కన్నుమూసిన జానకి.. చివరి పాట ఏంటంటే?
దిగ్గజ సింగర్ ఎస్.జానకి చనిపోయారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలకు తోడు కుమారుడిని కోల్పోయిన వేదన ఓ వైపు ఉండగా శనివారం సాయంత్రం మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకుపైగా 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల్ని అలరించారు. మరి ఈమె పాడిన చివరి పాట ఏంటో తెలుసా?2016 అక్టోబరులో రిటైర్మెంట్ ప్రకటించిన జానకి.. ఓవరాల్ కెరీర్ ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. చివరగా 'అమ్మాపోవిను' అనే మలయాళ పాటను రికార్డ్ చేసి.. ఇకపై పాటలు పాడదలుచుకోలేదని, సినిమాలతో పాటు వేదిక మీద కూడా పాడేది లేదని ప్రకటించారు. అలా జరిగి పదేళ్లు అయింది. ఇప్పుడు ఈమె శాశ్వతంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు భారతీయ భాషలన్నింటిలో పాడిన జానకి.. 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు.
లెజెండరీ గాయని జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు.తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వైఎస్ జగన్ అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైఎస్ జగన్.. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కాగా, ప్రముఖ దిగ్గజ నేపథ్య గాయని ఎస్.జానకి మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మృతి చెందారు. “దక్షిణ భారత కోకిలగా ఆమె ప్రత్యేక గుర్తించారు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్. జానకి.. ఆరు దశాబ్దాలకు పైగా సినీ గాన సేవ చేశారు. 17 భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించిన గానకోకిల.. మధురమైన గాత్రంతో కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్నారు. గ్రామీణ జానపదం నుంచి శాస్త్రీయ, మెలోడీ, భక్తి గీతాల వరకు విశేష ప్రతిభ కనపరిచారు. భారతీయ సినీ సంగీత రంగానికి ఎస్. జానకి సేవలు చిరస్మరణీయం. ఎస్. జానకి మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. గానకోకిల ఎస్. జానకికి సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పించారు.
పెళ్లిళ్లు ఎక్కువ చేసుకుంటే జాబ్ పోతుంది.. ప్రభుత్వ పథకాలు కూడా బంద్!
అసోం ప్రభుత్వం బహుభార్యత్వాన్ని అరికట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నవారికి ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగులు బహుభార్యత్వాన్ని అనుసరిస్తే వారి ఉద్యోగాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు. అసోంలో ఎప్పటి నుంచో ఉన్న బహుభార్యత్వం (Polygamy) ఆచారానికి చెక్ పెట్టడానికి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.2026–27 బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ జయంత మల్లా బారువా ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. ఇప్పటికే 2025 నవంబరులో అసోం అసెంబ్లీ బహుభార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం బహుభార్యత్వం నేరంగా రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అంతే కాదు ఈ చట్టం కేవలం శిక్షలతోనే ఆగిపోకుండా, బాధిత మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయనుంది. అవసరమైన సందర్భాల్లో ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం మహిళల హక్కులు, గౌరవం కాపాడటం. బహుభార్యత్వం వల్ల కుటుంబ ఆర్థిక సమస్యలు పెరిగి వారి పిల్లల చదువులు, ఆరోగ్యం నిర్లక్ష్యం అవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సమాజంలో లింగ సమానత్వం తీసుకురావడమే ఈ చర్య వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా 'ఒకే దేశం–ఒకే చట్టం' చర్చ జరుగుతున్న సమయంలో అసోం తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యేకంగా నిలిచింది. బీజేపీ పాలనలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా అసోం చర్యలను నిశితంగా గమనిస్తున్నాయి.
నిందితుడు రాజ్కుమార్ను పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ ఘటనలో పోలీసుల కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్కుమార్ను పట్టిస్తే రూ.2 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఆరుగురిని హత్య చేసిన పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాజ్కుమార్ కోసం 10 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్కుమార్ ఓ మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు. ఈ క్రమంలో అతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి మే చివరి వారంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం స్టేషన్ బెయిల్ మీద రాజ్కుమార్ బయటకు వచ్చాడు. ఓ కారు అద్దెకు తీసుకుని సరాసరి బాధితురాలి ఇంటికి వెళ్లి.. ఆమె తల్లి, నాన్నమ్మల గొంతు కోశాడు. ఆపై బాలికను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి శివారులోని చెరువు వద్ద అత్యాచారం జరిపాడు. ఆపై తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు బిడ్డలను కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, పోలీసుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు షాబాద్ చౌరస్తాలో ఈ ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. "పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఉంటే ఈరోజు ఆరుగురు ప్రాణాలు పోయేవి కావు" అంటూ గ్రామస్తులు పోలీసులపై మండిపడ్డారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ రమేశ్ను సస్పెండ్ చేశామని కలెక్టర్ తెలిపారు.
శరద్ పవార్ (85), ఎన్సీపీ లీడర్ రాయని డైరీ
యూఏఈ టాపర్లకు భారీ కానుక.. ఒక్కొక్కరికి లక్ష దిర్హమ్లు
'ఏఐ' నూతన పారిశ్రామిక విప్లవానికి నాంది!
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకుకోర్టు నోటీసులు
జోరుగా హుషారుగా...
వింబుల్డన్ విజేత లిండా నోస్కోవా
మంధాన మరోసారి.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
పెళ్లిళ్లు ఎక్కువ చేసుకుంటే జాబ్ పోతుంది.. ప్రభుత్వ పథకాలు కూడా బంద్!
జానకికి నేడు మైసూర్లో అంతిమ వీడ్కోలు
బట్లర్ సుడిగాలి శతకం.. ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమి
అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ
రామాయపట్నం పోర్టు రూ.1500 కోట్లకే ప్రైవేట్ పరం
ఇప్పుడు కలవడం కుదరదు మంత్రులతో సార్ సీరియస్గా మాట్లాడుతున్నారు!!
IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్పై వేటు!
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువనేశ్వర్కు చోటు
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి
'అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి'
నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ఇది: రామ్గోపాల్ వర్మ
ఓటీటీలోకి వచ్చేసిన ఫాంటసీ కామెడీ సినిమా.. తెలుగులోనూ
ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!
వాళ్ల ఓట్లు మనకూ కీలకమే సార్!
20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!
ఎల్ నినో పంజా.. రుతుపవనాల పరుగుకు బ్రేక్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
నేపాల్తో చారిత్రక క్రికెట్ సిరీస్.. వైభవ్కు ప్రమోషన్!
రెండు ఓట్ల సంగతి దేవుడెరుగు... ఉన్న ఒక్క ఓటు పోకుంటే చాలు!
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ప్రపంచ రికార్డు
లక్ష ఉద్యోగాల కోత, ప్లాంట్లు మూసివేత : వెల్లువెత్తిన నిరసన
హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థిని కరిచిన పాము
బెంగాల్లో పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ యూటర్న్
శరద్ పవార్ (85), ఎన్సీపీ లీడర్ రాయని డైరీ
యూఏఈ టాపర్లకు భారీ కానుక.. ఒక్కొక్కరికి లక్ష దిర్హమ్లు
'ఏఐ' నూతన పారిశ్రామిక విప్లవానికి నాంది!
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకుకోర్టు నోటీసులు
జోరుగా హుషారుగా...
వింబుల్డన్ విజేత లిండా నోస్కోవా
మంధాన మరోసారి.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
పెళ్లిళ్లు ఎక్కువ చేసుకుంటే జాబ్ పోతుంది.. ప్రభుత్వ పథకాలు కూడా బంద్!
జానకికి నేడు మైసూర్లో అంతిమ వీడ్కోలు
బట్లర్ సుడిగాలి శతకం.. ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమి
అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ
రామాయపట్నం పోర్టు రూ.1500 కోట్లకే ప్రైవేట్ పరం
ఇప్పుడు కలవడం కుదరదు మంత్రులతో సార్ సీరియస్గా మాట్లాడుతున్నారు!!
IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్పై వేటు!
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువనేశ్వర్కు చోటు
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి
'అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి'
నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ఇది: రామ్గోపాల్ వర్మ
ఓటీటీలోకి వచ్చేసిన ఫాంటసీ కామెడీ సినిమా.. తెలుగులోనూ
ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!
వాళ్ల ఓట్లు మనకూ కీలకమే సార్!
20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!
ఎల్ నినో పంజా.. రుతుపవనాల పరుగుకు బ్రేక్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
నేపాల్తో చారిత్రక క్రికెట్ సిరీస్.. వైభవ్కు ప్రమోషన్!
రెండు ఓట్ల సంగతి దేవుడెరుగు... ఉన్న ఒక్క ఓటు పోకుంటే చాలు!
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ప్రపంచ రికార్డు
లక్ష ఉద్యోగాల కోత, ప్లాంట్లు మూసివేత : వెల్లువెత్తిన నిరసన
హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థిని కరిచిన పాము
బెంగాల్లో పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ యూటర్న్
ఫొటోలు
ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు
'సావిత్రి క్లాసిక్స్' బుక్ లాంచ్ (ఫొటోలు)
ఆదియోగి విగ్రహాం ముందు సీరియల్ నటి పెళ్లి (ఫొటోలు)
వింబుల్డన్లో దిగ్గజాల సందడి (ఫొటోలు)
భీమవరంలో సినీనటి కృతిశెట్టి సందడి (ఫొటోలు)
రామ్గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
బోనీ కపూర్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ తారల సందడి (ఫోటోలు)
యూకే అంబాసిడర్తో పూనమ్ కౌర్ సందడి (ఫోటోలు)
సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
డిఫరెంట్ అవుట్ఫిట్లో హీరోయిన్ నిషా అగర్వాల్..ఫోటోలు
సినిమా
ప్రముఖ గాయని జానకి కన్నుమూత
ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న ఈమె మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం(జూలై 11) సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఆ బాధకి తోడు అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకుని, నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు.సినీ ప్రస్థానం: 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయాత్తు' ద్వారా నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది 'ఎమ్మెల్యే' చిత్రంలో 'నీతియే జయమౌనురా' అనే పాట పాడారు. చిన్న పిల్లల గొంతు నుండి ముసలివారి వరకు ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన స్వరంలో మార్పులు (Voice Modulation) చేయడం ఆమె ప్రత్యేకత.సంగీత ప్రయాణం: లెజండరీ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళ గీతాలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. 17 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడారు ఎస్ జానకి.పురస్కారాలు జాతీయ అవార్డులు: ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 12 నంది అవార్డులతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల నుండి 30కి పైగా అవార్డులు పొందారు. 1986లో కలైమామణి అవార్డు, 1997లో ఫిలింఫేర్, 2002లో అచీవర్ అవార్డు, 2005లో జేసుదాసు అవార్డులు ఆమెను వరించాయి. 2009లో మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2017లో వేటూరి జీవిత సాఫల్య పురస్కారం ఆమెకు లభించాయి. మౌనపోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు జానకి.పద్మభూషణ్ తిరస్కరణ: 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మభూషణ్' పురస్కారాన్ని, దక్షిణాది కళాకారులకు గుర్తింపు ఆలస్యంగా లభిస్తోందని నిరసిస్తూ ఆమె గౌరవపూర్వకంగా తిరస్కరించారు.
బెంజ్ కారు కొన్న నటి హేమ.. ఎన్ని కోట్ల ఖరీదంటే?
టాలీవుడ్ నటి హేమ ఎప్పటికప్పుడు ఏదోలా ఒకలా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కొత్త బెంజ్ కారు కొనుగోలు చేసి సదరు వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. తన కుటుంబంతో కలిసి వెళ్లి ఈ కారుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది.(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)1989 నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్న హేమ.. అత్త, అక్క, తల్లి తరహా పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ తరహా పాత్రలతోనే కామెడీ కూడా చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. చివరగా 2023లో ఓ మూవీలో నటించింది. తర్వాత నుంచి పెద్దగా మూవీస్ ఏం చేయట్లేదు. కాకపోతే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఈమె కూడా ఉందని చెప్పి ఆ మధ్య హడావుడి నడిచింది. పోలీసు కేసుల వరకు వెళ్లింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ఈమె చెప్పుకొచ్చింది.గతంలో బిగ్బాస్ షోలోనూ పాల్గొన్నప్పటికీ ఒకటి రెండు వారాలకే ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చింది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్ఎస్ 450డీ మోడల్ కారుని కొనుగోలు చేసింది. దీని ధర మార్కెట్లో రూ.1.40 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల మధ్య ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు హారర్ సినిమా.. మూడింటిలో స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211)
ఓరచూపులతో అనసూయ.. జీన్స్లో ఐశ్వర్య
ఓరచూపులతో చీరలో అనసూయ పోజులుజీన్స్లో కేక పుట్టించేస్తున్న ఐశ్వర్య రాజేశ్జిమ్లో తెగ కష్టపడిపోతున్న అనన్య నాగళ్లచిన్న స్కర్ట్తో విష్ణుప్రియ క్యూట్ డ్యాన్స్ఫారిన్ ట్రిప్లో రానా సతీమణి మిహీకచీరలో గ్లామర్ చూపించేస్తున్న నభా నటేశ్ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Vishnu Priya Bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika)
ఓటీటీలో తెలుగు హారర్ సినిమా.. మూడింటిలో స్ట్రీమింగ్
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్గా రూపొందిన 'త్రికాల' సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుని ఇప్పుడు ఓటీటీల్లోనూ ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్నెక్ట్స్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతూ టాప్ రేటింగ్తో ట్రెండ్ అవుతోంది. ఐఎండీబీలోనూ 9.1 రేటింగ్ అందుకుని హాట్ టాపిక్గా నిలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మిలిటరీ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్పై ప్రకటన)శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో.. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. కేవలం డైలాగులకే పరిమితం కాకుండా కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ అవసరాన్ని, పునర్జన్మల వైవిధ్యాన్ని విజువల్గా ఆవిష్కరించారు. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మేళవిస్తూ మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలను సమన్వయం చేసి చూపించారు.(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)
క్రీడలు
170 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. చరిత్ర సృష్టించిన భారత పేసర్
భారత మహిళల క్రికెట్ జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అరుదైన ఘనత సాధించింది. ఈ మైదానంలో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టిస్తూ ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరు లిఖించుకుంది. ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో క్రాంతి 17 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది. ఫలితంగా భారత్ ఇంగ్లండ్ను 170 పరుగులకే కుప్పకూల్చి, 117 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది.ఈ ప్రదర్శనతో క్రాంతి మరో ఘనత కూడా సాధించింది. టెస్టు క్రికెట్లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళా ఫాస్ట్ బౌలర్గా రికార్డు నెలకొల్పింది.లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరు నమోదు కావడం ఏ క్రికెటర్కైనా ఓ కల. అలాంటి అరుదైన గౌరవాన్ని తన కెరీర్ ప్రారంభ దశలోనే అందుకున్న క్రాంతి గౌడ్ భారత మహిళల క్రికెట్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించింది.మ్యాచ్ విషయానికొస్తే.. క్రాంతి గౌడ్ ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది. వీరితో పాటు మయా బౌచియర్ (23), మ్యాడీ విల్లియర్స్ (10), సోఫీ ఎక్లెస్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు. లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే.
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్
భారత టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక సార్లు (వరుసగా) టాస్ గెలిచిన కెప్టెన్గా ధోని రికార్డు సమం చేశాడు. శ్రేయస్, ధోని వరుసగా ఏడు మ్యాచ్ల్లో టాస్ గెలిచారు. ఈ జాబితాలో శ్రేయస్, ధోని తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (6), రోహిత్ శర్మ (5) ఉన్నారు.ఇంగ్లండ్తో ఇవాళ (జులై 11) జరుగుతున్న ఐదో టీ20లో టాస్ గెలవడం ద్వారా శ్రేయస్ కోహ్లి రికార్డును అధిగమించి, ధోని రికార్డును సమం చేశాడు.భారత టీ20 కెప్టెన్గా అత్యధిక వరుస టాస్ విజయాలు..శ్రేయస్ అయ్యర్ – 7* (2026)ఎంఎస్ ధోని – 7 (2010-12)విరాట్ కోహ్లీ – 6 (2019)ఎంఎస్ ధోని – 5 (2007)రోహిత్ శర్మ – 5 (2020-22)మళ్లీ టాస్ గెలిచిన శ్రేయస్.. ఆసారైనా మ్యాచ్ గెలిచేనా..?భారత టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వరుసగా ఏడో మ్యాచ్లో టాస్ గెలిచాడు. అయితే ఈ ఏడు మ్యాచ్ల్లో అతడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాడు. ఐర్లాండ్ సిరీస్తో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ ఆ సిరీస్లోని రెండు మ్యాచ్ల్లో టాస్ గెలిచి, సిరీస్ను మాత్రం 0-2తో కోల్పోయాడు. ఆతర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లోనూ టాస్ గెలవగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ తర్వాత మూడు మ్యాచ్ల్లోనూ శ్రేయస్ టాస్ గెలిచినా, ఒక్క మ్యాచ్లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు.దీంతో ఈసారైనా మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రేయస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షేడ్గే జట్టులోకి వచ్చారు.భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్ల
పాకిస్తాన్ క్రికెట్కు భారీ షాక్
పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు పరిమిత ఓవర్ల ఫీల్డింగ్ కోచ్ షేన్ మెక్డెర్మాట్ తన పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఆసియా గేమ్స్-2026కు కొన్ని నెలల ముందు మెక్డెర్మాట్ తప్పుకోవడం పాక్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఆస్ట్రేలియాలోని టాస్మేనియాకు చెందిన షేన్ మెక్డెర్మాట్.. గత ఏడాది జూలైలో పాక్ వైట్ బాల్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతడి హయంలో పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు గణనీయంగా మెరుగు పడ్డాయి. మెక్డెర్మాట్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. గతంలో అతడు అఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లకు ఫీల్డింగ్ కోచ్గా పనిచేశాడు. అతడి పర్యవేక్షణలోనే అఫ్గానిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్-2024లో సెమీఫైనల్కు చేరింది. ఏదేమైనప్పటికి ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు మెక్డెర్మాట్ రాజీనామా చేయడం పాక్ క్రికెట్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కాగా పాక్ టెస్ట్ జట్టు కెప్టెన్గా బాబర్ ఆజం తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. టీ20ల్లో కూడా బాబర్ను తిరిగి కెప్టెన్గా నియమించాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా ఓటమి
ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిఐదో టీ20లోనూ టీమిండియా ఓటమిపాలైంది. తద్వారా సిరీస్ను 0-4తో కోల్పోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇషాన్ కిషన్ (56) ఔట్12.4వ ఓవర్- ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు). స్కోర్ 131-4. మూడో వికెట్ కోల్పోయిన భారత్10.1వ ఓవర్- శ్రేయస్ అయ్యర్ (28) ఔట్సంజూ శాంసన్ ఔట్5.1వ ఓవర్- 55 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్లో జేకబ్ బేతెల్కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (27) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్2.3వ ఓవర్- 25 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (3) ఔటయ్యాడు. బట్లర్ సెంచరీ.. ఇంగ్లండ్ భారీ స్కోర్సౌతాంప్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లండ్ అతి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ (4-0-60-0), అక్షర్ పటేల్ (4-0-63-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్ దూబే ఒకే ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్లను చీల్చిచెండాతున్న బ్రూక్బ్రూక్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 నాటౌట్బట్లర్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 నాటౌట్14 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 168-1అర్ద సెంచరీలు పూర్తి చేసుకున్న బ్రూక్, బట్లర్హ్యారీ బ్రూక్ (56), జోస్ బట్లర్ (72) ధాటిగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 146-1గా ఉంది.ధాటిగా ఆడుతున్న బ్రూక్వన్డౌన్లో వచ్చిన హ్యారీ బ్రూక్ ధాటిగా ఆడుతున్నాడు. 11 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 40 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 73-1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్1.4వ ఓవర్- ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సూర్యాంశ్ షేడ్గేకు క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (6) ఔటయ్యాడు.మళ్లీ టాస్ గెలిచిన శ్రేయస్.. ఈసారైనా మ్యాచ్ గెలిచేనా..?శ్రేయస్ అయ్యర్ వరుసగా ఏడో మ్యాచ్లో టాస్ గెలిచాడు. ఈసారైనా మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టాస్ గెలిచిన శ్రేయస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షేడ్గే జట్టులోకి వచ్చారు.భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్7:15 గంటలకు టాస్భారత జట్టు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం 7:15 గంటలకు టాస్ పడుతుంది. టాస్ ఆలస్యం.. కారణమిదే..!భారత్, ఇంగ్లండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జులై 11) ఐదో టీ20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. భారత జట్టు ట్రాఫిక్లో ఇరుక్కోవడం చేత ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అయితే కొద్ది క్షణాల క్రితం టీమిండియా స్టేడియంకు చేరుకున్నట్లు అప్డేట్. మరికొద్ది నిమిషాల్లో టాస్ పడే అవకాశం ఉంది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్ను భారత్ ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. తర్వాత మూడు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. ఇవాళ నామమాత్రపు చివరి మ్యాచ్ జరుగనుంది.
న్యూస్ పాడ్కాస్ట్
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
టీచర్ల ‘టెట్’ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు?... ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
టెట్ మినహాయింపునకు కృషి. టీచర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలకు వైఎస్ జగన్ భరోసా
విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు
ప్రశ్నించే గొంతును నొక్కడానికి అత్యంత ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారు... ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించాం. పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించాం. ప్రధాని మోదీ వెల్లడి
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ మైలురాయి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
రాజధానిలో ఒకే నెలలో జరిగిన రెండు మరణాల వెనుక పెద్ద కుట్ర...
చంద్రబాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు
దేశంలో సామాన్యుడి వైద్యభారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరంతరం వాడాల్సిన అత్యవసర మందుల ధరలను నియంత్రిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది. మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బీపీ), గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 39 కీలక ఔషధాల (న్యూ డ్రగ్ ఫార్ములేషన్స్) రిటైల్ ధరలపై ఎన్పీపీఏ గరిష్ఠ పరిమితిని (క్యాపింగ్) విధించింది. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ), 2013 నిబంధనల ప్రకారం ఇటీవల జారీ చేసిన ఈ అధికారిక నోటిఫికేషన్లు తక్షణమే అమలులోకి రానున్నాయి.కీలక సవరణలు.. ధరల వివరాలుఎన్పీపీఏ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిత్యం ప్రజలు ఉపయోగించే విటమిన్లు, అత్యవసర ఇంజెక్షన్ల ధరలను ఈ క్రింది విధంగా నిర్ణయించారు:కాల్షియం, విటమిన్ D3 మాత్రలు: ఎముకల పుష్టికి, విటమిన్లోప నివారణకు విస్తృతంగా వాడే ఈ మాత్రల గరిష్ఠ రిటైల్ ధరను అన్ని పన్నులతో కలిపి ఒక టాబ్లెట్కు రూ.8.93గా స్థిరీకరించారు.యాంటీ-రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్: పిచ్చి కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు అత్యవసరంగా ఇచ్చే ఈ ప్రాణరక్షక ఇంజెక్షన్ (150 IU/ml) ధరను రూ.119.48గా సవరించారు.కార్డియాక్, బీపీ ఔషధాలు: గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించే క్లోపిడోగ్రెల్ + ఆస్పిరిన్ + అటోర్వాస్టాటిన్ క్యాప్సూల్ ధరను ఒక్కోదానికి రూ.6.37గా, హైపర్టెన్షన్ చికిత్సకు వాడే అమ్లోడిపైన్ + బైసోప్రోలోల్ + టెల్మిసార్టాన్ టాబ్లెట్ ధరను రూ.14.74గా నిర్ణయించారు.జీవనశైలి జబ్బుల బాధితులకు ఊరటభారతదేశంలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇంట్లో వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న కుటుంబాలకు నెలవారీ మందుల బిల్లులు పెద్ద భారంగా మారుతున్నాయి. తాజా నిర్ణయం ద్వారా బీపీ, షుగర్, హెచ్ఐవీ, శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ల ఔషధాల ధరలు నియంత్రణలోకి రావడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్కు పెద్ద ఊరట లభించనుంది.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు
మెటా, గూగుల్కు రూ.50 కోట్ల జరిమానా!
సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ)కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిన్నతనంలో సోషల్ మీడియాకు బానిస కావడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ ఒక 20 ఏళ్ల యువతి దాఖలు చేసిన కేసులో జ్యూరీ ఇచ్చిన తీర్పుపై మెటా తాజా అప్పీల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో మెటా న్యాయవాదులు అధికారికంగా అప్పీల్ నోటీసును దాఖలు చేశారు.అసలేమిటీ కేసు? బాధితురాలి ఆరోపణలు ఏంటి?ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న కేలీ అనే యువతి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. తను చిన్నతనంలో ఉన్నప్పుడే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫారమ్లకు తీవ్రంగా బానిసయ్యానని, దీనివల్ల తను తీవ్రమైన ఆందోళన (యాంగ్జైటీ), డిప్రెషన్, బాడీ డిస్మోర్ఫియా (శరీర ఆకృతిపై తీవ్రమైన అసంతృప్తి) వంటి మానసిక సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆమె కోర్టుకు తెలిపింది.టెక్ కంపెనీలు తమ యాప్ల్లో వాడే కొన్ని ప్రత్యేక ఫీచర్ల ద్వారా చిన్న పిల్లలను ఉద్దేశపూర్వకంగానే వ్యసనపరులుగా మారుస్తున్నాయని ఆమె తరఫు న్యాయవాదులు బలంగా వాదించారు. ప్రధానంగా కొన్ని ఫీచర్ల రూపకల్పనపై కోర్టులో చర్చ జరిగింది.ఇన్ఫినిట్ స్క్రోలింగ్: యూజర్లు నిరంతరాయంగా కంటెంట్ చూస్తూనే ఉండేలా పేజీలకు ముగింపు లేకుండా డిజైన్ చేయడం.ఆటోప్లే ఫంక్షన్: ఒక వీడియో ముగియగానే మరో వీడియో ఆటోమేటిక్గా ప్లే అయ్యేలా చేయడం.అల్గారిథమిక్ రికమండేషన్స్: యూజర్ల ప్రవర్తనను బట్టి మరింత వ్యసనకరమైన కంటెంట్ను వారి ముందుకు తీసుకురావడం.సంచలన తీర్పు.. 6 మిలియన్ డాలర్ల జరిమానాఈ ఏడాది మార్చి (2026)లో ఈ కేసును విచారించిన లాస్ ఏంజెల్స్ జ్యూరీ మెటా, గూగుల్ (యూట్యూబ్) సంస్థలు తమ ప్లాట్ఫారమ్ల రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని నిర్ధారించింది. బాధితురాలి మానసిక స్థితి క్షీణించడానికి ఈ కంపెనీల యాప్ డిజైన్లే ప్రధాన కారణమని పేర్కొంటూ మొత్తంగా 6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.50 కోట్లు) పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇందులో మెటా 4.2 మిలియన్ డాలర్లు, గూగుల్ 1.8 మిలియన్ డాలర్లు చొప్పున బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై టెక్ కంపెనీలు దాఖలు చేసిన ‘జడ్జ్మెంట్ నాట్విత్స్టాండింగ్ ద వర్డిక్ట్’ (తీర్పును కొట్టివేయాలనే అభ్యర్థన) పిటిషన్లను ట్రయల్ జడ్జ్ కరోలిన్ బి.కుహ్ల్ జూన్ ప్రారంభంలో తిరస్కరించడంతో మెటా ఇప్పుడు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.మెటా వాదన.. టెక్ కంపెనీల రక్షణ కవచంఅప్పీలుపై మెటా ప్రతినిధి స్పందిస్తూ.. ‘టీనేజర్ల మానసిక ఆరోగ్యం అనేది ఎంతో సంక్లిష్టమైన అంశం. దీన్ని కేవలం ఒక యాప్తో మాత్రమే ముడిపెట్టలేము. ఆన్లైన్లో యువత రక్షణ కోసం మేము అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. గూగుల్ ప్రతినిధి కూడా తాము అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా అమెరికాలోని ‘కమ్యూనికేషన్స్ డిసెన్సీ యాక్ట్ - సెక్షన్ 230’ ప్రకారం, థర్డ్-పార్టీ యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్కు టెక్ కంపెనీలు చట్టపరంగా బాధ్యులు కావు. అయితే, ఈ కేసులో న్యాయవాదులు కంటెంట్ను కాకుండా టెక్ కంపెనీలు రూపొందించిన యాప్ డిజైన్ (వ్యసనకరమైన ఫీచర్లు) లోపభూయిష్టంగా ఉందంటూ పట్టుబట్టడం విశేషం.ఈ కేసు కేవలం ఒక యువతికి సంబంధించినది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా సోషల్ మీడియా సంస్థలపై దాదాపు 10,000 కంటే ఎక్కువ వ్యక్తిగత కేసులు, సుమారు 800 స్కూల్ డిస్ట్రిక్ట్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అప్పీల్ తీర్పు భవిష్యత్తులో సోషల్ మీడియా నియంత్రణలపై, అలాగే కంపెనీల యాప్ డిజైన్ విధానాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భవిష్యత్తులో పిల్లల కోసం సోషల్ మీడియా యాప్స్లో భారీ మార్పులు వచ్చేందుకు ఇది ఒక మైలురాయిగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు
కలుషిత ఆహారం.. స్విగ్గీ ఇన్స్టామార్ట్కు నోటీసులు
ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్ఫారమ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) షాక్ ఇచ్చింది. వినియోగదారుల నుంచి వచ్చిన నాణ్యత ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థకు ఫుడ్ రెగ్యులేటర్ ఏకంగా 9 నోటీసులను జారీ చేసింది. కాలం చెల్లిన, కలుషితమైన, సురక్షితంకాని ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఈ నోటీసులు అందినట్లు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.లోపభూయిష్ట సేవలు.. కస్టమర్ల ఆగ్రహంఇటీవలి కాలంలో క్విక్ కామర్స్ యాప్ల ద్వారా నిమిషాల వ్యవధిలో నిత్యావసరాలు, ఆహార పదార్థాలను డెలివరీ పొందే ధోరణి మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగింది. అయితే, వేగంగా డెలివరీ చేయాలనే తపనలో నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులలో కొన్ని ప్రధాన లోపాలు ఉన్నట్లు వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. అందులో..ఎక్స్పైరీ డేట్ ముగిసిన పాలు, బ్రెడ్, ప్యాక్డ్ ఫుడ్స్ సరఫరా చేయడం.కొన్ని ప్యాకెట్లలో పురుగులు రావడం, కూరగాయలు/పండ్లు కుళ్లిపోయి ఉండటం.నిల్వ ఉంచే ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడం.నోటీసుల్లో ఏముంది?వినియోగదారుల రక్షణ చట్టాలు, ఆహార భద్రత చట్టాల ప్రకారం ఈ లోపాలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఫుడ్ రెగ్యులేటర్ స్విగ్గీ యాజమాన్యాన్ని ఆదేశించింది.1. పంపిణీ కేంద్రాల్లో(డార్క్ స్టోర్స్) నిల్వ పద్ధతులు ఎలా ఉన్నాయి?2. క్వాలిటీ చెకింగ్ కోసం ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు?3. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలు ఏమిటి?ఈ విధమైన తొమ్మిది నోటీసులకు సంబంధించి స్విగ్గీ ఇన్స్టామార్ట్ నిర్దేశిత గడువులోగా అధికారిక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే భారీ జరిమానాలతో పాటు సదరు డార్క్ స్టోర్ల లైసెన్సులను రద్దు చేసే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలిఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్లైన్లో ఆహార పదార్థాలు, నిత్యావసరాలు ఆర్డర్ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వస్తువు డెలివరీ అయిన వెంటనే ప్యాకెట్పై ఉన్న ఉత్పత్తి తేదీ, ఎక్స్పైరీ తేదీలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఎలాంటి లోపాలున్నా వెంటనే సదరు ప్లాట్ఫారమ్తో పాటు జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ లేదా ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేయవచ్చు.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు
యువతకు అలర్ట్.. రాబర్ట్ కియోసాకి పోస్ట్!
బంగారం, వెండి, బిట్కాయిన్ గురించి చెప్పే 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఏఐ గురించి, ఉద్యోగాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. దాని ప్రభావం ఉద్యోగాలపై కూడా అంతే వేగంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఏఐ టెక్నాలజీని తమ పనుల్లో ఉపయోగించడం మొదలెట్టేశాయి. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని కియోసాకి పేర్కొన్నారు.అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి అభిప్రాయం ప్రకారం.. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువ ఉద్యోగులు రాబోయే కాలంలో ఏఐ ప్రభావానికి గుయారవుతారు. నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, డేటా విశ్లేషణ వంటివన్నీ కూడా ఏఐ చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అనేక కంపెనీల సీఈఓలు కూడా ఈ మార్పుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అమెరికా వద్ద ఏఐ అభివృద్ధికి కావలసిన స్పష్టమైన వ్యూహం ఉన్నప్పటికీ.. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులను ఎలా సిద్ధం చేయాలనే దానికి కావాల్సిన ప్రణాళిక లేదని పేర్కొన్నారు. కాబట్టి యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాలు లేదా ఇతర కంపెనీల మీద ఆధారపడకుండా.. తమ భవిష్యత్తును తామే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.జాబ్ చేస్తున్నవారు సైతం కేవలం ఒక ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఏఐతో ఎలా కలిసి పనిచేయాలి అనే విషయాలను నేర్చుకోవాలి. అవసరమైతే సొంతంగా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం ముఖ్యమని చెబుతున్నారు. మొత్తం మీద ఏఐ ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని స్పష్టంగా తెలుస్తోంది.
ఫ్యామిలీ
వెండితెర టు వైల్డ్ లైఫ్
దాదాపు 2 దశాబ్ధాల క్రితం దర్శకుడు రామ్గోపాల్ వర్మ తీసిన డి వంటి సినిమాల ద్వారా బాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన రణదీప్ హుడా కెమెరా ముందు ఎంత సహజంగా కనిపిస్తాడో, కెమెరా వెనుక కూడా సహజత్వాన్ని అంతే ప్రేమిస్తాడు. నటనలో జీవించడంతో పాటు ప్రకృతి లో వన్య్రపాణుల జీవితాన్ని పంచుకోవడాన్ని ఇష్టపడతాడు. వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ ఆయనకు ఎంతో ఇష్టమైన అభిరుచి. దీనికోసం గతంలోనూ పలు అరణ్యాలను అన్వేషించి, తాజాగా మధ్యప్రదేశ్లోని కన్హా నేషనల్ పార్క్ను సందర్శించాడు. జీవవైవిధ్యానికి స్వర్గధామమైన కన్హా, పులులు, చిరుతలు, చిత్తడి జింకలు (బారాసింఘా), కృష్ణజింకలు తదితర అరుదైన, అంతరించిపోతున్న జాతులకు నిలయం. సతీసమేతంగా...ఆయన తన భార్య, నటి లిన్ లైశ్రామ్తో కలిసి కన్హా జాతీయవనంలోని జీవ వైవిధ్యాన్ని ఆస్వాదిస్తూ పులులు, చిరుతలు, బరాసింఘా జింకలు, బ్లాక్బక్స్ వంటి అరుదైన జంతువులను తన కెమెరాలో బంధించారు. జంతువుల సహజ ప్రవర్తనకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా చిత్రీకరించడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తారు. మంచి ఫొటోకోసం గంటల తరబడి ఓపికగా ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. ‘వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ నాకు కేవలం హాబీ మాత్రమే కాదు. ప్రకృతితో, నాతో నేను మళ్లీ అనుసంధానం కావడానికి ఓ మార్గం కూడా. అడవిలో జంతువులను వాటికి తగిన సహజమైన వాతావరణంలో గమనించడం సహనం, వినయంతో సహా మనకు ఎన్నో నేర్పిస్తుంది. అంతేకాదు, జీవితంపై కొత్త దృక్పథాన్ని ఇస్తుంది’’ అంటాడు రణదీప్. పర్యావరణ పరిరక్షణకు మద్దతుగత కొంతకాలంగా వన్య్రపాణుల సంరక్షణకు రణదీప్ తనవంతు మద్దతు ఇస్తున్నాడు. అడవులు, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని సోషల్ మీడియాలో తరచుగా గుర్తు చేస్తుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 500 కుపైగా మొక్కలు నాటిన విషయాన్ని కూడా ఆయన పంచుకున్నారు. అడవి రెండో ఇల్లు...‘గత కొంత కాలంగా అడవి నా రెండవ ఇల్లుగా మారింది, అడవిలో గడిపిన ప్రతి క్షణం ప్రకృతిలోని ప్రతిదీ ఒకదానితో ఒకటి ఎంత అందంగా ఎలా ముడిపడి ఉందో తెలియజేస్తుంది. ఇది అద్భుతాలతో నిండిన ప్రపంచం, ఇక్కడ పర్యావరణ వ్యవస్థ ఎంత క్లిష్టమైనదో ప్రత్యక్షంగా చూశాను. అతి చిన్న జీవుల నుంచి అతి పెద్ద మాంసాహార జీవి వరకు, ప్రకృతి నియమాలను ఎంతో కచ్చితత్వంతో పాటించడం గమనించాను’’ అంటాడాయన. – సత్యబాబు, సాక్షి, హైదరాబాద్
అవేర్నెస్ ఆపొద్దు..
పిరియడ్స్ గురించిన అవేర్నెస్ను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాల్సిందేఒక అమ్మాయి స్కూల్కు సెలవు పెట్టడానికిఒక క్రీడాకారిణి మైదానానికి దూరంగా ఉండడానికిఉద్యోగినులు చాలాసార్లు ఇబ్బంది పడటానికిఈ సమస్య పై అవగాహన లోపమే కారణం.శరీరం పెట్టే ఇబ్బంది కంటే సమాజం చేస్తున్న అవమానమే జాస్తి.చైతన్యం కోసం అందరూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.సినిమా రంగంలో కూడా ‘ప్యాడ్మ్యాన్’ వంటి సినిమాలు నిశ్శబ్దంగా ఉన్న గోడలను బద్దలు కొట్టాయి. ఇప్పుడు ‘పిరియడ్ సేఫ్’ పేరుతో మన వంతు కాంపెయిన్ మనం చేశాం.స్కూల్ పిల్లల నుంచి జాతీయ క్రీడాకారిణుల వరకు వారి గొంతు విన్నాం. కానీ... ఇది సరిపోదు. ఈ సంభాషణ ఇక్కడితో ఆగకూడదు. ప్రతి అమ్మాయికి సురక్షితమైన గౌరవప్రదమైన పిరియడ్ దక్కే వరకు మన పోరాటం ఆగదు. ఈరోజు మనం మాట్లాడింది రక్తం గురించి కాదు. రేపటి తరం ధైర్యం గురించి.నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యలకు పరిష్కారాలు తెలియజేస్తున్నవారి సూచనలను మనమూ పాటిద్దాం. మన ఇంట్లోనూ పీరియడ్ ఫేజ్ నిశ్శబ్దపు గోడలను కూల్చేద్దాం. ‘ఆ రోజులలో’ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుందాం.. అండగా ఉందాం..టీచర్లే ముందు గుర్తించగలరుమాది కో ఎడ్యుకేషన్ స్కూల్. అబ్బాయిలకన్నా అమ్మాయిల సంఖ్యే అధికం. నెలసరి సమయంలో అమ్మాయిల శారీరక, మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి దానిపై వారికి అవగాహన కోసం ఏడాదికి మూడుసార్లైనా అవేర్నెస్ క్యాంపులను ఏర్పాటు చేయిస్తాం. అమ్మాయిల నెలసరి సమస్యలను అడిగి తెలుసుకుంటాం. నెలసరి సమయంలో శుభ్రత పాటించకపోతే భవిష్యత్తులో ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి, అవి దీర్ఘకాలం ఎలా బాధిస్తాయో వివరిస్తాం. ఇన్ఫెక్షన్లు వచ్చిన మహిళలు తల్లులు కావాలనుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియజేస్తాం. శానిటరీ ప్యాడ్స్ వాడకం గురించి చెబుతూ, ఎన్జీవోల సాయంతో స్కూల్స్కి శానిటరీ ప్యాడ్స్ తెప్పిస్తుంటాం. ఆరు నెలలకు సరిపడా అమ్మాయిలకు కావల్సిన ప్యాడ్స్ ఒకేసారి పంపిణీ చేస్తాం. ఆరోగ్యంగా ఎదగడానికి కావల్సిన అవగాహన స్కూల్లో కలిగిస్తాం. – వాణీ సక్కుబాయి, జెడ్పిహెచ్ఎస్ టీచర్ఇంటింటికీ వెళ్లి అవగాహనఆశావర్కర్గా ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో తల్లీ పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రసవం తర్వాత మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు. అధిక రక్తస్రావం, నెలసరి సక్రమంగా రాకపోవడం, రక్తహీనత వంటి సమస్యల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మహిళలకు చెబుతుంటాం. స్కూళ్లకు వెళ్లి నెలసరి సమయంలో శుభ్రత లేకపోతే వచ్చే సమస్యల గురించి వివరించడం, సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పడం, వ్యాక్సిన్లు వేయించడం చేస్తుంటాం. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డ తల్లి అయ్యి, ఆరోగ్యకర జీవనం గడిపే వరకు మా పాత్ర ఉంటుంది. ఫోన్ల ద్వారానూ, ఇంటింటికి వెళ్లి కూడా మా సేవలను అందిస్తాం. – గంగిలి ధనలక్ష్మి, ఏఎన్ఎమ్తరచూ వర్క్షాప్స్మేం వాటర్, శానిటరీ క్లీనింగ్కు సంబంధించి వర్క్ చేస్తుంటాం. దీంట్లో భాగంగా తరచూ యువతులకు, మహిళలకు శుభ్రతకు సంబంధించిన వర్క్షాప్స్ నిర్వహిస్తుంటాం. ఉపయోగించిన ప్యాడ్స్ను ఎలా డిస్పోజ్ చేయాలో చెబుతాం. మట్టిలో పూడ్చిపెట్టడం కన్నా వాడిన ప్యాడ్స్ను కాల్చేయమని సూచిస్తాం. పీరియడ్స్ వచ్చిన సమయంలో చేతులు, డ్రెస్సుల శుభ్రత, ప్యాడ్స్ మార్చుకోవడం, ఇన్ఫెక్షన్స్ గురించి తరచూ చెబుతుంటాం. కొందరు తమ సమస్యలను నేరుగా వచ్చి, చర్చిస్తుంటారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రతను పాటించడం కూడా చాలా ముఖ్యం.– రేవతి, వాటర్ ఎయిడ్ ఇండియా, స్వచ్ఛంద స్వస్థ కమ్యూనిటీ ఫెసిలిటేటర్కుటుంబ మద్దతు అవసరంనెలసరి సమయంలో అమ్మాయిల మనస్తత్వంలో చాలా మార్పులు ఉంటాయి. వారు తినే ఆహారం, పెరిగిన వాతావరణం కూడా వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంటాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అంత సులువుగా అర్థం చేసుకోలేక ఆందోళన పడుతుంటారు. ఆ సమయంలో వారికి మనస్తత్వ నిపుణుల కౌన్సెలింగ్ అవసరం. ఉద్యోగినులు నెలసరి సమయంలో తమ వర్క్ ప్లేస్లో బ్యాలెన్స్డ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో మాత్రం చిన్న విషయాలకు కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. పీరియడ్స్ ఉన్నవారి మనస్తత్వాన్ని అర్ధం చేసుకుంటూ కుటుంబం వారికి మద్దతుగా ఉండాలి. అప్పుడే ‘ఆమె’ సంతోషంగా ఉంటుంది. కుటుంబమూ సంతోషంగా ఉంటుంది. – డాక్టర్ సునీతాప్రసాద్, సైకాలజిస్ట్నిర్వహణ: నిర్మలారెడ్డి
వర్షాకాలంలో ఆ ఇన్ఫెక్షన్ల బారిన పడకూడదంటే..! తప్పనిసరిగా ఆ ఆహారాలు..
తొలకరి జల్లులతో హమ్మయ్యా అనేలా..భగభగ మండే ఎండల నుంచి చల్లటి ఉపశమనం కలిగించే ఆహ్లాదభరిత వాతావరణం ఇది. ఎంతో చల్లగా ఉండే ఈ సీజన్ ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండే కాలం కూడా. అందువల్లే ఈ సీజన్లో తాజాగా వండిన భోజనం, సురక్షితమైన తాగు నీటిని ఎంచుకుంటేనే కాలానుగుణ వ్యాధులకు అడ్డుకట్ట వేయగలమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వెచ్చని ఉష్ణోగ్రతల కలయికలో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు పెరగడానికి సరైన సమయం ఇది. ఫలితంగా కడుపు ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఈ కాలంలో. అందువల్ల ఎలాంటి ఆహారం తింటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం, అందుకోసం ఏం చేయాలి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.స్ట్రీట్ ఫుడ్..వర్షాకాలంలో దూరంగా ఉండవలసిన అతిపెద్ద ఆహారాలలో వీధి ఆహారం ఒకటి. చాట్, పానీ పూరీలు, కోసిన పండ్లు, మూతపెట్టని చిరుతిళ్లు, బహిరంగ ప్రదేశాల్లో తయారు చేసే ఆహారాలు తదితరాలకు దూరంగా ఉండటం మంచిది. అమ్మకందారులు సురక్షితమైన నీటిని వినియోగించనట్లయితే..కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల తాజాగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఎంచుకోవడమే సురక్షితమైందని సూచిస్తున్నారు.పచ్చి ఆకు కూరలు, సలాడ్లుపచ్చి ఆకుకూరలలో, ముఖ్యంగా వర్షాకాలంలో, మట్టితోపాటు పరాన్నజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు ఉండవచ్చు. వాటిని సరిగ్గా కడగకపోతే, అవి జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. వండటం వల్ల వ్యాధులను కలిగించే చాలా సూక్ష్మక్రిములు నశిస్తాయి కాబట్టి, సాధ్యమైనంత వరకు వండిన కూరగాయలను తినమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ సలాడ్లు తినాలనుకుంటే, వాటిని ఇంట్లో శుభ్రమైన నీటితో బాగా కడిగి తీసుకోవడం మేలు. పండ్లు, కూరగాయలను బాగా కడిగే ముందు, వాటిని కొద్దిగా వెనిగర్ కలిపిన నీటిలో నానబెట్టి తీసుకోవడం మరింత మంచిది.తాజాగా లేని సముద్రపు ఆహారంవర్షాకాలంలో సముద్రపు ఆహారాన్ని జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలా చేపలకు సంతానోత్పత్తి కాలం. దాంతో ఈ సమయంలో, కలుషితం కావడం,పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ఆహారాన్ని తినాలని ఎంచుకుంటే, అది తాజాగా, పూర్తిగా ఉడికించినదైతేనే తీసుకోవడం సురక్షితం. సరిగ్గా ఉడకని లేదా పాడైపోయిన సముద్రపు ఆహారం వల్ల ఆహార సంబంధిత అనారోగ్యాలు, కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుంది.మిగిలిపోయిన..పాడైపోయిన ఆహారంఎక్కువ కాలం పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచిన లేదా చాలా గంటల పాటు బయట వదిలేసిన ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఎందుకంటే తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల మిగిలిపోయిన ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే అది సురక్షితం కాదు. తప్పనిసరిగా ఆహారాన్ని నిల్వ చేయాల్సి వస్తే, దానిని త్వరగా రిఫ్రిజిరేటర్లో పెట్టి, తినే ముందు బాగా వేడి చేసుకోండి.వేయించిన నూనెతో కూడిన ఆహారాలువర్షాకాలంలో ప్రజలు తరుచుగా పకోడాలు, సమోసాలు, ఇతర వేయించిన చిరుతిళ్లను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఆహారాలు బరువుగా ఉండి, జీర్ణం కావడం కష్టంగా ఉంటాయి. పైగా ఇలాంటి ఆహారాల వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం అధికంగా ఉంటుంది.చక్కెర పానీయాలు, డెజర్ట్లు, పచ్చి ఆహారాలుఅధిక చక్కెర పానీయాలు , డెజర్ట్లు వాపుకు కారణం కావచ్చు. పైగా మొత్తం రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయగలవు. వర్షాకాలంలో బయట అమ్మే పచ్చి మొలకలు,ముందుగా కోసిన పండ్లకు దూరంగా ఉండటం మంచిది.ఎందుకంటే అవి బ్యాక్టీరియా వృద్ధికి సులభంగా నిలయాలుగా మారతాయి. బదులుగా, అరటిపండ్లు దానిమ్మపండ్లు వంటి తొక్క తీయగలిగే సీజనల్ పండ్లను ఎంచుకోవడం మేలు.ఆరోగ్యకరమైన ఆహారపు చిట్కాలుతేలికగా, పోషక విలువలతో, సులభంగా జీర్ణమయ్యే, తాజాగా తయారుచేసిన ఇంట్లో వండిన భోజనంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులుబాటిల్లోని నీటిని లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగండి. అవసరమైతే..వాటర్ ప్యూరిఫైయర్ను ఉపయోగించండి లేదా క్లోరిన్ టాబ్లెట్ను కలపండి.వీధి ఆహారానికి దూరంగా ఉండి, ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి.గోధుమలు, పిండిచేసిన ధాన్యాలు సురక్షితమైనవిపండ్లు, కూరగాయలను క్షుణ్ణంగా కడగి తీసుకోవడం మేలుపచ్చి మొలకలు, కోసిన పండ్లకు దూరంగా ఉండండి: ఇవి బ్యాక్టీరియా వృద్ధికి నిలయాలుగా మారతాయిశుభ్రమైన పాత్రలు, పళ్ళాలు వాడండి: వాటిని సబ్బుతో క్షుణ్ణంగా కడగండిశరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి: పుష్కలంగా ద్రవపదార్థాలు తాగండితరచుగా చేతులు కడుక్కోండి: ముఖ్యంగా తినడానికి ముందు, వాష్రూమ్కి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా చేతులు కడుక్కుని తినడం మంచిది. గమనిక: ఇది కేవలం అగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సంస్కృతం చదవడం రాదు.. ఐనా భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసింది!)
ప్యారిస్ హాట్ కౌచర్ వీక్లో పుత్తడి బొమ్మలా ఇషా..!
ప్యారిస్ హాట్ కౌచర్ వీక్లో, అన్నా వింటౌర్తో పాటు డిజైనర్ మనీష్ మల్హోత్రా డెబ్యూ షో కోసం ఇషా అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్లో మనీష్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ షో ఫ్రంట్ రోలో కరణ్ జోహార్, అన్నా వింటౌర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఆ ఈవెంట్లో మనీష్ ఆటం/వింటర్ 2026 హాట్ కౌచర్ కలెక్షన్ నుంచి చేతితో తయారు చేసిన బంగారు గౌనులో ఇషా మెరిశారు. View this post on Instagram A post shared by Check The Tag (@checkthetag) చీలమండలం వరకు ఉన్న ఈ స్ట్రక్చర్డ్ డ్రెస్లో హాల్టర్ నెక్ లైన్తో పాటు ఒక శిల్పకళాత్మకమైన కార్సెట్ సిల్హౌట్ ఉంది. దీనిలో మనీష్ రూపొందించిన ప్రత్యేకమైన, క్లిష్టమైన చేతి ఎంబ్రాయిడరీ కూడా ఉంది. ఈ లుక్కు ఇషా బంగారంతో అలంకరించిన ఫెర్రాగామో హీల్స్, స్టేట్మెంట్ డైమండ్ డ్రాప్ చెవిపోగులు, ఒక ఉంగరాన్ని జత చేసింది. మేకప్ కోసం, ఆమె వింగ్డ్ ఐలైనర్, గోల్డెన్ ఐషాడో, మస్కారా పూసిన కనురెప్పలు, స్పష్టంగా తీర్చిదిద్దిన కనుబొమ్మలు, లేత గులాబీ రంగు బుగ్గలు, నిగనిగలాడే ఎరుపు-గోధుమ రంగు పెదవులను ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగా తన కురులను మధ్యలోకి పాపిడి తీసి వదులుగా వదిలేసి తన లుక్ను పూర్తి చేసింది. అలాగే ఈ ఈవెంట్కు ముందుకు సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ అన్నా వింటౌర్తో కబుర్లు చెబుతూ కనిపించింది ఇషా. ఇక అన్నా ఊదారంగు పూలు, టీల్ గ్రీన్ ఆకులతో కూడిని బోల్డ్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న..బంగారు రంగు సిల్క్ మిడి డ్రెస్లో హాజరయ్యింది. అందుకు అనుగుణంగా ముదురు ఊదా మెటాలిక్ రాళ్లతో అలంకరించిన భారీ ఆభరణాల నెక్లెస్ని జత చేశారామె. కాగా, పారిస్ హాట్ కౌచర్ వీక్లో మనీష్ ప్రదర్శించిన 'మా' అనే కలెక్షన్, మార్చి 19న మరణించిన తన దివంగత తల్లి సుదర్శన్ మల్హోత్రాకు నివాళి. తన చిన్ననాటి జ్ఞాపకాల స్ఫూర్తితో రూపొందించిన ఈ కలెక్షన్లో, 1970వ దశకంలో తన తల్లి ధరించిన చీరల ప్రత్యేకమైన రంగులు కనిపిస్తాయి. ముత్యాలు, జర్దోజీ, రేషమ్, సీక్విన్స్ వంటి అనేక రకాల భారతీయ చేతి-ఎంబ్రాయిడరీ (hand-embroidery) పద్ధతులు ఈ కలెక్షన్లలో అత్యంత ప్రత్యేకం. View this post on Instagram A post shared by Isha Ambani Piramal (@ishaambani) (చదవండి: ఉద్యోగం లేదు, ఎలాంటి వేతనం లేదు..!దర్జాగా స్విట్జర్లాండ్లో..)
అంతర్జాతీయం
రిటర్న్ గిఫ్ట్గా రివాల్వర్
అంకారా: వేడుక ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారింది. ఈ తీరు ఒక్క సంప్రదాయ వేడుకలు, మన దేశానికే పరిమితం కాలేదనిపిస్తోంది ఈ తాజా ఘటన చూస్తే. ఇటీవల నాటో శిఖరాగ్ర సమావేశానికి తుర్కియే ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి హాజరైన వివిధ దేశాధినేతలకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్. సమావేశం ముగిసి వెళ్లేముందు అసాధారణమైన వీడ్కోలు బహుమతి ఇచ్చాడు. సమావేశం నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోవడం నాయకుల వంతయ్యింది. ఇంతకీ గిఫ్ట్ బ్యాగ్లోని చెక్క పెట్టెలో ఉన్న క్లాసిక్ రివాల్వర్. ఉత్తి తుపాకీ మాత్రమే కాదు.. దాంతోపాటు ఆరు బులెట్లు మెరిసిపోతూ కనిపించాయి. టర్కీ జెండా, నాటో లోగోతో పాటు, టర్కిష్, ఇంగ్లిష్ భాషల్లో ‘గుముసే, మా దేశంలో తయారైన మొట్టమొదటి రివాల్వర్ తరహా హ్యాండ్గన్’అని రాసిన ఫలకాన్ని ఉంచారు. తుర్కియే ఆయుధ తయారీ సంస్థ ఎమ్కేఈ ఉత్పత్తి చేసిన అరుదైన సిక్స్–షూటర్ అయిన గుముసే–357 మ్యాగ్నమ్ రివాల్వర్ అది. దానిపై నాయకుల పేర్లను కూడా చెక్కారు. బెల్జియం ప్రధానమంత్రి, లిథువేనియా అధ్యక్షుడు, స్పానిష్ ప్రధాని సహా పలువురు నాయకుల కార్యాలయాలు ఆయా ఫొటోలను పంచుకున్నాయి. తక్కువ ధరకే ఆధునియక హ్యాండ్గన్ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఆయుధాలను తయారుచేస్తున్న దేశాలలో తుర్కియే ఒకటి. తక్కువ ధరకే అంతర్జాతీయ ప్రమాణాలు, అద్భుతమైన పనితీరు కలిగిన ఆధునిక హ్యాండ్గన్ తయారు చేయడంలో ఈ దేశం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ దేశం తొలినాళ్లలో తయారు చేసిన రివాల్వర్ టైప్ హ్యాండ్గన్ ‘గుముసే’అరుదైనది. 2019, 2024 మధ్యకాలంలో అమెరికా, ఇటలీల తర్వాత తుర్కియే ప్రపంచంలో మూడవ అతిపెద్ద చిన్న ఆయుధాల ఎగుమతిదారుగా నిలిచింది. మ్యూజియాలకు చేర్చిన నాయకులు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్, తన రివాల్వర్ను ఒక సేఫ్లో భద్రపరచడానికి బ్రస్సెల్స్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకీ రివాల్వర్ వార్సా విమానాశ్రయంలో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఉంది. డచ్, స్వీడిష్ ప్రధానమంత్రుల కార్యాలయాలు తమ రివాల్వర్లను తుర్కియే రాజధాని అంకారాలోని వారి వారి రాయబార కార్యాలయాలకు తీసుకెళ్లాయి. బ్రిటన్కు తుపాకీతో పాటు క్లీనింగ్ కిట్, 500 తూటాలు కూడా వచ్చాయి. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని రివాల్వర్ను ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన పలాజో చిగీలో ఇతర ప్రభుత్వ బహుమతులతో పాటు భద్రపరిచారు. ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లేయన్, తనకు కానుకగా వచ్చిన తుపాకీని సైనిక మ్యూజియానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. గ్రీస్ కానుకను ఏథెన్స్లోని యుద్ధ మ్యూజియంలో ఉంచాలనుకుంటోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, రివాల్వర్ను జాతీయ యుద్ధ మ్యూజియానికి చేర్చారు.
పామ్బీచ్ ఎయిర్ పోర్టుకు ట్రంప్ పేరు!
వెస్ట్ పామ్ బీచ్: అమెరికాలోని దక్షిణ ఫ్లారిడా ప్రాంతంలోని పామ్బీచ్ విమానాశ్రయం పేరును గురువారం ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’గా మార్చరు. పాత బోర్డుల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసే పని మొదలైపోయింది. కొద్దికాలంపాటు పాత, కొత్త బోర్డులు రెండూ కనిపిస్తూంటాయని విమానాశ్రయ అధికారులు ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలిపారు. కొత్త బోర్డులు, బ్రాండింగ్ తదితర ఏర్పాట్లకు 55 లక్షల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. విమానాశ్రయానికి తన పేరు పెట్టడంపై అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ట్రూత్ సోషల్లో ఒక పోస్టు చేస్తూ... ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యద్భుతమైన విమానాశ్రయాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. దానికి తన పేరు పెట్టడం పెద్ద గౌరవంగా అభివర్ణించారు.
పునర్వినియోగ బూస్టర్ అభివృద్ధిలో చైనా విజయం
బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా అరుదైన ఘనత సాధించింది. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్–ఎక్స్ తరువాత మళ్లీమళ్లీ వాడగల రాకెట్ బూస్టర్లను అభివృద్ధి చేయగలిగింది. చైనా హైనాన్ ప్రావిన్స్ నుంచి శుక్రవారం ఆకాశానికి ఎగిరిన లాంగ్ మార్చ్–10బి నిర్దేశిత కక్ష్యలో పేలోడ్ను చేర్చినట్లు చైనా వార్తా పత్రిక జిన్హువా తెలిపింది. అయితే ఇదే ప్రయోగంలో రాకెట్ మొదటి దశ బూస్టర్ను నియంత్రిత పద్ధతిలో పొందడంలోనూ విజయం సాధించింది. రాకెట్ నుంచి మొదటి, రెండవ దశలు విడిపోయిన తరువాత మొదటి దశ బూస్టర్ సముద్రంపై ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ఫామ్పై ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థలో సురక్షితంగా వాలింది. మళ్లీ మళ్లీ వాడగల రాకెట్ బూస్టర్ల అభివృద్ధిలో ఇదో కీలక ఘట్టం. చైనా గత డిసెంబర్లోనూ రెండు పునర్వినియోగ రాకెట్ బూస్టర్లను ప్రయోగించినప్పటికీ అవి స్పేస్ ఎక్స్ రాకెట్ల మాదిరిగా నిట్టనిలువుగా నేలను చేరడంలో విఫలమైనట్లు హాంకాంగ్లోని సౌత్ చైనా మార్నీంగ్ పోస్ట్ తెలిపింది. ఈసారి మాత్రం ప్రయోగం, బూస్టర్ రికవరీ రెండూ విజయవంతంగా పూర్తయ్యాయి. లాంగ్ మార్చ్–10బి రాకెట్ సుమారు 63 మీటర్లు ఎత్తు, ఐదు మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. మోసుకెళ్లగల పేలోడ్ సామర్థ్యం16 టన్నులు. మొదటి దశ బూస్టర్ సముద్ర ప్లాట్ఫామ్పై దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రోబోలు ఆపరేషన్ చేశాయి!
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హ్యూమనాయిడ్ రోబోలు (మనుషుల్లా వ్యవహరించేవి) ఒకటి కాదు.. రెండు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాన్డియాగో) శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఒక ఆపరేషన్లో సర్గీ అనే రోబోను ఒక వైద్యుడు రిమోట్ కంట్రోలర్ సాయంతో పని చేయించి పిత్తాశయాన్ని (గాల్బ్లాడర్) తొలగించగా... రెండు హ్యూమనాయిడ్ రోబోలు తమలో తాము మాట్లాడుకుంటూ రెండో ఆపరేషన్ను పూర్తి చేశాయి. ఈ ప్రయోగం వివరాలు అంతర్జాతీయ ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘నేచర్’జూలై ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమయ్యాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోబోలతో శస్త్రచికిత్సలు చేయించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. తరచూ ఇలాంటి వార్తలు చదువుతూనే ఉంటాం. అయితే ఇందులో చాలా పరిమితులున్నాయి. మొదటగా వీటి బరువు ఇంట్యూటివ్ సర్జికల్స్ వారి డావిన్సీ సర్జికల్ సిస్టమ్ 820 కిలోల వరకూ బరువు ఉంటే సీఎంఆర్ సర్జికల్స్కు చెందిన వెరిసియస్ 450 కిలోలు ఉంటుంది. మెడ్ట్రానిక్ కంపెనీ తయారు చేసిన హ్యూగో ఆర్ఏఎస్ సుమారు 540 కిలోల బరువు ఉంటుంది. వీటిని ఆపరేషన్ థియేటర్లలో అమర్చడం పని చేయించడం కష్టమైన వ్యవహారం. ప్రత్యేక నైపుణ్యాలున్న సిబ్బంది అవసరం. పైగా ఒక్కోటి కొన్ని రకాల సర్జరీలు మాత్రమే చేయగలదు.హ్యూమనాయిడ్ రోబోలు ఈ పరిమితులన్నింటినీ అధిగమించగలవని అంచనా. కాలిఫోర్నీయా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఉపయోగించిన హ్యూమనాయిడ్ రోబో సర్గి ఐదు అడుగుల ఎత్తు, సుమారు 27 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్కు నడుచుకుని రాగలదు. సర్జికల్ రోబోలతో పోలిస్తే చౌక. ప్రపంచంలో ఏ మూలలోనైనా ఇట్టే ఉపయోగించవచ్చు. పేద, మధ్యాదాయ దేశాల్లో, వనరులు, వసతులు తక్కువగా ఉన్నచోట్ల ఈ హ్యూమనాయిడ్ రోబోలు ప్రాణాలు నిలిపే కీలకమైన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడతాయని కాలిఫోర్నీయా వర్సిటీ ఇంజినీర్ మైకెల్ ఇప్ తెలిపారు. సర్జరీకి అవసరమైన కత్తులు, ఇతర పరికరాలను పట్టుకునేందుకు అడాప్టర్లను ప్రత్యేకంగా తయారు చేశామని, వీటితో పనిచేయించడం పెద్ద కష్టమేమీ కాలేదని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న సర్జన్ నికితా తరేజా తెలిపారు. ఈ హ్యూమనాయిడ్ రోబోలు ఆపరేషన్ థియేటర్లో ఎంత బాగా సర్దుకుపోయాయో చూసి ఆశ్చర్యపోయామన్నారు. తొలి ఆపరేషన్లో సెర్గిని పదే పదే రీకాలిబరేట్ చేయాల్సి వచ్చిందని, దీనివల్ల కొంత ఎక్కువ సమయం పట్టిందని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం
8 నెలల గర్భిణిపై భర్త కిరాతకం..!
కడుపులో పెరుగుతున్న బిడ్డ వద్దనుకున్న భర్త 8 నెలల కడుపుతో ఉన్న భార్యను హత్య చేయడానికి ప్రయత్నించిన సంఘటన చిక్కబాణావర పోలీస్స్టేషన్ పరిధిలోని హెసరఘట్ట రోడ్డులో చోటు చేసుకుంది. మహమ్మద్ పీర్(40) అనే వ్యక్తి తన భార్య హసీనా(35)పై హత్యాయత్నం చేశాడు. వివరాలు.. మహమ్మద్ పీర్, హసీనాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే అంతకు ముందే మహమ్మద్ పీర్కు వివాహమై సంతానం కూడా ఉన్నారు. ఈక్రమంలో హసీనా రెండు సార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. మళ్లీ ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవడానికి హసీనా ఒప్పుకోలేదు. మహమ్మద్ పీర్ ఆమెపై దాడి చేసి అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసినా హసీనా ససేమిరా అంది. గురువారం సాయంత్రం హసీనా ఇంట్లో నిద్రిస్తుండగా చున్నీ(వేల్)తో గొంతు బిగించి హత్యాయత్నం చేశాడు. పెనుగులాటలో హసీనా మూర్ఛబోవడంతో మృతి చెందిందని భావించి పరారయ్యాడు. అయితే హసీనాకు స్పృహ వచ్చాక పుట్టింటికి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే హసీనాను వెంటబెట్టుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి నిందితుడిని అరెస్టు చేశారు.కర్ణాటక:
15 రోజులు.. 31 కోట్ల లీటర్లు.. చరిత్ర తిరగరాసిన ప్రజలు..
ఒక చుక్క నీరు కూడా వృథా కాకూడదని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. చేతుల్లో ఎలాంటి భారీ యంత్రాలు లేవు.. కోట్ల రూపాయల ప్రాజెక్టులు లేవు.. కానీ ఒకే లక్ష్యం ఉంది.. వర్షపు నీటిని కాపాడాలి. ఆ సంకల్పంతో వేలాది మంది గ్రామస్తులు కదిలారు. ఫలితం.. కేవలం 15 రోజుల్లో ఏకంగా 31 కోట్ల లీటర్ల నీటిని సంరక్షించిన అరుదైన విజయగాథ ఇది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగుచూసింది.ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలో మొదలైన ఈ జల ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వర్షాలు కురిసినప్పుడు నీరు వేగంగా ప్రవహించి గ్రామాల నుంచి బయటకు వెళ్లిపోకుండా, ప్రతి చుక్కను భూమిలోకి చేర్చాలనే ఆలోచనతో గ్రామస్తులు స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. ‘మోర్ గావ్, మోర్ పానీ 2.0’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వందలాది గ్రామాల్లో ప్రజలు శ్రమదానం చేశారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, రైతులు, యువత కలిసి నీటి నిల్వ నిర్మాణాల పనుల్లో పాల్గొన్నారు. ఇంకుడు గుంతలు, సోక్పిట్లు, చిన్న నీటి నిల్వ గుంతలు, వర్షపు నీటిని మళ్లించే కాలువలు వంటి అనేక నిర్మాణాలను తక్కువ సమయంలో పూర్తి చేశారు.ఈ ప్రయత్నంలో వేలాది చిన్న చిన్న పనులు కలిసి ఒక పెద్ద ఫలితాన్ని ఇచ్చాయి. మొత్తం 3 లక్షలకు పైగా జల సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు కావడంతో వర్షపు నీరు నేరుగా భూగర్భ జలాల్లోకి చేరే అవకాశం పెరిగింది. సాధారణంగా వాగులు, కాలువల ద్వారా వెళ్లిపోయే కోట్లాది లీటర్ల నీరు ఇప్పుడు గ్రామాల భవిష్యత్తుకు నిల్వగా మారింది. ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు శక్తి ప్రజల భాగస్వామ్యం. కేవలం ప్రభుత్వం చేసే పనిగా కాకుండా, తమ గ్రామానికి తామే నీటి రక్షకులుగా మారిన ప్రజల ఆలోచనే ఈ విజయానికి కారణమైంది. నీటి సమస్యను ఎదుర్కోవడానికి పెద్ద ప్రాజెక్టుల కోసం ఎదురుచూడకుండా, చిన్న చిన్న చర్యలతోనే పెద్ద మార్పు తీసుకురావచ్చని గ్రామాలు నిరూపించాయి.ఈ కార్యక్రమం కేవలం నీటి నిల్వకే పరిమితం కాలేదు. భవిష్యత్తులో తాగునీటి సమస్యను తగ్గించడం, రైతులకు సాగునీటి భరోసా కల్పించడం, భూగర్భ జలాలను పునరుద్ధరించడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు బలమైన పునాది వేసింది. ప్రభుత్వ పథకం ఉన్నప్పటికీ, దీనిని విజయవంతం చేసింది ప్రజలే. ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి పనిచేయడం, ప్రతి గ్రామం దీన్ని తమ బాధ్యతగా తీసుకోవడంతో ఇది ప్రభుత్వ కార్యక్రమం కంటే ప్రజా ఉద్యమంగా మారింది.వాతావరణ మార్పులు, కరవు, నీటి కొరత ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. ప్రజలు ఒక్కటైతే ప్రకృతిని కాపాడటమే కాదు, భవిష్యత్ తరాలకు నీటి భద్రతను కూడా అందించవచ్చని ఈ గ్రామాలు నిరూపించాయి. ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకుండా కాపాడాలనే సంకల్పం.. నేడు 31 కోట్ల లీటర్ల జలసంపదగా మారింది. ఇదే మహాసముంద్ గ్రామాల అసలైన విజయం.
ముగ్గురు బాలికలపై కామాంధుడి లైంగిక దాడి..!
కర్ణాటక: రాచనగరి మైసూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ముగ్గురు బాలికలపై ఓ కామాంధుడు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. నిందితుడు మొదట 9వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అసభ్యకరమైన వీడియో క్లిప్తో ఆమెను బెదిరించి, తన స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి చేశాడు. అనంతరం ఆమె తీసుకువచ్చిన మరో ఇద్దరు బాలికలపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ఘోరం వెలుగు చూడగా పోలీసులు సదరు కామాంధుడిని కటకటాల వెనక్కు నెట్టి విచారణ చేస్తున్నారు. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. ఓ బాలిక మైసూరులోని విజయనగరలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు తన పొరుగు గ్రామానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని ఇన్స్టా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను ఆమెతో నిరంతరం సంప్రదిసూ మాయమాటలతో తన ఇంటికి రప్పించుకున్నాడు. అతడిని నమ్మిన బాలిక విజయనగరలోని అతని ఇంటికి వచ్చింది. ఆ సమయాన్ని ఉపయోగించుకుని, అతను ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన మొబైల్ ఫోన్లో ఆమె అశ్లీల వీడియోను చిత్రీకరించాడు. అలా అతను ఆమెను పదేపదే లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఆ వీడియో క్లిప్లను చూపుతూ ఆమెను బెదిరించాడు. స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి తన స్నేహితురాళ్లను తనతో పాటు ఇంటికి తీసుకురమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక, తన ఇద్దరు స్నేహితురాళ్లను అతని ఇంటికి తీసుకువెళ్లింది. అతను వారిపై కూడా లైంగిక దాడికి పాల్పడటమేగాక మిగతా స్నేహితురాళ్లను కూడా తీసుకురమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆందోళనకు గురైన ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. దీంతో వారు ఒడనాడి సేవా సంస్థకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన స్పయాని, పరశు ఈ విషయాన్ని బాలల సంరక్షణ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలిక, ఆమె తల్లిదండ్రులు విజయనగర డివిజన్ ఏసీపీకి కూడా ఈ సంఘటనల గురించి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. బాలల సంరక్షణ కమిటీ కూడా బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
విజయ్పై అభిమానం.. ఆమె ఉద్యోగానికే ఎసరు!
చెన్నై: అభిమానం ఉండొచ్చు.. కానీ ఆ అభిమానం హద్దులు దాటితే మూల్యం చెల్లించక తప్పదు. తొలినాళ్ల నుంచే విజయ్కు వీరాభిమానిగా ఉన్న ఒకావిడ విధి నిర్వహణలో చేసిన పని.. చివరకు ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ ఆగ్రహానికి గురి చేసింది. అభిమాని అయినా డోంట్కేర్ అని అనేసింది. ఫలితంగా ఆమె ఉద్యోగమే ప్రమాదంలో పడింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై ఉన్న అభిమానంతో ఓ ప్రభుత్వ పాఠశాల హెడ్మిస్ట్రెస్ తీసుకున్న నిర్ణయం.. చివరకు ఆమె సస్పెన్షన్కు దారితీసింది. తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులకు సీఎం విజయ్ కరూర్ సభను ప్రొజెక్టర్పై ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) చేసి చూపించడంతో తమిళనాడు ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకుంది.కరూర్ జిల్లాలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో హెడ్మిస్ట్రెస్గా పనిచేస్తున్న ఎస్. మల్లిగా విజయ్కు వీరాభిమాని. శుక్రవారం తరగతి గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి సీఎం విజయ్ కరూర్ సభను ప్రొజెక్టర్పై ప్రత్యక్షంగా వీక్షించేలా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.విషయం తెలిసిన వెంటనే పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో ఇది హెడ్మిస్ట్రెస్ వ్యక్తిగత నిర్ణయమేనని తేలడంతో ఆమెను తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఇదే తరహాలో జరిగిన మరో ఘటనపైనా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు."పాఠశాలల్లో రాజకీయాలకు ఎలాంటి స్థానం లేదు. విద్యాసంస్థలు రాజకీయ వేదికలు కావు.. అవి భావితరాలను తీర్చిదిద్దే జ్ఞాన కేంద్రాలు" అని మంత్రి స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మినహా పుట్టినరోజు వేడుకలు, రాజకీయ సభలు లేదంటే ఇతర ప్రభుత్వేతర కార్యక్రమాలకు పాఠశాలల్లో అనుమతి ఉండదని తెలిపారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రైవేట్ సంస్థల సభ్యులు నేరుగా విద్యార్థులతో సమావేశాలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.కరూర్ జిల్లా ప్రాథమిక విద్యాధికారి జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో.. విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ మార్గదర్శకాల ఉల్లంఘన, జూలై 9న విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్ను పాటించకపోవడం వంటి ఆరోపణలను ప్రస్తావించారు. పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు హెడ్మిస్ట్రెస్ మల్లిగా సస్పెన్షన్లోనే కొనసాగనున్నారు.ఇటీవల సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు పాఠశాల ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం కూడా వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలై ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాసంస్థల్లో రాజకీయ కార్యకలాపాలపై తమిళనాడు ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది.
ఎన్ఆర్ఐ
రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ
ఓ భారత మహిళ అబుదాబిలో జాక్పాట్ కొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 62 కోట్ల లాటరీని గెలుచుకుంది. ఢిల్లీకి చెందిన కనికా అరోరా అనే గృహిణి కొన్న లాటరీ టికెట్కు రూ. 62 కోట్ల ప్రైజ్మనీ వరించింది. అబుదాబి బిగ్ టికెట్ సిరీస్లో భాగంగా ప్రతీనెల లాటరీ టికెట్ కొనే ఆ మహిళకు జూన్ 30వ తేదీన తీసిన లాటరీలో 25 మిలియన్ దిర్హమ్ల భారీ మొత్తం వరించింది. తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవడంతో సదరు మహిళ ఉబ్బితబ్బిబ్బై పోతోంది. సంవత్సరాలుగా ఢిల్లీకి చెందిన ఆమె కుటుంబానికి బిగ్ టికెట్ ఎంట్రీ కొనడం నెలవారీ అలవాటుగా మారింది. గృహిణి అయిన కనికా అరోరా అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 288 డ్రాలో 25 మిలియన్ దిర్హమ్ల (AED) గ్రాండ్ ప్రైజ్ (సుమారు రూ. 62 కోట్లు) గెలుచుకుని, చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నారు.దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా ఆ టికెట్ను కొనుగోలు చేశాం. అబుదాబిలో లాటరీ టికెట్ల కొనుగోలులో ఒక రకమైన ప్రమాదం ఉన్నప్పటికీ, వాటిని మాత్రం ప్రతీనెలా కొంటూనే ఉన్నాం. ఇన్నాళ్లకు మా కల సాకారమైంది. లాటరీలో బహుమతి గెలిస్తే ఆ మొత్తాన్ని ఏం చేయాలో అనే దానిపై నా భర్త, నేను మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు నిజంగా గెలవడంతో ఎక్కడ నుంచి ప్రారంభించాలో కూడా తెలియడం లేదు. ప్రతీ ఒక్కరూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. మన కల ఎలా నిజమౌతుందో చెప్పలేం కదా’ అంటూ ఆనందం వ్యక్తం చేసిదామె.
NRI: గాంధీ మెమోరియల్.. ఘనంగా అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు!
డాలస్, టెక్సస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్ పరిసర ప్రాంతమైన ఇర్వింగ్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద అమెరికాదేశపు 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అతి వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యాల్ జపంటా మాట్లాడుతూ - అమెరికా జనజీవన స్రవంతిలో భాగం అవుతూ, అర్వింగ్ నగర ప్రగతికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు, దేశంలో కెల్లా ప్రతిష్టాత్మకమైన గాంధీ స్మారకం ఇర్వింగ్ నగరంలో ఏర్పాటు చేసినందులకు ధన్యవాదములు అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రత్యేకఅతిథిగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ తన సందేశంలో ఎన్నో దశాబ్దాలగా టెక్సాస్ రాష్ట్రంలో స్థిరపడిన ప్రవాస భారతీయులు టెక్నాలజీ, విద్యా, వైద్య రంగాలలో తమ ప్రతిభను చూపుతూ రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి తద్వారా అమెరికా జిడిపి ఎదుగుదలలో భాగస్వాములవడం అభినందనీయం అని ప్రశంసించారు. 50 మందికి పైగా “స్వర స్వాతి సింగింగ్ గ్రూప్” చిన్నారులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక అమెరికా దేశభక్తి పూర్వక గీతాలు ఆలపించడం ఆనందగా ఉందని, ఈ దేశ భవిష్యత్ ఈ యువత చేతిలోనే ఉందని శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – “ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక చారిత్రక ఘట్టం అన్నారు. ఈ రెండున్నర శతాబ్దాల ప్రయాణంలో అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వచ్చిన ప్రజలు వారితో పాటు తీసుకు వచ్చిన తమ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రతిభతో ఈ దేశాన్ని మరింత సుసంపన్నం చేశారు. భారతీయ మూలాలున్న అమెరికన్లకు విద్య, ఉపాధి, వ్యాపారం, శాస్త్ర సాంకేతిక రంగాలు, వైద్యం, ప్రజాసేవ ఇలా ప్రతి రంగంలోనూ ఎదగడానికి ఈ దేశం విశాలమైన అవకాశాలను కల్పించింది అందుకు కృతజ్ఞతలు అన్నారు.మన భారతీయ సంస్కృతిని, విలువలను కాపాడుకుంటూ మనం అమెరికా సమాజంలో భాగస్వాములవ్వాలి. స్వాతంత్ర్యం మనకు హక్కులను మాత్రమే ఇవ్వదు; బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. మనకు లభించిన స్వేచ్ఛను గౌరవించండి. వైవిధ్యాన్ని ఆదరించండి. నిజాయితీని ఆచరించండి. మానవత్వాన్ని పెంపొందించండి. విభేదాలకంటే ఐక్యతను, స్వార్థం కంటే సేవాభావాన్ని, ద్వేషం కంటే ప్రేమను ఎంచుకుని ముందుకు సాగాలి అన్నారు.”మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు రావు కల్వల, తయాబ్ కుండావాలా, మహేంద్ర రావు, రాజేంద్ర వంకా వాలా, రాంకీ చేబ్రోలు, దీపక్ కార్లా, అనంత మల్లవరపు, ముర్తుజా భాయ్, సోనిట్ సింగ్, కలై కృష్ణమూర్తితో సహా అనేక సంఘాల ప్రతినిధులు అధికసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక గీతాలతో పిల్లకు తర్ఫీదు ఇచ్చి, 50 మందికి పైగా చిన్నపిల్లలతో దేశభక్తి గీతాలను పాడించిన స్వర స్వాతి సింగింగ్ గ్రూప్ అధినేత స్వాతి కుప్పిలికి, సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు, కార్యకర్తలకు, ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ మేయర్ యాల్ జపంటా, ప్రత్యేకఅతిథి టెక్సస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ కు రావు కల్వల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
‘సర్’ ఎఫెక్ట్: 15 లక్షల ‘ప్రవాస’ ఓట్లు గల్లంతు!
గల్ఫ్ కార్మికుల ఓట్ల గల్లంతుపై అందిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. కరీంనగర్ టు గల్ఫ్.. ఓటు హక్కుపై నీలినీడలు కమ్ముకోవడంపై న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. 15 లక్షల మంది ప్రవాసాంధ్రుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న విషయాన్ని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. పోర్టల్ లోపాల వల్ల వీసా పత్రాలు తిరస్కరణకు గురవుతున్నాయని న్యాయవాది రామారావు పేర్కొన్నారు. ఫామ్ 6A ఆన్లైన్ ఇబ్బందులతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో గల్ఫ్ వలస కార్మికులు ఉన్నారని.. ఆయన పేర్కొన్నారు. ఓట్లతో పాటు ఆస్తుల హక్కులపైనా ప్రవాసులలో ఆందోళన నెలకొంది. అసంపూర్ణ అఫీషియల్ మ్యాపింగే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.ప్రధానంగా ఓట్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి మరింత సమయం ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులో విన్నవించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకృతం చేస్తే నిరక్ష్యరాస్యులు సైతం తమ ఓటు హక్కును కాపాడుకోగలుతారని, కాని పక్షంలో ఓట్ల గల్లంతు జరుగుతుందనే విషయాన్ని న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. బయట దేశాల్లో ఉన్న ఇక్కడ ఓటర్లకు ఇంట్లో వాళ్ల ద్వారా గుర్తింపు కార్డు ఇచ్చినా మాన్యువల్గా ఓటు నమోదు ప్రక్రియ కొనసాగేలే చూడాలన్నారు. ఓట్ల జాబితా సవరణలో భాగంగా సాంకేతిక ఆంశాల కారణంగా ఇలా ఓటు తిరస్కరణకు గురి కావడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అంశానికి సంబంధించిన ఫిర్యాదును రిజస్టర్ చేసిన ఎన్హెచ్ఆర్సీ.. తెలంగాణ సీఈఓ సుదర్శన్రెడ్డిని ప్రతివాదిగా చేర్చింది.
కాన్సాస్లో ఆకస్మిక వరదలు : ఏపీకి చెందిన టెకీ దుర్మరణం
అమెరికాలో కాన్సాస్లో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల్లో (Flash Floods) చిక్కుకుని వెంకటేష్ దొప్పలపూడి (33) అనే భారతీయ ఐటీ నిపుణుడు, ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లోని పర్చూరు మండలానికి చెందినవ్యక్తిగా గుర్తించారు. శనివారం మధ్యాహ్నం ఆయన హ్యూస్టన్ నుండి ఉత్తర దిశగా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు పెద్దకుమారుడు దొప్పలపూడి వెంకటేష్ (33) విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గతంలో అమెరికా వెళ్లాడు. వెంకటేష్ నెబ్రాస్కాలో నివసిస్తూ, H-1B వీసాపై అక్కడ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సౌత్-సెంట్రల్ కాన్సాస్లో కురిసిన భారీ వర్షాల (6 ఇంచుల కంటే ఎక్కువ వర్షపాతం) కారణంగా అకస్మాత్తుగా వరదలు పోటెత్తాయి. వెల్లింగ్టన్లోని 'సౌత్ ఆలివర్ రోడ్' బ్రిడ్జ్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో మునిగిపోయింది. కారులో ఒకరు చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం అందించడంతో సమ్నర్ కౌంటీ ఎమర్జెన్సీ రెస్పాండర్స్ రంగంలోకి దిగారు. అయిత వరద ఉధృతి, బలమైన ప్రవాహాల కారణంగా ప్రారంభంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్లు, ఎయిర్ యూనిట్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. కాన్సాస్ హైవే పెట్రోల్ ఎయిర్ యూనిట్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన గాలింపు అనంతరం ఆదివారం వెంకటేష్ మృతదేహాన్ని వెలికితీశారు.ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై ఎక్స్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించింది. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, మృతదేహాన్ని భారతదేశానికి (స్వగ్రామానికి) తరలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని కన్సులేట్ పేర్కొంది. ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు
క్రైమ్
విశాఖ: టెకీ రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అరెస్టు
ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీ హిల్ స్టేషన్ హోటల్లో గత కొన్నిరోజులక్రితం తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి అనుమానస్పద స్థితిలో మరిణించిన విషయం తెలిసిందే.అయితే, ఈ హత్యకు ప్రధాన నిందితుడు తన అల్లుడు శ్రీ చరణే అని మృతిరాలి తండ్రి పలు ఆరోపణలు చేశారు. తండ్రి చేసిన ఆరోపణలతో రంగంలోకి దిగిన పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుపై భర్త శ్రీచరణ్ని డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు.
అమ్మాయిల లోదుస్తులు దొంగలించి.. వికృత చేష్టలు..!
మహిళల దుస్తులు కాజేసి సీసీ టీవీ కెమెరా ముందు అశ్లీలంగా ప్రవర్తించే అసోంకు చెందిన వికృత కాముకుడిని బెంగళూరు ఇందిరానగర పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ హుసేన్ పట్టుబడిన వ్యక్తి. కంపెనీలో డెలివరీ బాయ్గా పని చేస్తూ ఇందిరానగరలో నివాసం ఉంటున్నారు. దుస్తులు కాజేయడంపై యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందిరానగర పోలీసులు అబ్దుల్ హుసేన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించగా, బెయిల్పై విడుదలైనట్లు పోలీసులు తెలిపారు.స్నేహితురాలితో కలిసి హొయ్సళనగరలో ఓ యువతి నివాసం ఉండేది. గత మే నెల నుంచి ఇంటి కాంపౌండు లోపల దుస్తులు ఆరబెట్టిన స్దలంలో పలుమార్లు దుస్తులు చోరీకి గురయ్యాయి. కొద్దిరోజుల అనంతరం పాత దుస్తులు మళ్లీ కౌంపౌండ్లో పెట్టి కొత్త దుస్తులు మాత్రమే చోరీ చేసేవారని యువతి ఇందిరానగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుస్తులు పలుమార్లు చోరీకి గురికావడంపై యువతి రహస్య కెమెరా అమర్చింది. ఈనెల 2వ తేదీ తెల్లవారు జామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి కాంపౌండ్లోకి అక్రమంగా ప్రవేశించి గతంలో చోరీ చేసిన దుస్తులు ధరించి మళ్లీ దుస్తుల చోరీకి పాల్పడ్డాడు. అంతేగాక కెమెరా ముందు అశ్లీలంగా ప్రవర్తించాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇందిరానగర పోలీసులు తీవ్రంగా గాలించి అరెస్ట్ చేసి జైలుకు పంపించగా బెయిల్పై విడుదలయ్యాడు. -బెంగళూరు
8 నెలల గర్భిణిపై భర్త కిరాతకం..!
కడుపులో పెరుగుతున్న బిడ్డ వద్దనుకున్న భర్త 8 నెలల కడుపుతో ఉన్న భార్యను హత్య చేయడానికి ప్రయత్నించిన సంఘటన చిక్కబాణావర పోలీస్స్టేషన్ పరిధిలోని హెసరఘట్ట రోడ్డులో చోటు చేసుకుంది. మహమ్మద్ పీర్(40) అనే వ్యక్తి తన భార్య హసీనా(35)పై హత్యాయత్నం చేశాడు. వివరాలు.. మహమ్మద్ పీర్, హసీనాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే అంతకు ముందే మహమ్మద్ పీర్కు వివాహమై సంతానం కూడా ఉన్నారు. ఈక్రమంలో హసీనా రెండు సార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. మళ్లీ ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవడానికి హసీనా ఒప్పుకోలేదు. మహమ్మద్ పీర్ ఆమెపై దాడి చేసి అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసినా హసీనా ససేమిరా అంది. గురువారం సాయంత్రం హసీనా ఇంట్లో నిద్రిస్తుండగా చున్నీ(వేల్)తో గొంతు బిగించి హత్యాయత్నం చేశాడు. పెనుగులాటలో హసీనా మూర్ఛబోవడంతో మృతి చెందిందని భావించి పరారయ్యాడు. అయితే హసీనాకు స్పృహ వచ్చాక పుట్టింటికి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే హసీనాను వెంటబెట్టుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి నిందితుడిని అరెస్టు చేశారు.కర్ణాటక:
ముగ్గురు బాలికలపై కామాంధుడి లైంగిక దాడి..!
కర్ణాటక: రాచనగరి మైసూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ముగ్గురు బాలికలపై ఓ కామాంధుడు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. నిందితుడు మొదట 9వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అసభ్యకరమైన వీడియో క్లిప్తో ఆమెను బెదిరించి, తన స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి చేశాడు. అనంతరం ఆమె తీసుకువచ్చిన మరో ఇద్దరు బాలికలపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ఘోరం వెలుగు చూడగా పోలీసులు సదరు కామాంధుడిని కటకటాల వెనక్కు నెట్టి విచారణ చేస్తున్నారు. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. ఓ బాలిక మైసూరులోని విజయనగరలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు తన పొరుగు గ్రామానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని ఇన్స్టా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను ఆమెతో నిరంతరం సంప్రదిసూ మాయమాటలతో తన ఇంటికి రప్పించుకున్నాడు. అతడిని నమ్మిన బాలిక విజయనగరలోని అతని ఇంటికి వచ్చింది. ఆ సమయాన్ని ఉపయోగించుకుని, అతను ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన మొబైల్ ఫోన్లో ఆమె అశ్లీల వీడియోను చిత్రీకరించాడు. అలా అతను ఆమెను పదేపదే లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఆ వీడియో క్లిప్లను చూపుతూ ఆమెను బెదిరించాడు. స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి తన స్నేహితురాళ్లను తనతో పాటు ఇంటికి తీసుకురమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక, తన ఇద్దరు స్నేహితురాళ్లను అతని ఇంటికి తీసుకువెళ్లింది. అతను వారిపై కూడా లైంగిక దాడికి పాల్పడటమేగాక మిగతా స్నేహితురాళ్లను కూడా తీసుకురమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆందోళనకు గురైన ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. దీంతో వారు ఒడనాడి సేవా సంస్థకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన స్పయాని, పరశు ఈ విషయాన్ని బాలల సంరక్షణ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలిక, ఆమె తల్లిదండ్రులు విజయనగర డివిజన్ ఏసీపీకి కూడా ఈ సంఘటనల గురించి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. బాలల సంరక్షణ కమిటీ కూడా బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
వీడియోలు
17 భాషలో పాటలు...32 ప్రధాన అవార్డులు
ప్రముఖ గాయని ఎస్.జానకి (88) కన్నుమూత
సాగు చేసుకునే భూమిని.. వాళ్ళు ఎలా లాక్కుంటారు?
జగన్ మార్క్ స్కెచ్.. కూటమి కోటలు బద్దలు
విహార యాత్ర విషాదం! 15 మంది మృతి
పార్టీ నేతలపై జగ్గారెడ్డి ఆగ్రహం
SIR సర్వేలో తెలుగు తమ్ముళ్ల రచ్చ
బోటు ఘటన ఎలా జరిగిందంటే? ముఖ్య కారణాలు ఇవే..!
మంగళగిరికి సెక్యూరిటీ లేకుండా వెల్లు ఎంత మంది కాలర్ పెట్టుకుంటారో చూస్తావ్
మాజీ MLA GS రావు మృతిపై జగన్ సంతాపం..


