో సిరీస్లకు ఆఫ్ఘనిస్తాన్ జట్ల ప్రకటన
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో టీమిండియా-ఆఫ్ఘన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్, 3 వన్డేల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ల కోసం వేర్వేరు ఆఫ్ఘనిస్తాన్ జట్లను ఇవాళ (మే 26) ప్రకటించారు. ఈ రెండూ ఫార్మాట్ల జట్లకు హష్మతుల్లా షాహిది కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనంగా ఉంది.ఇటీవలికాలంలో ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్లో లేకపోయినా, కీలక పర్యటన కావడంతో సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు.వన్డే జట్టులో అనుభవజ్ఞులైన రహ్మత్ షా, రహ్మానుల్లా గుర్బాజ్తో పాటు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. వికెట్కీపర్లుగా అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్లను ఎంపిక చేశారు.బౌలింగ్ విభాగంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టుకు ప్రధాన బలంగా నిలవనున్నాడు. అతడి అనుభవం భారత పిచ్లపై ఆఫ్ఘనిస్తాన్కు కీలకంగా మారనుంది.2027 వన్డే వరల్డ్కప్ దృష్ట్యా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. బెంచ్ స్ట్రెంత్ను పరీక్షించుకోవడం, కొత్త కాంబినేషన్లను సిద్ధం చేయడం ఈ సిరీస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు టెస్టు ఫార్మాట్లో భారత్ లాంటి బలమైన జట్టుతో ఆడటం ఆఫ్ఘనిస్తాన్కు విలువైన అనుభవాన్ని అందించనుంది. గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్ఘనిస్తాన్కు ఈ సిరీస్ పెద్ద పరీక్షగా మారింది. ఈ సిరీస్ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.భారత పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్ వన్డే జట్టు:హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అబ్దుల్ మాలిక్, సెదీకుల్లా అతల్, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మనుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరఫుద్దీన్ అష్రఫ్, నంగ్యాల్ ఖరోటాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ, రషీద్ ఖాన్.భారత పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టు:హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అబ్దుల్ మాలిక్, సెదీకుల్లా అతల్, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మనుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరఫుద్దీన్ అష్రఫ్, నంగ్యాల్ ఖరోటాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ.ఆఫ్ఘనిస్తాన్ భారత పర్యటన షెడ్యూల్ఏకైక టెస్ట్ మ్యాచ్- జూన్ 6-10 (ముల్లాన్పూర్)తొలి వన్డే- జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే- జూన్ 17 (లక్నో)మూడో వన్డే- జూన్ 20 (చెన్నై)
పీకల్లోతు కష్టాల్లో గుజరాత్
ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్8.2వ ఓవర్- 65 పరుగుల వద్ద గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది. డఫీ బౌలింగ్లో హాజిల్వుడ్కు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (8) ఔటయ్యాడు. 51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన గుజరాత్5.4వ ఓవర్- 51 పరుగుల వద్ద గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. రసిక్ సలాం దార్ బౌలింగ్లో హాజిల్వుడ్కు క్యాచ్ ఇచ్చి జేసన్ హోల్డర్ డకౌటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో గుజరాత్255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. హాజిల్వుడ్ బౌలింగ్లో బట్లర్ (29) మూడో వికెట్గా, రసిక్ సలాం దార్ బౌలింగ్లో నిషాంత్ సింధు (5) నాలుగో వికెట్గా వెనుదిరిగారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్3.1వ ఓవర్- 27 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.సాయి సుదర్శన్ హిట్ వికెట్2.3వ ఓవర్- 17 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. గుజరాత్ను దరిద్రం వెంటాడంతో సాయి సుదర్శన్ (14) హిట్ వికెట్గా వెనుదిరిగాడు. డఫీ బౌలింగ్లో బంతి బౌండరీకి వెళ్లినా సుదర్శన్ బ్యాట్ చేజారి వికెట్లకు తాకింది. పాటిదార్ ఊచకోత.. ఆర్సీబీ భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. రజత్ పాటిదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పాటిదార్తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాటిదార్ క్యాచ్ను రబాడ మిస్ చేయడంతో గుజరాత్ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. క్యాచ్లు, రనౌట్లు మిస్ చేయడంతో పాటు లేని పరుగులను సమర్పించుకున్నారు. బౌలర్లు ఓ మోస్తరుగా బౌలింగ్ చేసినా ఫీల్డర్ల పొరపాట్ల కారణంగా గుజరాత్ భారీ మూల్యం చెల్లించుకుంది. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ17.6వ ఓవర్- 214 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో టిమ్ డేవిడ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ఆర్సీబీ స్కోర్: 204/4భారీ స్కోర్ దిశగా ఆర్సీబీఆర్సీబీ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 16 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్ పాండ్యా(43), పాటిదార్(49) ఉన్నారు.మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ9వ ఓవర్లో ఆర్సీబీ మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి జేసన్ హోల్డర్ బౌలింగ్లో విరాట్ కోహ్లి (43) క్లీన్ బౌల్డ్ కాగా.. నాలుగో బంతికి వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ (30) పెవిలియన్కు చేరాడు. పవర్ ప్లేలో దుమ్మురేపిన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలో దుమ్మురేపింది. సుడిగాలి ఇన్నింగ్స్ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (19) ఔటైనా, విరాట్ కోహ్లి (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (23 నాటౌట్) మెరుపులు కొనసాగించారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 76-1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ1.6వ ఓవర్- 21 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెంకటేశ్ అయ్యర్ (19) ఔటయ్యాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 26) జరుగుతున్న తొలి క్వాలిఫయర్ పోటీలో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ సలాం దార్
న్యూస్ పాడ్కాస్ట్
మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా?... చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో పగిలిన అక్రమాల పుట్ట... ఎస్సీఆర్టీ నుంచే కుంభకోణం..
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో దోపిడీ విజన్, స్కామ్కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
బిజినెస్
బక్రీద్పై కన్ఫ్యూజన్.. మే 28న స్టాక్ మార్కెట్లకు సెలవా?
భారతదేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్లైన.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు 2026 మే 28, గురువారం రోజున బక్రీద్ పండుగ సందర్భంగా మూతపడనున్నాయి. కాబట్టి.. స్టాక్ మార్కెట్లలో అన్ని ప్రధాన ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.ఎన్ఎస్ఈ విడుదల చేసిన అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం.. బక్రీద్ రోజు ఈక్విటీ ట్రేడింగ్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) వంటి విభాగాలలో ట్రేడింగ్ ఉండే అవకాశం లేదు. అందువల్ల పెట్టుబడిదారులు ఆ రోజున షేర్ల కొనుగోలు లేదా అమ్మకాలు చేయలేరు.అయితే.. ఈసారి బక్రీద్ సెలవు మే 27న ఉంటుందా?, లేదా మే 28న ఉంటుందా? అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కొన్ని రాష్ట్రాలు, సంస్థలు మొదట మే 27ను పరిగణించినప్పటికీ.. ఎక్కువ శాతం ఆర్థిక సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్లు మే 28నే అధికారిక సెలవు రోజుగా ప్రకటించాయి. దీంతో పెట్టుబడిదారులు తమ ట్రేడింగ్ ప్రణాళికలను దానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.అదేవిధంగా.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) కూడా మే 28 ఉదయం సెషన్ మూతపడనుంది. అయితే.. సాయంత్రం సెషన్లో కమోడిటీ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే.. బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ వంటి వస్తువుల ట్రేడింగ్ సాయంత్రం తర్వాత కొనసాగుతుందన్నమాట.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 479.26 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 76,009.70 వద్ద, నిఫ్టీ 118.00 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 23,913.70 వద్ద నిలిచాయి.ఇండో రామా సింథటిక్స్ (ఇండియా) లిమిటెడ్, బయోఫిల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఆగ్రో ఫోస్ ఇండియా లిమిటెడ్, ప్రతాప్ స్నాక్స్ లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టెక్నో ఎలక్ట్రిక్ & ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, గాంధీ స్పెషల్ ట్యూబ్స్ లిమిటెడ్, డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్, అజ్మేరా రియల్టీ & ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
మైక్రోసాఫ్ట్ వర్సెస్ ఎంసీఏ
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) మధ్య న్యాయ పోరాటం మరింత ముదిరింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సహా ఇతర అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్లపై ఢిల్లీ-హరియాణా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) విధించిన జరిమానా ఉత్తర్వులను సవాలు చేస్తూ లింక్డ్ఇన్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించింది.మే 15, 2026న దాఖలైన ఈ అప్పీల్ను పరిశీలించిన ట్రైబ్యునల్ ఈ వివాదంపై తుది నిర్ణయం వచ్చే వరకు ఆర్ఓసీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ (స్టే) మధ్యంతర ఉపశమనం కల్పించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భారతదేశంలో పనిచేస్తున్న బహుళజాతి కంపెనీల (ఎంఎన్సీ) భవిష్యత్తుపై దీని ప్రభావం ఉండనుండటంతో లీగల్ సర్కిల్స్లో ఈ కేసు హాట్ టాపిక్గా మారింది.అసలు వివాదం ఏమిటి?లింక్డ్ఇన్ సంస్థ మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉంది. 2016లో సుమారు 26.2 బిలియన్ డాలర్ల డీల్తో మైక్రోసాఫ్ట్ దీనిని సొంతం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ కార్పొరేట్ నిర్మాణంలో అగ్రస్థానంలో ఉండగా లింక్డ్ఇన్ సీఈఓ ర్యాన్ రోస్లాన్స్కీ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ పరిధిలో పనిచేస్తున్నారు. అయితే, మే 5, 2024న జారీ చేసిన ఒక ఉత్తర్వులో లింక్డ్ఇన్ ఇండియా, లింక్డ్ఇన్ ఐర్లాండ్లతో పాటు సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీలపై ఆర్ఓసీ రూ.27 లక్షల జరిమానా విధించింది. కంపెనీల చట్టం ప్రకారం వీరు ‘గణనీయమైన ప్రయోజనకరమైన యజమానుల’ (సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్స్-ఎస్బీఓ) నిర్వచనం కిందికి వస్తారని, అయితే ఈ వివరాలను దాచారని ఆర్ఓసీ పేర్కొంది.లింక్డ్ఇన్ వాదనలింక్డ్ఇన్ ఇండియా అనేది మైక్రోసాఫ్ట్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ. అయితే, మాతృ సంస్థలో ఏ ఒక్క నిర్దిష్ట వాటాదారుకూ గణనీయమైన వాటా లేదు. అందువల్ల ఎంసీఏ ఫైలింగ్స్లో తాము ‘శూన్య’ (నిల్) ఎస్బీఓలను ప్రకటించామని, చట్టాన్ని తాము ఉల్లంఘించలేదని లింక్డ్ఇన్ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై స్పందన కోరుతూ పంపిన ఈమెయిల్స్కు లింక్డ్ఇన్, మైక్రోసాఫ్ట్ లేదా ఎంసీఏ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.ఎస్ఈసీ మాటేంటి..ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ముందు మైక్రోసాఫ్ట్ సమర్పించిన పత్రాలను ఆర్ఓసీ పరిగణనలోకి తీసుకోవడం. సత్య నాదెళ్లకు లింక్డ్ఇన్ ఇండియాపై నియంత్రణ ఉందనే నిర్ధారణకు రావడానికి, ఆయన ఎస్ఈసీకి సమర్పించిన ‘ఫారం 4ఎస్’ ఫైలింగ్స్ను ఆర్ఓసీ తన 63 పేజీల ఉత్తర్వులో ప్రధానంగా ప్రస్తావించింది. కంపెనీ అంతర్గత వ్యక్తులు (ఇన్సైడర్స్), డైరెక్టర్లు తమ వాటాల మార్పులను వెల్లడించడానికి అమెరికాలో ఈ ఫారం 4ఎస్ ఉపయోగిస్తారు.బహుళజాతి కంపెనీలపై పడే ప్రభావంభారతీయ చట్టాల ప్రకారం ప్రయోజనకరమైన యాజమాన్యాన్ని (ఎస్బీఓ) రెండు పరీక్షల ద్వారా గుర్తిస్తారు. షేర్హోల్డింగ్ టెస్ట్.. కంపెనీలో 10 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉండటం. నియంత్రణ టెస్ట్.. ప్రత్యక్ష వాటాతో సంబంధం లేకుండా కంపెనీ వ్యవహారాలపై గణనీయమైన ప్రభావం లేదా నియంత్రణను (వీటో హక్కులు వంటివి) కలిగి ఉండటం. ప్రస్తుత కేసులో ఆర్ఓసీ ఏ వాటాదారుకో కాకుండా, ఏకంగా గ్లోబల్ సీఈఓకు జరిమానా విధించడం గమనార్హం.‘సీఈఓ విధి కంపెనీని నడపడమే. నిర్ణయాధికారాల కోసం వారికి కొన్ని అధికారాలు సహజంగానే ఉంటాయి. అంతమాత్రాన సీఈఓలు తీసుకునే ప్రతి నిర్ణయం ఎస్బీఓ నిబంధనల ప్రకారం ‘నియంత్రణ’ కిందికి రాదు’ అని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు
లేఆఫ్స్కు సాకు చెప్పడం సీఈఓల సోమరితనం
టెక్ ప్రపంచంలో కొంతకాలంగా సాగుతున్న ఉద్యోగాల కోత (లేఆఫ్స్)పై కృత్రిమ మేధ (ఏఐ) దిగ్గజం, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీల్లో జరుగుతున్న ఉద్యోగాల తొలగింపునకు ఏఐ సాంకేతికతను సాకుగా చూపించడాన్ని ఆయన తప్పుపట్టారు. కొంతమంది టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, కేవలం స్మార్ట్గా కనిపించడానికి ఏఐని వాడుకుంటున్నారని ఇది వారి సోమరితనం(లేజీ నారేటివ్) అని మండిపడ్డారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.రెండేళ్ల క్రితం తీసేసి.. ఇప్పుడు ఏఐ అనడం ఏంటి?ఉద్యోగ నష్టాలకు, ఏఐ విస్తరణకు ముడిపెడుతూ సాగుతున్న ప్రచారాన్ని జెన్సెన్ హువాంగ్ పూర్తిగా ఖండించారు. సాంకేతికత ఇప్పుడిప్పుడే వ్యాపారాలకు ఉపయోగకరంగా మారుతోందని, కానీ కంపెనీలు మాత్రం చాలా కాలం క్రితమే ఉద్యోగులను తొలగించాయని ఆయన గుర్తుచేశారు. ‘ఏఐ అనేది కేవలం గత ఆరు నెలలుగా మాత్రమే పూర్తిస్థాయిలో ఉత్పాదకతను ఇస్తూ కంపెనీలకు ఉపయోగకరంగా మారింది. మరి అలాంటప్పుడు రెండేళ్ల క్రితమే ఉద్యోగులను తొలగించిన కంపెనీలు.. దానికి ఏఐ కారణమని ఎలా చెబుతాయి? టెక్నాలజీ ఇప్పుడే మార్కెట్లోకి వస్తే.. అప్పుడే ఉద్యోగాలు ఎలా పోతాయి? నేను ఈ ధోరణిని తీవ్రంగా ద్వేషిస్తున్నాను’ అని హువాంగ్ అన్నారు. కొంతమంది వ్యాపార నాయకులు శ్రామిక శక్తిని తగ్గించుకోవడానికి ఉన్న అసలైన అంతర్గత కారణాలను దాచిపెట్టి కేవలం చర్చనీయాంశంగా మార్చడానికి ఏఐని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.భయాందోళనలు సృష్టించడం బాధ్యతారాహిత్యంప్రస్తుతం మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఒకవైపు ఏఐ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెడుతూనే.. మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో మానవ కార్మికులను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేస్తుందేమోనన్న ఆందోళనను ఉద్యోగుల్లో పెంచుతున్నాయి. ఈ అంశంపై హువాంగ్ స్పందిస్తూ.. కార్పొరేట్ నాయకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ‘మనం అనవసరంగా ప్రజలను భయపెడుతున్నాం, ఇది చాలా బాధ్యతారాహిత్యం. ఏఐ చుట్టూ ఉన్న వాస్తవాలను, దానివల్ల కలిగే సమతుల్య ప్రయోజనాలను సమాజానికి వివరించడంపై పరిశ్రమ దృష్టి పెట్టాలి’ అని ఆయన స్పష్టం చేశారు.పీక్ స్టేజ్లో ఉద్యోగాల కోత: గణంకాలు ఏం చెబుతున్నాయి?ఉత్పాదకతను పెంచడానికి, పనులను ఆటోమేట్ చేయడానికి పరిశ్రమలు ఏఐ సాధనాలను వేగంగా స్వీకరిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ లేఆఫ్స్కు కేవలం అదే కారణం కాదని మార్కెట్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే ‘లేఆఫ్స్.ఎఫ్వైఐ’ తాజా గణాంకాల ప్రకారం.. 2026లో ఇప్పటివరకు 150 టెక్ కంపెనీల్లోని 1,14,210 మందికి పైగా ఈ లేఆప్స్ ద్వారా ప్రభావితమయ్యారు. మొత్తమ్మీద, లేఆఫ్స్ వెనుక ఉన్న ఆర్థిక మాంద్యం భయాలు, కంపెనీల మితిమీరిన విస్తరణ, వ్యయాల తగ్గింపు వంటి అసలు కారణాలను పక్కనబెట్టి ప్రతిదానికీ సరికొత్త టెక్నాలజీ వైపు వేలెత్తి చూపడం సరికాదన్న ఎన్విడియా చీఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు
ఫ్యామిలీ
హిమాలయాల నడుమ చల్లని స్వర్గం
అవి పర్వత శ్రేణులు మాత్రమే కాదు, ఒక జీవన వేదం. మంచు పర్వతాలతో మొదలయ్యి, ప్రశాంతమైన బుద్ధిస్ట్ ఆలయం వరకు నేపాల్లోని ప్రతీ ఒక్కటి మనకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఎండాకాలంలో ఇక్కడ ఉన్న వాతావరణం మన మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఖాట్మాండులో చారిత్రాత్మక కట్టడాల నుంచి పోఖరాలోని సరస్సు వరకు ప్రతీ అడుగు ఒక కొత్త కథలోకి ఎంటరైన ఫీలింగ్ను అందిస్తుంది.ప్రకృతి పరవశంలో...నేపాల్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హిమాలయాలు. ఎండాకాలంలో మిగితా చోట్ల ఎండ ఎక్కువ ఉన్నా, ఇక్కడ అనేక చోట్ల వాతావరణం మాత్రం చాలా హాయిగా ఉంటుంది. ఖాట్మాండులోని ప్రాచీన కట్టడాలు, కొత్తగా అనిపించే వీధులు మన ప్రయాణాన్ని చాలా ప్రత్యేకంగా మార్చుతాయి. ఇక్కడ ఉండే మనుషులు, వారి ఆత్మీయత మనం దూర ప్రాంతంలో ఉన్నాం అనే ఫీలింగ్ని దరిచేరనివ్వవు. ప్రతీ చిన్న గుడిలో ఉండే శాంతి మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్రతీ క్షణం కొత్త జ్ఞాపకంలా అనిపిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలుఖాట్మాండు సిటీలో ఉండే పశుపతినాథ్ ఆలయం ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అక్కడ జరిగే హారతి, వాతావరణం మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది. ఇది కేవలం ఒక గుడి కాదు, ఇక్కడ ప్రతీ రాయి ఒక కథ చెబుతుంది. ఇంకా బౌద్ధనాథ్ స్తూపం వద్ద ఉండే ఆ శాంతి, అక్కడికి వచ్చిన భక్తుల మౌనం మనల్ని క్షణం పాటు స్థంభింపచేస్తాయి. పోఖరకి వెళ్తే అక్కడ ఫేవా లేక్లో బోట్ రైడింగ్ చేస్తున్నప్పుడు కనిపించే మచ్ఛపుచ్చ్రే పర్వతం రిఫ్లెక్షన్ చూసేందుకు రెండు కళ్లు సరి΄ోవు. సరస్సు నుంచి వచ్చే చల్లని గాలి మన శరీరాన్నే కాదు మనసును కూడా హత్తుకుంటుంది. సారంగ్కోట్ నుంచి సూర్యోదయం చూడటం ఒక మరువలేని అనుభవంగా మిగిలి΄ోతుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఖాట్మాండుకి డైరెక్ట్ ఫ్లైట్స్ లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మబ్బుల మధ్య కనిపించే హిమాలయ శిఖరాలు చూడటం ఒక గొప్ప అనుభూతి ఇస్తుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్లో గోరఖ్పుర్ వరకు వెళ్లి, అక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా నేపాల్ బార్డర్స్ దాటాల్సి ఉంటుంది. రోడ్డు ప్రయాణంలో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ వెళ్లడం ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుంది. విజయవాడ నుంచి వచ్చే వారు ముందుగా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్స్ తీసుకోవడం ఉత్తమం.ఎక్కడ ఉండాలి?నేపాల్లో స్టే చేయడం అంటే ఒక ప్రకృతి ఒడిలో నిద్ర΄ోవడం లానే ఉంటుంది. ఖాట్మాండులోని థామెల్ ఏరియాలో ఉన్న హాస్టల్స్లో ఉంటే అక్కడుండే వైబ్రెంట్ లైఫ్ని దగ్గరగా చూడవచ్చు. ఇక్కడ స్ట్రీట్స్ అన్ని కొత్త పరిమళాలతో నిండి ఉంటాయి. పోఖరాలో సరస్సు పక్కనే ఉండే రిసార్ట్స్లో స్టే చేస్తే, పొద్దున్నే లేచే సరికి కనిపించే మౌంటెన్ వ్యూస్ మనసును ఉల్లాసపరుస్తాయి. ఇక్కడ రిసార్ట్స్లో ఉండే హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. అక్కడుండే చెట్ల మధ్య, చల్లని గాలి మధ్య స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది.ఏం చూడాలి?నేపాల్లో ప్రతీ మూమెంట్ స్పెషల్. భక్తుపూర్లోని ప్రాచీన వీధులు, అక్కడుండే ఆర్కిటెక్చర్ చూస్తే మనం కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్లామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. నాగర్కోట్ నుంచి కనిపించే ఎవరెస్ట్ రేంజ్ వ్యూస్ ట్రిప్కి ఒక హైపాయింట్లా ఉంటుంది. సమ్మర్లో అక్కడుండే గ్రీనరీ, మబ్బుల దోబూచులాట చూడటానికి చాలా బాగుంటాయి. పశుపతినాథ్ దగ్గర ఈవినింగ్ హారతి చూడటం, అక్కడి ఆట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వడం ఒక గొప్ప ఎక్స్పీరియెన్స్.ఏం తినాలి?నేపాల్లో ప్రతీ ముద్ద ఒక జ్ఞాపకంలా మిగిలి΄ోతుంది.ఇక్కడ మోమోస్ తినడం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. అది ఒక యూనిక్ ఇమోషన్. మోమోస్ మాత్రమే కాదు, లోకల్ ఎక్స్పీరియెన్స్ ఆ రుచి మనసుకు హత్తుకుంటుంది. ట్రెడిషనల్ దాల్ భాట్ మనం తినే థాలిని పోలి ఉంటుంది. హిమాలయన్ స్పైసెస్ వల్ల కొత్త రుచి వస్తుంది. ఎండాకాలం బేవరేజెస్ అండ్ టీ వెరైటీలు రిఫ్రెషింగ్లా ఉంటాయి. వీటితో పాటు క్రిస్పీ సెల్ రోటీ, యోమారి లాంటి స్వీట్ డెలికసీస్ నేపాల్ ఆథెంటిక్ టేస్టును చూపిస్తాయి. స్ట్రీట్ ఫుడ్లో దొరికే చోయిలా, చాటామరి అనే నేపాల్ పిజ్జాను పర్యాటకులు బాగా ఇష్టపడతారు.నేపాల్ యాత్ర బడ్జెట్ వివరాలునేపాల్ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు 5 డేస్ ప్లాన్ చాలా బాగుంటుంది. టోటల్ ట్రిప్ బడ్జెట్ పర్ పర్సన్ వచ్చేసి మినిమం రూ.20 వేల అనుకుంటే, మ్యాక్సిమమ్ అనేది మీ ట్రావెల్ స్టైల్, రూమ్ అండ్ ఫుడ్, ఇతర ఖర్చులను బట్టి ఆధారపడి ఉంటుంది. సుమారుగా చెప్పాలంటే ఒక వ్యక్తికి వారం రోజుల నేపాల్ యాత్రకు యావరేజ్ రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.హైదరాబాద్ నుంచి ఖాట్మాండుకు ఫ్లైట్ చార్జీలు సీజన్, ప్రయాణించే క్లాసును బట్టి రూ.35 వేల నుంచి రూ.51 వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది. రూమ్స్ విషయానికి వస్తే రూ.500కు కూడా రూమ్స్ లభిస్తాయి. కానీ అందులో సేఫ్టీ ఇష్యూస్ అండ్ సదు΄ాయాల కొరత ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ సమస్యే కాదు అనుకుంటే రూ.10 వేలకు కూడా రూమ్స్ లభిస్తాయి.ఇక ఫుడ్ కాస్ట్ విషయానికి వస్తే యావరేజ్గా రోజుకు రూ.600 నుంచి రూ.1500 వరకు మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ను బట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ ట్రావెలర్స్ కోసం గెస్ట్ హౌజెస్ కూడా ఆప్షన్స్ ఉంటాయి.ఎవరెస్ట్, కైలాస శిఖర దర్శనంనేపాల్ నుంచి ఎవరెస్ట్ అండ్ పవిత్ర కైలాస పర్వత శిఖరాన్ని చూడటం ఒక తీయని అనుభూతిగా మిగిలి΄ోతుంది. ఖాట్మాండు నుంచి ఎర్లీగా మౌంటెన్ ఫ్లైట్ ఎక్కితే ఎవరెస్ట్ని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఎవరెస్ట్ని చూసేందుకు ఫ్లైట్స్ ఉన్నా, కైలాస పర్వత దర్శనం కోసం హుమ్లాలోని లిమి ప్లాచా వరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి చైనా వీసా లేకుండా దూరంగా ఉన్న కైలాస మానస సరోవర్ని కళ్లారా చూడవచ్చు.వీసా అవసరం లేదుభారతీయులకు నేపాల్ వెళ్లడానికి వీసా అవసరం లేదు. ఓటర్ ఐడీ లేదా పాస్పోర్టు ఉంటే సరి΄ోతుంది. డిజిటల్ కాపీలను కాకుండా ఒరిజినల్ తీసుకెళ్లండి. ఎందుకంటే డిజిటల్ కాపీలు, ప్రింటౌట్లు, డిజిలాకర్ వర్షన్లను బార్డర్స్ అండ్ ఎయిర్΄ోర్టుల్లో యాక్సెప్ట్ చేయరు. మరో విషయం ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులను అధికారిక ట్రావెల్ డాక్యుమెంట్స్గా అంగీకరించరు.తెలుసుకోవాల్సిన విషయాలు 1. ప్రపంచంలోని టాప్ 14 అత్యంత ఎతైన పర్వతాల్లో 8 నేపాల్లోనే ఉన్నాయి.2. గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రాంతమైన లుంబిని నేపాల్లోనే ఉంది.3. నేపాల్ ఫ్లాగ్ ప్రపంచంలోనే యూనిక్ షేప్లో ఉంటుంది.4. ఇక్కడ నేలీ భాషతోపాటు చాలామంది హిందీ, ఇంగ్లిష్ మాట్లాడుతారు.5. ఇండియన్ కరెన్సీని కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు.ఎండాకాలంలోవెళ్తే మాత్రంనే;ల్ సమ్మర్ ట్రిప్ వెళ్తే మాత్రం బ్రెతబుల్ కాటన్ క్లోత్స్, ఒక లైట్ జాకెట్ తీసుకెళ్లండి. వెళ్లే ముందు వాతావరణం అప్డేట్స్ తెలుసుకోవడం మరవకండి.ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు నోట్: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్ అప్టేట్స్ స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు. (చదవండి: ఇవాళ నుంచే రోహిణి కార్తె ప్రారంభం..! రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే..)
సమ్మర్ టూర్స్లో కార్సేఫ్టీకి టిప్స్..!
సమ్మర్ హాలిడేస్ అంటే రోడ్ ట్రిప్స్ గుర్తొస్తాయి. హైవేస్, ప్లే లిస్టులు, టీ స్టాప్స్, సన్సెట్ డ్రైవ్స్ ఇవన్నీ ప్రయాణంలో భాగం అవుతాయి. కానీ ఎండాకాలంలో కార్ కేర్ చేయకపోతే జర్నీ మధ్యలో టైర్ పేలిపోవడం లేదా ఇంజిన్ వేడెక్కడం లాంటి సమస్యలు కూడా రెడీగా ఉంటాయి. రోడ్ ట్రిప్ అనే ఒక ఎగ్జైట్మెంట్ను బోనెట్ నుంచి వచ్చే పొగ తగ్గించే అవకాశం ఉంది.ఇంజిన్ హీట్తో జాగ్రత్తఎండాకాలంలో లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నప్పుడు ఇంజిన్ ఎక్కువ హీట్ అవ్వడం సాధారణం. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రత మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ట్రిప్ ముందు కూలెంట్ లెవల్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. రేడియేటర్ వాటర్ సరిగ్గా ఉందా లేదా అని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ పాతది అయితే వేడి ఎక్కువగా జనరేట్ అవుతుంది. అందుకే సర్వీసింగ్ను టైమ్కు చేయించడం మరవకండి. ట్రాఫిక్లో కంటిన్యూగా ఏసీ ఫుల్ బ్లాస్ట్లో వినియోగిస్తే చేస్తే కూడా ఇంజిన్ ప్రెషర్ పెరిగి΄ోతుంది. కొంచెం బ్రేక్స్ ఇస్తూ లాంగ్ డ్రైవ్ చేస్తే కార్కి కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది.టైర్ పేలిపోకుండా ఉండాలి అంటే ..ఎండాకాలంలో స్పీడుగా వెళ్లడం అనేది కారుకు బల పెట్టడం పరీక్షలాంటిదే. ఎందుకంటే ఈ సమయంలో టైర్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా.. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాణానికి ముందు పీఎస్ఐ లెవల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. చాలా మంది అదనపు భద్రత కోసం టైర్లలో గాలిని ఎక్కువగా నింపుతారు. కానీ ఎండ వేడి కారణంగా ఆ గాలి విస్తరించి టైర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.అలాగే పాత టైర్లతో దూర ప్రయాణాలు ప్లాన్ చేయడం కూడా ప్రమాదకరం. టైర్ ఉపరితలంపై పగుళ్లు లేదా ఎక్కువగా అరిగిపోయిన గుర్తులు కనిపిస్తే వెంటనే మార్చించడం మంచిది. స్టెప్నీ పరిస్థితిని కూడా తప్పకుండా పరిశీలించాలి. సరైన కండిషన్లో ఉన్న టైర్ను మాత్రమే అదనపు టైర్గా వెంట తీసుకెళ్లడం సురక్షితం.స్మార్ట్ డ్రైవర్స్ బ్రేక్స్ తీసుకుంటారులాంగ్ జర్నీలో ఆగకుండా డ్రైవ్ చేయడం కన్నా ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి చిన్న చిన్నబ్రేక్స్ తీసుకోవడం బెటర్. కార్ ఇంజిన్ కూల్ అవుతుంది. టైర్స్కి కూడా రెస్ట్ దొరుకుతుంది. మీకు కూడా కాస్త బాడీని స్ట్రెచ్ చేసుకుని టీ బ్రేక్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.రోడ్ ట్రిప్ మెమోరీస్ బ్యూటిఫుల్గా ఉండాలి అంటే డెస్టినేషన్ కన్నా ముందు బండి కండిషన్ చాలా ఇం΄ార్టెంట్. బండి భద్రం.. ప్రయాణం సురక్షితం. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.
ప్రపంచ ఐస్క్రీమ్కే రాజధాని
ఎండాకాలం అంటే మన మైండ్లో ముందుగా ఫ్లాష్ అయ్యే ఇమేజ్ ఏంటి? వేడెక్కిన రోడ్లు, వడగాలుల మధ్య చేతిలో చల్లని ఐస్క్రీమ్. అయితే ప్రపంచంలో ఐస్క్రీమ్కు కూడా ఒక రాజధాని ఉంది అని దానిని ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారని తెలుసా?అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ‘లే మార్స్’ అనే స్మాల్ టౌన్ ఈ స్పెషల్ టైటిల్తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. ఈ పట్టణం చిన్నది అయినా అక్కడి ఐస్క్రీమ్ క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. అక్కడ వీధుల్లో నడుస్తుంటే కూడా స్వీట్ వెనీల్లా సువాసన వస్తుంది అని టూరిస్టులు చెబుతారు.బ్లూ బన్నీ స్టోరీతో ఫేమస్ అయిన స్టోర్లే మార్స్ ΄పాపులారిటీ వెనక అతిపెద్ద కారణం వచ్చేసి వెల్స్ ఎంటర్ప్రైసెస్ అనే కంపెనీ. ఈ సంస్థ నడిపించే బ్లూ బన్నీ అనే ఐస్క్రీమ్ బ్రాండ్ చాలా పాపులర్ అయింది. కొన్ని దశాబ్దాల నుంచి ఐస్క్రీమ్ ప్రొడ్యూస్ చేస్తూ ఈ చిన్న పట్టణాన్ని అంతర్జాతీయ డెసెర్ట్ మ్యాపులో పెట్టింది ఈ సంస్థే.ప్రతీ రోజు ఇక్కడ భారీ పరిమాణంలో ఐస్క్రీమ్ ప్రిపేర్ చేస్తారు. వెనీల్లా, స్ట్రాబెర్రీ, చాకొలేట్, కేరామెల్ం సింపుల్ ఫ్లేవర్స్ నుంచి కలర్ఫుల్ క్రేజీ కాంబినేషన్స్ వరకు ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అక్కడ ఐస్క్రీమ్ అనేది జస్ట్ ఫుడ్ మాత్రమే కాదుం లోకల్ కల్చర్లో ఒక పార్ట్లా ఫీల్ అవుతుంది.ఫ్రోజెన్ కార్నివాల్ వైబ్లే మార్స్ వీధుల్లో ఐస్క్రీమ్ థీమ్ అనేది ప్రతీ చోట కనిపిస్తుంది. క్యూట్ ΄ార్లర్స్, డెజర్ట్ కేఫ్స్, జయంట్ స్కూప్ స్టాట్యూలు, కలర్ఫుల్ బోర్డులుం సిటీ మొత్తం ఒక ఫ్రోజెన్ కార్నివాల్లా ఉంటుంది. విజిటర్స్ కోసం స్పెషల్గా ఐస్ క్రీమ్ మ్యూజియం, ఫ్యాక్టరీ టూర్స్, టేస్టింగ్ ఎక్స్పీరియెన్స్ కూడా అరేంజ్ చేస్తారు. ట్రావెల్ లవర్స్కి లే మార్స్ అనేది నార్మల్ ఫుడ్ డెస్టినేషన్ కాదు. చైల్డ్హుడ్ సమ్మర్ మెమోరీస్ని ఫ్రీజర్లో ప్రిజర్వ్ చేసినట్టు అనిపించే స్వీట్ ఎక్స్పీరియెన్స్. మన దగ్గర మ్యాంగో సీజన్ కోసం వెయిట్ చేస్తాము. కానీ అక్కడ ప్రతీ రోజు ఒక ఐస్క్రీమ్ సీజన్లాగే ఉంటుంది.
తెలంగాణ ఇక్కత్ చీరలో రాధికరాజే గైక్వాడ్ ! ఏకంగా నాలుగేళ్లు..
పూర్వపు బరోడా (వడోదర) రాచరిక రాష్ట్ర మహారాణి సాంప్రదాయ భారతీయ నేత కళల పునరుద్ధరణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారామె. అంతేగాదు ఒకప్పుడు కేవలం మరాఠా రాజ కుటుంబాల కోసం మాత్రమే నేయబడి..ఇప్పుడు కనుమరుగైన చారిత్రాత్మక బరోడా శాలు పునరుద్ధరణ కోసం, రాజమాత శుభాంగిని రాజేతో కలిసి నాయకత్వం వహించారు కూడా. ఆమె వద్ద 100 ఏళ్లకు ముందు ఉండే పురాతనమైన వారసత్వపు చీరలతో సహా, అబ్బురపరిచే చీరల సేకరణ కూడా ఉంది. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రసిద్ధ నేత చీరలను ధరించి, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అవి నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ పురాతన చీరలకు నిధిలా ఉంటుంది. అవి మనకు రకరకాల నేతలు, వాటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లుగా ఉంటుంది. అలానే తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమంలో సంచలనంగా మారింది. ఆ చీరకు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలిస్తే విస్తుపోతారు. మరి అవేంటో సవివరంగా తెలుసుకుందామా.!.మహారాణి రాధికరాజే గైక్వాడ్ తాజా ఇన్స్టాగ్రామ్లో సికింద్రాబాద్కు చెందిన వరశ్రీ వారు రూపొందించిన తెలంగాణ సుప్రసిద్ధ ఇక్కత్ చేనేత చీరలో కనిపించారు. ఆ చీరపై డబుల్ ఇక్కత్, కంబైన్డ్ ఇక్కత్ పద్ధతులు అరుదైన సమ్మేళ్లనంతో 30 రంగులలో నేసిన 108 అసలైన తేలియా రుమాల్ జ్యామితీయ నమూనాలు ఉన్నాయి. ఆమె ఆ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ఇక్కత్లలో ఒక అద్భుతమైన కొత్త భాష ఉంటుంది. ఇది సాంప్రదాయ నైపుణ్యం, గణితం, సహనం, సృజనాత్మకత, ఆవిష్కరణల కలయిక. ఈ కళ సంక్లిష్టత మాత్రమే తనని ఆకట్టుకోలేదని, దాని వెనుకున్న అంకితభావం, నెలల తరబడి పరిశోధన, మరచిపోయిన నమునాల సంగ్రహాలు, అంతులేని గ్రాఫ్ పేపర్లు, 60 రంగులద్దే సెషన్లు, నిపుణులైన సమిష్ట స్ఫూర్తి తదితరాలు ఎంతగానో ఆకట్టుకుంటాయని అన్నారామె. అందువల్ల తనకు ఆ చీర అత్యంత గొప్పదిగా కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ రాధికారాజే ధరించిన చీర ఏకంగా నాలుగు నెలలపాటు నేశారట. ఇంద్రధనుష్గా పిలిచే ఈ చీరలో మోటీఫ్ల మధ్య ఇంద్రధనుస్సుని తలపించే రంగులు, డబుల్ ఇక్కత్ మోటిఫ్లలో చదరంగం గళ్ల వంటి నిర్మాణాలు, తెలంగాణ ఇక్కత్ కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తదితరాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చీరలు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఈ చీర అరుదైన కలెక్షన్స్కి చెందిన శారీగా పేర్కొనవచ్చు అని రాధికారాజే అంటున్నారు.తెలియా రుమాల్ చరిత్రతెలియా రుమాల్ అనేది తెలంగాణలోని నల్గొండ జిల్లా పుట్టపాక, ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ చేనేత వస్త్ర కళ. ఈ కళలో నూలును నువ్వుల నూనె, ఆముదం తదితర మూలికలతో శుద్ధి చేసి, డబుల్ ఇక్కత్ పద్ధతిలో జ్యామితీయ నమూనాలతో నేస్తారు. ఇది 19వ శతాబ్దానికి చెందిన కళ. దీనికుండే జిడ్డు స్పర్శ, వాసన వాటన్నింటిని సూచిస్తుంది. సాధారణంగా ఇలాంటి ఫ్యాబ్రిక్ని తల లేదా మెడ, నడుము కట్టుకునే వస్త్రాలుగా ఉపయోగించేవారు. దీన్ని 'ఆసియా రుమాల్' గా వాణిజ్య ఎగుమతి చేసేవారు. గుజరాత్కు చెందిన పటోలా లాగా, చేనేత మగ్గంపై నేయడానికి ముందు వార్ప్, వెఫ్ట్ దారాలు రెండింటికీ రెసిస్ట్-డైయింగ్ చేసే డబుల్ ఇకాట్ పద్ధతిలో నేయబడిన కొన్ని దక్షిణాసియా వస్త్రాలలో ఇది ఒకటి. ఈ తేలియా రుమాల్లోని నూనె దుమ్మును దూరంగా ఉంచడం తోపాటు వాష్బుల్ కానీ విధంగా ధరించేవారట.ఇక డబుల్ ఇక్కత్ అనేది ఒక సంక్లిష్టమైన నేత పద్ధతి, దాని ఫలితంగా, తేలియా రుమాల్ వస్త్రంలో ఉపయోగించే మూలాంశాలు మొదట్లో "వజ్రాలు, నక్షత్రాలు, చతురస్రాలు, చుక్కలు, చారలు, గడులు వంటి సరళమైన జ్యామితీయ ఆకారాలుగా ఉండేవి, ఇవి తరచుగా మొజాయిక్ పనిని పోలిన కలయికలలో అమర్చబడేవి. అయితే, 1920, 1930ల మధ్య, అవి మార్పులు చోటు చేసుకోవడంతో మనుషుల నమూనాలను, విమానాలు, గ్రామఫోన్లు, గడియారాలు వంటి కొన్ని సమకాలీన మూలాంశాలను కూడా చేర్చడం మొదలైంది. అంతేగాదు 2020లో తెలంగాణకు చెందిన తేలియా రుమాల్కు భౌగోళిక గుర్తింపు (GI ట్యాగ్) కూడా లభించింది. View this post on Instagram A post shared by Radhikaraje Gaekwad (@radhikaraje) (చదవండి: Tai Chi walking: ‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?)
అంతర్జాతీయం
మిడిల్ ఈస్ట్పై ట్రంప్ బిగ్ ప్లాన్.. పాక్, గల్ప్ దేశాల బ్రేక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇజ్రాయెల్కు అనుకూలంగా అరబ్, ముస్లిం మెజారిటీ దేశాలపై మరో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్కు మేలు చేసే విధంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని పాకిస్తాన్ సహా అరబ్ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒప్పందంలో చేరిన దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాలన్నదే ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ఈ ఒప్పందంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అమెరికాకు లాభమేంటి? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇంతకీ ఈ అబ్రహం ఒప్పందం ఏంటి? పాకిస్తాన్ ఎందుకు టెన్షన్ పడుతోంది అనే విషయాలు తెలుసుకుందాం..అబ్రహాం ఒప్పందం అనేది 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ మరియు కొన్ని అరబ్ దేశాల మధ్య కుదిరిన సాధారణీకరణ ఒప్పందం. దీని ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించి, దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను ప్రారంభించడం. ఈ ఒప్పందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకోలతో సహా పలు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కు అధికారిక సంబంధాలను ప్రారంభించింది. ఇజ్రాయెల్ను దేశంగా గురిస్తూ మధ్యప్రాచ్యంలో ఒక చారిత్రాత్మక నమూనా మార్పునకు నాంది పలికింది. దశాబ్దాలుగా పాలస్తీనా సమస్య పరిష్కారమయ్యే వరకు చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించడానికి నిరాకరించాయి. కానీ, అబ్రహం ఒప్పందంతో ఇజ్రాయెల్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఒప్పందంలో చేరిన అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.అబ్రహాం ఒప్పందం లక్ష్యందౌత్య సంబంధాలు: ఇజ్రాయెల్తో అధికారిక రాయబార కార్యాలయాలు, దౌత్య సంబంధాలు ఏర్పరచడం.ఆర్థిక సహకారం: వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం.భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా వ్యూహాలు.ఒప్పందంలోని దేశాలు..యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్, కజికిస్తాన్: ఈ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.సౌదీ అరేబియా, పాకిస్తాన్: ఇంకా గుర్తించలేదు. వీరి ప్రజాభిప్రాయం పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై బలంగా ఉంది.పాలస్తీనా సమస్య: ఇజ్రాయెల్ను గుర్తించడం. పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం. అందుకే కొన్ని దేశాలు వెనుకంజ వేస్తున్నాయి.అబ్రహాం ఒప్పందం ఇజ్రాయెల్కు వ్యూహాత్మకంగా లాభదాయకం. కానీ పాలస్తీనా సమస్య పరిష్కారం లేకపోవడం వల్ల రాజకీయంగా కొన్ని నష్టాలు ఉన్నాయి. అమెరికాకు ఇది మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచే ముఖ్యమైన వ్యవహారం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్.. అరబ్ దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కానీ పాలస్తీనా సమస్యపై ఇది పెద్ద ప్రభావం చూపిస్తోంది.ఇజ్రాయెల్కు లాభాలుఅరబ్ గుర్తింపు: UAE, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలతో అధికారిక సంబంధాలు ఏర్పడటం వల్ల ఇజ్రాయెల్కు అరబ్ ప్రపంచంలో గుర్తింపు పెరిగింది.ఆర్థిక ప్రయోజనాలు: వాణిజ్యం, టెక్నాలజీ, పర్యాటకం రంగాల్లో కొత్త అవకాశాలు. ఉదాహరణకు, UAE–ఇజ్రాయెల్ మధ్య బిలియన్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలు కుదిరాయి.భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలతో రక్షణ సహకారం పెరిగింది.ప్రాంతీయ స్థానం: ఇజ్రాయెల్ CENTCOM (US Central Command)లో చేరడం వల్ల ప్రాంతీయ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర.ఇజ్రాయెల్కు నష్టాలుపాలస్తీనా సమస్య: ఒప్పందంలో పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం వల్ల అరబ్ ప్రజల్లో వ్యతిరేకత.ప్రజాభిప్రాయం: గాజా యుద్ధం తర్వాత అరబ్ దేశాల్లో ప్రజలు ఇజ్రాయెల్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సౌదీ ఆలస్యం: పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా సౌదీ అరేబియా ముందుకు రావడం లేదు.అమెరికాకు లాభాలుప్రభావం పెరుగుదల: మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావం మరింత బలపడింది.భద్రతా నిర్మాణం: US మిత్రదేశాల మధ్య రక్షణ సహకారం పెరిగింది, ఇరాన్ను ఎదుర్కోవడంలో సమన్వయం సాధ్యమైంది.ఆర్థిక అవకాశాలు: అమెరికా కంపెనీలకు గల్ఫ్–ఇజ్రాయెల్ మార్కెట్లలో కొత్త అవకాశాలు.వ్యూహాత్మక విజయం: దశాబ్దాల తర్వాత అరబ్–ఇజ్రాయెల్ సంబంధాలను తెరవడం ద్వారా అమెరికా తన దౌత్య విజయాన్ని ప్రదర్శించింది.పాలస్తీనా సమస్యలో మార్పులుఅరబ్ ఐక్యతలో విరుగుడు: ఇంతకాలం అరబ్ దేశాలు పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై ఒకే విధమైన మద్దతు చూపేవి. కానీ UAE, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఇజ్రాయెల్ను గుర్తించడం వల్ల ఆ ఐక్యత బలహీనపడింది.పాలస్తీనా నాయకత్వం నిరాశ: పాలస్తీనా అథారిటీ మరియు హమాస్ ఈ ఒప్పందాలను “వంచన”గా పేర్కొన్నాయి.ప్రజాభిప్రాయం: అరబ్ ప్రజల్లో చాలా మంది పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఇరాన్ అంశంఇరాన్ అబ్రహాం ఒప్పందంలో చేరడం సిద్ధాంతపరంగా అసాధ్యం. ఎందుకంటే, ఇజ్రాయెల్ను గుర్తించడం ఇరాన్ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకం. కానీ, ఒప్పందం వల్ల ఇరాన్పై వ్యూహాత్మక ఒత్తిడి పెరిగింది. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో కలిసి పనిచేయడం వల్ల ఇరాన్ తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి మరింతగా ప్రాక్సీ యుద్ధాలు మరియు హోర్ముజ్ జలసంధి నియంత్రణపై ఆధారపడుతోంది.పాకిస్తాన్ ఇలా..పాకిస్తాన్ ఇప్పటివరకు అబ్రహాం ఒప్పందంలో చేరలేదు. ఎందుకంటే దేశీయ ప్రజాభిప్రాయం, పాలస్తీనా సమస్యపై కఠినమైన వైఖరి ఉంది. అలాగే ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించలేదు. పాలస్తీనా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించవచ్చు అని గతంలోనే అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. పాకిస్తాన్ ప్రజలు పాలస్తీనా రాష్ట్రానికి బలమైన మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించడమంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేపే అవకాశం ఉంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ను అబ్రహాం ఒప్పందంలో చేరమని కోరుతూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షరీఫ్కు అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ, ప్రజాభిప్రాయాన్ని సమతుల్యం చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ను దేశంగా గుర్తిస్తే.. ఇటు ఇరాన్తో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో, ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది.
రహస్య బంకర్లో మొజ్తబా ఖమేనీ.. వీడని దాడుల భయం!
టెహ్రాన్: ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అత్యంత రహస్య ప్రదేశంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల భయంతో ఆయన బయటి ప్రపంచంతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి కారణమైన దాడుల తరహాలోనే, తనపై కూడా దాడులు జరుగుతాయని భావిస్తున్న మొజ్తబా ఖమేనీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్య బంకర్లలో తలదాచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.కూలీల వ్యవస్థతో సంక్షోభంఅమెరికా అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఖమేనీని నేరుగా చేరుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఆయనతో సంభాషించడానికి ఒక క్లిష్టమైన ‘కూలీల నెట్వర్క్’ను ఏర్పాటు చేశారు. ఈ పద్ధతి వల్ల ఇరాన్- అమెరికా మధ్య జరుగుతున్న దౌత్య చర్చల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఇరాన్ ప్రతినిధులు కూడా తమ సుప్రీం లీడర్ను నేరుగా సంప్రదించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల పంపే ప్రతి సందేశానికి స్పందన రావడానికి చాలా సమయం పడుతోంది.అగ్రనేతలకే తెలియని ఖమేనీ ఆచూకీఅత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇరాన్ ప్రభుత్వంలోని అగ్రశ్రేణి అధికారులకు సైతం ఖమేనీ ఎక్కడ ఉన్నారో తెలియదు. తన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఖమేనీ, తన ఆచూకీని బయటపడకుండా చూసుకుంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇరాన్ అంతర్గత వర్గాల నుండి సేకరిస్తున్న సమాచారం వల్ల, ఇప్పటికే ఇరాన్కు చెందిన చాలా మంది కీలక నేతలు పట్టుబడ్డారు. ఇదే భయం ఇప్పుడు ఖమేనీని అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది.ఒసామా బిన్ లాడెన్ తరహా వ్యూహంకొందరు విశ్లేషకులు ఖమేనీ అనుసరిస్తున్న ఈ అజ్ఞాత పద్ధతులను, గతంలో ఒసామా బిన్ లాడెన్ అనుసరించిన ‘ఆపరేషనల్ ఇన్విజిబిలిటీ’తో పోలుస్తున్నారు. మొజ్తబా ఖమేనీ గత ఫిబ్రవరి 28 నాటి దాడుల్లో గాయపడినప్పటి నుండి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇరాన్ నేతలు చాలా మంది వారాల తరబడి భూగర్భ బంకర్లకే పరిమితం కావడం, ఇరాన్ నాయకత్వంలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది.ఇది కూడా చదవండి:కశ్మీర్లో ఎన్ఐఏ మెరుపు దాడులు
వీడియో: విమానం ఢీ.. చీలిపోయిన పారాగ్లైడర్!
ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వతాలపై ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం ఎగురుతున్న చిన్న విమానం.. గాల్లో విహరిస్తున్న పారాగ్లైడర్ను నేరుగా ఢీకొట్టింది. ఒక్కసారిగా పారాగ్లైడర్ ముక్కలైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింటకు చేరాయి. ఆ వీడియోలో ఓ చిన్న విమానం పారాగ్లైడర్ మధ్య నుంచి చీల్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు షాకింగ్గా కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మహిళ గాల్లోనే అదుపుతప్పి చక్రంలా తిరుగుతూ కిందకు పడిపోయింది. అయితే.. చివరి క్షణంలో ఆమె ఎమర్జెన్సీ పారాచూట్ను తెరవడంతో ప్రాణాపాయం తప్పింది. స్క్మిటెన్హోహే పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మొత్తం ఆమె కెమెరాలో రికార్డైంది. వెంటనే అత్యవసర బృందాలు హెలికాప్టర్తో చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించాయి. చిన్నచిన్న గాయాలతో ఆమె బయటపడినట్లు సమాచారం. ఆమె పేరు సబ్రినా(44) అని, పారాగ్లైడింగ్లో అనుభవం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆ తేలికపాటి విమానం కూడా జెల్ ఆమ్ సీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ ఢీ కొట్టడాన్ని తాను తప్పించలేకపోయానని సదరు పైలట్(28) అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో.. గాల్లో భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.🇦🇹 A paraglider collided midair with a Cessna 172 over Austria and somehow survived.She deployed her emergency parachute seconds after impact and landed safely.The plane pilot also managed to land safely at Zell am See Airport.pic.twitter.com/6IH7sTi3Ic— Mario Nawfal (@MarioNawfal) May 24, 2026
ఇరాన్ డీల్పై నిమ్మలంగా ట్రంప్!
దాదాపు మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. అయితే కాల్పుల తీవ్రత కొంత తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. “డీల్ కోసం తొందరపడొద్దు.. సమయం మాకే అనుకూలంగా ఉంది” అంటూ ట్రంప్ చెప్పడం వెనుక అసలు వ్యూహం ఏంటనేది అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ట్రంప్ చేసిన ఆ ఒక్క వ్యాఖ్యతో మళ్లీ ప్రపంచ మార్కెట్లు, చమురు దేశాలు, దౌత్య వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అమెరికా ఇప్పుడు కేవలం యుద్ధాన్ని ఆపడం మాత్రమే కాదు. ఇరాన్పై దీర్ఘకాల వ్యూహాత్మక ఒత్తిడి కొనసాగిస్తూ భారీ రాజకీయ-ఆర్థిక ఒప్పందాన్ని సాధించాలని చూస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై పూర్తి నియంత్రణ, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకా రవాణా, మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని మరింత బలపరచడం వంటి లక్ష్యాలతో వాషింగ్టన్ ముందుకెళ్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే.. ఇరాన్ ట్రంప్ ప్రతిపాదనలకు ఒప్పుకుందా?..ప్రస్తుతం అందుతున్న సంకేతాల ప్రకారం సమాధానం “పాక్షికంగానే” ఒప్పుకుంది. చర్చలకు సిద్ధమని టెహ్రాన్ వర్గాలు చెబుతున్నా.. అమెరికా షరతులకు పూర్తిగా గ్రీన్సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. ముఖ్యంగా అణు కార్యక్రమాన్ని పూర్తిగా పరిమితం చేయడం, యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ అణు సంస్థ (IAEA) తనిఖీలకు పూర్తి అనుమతి ఇవ్వడం వంటి అంశాల్లో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ వైఖరి ప్రస్తుతం ‘‘ముందు ఆంక్షలు సడలించండి.. తర్వాత మేం నిర్ణయం చెబుతాం’’ అన్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, యుద్ధం అధికారికంగా ముగిసిందన్న హామీ ఇవ్వడం వంటి అంశాలను టెహ్రాన్ ప్రధాన షరతులుగా పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి అంశాన్ని ఇరాన్ ఇప్పటికీ ఒత్తిడి సాధనంగానే ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో ట్రంప్ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. “పూర్తి ఒప్పందం కుదిరే వరకు బ్లాకేడ్ అలాగే కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. అంటే కాల్పులు తగ్గినా.. ఆర్థిక, వ్యూహాత్మక ఒత్తిడి మాత్రం కొనసాగుతుందన్న సంకేతాలు అమెరికా ఇస్తోంది. అందుకే ట్రంప్ అసలు లక్ష్యం యుద్ధాన్ని ఆపడం కంటే.. ఇరాన్ను బలహీన స్థితిలో చర్చల టేబుల్పై ఉంచడమేనా? అనే చర్చ మొదలైంది.అంతర్జాతీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో యుద్ధాన్ని అధికారికంగా ముగించడం, హర్ముజ్ మార్గాన్ని తిరిగి తెరవడం, తదుపరి 30 లేదంటే 60 రోజులపాటు అణు చర్చలు కొనసాగించడం వంటి అంశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్, ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తుండటం గమనార్హం.ఇక అమెరికా లోపల కూడా ట్రంప్పై ఒత్తిడి పెరుగుతోంది. “మూడు నెలల క్రితం ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పి.. ఇప్పుడు మళ్లీ అదే దేశంతో రాజీ చర్చలు ఎందుకు?” అంటూ కొందరు రిపబ్లికన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న డిమాండ్ను కొనసాగిస్తోంది.ఇప్పటికైతే యుద్ధం కాస్త చల్లారినట్లే కనిపిస్తున్నా.. అసలు గేమ్ ఇప్పుడు మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ “టైమ్ మా వైపే ఉంది” అంటుంటే.. ఇరాన్ మాత్రం “మా షరతులు ముందుగా నెరవేర్చాలి” అని పట్టుబడుతోంది. ఈ బేరసారాలు ఎటు దారి తీస్తాయన్నదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్లు, అంతర్జాతీయ భద్రత భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ట్రంప్ ఆ ఒక్క మాటతో మళ్లీ ప్రపంచంలో టెన్షన్ పెరిగిందనే అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి.
జాతీయం
టాయిలెట్లో బిడ్డను కని.. వెంటిలేటర్ నుంచి విసిరేసి..
హరిపాడు: కేరళలోని అలప్పుజ జిల్లా, హరిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కడుపునొప్పిగా ఉందని చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన 19 ఏళ్ల విద్యార్థిని, టాయిలెట్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత ఆ నవజాత శిశువును ఆస్పత్రి టాయిలెట్ వెంటిలేటర్ గుండా బయటకు విసిరేసింది.ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తతతో..తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో విద్యార్థిని టాయిలెట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే, బయట నుంచి పసికందు ఏడుపు వినిపించడాన్ని డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గమనించారు. డాక్టర్లు తిష, డాక్టర్ ఆల్ఫీ, నర్సింగ్ ఆఫీసర్ జిషా, సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో గాలించారు. ఆస్పత్రి భవనం వెలుపల పడి ఉన్న శిశువును గుర్తించి రక్షించారు.ప్రాణాపాయం నుంచి..ఆ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల, చిన్నారికి ప్రమాదం పొంచి ఉండేది. కానీ, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, వేగంగా స్పందించడం వల్ల శిశువు ప్రాణాలతో దక్కింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, పసికందు సురక్షితంగా ఉంది. ప్రస్తుతం చిన్నారి, ఆమె తల్లి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తల్లికి, బిడ్డకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వారిద్దరినీ ఆలప్పుజ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు!
గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పండుగకు కేవలం రెండు రోజుల ముందు ఈ అభ్యర్థన రావడంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.చివరి నిమిషంలో పిటిషన్ ఎందుకు?అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. గోవధను నిషేధించే చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని, అలాగే వధశాలల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. బుధవారమే ఈ అంశంపై విచారణ చేపట్టాలని న్యాయవాది బారున్ కుమార్ సిన్హా కోర్టును కోరారు.సుప్రీంకోర్టు ఘాటు స్పందనఈ అభ్యర్థనను విన్న వెంటనే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘పండుగకు ఒక్కరోజు ముందు మీకు ఇది గుర్తుకొచ్చిందా? ఇందులో ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదు. ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానిస్తూ, విచారణను చేపట్టేందుకు స్పష్టంగా నిరాకరించింది. సమయానుకూలంగా కాకుండా, పండుగ వేళ ఇలాంటి అంశాలను కోర్టు ముందుకు తేవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.న్యాయపరమైన పరిణామాలుప్రస్తుతానికి ఈ పిటిషన్పై ఎలాంటి అత్యవసర ఉత్తర్వులు జారీ కాకపోవడంతో, పాత చట్టాలు, మార్గదర్శకాల ప్రకారమే పండుగ ఏర్పాట్లు కొనసాగనున్నాయి. చట్టాల అమలు, వధశాలల నియంత్రణకు సంబంధించి పిటిషనర్ లేవనెత్తిన అంశాలను తదుపరి సాధారణ విచారణలో పరిశీలించాల్సి ఉంటుంది. అత్యవసర విచారణ కోరిన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించడంతో, ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది.
3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్ ఆరోపణలు
మోడల్ , నటి ట్విషా శర్మ మరణం కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్లపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. ట్విషా శర్మ మృతి కేసు ఇప్పుడు అత్యంత కీలక దశలోకి ప్రవేశించింది.భోపాల్ పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అత్త, భార్తలను నిందితులుగా చేర్చింది. సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్కు చెందిన ఒక బృందం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుని, స్థానిక పోలీసులు ఇప్పటివరకు సేకరించిన కేస్ డైరీ, పోలీసు పత్రాలు, వాంగ్మూలాలు, వైద్య పత్రాలు, ఇతర భౌతిక సాక్ష్యాలను సేకరించింది.ఇదీ చదవండి: ట్విషా కేసులో సీబీఐ కోణం : అపుడే అత్త రూ. 2 లక్షలు డిమాండ్ఇప్పటికే వరకట్నం డిమాండ్ చేశారన్న ఆధారాలు లభించినట్లు ఆరోపణలు రావడంతో, వరకట్నం మరణనం సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటి) చీఫ్ రజనీష్ కశ్యప్ కౌల్ను ఫిర్యాదిదారుగా పేర్కొన్నారు.మరోవైపు పోలీసు విచారణలో భర్త సమర్థ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్కు, లభించిన ఆధారాలకు మధ్య తేడాలను సీబీఐ గమనించింది. తనకు గర్భం రావడంపై అనుమానంతో, బలంతంగా అబార్షన్ చేయించారని ట్విషా వాట్సాప్ ద్వారా తెలుస్తుండగా, తనకు తండ్రి కావాలని ఉందని, కానీ ట్విషాకు ఇష్టం లేకపోవడం వల్లే వైద్యుల సలహా మేరకు పరస్పర అంగీకారంతో గర్భస్రావం చేయించామని చెప్పాడు. గర్భం దాల్చినప్పటి నుండి ట్విషా తీవ్ర ఆందోళనకు గురైందని పేర్కొన్నాడుబైపోలార్ డిజార్డర్దీంతోపాటు మరో షాకింగ్ ఆరోపణలు కూడా చేశాడు భర్త. ట్విషాకు బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) 'అడ్జస్ట్మెంట్ డిజార్డర్' ఉన్నాయని, ఆమె ప్రవర్తన అకస్మాత్తుగా మారేదని తెలిపాడు. ఒత్తిడి తగ్గించడానికి వైద్యుల సలహా పైనే నిద్రమాత్రలు ఇచ్చామని చెప్పాడు.ట్విషా కుటుంబం వాదన: పెళ్లికి ముందు ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని, గర్భం దాల్చిన తర్వాత వచ్చిన గొడవల వల్లే మానసిక చికిత్స, మందులు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కాలంలో ట్విషా సుమారు 15 కిలోల బరువు తగ్గిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ చికిత్స గురించి ఆమెకు, పుట్టింటివారికి సమాచారం ఉందా లేదా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.ఉద్యోగం మానేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడని, కనీసం ఆన్లైన్ జాబ్స్ కూడా చేసుకోనివ్వడం లేదని ట్విషా చనిపోవడానికి ముందు తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్విషా తన సొంత ఇష్టపూర్వకంగా, ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఉద్యోగం మానేసిందని, తాము ఎక్కువ సమయం కలిసి గడపడానికే ఈ నిర్ణయం తీసుకుందని సమర్థ్ తెలిపాడు. చనిపోయే రోజు కూడా ఆమె మామూలుగానే ఉందనీ, ఇద్దరమూ జిమ్కు వెళ్లామని, కలిసి భోజనం చేసి, వాకింగ్కు కూడా వెళ్లామని సీబీఐకి చెప్పాడు.సమర్థ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పెళ్లయిన కొత్తలో అంతా నార్మల్గానే ఉందని, శారీరక, మానసిక వేధింపులేవీ లేవని చెప్పినప్పటికీ, అతని మొబైల్ ఫోన్ నుండి ట్విషాకు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వాట్సాప్ చాట్ హిస్టరీ పూర్తిగా డిలీట్ చేశాడు. ఇది మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ చాట్లను రికవర్ చేయడానికి టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ చాట్స్ రికవర్ అయితే, సమర్థ్ చెప్తున్న "నార్మల్ రిలేషన్షిప్" వాదనలోని నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది అంటున్నారు దర్యాప్తు అధికారులు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్ రజనీష్ కాశ్యప్ కౌల్ ఫిర్యాదుదారుగా సీబీఐ ఈ కేసును దేశ రాజధాని ఢిల్లీ నుండి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తోంది. అయితే, దర్యాప్తు చేతులు మారుతున్న కొద్దీ, మూడు రోజులు, దాదాపు 10 గంటల పాటు జరిగిన విచారణలో సమర్థ్ సింగ్ పోలీసులకు ఏమి చెప్పాడు, వాట్సాప్ చాట్లు, వైద్య రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, ఇతర డిజిటల్ సాక్ష్యాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలకు వ్యతిరేకంగా అతని వాదనలో ఎంత నిజం ఉంది అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
క్లైమాక్స్కు చేరిన కర్ణాటక రాజకీయం
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు హస్తినలో వాడీవేడిగా సాగుతున్నాయి. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో.. ఇవాళ ఇందిరాభవన్లో అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లు భేటీ అయ్యారు. సమావేశంలో వాళ్లు కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంతరం బయటకు వచ్చిన వాళ్లిద్దరూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా, గత డిసెంబరు నుంచి(రెండున్నరేళ్లు అధికారం పూర్తి కావడం) సీఎం కుర్చీ కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇరువురూ ఢిల్లీకి వెళ్లి మంతనాలు సాగించారు. అయితే.. మే 20తో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తి కానుంది. పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే, తననే కొనసాగించాలని సిద్ధరామయ్య కోరుతున్నట్లు సమాచారం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మరో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వీళ్లిద్దరి నుంచి అభిప్రాయసేకరణ చేశారు. సిద్ధరామయ్యకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మూడేళ్లలో తన ప్రభుత్వ పనితీరు, ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు తదితరు అంశాలను సిద్దరామయ్య ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. ఆయన్ని మారిస్తే ఓబీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో అధిష్టానం ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే తనకే సీఎం పదవి ఇవ్వాలని డీకే గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు సమీకరణాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత అనిశ్చితి ఎక్కువకాలం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో కొనసాగుతున్న అధికారం పోరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిళ్లు చేయడం ఏమాత్రం మంచిది కాదు. పార్టీ 2028లో మళ్లీ అధికారంలోకి రావాలంటే స్థిరత్వం.. బలమైన టీమ్ అవసరం. అంతర్గత అనిశ్చితి ఎక్కువకాలం కొనసాగితే బీజేపీకి లాభం కలుగుతుంది అని హెచ్చరించారాయన. అదే సమయంలో అధిష్టానం నుంచి త్వరలోనే ఓ ప్రకటన వెలువడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒకవేళ మార్పు గనుక ఉంటే.. ఇప్పుడే చేస్తారా?.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మార్పు ఉంటుందా? ఒకవేళ లేకుంటే అసెంబ్లీ ఎన్నికల వరకు సిద్ధరామయ్యనే కొనసాగిస్తారా?.. డీకేను ఎలా సంతృప్తి పరుస్తారు? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఎన్ఆర్ఐ
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్బోర్న్కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. మెల్బోర్న్ ఉద్యోగ మార్కెట్ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్ ఆఫర్ Airbnb అపార్ట్మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం 2008లో లండన్కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 2023 నాటికి లండన్ బోటిక్ వెడ్డింగ్ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్బోర్న్కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది. ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్బోర్న్లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్ వైఫ్ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్ అయిపోవడమే మేలని అంటోంది. చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. ఇలా ఈ రేంజ్కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shweta (@shweta_lifecoach) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..)
స్నేహితురాలి పెళ్లికి వెళ్లి..
హైదరాబాద్: అమెరికాలో స్విమ్మింగ్పూల్లో పడి నగర యువతి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ డివిజన్ న్యూ శివపురి కాలనీకి చెందిన ముద్దసాని దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కూతురు శ్రీవీణ (28)కు 2023లో ప్రశాంత్ రెడ్డితో వివాహమైంది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవీణ స్నేహితురాలి వివాహం సందర్భంగా రెండు రోజుల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. అక్కడ శ్రీవీణ స్విమ్మింగ్పూల్లో విగతజీవిగా కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఒక్కగానొక్క కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో నగరంలోని దేవేందర్ రెడ్డి, సునీత దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీవీణ తల్లిదండ్రులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్రెడ్డి పరామర్శించారు. ఆమె భౌతిక కాయాన్ని అమెరికా నుంచి భారత్కు వీలైనంత తొందరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాన్వొకేషన్ ముగిసిన మరుక్షణమే కానరాని లోకాలకు..
లక్కిరెడ్డిపల్లె(అన్నమయ్య జిల్లా): కన్న కొడుకు విదేశాల్లో గొప్ప చదువులు చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు విధి తీరని అన్యాయం చేసింది. ఎంఎస్ పూర్తి చేసి పట్టా అందుకున్న సంబరం నిండకముందే, అదే రాత్రి మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చి ఆ యువకుడిని బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ తాజ్ కుమారుడు మహమ్మద్ కుమేల్ షేక్ (28) అమెరికాలో గురువారం రాత్రి హఠాన్మరణం చెందాడు. కుమేల్ షేక్ ఇంజినీరింగ్ విద్యను చెన్నైలోని సత్యభామ వర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకున్న ఆయన, గురువారం జరిగిన కాన్వొకేషన్ వేడుకలో పట్టా అందుకున్నారు. ఆ ఆనందంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి, స్నేహితులతో కలిసి ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్లారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. మృతుడి తండ్రి స్టాంప్ రైటర్గా పనిచేస్తున్నారు.
ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవాలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ తన సప్తమ వార్షికోత్సవం (ఏప్రిల్25, 2026) ఘనంగా జరుపుకుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ బి.వి.ఎస్. చౌదరి, రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది.స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేశారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్” , విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ , యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు VC నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయన్నారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్ళని కొనియాడారు.అలాగే కుమారి మనోజ్ఞ అనే గాత్రసంగీత విద్యార్ధి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు వ్రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించగలగటం విశేషం అనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ, సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం మరియు రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించబడి, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.యూ.టీ.ఐ.ఏ.ఈ.సీ చైర్మన్ రాయ్, ట్రెజరర్ v. Adesh బాబు , కళ , శివ కృష్ణ ఆలయ చైర్మన్ ,మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కాకతీయ సాంస్కృతిక పరివారం నుంచి సబ్బుపాలకుర్తి , సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుంచి క్రాంతి, జయ, దీపు , రేఖ , రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు
క్రైమ్
ట్విషా కేసులో సీబీఐ కోణం : అపుడే అత్త రూ. 2 లక్షలు డిమాండ్
మధ్యప్రదేశ్లోని భోపాల్లోట్విషా శర్మ మరణానికి సంబంధించిన కేసులో ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి తరువాత వధువును అత్తవారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం సందర్భంగా, ఆమె అత్త, తన కోడలి వరకట్నం మరణం కేసులో నిందితురాలిగా ఉన్న విశ్రాంత జిల్లా న్యాయమూర్తి గిరిబాల సింగ్ రూ. 2 లక్షల వరకట్నం డిమాండ్ చేసిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ట్విషా శర్మ వరకట్న మరణం కేసును విచారిస్తున్న సీబీఐ ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్ (FIR)లో పేర్కొంది. ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్లపై సీబీఐ కొత్తగా కేసునమోదు చేసి, భోపాల్ పోలీసుల నుండి ఆధారాలను స్వాధీనం చేసుకుంది.గత ఏడాది డిసెంబర్ 9న మోడల్, నటి ట్విషా శర్మకు , న్యాయవాది సమర్థ్ సింగ్తో వివాహం జరిగింది. కట్నం భారీగానే చెల్లించారు. అయితే పెళ్లి ముగిసి అత్తగారింటికి పంపించే సమయం (విదాయి)లో సమర్థ్ సింగ్ తల్లి గిరిబాల సింగ్ రూ. 2 లక్షలు డిమాండ్ చేశారని, ఒత్తిడి తట్టుకోలేక వధువు కుటుంబం ఆ డబ్బు చెల్లించిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అదీ చాలదన్నట్టు పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తగారు కలిసి ట్విషాను శారీరకంగా, మానసికంగా వేధించారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మొదట జరిగిన రూ. 2 లక్షల డిమాండ్ తదుపరి తీవ్ర వేధింపులకు దారితీసిందా? అసలు ఆమె మరణానికి గల కారణాలేంటి? అనే కోణంలో సీబీఐ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.కాగా పెళ్లైన ఐదు నెలలకే అత్తగారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వరకట్న వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసింది. అలాగే పోస్ట్మార్టంలో అవకవతవకలు జరిగాయంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో మధ్య ప్రదేశ్ హైకోర్టు రీ పోస్ట్మార్టంకు ఆదేశించింది. అంతకు ముందే భోపాల్ పోలీసుల నుంచి ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ ప్రత్యేక బృందం భోపాల్ చేరుకుని ఆధారాలను సేకరించడం, నిందితులను విచారించడం ప్రారంభించింది. భార్య మరణం తరువాత పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సమర్థ సింగ్ పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. సెక్షన్లు 80(2), 85, 3(5) లతో పాటు, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్లపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ట్విషా కుటుంబం చేస్తున్న ఆరోపణలను భర్త సమర్థ్ సింగ్ కుటుంబం పూర్తిగా నిరాకరిస్తోంది. తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, ట్విషాకు డ్రగ్స్ అలవాటు ఉండేదని, దానివల్లే ఆమె ఇబ్బంది పడేదని గిరి బాల సింగ్ వెల్లడించారు. ఈమె వ్యాఖ్యలపై ఇంటర్నెట్లో దుమారంరేగింది. విక్లిమ్ను బ్లేమ్ చేస్తూమొసలి కన్నీళ్లు కారుస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్నం కోరలకు కన్న కూతురిని బలి చేయడం కంటే, విడాకులు తీసుకొని పుట్టింట్లో ఆమెను బతనివ్వడమే మేలని హితవు పలకడం గమనార్హం.
కోడలిపై కన్నేసిన 75 ఏళ్ల మామ..!
బెంగళూరు: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మామ (75), కేసు సామరస్యంగా పరిష్కరించుకుంటామని బాధితురాలు (కోడలు) దయతల్చడంతో హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. వివరాలు.. బాధిత మహిళ.. భర్త, అత్త, మామ నిరంతరం లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై వారిపై కేసు నమోదైంది. నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మామ బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు, తన వయసు 75 సంవత్సరాలని, 9 నెలలుగా కారాగారంలో ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నాడు. కుటుంబ గొడవలతో తప్పుడు ఫిర్యాదు చేశారన్నాడు. దీనిని ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకిస్తూ, పిటిషనర్పై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ నిరాకరించాలని కోరారు. అయితే బాధిత మహిళ.. కేసును సామరస్యంగా పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోంది. బెయిలు ఇవ్వవచ్చని తెలిపింది. జస్టిస్ జిఎస్ కమల్ వాదనలను ఆలకించి బెయిలుకు ఆమోదించారు. రూ.లక్ష పూచీకత్తు, పలు నిబంధనలను పాటించాలని ఆదేశించారు. కేసు విచారణ యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు.
యూపీ సీఎం పీఏ నెంబర్ కావాలి
సాక్షి,హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ తెహరీక్–ఇ–హిందుస్థాన్ (టీటీహెచ్) చీఫ్ షెహజాద్ బట్టీ అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ, మేడ్చల్ పోలీసులకు చిక్కిన జాయిద్ ఖాన్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడి నుంచి షెహజాద్ అనుచరులు అబిద్, రానాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) నెంబర్ తీసుకోవాలని భావించారు. మరికొన్ని ఆపరేషన్లకు ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచి్చంది. తదుపరి విచారణ కోసం జాయిద్ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ కేసులో షెహజాద్తో పాటు అబిద్, రానాలను వాంటెడ్గా చేర్చారు. పోలీసుల దర్యాప్తు, నిందితుడి విచారణలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చిన అంశాలివి... ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన జాయిద్ అలియాస్ ఆదిల్ ఖాన్ (22) నాలుగో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఇతడి బంధువైన ఫైజాన్ మేడ్చల్లోని ముబారక్ రెస్టారెంట్లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అతడి ద్వారానే జాయిద్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మేడ్చల్ వచ్చి అదే హోటల్లో సర్వర్గా చేరి అదే రెస్టారెంట్లో నివసిస్తున్నాడు. 2021 నుంచి జాయిద్కు రెండు ఇన్స్ట్రాగామ్, ఓ ఫేస్బుక్, మరో వాట్సాప్ ఖాతాలు ఉన్నాయి. 2023లో ఓ బొమ్మ పిస్టల్ ఖరీదు చేసిన జాయిద్ దాంతో వీడియోలు తీసి అప్లోడ్ చేయడం మొదలెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిజమైన తుపాకీ ఖరీదు చేయాలని భావించిన జాయిద్ దానికోసం గూగుల్తో పాటు ఇన్స్ట్రాగామ్లో సెర్చ్ చేశాడు. వాటి ద్వారా మధ్యప్రదేశ్లోని ఖర్గోన్కు చెందిన వ్యక్తి విదేశీ పిస్టల్స్ విక్రయిస్తాడని తెలిసింది. అతడి ఫోన్ నెంబర్ సంగ్రహించిన జాయిద్ సంప్రదించాడు. ఫిబ్రవరి 27న అతడు కొన్ని తుపాకుల ఫొటోలను షేర్ చేశాడు. ఇలా ఇన్స్ట్రాగామ్లో అబిద్ జట్, రానా హుస్సేన్లను ఫాలో అవడం ప్రారంభించాడు. వీళ్లు ఆయుధాలతో అనేక ఫొటోలు, వీడియోలను తమ పేజ్ల్లో పోస్టు చేశారు. ఈ ద్వయం దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తెహరీక్–ఇ–హిందుస్థాన్ (టీటీహెచ్) ఉగ్రవాద సంస్థను నిర్వహిస్తున్న షెహజాద్ బట్టీ అనుచులుగా ఉన్నారు. అక్రమ ఆయుధాల వ్యాపారం, టార్గెట్ కిల్లింగ్ చేసే బట్టీ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఐఎస్ఐ కోసం దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాలు తెలిసీ జాయిద్ వారితో సంబంధాలు కొనసాగించాడు. అబిద్ జట్ కోరడంతో జాయిద్ ఈ ఏడాది ఏప్రిల్ 2న ప్రయాగ్రాజ్కు చెందిన చోటా యోగి అనే వ్యక్తి వివరాలను ఇన్స్ట్రాగామ్ ద్వారా షేర్ చేశాడు. అప్పటి నుంచి అబిద్, రానాలు తమ ఫోన్ నెంబర్లు పంపి, వాట్సాప్ సంప్రదిపులు ప్రారంభించారు. ఈ నెల 10న అబిద్ జట్ తన పోస్టర్ను జాయిద్కు షేర్ చేశాడు. ‘పాకిస్థానీ డాన్ అబిద్ జట్’ అనే క్యాప్షన్తో ఉన్న ఈ పోస్టర్స్ను వెయ్యి ప్రింట్ తీసి, ఘజియాబాద్ ప్రాంతంలో అంటించాలని, ఆ వీడియోలను తనకు పోస్టు చేయాలని, అలా చేస్తే ఓ అసలైన పిస్టల్ పంపిస్తానని అబిద్ చెప్పాడు. దీనికి జాయిద్ అంగీకరించాడు. ఈ నెల 20న జాయిద్ను సంప్రదించిన రానా తనకు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పీఏ ఫోన్ నెంబర్ కావాలని కోరాడు. దీనికోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన జాయిద్ యూపీ క్యాబినెట్ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు చెందిన వారి వివరాలను దొరకడంతో అవన్నీ షేర్ చేశాడు. ఘజియాబాద్ వెళ్లినప్పుడు అబిద్ జట్ పోస్టర్లు అంటించి, అసలు పిస్టల్ పొందాలని జాయిద్ ఎదురు చూస్తున్నాడు.
భర్తను హత్య చేసిన భార్య
తగరపువలస: భర్తను భార్య హతమార్చిన ఘటన విశాఖ జిల్లా భీమిలి పోలీస్స్టేషన్ పరిధిలోని వలందపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నాగమణి(26)కి వలందపేట రజక వీధికి చెందిన తాపీ మేస్త్రి బోర సూరితాత(35)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. నాగమణి నూడిల్స్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సూరితాత ఆమెను తరచూ నిలదీసేవాడు. ఈ విషయమై దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఆదివారం భవన నిర్మాణ పనులకు వెళ్లిన సూరితాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. వీరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో నాగమణి తన చున్నీని భర్త మెడకు గట్టిగా బిగించి శ్వాస ఆడకుండా చేసి హతమార్చింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు..భర్త ఆరోగ్యం క్షీణించిందని బంధువులకు ఫోన్ చేసింది.అపస్మారక స్థితిలో ఉన్న సూరితాతను బంధువులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి మెడపై ఉన్న గాయాలను చూసి బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో నాగమణిని విచారించడంతో తానే చున్నీని బిగించి సూరితాతను హతమార్చానని ఒప్పుకుంది. ఈ హత్యలో ఆమెకు ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
మోదీని ఢీ కొట్టడానికి దీదీ మాస్టర్ ప్లాన్.. INDIA కూటమి భేటీ
మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం.. లక్షకు 21 కోట్లొచ్చాయ్..!
బాలీవుడ్ నుండి 3 ఏళ్లు రణవీర్ సింగ్ బ్యాన్!?
నా బిడ్డ పేరు వాడుకుని గెలిచావ్.. ఇప్పుడు తప్పించుకుంటున్నావ్
రెండే ఆప్షన్లు మీరే డిసైడ్ చేసుకోండి.. అరెస్ట్ పై కేతిరెడ్డి స్టాంగ్ వార్నింగ్
Big Breaking: అమెరికాలో గ్యాస్ లీక్.. ఎమర్జెన్సీ ప్రకటన
దేవుడా ఏంటి ఈ కర్మ అనేలా తిరుమల లో పరిస్థితి
ఉద్యోగస్తులు అంటే ఎందుకు అంత పగ
మహేష్ రెడ్డిని హత్య చేసింది పరిటాల శ్రీరామ్ కావొచ్చు..?
తల్లి లేని లోటు తీర్చలేనిది..! ఎమోషనల్ అయిన పేర్ని కిట్టు


