హనీ ఈజ్ ది బెస్ట్.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్ (ఫోటోలు)
Hyd: అంబర్పేట కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని అంబర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం( ఏప్రిల్ 27వ తేదీ) మధ్యాహ్న సమయంలో అంబర్పేటలోని మహేంద్ర, రెనాల్ట్ కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్ల షోరూమ్లో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో చుట్టు పక్కల అంతటా పొగ భారీగా కమ్ముకుంది. ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది భారీగా ఎగిసిపడుతున్న అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. పొగ భారీగా వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసాల వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. కార్ల పార్క్ చేసిన చోట ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాలు పార్క్ చేసిన చోట అగ్ని ప్రమాదం జరగ్గా, ఆ మంటలు వేగంగా అన్ని కార్లకు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు చెబుతున్నారు.
దాడికి 10 నిమిషాల ముందు ఏం చేశాడంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ఉన్నతాధికారులపై హత్యాయత్నం వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దాడికి ముందు అనుమానితుడు తన కుటుంబానికి ఓ సుదీర్ఘమైన లేఖ(మేనిఫెస్టో) రాశాడు. అందులో దాడికి కారణాలు.. తన లక్ష్యం.. అలాగే ఆ దాడిని ఈ తరహాలోనే ఎందుకు చేయాలనుకుంది.. మొత్తం చెప్పుకొచ్చాడు.తనను తాను ఫ్రెండ్లీ ఫెడరల్ అస్సాసిన్’ అంటూ సంబోధించుకున్న ఎలెన్ ఇలా రాసుకొచ్చాడు.. హింసకు హింసతో ప్రతిస్పందించకూడదు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు అని క్రైస్తవం చెబుతుంది. వ్యక్తిగత అవమానాలు లేదా దాడులు ఎదురైనప్పుడు ప్రతీకారం తీర్చుకోవద్దు అని అంటోంది. కానీ, ఇతరుల చెంప మీద కొడుతున్నప్పుడు మౌనంగా చూడమని కాదు. అలాంటి సమయంలోనూ స్పందించకపోతే అణచివేతకు సహకరించినట్లే అవుతుంది.నిత్యం అఘాయిత్యాలు, ఆకలి కేకలు, వేధింపులు, అన్యాయంగా మరణశిక్షల విధింపు.. వీటిని చూస్తూ భరించలేకపోతున్నా. సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం తగ్గించాలని భావిస్తున్నా. కానీ, ఒక రేపిస్ట్, ద్రోహి.. పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వ్యక్తి ప్రసంగం వినడానికి చాలామంది వచ్చారు. నా లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో..తన కుటుంబ సభ్యులు, సహచరులు, విద్యార్థులు, ప్రయాణికులు, హోటల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే తన నిర్ణయాలు ఇతరులకు నష్టం కలిగించవచ్చని క్షమాపణలు తెలియజేశాడు.అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్’(డబ్ల్యూహెచ్సీఏ) విందు సమావేశం జరిగింది. పదేళ్ల తర్వాత ఆ డిన్నర్కు హాజరైన ట్రంప్.. మరికాసేపట్లో మాట్లాడాల్సి ఉంది. ఈలోపు.. 8.34గం. ప్రాంతంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.హాల్ బయట కాల్పులు జరుగుతుండడంతో ట్రంప్ దంపతుల చుట్టూ భద్రతాధికారులు వలయంగా ఏర్పడి వేదిక వద్ద నుంచి తరలించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ దంపతులను, ఇతర అధికారులనూ సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. తుపాకులు, కత్తులతో వచ్చిన ఆగంతుకుడిని మీటింగ్ జరుగుతున్న బాల్రూంవైపు వెళ్లకుండా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆపేశాయి. సంకెళ్లు వేసి ఆపై అక్కడి నుంచి తరలించాయి. నిందితుడు కోల్ టొమాస్ ఎలెన్ను (31)గా ధృవీకరించిన దర్యాప్తు సంస్థలు.. కాలిఫోర్నియా టొరాన్స్లో అతనో టీచర్గా చెబుతున్నారు. అంతేకాదు.. ఎలెన్ అదే హోటల్లో బస చేశాడని అధికారులు గుర్తించారు.లిస్ట్ నుంచి ఆయనొక్కడికే మినహాయింపు.. ఎలెన్ లిస్ట్లో ఉన్న పేర్లు బయటకు రావాల్సి ఉంది. అయితే.. ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని హైలెవల్ నుంచి లోలెవల్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ నుంచి ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పేరు మాత్రం మినహాయించబడిందట. ఎలెన్ ఆయన్ని మాత్రమే ఎందుకు తప్పించాడు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే హోటల్ సిబ్బందిని కూడా దాడి నుంచి మినహాయించుకున్నాడని తెలుస్తోంది.ఇవాళే కోర్టుకు.. వాషింగ్టన్ హిల్టన్లో భద్రతా తనిఖీ కేంద్రాన్ని దాటి, అధికారులతో కాల్పులు జరిపిన తర్వాత ఎలెన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా యు.ఎస్. అటార్నీ జీనిన్ పిర్రో ఏం చెబుతున్నారంటే.. అతనిపై ఫెడరల్ ఆయుధాలు, దాడి కేసులు నమోదు చేయబడ్డాయి. అదనపు కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు.తనపై జరిగిన హత్యాయత్నంపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ‘‘ఎలెన్ క్రైస్తవ వ్యతిరేకి. క్రైస్తవుల పట్ల అతనిలో విద్వేషం పెరిగిపోయింది. అతనో మానసిక రోగి. గతంలో అతనిపై సోదరుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు’’ అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు దాడిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అధ్యక్షుడిగా ఉండటం ప్రమాదకరమైన పనైనా నేను భయపడలేదు. మెలనియా కూడా పలుమార్లు నాతో ఈ విషయం చెప్పింది. జరిగిన దాని గురించి ఇక ఆలోచించను. ఎప్పటిలాగే పని చేసుకుంటూ వెళ్తా. దేనిని ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటానని ప్రకటించారు.
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది
సిద్దిపేట జిల్లా: శిశువు మరణానికి కారణమైన దంపతులతో పాటు వారికి సహకరించిన ఆర్ఎంపీని రిమాండ్కు పంపించారు. శనివారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. 2025, జులై 29న మండల పరిధిలోని కేశనాయక్ తండా శివారులోని వాగులో గుర్తు తెలియని పసికందు శవం నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిందని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కన్నపేట ఎస్ఐ సీహెచ్ ప్రశాంత్, హుస్నాబాద్ సీఐ శ్రీను విచారణ చేపట్టారు. తండాకు చెందిన బానోతు లక్ష్మికి లేటు వయస్సులో ప్రెగ్నెన్సీ రాగా అప్పటికే ఆమె కూతుర్లకు పెళ్లి కావడంతో విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందనే భయంతో దంపతులు ఎవరికి తెలియకుండా అబార్షన్ చేసుకోవాలనుకున్నారు. అయితే కుందానవానిపల్లికి చెందిన ఆర్ఎంపీ వంశీ సహకారంతో అబార్షన్ టాబ్లెట్స్ వేసుకోగా బతికి ఉన్న శిశువు జన్మించింది. కాగా గ్రామంలో తెలిస్తే పరువుపోతుందనే భయంతో శిశువును ఎవరికి తెలియకుండా రహస్యంగా చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారి ఇంటి సమీపంలోని కాలువలో పడేయగా శిశువు నీటి ప్రవాహంలో మునిగి చనిపోయినట్టు విచారణలో నిర్దారణ అయిందని తెలిపారు. ఈ కేసులో చనిపోయిన శిశువు మరణానికి కారణమైన తల్లిదండ్రులు బానోతు లక్ష్మి, రాజు, ఆర్ఎంపీ వంశీలను అరెస్ట్ చేశారు.
తీవ్ర పదజాలంతో పేరెంట్పై ప్రిన్సిపాల్ వీరంగం!? వీడియో వైరల్
టాక్సిక్ వాయిదా పడే ఛాన్స్.. అంతా యశ్ వల్లేనా?
రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?'
Hyd: అంబర్పేట కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గిల్ వివాదాస్పద పోస్టు.. బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు!
సిక్సర్ల వీరుడని బిల్డప్.. టీమిండియాకు ఆడుతున్నాడు కానీ!
టీమిండియాకు భారీ షాక్
ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు
సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త
విష్ణుప్రియతో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి
దాదాపు 50 రోజుల ఉద్రిక్తతల తర్వాత.. ఇరాన్ కీలక నిర్ణయం
రూ.20 లక్షల నుంచి రూ.20 వేలకు తగ్గిన సంపాదన..
వైభవ్ సూర్యవంశీకి తీవ్ర గాయం.. ఐపీఎల్ నుంచి అవుట్?
సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు
డ్రగ్ మాఫియాకు భారీ షాక్.. ముగిసిన ‘డాన్’ శకం?
నేటి నుంచి ఉప్పల్ చౌరస్తా బంద్
షాక్ తగిలిన వెంటనే గుడ్న్యూస్.. నువ్వు కేక భజ్జీ
ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలబ్ధి
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది
చెన్నైలో త్రిష కలల సౌధం ధర ఎంతంటే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్ అప్డేట్
సడన్ ట్విస్ట్.. ఇరాన్లో యుద్ధం సీను మారింది?
అసలు ఆరోగ్యశ్రీ పథకమే ఎవరికీ వర్తించదంటే పోలే!
అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..
రష్యా-ఉక్రెయిన్ షాకింగ్ డీల్.. ఆనందంలో సైనికులు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ఉద్యోగయోగం
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
తీవ్ర పదజాలంతో పేరెంట్పై ప్రిన్సిపాల్ వీరంగం!? వీడియో వైరల్
టాక్సిక్ వాయిదా పడే ఛాన్స్.. అంతా యశ్ వల్లేనా?
రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?'
Hyd: అంబర్పేట కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గిల్ వివాదాస్పద పోస్టు.. బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు!
సిక్సర్ల వీరుడని బిల్డప్.. టీమిండియాకు ఆడుతున్నాడు కానీ!
టీమిండియాకు భారీ షాక్
ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు
సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త
విష్ణుప్రియతో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి
దాదాపు 50 రోజుల ఉద్రిక్తతల తర్వాత.. ఇరాన్ కీలక నిర్ణయం
రూ.20 లక్షల నుంచి రూ.20 వేలకు తగ్గిన సంపాదన..
వైభవ్ సూర్యవంశీకి తీవ్ర గాయం.. ఐపీఎల్ నుంచి అవుట్?
సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు
డ్రగ్ మాఫియాకు భారీ షాక్.. ముగిసిన ‘డాన్’ శకం?
నేటి నుంచి ఉప్పల్ చౌరస్తా బంద్
షాక్ తగిలిన వెంటనే గుడ్న్యూస్.. నువ్వు కేక భజ్జీ
ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలబ్ధి
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది
చెన్నైలో త్రిష కలల సౌధం ధర ఎంతంటే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్ అప్డేట్
సడన్ ట్విస్ట్.. ఇరాన్లో యుద్ధం సీను మారింది?
అసలు ఆరోగ్యశ్రీ పథకమే ఎవరికీ వర్తించదంటే పోలే!
అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..
రష్యా-ఉక్రెయిన్ షాకింగ్ డీల్.. ఆనందంలో సైనికులు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ఉద్యోగయోగం
ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు
ఫొటోలు
‘వదలా’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
రెడ్ శారీలో ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్ (ఫొటోలు)
మెరిసిపోతున్న మానస చౌదరి (ఫొటోలు)
ఏపీకి కూటమి శాపం.. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఇక్కడేందుకు? (ఫొటోలు)
‘ఏక్ దిన్’ మూవీ మ్యూజికల్ ఈవెంట్లో సాయి పల్లవి (ఫొటోలు)
హైదరాబాద్ : ఆకట్టుకున్న ‘సాక్షి’ హ్యాపీ కిడ్స్ ఈవెనింగ్ (ఫొటోలు)
హనీ ఈజ్ ది బెస్ట్.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్ (ఫోటోలు)
ఈవెంట్లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)
ఫ్రెండ్స్తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)
అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)
సినిమా
ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే వేల కోట్ల కలెక్షన్స్
ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు దాన్ని చూసేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ మైఖేల్ జాక్సన్ బయోపిక్ విషయంలో మాత్రం ఇది రివర్స్లో జరిగింది. పదో వందో కాదు ఏకంగా మూడు రోజుల్లోనే వేలకోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇది చూసి, బాక్సాఫీస్ ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రేంజు అభిమానమా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ 'మైఖేల్' మూవీ సంగతేంటి? తొలి వీకెండ్ వసూళ్లెంత?(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని షేక్ చేసిన పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా 'మైఖేల్'. ఇందులో మైఖేల్ జాక్సన్ అన్న కొడుకు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేశాడు. చిన్నాన్న డ్యాన్సుల దగ్గర నుంచి స్టైల్ వరకు ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లు దింపేశాడు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు.. మూడు రోజుల్లోనే $217.4 మిలియన్ల కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది.భారతీయ కరెన్సీ ప్రకారం వసూళ్లు మొత్తం రూ.2049 కోట్లు. అయితే అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్ రికార్డ్ ఇదివరకు 'ఓపెన్ హైమర్' పేరిట 180.4 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు దీన్ని అధిగమించిన 'మైఖేల్'.. గ్లోబల్ వైడ్ సరికొత్త ఘనత సాధించింది. అయితే విడుదల ముందు రోజు ప్రీమియర్లు వేస్తే చూసిన చాలామంది.. 'మైఖేల్' బయోపిక్ అంతేం మెప్పించలేదని పెదవి విరిచారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైఖేల్ జాక్సన్ అభిమానులు మాత్రం ఆయన్ని చివరిసారి బిగ్ స్క్రీన్పై చూసుకోవాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇక్కడ అక్కడ తేడా లేకుండా థియేటర్లకు వెళ్లి సినిమాని చూస్తున్నారు.అయితే 'మైఖేల్' పేరుతో రిలీజైన ఈ సినిమాలో పాజిటివ్ యాంగిల్ మాత్రమే చూపించారు. వివాదాల జోలికి పోలేదు. అలానే కథని మధ్యలోనే ఆపి, సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ఈ రెండో భాగం ఎప్పుడొస్తుందనేది చూడాలి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)
లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకైన ధునుష్.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సినిమా ఈవెంట్ కోసం ఎప్పుడు వచ్చిన.. ధనుష్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వస్తుంటారు. నిన్న(ఏప్రిల్ 26) హైదరాబాద్లో నిర్వహించిన ‘కర’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ అదే జరిగింది. ధనుష్ వస్తున్నాడని తెలిసి భారీగా అభిమానులు తరలివచ్చారు. అందులో ఓ మహిళా అభిమాని చేసిన పనికి ధనుష్ షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది?ధనుష్ కోసం..ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో విఘ్నేష్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్ సతీష్ కుమార్, రాజేశ్కుమార్ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ ఈవెంట్కి ధనుష్ కూడా వస్తున్నాడని తెలిసి ఓ మహిళా అభిమాని ఆ హోటల్కి వెళ్లింది. తన అభిమాన హీరోని లైవ్లో చూసి మురిసిపోయింది.మోకాళ్లపై కూర్చోని.. ఈవెంట్ ముగిసిన తర్వాత ధనుష్ వేదికపై నుంచి వెళ్తుండగా.. సదరు మహిళా అతన్ని కలిసేందుకు వచ్చింది. తెలిసిన వారి సహాయంతో ధనుష్ను దగ్గరకు వెళ్లింది. అతను ఆమెను పలకరించగానే.. భావోద్వేగానికి లోనైంది. ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని నమస్కరించింది. ఊహించని ఈ పరిణామానికి ధనుష్ షాకయ్యాడు. క్షణాల్లో తెరుకొని వెంటనే ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మళ్లీ అలాగే చేయడంతో కాసేపు ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత ఆమెను పైకి లేపి, మాట్లాడి, చివరకు ఆమెతో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. A female fan goes down on her knees to greet #Dhanush at the #Kara event.#MamithaBaiju pic.twitter.com/ZtTLrqPmId— Milagro Movies (@MilagroMovies) April 26, 2026
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రావట్లేదు. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన 'గాయపడ్డ సింహం', కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' రిలీజ్ కానున్నాయి. ఇక డబ్బింగులు విషయానికొస్తే ధనుష్ 'కర', మోహన్ లాల్-ముమ్ముట్టి 'పేట్రియాట్', సాయిపల్లవి 'ఒక రోజు'తో పాటు హిందీ చిత్రం 'రాజా శివాజీ'.. బిగ్ స్క్రీన్స్పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు ఈసారి చాలానే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. బైకర్, రాకాస లాంటి తెలుగు మూవీస్తో పాటు ద కేరళ స్టోరీ 2, లీడర్, ఆడు 3 లాంటి డబ్బింగ్ మూవీస్ ఆసక్తి రేపుతున్నాయి. గ్లోరీ అనే డబ్బింగ్ సిరీస్ కూడా బాగానే ఉందనిపించేలా ఉంది. వీటితో పాటు వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ప్రైజులు కూడా ఉండే అవకాశముంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రాబోతుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 27 నుంచి మే 03 వరకు)నెట్ఫ్లిక్స్షుడ్ ఐ మ్యారీ ఏ మర్డరర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29మ్యాన్ ఆన్ ఫైర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30బైకర్ (తెలుగు మూవీ) - మే 01రాకాస (తెలుగు సినిమా) - మే 01గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01హాట్స్టార్బ్యాచ్మేట్స్ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 30అమెజాన్ ప్రైమ్ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్స్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 29సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01లీడర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01 (రూమర్ డేట్)జీ5లారెన్స్ ఆఫ్ పంజాబ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 27ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01సోనీ లివ్ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01ఆపిల్ టీవీ ప్లస్విడోస్ బే (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29ఎమ్ఎక్స్ ప్లేయర్క్యాంపస్ బీట్స్ రిటర్న్స్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 29(ఇదీ చదవండి: 'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు)
ఓటీటీలోకి 'బైకర్' సినిమా.. అధికారిక ప్రకటన
ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో హిట్ కొట్టిన హీరో శర్వానంద్.. ఈ నెల తొలివారంలో మరో మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి)శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'బైకర్'. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు. బైక్ రేసింగ్ స్టోరీతో సరికొత్తగా దీన్ని తెరకెక్కించారు. చూసిన చాలామంది బాగానే ఉందన్నారు కానీ ఎందుకనో జనాలు ఈ మూవీని థియేటర్కి వెళ్లి చూసేందుకు పెద్దగా ఇష్టపడలేదు. కలెక్షన్సే దీనికి ఉదాహరణ. ఇప్పుడీ చిత్రం మే 01వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇదే పేరుతో.. హిందీలో మాత్రం 'శర్వా' అనే టైటిల్తో అందుబాటులోకి రానుంది.'బైకర్' విషయానికొస్తే.. బుల్లెట్ సునీల్ అలియాస్ సునీల్ నారాయణ్(రాజశేఖర్) మాజీ మోటోక్రాస్ రేసర్. మన దేశంలో మోటోక్రాస్ రేసింగ్ క్రీడకు గుర్తింపు తీసుకురావాలనేది ఈయన ఆలోచన. ఇందులో భాగంగా రేసర్లని తీర్చిదిద్దుతుంటాడు. ఈయన కొడుకు వికాస్ నారాయణ్(శర్వానంద్).. తండ్రి దగ్గరే ట్రైనింగ్ తీసుకుని టాప్ రేసర్ అవుతాడు. అంతర్జాతీయ పోటీలోనూ పాల్గొంటాడు కానీ కొన్ని కారణాల వల్ల మూడో స్థానంలో నిలుస్తాడు. తర్వాత రేసింగ్ నుంచే వికాస్ దూరం కావాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచిన ఆ నిర్ణయం వెనకున్న కారణమేంటి? చివరకు ఏమైంది? వీళ్లిద్దరూ మళ్లీ కలిశారా లేదా అనేది మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)
క్రీడలు
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2026లో సోమవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులను ఊరిస్తున్నాయి. ఢిల్లీతో మ్యాచ్లో కోహ్లి మరో 111 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.కోహ్లి ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 274 మ్యాచ్లు ఆడి మొత్తంగా 8,889 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మ్యాచ్లో కోహ్లి 62 పరుగులు సాధిస్తే, భారత గడ్డపై 10,000 టీ20 రన్స్ నమోదు చేసిన ప్లేయర్గా అవతరిస్తాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్గా కోహ్లి రికార్డులకెక్కుతాడు. అంతేకాకుండా తన టీ20 కెరీర్లో 450 సిక్సర్ల మార్కును చేరడానికి కోహ్లి కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.కోహ్లి ఉన్న ఫామ్కు ఈ రికార్డులను అందుకోవడం పెద్ద విషయమేమి కాదు. ఈ ఏడాది సీజన్లోనూ ఎప్పటిలానే కోహ్లి పరుగులు వరద పారిస్తున్నాడు. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తన సొంతమైదానం(అరుణ్ జైట్లీ స్టేడియం)లో సత్తాచాటేందుకు కింగ్ సిద్దమయ్యాడు. కోహ్లి(328) ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్ధానంలో ఉన్నాడు.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే?
‘మా మామ గారికి అంకితం’
చాన్నాళ్ల తర్వాత ఐపీఎల్-2026లో కోల్కతా రైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఈ యూపీ ఆటగాడు అదరగొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి 51 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.కోల్కతా విజయంలో అంతా తానే..రింకూ ప్రదర్శన కారణంగానే కోల్కతా 155 పరుగుల మార్కు అందుకోగలిగింది. ఈ మ్యాచ్లో ఓవరాల్గా కోల్కతా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగు సిక్స్లు.. ఫీల్డింగ్లో నాలుగు క్యాచ్లు, సూపర్ ఓవర్లో నాలుగు పరుగులు ఇలా... జట్టు విజయంలో రింకూనే కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మా మామ గారికే అంకితంఇక ఈ మ్యాచ్ను వీక్షించేందుకు రింకూ సింగ్ కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj) లక్నోలోని ఏకనా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా రింకూ ప్రదర్శన పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. రింకూ మా మామ గారి కోసం ఆడాడు. ఈరోజు ఆయనను మేము ఎంతగానో మిస్సవుతున్నాము. రింకూ ప్రదర్శన మా మామ గారికే అంకితం’’ అని ప్రియా సరోజ్ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders)చిన్న పిల్లలా గంతులేశారుకాగా రింకూ సిక్సర్లు బాదుతున్న వేళ ప్రియా సరోజ్ చిన్న పిల్లలా గంతులేశారు. నవ్వులు చిందిస్తూ కాబోయే భర్త విజయాన్ని సెలబ్రేట చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన ప్రియా సరోజ్.. ఉత్తరప్రదేశ్లోని మచ్లిచహర్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున లోక్సభకు ఎంపికయ్యారు. రింకూతో పరిచయం ప్రేమగా మారగా.. గతేడాది పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే రింకూ తండ్రి మరణించిన విషయం విదితమే. చదవండి: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders)
రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే?
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం ఏకానా స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్పై సూపర్ ఓవర్లో లక్నో ఓటమి పాలైంది. గత సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్నోకు ఏదీ కలిసిరావడం లేదు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన లక్నో.. ఆరింట ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి చేరుకుంది. దీంతో లక్నో దాదాపుగా ప్లే ఆఫ్స్కు రేసు నుంచి నిష్క్రమించినట్లే. ముఖ్యంగా రిషబ్ పంత్ కెప్టెన్గా తన మార్క్ చూపించలేకపోతున్నాడు. డగౌట్లో ప్లాన్లు నిమిష నిమిషానికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒత్తిడి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఇలాంటి లోపాలే స్పష్టంగా కన్పించాయి. ఆఖరి ఓవర్లో దిగ్వేష్ రాఠీతో బౌలింగ్ చేయించడం, సూపర్ ఓవర్లో నికోలస్ పూరన్ను బ్యాటింగ్కు పంపడం వంటి నిర్ణయాలు లక్నో కొంపముంచాయి. ఈ నేపథ్యంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంతపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్కు అప్పగించాలని జాఫర్ సూచించాడు. "లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉంది. వారి నుంచి ఇలాంటి ప్రదర్శలు అస్సలు ఊహించలేదు. ఒకవేళ నేనే లక్నో కోచింగ్ స్టాప్లో భాగమైంటే వెంటనే కెప్టెన్సీ మార్పు చేస్తాను. పంత్ను కెప్టెన్సీ బాధ్యతలను తప్పించి మార్క్రమ్కు అప్పగించేవాడని. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేసేవాడిని.మార్క్రమ్, మిచెల్ మార్ష్లతో ఓపెనింగ్ చేయిస్తాను. . మూడో స్థానంలో నికోలస్ పూరన్, ఆ తర్వాత నాలుగో స్థానంలో రిషబ్ పంత్, ఐదో స్థానంలో ఆయుష్ బదోని. ఆరో స్థానంలో అబ్దుల్ సమద్, ఏడో స్థానంలో ముకుల్ చౌదరిలను బ్యాటింగ్కు పంపేవాడిని. పంత్ లాంటి ఆటగాడికి కెప్టెన్సీ సెట్ కాదు. అతడు కేవలం బ్యాటర్గా గానే ఆడాలి. అప్పుడే అతడు పూర్తి స్వేఛ్చతో ఆడి మ్యాచ్లను గెలిపిస్తాడు. కాబట్టి కెప్టెన్సీ విషయంలో లక్నో పునరాలోచన చేయాలి. కెప్టెన్సీ బారంపై పంత్పై మోపొద్దు. అతడి స్ధానంలో మార్క్రమ్ను కెప్టెన్గా చేయండి. మార్క్రమ్కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ స్ధాయిలో సౌతాఫ్రికాను అతడు నడిపిస్తున్నాడు. అతడు అన్ని విధాలగా సమర్ధుడు అని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అయితే జాఫర్ ఒక్కడే కాదు చాలా మంది మాజీలు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు. పంత్ కూడా అందుకు సముఖంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.పంత్ ఈ ఏడాది సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొగలనున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా అతడి కెప్టెన్సీలోని లక్నో గత సీజన్లో కూడా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేదు. ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తోంది.
అంగ్క్రిష్ రఘువంశీపై కఠిన చర్యలు
కోల్కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో కోత విధించింది. ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లో ఏకనా స్టేడియంలో లక్నో- కోల్కతా జట్లు తలపడ్డాయి. అనూహ్య రనౌట్ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కోల్కతా బ్యాటింగ్కు దిగింది. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) ఆదిలోనే చెలరేగి ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (0), అజింక్య రహానే (10) వికెట్లు కూల్చాడు. ఇక వన్డౌన్లో వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ అనూహ్యంగా రనౌటయ్యాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతిని మిడాఫ్ దిశగా ఆడిన రఘువంశీ సింగిల్ కోసం ముందుకొచ్చాడు.అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్అయితే మరో ఎండ్లో ఉన్న కామెరాన్ గ్రీన్ నిరాకరించడంతో వెనుదిరిగాడు. ఈ క్రమంలో మిడాఫ్ దగ్గర బంతి అందుకున్న మహ్మద్ షమీ వికెట్ల వైపు విసిరాడు. ఆ బాల్ కాస్త రఘువంశీకి తాకగా... లక్నో జట్టు ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కోసం అప్పీల్ చేసింది.KKR ತಂಡಕ್ಕಂತೂ ಇದು ನಿಜಕ್ಕೂ ನುಂಗಲಾರದ ತುತ್ತು! 'Obstruction of Field' ಅಂತ Raghuvanshi ಗೆ ಔಟ್ ಕೊಡಲಾಗಿದೆ.☝️ ನಿಮ್ಮ ಪ್ರಕಾರ ಇದು Out? ಅಥವಾ Not Out? 👀 ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #LSGvsKKR | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL #AngkrishRaghuvanshi pic.twitter.com/cPsuy1J2p7— Star Sports Kannada (@StarSportsKan) April 26, 2026తీవ్ర అసంతృప్తిదీంతో పలుమార్లు రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్... రఘువంశీ దిశ మార్చుకున్నాడని నిర్ధారించి అతడిని అవుట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై రఘువంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోపంగా మైదానాన్ని వీడాడు. హెల్మెట్ను విసిరేసి అసంతృప్తి వెళ్లగక్కాడు.జరిమానాతో పాటు..ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి చర్యలకు దిగింది. ‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు, క్లాతింగ్ తదితర వస్తువులకు హాని కలిగించకూడదు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా రఘువంశీ ఈ నిబంధనను ఉల్లంఘించాడు.అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డిమెరిట్ పాయింట్ కూడా జత చేస్తున్నాం’’ అని ప్రకటన విడుదల చేసింది. ఈ మ్యాచ్లో కోల్కతా- లక్నో జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా చెరో 155 పరుగులు చేశాయి. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. కోల్కతా విజయం సాధించింది.చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్లో లేకున్నా అందుకే అతడిని పంపించాం
న్యూస్ పాడ్కాస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం... వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దుండగుడి కాల్పులు
వెనుతిరిగిన ఇరాన్, ముందుకు రాని అమెరికా... రెండో విడత ప్రత్యక్ష చర్చలపై వీడని పీటముడి
ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం. నేటి ఉదయం నుంచి రోడ్డెక్కనున్న బస్సులు
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఓటర్లు.. పశ్చిమ బెంగాల్ తొలి విడతలో 92.72 శాతం, తమిళనాడులో 85.14 శాతం ఓటింగ్ నమోదు
రాబోయే రోజులు మనవే.. కష్టాలు చెప్పుకున్న ప్రజలకు భరోసా ఇచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
‘ఉపాధి’పై ఇంత నిర్లక్ష్యమా?. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా... అమెరికా నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న పాపం ప్రతిపక్షాలదే... భ్రూణ హత్యతో పాపం మూటగట్టుకున్నాయి... ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
లోక్సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
బిజినెస్
అమెజాన్లో మామిడి జాతర.. ఏఐతో నచ్చిన పండు
వేసవి కాలం రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండ్ల మధురమైన రుచి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అమెజాన్ ఇండియా 'ఆమ్-ఎజింగ్' పేరిట ప్రత్యేక మామిడి పండ్ల విక్రయాలను ప్రారంభించింది. పొలాల నుండి నేరుగా సేకరించిన అల్ఫోన్సో, కేసర్, సఫేదా, తోతాపురి వంటి మేలైన రకాలను అమెజాన్ నౌ, అమెజాన్ ఫ్రెష్ ద్వారా అందిస్తోంది. పండ్లతో పాటు మామిడి ఐస్ క్రీములు, ఆమ్రస్, ఊరగాయలు, పానీయాలపై 30% నుండి 70% వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సిఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలకు నిమిషాల వ్యవధిలోనే లేదా గరిష్టంగా 2 గంటల్లోపు డెలివరీ చేసే సదుపాయాన్ని కల్పించింది.ఈ సీజన్ షాపింగ్లో ప్రధాన ఆకర్షణ అమెజాన్ వారి ఏఐ-ఆధారిత షాపింగ్ అసిస్టెంట్ 'రూఫస్' (Rufus). వినియోగదారులు తమ మూడ్కు తగిన మామిడి పండును ఎంచుకోవడానికి రూఫస్ సహాయపడుతుంది. "రూ. 500 లోపు అల్ఫోన్సో చూపించు" లేదా "స్మూతీకి ఏ రకం బాగుంటుంది?" వంటి ప్రశ్నలకు ఇది తక్షణమే సమాధానాలిస్తుంది. అంతేకాకుండా, గత 30 నుండి 90 రోజుల ధరల చరిత్రను విశ్లేషించి, వినియోగదారులు సరైన డీల్ పొందుతున్నారో లేదో తెలియజేస్తుంది. ధర తగ్గినప్పుడు అలర్ట్లు పంపడం, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు చేయడం ద్వారా ఈ ఏఐ అసిస్టెంట్ షాపింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్గా మారుస్తోంది.ప్రతి వినియోగదారుని అవసరానికి తగినట్లుగా ఐదు రకాల కేటగిరీలను అమెజాన్ రూపొందించింది. తీపి కోరికలను తీర్చుకోవడానికి అల్ఫోన్సో రకాలు, వంటల కోసం తోతాపురి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఆమ్రస్, క్యాండీలు, ఆరోగ్య స్పృహ ఉన్నవారి కోసం ఫ్రీజ్ డ్రైడ్ చిప్స్, ప్రోటీన్ షేక్ వంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది.
ఎరియర్స్ వచ్చాయా.. కొత్త ఫారాలు నింపండి..
కొత్త చట్టం, కొత్త రూల్స్, కొత్త ఫారాల వల్ల ఎన్నో మంచి మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు. సాంకేతికత, సులభతరం కోణంలోనే కాకుండా హేతుబద్ధీకరించే విధంగా ఇవి ఉన్నాయి. ఈ మార్పులతో కొత్త ఫారాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు. సులభతరం అంశాలన్నీ నింపితే సమాచారం సమగ్రంగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సాంకేతికంగా అనువుగా ఉండటం వల్ల ప్రాసెసింగ్ త్వరగా అవుతుంది. అటు చట్టం, ఇటు రూల్స్లోని అంశాలకి (మార్పులు) అనుగుణంగా, ఎటువంటి తికమక లేకుండా సాఫీగా, సజావుగా సాగుతుంది. పాత ఫారాల్లో ఉన్న తప్పొప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా తయారు చేశారు. ఫారం నింపగానే అనుసంధానం కావడం వల్ల అన్నింటిని అన్వయించుకుని, ఇతర సమాచారం మీద ఆధారపడకుండా అధికారులు చకచకా పరుగెడతారు.పాత చట్టంలో 89 (1), ఫారం 10ఈ జీతాల ఎరియర్స్ రావడం, వాటిని, సంవత్సరాలవారీగా విడగొట్టి, ఆయా ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చేయడాన్ని 89 (1) సెక్షన్లో ప్రస్తావిస్తారు. ఆ అంశాలన్నీ ఫారం 10ఈ లో నింపాలి. అప్పుడు రిలీఫ్ లెక్కించాలి.కొత్త సెక్షన్ 157 (1), కొత్త రూల్స్ 97, కొత్త ఫారం 39 కొత్త సెక్షన్ 157 (1), దాన్ని అమలుపర్చడానికి ఉద్దేశించినది 97 రూలు. ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఫారం 39 తయారైంది. పాన్ లేనిదే ఈ కొత్త ఫారాన్ని నింపలేరు. దాఖలు చేయలేరు. కొత్త ఫారంలో ఏమేమి తెలియజేయాలి? తొలి భాగంలో వ్యక్తిగత వివరాలతో పాటు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎరియర్స్ వచ్చాయో తెలియజేయాలి. మలి భాగంలో ముఖ్యమైన విషయం అంతా అంకెలమయంగా ఉంటుంది. డేటా అంతా రాయాలి. ఎరియర్స్ మీద ఎంత వచి్చంది రాయాలి. జీతం, గ్రాట్యుటీ, రిట్రెంచ్మెంట్ పరిహారం, పెన్షన్..ఇలా ఏదైనా కావొచ్చు అన్నీ రాయాలి. వీటిని సరిగ్గా నింపితే ఆ తర్వాత కాలమ్లో అన్నీ ఆటో పాపులేట్ అయిపోతాయి. పన్ను భారమెంత, ఆదాయం ఎంత, ఎరియర్స్ ఎంత, పన్ను ఎంత, ఉపశమనం (రిలీఫ్) ఎంత .. అన్నీ తెలుస్తాయి. చివరగా రిలీఫ్ ఎంతో లెక్కించి వస్తుంది.ఫారం 10ఈని అంతా చేతితో నింపాలి. మనమే అన్ని లెక్కలు చేయాలి. రాయాలి. బోలెడంత పని. యజమాని చేయరు. ఉద్యోగికి శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఇదంతా చిటికెలో అయిపోతుంది. ఈ సమాచారం అంతా ఆటోమేటిక్గా మీరు వేసే ఆదాయ పన్ను ఫారంలలో, అంటే ఐటీఆర్లలోకి వెళ్లిపోతుంది. కరెక్టుగా ఉంటే సమాచారం చాలా త్వరగా బదిలీ అవుతుంది.ఏయే డాక్యుమెంట్లు అవసరం.. మీ పాన్ కార్డు, మీ టీడీఎస్ సర్టిఫికెట్లు, మీ ఏఐఎస్ ఫారం, వచి్చన ఎరియర్స్ వివరాల గురించి తెలియజేసే పత్రం, ఫారం 130, ఫారం 168, గత సంవత్సరాల రిటర్నులు, పన్ను లెక్కింపుల ఎరియర్స్ వివరాలు కాగితాల రూపంలో కావాలి.అంతా ఆన్లైన్లోనే .. ఇది డిజిటల్ ఫారం. ఇది వరకు లాగా ఆఫ్లైన్లో వేయకూడదు. పోర్టల్లో దాఖలు చేయాలి. ఇందుకోసం మెనూకి వెళ్లి, ఫారం 39ని క్లిక్ చేయండి. బేసిక్ డేటా, ఎంపిక చేసిన కాలమ్లను సరిగ్గా నింపండి. రివ్యూ చేసుకోవచ్చు. రెండుసార్లు చెక్ చేసుకోవచ్చు. వెరిఫై చేయండి. ఫైల్ చేయండి. అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఇక తరువాత.. రిటర్ను వేయడమే! రిలీఫ్ మీకు వస్తుంది. ఏ అనుమతి కోసమూ ఆగనక్కర్లేదు. అయితే, రిటర్ను వేసేందుకు మరీ చివరి తేదీ వరకు ఆగకుండా, రెండు–మూడు నెలల ముందే ప్రాసెస్ మొదలుపెట్టండి.మీకు తెలిసిన పాత విశేషాలే అయినా.. మరోసారి.. ఉద్యోగులకు వర్తిస్తుంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎరియర్స్ ఒకేసారి ఏకమొత్తంగా రావొచ్చు. గత సంవత్సరంలో మీ ఆదాయం తక్కువ శ్లాబులో పన్నుకి గురి అయి ఉండాలి ఈ ఎరియర్స్ని ఆయా సంవత్సరాలకు సర్దుబాటు చేయడం వల్ల ఏం అవుతుందంటే, ఈ సంవత్సరం 30 శాతం బ్రాకెట్లో పడే ఆదాయం తగ్గి, గత సంవత్సరం 10 శాతానికి, 20 శాతానికి తగ్గొచ్చు. అంటే గత సంవత్సరం చేతికి వచ్చి ఉంటే తక్కువ రేటులోనే పన్ను భారం ఉండేది. ఇప్పటి 30 శాతానికి బదులుగా పన్ను భారం రేటు తగ్గి ఉండేది. ఆ ఉపశమనాన్నే రిలీఫ్ అంటారు. ఆల్ ది బెస్ట్.
మారిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు
దేశంలో బంగారం ధరలు మారిపోయాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరల్లో (Today Silver Rate) మాత్రం ఎలాంటి మార్పు లేదు. వరుసగా రెండో రోజూ నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..
లాభాల్లో స్టాక్ మార్కెట్.. 24,000 దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 118 పాయింట్లు పెరిగి 24,016 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 378 పాయింట్ల లాభంతో 77,042 వద్ద ట్రేడవుతోంది.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.16 శాతం, 1.05 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. ఇదిలా ఉండగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ
ఓవర్నైట్ చాంపియన్లు కారు
వరల్డ్ టేబుల్ టెన్నిస్ సింగిల్ టైటిల్స్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఆకుల శ్రీజ. ఆమె అర్జున అవార్డు సహా ఎన్నో పతకాలు గెలుచుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ‘పిల్లలకు చదువు ఒక్కటే కాదు, క్రీడారంగాన్నీ పరిచయం చేసినట్లయితే అన్ని వైపులా అభివృద్ధి చెందుతారు’ అంటారు శ్రీజ తల్లిదండ్రులు ఆకుల ప్రవీణ్కుమార్, సాయిసుధ. పిల్లల పెంపకంలో తమ పాత్ర గురించి ప్రవీణ్కుమార్ తెలిపిన సంగతులు...‘‘నేను టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని. రోజూ ప్రాక్టీస్కి వెళ్లేవాడిని. పిల్లల చిన్నప్పుడు వారిని రెండు, మూడు స్పోర్ట్స్ మీట్స్కు తీసుకెళ్లాను. అక్కడ మ్యాచ్లో గెలుపొందినవారికి ప్రైజులు ఇవ్వడం, అందరూ చప్పట్లు కొట్టడం చూసి, మా పెద్దమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యింది. ‘డాడీ నాకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారా’ అని అడిగింది. అంతేకాదు, స్కూల్ నుంచి వస్తూనే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని గ్రౌండ్కు వెళదామని రెడీ అయిపోయేది. ‘నేను కూడా చాంపియన్ని అవుతాను’ అనేది. రోజూ నాతో పాటు ప్రాక్టీస్కు రావడం చూసి, అకాడమీకి తీసుకెళ్లాను. అక్కడ తను బాగా ఆడటం చూసినవాళ్లు మెచ్చుకోవడంతో మరింతగా ప్రాక్టీస్ చేసేది. అక్కను చూసి చెల్లెలు..రవళి మెడల్స్ తీసుకోవడం చూసి, చిన్నమ్మాయి శ్రీజ ‘నేను కూడా టేబుల్ టెన్నిస్ ఆడతాను’ అంది. శ్రీజను కూడా టేబుల్ టెన్నిస్లో చేర్పించాను. ఇద్దరూ స్పోర్ట్స్లో మంచి ప్రతిభ చూపించేవారు. దీంతో ప్రతి కాంపిటిషన్లో వాళ్లు పాల్గొనేలా చూసేవాడిని. గేమ్ పూర్తయ్యేంతవరకు ఉండి, తీసుకొచ్చేవాడిని. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ప్రైవేట్గా..!పిల్లల చిన్నప్పుడు నాకు ఓరియంటల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ ఉద్యోగం. నా భార్య ఎల్ఐసీలో జాబ్. ప్రభుత్వ ఉద్యోగాలే అయినా జీతాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉండేవి. దీంతో, ఆ జాబ్ మానేసి, జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేరాను. అప్పుడు ‘మా అమ్మనాన్నలు, బంధువులు గవర్నమెంట్ జాబ్ వదులుకోవద్దు’ అని చెప్పారు. కానీ, వాళ్ల మాటలను పట్టించుకోలేదు. నా భార్య సపోర్ట్ చేసింది. నెల జీతం పెరగడం వల్ల ఇద్దరమ్మాయిలను అకాడమీలో చేర్పించడం, వారు కాంపిటిషన్స్లో పాల్గొనేలా చూడటం సులువైంది. రాత్రికి రాత్రి చాంపియన్లు అవరుమనమేవో త్యాగాలు చేస్తున్నాం కాబట్టి పిల్లలు రాత్రికి రాత్రి చాంపియన్లు కావాలనుకోకూడదు. ‘గెలుపు ఓటములు పట్టించుకోకుండా, మీ కృషి మీరు చేయండి. ప్రతీసారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి’ అని పిల్లలకు చెబుతుండేవాళ్లం. పిల్లలు ఓడిపోయినప్పుడు మా బంధువులు ‘అయ్యో, మీరు గవర్నమెంట్ జాబ్ వదలుకున్నారు, కానీ వాళ్లు ఓడిపోయారు’ అన్నట్టుగా మాట్లాడేవారు. ‘పిల్లలను బెస్ట్గా ప్రయత్నంచమని చెప్పండి. అంతేకాని, వారు చిన్నబుచ్చుకునేలా మాట్లాడకూడదు’ అని మా పేరెంట్స్కి, బంధువులకు గట్టిగా చెప్పాం. బంగారు పతకాలుపెద్దమ్మాయి టెన్త్ పూర్తయ్యాక ఒక కాన్సెప్ట్ కాలేజీలో జాయిన్ చేశాం. వాళ్లు ముందుగా స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తాం అన్నారు. తర్వాత మూడు నెలలకు ‘మీ అమ్మాయి బాగా చదువుతోంది – గ్రేడ్స్ ముఖ్యం’ అన్నారు. దీంతో రవళి స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఆపేసింది. చిన్నమ్మాయి విషయంలో అలా జరగకూడదని తనని బద్రుకా కాలేజీలో చేర్పించాం. ముందుగానే కాలేజీ యాజమాన్యంతో ‘స్పోర్ట్స్కు ప్రాముఖ్యం ఇస్తేనే చేర్పిస్తాం’ అని చెప్పాం. కాలేజీ వాళ్లు సపోర్ట్ చేశారు. శ్రీజ ఇంటర్మీడియట్లో కాలేజీ టాపర్గా గోల్డ్ మెడల్ సాధించింది. దానికి కారణం మా ఆవిడ సాయిసుధ. శ్రీజతో పాటు తనూ టోర్నమెంట్స్కు వెళ్లేది. ట్రెయిన్లో, రూములో, మ్యాచ్ మధ్యలో వీలు దొరికనప్పుడల్లా చదివించేది. ఇద్దరి కృషి...పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులిద్దరి కృషి ఉండాలి. స్పోర్ట్స్లో నేను కేర్ తీసుకుంటే, చదువు విషయంలో సాయిసుధ శ్రద్ధ తీసుకుంది. పిల్లల కెరీర్ గురించి ఆలోచించి మా ఆవిడ జాబ్లో ప్రమోషన్లు కూడా తీసుకోలేదు. ప్రమోషన్ తీసుకుంటే ట్రాన్స్ఫర్లు అవుతాయని ఆలోచించి అధికారి హోదాను కూడా వద్దనుకుని, వీలైనంత టైమ్ పిల్లలకు కేటాయించేది. పిల్లలిద్దరూ స్పోర్ట్స్లో రాణిస్తూ, చదువులోనూ గోల్డ్ మెడల్స్ సాధించారు. స్పోర్ట్స్.. జాబ్..పెద్దమ్మాయి ఇంటర్మీడియట్లో ఆపేసిన స్పోర్ట్స్ సీబీఐటీలో చేరాక స్టార్ట్ చేసింది. ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్ లీడ్ చేసేది. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసింది. ఇప్పుడు అమెరికాలో సెటిలైంది. చిన్నమ్మాయి శ్రీజకి పద్దెనిమిదేళ్లకు ఆర్బీఐలో జాబ్ వచ్చింది. ప్రాక్టీస్కు, టోర్నమెంట్స్లో పాల్గొనడానికి వీలుంటుంది. డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూనే ఫిజికల్ ఫిట్నెస్, ప్రాక్టీస్, టైమ్ ప్లానింగ్ గురించి చాలా క్రమశిక్షణగా ఉంటుంది. తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాం. వారికోసం ఏమైనా చేస్తాం. దానిని పిల్లలు అర్ధం చేసుకొని, వారి భవిష్యత్తును బాగా మలచుకుంటే పెద్దలుగా మనకూ ఆనందం. నేటి తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దాంతో పిల్లలకు ఒకవైపు మాత్రమే అవకాశాలు ఉంటున్నాయి. స్పోర్ట్స్లో అన్నివైపులా వృద్ధి ఉంటుంది.
బెస్టే ఫస్ట్
‘చేసే ప్రతి పనిలోనూ బెస్ట్ ఇస్తే అదే మనల్ని ఒకరోజు అందరిముందు గొప్పగా నిలుపుతుంది’ అంటున్నారు. హైదరాబాద్ వాసి చిలకలపూడి ఇందు ఫల్గుణి. ఈ నెల ఫెమినా మిస్ ఇండియా సౌత్ కిరీటం గెలుచుకొని దక్షిణాది అందాల భామగా నిలిచారు. ఈ సందర్భంగా ఇందు ఫల్గుణి పంచుకున్న విశేషాలు...బ్యూటీ రంగంలో రాణించాలనుకుంటున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లోని ఆంధ్ర మహిళాసభలో ఎల్ఎల్బి థర్డ్ ఇయర్ చదువుతున్నాను. వృత్తిరీత్యా జడ్జిగా ఎదగాలనుకుంటున్నాను. తెలుగు భాషపైన పట్టు సాధించాలనే ఆలోచనతో సాహిత్యాన్నీ చదువుతుంటాను. – ఇందు ఫల్గుణి‘‘కలలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తుంటారు. నేనూ చిన్నప్పటి నుంచి మోడలింగ్లోకి వెళ్లాలి, అందాలపోటీలలో పాల్గొనాలి, సినిమాలలో నటించాలి, జాతీయస్థాయి బ్యూటీ కాంటెస్ట్ వేదికపైన నించోవాలి.. అనుకునేదానిని. ఈ కల చిన్నప్పటి నుంచి ఉన్నా ‘నేను చేయగలనా?’ అనే సందేహం ఎప్పుడూ ఉండేది. ఆ సందేహాన్ని తీసేసి, ‘చేయగలను..’ అని ఎప్పుడైతే అనుకున్నానో ఆ రోజు నుంచి కృషి చేయడం మొదలుపెట్టాను. నా చూపు బ్యూటీ కాంటెస్ట్ల వైపు ఉండేది కాబట్టి నన్ను నేను మెరుగ్గా చేసుకోవడానికి వరల్డ్ బ్యూటీస్గా పేరొందిన ఐశ్వర్యా రాయ్, లారాదత్తా, సుస్మితాసేన్ ల గురించి సమగ్రంగా తెలుసుకునేదానిని. ప్రోత్సాహంతో ముందడుగు...మా తమ్ముడు యాడ్ ఫిల్మ్లో పాల్గొనేవాడు. నేను ఆ యాడ్ ఫిల్మ్మేకింగ్కి వెళ్లి, దూరంగా కూర్చొని చూస్తుండేదాన్ని. కొన్ని రోజులకు ఆసక్తిగా అనిపించి, నేనూ ఆ యాడ్స్లో పాల్గొన్నాను. అలా తొమ్మిదేళ్ల వయసు నుంచి మోడలింగ్ చేస్తున్నాను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. కాలేజీకి వచ్చాక అమ్మ నాగలక్ష్మి, నాన్న మహేష్ ప్రోత్సాహంతో మళ్లీ మోడలింగ్ మొదలుపెట్టాను. కూచిపూడి డ్యాన్సర్గానూ సాధన చేస్తున్నాను. మధ్యతరగతి కుటుంబం నేపథ్యం నాకున్న కలను నెరవేర్చుకోవడానికి అమ్మానాన్నలకు భారం కాకూడదు అనుకున్నాను. అందుకు, యూ ట్యూబ్లో మేకప్, మేకోవర్ గురించి రెండేళ్లపాటు ప్రాక్టీస్ చేశాను. అది సరిపోదని, ముంబైకి వెళ్లి అక్కడి అకాడమీలో చేరి శిక్షణ తీసుకున్నాను.గ్లామర్ మాత్రమే కాదుఅందాలపోటీలు అంటే గ్లామర్ మాత్రమే అనుకుంటారు చాలామంది. క్యాన్సర్, ఆటిజం సమస్య ఉన్న చిల్డ్రన్ కోసం ఫండ్ రైజ్ చేస్తుంటాను. అంటే.. సేవాగుణం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ, వ్యక్తిత్వం, ఆలోచన, కమ్యూనికేషన్ స్కిల్స్, సాధన.. అన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. స్టేజ్పైన వాక్ కోసం ఆరు ఇంచుల హీల్ మీద గంటలు గంటలు నిల్చోవాలి. తర్వాత నేల మీద కాలు పెట్టి, నిలబడటానికిæఎంత నొప్పి ఉంటుందో చెప్పలేం. ఎంతో సహనం కూడా ఉండాలి. ఇంత తపన పడుతున్నా చుట్టుపక్కలవారి నుంచి, బంధువుల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. అవన్నీ పట్టించుకోకుండా ఏం సాధించాలనుకున్నామో ఆ లక్ష్యంవైపే దృష్టి పెట్టాలనుకున్నాను.ప్రతి రాష్ట్రంలో ఓ ఇల్లు..భువనేశ్వర్లోని క్విట్ యూనివర్శిటీలో ఈ బ్యూటీ కాంటెస్ట్ జరిగింది. నలబైవేల మందికి పైగా విద్యార్థులు, లెక్చరర్లు పువ్వులతో మాకు స్వాగతం పలికారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనంత గొప్పది. ఈ అందాలపోటీకి దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు చొప్పున ముప్పైమందిమి ఎంపికయ్యాం. ఇరవై ఐదు రోజుల పాటు ముప్పైమందిమి తోబుట్టువుల్లా కలిసిపోయాం. అన్ని రాష్ట్రాల విభిన్న రుచులు, సంస్కృతులు.. మాకు పరిచయం అయ్యాయి. మేం ఉన్న రోజుల్లోనే ఒడిస్సా, కేరళ, తమిళనాడు నూతన సంవత్సరాది వేడుకలు కూడా జరిగాయి.పండగలు జరుపుకోవడం, ఒకరికొకరం సాయం చేసుకోవడం, అక్కచెల్లెళ్లలా సరదాగా గడపడం.. ప్రతిరోజూ ఒక వేడుకే. మేం ఇప్పుడు ఏ రాష్ట్రానికి వెళ్లినా, అక్కడ మాకో ఇల్లు ఉంది. అంతగా కలిసిపోయాం. లక్షలాది మంది ఈ బ్యూటీ కాంటెస్ట్కుపోటీ పడుతుంటారు. అంతమందితోపోటీపడి వేదికపై వరకు వెళ్లడమే గొప్ప అనుకున్నాను. అలాంటిది తెలుగు అమ్మాయిగా ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ పట్టువదలకుండా చేసిన కృషిని వివరించింది ఈ బ్యూటీ.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
కథాకళి: డర్టీ మెటల్
ఐదేళ్ళుగా మేం ఐదుగురం మిత్రబృందం ప్రతి ఆదివారం రమ్మీ ఆడటం అలవాటు. అలా రోజు సిట్టింగ్లో... ‘‘మనిషి ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడు?’’ ఆ ఆదివారం వశిష్ట అడిగాడు.‘‘చాలావాటిని.’’ ఒకరు చెప్పారు.‘‘ఆ చాలావాటిలో దేన్ని అధికంగా ప్రేమి్తాడన్నది నా ప్రశ్న.’’‘‘అది మనిషికి మనిషికి మారుతూంటుంది.’’ చెప్పాను.‘‘నీకేం ఇష్టం? ఎన్నటికీ పోగొట్టుకోడానికి ఇష్టపడనిది.’’ వశిష్ట నన్ను అడిగాడు.‘‘మా నాయనమ్మ నా చిన్నప్పుడు ఇచ్చిన రూపాయి కాసు. దాన్ని ఖర్చు చేయకుండా దాచుకున్నాను.’’ చెప్పాను.‘‘నాకు ఉప్మా ఇష్టం. నేను చేసుకునే వెజిటబుల్ ఉప్మా.’’ మాలోని హాస్యప్రియుడైన లాయర్ చెప్పాడు.‘‘నువ్వు ఉప్మాని మించి ఇష్టపడేది ఏం లేదా?’’‘‘ఇష్టం అనేది కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి మారుతూంటుంది. నాకు ఉదయం కాఫీ ఇష్టం. సాయంత్రం టీ ఇష్టం. రాత్రికి బీర్ ఇష్టం. నేను పోయే టైమ్ని బట్టి ఆ సమయంలో కాఫీ లేదా టీ తాగుతూ లేదా ఉప్మా తింటూ పోవాలనుకుంటున్నాను.’’‘‘నాకు నా ఇంట్లో, నా పక్కలో, నిద్రలో మరణించడం ఇష్టం. ఓసారి ఓ బంధువుని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను. స్ట్రెచర్ మీద తీసుకెళ్ళే ఓ వ్యక్తి, వెనకే ఆక్సిజన్ సిలిండర్ని తోసుకెళ్ళే ఓ అటెండర్. ఆయన కళ్ళల్లో భయాన్ని చూశాక అనిపించింది, రోగం రొష్టు రాకుండా, ఇంట్లోనే మరణించడానికి మించిన యోగం లేదని. ఇంట్లో మరణం నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైంది.’’ మరొకరు చెప్పారు.‘‘ఫిలసాఫికల్.’’ నేను చెప్పాను.‘‘చిన్న సవరణ. ఉప్మా కాదు. ఉప్మాలోని ఉప్పు. సరిపడ ఉప్పు. ఓసారి నేను ఎక్కువ ఉప్పు వేసి తినలేకపోయాను. సరిపడ ఉప్పు వేసిన ఉప్మా.’’ లాయర్ వృత్తిలోని అతను నవ్వుతూ సవరించాడు.‘‘నీకు?’’ నాలుగోవాడిని అడిగాను.‘‘మన జెండా.’’ వాడు చేతిలోని ముక్కలని చూసి, ఓ ముక్కని వేశాక చెప్పాడు.కొద్దిసేపు ఆగి నేను అడిగాను.‘‘వశిష్టా. తమరికి ఏమి ఇష్టమో సెలవివ్వనా? మీ ఆవిడ ముక్కంటే కదా?’’అంతా నవ్వారు.‘‘వశిష్ట తన భార్య ముక్కు మీద కవిత్వం రాశాడు.’’ చెప్పాను.‘‘కాని మీ ఆవిడకి బంగారం అంటే ఇష్టం. కాబట్టి నువ్వు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నావేమో?’’ ఒకరు అడిగారు.వశిష్ట ప్రతీ మేరేజ్ ఏనివర్సరీకి, తన భార్య పుట్టినరోజుకి, ఉమెన్స్ డేకి భార్యకి ఏదైనా బంగారు ఆభరణాన్ని బహుకరిస్తుంటాడని మాకు మా భార్యల ద్వారా తెలుసు. ‘మీరూ ఉన్నారు ఎందుకు? మీ ఫ్రెండ్ వశిష్ట వాళ్ళ ఆవిడకి ఏం కొనిచ్చాడో తెలుసా?’ అనే డైలాగ్ మేము చాలాసార్లు విన్నాం. ఇలాంటి ఆడవాళ్ళ ముచ్చట్లకి ఆ ఐదుగురికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ‘‘ప్రపంచంలోని పద్దెనిమిది శాతం బంగారం ఇండియన్ భార్యల దగ్గరే ఉందని చదివాను. అది పాతికవేల టన్నుల బంగారమట. అందులో చాలా భాగం వశిష్ట భార్య దగ్గరే ఉంది.’’ ఒకరు నవ్వుతూ చెప్పారు.‘‘మా ఆవిడకి బంగారం ఇష్టం కాబట్టి ఆమెని సంతోషపెట్టడానికి కొనిస్తూంటాను. నాకు నా భార్యంటే ఇష్టం. నా భార్య మీద ఇష్టాన్ని నేను అలా ప్రదర్శిస్తూ ఉంటాను.’’ వశిష్ట చెప్పాడు.ఈ చర్చ జరిగిన కొంత కాలానికి వశిష్ట భార్య మరణించింది. ఈ కాలంలో అకాల మరణానికి కారణమైంది కేన్సర్. అది ఫోర్త్ స్టేజ్లో కాని బయటపడలేదు. బయటపడ్డ రెండు నెలలు తిరగకుండానే ఆమె గతించింది.వశిష్ట దుఃఖాన్ని పట్టలేకపోయాం. ఆ పదిహేను రోజులు మేము నలుగురం అతని వెన్నంటే ఉన్నాం. ఆ తర్వాత చాలా ఆదివారాలు మేము నలుగురమే రమ్మీ ఆడాం. తన భార్య పోయిన ఎనిమిదో ఆదివారం వశిష్ట వచ్చాడు. ఐదారు నిమిషాల తర్వాత వశిష్ట చెప్పాడు. ‘‘ఓసారి ‘మనిషి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు?’ అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను అధికంగా ప్రేమించేది మా ఆవిడని చెప్పాను. గుర్తుందా?’’‘‘అవును. అందులో మాకు ఎలాంటి సందేహం లేదు.’’ చెప్పాను.‘‘కాదు. మా ఆవిడ మరణించాక నాకు తెలిసింది. నేను ప్రేమించేది మా ఆవిడని కానే కాదు. ఆవిడ ప్రేమించే డర్టీ మెటల్ని. బంగారాన్ని.’’ నెమ్మదిగా చెప్పాడు.‘‘అంటే నువ్వు ఇంతకాలం మీ ఆవిడ ఇష్టపడుతుందని బంగారం కొనలేదా?’’ అడిగాను.‘‘ఆవిడ మరణించకపోతే అసలు నాకీ సంగతే తెలిసేది కాదు. ఆవిడ శవాన్ని వైకుంఠ రథంలో తరలించేటప్పుడు నేను ఆవిడ నోట్లోని రెండు బంగారు కట్టుడు దంతాలని కటింగ్ ప్లయర్తో పెకలించి తీసుకున్నాను. భార్యని ప్రేమించే ఎవరైనా, జీవం లేనంత మాత్రాన చేసే పనేనా అది?’’ వశిష్ట ప్రశ్నించాడు.అతని మెళ్ళోని బంగారు గొలుసుకి ఆవిడ రెండు దంతాలు మెరుస్తూ కనిపించాయి. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి
రైవతుడి జననం
పూర్వం ఋతవాక్కు అనే మునికుమారుడు విద్యాభ్యాసం తర్వాత బ్రహ్మచర్యం వీడి, తగిన కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. చాలాకాలమైనా సంతానం కలగకపోవడంతో సూర్యుడి కోసం తపస్సు చేశాడు. సూర్యుడి వర ప్రసాదం వల్ల ఋతవాక్కుకు కొడుకు పుట్టాడు. అతడు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించాడు.ఋతవాక్కు ఆ బాలుడికి యథావిధిగా జాతకర్మాదులు జరిపించాడు. అయితే, ఆ బాలుడు పెరిగేకొద్ది బుద్ధివికాసం పొందకపోగా, వెర్రివాడిలా తిరగసాగాడు. కొడుకు పరిస్థితికి ఋతవాక్కు, అతడి భార్య తీవ్రంగా కలత చెందారు. మనోవ్యధతో వారు వ్యాధిగ్రస్థులయ్యారు. కొడుకు పరిస్థితిని చక్కదిద్దడానికి తరుణోపాయం కోసం ఋతవాక్కు ఒకనాడు గర్గముని ఆశ్రమానికి వెళ్లాడు. గర్గమునిని దర్శించుకుని, తన కొడుకు పరిస్థితిని వివరించి, తరుణోపాయం చెప్పమని కోరాడు.‘‘మునిపుంగవా! నీ కొడుకు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టాడు. నక్షత్రదోషం కారణంగానే అతడు మూర్ఖుడయ్యాడు’’ అని పలికాడు గర్గుడు. ఋతవాక్కు ఆ మాటలకు కోపించి, ‘‘రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి నేల రాలిపోవు గాక!’’ అని శపించాడు.వెంటనే రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి రాలిపోయి, కుముద పర్వతంమీద ఉన్న ఒక కొలనులో పడింది. ఆ కొలనులో అనేక పద్మాలు ఉండేవి. వాటిలోని ఒక పద్మం నుంచి రేవతీ నక్షత్రం ఒక కన్యక రూపంలో పుట్టింది. ప్రముచుడు అనే ముని ఆ కన్యకను చూసి, తన ఆశ్రమానికి తీసుకువెళ్లి, పెంచుకోసాగాడు. ఆమెకు రేవతి అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు రేవతి యుక్తవయస్కురాలైంది. ప్రముచుడు ఆమె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు.ప్రముచుడు ఒకనాడు అగ్నిదేవుడిని ‘‘దేవా! నా కుమార్తెకు యోగ్యుడైన వరుడు ఎక్కడ దొరుకుతాడో నువ్వే చెప్పు’’ అని అభ్యర్థించాడు.‘‘మునీశ్వరా! కొద్దిరోజుల్లోనే దుద్ధముడు అనే రాజు నీ ఆశ్రమానికి వచ్చి, నీ కుమార్తెను చూస్తాడు. అతడే ఆమెకు తగిన వరుడు. నీ కుమార్తె రేవతిని అతడికిచ్చి వివాహం జరిపించు’’ అని పలికాడు అగ్నిదేవుడు.కొన్నాళ్లకు ప్రియంవద వంశీయుడైన దుద్ధముడు అడవిలో సంచరిస్తూ, ప్రముచుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే, ఆశ్రమంలోంచి ప్రముచుడు బయటకు వచ్చాడు. ‘‘ప్రియంవద వంశోద్భవా! నిన్ను చూసి చాలాకాలమైంది. నువ్వు నాకు అల్లుడివి’’ అని పలికి, అతడికి అర్ఘ్యమిచ్చి, లోనికి స్వాగతించాడు.‘‘మహర్షీ! మీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. నేను మీకెలా అల్లుడినయ్యాను?’’ అడిగాడు దుద్ధముడు.‘‘రాజా! నా కుమార్తె రేవతిని నీకిచ్చి పెళ్లి చేయదలచాను. నువ్వు నా ఆశ్రమానికి వస్తావని, నా కుమార్తెకు తగిన వరుడివి నువ్వేనని అగ్నిదేవుడు చెప్పాడు’’ అన్నాడు ప్రముచుడు.తండ్రి మాటలు విన్న రేవతి, ‘‘తండ్రీ! నాకు ఈ రాజుతో వివాహం చేయదలిస్తే, రేవతీ నక్షత్ర ముహూర్త సమయంలోనే చేయాలి’’ అని చెప్పింది.ప్రముచుడు తన తపోమహిమతో రేవతీ నక్షత్రాన్ని ఆకాశంలో నిలిపి, అదే ముహూర్తంలో అగ్ని సమక్షంలో రేవతీ, దుద్ధముల వివాహం వేదోక్తంగా జరిపించాడు. వివాహం ముగిశాక, ‘‘జామాతా! నీకే వరం కావాలో కోరుకో’’ అని అడిగాడు ప్రముచుడు.‘‘మునివర్యా! నేను స్వాయంభువ మనువు వంశంలో పుట్టాను. నాకు నీ కుమార్తె రేవతి ద్వారా జన్మించే కుమారుడు ఈ మన్వంతరానికి అధిపతి అయ్యేలా వరం అనుగ్రహించండి’’ అని కోరాడు.‘‘తథాస్తు’’ అని ఆశీర్వదించాడు ప్రముచుడు.కొన్నాళ్లకు రేవతికి పండంటి కొడుకు పుట్టాడు. దుద్ధముడు అతడికి జాతకర్మాదులు జరిపించి, రైవతుడు అని నామకరణం చేశాడు.రైవతుడు సకల శాస్త్రాలను, అస్త్రశస్త్ర విద్యలను క్షుణ్ణంగా అభ్యసించాడు. కొన్నాళ్లకు దుద్ధముడు ఒక సుదినాన రైవతుడికి పట్టాభిషేకం జరిపించి, భార్యలతో కలసి వానప్రస్థానికి వెళ్లిపోయాడు.రైవతుడు సమస్త భూమండలాన్ని జయించి, రైవత మనువుగా ప్రఖ్యాతి పొందాడు.∙సాంఖ్యాయన
అంతర్జాతీయం
రీగన్ను కాల్చిందీ.. ఆ హోటల్లోనే
వాషింగ్టన్: నలభై ఐదు సంవత్సరాల క్రితం కాల్పుల ఘటన నుంచి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అదృష్టవశాత్తు బయటపడిన అదే హోటల్లో ట్రంప్పై హత్యాహత్నం జరగడంతో వాషింగ్టన్ నగరంలోని ‘హిల్టన్’ హోటల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 1981 మార్చి 30వ తేదీన రీగన్పై జరిగిన కాల్పుల ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆరోజు హోటల్లో ఒక కార్యక్రమంలో పాల్గొని బయటికొచ్చి లిమోసిన్ కారు ఎక్కేందుకు వెళ్తుండగా దూరంగా నిలబడిన జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి ఒక్కసారిగా రివాల్వర్తో బుల్లెట్ల వర్షం కురిపించాడు. 1.7 సెకన్ల వ్యవధిలో ఆరు బుల్లెట్లు కాల్చాడు. వాటిలో ఐదు అధ్యక్షుడు రీగన్సమీపంలోని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్కు తగిలాయి. కానీ ఒక బుల్లెట్ మాత్రం ఎడమ చేతి కిందనుంచి నేరుగా రీగన్ ఛాతిలోకి దూసుకెళ్లింది. దీంతో ఎడమ ఊపిరితిత్తికి రంధ్రంపడింది. కాల్పుల ఘటనతో హుతాశులైన పోలీసులు వెంటనే రీగన్ను అదే లిమోసిన్ కారులో సమీప జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ బోధనాస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్ను తొలగించడంతో రీగన్ బతికిపోయారు. కాల్పులు జరిపిన జాన్ హింక్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాల్పులు జరిపిన హింక్లీని మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని అతని లాయర్లు కోర్టులో వాదించారు. దీంతో 1982 జూన్లో అతడిని కఠినకారాగార శిక్ష నుంచి తప్పించారుగానీ నిర్బంధ కేంద్రంలో బంధించారు. ఏళ్లతరబడి వాదోపవాదనల తర్వాత 2016లో అతడిని సెయింట్ ఎలిజబెత్ ఆస్పత్రి మానసికరోగుల విభాగం నుంచి విముక్తుడిని చేశారు. చిట్టచివరకు 2022లో అతడిపై ఉన్న నేరాభియోగాలను పూర్తిగా ఎత్తేసి స్వేచ్ఛగా ఎక్కడైనా జీవించే హక్కు కల్పించారు. ‘ట్యాక్సీ డ్రైవర్’ సినిమా అందాల టీనేజీ హీరోయిన్ జోడీ ఫాస్టర్ మనసును గెల్చుకోవాలనే ఆత్రుతలో హింక్లీ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని దర్యాప్తు అధికారులు తేల్చారు. హింక్లీ దాడిచేసిన హోటల్ కావడంతో చాన్నాళ్లు ఈ హోటల్ను ‘వాషింగ్టన్ హిల్టన్’ పేరుకు బదులు హింక్లీ హిల్టన్ అని పిలిచారు. అలెన్ గతంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) టీ–షర్ట్ను ధరించిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఆయనకు ఇజ్రాయెల్తో సంబంధం ఉందా? దాడిలో విదేశాల హస్తం ఉందా ? అనే కొత్త ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి ఖండనలూ, స్పందనలూ వెలువడలేదు.
అతడో ఉన్మాది: ట్రంప్
వాషింగ్టన్: హిల్టన్ హోటల్లో కాల్పులకు తెగబడ్డ దుండగుడు అలెన్ తన యంత్రాంగంలోని అధికారులను లక్ష్యం చేసుకున్నట్టు తెలుస్తోందని ట్రంప్ అన్నారు. దీనికి సంబంధించి అలెన్ కుటుంబం శనివారం విందుకు ముందే కనెక్టికట్లో పోలీసులకు సమాచారం కూడా ఇచ్చినట్టు వివరించారు. కాల్పుల అనంతరం వైట్హౌస్లో జరిగిన మీడియా భేటీ, తర్వాత ఫాక్స్ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు చెప్పుకొచ్చారు. ‘‘దుండగుడు ఓ ఉన్మాది. చాలా ఆయుధాలతో హోటల్ లాబీలో కాల్పులకు దిగాడు. సీక్రెట్సర్వీసు సిబ్బంది అడ్డుకోగా ఒక అధికారిపై అత్యంత సమీపం నుంచి శక్తిమంతమైన తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. సిబ్బంది సాహసోపేతంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారి సాహసం ప్రశంసనీయం’’ అన్నారు. మిమ్మల్నే లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ‘అనుకుంటాను’ అని ట్రంప్ బదులిచ్చారు. హిల్టన్ హోటల్ వద్ద భద్రతా సక్రమంగా లేదని, అది సురక్షితమైన భవనం కాదని అభిప్రాయపడ్డారు. ‘‘హోటల్లో కాల్పుల శబ్దాన్ని మొదట తప్పుగా అర్థం చేసుకున్నా. పల్లెం లాంటిది కింద పడడం వల్ల వచ్చిన శబ్దంగా భావించా’’ అని చెప్పారు. లింకన్పై జరిగినట్లుగానే.. హత్యల గురించి తానెంతో అధ్యయనం చేశానని ట్రంప్ వ్యాఖ్యానించారు. అత్యధిక ప్రభావం చూపే శక్తివంతులనే లక్ష్యంగా చేసుకుంటారని చెప్పారు. ప్రభావం చూపలేని వారి జోలికి ఎవరూ రారని అన్నారు. 1865లో జరిగిన అబ్రహం లింకన్ హత్యాకాండను ప్రస్తావించారు. లింకన్పై జరిగినట్లుగానే తనపైనా హత్యాయత్నాలు జరిగాయని వెల్లడించారు. రాజకీయాలను రేస్ కార్ డ్రైవింగ్, బుల్ రైడింగ్లతో పోల్చారు. ‘‘రాజకీయాలు నిజంగా ప్రమాదకరమైన వృత్తి. ఇది చాలా ప్రమాదకరమన్న విషయం నాకెవరూ చెప్పలేదు. అమెరికా అధ్యక్ష పదవిని ఆశించడంలో ఉన్న రిస్క్ల గురించి మంత్రి మార్కో రూబియో ముందుగా నన్ను హెచ్చరించలేదు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు, ఇతర వీఐపీలకు భద్రతను కనీవిని ఎరగనంతగా కట్టుదిట్టం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ దపంతులు, కేబినెట్ సభ్యులు తదితరులంతా క్షేమంగా ఉన్నారంటూ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. పాత్రికేయుల విందు 30 రోజుల్లోగా మళ్లీ జరుగుతుందన్నారు.
సడన్ ట్విస్ట్.. ఇరాన్లో యుద్ధం సీను మారింది?
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్లో వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మంచుకురుస్తోంది. దశాబ్ధానికిపైగా కరువుతో అల్లాడుతున్న ఇరాన్లో క్రమంగా వాతావరణం మారుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సుల్లో మళ్లీ జీవం కనిపిస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారడంపై ఓ ఆసక్తికర వాదన తెరపైకి వచ్చిందిసోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇరాన్లో మార్పుల వెనుక అసలు సీక్రెట్ అదేనా. ఇరాన్లో కరువు పరిస్థితులు శతృదేశాల కుట్రే పూరితంగా సృష్టించినవేనాఅమెరికా ఇరాన్ యుద్ధం మొదలై యాబై రోజులు దాటిపోయింది. ఈ యుద్ధంలో ఇరాన్పై అమెరికా భారీ దాడులే చేసింది. క్షిపణులు, వైమానిక దాడులతో బీభత్సమే సృష్టించింది. దీని కోసం పెద్ద సంఖ్యలో ఆయుధ శక్తిని ఉపయోగించింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న ఇరాన్ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టింది. అయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా,ఇజ్రాయెల్కు ఇరాన్ అదే స్థాయిలో బదులిస్తోంది.ఇలాంటి సమయంలో ఇరాన్ వాతావరణం మారిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నిత్యం కరువుతో అల్లాడే ఇరాన్లో ఇప్పుడు భారీ స్థాయిలో వర్షాలు, మంచు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇక్కడే ఓ ఆసక్తికరమైన వాదన తెరపైకి వచ్చింది. దేశ వాతావరణాన్ని తారుమారు చేయడానికి వాడటానికి వినియోగించే రాడార్లను, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడం వల్లే ఈ వాతావరణ మార్పు సంభవించిందన్న వాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి దశాబ్ధానిపైగా ఇరాన్ కరువుతో అల్లాడుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సులే అక్కడి నీటి సంక్షోభం గురించి చెప్పడానికి ఉదహారణలుగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో యాభైరోజుల యుద్ధం తర్వాత అక్కడి వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, మంచు, ఉష్ణోగ్రతలు తగ్గడంతో అక్కడ పచ్చదనం చిగురులు తొడుగుతోంది. ఆనకట్టలు వాటి పూర్తి సామర్ధ్యానికి వస్తున్న తరుణంలో ఇరాన్ మీడియా కుట్ర సిద్ధాంతాలతో హోరెత్తుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ వాతావరణ ఇంజినీరింగ్ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడమే వాతావరణంలో ఆకస్మిక మార్పులకు కారణమన్నది వారి వాదన.ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చెందిన అధునాతన రాడార్ వ్యవస్థలపై, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలపైన దాడి చేసిన మాట నిజమే. అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించే క్షిపణి వ్యవస్థలు కేవలం ముందస్తు అలెర్ట్ కోసమే కాకుండా మధ్యధరా సముద్రంలోని తేమను ఇరాన్ పొరుగు ప్రత్యర్ధుల వైపు మేఘాలను మళ్లించడానికి వీటిని ఉపయోగించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.నిజానికి వర్షపు నీరు దొంగతనం అనే చర్చ ఇరాన్లో ఎప్పటి నుంచో ఉంది. 2018 నుంచి ఈ వాదన పదే పదే తెరపైకి వస్తోంది. ఇజ్రాయెల్,అమెరికా, యూఏఈ జియో ఇంజినీరింగ్ను ఉపయోగించి వాతావరణ సరళిని తారు మారు చేస్తున్నాయనేది ఇరాన్ వాదన. ఇప్పుడు సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ను సైతం తొలగించనున్న ట్రంప్?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్ నుంచి మరో కీలక అధికారిని తీసేయనున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్ కాష్ పటేల్ ట్రంప్ కేబినెట్ నుంచి వైదొలిగే ఛాన్స్ ఉందని ‘పోలిటికో’ వార్తా సంస్థ తెలిపింది. ట్రంప్ అడ్మినిట్రేషన్లో అంతర్గత ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో పటేల్ భవిష్యత్తుపై వైట్హౌస్ వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇప్పటికే ట్రంప్ పలువరు కీలక అధికారులను తొలగించారు. ఈ వారమే ట్రంప్ అనుమతితో అమెరికా నౌకాదళ కార్యదర్శిని తొలగించారు. ఆ తర్వాత తదుపరి వెళ్లే సీనియర్ అధికారి ఎవరన్న ఊహాగానాలు మరింత పెరిగాయి. పోలిటికో తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్ తదుపరి తొలగించే వారి లిస్టులో పటేల్ ఉండవచ్చని ఒక సీనియర్ వైట్హౌస్ అధికారి సూచించారు. కాష్ పటేల్ను పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమని, ఇప్పుడు ప్రశ్న “ఎప్పుడు తొలగిస్తారు?” అన్నదేనని వ్యాఖ్యానించారు. మీడియాలో ఆయనపై నెగటివ్ వార్తలు ఎక్కువగా రావడం, ఆయన పనితీరు, నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలపై విమర్శలు పెరగడం అందుకు కారణాలుగా చెప్పారు. కేబినెట్ కార్యదర్శి దృష్టిలో ఇది మంచిది కాదని పేర్కొన్నారు. ఇది ట్రంప్ను నిరుత్సాహానికి గురి చేస్తోందని చెప్పారు.కీలక అడ్మినిస్ట్రేటివ్ పదవుల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై రాజకీయపరంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కాష్ పటేల్ గురించి వార్తలు వస్తుండడం గమనార్హం. వరసగా తొలగిస్తున్న ట్రంప్ కొన్ని రోజుల క్రితమే అమెరికా యుద్ధ శాఖ, నౌకాదళ కార్యదర్శి జాన్ సీ ఫెలన్ను పదవి నుంచి తొలగించారు. ఉప కార్యదర్శి హంగ్ కావో తాత్కాలిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.మార్చి నుంచి దాదాపు ఐదుగురు సీనియర్ అధికారులు (ఫెలన్ సహా) ఒత్తిడి మధ్య పదవులు వదిలుకున్నారు. ఫెలన్కు ముందు, జనరల్ రాండీ జార్జ్ ఈ నెల ప్రారంభంలో ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి విరమణ చేశారు. ఇరాన్ యుద్ధం మధ్య ఇది అసాధారణ పరిణామం. అలాగే, మరో ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులను తొలగించారు. కాగా, ఇరాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో.. ట్రంప్ గవర్నమెంట్ చేస్తున్న ఈ యుద్ధానికి తాను సపోర్టు ఇవ్వలేనని జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ పేర్కొంటూ ఆయన సైతం ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
జాతీయం
ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కొత్త వివాదం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొత్త వివాదం రాజుకుంది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ హాజరుకావడం లేదని జడ్జి స్వరణ కాంత శర్మకు ఓ లేఖ రాశారు.‘‘న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. తప్పుడు ఆరోపణలతో నన్ను జైలుకు పంపారు. అందుకే నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. జడ్జి స్వరణ కాంత శర్మపై నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ, ఆమెపై విశ్వాసం లేదు. అందుకు కారణం ఆమె బీజేపీ అనుబంధ కార్యక్రమాలకు వెళ్లడం. కాబట్టి ఆమె ఎదుట విచారణకు హాజరు కాలేను. నా మనసాక్షి ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో మహాత్మా గాంధీ సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా’’ అని లేఖలో కేజ్రీవాల్ తెలిపారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జడ్జి స్వరణ కాంత శర్మ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె బీజేపీకి దగ్గరి మనిషని, ఆమె పిల్లలు కూడా కేంద్ర విభాగంలో పని చేస్తున్నారని.. కాబట్టి ఆమెను కేసు నుంచి తప్పించాలని కోరారాయన. అయితే హైకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. కేవలం అనుమానాలు, ఊహాగానాల ఆధారంగా రిక్యూసల్ ఇవ్వలేం. ఇది న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నా కుటుంబ ప్రస్తావనతో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు సరికాదు. ఆయన కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని జడ్జి శర్మ వ్యాఖ్యానించారు.
‘22 నిమిషాల్లో శత్రువుల వెన్నువిరిచేశాం’
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటన శత్రువుల గుండెల్లో గుబులు రేపుతోంది. కేవలం 22 నిమిషాల్లో ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థను ఎలా కుప్పకూల్చామో గుర్తుచేస్తూ.. ‘భారతదేశం దీనిని ఎప్పటికీ మర్చిపోదు’ అంటూ ఇండియన్ ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది.పహల్గామ్ మారణహోమానికి ప్రతీకారంకశ్మీర్లోని పహల్గామ్కు వెళ్లిన 25 మంది పర్యాటకులను పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసిన ఈ మారణహోమానికి ప్రతీకారంగా 2025 మే 7న భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో ప్రతీకార దాడులకు దిగాయి. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మన సైన్యం ప్రణాళికాబద్ధమైన దాడులతో విరుచుకుపడింది. Resolve. Clarity. Mission Focus. Justice Served- Swift and Precise.Evidence doesn't argue - It settles.#SindoorAnniversary #JusticeEndures#NationFirst pic.twitter.com/bSBWEgAjJX— ADG PI - INDIAN ARMY (@adgpi) April 27, 2026100 మందికి పైగా ఉగ్రవాదుల హతంఈ ఆపరేషన్లో లష్కరే తొయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన తొమ్మిది ప్రధాన ఉగ్రవాద లాంచ్ప్యాడ్లను భారత బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైనిక, పౌర స్థావరాలపై ఎలాంటి దాడులు జరగలేదని, కేవలం ఉగ్రవాదుల కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని భారతదేశం స్పష్టం చేసింది. అయితే దెబ్బతిన్న పాకిస్తాన్ వెంటనే భారత సరిహద్దు పట్టణాలపై డ్రోన్ దాడులు, షెల్లింగ్కు దిగింది.తోకముడిచిన పాక్.. కాల్పుల విరమణపాక్ దుశ్చర్యలతో రెండు పొరుగు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు సైనిక సంఘర్షణ కొనసాగింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారత సైన్యం అత్యంత పటిష్టమైన రక్షణను కొనసాగించడమే కాకుండా, పాకిస్తాన్లోని అనేక బేస్లపై దాడులు చేసి వారి సైనిక, కమ్యూనికేషన్ వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ భారీ నష్టాలను తట్టుకోలేక పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) భారత డీజీఎంఓను సంప్రదించారు. దీంతో మే 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి, నాలుగు రోజుల యుద్ధానికి తెరపడింది.ఇది కూడా చదవండి: అస్సాంలో ‘విజయ్’లాంటోడు?.. ఫలితాలను శాసిస్తూ..
అస్సాంలో ‘విజయ్’లాంటోడు?.. ఫలితాలను శాసిస్తూ..
డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఒకే ఒక్క సీనియర్ నేత చేతుల్లోకి వెళ్లనున్నట్లు కనిపిస్తోంది. ఆయనే బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) అధినేత హగ్రామా మొహిలారీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాడో అస్సాంలో హగ్రామా మొహిలారీ అదే పంథాలో కనిపిస్తున్నారు.అత్యంత శక్తివంతమైన నేతఒకప్పుడు బద్ధ శత్రువుగా ఉన్న అధికార బీజేపీతో ఇప్పుడు మళ్లీ చేతులు కలిపి, తదుపరి ప్రభుత్వాన్ని శాసించే కింగ్ మేకర్గా హగ్రామా మొహిలారీ అవతరించారు. పశ్చిమ అస్సాంలోని బోడోలాండ్ ప్రత్యేక స్వయంప్రతిపత్తి ప్రాంతంలో మొహిలారీ అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఒకప్పుడు సాయుధ తిరుగుబాటుదారునిగా ఉన్న ఆయన, 2003లో కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని, ప్రధాన స్రవంతిలో కలిసిపోయి, రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన పార్టీ ఒక ప్రత్యేక కౌన్సిల్ ద్వారా ఐదు జిల్లాలను పరిపాలిస్తూ, రాష్ట్ర అసెంబ్లీలోని కీలకమైన 15 స్థానాలపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.బీజేపీకి అత్యవసరమైన ‘సోషల్ ఇంజనీరింగ్’మొహిలారీ అసలు బలం సమాజంలోని భిన్న వర్గాలను ఏకం చేయగలగడమే. కేవలం ఒకే సామాజిక వర్గానికి పరిమితం కాకుండా గిరిజనులు, బెంగాలీ మూలాలున్న ముస్లిం మైనారిటీల మద్దతు కూడగట్టుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి. ఈ ‘సోషల్ ఇంజనీరింగ్’ వ్యూహమే బీజేపీకి ఆయనను అత్యవసర భాగస్వామిగా మార్చింది. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే, మొహిలారీ అండతోనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు ఆశిస్తున్నారు.నిధుల కోసమే ఈ రాజకీయ రాజీ?బీజేపీ, బీపీఎఫ్ల మధ్య సంబంధం ఎప్పుడూ ఒకేలా లేదు. కొన్నేళ్ల క్రితం మొహిలారీని జైలుకు పంపుతామని అగ్రశ్రేణి బీజేపీ నేతలు హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇరు పార్టీలు పాత పగలు మరిచి ఒక ‘రాజకీయ రాజీ’కి వచ్చాయి. గిరిజన కౌన్సిల్స్ మనుగడకు, అభివృద్ధికి ప్రభుత్వ నిధులు అత్యవసరం కావడంతో, అధికార పార్టీకి దగ్గరగా ఉండటం మొహిలారీకి కూడా తప్పనిసరి. 85 శాతానికి పైగా భారీ పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో మొహిలారీ మళ్లీ తిరుగులేని నాయకునిగా ఎదుగుతారా లేదా అనేది ఓట్ల లెక్కింపుతో తేలనుంది.ఇది కూడా చదవండి: మాలి రక్షణ మంత్రి దారుణ హత్య
ఏం జరగాలో అది జరుగుతోంది
బెంగళూరు: ఎప్పుడు ఏమి జరగాలో అది జరుగుతోంది, ఇకపై రాజకీయాల గురించి మీడియాతో మాట్లాడను, సమయం వచ్చినపుడు అదే తెలుస్తుంది అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆదివారం బెంగళూరులో సదాశివనగరలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘మాలో ఎలాంటి సమస్య లేదు. ఏ రాజకీయం కూడా లేదు. ఏమేమి తీర్మానం అయ్యాయో అవి అమల్లోకి వస్తాయి. ఎప్పుడు ఏమి చేయాలో దానిని పార్టీ చేస్తుంది. పార్టీపై విశ్వాసముంది’ అని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో చెరి సగం కాలం ఉండాలని సిద్దరామయ్య, తన మధ్య ఒప్పందం కుదిరిందని, దానిని అమలు చేయాలని డీకే డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. డీకే మాటలను బట్టి సీఎం కురీ్చని మార్చడానికి హైకమాండ్ సిద్ధమైనట్లు సమాచారం. హైకమాండ్ మాట పాటిస్తాం ముఖ్యమంత్రి కుర్చీ మార్పుపై స్పందించిన ఆయన, మీకు ఈ విషయంలో గందరగోళంగా ఉండవచ్చు. హైకమాండ్ చెప్పినదానిని పాటిస్తామని నేను, సీఎం చెప్పాం. అదే ప్రకారంగా నడచుకొంటామని తెలిపారు. మే 15న తన పుట్టిన రోజుకు ఎవరూ కూడా ఫ్లెక్స్, బ్యానర్లను వేయరాదని కోరారు. రోడ్ల సౌందర్యాన్ని నాశనం చేయరాదని, అలాంటివారిపై జరిమానా విధించాలని కమిషనర్కు సూచించానని తెలిపారు. అంతర్గత రిజర్వేషన్లకు పరిష్కారం ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లను తాము చెప్పినట్లు చేశామని బీజేపీ విమర్శల గురించి డీకే పేర్కొన్నారు. మాల, మాదిగ సముదాయాల్లో ముందు ఎవరికి, ఆ తరువాత ఎవరికి అనే ప్రశ్న గతంలో ఉండేది. దానిని పరిష్కారానికి దారిని కనిపెట్టామన్నారు. మాదిగ, మాల, లంబాణి, భోవి వర్గాలందరికీ న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. 30, 40 ఏళ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించామని చెప్పారు.
ఎన్ఆర్ఐ
టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ
జపాన్లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు. ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
క్రైమ్
9వ తరగతి విద్యార్థిని కోసం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన టీచర్
నల్లగొండ జిల్లా: ఉన్నత విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తాను చదువు చెబుతున్న విద్యార్థినిపై ప్రేమ పెంచుకుని అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరగగా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కనగల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని చండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వేసవికాలం కావడంతో సదరు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి సదరు విద్యార్థినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఎలాగైనా విద్యార్థినిని కలవాలని బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తలుపు తీస్తున్న క్రమంలో శబ్దం రావడంతో ఆరుబయటే నిద్రిస్తున్న విద్యార్థిని తండ్రి టీచర్ను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ టీచర్ తప్పించుకొని సొప్ప చేను, గడ్డివాముల్లో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా ఏకమై గ్రామాన్ని జల్లెడ పట్టి సదరు టీచర్ను పట్టుకొని దొంగగా భావించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారించగా.. తాను దొంగను కాదని, విద్యార్థిని కోసమే వచ్చానని సదరు టీచర్ అసలు విషయం చెప్పాడు. ఈ ఘటనపై కనగల్ ఎస్ఐ రాజీవ్రెడ్డిని వివరణ కోరగా.. సదరు టీచర్ విద్యార్థిని కోసమే ఇంట్లోకి చొరబడినట్లు ఒప్పుకున్నాడని, విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వకుండా జాప్యంచండూరు పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వగా.. సదరు ఉపాధ్యాయుడు చదువు చెప్పే పాఠశాలలో మాత్రం ఇప్పటివరకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం లేదు. ఈ విషయం అందరికీ తెలియడంతో.. ప్రోగ్రెస్ కార్డులకు వచ్చే తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై తిరగబడే అవకాశం ఉండడంతోనే జాప్యం చేస్తున్నట్లు సమాచారం.
తల్లి కుట్ర: చిన్న కొడుకుతో పెద్ద కొడుకు హత్యకు ప్లాన్
మంథనిరూరల్: కన్న కొడుకునే మరోకొడుకుతో అంతం చేయాలని చూసిందో తల్లి.. అర్ధ రాత్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పాలడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15ఏళ్లక్రితం చనిపోయాడు. తల్లి జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్ద తమ్ముడు గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొడుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసి చిన్నతమ్ముడు అనిల్, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్నట్లు మంథని పోలీసులు తెలిపారు.
ఇంట్లోకెళ్ళి బలవంతంగా మహిళపై ఎస్సై లైంగికదాడి..!
చిగురుమామిడి పోలీస్స్టేషన్లో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్ సొంతశాఖ ఉద్యోగులకు అందాల్సిన జీతాలను కాజేశాడు. ఈ ప్రక్రియకు కరీంనగర్ కమిషనరేట్ ఏవోస్థాయి అధికారి సహకరించడంతో రూ.కోట్లలో దండుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జైలుకు పంపారు.జమ్మికుంట పోలీసుస్టేషన్ ఎస్సైగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న కదిరె శ్రీకాంత్ ఓ మహిళను వేధించిన కేసులో చిక్కుకున్నాడు. శ్రీకాంత్కు ఫేస్బుక్లో పరిచయమైన ఓ వివాహిత ఇంటికి వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డట్టు ఆరోపణలొచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 15న వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసుస్టేషన్లో శ్రీకాంత్పై కేసు నమోదైంది.వీణవంక పోలీస్స్టేషన్ పరిధిలో ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతుంటుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారినుంచి మామూళ్లు వసూలు చేయడంతో పాటు సివిల్ వివాదాల్లో తలదూర్చిన ఆరోపణలతో ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.కరీంనగర్ క్రైం: చట్టాన్ని కాపాడాల్సిన కొందరు పోలీసులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు భక్షకులుగా మారుతున్నారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లే బాధితులకు అక్కడి సిబ్బంది చేయి తడపనిదే పని జరగక పోగా.. ఇదేంది సారూ అని అడిగితే జులుం ప్రదర్శించడం పలువురు సిబ్బంది వంతవుతోంది. ఇటీవల కాలంలో కరీంనగర్ పోలీసు కమిషనరేట్ వరుస వివాదాలకు నెలవుగా మారుతుండగా, ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు కొందరు చిక్కుల్లో పడుతున్నారు. ఈ ఒక్క నెలలో మూడు ఘటనలు జరగడం కలంకంగా మారాయి.రాజకీయ పలుకుబడితో..పలువురు సిబ్బంది రాజకీయ పలుకుబడితో వారికి నచ్చిన పోలీసు స్టేషన్లో పోస్టింగ్లు తెచ్చుకొని, ఉన్నతాధికారులు అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా.. పోలీసుశాఖలో అంతర్గత పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందా? లేక క్రమశిక్షణ లోపించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలువురు సిబ్బంది సివిల్ వివాదాల్లో తలదూర్చుతూ, ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివిధ కేసుల్లో స్టేషన్ బెయిల్ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇసుక వనరులు ఉన్నచోట్ల వసూళ్ల పర్వానికి తెరతీస్తున్నారని చెబుకుంటున్నారు. పోలీసుశాఖలో ఎక్కడ ఏంజరిగినా క్షణాల్లో తెలుసుకునే ఎస్బీ విభాగం ఏంపనిచేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు రక్షణగా నిలవాలి్సనవారు అడ్డదారిలో వెళ్తే, అలాంటివారిపై వ్యవస్థలో పారదర్శకతను పెంచేలా చర్యలు చేపట్టా ల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే ఘటనలు పోలీసుశాఖలో పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నన్నే అన్నా అంటావా?
కరీంనగర్: హెయిర్ సెలూన్కు కటింగ్కోసం వెళ్లిన ఓ ఎస్సై అందులో పనిచేసే వ్యక్తిపై తన జులుం ప్రదర్శించాడు. ‘షాపు ఇప్పుడే తెరిచాను కొద్దిసేపు ఆగండి అన్నా’ అన్న పాపానికి పిడిగుద్దులు గుద్ది, దుర్భాషలాడాడు. ఈ ఘటన కరీంనగర్లోని ఖాన్పుర ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది. నగరంలోని త్రీటౌన్లో ఎస్సైగా విధులు నిర్వహించే చైతన్య చందర్ ఉదయం ఖాన్పుర ప్రాంతంలో ఉండే ఓ సెలూన్కు వెళ్లాడు. తనకు కటింగ్ చేయాలని నాయీబ్రాహ్మణుడు పడాల రాములును కోరా డు. ‘ఇప్పుడే షాపు తెరిచాను. కొద్దిసేపు ఆగండి అన్నా’ అని రాములు సమాధానం చెప్పటంతో ‘నన్ను అన్నా అంటావా? కాసేపు ఆగమంటావా’? అంటూ దూషిస్తూ చేయిచేసుకున్నా డు. సెలూన్లో ఉన్న సీసీకెమెరాల్లో ఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అప్రమత్తమైన త్రీ టౌన్ సీఐ తిరుమల్ వెంటనే టౌన్ ఏసీపీ వెంకటస్వామికి సమాచారమిచ్చారు. విచారణ అనంతరం సీపీకి నివేదిక అందించారు. ఈ ఘటనలో ఎస్సై చైతన్య చందర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. రాములుపై దాడి చేసిన త్రీటౌన్ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నాయీబ్రాహ్మణుల జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య డిమాండ్ చేశారు.
వీడియోలు
నా కొడుకుని వాడుకొని రూ.9 కోట్ల మోసం..?
ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని YSRCP నిర్ణయం
పదునులేని గొడ్డలి అయిపోయావు ABN RK పై ఫైర్
కాలే పెనంలా మారబోతున్న తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిక
ABN రాధాకృష్ణకు నడి రోడ్డు మీద శిక్ష తప్పదు జగన్ వచ్చాక ఎవర్నీ వదలం
పెట్రోల్ బంక్ డీలర్లతో బాబు కుమ్మక్కు..! బ్లాక్ అమ్మకాలు..!
పిచ్చి కుక్కలు.. ABN రాధాకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్
అసమర్థులు కూటమిపై YSRCP నేతలు ఫైర్
ఆకు రౌడీలతో చంద్రబాబు ప్రభుత్వం నడుస్తుంది.. భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ కామెంట్స్
ఎర్రవెల్లి - హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్



