ట్రంప్నే బెంబేలెత్తించింది.. భారత్ విజయ రహస్యం ఇదే!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే అక్కసుతో భారత్పై భారీగా సుంకాలు మోపిన అమెరికా.. ఉన్నఫళంగా ఎందుకు దిగివచ్చింది? ఏకపక్షంగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భారత్తో డీల్ కుదిరిందని, ట్యాక్స్లను 18 శాతానికి తగ్గించామని ఎందుకు ప్రకటించారు?? బెదిరింపులతో లొంగదీసుకుందామని ట్రంప్ భావిస్తే.. ఏకు మేకై కూర్చుంటామంటూ పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం అమెరికా తల వంచిందా?ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛాయుత వాణిజ్యంపై భారత్ కుదుర్చుకున్న డీల్ ఇప్పుడు ట్రంప్ మెడలను వంచిందా? బంగారం ధరలు మొదలు.. పలు దేశాల షేర్ మార్కెట్లను మాటలతో శాసిస్తున్న ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే..! అహింసామార్గంలో.. శాంతియుతంగా ఎదుటివారి మెడలు వంచేలా చేయడం భారత్ నైజం..!! ఈ విషయంలో భారత్ వ్యూహాత్మక అడుగులు.. వాటి ఫలితాలను గురించి వివరంగా తెలుసుకోవాలంటే.. చదవాల్సిందే👉అది అనుకున్నంత ఈజీ కాకపోగా..ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు..! బాలిస్టిక్ మిసైల్స్.. యుద్ధ విమానాలతో విరుచుకుపడాల్సిన పని లేదు..! ఆంక్షల ఛట్రంలో ఆ దేశాన్ని బంధించి, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యేలా చేస్తే చాలు..! ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే దశలో ఆ దేశాలను దారికి తెచ్చుకోవచ్చు..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే..! ఇదే మైండ్ గేమ్తో ఎన్నో దేశాలను దారికి తెచ్చుకున్నాడు. భారత్ను కూడా అదే గాడిన కట్టాలనుకున్నాడు. భారత్ ఆత్మగౌరవం ముందు ఓడిపోయాడు. అది అనుకున్నంత ఈజీ కాకపోగా.. అమెరికన్లకే ధరాఘాతంతో శాపంగా మారుతోంది. దీంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల మెట్లు దిగిరాక తప్పలేదు..!👉ఆ మౌనమే ట్రంప్ను బెంబేలెత్తించింది..భారత్ను దారికి తెచ్చుకోవాలనే తపనతో ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి భారత్ నుంచి ప్రకటనలు లేకున్నా.. తానే భారతీయుల తరఫున ప్రకటనలు చేసుకున్నారు. రష్యా చమురును భారత్ కొనబోదని.. అమెరికా నుంచే కొంటుందని ప్రకటించేసుకున్నారు. అలాంటి ప్రకటనలకు భారత్ తొందరపడి ఏమాత్రం స్పందించలేదు. ‘నో కామెంట్’ అంటూ దాటవేయలేదు. చేసిందల్లా.. మౌనంగా ఉండడమే..! ఆ మౌనమే ఇప్పుడు ట్రంప్ను బెంబేలెత్తించింది. వెనక్కి తగ్గేలా చేసింది. మౌనంగానే భారత్ విజయం సాధించింది.👉జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు..సాధారణంగా మౌనం అర్ధాంగీకారం అంటారు. కానీ, జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు. ఒక పాలసీని అమలు చేయడానికి ముందు.. దానికి సమ్మతిని ఇవ్వడానికి ముందు చేసే ఆలోచనలు, కసరత్తుకు నిదర్శనమే మౌనం అంటారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. 1988లో అమెరికన్ ఆలోచనాపరుడు నోమ్ చోమ్స్కీతోపాటు.. ఆర్థికవేత్త ఎడ్వర్డ్.ఎస్.హెర్మాన్ తమ పుస్తకం ‘ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ద మాస్ మీడియా’లో ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించారు. ఆంక్షలు, లేదా యుద్ధాలకు ముందు.. నిరసనను వ్యక్తం చేయకుండా.. విధానాలను సాధారణీకరించేందుకు మౌనం దాల్చడం ఓ రాజనీతి అంటారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ పాటించిన మౌనం దీనికి చక్కటి ఉదాహరణ..!👉కన్జూమర్ సైకాలజీ అంటే ఇదే..కొనుగోలుదారులు ఎవరైనా తమకు కావాల్సిన వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడే కొంటారు. అది కన్జూమర్ సైకాలజీ. ఈ బేసిక్ నాలెడ్జ్ని కూడా మరిచిపోయిన ట్రంప్ చమురు విషయలో భారత్పై ఒత్తడి తేవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇక రాజనీతి విషయానికి వస్తే.. అగ్రదేశాలు అంతగా జియోపాలిటిక్స్ను వంటబట్టించుకోని రోజుల్లోనే మనదేశంలో ద్వాపరయుగంలో విదురనీతి.. ఆధునిక యుగంలో చాణక్యనీతి అమల్లో ఉన్నాయి. భారత్కు రష్యా ముందు నుంచి మిత్ర దేశం. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఆంక్షల ఛట్రంలో రష్యా కూరుకుపోయింది.👉భారత్ను దెబ్బతీయాలనుకున్నారు కానీ...ఈ క్రమంలో చౌకగా చమురు అమ్మేందుకు రష్యా సిద్ధమైనా.. అభివృద్ధి చెందుతున్న దేశాలేవీ కొనేందుకు ముందుకు రాలేదు. ఐరోపా దేశాలే రష్యా చమురు కొంటున్న తరుణంలో భారత్ కూడా రష్యాకు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ చర్య అటు రష్యాకు, ఇటు భారత్కు లబ్ధి చేకూర్చింది. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్.. సుంకాలతో భారత్ను దెబ్బతీయాలనుకున్నారు. భారత్ తన ప్లాన్-బీని అమలు చేసింది.👉ఊహించని పరిణామం..అంతే.. కొత్త వినియోగదారులను సొంతం చేసుకుంది. ఐరోపా సమాఖ్యతో 19ఏళ్లుగా కలగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకు ముందే.. చైనాకు దగ్గరైంది. ఉప్పు-నిప్పుగా ఉండే తాలిబాన్లను అక్కున చేర్చుకుంది. ఇరాన్తోనూ వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమైంది. జీయోపాలిటిక్స్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఊహించని ఈ పరిణామం అమెరికా మార్కెట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో.. ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.👉భారత్ స్వరం మార్చింది..దౌత్యం విషయంలో భారత వ్యూహాలు మునుపటిలా లేవు. గడిచిన దశాబ్దన్నర కాలంగా వ్యూహప్రతివ్యూహాలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంతా భగవతేచ్ఛ.. అని భావించే భారత్.. ఇప్పుడు స్వరం మార్చింది. ప్రేమిస్తే.. ప్రాణమిస్తాం.. వంచిస్తే.. కాలరాస్తాం.. ఎక్కడా తగ్గేదే లే.. అని చాటిచెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. ఏరంగంలోనైనా శత్రువు ఢీ-అంటే ఢీకొడతామని తేల్చిచెప్పింది.👉ఇంకా చెప్పాలంటే..ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే.. 2019లో ఆంక్షల పేరుతో ఇరాన్, వెనిజెవెలా, భారత్ నుంచి చమురు దిగుమతులను నిలివేశారు. ఆ సమయంలో ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీతో రాయబారాలు నెరిపారు. అప్పటి నుంచే.. భారత్-అమెరికా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ ఆత్మనిర్భరతతో ఉందనే విషయాన్ని అమెరికాకు చాటి చెప్పింది. అమెరికా సాధారణంగా తన దారికి తెచ్చుకోవాలనుకునే దేశాలపై ప్రయోగించే సామ, దాన, బేధ, దండోపాయాలకు తాము అతీతమని భారత్ నిరూపించింది. ట్రంప్ మాదిరిగా.. దావోస్లాంటి వేదికను బెదిరింపులకు వినియోగించుకోకుండా.. అసందర్భ ప్రేలాపనలకు పోకుండా.. మౌనం వహించింది. విజయం సాధించింది.
ఓటీటీకి మనశంకర వరప్రసాద్గారు... అఫీషియల్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను జీ5 సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయినప్పటికీ ఫిబ్రవరి 11 నుంచే ఓటీటీకి రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా జీ5 తమ ఫ్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేసింది. ఇందులో మనశంకర వరప్రసాద్గారు ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్కు రానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో టాలీవుడ్ సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
T20 WC : సౌతాఫ్రికాపై టీమిండియా గ్రాండ్ విక్టరీ
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా నవీముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 210 పరుగుల వద్దే నిలిచింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఐదెన్ మార్క్రమ్ 38 పరుగులు, ర్యాన్ రెకెల్టెన్ 44 పరుగులు చేశారుభారత్ ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వీరిద్దరు ధనాధన్ దంచికొట్టి రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగారు.ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్లు బాది 45 పరుగులు సాధించాడు. అయితే, ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్లో బౌల్డ్ అయిన తిలక్ హాఫ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 240 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్జే, క్వెనా మఫాకా తలా ఒక వికెట్ పడగొట్టారు.కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి రోజు పసికూన అమెరికాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా అవతరించిన సంగతి తెలిసిందే.
ఆ దేశాల్లో ఇండియన్ బైక్లకు యమా క్రేజ్..!
సమాజంలో ఓ స్థాయి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇంపోర్టెడ్ బైకులు, కార్లు వాడడం తెలిసిందే..! అయితే.. ఆఫ్రికాలోని పేదదేశాలతోపాటు.. లాటిన్ అమెరికా వంటి దేశాల్లో సాధారణ ప్రజలు కూడా ఇంపోర్టెడ్ బైకులు వాడుతారంటే మీరు నమ్ముతారా? పేదరికం ఎక్కువగా ఉండే బుర్కినాఫాసో, ఐవరీ కోస్ట్, గ్వాటెమాలా, హోండురాస్ వంటి దేశాల్లో ఇంపోర్టెడ్ బైకులకు క్రేజ్ చాలా ఎక్కువ. సెకండ్ హ్యాండ్ బైక్లైనా.. విదేశీవే వాడుతారు. అయితే.. ఆ దేశాలకు బైక్లను ఎగుమతి చేసేది మాత్రం మన దేశమే..! నైజీరియా, కొలంబియా, బ్రెజిల్లోనూ భారత తయారీ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.43 లక్షల బైక్ల ఎగుమతిభారత్లో ఎకానమీ ద్విచక్రవాహనాలు ఏ బ్రాండ్లో ఎక్కువగా ఉంటాయంటే.. ఠక్కున వచ్చే సమాధానాలు బజాజ్, హీరో, టీవీఎస్ అనే..! ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో ఈ వాహనాలకే అత్యధిక క్రేజ్ ఉంది. గత ఏడాది ఏకంగా 43 లక్షల ద్విచక్ర వాహనాలను భారత్ ఎగుమతి చేసింది. నైజీరియా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాల్లో పౌరులు వాడే ప్రతీ 10 బైకుల్లో.. ఏడు మన దేశానికి చెందినవే..! నిజానికి ఒకప్పుడు ఈ ఘనతను జపాన్, చైనా తమ పేరిట నమోదు చేసుకున్నాయి. అయితే.. గడిచిన 15 ఏళ్లుగా భారత్ ఆ రికార్డులను తారుమారు చేస్తూ వస్తోంది.వాస్తవానికి భారత్ నుంచి ద్విచక్ర వాహనాల ఎగుమతికి పెద్ద చరిత్రే ఉంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రంగంలో చైనా ఆధిపత్యం ఉండేది. అంతకు ముందు జపాన్ బైకులకు క్రేజ్ ఉండేది. అయితే.. భారత్ వ్యూహాత్మకంగా ఆలోచించి, ఆఫ్రికన్ దేశాలకు బైకుల ఎగుమతిని ప్రారంభించింది. క్రమంగా ఈ ఎగుమతులను లాటిన్ అమెరికా, ఇతర ఆసియా దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఈ దేశాల్లో ఎలక్ట్రిక్ బైకుల విషయంలో చైనా జోరు ఉన్నా.. భారత్ దాన్ని కూడా క్రమంగా అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.ఇందుకు అనేక కారణాలున్నాయి. జపాన్ బైకుల రేట్లు పెరిగాయి. చైనా బైకుల్లో నాణ్యతాపరమైన లోపాలు ఉంటున్నాయి. కానీ, భారత బైకులు మాత్రం అటు నాణ్యతాపరంగా.. ఇటు ధరలపరంగా ఆయా దేశాల పౌరుల మన్ననలు అందుకుంటున్నాయి. నిజానికి ఆయా దేశాల్లో జపాన్ బైకుల ధరలు 1500 డాలర్ల నుంచి 5 వేల డాలర్ల వరకు.. చైనా బైకుల ధరలు 800 డాలర్ల నుంచి 1200 డాలర్ల ఉన్నాయి. భారత్ మధ్యేమార్గంగా.. ఈ రెండిటికీ మధ్యలో 900 డాలర్ల నుంచి 1500 డాలర్ల మధ్య ధరలను నిర్ణయించి, ఆయా మార్కెట్లలోకి ప్రవేశించింది. నాణ్యత విషయంలో జపాన్ బైకులకు సమానంగా ఉండడంతో.. వీటికి ఆదరణ పెరిగింది.ఆకట్టుకుంటున్న మోడల్స్ఇక బైకుల మోడల్స్ విషయంలోనూ భారత్ ద్విచక్ర వాహనాలు ఆయా దేశాల వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. జపాన్ హోండా మాదిరి మోడళ్లను మన హీరో కంపెనీ తయారు చేస్తుండగా.. సుజికీ వంటి మోడళ్లను టీవీఎస్ రూపొందిస్తోంది. దీంతో.. జపాన్ బైకుల స్థానాన్ని భారత్ ఆక్రమించింది. చైనా బైకుల విషయానికి వస్తే.. చూడ్డానికి బాగానే ఉన్నా.. ఊరూపేరూ లేని కంపెనీలు కావడం.. విడిభాగాల సపోర్టు లేకపోవడంతో కొన్న ఏడాదికే అవి తుక్కుగా మారుతున్నాయనే విమర్శలు ఆయా దేశాల వినియోగదారుల నుంచి ఎదురవుతున్నాయి. దాంతో.. భారత్కు చెందిన హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీలు విదేశాలకు బైకుల ఎగుమతిలో ఆధిపత్యాన్ని సాధించాయి.భారత బైకుల పట్ల మోజు పెరగడానికి కారణాల్లో అత్యంత కీలకమైనది సపోర్టింగ్..! మన కంపెనీలు ఆయా దేశాలకు నిరంతరాయంగా.. డిమాండ్ని బట్టి ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ లైనర్లు, డిస్కులు, క్లట్చ్, గేర్ వైర్లు, కేబుళ్లను సరఫరా చేస్తాయి. అంతేకాదు.. అక్కడి డీలర్లకు నిరంతర సపోర్ట్ని అందజేస్తాయి. ఆయా దేశాల మెకానిక్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. అందుకే అక్కడి డీలర్లు భారతీయ బైకులను ఆదరిస్తారు. ఒక్క పేద దేశాలే కాదు.. అమెరికాలో మన ఎన్ఫీల్డ్కు చాలా క్రేజ్ ఉంది. హార్లే-డేవిడ్సన్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో కూడా అమెరికాలో ఎన్ఫీల్డ్కు విపరీతమైన ఆదరణ ఉంది. అమెరికాలోని 47 రాష్ట్రాల్లో ఎన్ఫీల్డ్కు 152 డీలర్షిప్లు ఉండడం ఇందుకు నిదర్శనం. క్లాసిక్-350, హిమాలయన్-45, ఇంటర్సెప్టార్-650, కాంటినెంటల్ జీటీ-650, సూపర్ మెటియోర్-650 వంటి మోడళ్లను అమెరికన్లు ఆదరిస్తున్నారు. ఐరోపాలో కూడా హార్లే-డేవిడ్సన్కు మన బుల్లెట్ గట్టి పోటీని ఇస్తోంది. చూశారా.. విదేశీ మార్కెట్లలో భారత బైకుల హవా??
పాక్కు బలూచ్ సవాలు!
ఉగ్రవాదుల కాల్పులు.. 162మంది మృతి
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
వాళ్లే అసలైన జాతిపితలు: కోమటిరెడ్డి
'వారణాసి' ఓటీటీ డీల్ పై హాట్ టాక్
T20 WC : సౌతాఫ్రికాపై టీమిండియా గ్రాండ్ విక్టరీ
బంగారంలా మెరిసిపోతున్న కాజోల్.. పొట్టి డ్రెస్లో జ్యోతి పూర్వాజ్ అందాలు..!
అంబటి, జోగి ఇళ్లపై దాడి.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఆ దేశాల్లో ఇండియన్ బైక్లకు యమా క్రేజ్..!
అందుకే పిల్లలు వెళ్లారు: విజయశాంతి రెడ్డి భర్త
టారిఫ్ తగ్గింపుతో బలపడిన రూపాయి
ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్ బెస్ట్!.. డెలాయిట్ మేనేజర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
దలైలామాకు గ్రామీ అవార్డు - తీవ్ర నిరసన తెలిపిన చైనా
ఈ మధ్య అదే రాజ్యమేలుతోంది!!
T20 WC: శ్రీలంకకు షాకిచ్చిన పసికూన!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
కపటనాటక సూత్రధారి
బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..!
చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు
ICC vs PCB: పాకిస్తాన్కు భారీ షాక్!
యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ
WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్
అమెరికా ప్రయాణంలో కర్ణాటక మహిళకు షాక్.. భారీ దొంగతనం
జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
‘బడ్జెట్’తో బుద్ధి చెప్పిన భారత్.. తేరుకోని బంగ్లాదేశ్
IND vs PAK: ఆ మూడు మ్యాచ్లు గెలుస్తాం: పాక్ కెప్టెన్
అందుకే పిల్లలు వద్దనుకున్నా: నటి
యాదాద్రికి ఎంఎంటీఎస్
పాక్కు బలూచ్ సవాలు!
ఉగ్రవాదుల కాల్పులు.. 162మంది మృతి
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
వాళ్లే అసలైన జాతిపితలు: కోమటిరెడ్డి
'వారణాసి' ఓటీటీ డీల్ పై హాట్ టాక్
T20 WC : సౌతాఫ్రికాపై టీమిండియా గ్రాండ్ విక్టరీ
బంగారంలా మెరిసిపోతున్న కాజోల్.. పొట్టి డ్రెస్లో జ్యోతి పూర్వాజ్ అందాలు..!
అంబటి, జోగి ఇళ్లపై దాడి.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఆ దేశాల్లో ఇండియన్ బైక్లకు యమా క్రేజ్..!
అందుకే పిల్లలు వెళ్లారు: విజయశాంతి రెడ్డి భర్త
టారిఫ్ తగ్గింపుతో బలపడిన రూపాయి
ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్ బెస్ట్!.. డెలాయిట్ మేనేజర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
దలైలామాకు గ్రామీ అవార్డు - తీవ్ర నిరసన తెలిపిన చైనా
ఈ మధ్య అదే రాజ్యమేలుతోంది!!
T20 WC: శ్రీలంకకు షాకిచ్చిన పసికూన!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
కపటనాటక సూత్రధారి
బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..!
చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు
ICC vs PCB: పాకిస్తాన్కు భారీ షాక్!
యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ
WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్
అమెరికా ప్రయాణంలో కర్ణాటక మహిళకు షాక్.. భారీ దొంగతనం
జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
‘బడ్జెట్’తో బుద్ధి చెప్పిన భారత్.. తేరుకోని బంగ్లాదేశ్
IND vs PAK: ఆ మూడు మ్యాచ్లు గెలుస్తాం: పాక్ కెప్టెన్
అందుకే పిల్లలు వద్దనుకున్నా: నటి
యాదాద్రికి ఎంఎంటీఎస్
ఫొటోలు
నేను తప్పు చేసినా సహించావ్.. సంఘవి ఎమోషనల్ (ఫోటోలు)
అంబటి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
జగన్ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)
అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)
ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)
పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
నెట్ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)
జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)
సినిమా
మెగా ఫ్యాన్స్కు షాక్.. పెద్ది మూవీ రిలీజ్ వాయిదా
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా అభిమానులకు బిగ్ షాకిచ్చింది మూవీ టీమ్. పెద్ది విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.పెద్ది మూవీ కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో మార్చిలో పెద్ది చూడాలనుకున్న మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దురంధర్-2 వల్లేనా?అయితే పెద్ది మూవీ వాయిదా వేయడంపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ దురంధర్-2 మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సారి దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దిని వాయిదా వేసి ఉంటారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే అడివి శేష్ నటించిన డకాయిట్ సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. #PEDDI will see you on 30th APRIL, 2026 💪🏻🔥@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @vriddhicinemas @VenkataSKilaru @MythriOfficial @SukumarWritings @PeddiMovieOffl pic.twitter.com/TTfrxi773W— Ram Charan (@AlwaysRamCharan) February 4, 2026
జెనీలియా వేగన్గా ఎందుకు మారిపోయిందో తెలుసా?
జెనీలియా.. ఈ పేరు చెప్పగానే చాలామందికి హ..హ.. హాసిని అన్న డైలాగ్ గుర్తుకొస్తుంది. సై, హ్యాపీ, బొమ్మరిల్లు, రెడీ వంటి పలు సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించింది. తర్వాత హిందీ, మరాఠి సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే గతేడాది జూనియర్ మూవీతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి తప్పకుండా టైం కేటాయిస్తుంది. భర్త రితేశ్, పిల్లలు రియాన్, రాహుల్తో సరదాగా గడుపుతుంది. అయితే కొడుకు అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో జెనీలియా పూర్తి శాకాహారిగా మారిపోయిందన్న విషయం మీకు తెలుసా?కొడుకు అమాయక ప్రశ్నజెనీలియా (Genelia D'souza) జంతు ప్రేమికురాలు. కానీ చిన్నప్పటినుంచి పుష్టిగా మాంసం లాగించేది. ఒకరోజు ఆమె పెద్ద కొడుకు రియాన్ స్కూల్ నుంచి రాగానే తల్లిని ఓ ప్రశ్న అడిగాడు. అమ్మా.. నువ్వు మన ఫ్లాష్ (కుక్క)ను ప్రేమిస్తావు, కానీ కోడిని మాత్రం తింటావు. రెండింటికి మధ్య తేడా ఏముంది? రెండూ జంతువులే కదా? అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న ఆమెను ఆలోచనలో పడేసింది. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న ఆలోచనవైపు నడిపించింది. భార్యాభర్తలిద్దరూ..అలా జెనీలియా 2017లో శాకాహారిగా మారింది. నాన్వెజ్కు దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తోంది. అయితే మొదట్లో కోడిగుడ్లు, చీజ్, ఇతరత్రా డెయిరీ పదార్థాలు మాత్రం ఆహారంలో తీసుకునేది. శాఖాహారం తీసుకున్నప్పుడు తన శరీరంలో పాజిటివ్ మార్పులు వచ్చాయని సంతోషించింది. జెనీలియా భర్త రితేశ్ దేశ్ముఖ్ కూడా ఒకప్పుడు మాంసప్రియుడే. కానీ ఒకానొక సమయంలో అది కరెక్ట్ కాదనిపించడంతో 2016లో నాన్వెజ్ తినడం మానేశాడు.వేగనిజం2020లో కరోనా తాండవిస్తున్న సమయంలో దంపతులిద్దరికీ ఇంట్లో బోలెడంత సమయం దొరికింది. అప్పుడే వీరిద్దరూ నెమ్మదిగా డెయిరీ పదార్థాలకు కూడా స్వస్తి పలికి వేగన్కు జై కొట్టారు. వేగన్ అంటే.. జంతు సంబంధిత ఆహారాలకు (మాంసంతో పాటు పాలు, గుడ్లు, నెయ్యి వంటివి) దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. దీన్నే వేగనిజం అని కూడా అంటారు.చదవండి: బుల్లెట్ సునీల్గా రాజశేఖర్.. గ్లింప్స్ చూశారా?
ఓటీటీకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్తో పాటు చిరంజీవి మనశంకర వరప్రసాగద్గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ప్రభాస్ మూవీ అంత మెప్పించలేపోయింది. మిగిలిన నాలుగు చిత్రాలు ఆడియన్స్ను అలరించాయి.అంతేకాకుండా చివర్లో విడుదలైన శర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.love met chaos and chose to arrive on your screens 👀#NaariNaariNadumaMurariOnPrime, Watch Now https://t.co/JCx7tvOlqr@ImSharwanand @AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju @ItsActorNaresh @Composer_Vishal @dopyuvraj @gnanashekarvs @ramjowrites @brahmakadali… pic.twitter.com/KxGZsv5EGZ— prime video IN (@PrimeVideoIN) February 3, 2026
పెద్దమ్మ తల్లి ఆలయంలో ఛార్మి, పూరి పూజలు.. వీడియో వైరల్
జూబ్లీహిల్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హీరోయిన్ ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శించుకున్నారు. వీరిద్దరు హైదరాబాద్లోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ దర్శనం అనంతరం వీరిద్దరు బయటికొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్ సేతుపతి బర్త్డే సందర్భంగా నేడు(జనవరి 16) ఈసినిమా టైటిల్తో పాటు ఫస్ట్లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి స్లమ్ డాగ్ అనే టైటిల్ని ఖరారు చేశారు. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా చిరిగిన దుస్తులు ధరిస్తూనే.. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్ఫుల్గా కనిపించాడు.కాగా.. ఈ పాన్ ఇండియా చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. Director #PuriJagannadh & #CharmyKaur Spotted At Shri Peddamma Talli Temple pic.twitter.com/ofas8ZxFfC— idlebrain.com (@idlebraindotcom) February 4, 2026
క్రీడలు
T20 WC 2026: ‘భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుంది’
భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదులు తలపడుతుంటే ఇరు దేశాల అభిమానులే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం స్క్రీన్లకే అతుక్కుపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్లు జరిగి దశాబ్దకాలానికి పైగా గడిచిపోయింది.ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్లో మాత్రమే భారత్- పాక్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత నుంచి ఈ రెండు దేశాల్లో ఒకటి ఆతిథ్యం ఇస్తే.. తటస్థ వేదికపైనే మ్యాచ్లు జరిగేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ భారత్లో జరుగుతుండగా.. పాక్ శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడనుంది.పాక్ ఓవరాక్షన్అయితే, బంగ్లాదేశ్కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల పోరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ వందకు వంద శాతం జరిగితీరుందని అభిప్రాయపడ్డాడు.వందకు వంద శాతం జరుగుతుంది‘‘వచ్చే మూడు- నాలుగు రోజుల్లో పాక్ నిర్ణయం తారుమారు అవుతుంది. వందకు వంద శాతం భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందరిలాగే నేనూ దాయాదుల పోరును చూడాలని గట్టిగా అనుకుంటున్నాను.ఈ మ్యాచ్ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు.. పాక్ ఇప్పుడు తప్పుకొంటే ఆర్థికంగా బాగా నష్టపోవాల్సి ఉంటుంది. తమ వల్ల కలిగిన నష్టాన్ని బ్రాడ్కాస్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ టోర్నీలో మిగతా దేశాలు కూడా ఉన్నాయి.ఇతర బోర్డులకూ నష్టమేపాక్ వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తుందని ఐసీసీ సమావేశంలో ఆయా దేశాల బోర్డులు వాదిస్తాయి. త్వరలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా జరుగనుంది. ఈ ఈవెంట్కు తమ ఆటగాళ్లను వెళ్లకుండా నిలువరించే అవకాశాలు కూడా ఉన్నాయి.అయినా ఈసారి పాక్ భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని చెప్పడం సమంజసమే కాదు. ఈసారి పాక్ తటస్థవేదిక మీదే పాక్ తమ మ్యాచ్లు ఆడబోతోంది. అయినా సరే టోర్నీలో ఒక్క జట్టుతో మాత్రమే ఆడము అని చెప్పడం ఏరకంగానూ ఆమోదయోగ్యనీయం కాదు. పూర్తిగా తప్పుకోకుండా ఒక్క జట్టుతో మ్యాచ్ను బహిష్కరించడం టెక్నికల్గా సరికాదు’’ అని అశూ పేర్కొన్నాడు.ఇప్పటికే బంగ్లా అవుట్కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదంటూ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. గడువు ఇచ్చినా బంగ్లా వైఖరి మారకపోడంతో టోర్నీ నుంచి ఆ జట్టును తప్పించింది. అయితే, పాక్ బంగ్లాదేశ్కు వంతపాడుతూ భారత్తో మ్యాచ్ బహిష్కరణ అంటూ నాటకానికి తెరతీసింది. కాగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ.. మేఘం కురిస్తే...
World Cup 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిశాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గనిస్తాన్పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు ధనాధన్ దంచికొట్టాడు.24 బంతుల్లోనే..కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 68 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.𝐅𝐀𝐒𝐓. 𝐅𝐄𝐀𝐑𝐋𝐄𝐒𝐒. 𝐅𝐈𝐅𝐓𝐘.Vaibhav Sooryavanshi goes full throttle in the SEMI-FINAL chase! 🚀#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/skcIOVMznz— Star Sports (@StarSportsIndia) February 4, 2026సుడిగాలి ఇన్నింగ్స్వైభవ్ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులు చేసింది. అయితే, భారత ఇన్నింగ్స్ పదో ఓవర్లో నూరిస్తాని ఒమర్జాయ్ బౌలింగ్లో మూడో బంతికి.. ఒస్మాన్ సదాత్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సూర్యవంశీ పెవిలియన్ చేరాడు. కాగా ఓపెనర్ ఆరోన్ జార్జ్తో కలిసి మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్కు 57 బంతుల్లో 90 పరుగులు జోడించాడు.311 పరుగుల లక్ష్యంకాగా వరల్డ్కప్ రెండో సెమీ ఫైనల్లో భాగంగా జింబాబ్వేలోని హరారే వేదికగా టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో చెలరేగారు.ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి అఫ్గనిస్తాన్ 310 పరుగులు సాధించింది. అఫ్గన్ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్కు శుభారంభమే లభించింది. పది ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి యువ భారత జట్టు వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది.చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు
T20 WC: పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్.. తాజాగా భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.భారత్ ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఓవరాక్షన్ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.భారత్తో మ్యాచ్ రద్దు చేసుకుంటే..ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్.. టీమిండియాతో మ్యాచ్ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్ 8 చేరే అవకాశాలను కూడా పాక్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్కప్ టోర్నీలో పాక్.. భారత్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్.. తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.వాన పడే అవకాశంఅయితే, ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్లో భారత్ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్ ఆ మ్యాచ్ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.ఇక లీగ్ దశలో ఆఖరిగా పాక్.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్ ఆడకపోతే పాక్ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.నెట్రన్రేటుపై ప్రభావంమరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్, నమీబియాలతో మ్యాచ్లకు ఆటంకం కలిగితే నెట్రన్ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్లో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్ ఓడిపోయి సూపర్-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.తాజా ఎడిషన్లోనూ పాక్కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్ రద్దు.. రెండు మ్యాచ్లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్ సూపర్-8 చేరడం కష్టమే అనిపిస్తోంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు
WC 2026: భారత బౌలర్లు విఫలం.. అఫ్గనిస్తాన్ భారీ స్కోరు
ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. అఫ్గనిస్తాన్తో బుధవారం నాటి మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇందుకు తోడు భారత జట్టు ఫీల్డింగ్ తప్పిదాలతో అఫ్గన్ బ్యాటర్లుకు లైఫ్ ఇచ్చింది. ఫలితంగా అఫ్గనిస్తాన్ భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన ఫైజల్ షినోజాదాజింబాబ్వేలోని హరారే వేదికగా వరల్డ్కప్ రెండో సెమీస్ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఒస్మాన్ సదాత్ (39), ఖలీద్ అహ్మద్జాయ్ (31) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ ఫైజల్ షినోజాదా (Faisal Shinozada) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఉజైరుల్లా అజేయ శతకంమొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న ఫైజల్.. 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. మరోవైపు.. రనౌట్ ప్రమాదాల నుంచి తప్పించుకున్న నాలుగో నంబర్ బ్యాటర్ ఉజైరుల్లా నియాజాయ్ (Uzairullah Niazai) సైతం శతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 86 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫైజల్- ఉజైరుల్లా కలిసి మూడో వికెట్కు 130 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా అఫ్గనిస్తాన్ ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 111 పరుగులు రాబట్టింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గన్ జట్టు ఏకంగా 310 పరుగులు సాధించింది.𝙄𝙩 𝙩𝙤𝙤𝙠 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙩𝙤 𝙨𝙩𝙤𝙥 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 ✨Deepesh Devendran goes through the gate to hand #TeamIndia a vital wicket 👊#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/eVzeiSfryl— Star Sports (@StarSportsIndia) February 4, 2026ఈ ఎడిషన్లో ఇదే అత్యధిక స్కోరుఅండర్-19 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్లలో తాజా ఎడిషన్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీశారు. అఫ్గన్ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే భారత్ ఫైనల్లో అడుగుపెట్టగలదు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్
న్యూస్ పాడ్కాస్ట్
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
జీవీఎంసీలో రౌడీ రాజ్యం... గీతం కబ్జాకు పచ్చజెండా... కనీస చర్చ లేకుండానే భూముల క్రమబద్దీకరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో రీ సర్వే సూపర్. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ, మార్కెట్ సంస్కరణలు భేష్ అని పొగిడిన కేంద్ర ఆర్థిక సర్వే
YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు... సీబీఐ దర్యాప్తులో వెల్లడి... బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు
కరెంట్ చార్జీలపై ఏపీ సర్కారు కహానీ. చార్జీలు తగ్గిస్తామంటూనే 20వేల కోట్ల రూపాయల భారం
బిజినెస్
వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం
వేదాంత గ్రూప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత సంపదలో 75 శాతాన్ని సమాజ సేవ కోసం విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల తన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న అనిల్ అగర్వాల్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన అనంతరం ఈ సంచలన ప్రకటన చేశారు. అనిల్ అగర్వాల్కు ఇద్దరు సంతానం కుమారుడు అగ్నివేష్ అగర్వాల్, కూతురు ప్రియా అగర్వాల్(2013లో ఆకాష్ హెబ్బర్ను వివాహం చేసుకున్నారు). అనిల్ మొత్తం నెట్వర్త్ సుమారు రూ.3.66 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అందులో తన వ్యక్తిగత సంపదను దానం చేసేందుకు సిద్ధమయ్యారు.ప్రధానితో భేటీ.. ఒక భావోద్వేగ ప్రయాణంఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా జరిగిన ‘గ్లోబల్ ఎనర్జీ లీడర్స్’ రౌండ్ టేబుల్ సమావేశంలో అనిల్ అగర్వాల్ పాల్గొన్నారు. తన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ ఆకస్మిక మరణం తర్వాత ఆయన హాజరైన మొదటి అధికారిక సమావేశం ఇది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చూపిన చొరవను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అగర్వాల్ తన మనోభావాలను పంచుకున్నారు.‘మా కుటుంబంలో విషాదం తర్వాత నేను హాజరైన మొదటి అధికారిక సమావేశం ఇది. వ్యక్తిగత నష్టంతో కుంగిపోయిన మాకు ప్రధానమంత్రి మోదీ అందించిన ఓదార్పు, సానుభూతి వెలకట్టలేనివి. ఆయన మాటలు నాకు, నా భార్యకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చాయి’ అని అగర్వాల్ పేర్కొన్నారు.కుమారుడి ఆశయ సాధనే లక్ష్యం..అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో స్కేయింగ్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు. తన కుమారుడి కోరికలకు అనుగుణంగానే ఈ దాతృత్వ నిర్ణయం తీసుకున్నట్లు అగర్వాల్ తెలిపారు.ఇకపై తాను వ్యాపార ప్రమోటర్గా కాకుండా కేవలం ఒక ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తానని అనిల్ అగర్వాల్ స్పష్టం చేశారు. వ్యాపార నియంత్రణ కంటే సామాజిక ప్రభావానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి రంగాల్లో సుమారు రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.ప్రధాని పరామర్శతీవ్ర దుఖంలో ఉన్న అగర్వాల్ దంపతులను ప్రధాని మోదీ ధైర్యంగా ఉండాలని కోరారు. ‘మీరు దృఢంగా ఉండాలి. మీ పనిని కొనసాగించాలి. అది దేశానికి చాలా ముఖ్యం’ అని ప్రధాని ఇచ్చిన సలహా తమకు ఎంతో ఊరటను ఇచ్చిందని అగర్వాల్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజల బాధలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకునే నాయకుడు ఉండటం అదృష్టమని ఆయన ప్రశంసించారు.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..
జీసీసీలకు హాట్స్పాట్గా భారత్
అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలకు (జీసీసీలు) ఆకర్షణీయ కేంద్రంగా భారత్ స్థానం మరింత బలపడనుంది. 2024 చివరికి దేశవ్యాప్తంగా 1,700 జీసీసీలు ఉంటే, 2030 నాటికి వీటి సంఖ్య2,400కు పెరుగుతుందని ఫిక్కీ, అనరాక్ సంయుక్త నివేదిక అంచనా వేసింది. అంతేకాదు వీటి మార్కెట్ పరిమాణం 64 బిలియన్ డాలర్ల నుంచి 110 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని తెలిపింది. 2024 నాటికి జీసీసీలు 19 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పించగా, 2030 నాటికి 28 లక్షల మంది నిపుణులకు పెరుగుతుందని అంచనా వ్యక్తం చేసింది. దేశంలో జీసీసీల మార్కెట్ గత కొన్నేళ్లలో ఎంతో వేగంగా పెరిగినట్టు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు.‘కీలకమైన ఐటీ/ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్ఎస్ఐ), ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధి (ఈఆర్అండ్డీ) రంగాల నుంచి డిమాండ్ పెరగడం జీసీసీల వృద్ధికి ఇంధనంగా నిలుస్తోంది. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగొచ్చు. భారత జీసీసీ మార్కెట్ ఏటా 10 శాతం చొప్పున కాంపౌండెడ్గా పెరుగుతూ 2030 నాటికి 105–110 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు’ అని అనుజ్ పురి తెలిపారు. టైర్–2 నగరాలకూ విస్తరణదేశంలో జీసీసీల కార్యకలాపాలు టాప్–7కు వెలుపలి ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నట్టు ఫిక్కీ–అనరాక్ నివేదిక తెలిపింది. జైపూర్, ఇందోర్, సూరత్, కోచి, కోయింబత్తూర్ పట్టణాల్లోనూ జీసీసీలు ఏర్పాటువుతున్నట్టు పేర్కొంది. ‘‘మూడు దశాబ్దాలుగా భారత ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నిర్వహణను ఖర్చుగానే చూసే వారు. కానీ, ఇప్పుడు ఇదొక కీలక చోదకం. అంతర్జాతీయ పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు కేంద్రాలుగా మారుతున్నాయి. భారత యువతకు ఎంపికలుగా మారుతున్నాయి’’అని ఫిక్కీలో పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ కమిటీ చైర్మన్గా ఉన్న రాజ్ మెండ తెలిపారు. దేశంలోని టాప్–7 నగరాల్లో 800 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) గ్రేడ్–ఏ ఆఫీస్ వసతులు ఉన్నాయని.. సగం మేర బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లోనే ఏర్పాటైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2025లో నికర వినియోగం 58 మిలియన్ ఎస్ఎఫ్టీ కాగా, స్థూల లీజింగ్ 80 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్లో జీఐ ఔట్సోర్సింగ్ జీసీసీ అకౌంట్స్ ఔట్సోర్సింగ్, నాలెడ్జ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సంస్థ జీఐ ఔట్సోర్సింగ్ తాజాగా హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ టెక్ పార్క్లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ప్రారంభించింది. కోవసెంట్లో భాగమైన ఎనేబ్లర్తో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇందులో 50 మంది సిబ్బంది ఉండగా వచ్చే 12 నెలల్లో ఇది 100కి పెరగనున్నట్లు గ్రూప్ సీఈవో తారిఖ్ హుసేన్ తెలిపారు. 2028 నాటికి మరో 100 మందిని తీసుకోనున్నట్లు వివరించారు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్లో ప్రస్తుతం తమకున్న కార్యకలాపాలకు ఈ సెంటర్ అనుబంధంగా ఉంటుందని హుసేన్ వివరించారు. గ్లోబల్ క్లయింట్లకు ప్రపంచ స్థాయి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించే క్రమంలో ఏఐ ఆధారిత జీసీసీని ఏర్పాటు చేయడంలో జీఐ ఔట్సోర్సింగ్కి తోడ్పాటు అందించినట్లు కోవసెంట్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..
భారత్లో గూగుల్ భారీ విస్తరణ.. 20,000 మందికి ఉద్యోగాలు!
అమెరికాలో హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, పెరుగుతున్న వ్యయాల నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. విదేశీ సిబ్బందిని అమెరికాకు పిలిపించుకునే బదులు ప్రతిభ ఉన్న చోటికే తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో గూగుల్ భారీ విస్తరణకు చర్యలు చేపట్టింది.బెంగళూరులో భారీ క్యాంపస్బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న అలెంబిక్ సిటీలో భారీ కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేస్తోంది. మొత్తం మూడు టవర్లలో సుమారు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఉండబోతోందని ప్రాథమిక సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 20,000 మంది సాఫ్ట్వేర్ నిపుణులకు ఉపాధి లభిస్తుంది. భారత్లో ప్రస్తుతం గూగుల్కు 14,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త క్యాంపస్తో గూగుల్ ఇండియా తన సిబ్బంది సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. 6.5 లక్షల చదరపు అడుగుల మొదటి టవర్ రాబోయే కొద్ది నెలల్లోనే ప్రారంభం కానుంది. మిగిలిన రెండు టవర్లు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతాయని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది.వీసా ఆంక్షలే వరంగా..అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వస్తున్న మార్పులు భారతీయ ఇంజినీర్లకు వరంగా మారాయి. యూఎస్ హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుములను భారీగా పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తుకు కంపెనీలు దాదాపు 1,00,000 డాలర్లు (సుమారు రూ.91 లక్షలు) వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీసా అనుమతుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం కంటే భారత్లోనే స్థానిక బృందాలను నిర్మించడం కంపెనీలకు లాభదాయకంగా మారుతుంది. మానవ వనరులను అమెరికాకు తరలించే ఖర్చు తగ్గడమే కాకుండా, భారతీయ నైపుణ్యాన్ని తక్కువ వ్యయంతోనే వినియోగించుకునే వీలు కలుగుతోంది.ఏఐ రేసులో భారతే కీలకంప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, చిప్ డిజైనింగ్ వంటి క్లిష్టమైన విభాగాల్లో వందలాది పోస్టుల కోసం గూగుల్ నియామకాలు చేపడుతోంది. గూగుల్ మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా వంటి సంస్థలు కూడా భారత్లో తమ సిబ్బందిని పెంచుకుంటున్నాయి. గడిచిన ఏడాదిలో ఈ దిగ్గజ కంపెనీల భారతీయ ఉద్యోగుల సంఖ్య 16 శాతం పెరగడం గమనార్హం. ఇది గత మూడేళ్లలో అత్యధిక వృద్ధి.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..
తీవ్ర నేరారోపణలు.. సైబర్ క్రైమ్ యూనిట్ సోదాలు
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ఎక్స్ కార్యాలయాలపై ఆ దేశ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధమైన డేటా వెలికితీత, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు ఎక్స్ యాజమాన్యం ధ్రువీకరించింది.దర్యాప్తు నేపథ్యం..ఈ వివాదం 2025 జనవరిలో ప్రారంభమైంది. ఎక్స్ ప్లాట్ఫామ్ తన యూజర్లకు సిఫార్సు చేసే అల్గారిథమ్ ఆధారిత కంటెంట్పై పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తు క్రమంగా ఎక్స్ వివాదాస్పద ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’ వరకు విస్తరించింది. అయితే, ఈ చర్యలను ఎక్స్ తీవ్రంగా ఖండించింది. జులై 2025లో స్పందిస్తూ.. ఈ విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమని, తమ అల్గారిథమ్ను తారుమారు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.ఎక్స్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలుపిల్లల అశ్లీల చిత్రాలను కలిగి ఉండటం. వాటిని ఇతరులతో పంచుకోవడంలో ప్లాట్ఫామ్ ప్రమేయం ఉండటం.అనుమతి లేకుండా మహిళల లైంగికపరమైన డీప్ఫేక్(రియల్ ఇమేజ్లను తలపించేలా ఏఐ ద్వారా సృష్టించే చిత్రాలు) చిత్రాలను సృష్టించడం ద్వారా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం.వ్యవస్థీకృత సమూహాల ద్వారా మోసపూరిత పద్ధతుల్లో డేటాను సేకరించడం.ముఖ్యంగా గ్రోక్ చాట్బాట్ మహిళల అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై యూరోపియన్ కమిషన్, యూకే రెగ్యులేటర్లు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి.ఎక్స్ను ఉపయోగించబోం..విచారణ తీవ్రతరం కావడంతో పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఇకపై ఎక్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించబోమని, అధికారిక సమాచారం కోసం లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తామని ప్రకటించింది.గతంలో టెలిగ్రామ్పై చర్యలుటెక్ దిగ్గజాలపై ఫ్రాన్స్ కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో కంటెంట్ మోడరేషన్ లోపాలపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ను ఫ్రాన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్ఫామ్ కార్యకలాపాల్లో మార్పులు చేసిన తర్వాతే గత మార్చిలో ఆయనను దేశం విడిచి వెళ్లడానికి అనుమతించారు. ప్రస్తుతం ఎక్స్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం సోషల్ మీడియా నియంత్రణల విషయంలో ఐరోపా దేశాల కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..
ఫ్యామిలీ
అవాంఛిత రోమాలు ఎందుకు పెరుగుతాయి?
తలపై జుట్టు బాగా పెరగాలని మహిళలు కోరుకోవడం ఎంతో సాధారణమో... దేహంలోని కొన్ని భాగాల్లో అంటే... పైపెదవీ, గదమ మీద జుట్టు పెరగకూడదని కోరుకోవడం కూడా అంతే సహజం. అలా జుట్టు పెదవులపైనా గడ్డంపైనా పెరగడాన్ని వారు ఎంతమాత్రమూ ఇష్టపడరు. అలాంటి అవాంఛిత రోమాలను అనేక విధాల తొలగించుకోడానికి మహిళలు ప్రయత్నిస్తుంటారు. ఇలా వారు కోరుకోని ప్రదేశాల్లో వెంట్రుకలు పెరగడాన్ని అవాంఛిత రోమాలు అనీ... అదే వైద్యపరిభాషలో హిర్సుటిజమ్ (Hirsutism) అని చెబుతారు. అవాంఛిత రోమాలు వచ్చేందుకు కారణాలు, వాటికి పరిష్కారాలేమిటన్నది తెలుసుకుందాం...సాధారణంగా మానవుల శరీరమంతటా రోమాలు ఉండనే ఉంటాయి. మనం క్షీరదాల కోవకు చెందినవాళ్లం కావడం వల్ల... క్షీరదాల్లో ఇలా ఒళ్లంతా వెంట్రుకలు ఉండటం ఒక లక్షణం కావడం వల్ల ఒంటి నిండా రోమాలు ఉండటం సహజం. కాకపోతే దేహంలోని కొన్ని చోట్ల అవి అవి ఉండాల్సినట్టుగా ఉండకుండా పెరగడాన్ని అవాంఛిత రోమాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు పురుషుల్లో గడ్డం, మీసం ఉండటం సహజం. కానీ మహిళల్లో అవి ఉండవు. ఉన్నప్పటికీ ప్రస్ఫుటంగా కనిపించకుండా... నూగుగా... ఉండీ ఉండకుండా కనిపిస్తుంటాయి. అయితే కొందరిలో అవి పురుషుల్లో మాదిరిగా పెరుగుతూ స్పష్టంగా కనిపించే అవకాశముంటుంది. అవాంఛిత రోమాలంటే... మహిళల్లో చెంపలూ, చుబుకం, పై పెదవుల వంటి చోట్ల కూడా కనీ కనిపించకుండా రోమాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం అంత సులభం కాదు. సాధారణంగా మహిళలందరి విషయంలోలా కాకుండా భిన్నంగా కనిపించేవాటిని అసహజమైన వెంట్రుకలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు గదమ, చెంపలు, పెదవులపైన వెంట్రుకలు పెరుగుతూ... అవి మరీ గుబురుగా పెరుగుతుంటే వాటిని అవాంఛిత రోమాలుగా పేర్కొనవచ్చు. ఒక అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది శాతం మహిళల్లో... పురుషుల్లో మాదిరిగానే గడ్డంపైనా, పెదవులపైనా వెంట్రుకలు కనిపిస్తాయన్నది వైద్య నిపుణుల మాట.హిర్సుటిజం, హైపర్ట్రైకోసిస్ అంటే...?మహిళల్లో కనిపించే ఈ అవాంఛిత రోమాలను హిర్సుటిజమ్ అనీ అలాగే హైపర్ట్రైకోసిస్ (Hypertrichosis) అని రెండు రకాలుగా చెప్పవచ్చు. స్త్రీలలోనూ పురుషుల మాదిరిగానే వెంట్రుకలు పెరగడాన్ని ‘హిర్సుటిజమ్’గా చెప్పవచ్చు.అయితే హైపర్ట్రైకోసిస్ కండిషన్లోనూ వెంట్రుకలు పెరిగినప్పటికీ... అవి పురుషుల్లోలాగా ఉండవు. ఉదాహరణకు మహిళల హార్మోన్లలో ఏవైనా తేడాలు వచ్చి పురుషుల్లోలా వెంట్రుకలు పెరగడాన్ని హిర్సుటిజమ్గా చెప్పవచ్చు. కానీ వాళ్ల దేహంపైనా వెంట్రుకలు ఉన్నప్పటికీ అవి ఉండాల్సినంతగా కాకుండా చాలా ఎక్కువగా పెరగడాన్ని ‘హైపర్ ట్రైకోసిస్’ అంటారు. జన్యుపరమైన కారణాలతో ఇలా జరుగుతుంది. ఇక కొందరిలో అంతకుముందు లేకపోయినా... కొన్ని రకాల మందులు వాడాక దేహంపైన రోమాలు రావచ్చు. అలా మునుపు లేనివీ... అటు తర్వాత ఏదైనా కారణాలతో రోమాలు పెరగడాన్ని కూడా ‘హైపర్ ట్రైకోసిస్’గా చెప్పవచ్చు.కారణాలు మహిళల్లో అవాంఛిత రోమాలు పెరగడానికి అనేక అంశాలు కారణమవుతాయి. అవి... హార్మోన్లలో తేడాలు...మహిళల్లో స్రవించే హార్మోన్లలో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ అవసరమైన మోతాదు కంటే మించి స్రవించినప్పుడు... ఆ అంశం మహిళల్లో అవాంఛిత రోమాలకు దారితీయవచ్చు.పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్... మహిళల్లో పురుషుల్లోలా వెంట్రుకలు పెరిగేందుకు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్’ (పీసీవోడీ) కూడా ఒక కారణం. హిర్సుటిజమ్ ఉన్న మహిళలలో వైద్యపరీక్షలు చేసినప్పుడు వాళ్లలో చాలామందికి (దాదాపు 70% మందిలో) పీసీవోఎస్ ఉన్నట్లుగా ఫలితాలు రావడం చాలా సహజం. పీసీఓఎస్ ఉన్న మహిళల అండాశయాలు (ఓవరీస్) పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దాంతో ఆ హార్మోన్ మహిళల్లో సాధారణంగా ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు పెరగడం కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లలో మొటిమలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. యుక్తవయసు దాటి΄ోయాక కూడా మొటిమలు రావడం, అవాంఛితమైన రోమాలు ఉంటే పీసీవోఎస్ ఉందేమో అని అనుమానించాలి.పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీవోడీ) సమస్య ఉన్నప్పుడు నిపుణులైన గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం ద్వారా నెలసరి సమస్యలు సరయ్యేలా చూసుకోవడం, చికిత్సను మధ్యలో ఆపకుండా సమస్య పరిష్కారమయ్యేవరకు / పూర్తిగా తగ్గేవరకు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ను కొనసాగించాలి.కొన్ని రకాల గ్రంథుల సమస్య ఉన్నప్పుడు... కొందరు మహిళల్లో థైరాయిడ్ గ్రంథి సమస్యగానీ, పిట్యూటరీ గ్రంథి సమస్య ఉన్నప్పుడు కూడా వారిలో పురుషుల్లోలాగానే వెంట్రుకలు పెరగవచ్చు. అందుకే... అవాంఛిత రోమాలు ఉన్నప్పుడు నిపుణులను సంప్రదించి దానికి అసలు కారణాలు తెలుసుకుని చికిత్స తీసుకోవడం అవసరం.ఇడియోపథిక్ హిర్సుటిజమ్ అంటే...కొద్దిమంది మహిళల్లో పురుషహార్మోన్ స్రావాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ... వెంట్రుకల పెరుగుదల మాత్రం అసాధారణంగా ఉండవచ్చు. ఇలాంటి కండిషన్ను ‘ఇడియోపథిక్ హిర్సుటిజమ్’గా చెబుతారు. వీళ్లలో రుతుక్రమం మామూలుగానే ఉంటుంది. గర్భం రావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాకపోతే వెంట్రుకల పెరుగుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. సాధారణంగా వీళ్లు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటారు. అంటే స్థూలకాయం / ఊబకాయంతో ఉండవచ్చు. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం. మెడ దగ్గర ప్రధానంగా మెడ వెనక భాగంలోనూ, చర్మం ముడతలు పడే ప్రదేశాల్లో చర్మం మరింతగా నల్లగా, మందంగా కనిపించవచ్చు. ఇలా చర్మం మందంగా, నల్లగా కనిపించే కండిషన్ను ‘ఎకాంథోసిస్ నైగ్రికాన్స్’ అంటారు.డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువ... అవాంఛిత రోమాల సమస్యతో బాధపడేవాళ్ల రక్తంలో సాధారణంగా చక్కెర మోతాదులను అదుపులో పెట్టేందుకు మరింత ఎక్కువగా ‘ఇన్సులిన్’ హార్మోను అవసరమవుతుంది. అందుకే ఇలాంటి వాళ్లు చాలాకాలం పాటు ఎలాంటి చికిత్సా తీసుకోకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, అది క్రమంగా డయాబెటిస్ సమస్యకు దారితీసేందుకు అవకాశాలెక్కువ.ఈ వైద్యనిపుణుల సహాయంతో... అవాంఛిత రోమాలు వచ్చే మహిళల్లో రుతుక్రమం సరిగా ఉండదు. అంటే వీళ్లలో నెలసరి (పీరియడ్స్) సక్రమంగా రావు. బరువు ఎక్కువగా పెరగడం, చర్మంలో ముడతలు ఉండే మెడ, బాహుమూలాలు వంటి చోట్ల చర్మం దళసరిగా మారడం, మొటిమలు ఎక్కువగా వస్తుండటం వంటి లక్షణాలతో పాటు ఒకవేళ మాడుపై తగినన్ని వెంట్రుకలు లేకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆ బాధితులు.. ఎండోక్రైనాలజిస్ట్ (హార్మోన్ల నిపుణులు)ను, డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధుల నిపుణుల)ను సంప్రదించాలి. ఈ లక్షణాలున్నవారు తాము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు గైనకాలజిస్ట్ను తప్పనిసరిగా సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ఎండోక్రైనాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్... ఈ ముగ్గురూ ఒక టీమ్గా చికిత్స అందిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)తో బాధపడుతున్న మహిళలైతే వారు తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం వంటి అలవాట్లను కొనసాగించాలి. ఇవి చేస్తూ తమ బరువును తగ్గించుకోవడం లేదా నియంత్రణలో ఉంచుకోవడం చేస్తూ... వాటితో పాటు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి తాత్కాలిక ప్రక్రియలనో లేదా శాశ్వత పద్ధతులనో అవలంబించాలి.అవాంఛిత రోమాల తొలగింపునకు తాత్కాలిక ప్రక్రియలుథ్రైడ్డింగ్ అండ్ వ్యాక్సింగ్ ...సాధారణంగా చాలామంది మహిళలు తమ అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి ముఖ్యంగా థ్రెడింగ్, వ్యాక్సింగ్ లాంటి తాత్కాలిక ప్రక్రియలను అనుసరిస్తుంటారు. ఇవి తరచూ చేస్తున్న క్రమంలో కొందరిలో వెంట్రుకమూలంలో/ రోమం అంకురంలో ఇన్ఫెక్షన్స్ రావడం (ఫాలిక్యులైటిస్) వంటి ముప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అప్పుడక్కడ రోమం కుదురు దగ్గర ఒక గడ్డలా మారి అక్కడ చీమూ పట్టే అవకాశాలెక్కువ. అలాంటి సందర్భాల్లో నొప్పి కూడా రావచ్చు. ఈ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ ప్రక్రియలను అనురించేవారి చర్మం నల్లబడవచ్చు. తగినంత పరిశుభ్రత పాటించకపోతే థ్రెడ్డింగ్తో ఒక్కోసారి పులిపిరులతో కూడిన వైరల్ వార్ట్స్ రావచ్చు. కొందరు మహిళలు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు. వాటిని ఉపయోగించేప్పుడు అలర్జీలు రాకపోతే వాటిని సురక్షితమైనవిగా భావించి, వాటిని వాడుకోవచ్చు. అయితే హెయిర్ రిమూవల్ క్రీమ్ను ఉపయోగించే ముందు అది సురక్షితమా, కాదా అని తెలుసుకోడానికి చర్మంపై ఎక్కడైనా కొద్దిగా ఉపయోగించి చూడటం (ప్యాచ్ టెస్ట్) అవసరం.షేవింగ్... అపోహలు... అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి సాధారణంగా భారతీయ మహిళలు షేవింగ్ను అంతగా ఇష్టపడరు. షేవింగ్ తర్వాత మరింత గుబురుగా వెంట్రుకలు వస్తాయన్న అపోహ ఉండటం, షేవింగ్ (Shaving) వల్ల చర్మం మరింత గరుగ్గా, మందంగా మారుతుందనే అభిప్రాయాలు ఉండటంతో తమ లుక్స్ను కాపాడుకునే క్రమంలో దాన్ని ఒక సురక్షితమైన, నమ్మదగిన ప్రక్రియ అనుకోరు. అయితే అవి అపోహలే. అయినప్పటికీ షేవ్ చేసిన మర్నాడో లేదా వెంటవెంటనో వెంట్రుకలు పెరుగుతుండటం మామూలే కావడం, షేవ్ చేసిన మేర చర్మం రంగు ఒకింత మారడం వంటి కారణాల వల్ల ఇలా అపోహ పడటానికి అవకాశముంది.చదవండి: నిద్ర పట్టడం లేదా.. ఇదిగో పరిష్కారంఇవిగాక... అవాంఛితమైన రోమాలను తొలగించుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల వైద్యప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు లేజర్ ప్రక్రియలూ, ఎలక్ట్రోలైసిస్ (electrolysis) మార్గాల వంటి అధునాతన చికిత్సలూ ఉన్నాయి. అయితే వైద్య సంబంధితమైన ఎలాంటి విద్యార్హతలు లేకుండా తమను తాము బ్యూటీషియన్లు, కాస్మటాలజిస్టులమని చెప్పుకునే వారి దగ్గరకు వెళ్లడం కంటే... వైద్యపరమైన విద్యార్హతలు (క్వాలిఫైడ్) వైద్యనిపుణులై డర్మటాలజిస్టులు /ట్రైకాలజిస్టులను సంప్రదించడం చాలా మంచిది. ఇక ఇలాంటివారైతే... మహిళల్లో ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలు (అండర్లైయింగ్ కాజెస్) ఉండటం వల్ల అవాంఛిత రోమాలు వస్తే... తగిన మందులు ఇవ్వడం లేదా సమస్య మూలాలను తెలుసుకుని సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించమంటూ సలహా ఇవ్వడం వంటివి చేస్తారు.కొందరు మహిళల్లో వెంట్రుకలు పలుచబడటం కూడా...మహిళల్లో అవాంఛిత రోమాలు ఎంత సహజమో... అలాగే కొంతమంది స్త్రీలలో వెంట్రుకలు పలచబారడమూ కనిపిస్తుంది. ఇది ప్రధానంగా పాపిట తీసే చోట కనిపించడం చాలా సాధారణం. అక్కడ వెంట్రుకలు మరింతగా పలచబారిపోయి పాపిట ఉండాల్సిన దానికంటే చాలా వెడల్పుగా కనిపిస్తుంటుంది. ఇలా జరగడాన్ని ‘ఫిమేల్ ప్యాటరన్ హెయిర్ లాస్’’ అంటారు. కొందరిలో ఈ సమస్యను గుర్తించాక... వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటే (సాధారణంగా ఆర్నెల్లలోపు) ఈ సమస్యను మందులతో అధిగమించవచ్చు. అంటే కోల్పోయిన వెంట్రుకలను తిరిగి పొందవచ్చు. అది కుదరకపోయినా మరిన్ని వెంట్రుకలు రాలిపోకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే వెంట్రుకలు మరింతగా రాలిపోయి పూర్తిగా పలచబడితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే ప్రత్యామ్నాయమవుతుంది. నిర్వహణ: యాసీన్
లండన్లో పానీ పూరీ అమ్ముతున్న ఐఐటీ గ్రాడ్యుయేట్..!
కార్పోరేట్ లైఫ్ని వద్దనుకుని మరి ఆతిథ్య రంగాన్ని ఎంచుకుంది భారత సంతతి మహిళ. ఒకప్పుడు శామ్మ్సంగ్ డిజైనర్గా పనిచేసిన ఆమె లండన్లో తన భర్తతో కలిసి సప్పర్ క్లబ్ని రన్ చేస్తుంది. అక్కడ ఆమె పానీపూరితో అపరిచిత భారతీయలును ఒకచోటకుకు చేర్చడమే కాదు వివిధ భారతీయ వంటకాలను పరిచయం చేస్తోంది, లాభాలు ఆర్జిస్తోంది కూడా. అయినా ఐఐటీ చదివి ఇలాఇదే ఎందుకంటే..ఆ దంపతులే అంకిత ఖాంతే, భర్త అమన్ కృష్ణ కలిసి 'ది బౌజీ క్లబ్' అనే సప్పర్ క్లబ్ను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో పుట్టిన ఖాంతే నాగ్పూర్లో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసి, ఐఐటీ గుహతిలో మాస్టర్ డిగ్రిని పూర్తి చేసింది. ఆ తర్వాత 2024లో అమన్ కృష్ణను వివాహం చేసుకుని యూకేకి వెళ్లి స్థిరపడింది. ఇక ఆమె భర్త కృష్ణ ఉత్తరప్రదేశ్లోని ఓబ్రాలో జన్మించాడు. అతడు ఐఐటీ ధన్బాద్ కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐఐటీ హైదరాబాద్లో మాస్టర్ డిగ్రీని పూర్తిచేశాడని చెప్పుకొచ్చింది. తామిద్దరం లండన్ స్థిరపడ్డాక జాబ్ మార్కెట్ని పూర్తిగా స్టడీ చేశాం. అంతకుముందు తాను బెంగళూరులో శామ్సంగ్లో ప్రొడక్ట్ డిజైనర్గా మూడేళ్లు పనిచేసినట్లు పేర్కొంది. స్నేహితులను అందరికి ఒక చోటకు చేర్చి హోస్టింగ్ చేయడం తనకు హాబీ అని ఆ అలవాటే..ఇలా 'ది బౌజీ క్లబ్' నిర్వహించాలనే ఆలోచనకు నాందిపలికిందన్నారు. పైగా దీని సాయంతో ఇంకా కొత్తవారు పరిచయమవ్వక ఇబ్బంది పడుతున్న భారతీయ ఎన్నారైలకు ఇది హెల్ప్ అవ్వడమే కాకుండా ఆహారంతోనే సులభంగా అందర్నీ ఒకచోటకు చేర్చగలమని దీన్ని ప్రారంభించినట్లు వివరించింది. మొదట్లో కొంతమంది స్నేహితులతో ప్రారంభించామని, ఆ తర్వాత టిక్కెట్టు పొందాక సప్పర్ క్లబ్గా మారిందని చెప్పుకొచ్చింది. కొన్ని ఈవెంట్ల తర్వాత ప్రతి మొదటి పదినిమిషాలు చాలా ముఖ్యమైనవి అర్థమైందో దాంతో ..పానీపూరిని ఐస్ బ్రేకర్గా పరిచయం చేశాం. అలా ప్రతి విందులో ఇది సిగ్నేచర్ విందుగా పానీపూరితోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది అంకిత. నెలకు సుమారు పది నుంచి 12 మంది ఆతిథ్యం ఇస్తామని..ఇక్కడ ఏడు కోర్సుల ఇండియన్-ఫ్యూజన్ మెనూను అందిస్తున్నట్లు వెల్లడించింది. టికెట్ట ధర ఒక్కొక్కరికి రూ. 6000. అయితే ఈ జంట ఎంత టర్నోవర్ వస్తుందో మాత్రం వెల్లడించలేదు. పండుగ సమయల్లో ఆ పండు నేపథ్య సిరీస్తో ఫుడ్ని అందిస్తారట కూడా. అంతేగాదు తాము ఐఐటీ గ్రాడ్యుయేట్లు కావడంతోనే వేగంగా అర్థంచేసుకోవడం, రిస్క్ తీసుకోవడం వంటివి చేయగలిగామని సగర్వంగా చెబుతోంది అంకిత. సప్పర్ క్లబ్ అంటే ఏమిటి?ప్రైవేట్ డిన్నర్ పార్టీ, రెస్టారెంట్కి మాధ్యమంగా ఉంటుంది ఈ సప్పర్ క్లబ్. దీన్ని సామాజికి భోజన అనుభవంగా చెప్పొచ్చు. విభిన్న నేపథ్యాలున్న వ్యక్తులంతా ఒకచోట చేరి హాయిగా నచ్చిన ఆహారాన్ని ఆస్వాదించే అనుభూతిని అందిస్తుంది. రెస్టారెంట్లో కూడా ఇలానే ఉన్నా..అక్కడ వేరువేరుగా డైనింగ్ టేబుల్పై కూర్చొని ఆస్వాదిస్తాం. ఇక్కడ అలా కాదు ఒకచోట సమావేశమైన వ్యక్తుల్లా సహపంక్తి భోజనంలా తింటారు ఈ సప్పర్ క్లబ్లో. (చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..)
మన ‘స్వీటు’ హాటు!
ఆహార పదార్థాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంలో వివిధ రకాల స్వీట్లు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ స్వీట్లకూ నగరంలో భారీ డిమాండ్ ఉంది. అయితే వీటిలో కొన్నింటిపై బంగారం, వెండి పూతతో ఆకర్షణీయమైన స్వీట్లు తయారు చేస్తుంటారు. విలాసవంతమైన జీవన శైలిలో భాగంగా వీటిని తినేందుకు ఆసక్తి చూపుస్తుంటారు నగరవాసులు. అయితే ఈ పూతలో అసలైన మెంటల్స్ కాకుండా వాటికి ప్రత్యామ్నాయంగా వేరే లోహాలను వినియోగిస్తున్నారు. తళుక్కున మెరుస్తూ ఎంతో ఆకర్షణీయంగా కనిపించే వివిధ రకాల స్వీట్ల మెరుపుల వెనుక ఉన్నది అసలైన లోహాలేనా? బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ఇది సాధ్యమేనా? ప్రత్యామ్నాయ పూతలో ఉండే లోహాలేంటి? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగి నష్టాలేంటి? తెలుసుకుందాం.. హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. పండుగలకు, శుభకార్యాలకు నోరూరించే స్వీట్లూ ఫేమస్సే. ముఖ్యంగా వింధులో వెండి పూతతో మెరిసే స్వీట్లను విలాసవంతమైన జీవన శైలిలో భాగంగా భావిస్తుంటారు. కాజూ కత్లీ నుంచి మోతీచూర్ లడ్డూ వరకు.. మెరిసే వెండి పూత లేకపోతే ఆ స్వీట్కు సంపూర్ణత లేదన్న భావన చాలా మందిలో ఉంది. అయితే ఇటీవల కాలంలో స్వీట్ షాపుల కౌంటర్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దీనికి కారణం మిఠాయి రుచిలో మార్పు కాదుం.. వెండి ధరల పెరుగుదలంతో ధరల్లోనూ భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఫలితంగా పూత (సిల్వర్ వర్క్) తయారీ ఖర్చు పెరిగింది. ఇది నేరుగా స్వీట్ ధరలపై ప్రభావం చూపుతోంది. పూత ఐచ్ఛికమే.. ఇప్పటి వరకూ బంగారం, వెండి పూత స్వీట్స్ అనేవి సాధారణమే. పండుగ, శుభకార్యాల ఆర్డర్లలో ఇవి తప్పనిసరి ఐనప్పటికీ ఈ పూత గురించి అంతంగా ఆలోచించేవారు కాదు. కానీ ఇకపై పూత ఐచ్ఛికం కానుంది. అదనపు చార్జ్లతో మాత్రమే వీటిపూత అందుబాటులో ఉండనుందని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. స్వీట్ వ్యాపారులు కూడా ఖర్చు – లాభం మధ్య సమతుల్యతతో లోహాల వినియోగాన్ని తగ్గిస్తున్నామని చెబుతున్నారు. ఐతే కొన్నిచోట్ల పూర్తిగా మానేశారు. ఉల్లి రేటు పెరిగినప్పుడు బిర్యానీలోకి ఆనియన్ సలాడ్ తగ్గినట్టే, బంగారం, వెండి ధరల పెరుగుదలతో స్వీట్లపై మెరుపు తగ్గుతోంది. శరీరానికి అవసరమా? చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే.. ‘బంగారం, వెండి వంటి లోహాలు శరీరానికి మంచిది’ అనుకుంటారు. వాస్తవానికి బంగారం, వెండి పూతతోగానీ, ఆ లోహంతోగానీ మన శరీరానికి ఎటువంటి ఉపయోగమూలేదు. శరీరానికి అవసరమైన ఖనిజాల జాబితాలో బంగారం, వెండి వంటివి లేవు. అలా అని పోషకాహారమూ కాదు. అయితే చిన్న మోతాదులో బంగారం, వెండి విషపూరితం కాదు. జీర్ణాశయంపై∙ ఎటువంటి ప్రభావం చూపదు. అయితే మోతాదు మించితే ప్రమాదం అంటున్నారు వైద్యులు. దీనికి తోడు ఈ పూతలో ఈ175 అనే పదార్థాన్ని వినియోగిస్తారు. ఇది ఒక మైక్రాన్ని మించి ఉండకూడదు.ఉపయోగం ఉందా.. ?అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. బంగారం, వెండిలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ లక్షణం కారణంగా స్వీట్లు త్వరగా పాడవ్వవు. అందుకే స్వీట్లపై ఈ తరహా పూత పూస్తుంటారు. అయితే ఇది ఆరోగ్య అవసరం కాదని మనం గ్రహించాలి. కేవలం ఇదో అలంకరణ మాత్రమే. ఈ లోహాలను తీసుకోవడం వల్ల కేలరీలు, విటమిన్లు, న్యూట్రిషనల్ వేల్యూస్ ఏమీ ఉండవని గ్రహించాలి. అయితే కొందరు నిర్వాహకులు తక్కువ ధరకు దొరికే పూతను వినియోగిస్తున్నారు. ఇందులో అల్యూమినియం, నికిల్, లెడ్ వంటి ప్రమాదకరమైన లోహాలను వినియోగిస్తున్నారు. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రత్యామ్నాయ డెకరేషన్.. ఆరోగ్యంపై స్పృహ పెరగడంతో గత కొంతకాలంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు పలువురు వినియోగదరులు, నిర్వాహకులు. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్ డెకొరేషన్, చాక్లెట్ కోటింగ్, నేచురల్ కలర్స్, ఫ్యూజన్ స్వీట్లు..!! అంటే వెండి మెరుపు స్థానంలో డిజైన్, ఇన్నోవేషన్కు చోటు కల్పిస్తున్నారు.స్వీట్లపై ఉండేది నిజమైన లోహాలేనా? వాస్తవానికి స్వీట్లపై ఉండేది నిజమైన బంగారం, వెండేనా..?! అన్న ప్రశ్న మనలో ఎంతమందికి వచి్చంది. స్వీట్లపై వాడే పూతను గోల్డ్, సిల్వర్ వర్క్ (చాంద్ కా వర్క్) అంటారు. అయితే దీనికి ఫుడ్–గ్రేడ్ గోల్డ్, సిల్వర్ వర్క్ 99 శాతం శుద్ధమైన బంగారం, వెండి వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది అతి సూక్ష్మమైన (మైక్రాన్లు) లోహంతో పలుచగా ఉంటుంది. ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం దీనిని తయారు చేస్తారు. అయితే గతంలో కొన్ని చోట్ల అల్యూమినియం, నకిలీ మెటాలిక్ షీట్స్, ఇండ్రస్టియల్ ఫాయిల్ వాడిన ఘటనలూ లేకపోలేదు.లైఫ్స్టైల్లో మెరుపులకు ప్రాధాన్యం..హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఫుడ్ అనేది కేవలం ఆకలి తీర్చడమే కాదు.. ఇదో స్టేటస్ సింబల్గా మారిపోయింది. వెండి, బంగారు పూత ఉన్న స్వీట్ అంటే ఆ ప్రత్యేకతే వేరు అన్నట్లు కొందరి ఆలోచనా సరళి ఉంది. ఇదొక ఖరీదైన గిఫ్ట్గా గుర్తింపు పొందడంతో పాటు శుభకార్యాల్లోనూ ఆర్భాటానికి ప్రతిగా నిలుస్తోంది. అందుకే వెండిపూత లేకపోతే రుచి మారకపోయినా, విలాసం తగ్గిన భావన వినియోగదారుల్లో కలుగకమానదు.
తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారా..!?
చాలామంది తరుచుగా ఉద్యోగాలు మారుతుంటారు. ముఖ్యంగా 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువత తరుచుగా జాబ్లు మారుతుంటారు. దాంతో చాలామంది ఈ ఉద్యోగంలోనైన ఎన్నాళ్లు ఉంటాడో అని విమర్శిస్తుంటారు. అయితే ఇలా విమర్శించడాన్ని తప్పుపడుతున్నారు పీపుల్ గ్రూప్ అండ్ షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు , సీఈవో అనుపమ్ మిట్లల్. ఇలా మారడాన్ని ఆయన సరైన స్ట్రాటజీగా అభివర్ణించారు కూడా. పైగా యువత సరిగ్గానే చేస్తుందని కితాబిచ్చేస్తున్నారు కూడా. చాలామంది నిపుణులు కూడా ఎక్కడ స్థిరంగా పనిచేయకపోతే అనుభవం ఎలా వస్తుందంటూ..ఉద్యోగాలు మారుతుండే వాళ్లని తిడుతుంటారు. కానీ మిట్టల్ మాత్రం ఇది సరైనదే అంటున్నారు. మరి అది ఏవిధంగానో ఆయన మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!జెన్జెడ్ తరుచుగా ఉద్యోగాలను మార్చడంపై సీఈవో అనుమపమ్ మిట్టల్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ..ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. జెన్జెడ్ తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారని కెరీర్ నిపుణులు తప్పుపడుతుంటారు. కానీ దీన్ని డేటింగ్లా తీసుకోండి అంటున్నారు అనుపమ్. స్థిరంగా ఒక చోట ఉద్యోగం చేయడాన్ని వివాహంగా భావిస్తే..ఈ తరం యువత తమకు నచ్చిన రంగంలో అభిరుచి వెతుక్కుంటూ చేస్తున్న అన్వేషణే ఇది అని అంటున్నారాయన. ఇలా ఉద్యోగాలు మారుతు తమకు నచ్చిన రంగాన్ని వెతుక్కుంటున్నారని అన్నారు. ఈ యువ నిపుణుల తమకు ఏ రంగాలు, ఎందులో తాము సరిపోతామో అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఇది అని అంటున్నారు. దీన్ని నమ్మకద్రోహం కిందకు చూడొద్దని, ఆత్మపరిశీలనకు సంబంధించిన అన్వేషణగా అభివర్ణించారాయన. చాలామంది కెరీర్ నిపుణులు దీన్ని తప్పుగా చూస్తున్నారు గానీ.. యువత సరిగ్గా చేయాల్సింది ఇదే కదా అన్నారు. నిజానికి జెన్జెడ్లో చాలామంది కెరీర్ ప్రారంభదశలో ఉన్న నిపుణులే. ఈ తరం ఒత్తిడి కంటే మానసిక శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తోంది. పైగా వాళ్లు కార్పోరేట్ నిచ్చెన ఎక్కడం కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై దృష్టి పెడతారని పలు సర్వేలు కూడా పేర్కొన్నాయని గుర్తుచేశారు. అందువల్ల ఈ తరం చేస్తుంది ముమ్మాటికి కరెక్టేనని అన్నారు. అంతేగాదు 21-24 ఏళ్ల మధ్య ఉద్యోగాలు మారడం సరైనదేనని, 25 ఏళ్ల తర్వాత మాత్రం స్థిరంగా ఒకచోట పనిచేయాలని అనుపమ్ సూచించారు. అంతేగాదు ఉద్యోగం మారాక, దాని గురించి ఆలోచించకండి, చింతికండి అని చెబుతున్నారు అనుపమ్. తాను టీమ్ లీడర్గా ఉన్నప్పుడూ..ఉద్యోగాల నియామక ప్రక్రియలో చాలా క్లియర్గా ఉండేవాడినని, అభ్యర్థికి కనీసం 4 నుంచి 5 ఏళ్లు అనుభవం లేకపోతే నిర్థాక్షిణ్యంగా రిజెక్ట్ చేసేవాడినని అన్నారు. అలాగే ఇలా ఉద్యోగాలు మారడం వల్ల కొత్తదనం తెలియడమే కాకుండా, దాని పర్యవసానాలపై అవగాహన, అనుభవం ఏర్పడుతుందని కూడా నొక్కి చెప్పారు. ఈ పోస్ట్ చాలామంది యువతను ఆకర్షించడమే గాక మాకు ఇది సరైన మార్గనిర్దేశం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..)
అంతర్జాతీయం
అరేబియా సముద్రంలో టెన్షన్.. ఇరాన్ డ్రోన్ను కూల్చిసిన అమెరికా
అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా అని స్థితికి ప్రస్తుతం పరిస్థితులు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలో ఇరాన్ డ్రోన్ను అమెరికా జెట్ కూల్చివేసింది.ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది అణు ఒప్పందంపై చర్చలకోసం ఇరాన్కు ఆహ్వానం పంపామన్నారు. త్వరలో టర్కీ ఇస్తాంబుల్లో ఆ చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇరాన్ సైతం ఇదివరకే చర్చలకు సముఖమే అని ప్రకటించడంతో ఇక పరిస్థితులు సద్ధుమణుగుతాయి అనుకున్నారు. అయితే ఇంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. అరేబియా సముద్రంలో ఇరాన్ డ్రోన్ను అమెరికా కూల్చివేసింది..ఇరాన్కు చెందిన షహెద్-139 అనే డ్రోన్ అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్కు దగ్గరగా ఎగరింది. దీంతో అమెరికా బలగాలు ఎఫ్-35 జెట్తో దానిని కూల్చివేశాయి. అయితే డ్రోన్ వాహన నౌకకు సమీపంగా రావడంతో ఆత్మరక్షణ కోసం దానిని కూల్చివేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.అయితే అమెరికా యుద్ధనౌక అబ్రహం లింకన్ బయిలు దేరిందని, అణు ఒప్పందంపై ఇరాన్ తగ్గకపోతే వెనిజువెలా దాడిని మించి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తమపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఖమేనీ హెచ్చరించారు. ఈ దాడి నేపథ్యంలో ఏం జరగనుందా అనే ఆందోళన మెుదలైంది.
తాలిబన్ల కఠిన ఆంక్షలు.. దిక్కులేక ఇంటివద్దే ప్రసవాలు
అఫ్గానిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్కడి మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాలిబన్లు తీసుకున్న నిర్ణయాలు అక్కడ ఇప్పుడు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఆ దేశంలో గర్భ నిరోధక మాత్రలు అమ్మడంపై తాలిబన్లు నిషేదం విధించారు. దీంతో అక్కడి డాక్టర్లు గర్భస్రావం కలిగించకుండా కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలతో అక్కడ ప్రసవాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రసవాలకు ఆసుపత్రుల కొరత ఏర్పడడంతో సరైనంతమంది డాక్టర్లు లేకపోవడంతో చాలా మంది ఇంటివద్దే అధికంగా ప్రసవాలు జరుగుతన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.చిన్న వయసులోనే అక్కడి బాలికలకు పెళ్లిళ్లు చేస్తుండడంతో చాలా మంది పోషాకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వారందరికి సరైన వైద్యం అందకపోవడంతో గర్భిణిలు స్వంతంగా వైద్యం చేసుకుంటున్నట్లు అక్కడి కథనాలు పేర్కొన్నాయి. 12 ఏళ్లు దాటిన తర్వాత బాలికలకు చదువు నిషిద్దం. బాలికలు బయిటకు వెళ్లి పనులు చేయకూడదు. వాటిలో కొన్ని ఏదైనా వ్యాపార సముదాయాలపై మహిళల ఫోటోలు ప్రదర్శించడం నిషిద్దం. పురుషుడు లేకుండా మహిళలు ఒంటరిగా బయిటకి వెళ్లకూడదు. డ్రైవింగ్ లైసెన్సులు మహిళలకు ఉండవు. ఇలా కఠిన మైన ఆంక్షలు అక్కడి మహిళలపై తాలిబన్లు విధిస్తారు. దీంతో కొత్తగా ఆ దేశంలో మహిళలు వైద్యులయ్యే అవకాశం సైతం చాలా తగ్గింది.
ఎడారిలో ఎనిమిదేళ్ల చిన్నారి... 15 కిలోమీటర్లు నడక
మస్కట్లో ఓఎనిమిదేళ్ల బాలుడు మృత్యువును జయించాడు. ఉత్తర షర్కియాలోని బిడియా ప్రాంతంలోని ఎడారిలో బాలుడు తప్పిపోయాడు.15 కిలోమీటర్లు ఏకాకిగా తీవ్రమైన ఉష్ణోగ్రతలో నడిచిన చిన్నారి ఎట్టకేలకు అక్కడి అధికారులకు దొరికాడు. సాధారణంగా ఎండాకాలంలో ఇసుకలో నడిస్తేనే ఆ ఉష్ణోగ్రతను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అదే ఏడారి ప్రాంతంలో అయితే ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దప్పిక, తీవ్రమైన వేడిమి, ఎక్కడ ముగింపు ఉంటుందో తెలియదు. ఇక ఆ ఆలోచనే ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. ఒమన్ దేశం మస్కట్లో చిక్కుకపోయిన ఓ ఎనిమిదేళ్ల చిన్నారి. ఎవరికి తెలియని దారిలో దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఎండ, వేడిమిని భరిస్తూ దాహాన్ని తట్టుకుంటూ ఒంటరిగా పయణించాడు. ఎటువంటి ప్రమాదం లేకుండా ఎట్టకేలకు సురక్షితంగా బయిటపడ్డాడు.తమ పిల్లాడు ఎడారిలో తప్పిపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉత్తర షర్కియా భద్రత విభాగం వెంటనే అప్రమత్తమై తప్పిపోయిన బాలుడి కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టింది. సివిల్ డిఫెన్స్ అంబులెన్స్ అథారిటీ ప్రకారం దాదాపు ఎనిమిది ఎనిమిది గంటల పాటు శ్రమించిన తర్పాత ఎట్టకేలకు ఆ బాలుడి జాడను అధికారులు కనుగొన్నారు.అంత కఠినమైన ఏడారిలో నీరు లేకుండా, ఎండ వేడిమిని తట్టుకొని ఆ చిన్నారి దాదాపు 15 కిలోమీటర్ల నడిచినట్లు తెలిపారు. అయితే విహారయాత్రలకు వెళ్లినప్పడు గానీ క్యాంపు ఫైర్ చేసిన ప్రాంతాలకు పిల్లలను తీసుకెళ్లినప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు పేర్కొన్నారు.
మహిళలపై ఇరాన్ ప్రతీకారం.. జైళ్లలో అత్యాచారాలు?
ఇరాన్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అక్కడి సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో వారిని అక్కడి ప్రభుత్వం బంధించి జైళ్లలో వేసింది. అయితే కారాగారాలలో వారిపై అత్యాచారం చేసి హతమారుస్తున్నారని ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. వారిలో కొంతమంది హిజాబ్ తొలగించి సిగరెట్తో ఖమేనీ ఫోటోకు నిప్పంటిస్తూ నిరసనలు తెలిపారు. దీంతో అక్కడి భద్రతా బలగాలు వారిని అరెస్టు చేశాయి. తాజాగా ఖమేనీ ప్రభుత్వం వారిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.ఇరాన్-జర్మన్ జర్నలిస్టు మిచెల్ అబ్దోల్లాహి ఇరాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరాన్ ప్రభుత్వంపై నిరసన చేసిన మహిళలపై జైళ్లలో అత్యాచారాలు చేస్తున్నారని, వారిని అంగవైకల్యానికి గురిచేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా సిగరెట్లతో కాల్చుతూ చిత్రవధలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు గర్భం దాల్చితే వాటిని తొలగిస్తున్నారని పేర్కొన్నారు.అయితే వారు పెడుతున్న హింసల్ని తట్టుకోలేక మరణిస్తే మరణిస్తే వారి మృత దేహాలను ఎవరికి తెలియకుండా కాల్చి వేస్తున్నారని తెలిపారు. జైళ్లలో హింస జరుగుతున్న సంగతి ఎవరికి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా చేస్తున్నారని జర్నలిస్టు పేర్కొన్నారు. అయితే ఇరాన్లో జరిగిన ఆందోళనల కారణంగా దాదాపు ఐదువేల మంది పౌరులు మృతిచెందిన సంగతి తెలిసిందే.
జాతీయం
మామ ఆస్తుల వివరాల్ని అల్లుడికి ఇవ్వలేం
లక్నో: మామ వ్యక్తిగత వివరాలైన వేతనం, ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారాన్ని సహ చట్టం కింద అతడి అల్లుడికి ఇవ్వలేమని యూపీ సమాచార హక్కు కమిషన్ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర కమిషనర్ మహ్మద్ నదీమ్ జనవరి 7వ తేదీన జారీ చేసిన ఆదేశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రైవేట్ కోర్టు కేసులకు అవసరమైన ఆధారాలను అందించడం, వ్యక్తిగత గోప్యతలో జోక్యం చేసుకోవడం సహచట్టం ఉద్దేశం కాదని స్పష్టత ఇచ్చారు. ఆస్తులు, వేతనం, పింఛను తదితర వ్యక్తిగత వివరాలను వేరెవ్వరికీ ఇవ్వరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందంటూ గుర్తు చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసి 2015 జనవరి ఒకటో తేదీన రిటైరైన రిషిపాల్ సింగ్ ఆస్తులు, పింఛను వివరాలను అందజేయాలంటూ కుల్వంత్ సింగ్ అనే వ్యక్తి బిజ్నోర్ జిల్లా నజిబాబాద్ తహశీల్దార్కు 2025 జూలై 27వ తేదీన సహచట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. రిషిపాల్ సింగ్ కుమార్తె భర్త, సొంత అల్లుడే కుల్వంత్ సింగ్. రూ.26 లక్షల కట్నం కోసం వేధిస్తున్నానంటూ భార్య తనపై కట్నం వేధింపుల కేసు పెట్టిందని, ఈ కేసుకు మామ ఆర్థిక స్థితిగతుల వివరాలు అవసరమని అతడు పేర్కొన్నాడు. ఈ దరఖాస్తుపై నజిబాబాద్ తహశీల్దార్ సమాధానమివ్వలేదు. దీంతో, కుల్వంత్ సింగ్ రాష్ట్ర సమాచార కమిషన్ను ఆశ్రయించాడు. ‘ఈ సమాచారం కోరిన వ్యక్తి బయటి వాడు కాదు, అతడి సొంతల్లుడే. ఈ సమాచారం వ్యక్తిగత అవసరాల కోసమే తప్ప, విస్తృత ప్రజా ప్రయోజనం కోసం మాత్రం కాదు. పైపెచ్చు ఇది కట్నం వేధింపుల కేసు. మామ తనకు రూ.26 లక్షలు ఇవ్వగల సత్తా ఉండి కూడా కుమార్తెతో వేధింపుల కేసు పెట్టించాడని వాదించేందుకు దీనిని వాడుకోవాలనుకున్నాడు. అందుకే అతడి దరఖాస్తును తిరస్కరించాం’అని రాష్ట్ర సహ కమిషనర్ నదీమ్ చెప్పారు. అంతగా కావాలంటే అతడు కోర్టుకు వెళ్లవచ్చన్నారు. కోర్టు అంగీకారంతో సంబంధిత అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని పొందవచ్చని వివరించారు.
ప్రకృతి అద్భుతం.. లడఖ్ లో మంచు చిరుతలు..!
లడఖ్ నుండి వచ్చిన ఒక అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. హిమాలయ పర్వతాలలో మంచు చిరుత తన కుటుంబంతో పరుగులు పెడుతూ కనిపించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) షేర్ చేసిన ఈ అరుదైన 43 సెకన్ల క్లిప్ లక్షలాది మంది జంతు ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. లడఖ్ నుండి వచ్చిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.మంచు చిరుతలను “పర్వతాల దెయ్యాలు” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అవి రాళ్ళు, మంచులో పూర్తిగా కలిసిపోతాయి. వాటిని ఇలా చూడటం దాదాపు అసాధ్యం..!ప్రఖ్యాత IFS అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను సోషల్ మీడియా X లో షేర్ చేశారు. ఒక విషయాన్ని ప్రస్తావించారు. “పర్వతాల దెయ్యాలు.. ఈ ప్రాణాంతకమైన హిమాలయాల మంచుల్లో పరుగెడుతున్నాయో.. ఈ మంచు దయ్యాలు అని పిలవబడే మంచు చిరుతపులులను మన భారత సైన్యాన్ని చూడవచ్చు” అని రాశారు.మంచులోనూ, మైదానాల్లోనూ జీవించే సామర్థ్యం వీటికి సొంతం. వాటిల్లాగే విధులు నిర్వహిస్తున్న భారత్ సైన్యానికి సాధ్యం. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా, మనుగడ అసాధ్యం అనిపించే ఈ మంచు ఏడారి ప్రాంతాల్లో ఉంటూ భారతదేశాన్ని రక్షించే సైనికులకు నివాళి. అంటూ IFS అధికారి పర్వీన్ కస్వాన్ పేర్కొన్నారు. మరోవైపు, IAS అధికారిణి సుప్రియా సాహు దీనిని “ప్యూర్ వైల్డ్ జాయ్” అని పేర్కొన్నారు. “ఈ అద్భుతమైన జీవులు మంచు మధ్య కనిపించినప్పుడు, నిర్జీవ పర్వతాలు ప్రాణం పోసుకున్నట్లుగా ఉంటుంది. ఈ దృశ్యం నిజంగా ఆత్మను ఓదార్చుతుంది.” అని రాశారు.ఈ వీడియో ద్వారా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రపంచానికి ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపింది. రోడ్డు నిర్మాణం, ప్రకృతి పరిరక్షణ ఒకేసారి సాధ్యమని వివరించారు.“మేము రోడ్లు నిర్మిస్తాము, కానీ మూగ జీవుల ఇళ్లను ధ్వంసం చేయకుండా, వాటిని సంరక్షించడం ద్వారా” అని వివరించింది.ఇదిలావుంటే, ప్రపంచ వన్యప్రాణి నిధి (WWF) ప్రకారం, భారత ప్రభుత్వం హిమాలయాల ఎత్తైన పర్వత ప్రాంతాలలో మంచు చిరుతను ఒక ప్రధాన జాతిగా గుర్తించింది. తాజా నివేదిక (SPAI) ప్రకారం, భారతదేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నాయి. వీటిలో, లడఖ్లో మాత్రమే అత్యధిక సంఖ్యలో 477 మంచు చిరుతలు జీవిస్తున్నాయి.ఈ అరుదైన వీడియో ద్వారా లడఖ్ మంచు పర్వతాల అద్భుతం, ప్రకృతి సంరక్షణ అవసరం, మరియు మన దేశ సైన్య రక్షణ సామర్థ్యం ఒకేసారి చూపించబడుతోంది.
సీఈసీని అభిశంసించాలి
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను అభిశంసించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. ఆయనపై అభిశంసనకు తీర్మానం ప్రవేశపెడితే తాము కచి్చతంగా మద్దతిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఇతర విపక్ష పారీ్టలు సైతం ముందుకు రావాలని కోరారు. ఆమె మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బెంగాల్లో తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ముసుగులో తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు సీఈసీని జబాబుదారీ చేస్తూ చట్టం తీసుకురావాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన సూచనను మమతా బెనర్జీ గట్టిగా సమర్థించారు. ఇప్పుడు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను అభిశంసించాలని తేల్చిచెప్పారు. ఈ దిశగా కాంగ్రెస్ ముందడుగు వేస్తే మద్దతిస్తామని అన్నారు. ఓట్లు తొలగిస్తే బాధితులు ఎక్కడికెళ్లాలి? బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. ఎన్నికల సంఘాన్ని వాడుకోకుండా తమతో ముఖాముఖి తలపడాలని బీజేపీకి సవాలు విసిరారు. బెంగాల్లో ఎస్ఐఆర్ వల్ల దళితులు, గిరిజనులు, మైనారీ్టలు, అణగారినవర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని, వారి ఓట్లు రద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్ఐఆర్తో తొలగింపునకు గురైన ఓట్లు వందశాతం తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులవేనని చెప్పారు. బీజేపీపై అనుమానం రాకుండా ఒకటి రెండు ఓట్లు ఇతర పారీ్టల మద్దతుదారులవి కూడా తొలగించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఓట్లు తొలగిస్తే వారంతా ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు. నేడు సుప్రీంకోర్టులో విచారణకు మమత హాజరు! బెంగాల్లో ఎస్ఐఆర్ చేపట్టడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
లోక్సభలో అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకం ఉదంతంపై సోమవారం సభలో రేగిన వివాదం మంగళవారం కూడా కొనసాగింది. దానిపై తనను మాట్లాడనివ్వాలంటూ విపక్ష నేత రాహుల్గాంధీ పట్టుబట్టారు. అందుకు సభాపతి అనుమతించకపోవడంతో కాంగ్రెస్తో పాటు ఇతర విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. నినాదాలతో సభను హోరెత్తించారు. కాగితాలను చించి స్పీకర్ కేసి విసిరారు. పోడియంపైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ ఉదంతం చివరికి ఎనిమిది మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్కు దారితీసింది. ఉదయం నుంచే... మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగా నే రాహుల్గాంధీ మాట్లాడారు. 2020 నాటి భారత్, చైనా ఘర్షణకు సంబంధించి నాటి ఆర్మీ చీఫ్ నరవణె తన పుస్తకంలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఓ మేగజైన్లో వచి్చన వ్యాసాన్ని సోమవారం ఆయన సభలో ఉటంకించడం, అందుకు స్పీకర్ బిర్లా అభ్యంతరం తెలపడం తెలిసిందే. స్పీకర్ సూచించిన మేరకు సదరు వ్యాసాన్ని తాను ధ్రువీకరిస్తున్నట్టు మంగళవారం రాహుల్ సభలో ప్రకటించారు. ఈ మేరకు దానిపై తాను సంతకం చేసిన కాపీని సమరి్పంచారు. దాన్ని పరిశీలించాక స్పందిస్తానని సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు.అయినా నరవణె అంశంపై మాట్లాడేందుకు రాహుల్ తిరిగి ప్రయత్నించారు. దాంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ ఒకసారి రూలింగ్ ఇచ్చాక అదే అంశాన్ని పదేపదే లేవనెత్తకుండా అక్కడితో వదిలేయాలని సూచించారు. తాను విపక్ష నేతనని, మాట్లాడేందుకు అనుమతి కోరాల్సిన అవసరం లేదని రాహుల్ బదులిచ్చారు. మేగజైన్లోని అంశంపై మాట్లాడి తీరతానని పట్టుబట్టారు. ప్యానెల్ స్పీకర్ మాత్రం ఇతర విపక్ష సభ్యులను మాట్లాడాల్సిందిగా కోరారు. కానీ వరుసగా ముగ్గురు సభ్యులు మాట్లాడేందుకు నిరాకరించారు. తద్వారా రాహుల్కు సంఘీభావం ప్రకటించారు. దాంతో ఎన్డీఏ భాగస్వామి టీడీపీకి చెందిన హరీశ్ బాలయోగిని మాట్లాడాల్సిందిగా ప్యానెల్ స్పీకర్ కోరారు.ఆయన మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో సభ పదేపదే వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోగా విపక్ష సభ్యులు కాగితాలు చించి స్పీకర్ కేసి విసిరారు. పోడియంపైకి, లోక్సభ సెక్రెటరీ జనరల్ టేబుల్పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. దాంతో తీవ్ర గందరగోళం నడుమ సభ మరోసారి వాయిదా పడింది. మధ్యాహ్నం మూడింటికి సభ తిరిగి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా నేరుగా ఎనిమిది మంది విపక్ష సభ్యులు గుర్జీత్సింగ్ ఔజ్లా, హబీ ఈడెన్, సి.కిరణ్కుమార్రెడ్డి, అమరీందర్సింగ్ రజా వారింగ్, మాణిక్కం ఠాగూర్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియకోసే (కాంగ్రెస్), ఎస్.వెంకటేశన్ (సీపీ ఎం) పేర్లు చదివి విని్పంచారు. వారిని సస్పెండ్ చేయాల్సిందిగా రిజిజు తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు సభ పట్ల, సభాపతి అధికారాల పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆక్షేపించారు. తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. 8 మంది సభ్యులను ఏప్రిల్ 2న బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. విపక్ష ఎంపీలు రాహుల్ నేతృత్వంలో పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు.ప్రజాస్వామ్యానికి తీరని మచ్చస్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ లేఖజాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై విపక్ష నేతను లోక్సభలో మాట్లాడకుండా అడ్డుకోవ డం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని రాహుల్గాంధీ మండిపడ్డారు. సభాపతి స్థానంలో ఉన్నవారు సోమ, మంగళవారాల్లో తనతో ప్రవర్తించిన తీరును తీవ్రంగా నిరసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాహుల్ అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే స్పీకర్ నన్ను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఇలా జరగడం మన పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారి!’’ అంటూ మండిపడ్డారు.
ఎన్ఆర్ఐ
90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!
చాలామంది భారతీయ యువత డ్రీమ్ అమెరికా. కానీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ఆ కలలన్నీ దాదాపు కనుమరుగనే చెప్పాలి. అయినా కూడా అమెరికా అంటే మోజు మాములుగా ఉండదు. అక్కడ ఉండే సౌకర్యాలు, ఉన్నత చదువులు, మంచి వేతనం తదితరాల రీత్యా ఆ దేశం అంటే మహా మక్కువ చాలామంది యువతకు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అక్కడకు అడుగుపెడితేగానీ అసలు విషయం అవగతమవ్వదు. బహుశా అప్పటికి గానీ జన్మభూమికి మించిన స్వర్గసీమ మరొకటి లేదని తెలిసిరాదేమో. సౌకర్యాలు, జీతాలు పరంగా బాగున్నా..కొన్ని విషయాలు చూడగానే మన దేశం కచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఓ ఎన్నారై ఎదుర్కొన్నాడు. ఇదేం అమెరికా లైఫ్ అంటూ బాధపడుతున్నాడు. అసలేం జరిగిందంటే..ప్రవాస భారతీయుడు పార్థ్ విజయ వర్గియాకు ఐస్ స్కేటింగ్ చేస్తుండగా చిన్న గాయమైంది. అయితే అక్కడ అంబులెన్స్కి అయ్యే అధిక ఖర్చుకి భయపడి..నొప్పి భరిస్తూ మరి తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ రూమ్లో చికిత్స పొందాడు. అయితే ఆ ఎమర్జెన్సీ రూంలో గడిపింది జస్ట్ 90 నిమిషాలే..దానికే మనోడుకి వేసిన బిల్లు చూస్తే..కళ్లు బైర్లుకమ్ముతాయ్. పాపం ఇక్కడ వర్గియాకు కూడా ఆ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి కళ్లుగిర్రున తిరిగాయి. ఏడుపు ఒక్కటే తక్కువ అన్నంత పనైంది. ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా తన బాధనంతో ఓ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ వర్గియాకు ఎంత బిల్లు వేశారంటే..అక్షరాల రూ. 1.5 లక్షలు. సర్జరీ లేదు ఏం లేదు..జస్ట్ కొద్దిపాటి ట్రీట్మెంట్కి గుబగుయ్యిమనిపించేలా బిల్లు వేసింది ఆస్పత్రి. అదృష్టం ఏంటంటే వర్గియాకు హెల్త్ ఇన్సురెన్సూ ఉండటంతో అది క్లైయిమ్ చేసుకున్నాడు లేండీ. అలా క్లైయిమ్ చేసుకునేటప్పుడే వర్గియాకు తెలిసింది తన వైద్యానికి అంత ఖర్చు అయ్యిందని. తనకు సుమారు రూ. 3.5 లక్షలపైనే హెల్త్ ఇన్సురెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది అంటూ బావురమన్నాడు. అందుకే అమెరికా..అమెరికా..అంటు సంబరపడొద్దు..ఇక్కడ జీవితం చాలా ఖరీదైనది అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ అధిక జీతానికి తగ్గట్టు..ఖర్చులు కూడాను అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Parth Vijayvergiya (@parthvijayvergiya) (చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్గా ఉంటోంది..!)
అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి బిగ్ అలర్ట్!
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక చేసిన మొదటి పని.. వలసవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తరపున ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అన్లిమిటెడ్ పవర్ కట్టబెట్టారు. అమెరికా భద్రత పేరిట లైంగిక దాడులు, గృహ హింస, మాదక ద్రవ్యాల కేసులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడినవారిని ఐస్ లోకల్ పోలీసులతో గుర్తించి అరెస్టులు చేసి చర్యలు తీసుకునేది. అయితే ఇప్పుడు ఆ దృష్టి పార్ట్టైం జాబులు చేసే భారతీయ విద్యార్థులు.. ప్రొఫెషనల్ జాబులు చేసేవాళ్లపైకి మళ్లడం ఇండియన్ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది..తాజాగా.. మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్లోని ఒక భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఐస్ (Immigration and Customs Enforcement) అధికారులు అరెస్టు చేశారు. అలాగే.. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగిని ఏకంగా కంపెనీలోకి వెళ్లి మరీ బేడీలు వేసి లాళ్లినట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ఈ రెండు కేసుల్లో తమ వద్ద అధికారిక ప్రతాలు చూపించినా.. తమకేం తెలియదని వాళ్లు ఎంత మొత్తుకున్నా అక్కడి అధికారులు వినలేదు. అధ్వాన్నమైన పరిస్థితులు ఉండే డిటెన్షన్ సెంటర్లో గంటల తరబడి కూర్చోబెట్టి.. చివరాఖరికి పంపించేశారు.అమెరికాకు ఉన్నత విద్య కోసం భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వెళ్తుంటారు. ముఖ్యంగా F1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు ఖర్చులు తీర్చుకోవడానికి పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే, అమెరికా వీసా నిబంధనల ప్రకారం క్యాంపస్ వెలుపల నిర్దిష్ట గంటలకు మించి పనిచేయడం చట్టవిరుద్ధం. అలా అక్రమంగా పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తే అరెస్టులు తప్పవని ఐస్ గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తోంది. అయితే..ట్రంప్ పదవిలోకి వచ్చాక ఐస్ తన తనిఖీలను మరింత ఉధృతం చేసింది. గత ఏడాది వేలాది మందిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసింది. అందులో అక్రమంగా చొరబడిన భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు.. సోషల్ మీడియా వేదికలలోని చర్చలు భారతీయులపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు సంకేతాలను ఇస్తున్నాయి. అందుకే ప్రత్యేకించి భారతీయులే మీద ఐసీఈ ఫోకస్ పెట్టిందన్న చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం. కాబట్టి.. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయవద్దని విద్యార్థులను నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త.. తెలుగోడా!పైన చెప్పిన రెండు అరెస్టులలో.. బాధితులు తెలుగువాళ్లే కావడం గమనార్హం!. వాళ్లను ఎందుకు నిర్బంధించారో కూడా అధికారులు వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే.. ఏ రకంగా వాళ్ల దృష్టిలో పడ్డ తాట తీస్తారనే సంకేతాలు పంపించినట్లయ్యిందన్నమాట. ఈ పరిస్థితుల్లో న్యూమన్ గ్రూప్ లాయర్లు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది..మా నాయకుడు గొప్పని.. మా కులం గొప్పని కొందరు దేశంకాని దేశంలో ఉంటూ వ్యాఖ్యలు చేస్తుండడం, సోషల్ మీడియాలో పోస్టులు తరచూ చూస్తుండేదే. అలా అమెరికాలో ఉండి ఇక్కడి సినిమాలు, రాజకీయాల కోసం అడ్డగోలుగా మాట్లాడడం, సో.మీ.లో పోస్టులు చేయడం ఏమాత్రం మంచిది కాదని న్యూమన్ గ్రూప్ లాయర్లు సూచిస్తున్నారు. అలాగే కులం పేరిట అతి ప్రదర్శనలు కూడా చేయొద్దంటున్నారు. ఇవి చట్ట విరుద్ధమైన చర్యలు కావు కదా అని ఫీల్ అయిన కూడా.. అక్కడి అధికారుల దృష్టిలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తే అరెస్టు, డిపోర్టేషన్ ప్రమాదం తప్పదని కుండబద్ధలు కొడుతున్నారు.మనిషి చచ్చాక యమ భటులు వచ్చి లాక్కెళ్తారు కదా.. ఒకవేళ భారతీయులు గనుక అదుపులో ఉండకపోతే ఐస్(ICE) అధికారులు అంతకు మించి ట్రీట్మెంట్తో లాక్కెళ్లే ప్రమాదం ఉందనేది సోషల్ మీడియాలో ఓ యూజర్ చేసిన పోస్ట్ సారాంశం.. అమెరికాలో అటు రాజకీయ నాయకుల్లో, ఇటు సోషల్ మీడియాలో భారతీయుల మీద పెరుగుతున్న వ్యతిరేకత..ఇలాంటి సమయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అంటున్న అమెరికా లాయర్ న్యూమన్ గ్రూప్..అమెరికాలో సినిమాల కోసం, రాజకీయాల కోసం అతి చేయొద్దు అని ముఖ్యమైన సలహా ఇస్తున్న లాయర్లు..సినిమా ఇంకా… pic.twitter.com/uIZKc9TGKD— UttarandhraNow (@UttarandhraNow) January 21, 2026
ఆంధ్రా అల్లుడు.. మళ్లీ తండ్రి కాబోతున్నాడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి గుడ్న్యూస్ను అందరితో పంచుకున్నారు. మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని అటు ఆయన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ కూడా ధృవీకరించారు. దీంతో వాళ్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వాన్స్ దంపతులు త్వరలోనే నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జులై చివరిలో పండంటి మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నట్లు తెలిపారు. జేడీ- ఉషా వాన్స్లకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఈవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జేడీ వాన్స్ (James David Vance).. 1984 ఆగస్టు 2న ఓహియో స్టేట్లోని మిడిల్టౌన్లో జన్మించారు. స్థానిక స్టేట్ యూనివర్సిటీలో చదివి, తరువాత యేల్ లా స్కూల్లో న్యాయ విద్య పూర్తి చేశారు. 2016లో ఆయన ఆత్మకథ “Hillbilly Elegy” అమెరికా అంతటా విశేష ఆదరణ పొందింది. ఈ పుస్తకం ఆధారంగా Netflix చిత్రం కూడా రూపొందింది. 2022లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి, ఓహాయో నుంచి సెనేటర్గా ఎన్నికయ్యారు. తన స్పష్టమైన అభిప్రాయాలు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం వల్ల జనాదరణ పొందగలిగారు. 2025 జనవరి 20న జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఆయన వైట్ హౌస్లో పనిచేస్తున్నారు.ఉషా చిలుకూరి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేశారు. We’re very happy to share some exciting news. Our family is growing! pic.twitter.com/0RohEBYXM7— Second Lady Usha Vance (@SLOTUS) January 20, 2026యేల్ లా స్కూల్లోనే ఉషా, జేడీ వాన్స్ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. ఈ క్రమంలో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. జేడీ వాన్స్ క్రిస్టియానిటీ, ఉష హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు.
థాంక్యూ అమెరికా..కానీ భారత్ అంటే ప్రేమ..!
అమెరికాలో నివశిస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి చేసిన పోస్ట్ నెట్టింట అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఓ పక్క అమెరికాను మెచ్చుకుంటూనే.. భారత్పై ఉన్న తన ఇష్టాన్ని గురించి కూడా వివరించాడు. అతడి పోస్ట్ అత్యంత ఆలోచనాత్మకంగ..విదేశాల్లో ఉండే సౌకర్యాలు, అక్కడి తీరు తెన్నులు..వలస వచ్చిన భారతీయలుకు ఎలాంటి ఛాలెంజ్లు, అవకాశాలు అందిస్తుందో వివరించాడు. ఈ పోస్ట్ ఎన్నారైలందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి పోస్ట్లో ఏం రాశాడంటే..యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఇన్వెస్టర్ వేణు తాను అమెరికా వెళ్లడంతో తన జీవిత గమనం ఎలా పూర్తిగా మారిపోయిందో షేర్ చేసుకున్నారు. అమెరికాలో లభించే అవకాశాల గురించి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాను అమెరికాలో సక్సెస్ అందుకున్నప్పటికీ..తాను పుట్టిన మాతృగడ్డ భారతదేశాన్ని జీవిత కాలం ప్రేమిస్తానంటూ దేశభక్తిని కూడా చాటుకున్నారు. ఆయన పోస్ట్లో తాను అమెరికాకు వెళ్లడాన్ని తన జీవిత గమనాన్ని ఊహించని విధంగా మార్చేసిన అరుదైన అవకాశంగా అభివర్ణించారు. "కృషి, క్రమశిక్షణ, స్థిరత్వానికి ప్రతిఫలమిచ్చే అమెరికన్ వ్యవస్థను ఎంతగానో కొనియాడారు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తులు, ముఖ్యంగా రిస్కులు తీసుకోవడానికి సిద్ధపడే వారికి, ఓపికతో ఉండేవారికి తప్పక మంచి ఫలితాలు అందించి లైఫ్నే అద్భుతంగా మార్చుకునే అద్భుత అవకాశాన్ని అందిస్తుందని పోస్ట్లో వేణు రాసుకొచ్చారు. అంతేగాదు చాలామంది ఇతర దేశాల్లో జీవితాన్ని అనుభవించకుండానే అమెరికాని విమర్శిస్తుంటారని కూడా అన్నారు. ప్రపంచంలో మరోవైపు నిశిసించిన తర్వాత..ఈ స్థాయి అవకాశం ఎంత అరుదైనదో అర్థమవుతుంది. ఇక్కడ జన్మించడం లేదా ఇక్కడే మంచిగా జీవితాన్ని నిర్మించుకోవడం ఓ అద్భుతమైన ప్రయోజనమని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానంటూ తన పోస్ట్ని ముగించారు. ఈ పోస్ట్ భారతీయ ప్రవాసులలో చాలామందిని ఆకట్టుకుంది. అతడి పోస్ట్లోని కృతజ్ఞత, అమెరికన్ డ్రీమ్ గురించి అతడు రాసిన విలువైన భావాలు ప్రతి భారతీయుడి మనసుని తాకడమే గాక భారత వలసదారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతులో కూడిన స్పందన రావడం విశేషం. సోదరా మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ పోస్టులు కూడా పెట్టారు. Since it’s a long weekend, a small thought.I’m genuinely grateful to the United States. It was a one-time opportunity that completely changed my life. I love India and always will, but coming here altered my trajectory in ways I couldn’t have imagined.This country rewards…— Venu (@Venu_7_) January 19, 2026 (చదవండి: కళ్లకు గంతలు...సహా ఆ సిటీలో వెరైటీ డేటింగ్స్ ఎన్నో...)
క్రైమ్
పసి మొగ్గలపై 'విషపు కాటు'
తాచుపాముల తావుల్లో విషపు కాటుకు గురై.. పువ్వంటి బాల్యం బుగ్గిపాలవుతోంది. ఆకులు రాలి, మోడువారిన చెట్టులా వెక్కివెక్కి ఏడుస్తోంది. పరమాన్నం పెట్టేవాడు పరమాత్మ కాదని, ఆటబొమ్మలిచ్చే వాడు ఆదుకొనేవాడు కాడని గుర్తించలేక.. పసిప్రాయం కామాంధుల దాహానికి కర్కశంగా బలవుతోంది. మృగాళ్ల కాటుకు బలై.. తల్లై.. ప్రసవ వేదనతో చిక్కిశల్యమై.. కన్నవారికి బరువై తల్లడిల్లిపోతోంది. కాకినాడ క్రైం: ఆడపిల్ల పుడితే సాక్షాత్తూ ఆ శ్రీమహాలక్ష్మి తమ కడుపున పుట్టిందని తల్లిదండ్రులు మురిసిపోతారు. రెక్కలు విచ్చుకున్న సీతాకోకచిలుకలా.. ఘల్లుమనే గజ్జెల సవ్వడితో నట్టింట్లో నడయాడుతూంటే ఆనందపరవశులవుతారు.. అటువంటి పసిమొగ్గలు.. లోకం పోకడలు తెలియని ప్రాయంలోనే కామాంధుల చేతుల్లో బలైపోతున్నారు. రేపటి తరాన్ని అందించాల్సిన బాలికలపై.. అక్క, చెల్లి, కూతురు, మనవరాలు.. ఇలా అన్ని వావివరుసలనూ మరచిన మృగాళ్లు.. ముక్కుపచ్చలారని వయస్సులోనే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఆ బాధిత బాలికలు పసి ప్రాయంలోనే గర్భవతులై జీవచ్ఛవాలుగా మిగిలిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఏడాది వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 13 మంది బాలికలు మృగాళ్ల అఘాయిత్యాలకు గురై, గర్భం దాల్చారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఉంటుందన్నది అంచనా. గర్భం దాల్చిన వారు కాకుండా.. లైంగిక దాడులకు గురైన వారు మరెంతో మంది ఉంటున్నారు. విలువలు లుప్తం.. లోపిస్తున్న భయం » సమాజంలో నానాటికీ విలువలు లుప్తమవడం ఈ అకృత్యాలకు జరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతోపాటు అవగాహన లోపం, బలప్రయోగాలకు గురవడం, సరైన పెంపకం లేకపోవడం వంటివి కూడా కారణాలవుతున్నాయి. » బాలికలపై అత్యాచారం చేసి, హత్య కూడా చేసిన సంఘటనలు దేశంలో, రాష్ట్రంలో ఎన్నో జరిగాయి. అయినప్పటికీ నిందితులపై కఠిన చర్యలు చేపట్టడం లేదు. చట్ట ప్రకారం చర్యలున్నా, అవి తీవ్ర స్థాయిలో లేకపోవడంతో ఘాతుకానికి పాల్పడుతున్న వారికి భయం లేకుండా పోతోంది. ఎలాగైనా తప్పించుకోవచ్చనే భావనను కలిగిస్తోంది. కేసులు ఆలస్యంగా నమోదవడం, సాక్ష్యాలు లభించకపోవడం, రాజీ యత్నాలు, బాధిత బాలలు ఫిర్యాదు చేయలేకపోవడం మృగాళ్లకు కలిసొస్తున్నాయి. ఫలితంగా బాధితులకు తక్షణ న్యాయం లభించడం లేదు. దీంతో, చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యమైపోతున్నాయి. » కొన్ని సందర్భాల్లో పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ ఉండని దుస్థితి. కొంత మంది పిల్లలను బంధువుల ఇళ్లల్లో ఉంచి, జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అలా తల్లిదండ్రులు లేని లోటుతో జీవితాన్ని గడుపుతున్న పిల్లలకు కామాంధులు రకరకాల ఆకర్షణలు ఎరగా వేస్తున్నారు. అలాగే, బాల కార్మికులు, బిచ్చగాళ్లుగా జీవిస్తున్న చిన్నారులు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. » అసురక్షిత పరిస్థితుల్లో లైంగిక దాడులు జరుగుతూండటంతో పలువురు బాలికలు గర్భవతులవుతున్న దుస్థితి నెలకొంది.పెడోఫిలిక్ డిజార్డర్తో.. పెడోఫిలిక్ డిజార్డర్ అనే మానసిక సమస్య వల్ల కూడా పసివాళ్లపై లైంగిక వాంఛలకు లోనవుతూంటారు. వారితో తమ కోరిక తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. అలాగని ఘాతుకానికి పాల్పడిన ప్రతి వాడూ పెడోఫైల్ కాదు, ప్రతి పెడోఫైల్ నేరం చేస్తాడనీ లేదు. ఈ సమస్య వల్ల నేరం చేశానని తప్పించుకునే అవకాశం లేదు. వ్యక్తి సమస్యతో బాధపడుతున్నాడా లేదా అన్నది గుర్తించడం వైద్యపరంగా సులభమే. చిన్న పిల్లలపై చెడు ఆలోచనలు కలిగితే తక్షణమే మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించాలి. సైకియాట్రిక్ కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపీ, ఇంపల్స్ కంట్రోల్ మెడిసిన్ ద్వారా సమస్యను నియంత్రించవచ్చు. – డాక్టర్ వానపల్లి వరప్రసాద్, మానసిక వ్యాధుల నిపుణుడు, హెచ్ఓడీ (ఇన్చార్జి), రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ‘సమ్మతి’ అనే ప్రశ్నే లేదు ఇలాంటి దురాగతాల్లో బాధిత బాలికను పెళ్లి చేసుకుంటామని ఎర వేయడం పరిపాటిగా మారింది. నిరుపేద, వెనుకబడ్డ, తల్లిదండ్రులు లేక సంరక్షకుల వద్ద బతుకీడుస్తున్న అనాథ బాలల వర్గాల్లో ఇది పరిపాటిగా మారింది. వివాహం చేసుకుంటే కేసు రద్దవదు. కేసుతో పాటు నేరం చేసినందు వల్ల చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ పరిధిలో చట్ట పరమైన చర్యలు తప్పవు. ఇది కాక, పోక్సో చట్టం వర్తిస్తుంది. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. నేరంలో క్రూరత్వం స్పష్టమైతే మరణ దండనకూ ఆస్కారం ఉంటుంది. మైనర్లపై లైంగిక దోపిడీలో ‘సమ్మతి’ అనే ప్రశ్నే లేదు. – ఎండీ జవహర్ ఆలీ, ప్రముఖ న్యాయవాది, కాకినాడ » గత మే నెలలో కిర్లంపూడిలో 13 ఏళ్ల బాలికకు పక్కింటి వృద్ధుడు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఓ తాతయ్య చాక్లెట్లు ఇస్తున్నాడని ఆ బాలిక పాఠశాలలో తోటి స్నేహితులకు చెప్పడంతో.. ఆ పిల్లలు కూడా చాక్లెట్ల కోసం వెళ్లగా.. వారిపై కూడా ఆ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. » ఇలా ఏడుగురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో ఓ బాలిక గర్భవతి కావడంతో అధికారుల అనుమతితో అబార్షన్ చేయించారు. » గండేపల్లి మండలం సూరంపాలెంలో 13 ఏళ్ల బాలికపై ఓ లారీ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెద్దమ్మ ఇంటికి వెళ్తే కన్ను వేసి, బెదిరించి పలుమార్లు దారుణానికి తెగబడ్డాడు, ఆ మృగాడి నిర్వాకంతో ఆ బాలికకు జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగి, ఆడ శిశువు జని్మంచింది. » కాకినాడ జగన్నాథపురంలో 14 ఏళ్ల బాలికపై పొరుగింట్లో ఉంటున్న 40 ఏళ్ల దుర్మార్గుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. గర్భవతి అయిన ఆ చిన్నారికి అబార్షన్ చేయించేందుకు ఇంటర్ చదువుతున్న ఓ యువకుడికి చెప్పాడు. అతడు కూడా ఆ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి ఘాతుకానికి బలైపోయిన ఆ బాలిక.. ఆడపిల్లకి జన్మనిచ్చింది. » గత నవంబర్లో ఉప్పాడకు చెందిన 16 ఏళ్ల బాలికకు తినుబండారాలు కొనిచ్చి, తాతయ్య వరుస అయ్యే వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. గర్భం దాలి్చన ఆ బాలికకు కాకినాడ జీజీహెచ్లో అధికారుల ఆదేశాలతో అబార్షన్ చేశారు. » కాకినాడ అచ్చంపేటకు చెందిన 17 ఏళ్ల బాలికను ఓ వివాహితుడు ప్రేమ పేరుతో మోసగించి, దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఆ బాలిక గత నవంబర్ 29న బాబును ప్రసవించింది. ఆ శిశువును శిశుగృహకు అప్పగించారు. » బాబాయి అత్యాచారం చేయడంతో తాళ్లరేవులో 16 ఏళ్ల బాలిక గత అక్టోబర్లో పాపను ప్రసవించింది. » పిఠాపురానికి చెందిన 15 ఏళ్ల బాలికపై సొంత బంధువే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అధికారుల ఆదేశాలతో ఆమెకు అబార్షన్ చేశారు. » కరప మండలం నడకుదురుకు చెందిన ఓ బాలికను తెలిసున్న వ్యక్తే నమ్మించి మోసం చేశాడు. కాకినాడ కోకిల సెంటర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ బాలిక మగ శిశువును ప్రసవించింది. ఆ శిశువును అధికారులకు అప్పగించారు. » ఇవన్నీ కేవలం ఏడాది వ్యవధిలో జరిగిన దారుణాలు. మచ్చుకు కొన్నే అయినా, అభంశుభం తెలియని బాలికలపై అఘాయిత్యాలు ఏ రీతిలో జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.చైల్డ్ పోర్నోగ్రఫీ అరచేతిలోకి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణం పరిపాటిగా మారింది. వీటిని వీక్షిస్తున్న వారిని సాంకేతికత ఆధారంగా గుర్తించి భరతం పట్టాల్సిన పోలీసు శాఖ ఈ విషయంలో విఫలమవుతోంది. అశ్లీల వీడియోలు చూస్తున్న ఎంతో మంది వికృత చేష్టలతో పసిమొగ్గలను చిదిమేస్తున్నారు.చేతులెత్తేసిన సర్కారు బాలికలపై దురాగతాల్ని నిలువరించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. బాధ్యత వహించాల్సిన పోలీస్, మాతా శిశు సంక్షేమ శాఖ అనుబంధ విభాగాలు, రూ.కోట్లు వెనకేసుకుంటున్న ఎన్జీవోలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అవగాహన కార్యక్రమాల పేరుతో ఫొటోలకే పరిమితమవుతున్నారు. అక్కడక్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా అవి ఫలవంతంగా జరగడం లేదనే విమర్శలున్నాయి. పాఠశాల లేదా మరేదైనా ప్రాంతంలో ఒకసారి సదస్సు నిర్వహించి వదిలేస్తున్నారు. దీనివలన ప్రయోజనం ఎంతవరకూ ఒనగూడిందనే పరిశీలన ఉండటం లేదు. అలాగే, బాధిత బాలికలు చేరి, సాంత్వన పొందే విభాగంలో కనీసం వారి డేటా కూడా తగిన రీతిలో నిర్వహించడం లేదు.
‘బ్లాక్ హ్యాట్’వలకు చిక్కొద్దు
నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరగడంతో సైబర్ నేరగాళ్లు దాన్ని ఆసరాగా చేసుకొని రకరకాల పద్ధతుల్లో మోసాలకు తెరతీస్తున్నారు. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో బ్లాక్ హ్యాట్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈఓ) ఆధారిత అక్రమ వెబ్సైట్ల ప్రచారంపై కేంద్ర హోంశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర హోంశాఖకు చెందిన భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (ఎన్సీటీఏయూ) బ్లాక్ హ్యాట్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసింది. నెటిజన్లతోపాటు వెబ్సైట్ల నిర్వాహకులు సైతం బ్లాక్హ్యాట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఏమిటీ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ?సాధారణంగా మనం ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. అందుకోసం కీ వర్డ్స్ను టైప్ చేయగానే సెర్చ్ ఇంజన్ వాటికి సంబంధించిన సమాచారాన్ని చూపుతుంది. అక్కడ మొదటగా వచ్చే 3–4 లింకులే సరైనవని భావించి వెంటనే క్లిక్ చేస్తాం. సరిగ్గా ఇక్కడే సైబర్ నేరగాళ్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. పేరొందిన వెబ్సైట్లలోని భద్రతా లోపాలను ఉపయోగించుకొని సెర్చ్ ఇంజన్ ఫలితాలను మోసపూరితంగా మారుస్తున్నారు. ఇలా సెర్చ్ ఇంజన్ల ద్వారా వెబ్సైట్ల ర్యాంకింగ్ను అక్రమంగా పెంచడాన్ని బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటారు. ఈ విధానంలో హానికరమైన లేదా మోసపూరిత కంటెంట్ను అనధికారికంగా చొప్పించి వినియోగదారులను అక్రమ బెట్టింగ్, జూదం, అశ్లీల వెబ్సైట్లు, పైరేటెడ్ కంటెంట్ వైపు మళ్లిస్తున్నారు. తద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ముప్పు ప్రధానంగా వెబ్సైట్ నిర్వాహకులకే ఎక్కువగా ఉంటుందని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు.ప్రజలు, వెబ్సైట్ల యజమానులకు భద్రతా నిపుణుల సూచనలివీ..» ఆన్లైన్లో ఏదైనా సమాచారం కోసం సెర్చ్ ఇంజన్ల ఫలితాలపై క్లిక్ చేసే ముందు అవి అసలైన వెబ్సైట్లో కాదో పరిశీలించాలి. » అనుమానాస్పద లేదా రీడైరెక్ట్ అయిన వెబ్సైట్లలోని యాప్లను డౌన్లోడ్ చేయవద్దు. వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. » వెబ్సైట్లలో ఉపయోగించే సీఎంఎస్ ప్లాట్ఫామ్లు, ప్లగిన్లు, థీమ్లు, సర్వర్ సాఫ్ట్వేర్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి.» మాల్వేర్, అనధికార రీడైరెక్ట్లు, అనుమానాస్పద ఎస్ఈఓ కార్యకలాపాలపై వెబ్సైట్లను నిరంతరం పర్యవేక్షించాలి.» బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ వల్ల వెబ్సైట్ల బ్రాండ్ ఇమేజీ దెబ్బతినడం, డొమైన్ బ్లాక్ అయ్యే ప్రమాదం, వెబ్సైట్కు ట్రాఫిక్ తగ్గిపోయే ప్రమాదం ఉందని గుర్తించాలి. సాధారణంగా జరిగే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ మోసాలు ఇవి..కీవర్డ్ స్టఫింగ్: అవసరం లేకుండా ఒకే కీవర్డ్ను పదేపదే కంటెంట్లో చొప్పించడం.ఫేక్ బ్యాక్లింక్స్: నకిలీ వెబ్సైట్ల నుంచి వేల లింకులు ఇచ్చి వెబ్సైట్ ర్యాంక్ పెరుగుతుందని నమ్మించడం.నెగెటివ్ ఎస్ఈఓ దాడులు: ప్రత్యర్థి వెబ్సైట్పై స్పామ్ లింకులు వేసి దాని ర్యాంక్ పడేలా చేయడం.బ్లాక్ హ్యాట్ మోసాన్ని గుర్తిస్తే ఎలా ఫిర్యాదు చేయాలి?బ్లాక్ హ్యాట్ మోసం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి.
అందుకే పిల్లలు వెళ్లారు: విజయశాంతి రెడ్డి భర్త
సాక్షి, హైదరాబాద్: తన భార్య చాలా ధైర్యవంతురాలని, ఎందుకు బలవస్మరణానికి పాల్పడిందో అర్థం కావడం లేదని స్టాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి అన్నారు. తమ ఇద్దరి పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన చెప్పారు. బోడుప్పల్లోని తమ నివాసంలో మంగళవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడారు. ఒంటరితనంగా అనిపిస్తున్నట్టు తన భార్య ఎప్పుడూ చెప్పలేదన్నారు. తమ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవని, ఆమె పనిచేసే చోట కూడా ఇబ్బందులు లేవని వెల్లడించారు. అసలు ఆమెకు ఒంటరితనం ఫీలయ్యేంత సమయం లేదని.. ఉద్యోగం, కుటుంబంతోనే సరిపోయేదని చెప్పారు. సెలవు రోజుల్లో పిల్లలకు దగ్గరకు వెళ్లేదని.. ఒక వారం అబ్బాయి దగ్గరకు, మరో వారం అమ్మాయి దగ్గరికి వెళ్లేదన్నారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పాల్సిందని, ఏదోలా పరిష్కరించుకునే వాళ్లమని అన్నారు. ''అసలు ఏం జరిగిందో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదు. మైండ్ మొత్తం బ్లాకే ఉంది. మా మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. కుటుంబ సభ్యులందరితోనూ బాగానే మాట్లాడుతుంది. ఒంటరిగా ఉండేంత సందర్బాలు లేవు. జనవరి 29 నాడు నాతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నార్మల్గానే మాట్లాడింది. పిల్లల భవిష్యత్తు గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. పిల్లలు నాకంటే వాళ్ల అమ్మతో బాగా క్లోజ్గా ఉంటారు. వాళ్ల అమ్మ ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తారు. అమ్మ చెబితే.. వద్దని అననే అనరు. అమ్మ మీద ప్రేమతోనే ఆమెతో పాటు వెళ్లారు.అంతా మంచిగనే ఉన్నాం. ఫ్యామిలీ అంతా ఓకే. 19 ఏళ్ల మా వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. 14 నెలల క్రితం నేను దుబాయ్ వెళ్లాను. ఇండియాకు తిరిగొచ్చేమని నాతో ఎప్పుడూ చెప్పలేదు. నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇక్కడ అంతా నేను చూసుకుంటాను అని చెప్పేది. నా భార్య అంటే నాకు దేవతతో సమానం. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. మా పిల్లలకు వాళ్ల అమ్మతో ఎటాచ్మెంట్ ఎక్కువ, ఆమె లేకుండా ఉండలేరు. ప్రతి విషయం వాళ్ల అమ్మతో షేర్ చేసుకునేవారు. నేను లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని అనుకుందో ఏమో. మా అత్తయ్య వాళ్లతోనూ ఆమె ఏమీ చెప్పలేదు. ఇంట్లో బయటికి వెళుతున్నప్పడు.. 'ఈరోజు ఆఫీసు ఉండదు కదా' అని అత్తయ్య అడిగితే, పార్టీకి వెళుతున్నట్టు చెప్పింది. నార్మల్గానే ఉన్నట్టు కనబడడంతో ఎటువంటి అనుమానం కలగలేదు. నాకు తెలిసి ఆఫీసులో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవ''ని సురేందర్ రెడ్డి చెప్పారు. పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్అన్ని కోణాల్లోనూ దర్యాప్తుసాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి తన ఇద్దరు పిల్లలు చైతన్యారెడ్డి (18), విశాల్ రెడ్డి (17)తో కలిసి శనివారం తెల్లవారుజామున చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆమె ఎందుకిలా చేశారనేది మిస్టరీగా మారింది. కుటుంబం, కెరీర్లోనూ ఎటువంటి ఇబ్బందులు లేవని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మానసికంగా కూడా ఆమె చాలా ధైర్యవంతురాలని, అలాంటి ఆమె ఎందుకు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. విజయశాంతిరెడ్డి సెల్ఫోన్, ల్యాప్టాప్లో ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తున్నారు.
ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తి
నల్గొండ జిల్లా : మండలంలోని కేతేపల్లి గ్రామంలో జరిగిన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో మృతిచెందిన మమత, ఆమె చిన్ని కుమారుడు అద్విక్ అంత్యక్రియలు ఎట్టకేలకు సోమవారం రార్రి పూర్తయ్యాయి. ఈ కేసులో నిందితురాలైన సుజాత సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన కుందేలు నగేష్తో అదే గ్రామానికి చెందిన సుజాత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. నగేష్ భార్య మమతకు ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పెద్దమనుషుల సమక్షంలో నగేష్, సుజాతను పిలిపించి పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. అప్పటి నుంచి నగేష్ సుజాతతో మాట్లాడటం మానేశాడు. దీంతో ఎలాగైనా నగేస్ భార్య మమతను చంపాలని సూజాత నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సుజాత జనవరి 31న గ్రామంలోని కిరాణ దుకాణంలో ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకొని ఇంటి వద్దకు వెళ్లింది. పెట్రోల్తో పాటు ఒక సంచిలో కత్తి, కారంపొడి తీసుకొని నగేష్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటి ముందు చిన్న కుమారుడు అద్విక్ పాలు పడుతున్న మమతపై సుజాత పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో మమత, ఆమె చిన్న కుమారుడు అద్విక్ మృతిచెందారు. నిందితురాలు సుజాత సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి చేసిన నేరం అంగీకరించి లొంగిపోగా.. ఆమెను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన..మమత తరఫు బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మమత వివాహ సమయంలో కట్నం కింద ఇచ్చిన రూ.8లక్షల నగదు, 10 తులాల బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరారు. భూమి రిజిస్ట్రేషన్..నగేష్ తల్లిదండ్రుల వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిని మృతురాలు మమత పెద్ద కుమారుడు సాత్విక్ పేరిట ఆమె తరఫు బంధులు దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించారు. గార్డియన్గా మమత తండ్రి, తల్లిని పెట్టారు. అదేవిధంగా కట్నం కింద ఇచ్చిన రూ.8లక్షల నగదు, 10 తులాల బంగారంను మమత పెద్ద కుమారుడి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదరడంతో సోమవారం రాత్రి మమత, ఆమె చిన్న కుమారు అద్విక్ మృతదేహాలను బంధువులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కేతేపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
వీడియోలు
KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు
బ్రేకప్ గురించి నోరు విప్పిన మృణాల్ ఠాకూర్..!
నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!
పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర
శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి.. అర్ధరాత్రి గజగజ వణికిన డెలివరీ బాయ్
కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్
మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?
గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్
అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?

