తిరుమలలో కుంభవృష్టి వర్షం.. భక్తులకు ఇబ్బందులు
తిరుమల: తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం గంటపాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయం చుట్టుపక్కల రహదారులు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తులు తడిసి ఇబ్బంది పడ్డారు. రహదారులు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు కూడా అంతరాయం కలిగాయి.
నీట్ పరీక్ష భద్రత కోసం ఎన్టీఏ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల జూన్ 21న జరగనున్న నీట్ యూజీ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఏటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తరలించేందుకు భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించుతోంది. ఈ వివరాలను NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. దీంతో ఒక పరీక్ష కోసం విమానాల్ని వాడిన ఎగ్జామ్గా నీట్ రికార్డు సృష్టించనుంది.నీట్పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె. రామకృష్ణారావు నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో అభిషేక్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షల పారదర్శకతను, భద్రతను కాపాడటానికి ఈసారి మునుపెన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్స్ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అభిషేక్ సింగ్ మాట్లాడుతూ "పరీక్షా ప్రక్రియ సమగ్రతను, భద్రతను కాపాడటానికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రశ్నపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళాన్ని ఉపయోగిస్తున్నాము" అని అన్నారు.కాగా వైమానిక దళ అంశంపై ఇటీవలే మాట్లాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ జూన్ నెలలో ఉండే వాతావరణ పరిస్థితులు, రవాణా ఇబ్బందులు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రశ్నపత్రాలను సురక్షితంగా, సకాలంలో చేరవేసేందుకు వైమానిక దళ సహాయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే కేవలం ప్రశ్నాపత్రాల కోసం మాత్రమే వైమానిక దళం సహాయం తీసుకుంటామని భద్రత కోసం మరే సాయం తీసుకోమని స్పష్టం చేశారు.గత మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల రద్దు చేస్తున్నట్లు మే 12న ఎన్టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 21న దేశవ్యాప్తంగా తిరిగి పరీక్ష నిర్వహించనున్నారు.
‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్!
టెహ్రాన్: వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భవిష్యత్తులో సమావేశం కావచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి భేటీ ఆశించడం ముమ్మాటికీ అవాస్తవికమని, అమెరికా అధ్యక్షుడు ఇకనైనా ‘వాస్తవంలో బతకడం’ అలవాటు చేసుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ ఆశావాదం - ఇరాన్ తిరుగుబాటుఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ముందుకు సాగితే, ఇరాన్ అగ్ర నాయకత్వంతో నేరుగా చర్చలు జరపవచ్చని డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత ఒప్పందాన్ని కుదుర్చుకునే వ్యూహంలో భాగంగా, మొజ్తబా ఖమేనీతో చారిత్రాత్మక భేటీకి తాను సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని లెబనాన్ ఛానల్ ‘అల్ మయాదీన్’ ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొట్టిపారేశారు.అసలు ఎవరీ మొజ్తబా ఖమేనీ?2026 మార్చిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడైన మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత రాజకీయ, మతపరమైన పదవిని చేపట్టారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన ప్రజల్లో ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ, ఇరాన్ అంతర్గత, విదేశాంగ విధానాలను శాసించడంలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం నాల్గవ నెలలోకి ప్రవేశించిన ఈ తరుణంలో ఆయనతో భేటీ కావడం ట్రంప్కు ప్రతిష్టాత్మకంగా మారింది.కొనసాగుతున్న తీవ్ర విభేదాలుఅమెరికా ఎంతగా చర్చల ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నా, ఇరు దేశాల మధ్య నమ్మకరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు దౌత్యపరమైన పురోగతికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం బహిరంగ ప్రకటనల ద్వారా కాకుండా, ఆచరణాత్మక రాజకీయ పరిణామాల ఆధారంగానే భవిష్యత్తు చర్చలు ఉంటాయని ఇరాన్ గట్టిగా చెప్తోంది. నానాటికీ క్షీణిస్తున్న ఈ సంబంధాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం ఇప్పట్లో సాధ్యం కాదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు!
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేసేందుకు రంగం సిద్దమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ఎంపిక చేసిన భారత జట్టులో 15 ఏళ్ల సూర్యవంశీకి చోటు దక్కింది. దీంతో భారత జట్టు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ టెండూల్కర్ను వైభవ్ అధిగమించాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతి చిన్న వయస్సులోనే భారత జట్టు ఎంపికైన వైభవ్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడిని క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్మాన్లతో పోల్చడం సరికాదని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా వైభవ్ టీమిండియాకు ఎంపికవ్వడం తమ కుటుంబానికి ఒక పెద్ద కల నెరవేరిన క్షణమని సంజీవ్ తెలిపాడు.సంజీవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సచిన్, బ్రాడ్మన్లతో వైభవ్ను పోల్చడం నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ లెజండరీ క్రికెటర్లు అత్యున్నత స్థాయిలో దశాబ్దాల పాటు రాణించి, దేశానికి ఎన్నో అద్భుత విజయాలు అందించారు. ప్రస్తుతం వైభవ్ వారి పాదాల దుమ్ముతో కూడా సమానం కాడు. కాబట్టి ఇలాంటి పోలికలు అస్సలు పెట్టవద్దు. అదేవిధంగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు కూడా లెఫ్ట్ హ్యాండరే. కాబట్టి లారా బ్యాటింగ్ వీడియోలను వైభవ్కు చూపించాను. గత కొన్నేళ్లుగా లారా, యువరాజ్ సింగ్, ఇతర క్రికెటర్ల బ్యాటింగ్ వీడియోలు కూడా వైభవ్ చూస్తున్నాడు.అయినప్పటికి అతడి ఆటతీరు పూర్తిగా విలక్షణంగా ఉంటుంది. అతడు ఎవరిని అనుకరించకుండా తనదైన శైలిలో క్రికెట్ ఆడతున్నాడని" పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో వైభవ్ దుమ్ములేపాడు. 776 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్!?
తిరుమలలో కుంభవృష్టి వర్షం.. భక్తులకు ఇబ్బందులు
బుజ్జగింపుల పర్వం.. పవన్పై పోస్ట్ డిలీట్!
మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్ Z ఇలా ఉందేంటి?
ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
సింగర్ సునీత తనయుడి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
WTC పాయింట్ల పట్టికలో మార్పులు
న్యూఢిల్లీలో ఇండి కూటమి నేతలు.. భేటీపై ఉత్కంఠ
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
‘ఆర్ఆర్ఆర్పై కిషన్రెడ్డి జవాబు చెప్పాలి’
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
జై చంద్రబాబు అంటే మీకు కనెక్ట్ అవుతుంది సార్!
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు
అపచారం... దైవద్రోహం
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
తొలి క్యాబినేట్ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
30 ఏళ్ల నాటి కేసు.. నటికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే
ఊళ్లో నెమళ్ల బెడద
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా..!
విశాఖ: 2 గంటల పాటు నిలిచిపోయిన రైళ్లు
తిరుమలలో కుంభవృష్టి వర్షం.. భక్తులకు ఇబ్బందులు
బుజ్జగింపుల పర్వం.. పవన్పై పోస్ట్ డిలీట్!
మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్ Z ఇలా ఉందేంటి?
ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
సింగర్ సునీత తనయుడి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
WTC పాయింట్ల పట్టికలో మార్పులు
న్యూఢిల్లీలో ఇండి కూటమి నేతలు.. భేటీపై ఉత్కంఠ
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
‘ఆర్ఆర్ఆర్పై కిషన్రెడ్డి జవాబు చెప్పాలి’
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
జై చంద్రబాబు అంటే మీకు కనెక్ట్ అవుతుంది సార్!
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు
అపచారం... దైవద్రోహం
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
తొలి క్యాబినేట్ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
30 ఏళ్ల నాటి కేసు.. నటికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే
ఊళ్లో నెమళ్ల బెడద
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా..!
విశాఖ: 2 గంటల పాటు నిలిచిపోయిన రైళ్లు
ఫొటోలు
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్నెస్తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్ సందడి (ఫొటోలు)
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
సినిమా
'సాంగ్ షూట్.. హీరో ముద్దులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు'
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఉంటాయి. కథకు తగ్గట్టుగా కొన్ని సీన్స్ తప్పకుండా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ముద్దు సీన్స్ చేయడమంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా నటీనటులు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితేనే ముద్దు సీన్ అంత బాగా ఆడియన్స్కు కనెక్ట్ అవుతుంది. అలాంటి ఈ సీన్స్లో ఒక్కోసారి అభ్యంతరం రావడం కూడా సహజమే. తాజాగా ఓ నటి ముద్దు సీన్లో తనకెదురైన అనుభవాన్ని షేర్ చేసుకుంది.ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా బాపత్.. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఓ సాంగ్ షూట్లో హీరో తనను పదేపదే ముద్దు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తాను చాలా అసౌకర్యానికి గురైనట్లు వెల్లడించింది. ఆ టైమ్లో తాను ఎలా స్పందించాలో.. ఎలా సమర్థించుకోవాలో తెలియలేదని అన్నారు. షూటింగ్ తర్వాత కూడా ఆ సీన్ తన మైండ్లో నుంచి పోలేదని చెప్పారు. అయితే ఆ ముద్దు సన్నివేశంపై తాను మొదటి నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేశానని ప్రియా తెలిపారు. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్లలో దాని అవసరం గురించి దర్శకుడిని ప్రశ్నించానని ప్రియా బాపత్ వెల్లడించారు. ఆ సన్నివేశం కంటే సహనటుడి ప్రవర్తన హద్దులు దాటిందని ఆమె ఆరోపించారు.అంతేకాకుండా చిత్రీకరణ సమయంలో తామిద్దరూ ఒకే హోటల్లో బస చేశామని వెల్లడించింది. తాను చాలాసార్లు వద్దని చెప్పినప్పటికీ నా సహనటుడు అల్పాహారం, రాత్రి భోజనానికి తనతో కలిసి చేయాలని పదేపదే అడిగాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవం తనను తీవ్రంగా కుంగదీసిందని తెలిపింది. తన పరిస్థితి గురించి ప్రతి రాత్రి తన భర్త ఉమేష్ కామత్కు ఫోన్ చేసేదాన్నని చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె భర్త కామత్ ముంబయి నుంచి సినిమా షూటింగ్ జరుగుతున్న భోపాల్కు వచ్చి మూడు రోజుల పాటు ఆమెతో పాటే ఉన్నారని వెల్లడించింది.కాగా.. ప్రియా బాపత్ మరాఠీ చిత్రసీమలో ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా ఓటీటీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. 'కాక్స్పర్శ్', 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్లో నటనకు ఆమె బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా హ్యాపీ జర్నీ (2014), ఆమ్హీ దోగీ (2018), అంధేరా, రాత్ జవాన్ హై లాంటి ప్రాజెక్ట్ల్లో కనిపించింది. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది.
నేలపై కూర్చుకున్న నాగ్ అశ్విన్.. 'కల్కి' దర్శకుడి వీడియో వైరల్
ఈ రోజుల్లో చిన్న సినిమాలు చేసిన కొద్దిమంది నటులు, దర్శకులే తాము పెద్ద సెలబ్రిటీలమనే రేంజ్లో ఫీల్ అవుతూ గాల్లో తేలిపోతుంటారు. కానీ, ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్తో 'కల్కి 2898 AD' లాంటి గ్లోబల్ పాన్-ఇండియా బ్లాక్బస్టర్ సినిమా తీసిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం తన సింప్లిసిటీతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన నిరాడంబరతకు అద్దం పట్టే ఒక అరుదైన ఘటన తాజాగా చెన్నైలో చోటుచేసుకుంది.లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో 'సింగ్ గీతం' అనే సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ఒక ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు కోలీవుడ్ విశ్వనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు రావడంతో వేదికపై మరియు గెస్టుల గ్యాలరీలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వచ్చిన అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు కూర్చోవడానికి సీట్లు సరిపోలేదు. తన సినిమా ఈవెంట్కు వచ్చిన అతిథులకు ఇబ్బంది కలగకూడదని భావించిన నాగ్ అశ్విన్.. ఏమాత్రం ఈగోకు పోకుండా, తాను ఒక స్టార్ డైరెక్టర్ ని అనే విషయాన్ని పక్కన పెట్టి, సోఫాల పక్కనే కింద నేల మీద కూర్చుండిపోయారు. కమల్ హాసన్ లాంటి లెజెండ్ పక్కన కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ, అతిథుల సౌకర్యం కోసం నాగ్ అశ్విన్ కింద కూర్చోవడం చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో నాగ్ అశ్విన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Producer Nag Ashwin @nagashwin7 at #SingGeetham movie pre release event.. 🙏 pic.twitter.com/NJgolG5BNG— H A N U (@HanuNews) June 7, 2026
రామ్ చరణ్కు క్లీంకార సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం పెద్ది సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. తొలి రోజే హిట్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు.పెద్ది సూపర్ హిట్ వేళ ప్రతి ఒక్క అభిమాని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లీంకార.. డాడీకి క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నాన్న.. దిస్ ఈజ్ ఫర్ యూ.. క్లీంకార లవ్ యూ సో మచ్ అంటూ చరణ్ ఇంట్లో పనిచేసే సిబ్బందితో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వారంతా చికిరి చికిరి సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.
అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిల్లలు ఫుల్ హ్యాపీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఓ అభిమాని కోరిన వెంటనే అతని ఆకాంక్షను నెరవేర్చాడు. తన ఇద్దరు పిల్లల కోసం రెండు కుకీస్ పంపమని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా కోరాడు. ఇది చూసిన ఎన్టీఆర్ మీ అడ్రస్ పెట్టు పంపిస్తా అంటూ రిప్లై ఇచ్చారు.అతనికి మాటిచ్చినట్లుగానే తన ఆటోగ్రాఫ్తో కూడిన కుకీస్ను పంపి అభిమాని కోరిక తీర్చాడు. వాటిని స్వయంగా ఎన్టీఆర్ తయారు చేసి మరి పంపించాడు. తమ రిక్వెస్ట్కు స్పందించి కుకీస్ పంపడంతో ఆ అభిమాని ఆనందం పట్టలేకపోయారు. జూనియర్ పంపిన కుకీస్ను అతని పిల్లలు తింటుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆ ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది.ఇక జూనియర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పనిచేస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ కనిపించనుంది. Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at… pic.twitter.com/DkRU7PEMJK— saiteja (@saitejaathoti) June 6, 2026
క్రీడలు
చరిత్రాత్మక లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లండ్దే గెలుపు
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన చారిత్రక టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో లార్డ్స్లో జరిగిన 150వ మ్యాచ్ కావడంతో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలో 150 టెస్ట్లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియం లార్డ్స్ క్రికెట్ మైదానం.పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు స్వల్ప స్కోర్కే పరిమితమయ్యాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ను 140 పరుగులకే ఆలౌట్ చేసింది. జేమీసన్ 5, నాథన్ స్మిత్ 3, విలియమ్ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం న్యూజిలాండ్ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ 5, టంగ్ 3, అట్కిన్సన్ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన జేమీసన్ టాప్ స్కోరర్గా నిలిచాడు.27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ అరంగేట్రం బ్యాటర్ ఎమిలియో గే (57), డకెట్ (33), జేమీ స్మిత్ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్ స్మిత్ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్ ఓరూర్కీ 2, మ్యాట్ హెన్రీ, జేమీసన్ తలో వికెట్ తీశారు.254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్ 5, రాబిన్సన్, టంగ్ తలో 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కాన్వే (41), గ్లెన్ ఫిలిప్స్ (44 నాటౌట్), కేన్ విలియమ్సన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 17న మొదలవుతోంది.
పసిడి పతకం ముద్దాడిన సుచిత్ర అకాడమీ స్టార్లు
హైదరాబాద్ వేదికగా యోనెక్స్-సన్రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ (U-15) నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో సరికొత్త ఛాంపియన్లు అవతరించారు. సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన కిమ్కిమ్ ఖోంగ్సాయి, లియాన్సాంగ్పుయా జోడి మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో పసిడి పతకం కైవసం చేసుకున్నారు.ఫైనల్లో ప్రత్యర్ధిపై 21-10, 21-15 వరుస సెట్లలో గెలిచి ఛాంపియన్స్గా నిలిచారు. అంతకుముందు సెమీఫైనల్లో టోర్నీ రెండువ సీడ్ జోడీపై వీరిద్దరూ ఘన విజయం సాధించారు. కాగా కిమ్కిమ్ ఖోంగ్సాయి, లియాన్సాంగ్పుయా ఇద్దరూ మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు.వారిద్దరికి 'సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ'లో చేరకముందు కనీసం రాష్ట్ర స్థాయి మ్యాచ్లు కూడా అనుభవం లేదు. వారిని చిన్న వయసులోనే హైదరాబాద్ తీసుకొచ్చి, అకాడమీ తరపున డైరెక్టర్ కె. ప్రదీప్ రాజు ఉచిత కోచింగ్ ఇచ్చారు.
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో దంచికొట్టిన రాహుల్... టెస్టు ఫార్మాట్లోనూ అదే జోరు కొనసాగించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగం కానీ ఈ మ్యాచ్లో భారత్కు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు.చక్కటి షాట్లతో మంచి టచ్లో కనిపించిన యశస్వి జైస్వాల్ త్వరగానే అవుటవడంతో... అఫ్గాన్ శిబిరంలో ఆనందం కనిపించింది. వనడౌన్ బ్యాటర్ సుదర్శన్ సాయంతో రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. చితూచి ఆడిన ఈ జంట ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. మంచి బంతులను వదిలేసిన ఈ జోడీ... గతి తప్పిన బంతులపై విరుచుకుపడింది.దీంతో స్కోరుబోర్డు సాఫీగా సాగగా... అఫ్గాన్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జంటను విడదీయలేకపోయారు. అనుభవరాహిత్యం అఫ్గాన్ జట్టుకు ప్రతిబంధకంగా మారింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ బ్యాట్ను తాకిన బంతి... కీపర్ చేతిలో పడింది. అయితే అంపైర్ ఇది గుర్తించకపోగా... అఫ్గాన్ రివ్యూ కోరలేదు. తర్వాత రీప్లేలో అది స్పష్టంగా అవుట్ అని కనిపించింది. దీంతో బతికిపోయిన రాహుల్... టెస్టు ఫార్మాట్లో 12వ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన రాహుల్రాహుల్ సరిగ్గా 100 పరుగుల వద్దే అవుట్ కావడం రాహుల్ కెరీర్లో ఇది మూడోసారి. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు ఖచ్చితంగా 100 పరుగుల వద్ద అవుట్ అయిన భారత బ్యాటర్గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తమ కెరీర్లో రెండేసి సార్లు ఇలా వంద పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ఇప్పుడు రాహుల్ వారిని అధిగమించాడు. అంతేకాకుండా రాహుల్ తన టెస్ట్ కెరీర్లో చేసిన చివరి మూడు సెంచరీలు కూడా ఇలా వంద పరుగులు వద్దే ముగిశాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు సెంచరీలను ఇలా 'ఖచ్చితంగా 100' వద్దే ముగించిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
షాహీన్ అఫ్రిదికి ఊహించని షాక్
పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన రెడ్బాల్ శిక్షణ శిబిరంలో అతడికి చోటు దక్కలేదు. దీంతో షాహీన్ టెస్టు భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి.జూన్ 8 నుంచి జూలై 10 వరకు జరిగే రెడ్బాల్ క్యాంప్కు 22 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన పీసీబీ, షాహీన్ పేరును జాబితాలో చేర్చలేదు. అయితే జూన్ 15 నుంచి సెప్టెంబర్ 18 వరకు కొనసాగే వైట్బాల్ క్యాంప్లో మాత్రం అతడికి స్థానం కల్పించింది.ఆస్ట్రేలియాపై మెరిసినా..తాజాగా పాక్ ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను గెలవడంలో (2-1) షాహీన్ కీలక పాత్ర పోషించాడు. మూడు ఇన్నింగ్స్ల్లో 7 వికెట్లు తీసి, 3.86 ఎకానమీతో ఆకట్టుకున్నాడు.అలాగే ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో కూడా రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్లు సాధించాడు. అయినప్పటికీ రెడ్బాల్ క్యాంప్ నుంచి అతడిని తప్పించడంపై ఆశ్చర్యకరంగా ఉంది.తీవ్ర విమర్శలుఇటీవలి కాలంలో పాక్ టెస్ట్ జట్టు ప్రదర్శనలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండోసారి వైట్వాష్కు గురికావడం, నాలుగు వరుస టెస్టుల్లో ఓడిపోవడం జట్టు ఘోర పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో భారీ మార్పులు చేయాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.రెడ్బాల్ క్యాంప్లో స్టార్ ఆటగాళ్లురెడ్ బాల్ క్యాంప్లో షాహీన్కు చోటు దక్కకపోయినా.. బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, సల్మాన్ అఘా, ఇమామ్ ఉల్ హక్, ఆమిర్ జమాల్ వంటి ప్రముఖులకు అవకాశం లభించింది.ఇదిలా ఉంట, పాక్ తదుపరి టెస్ట్ మ్యాచ్లు జులై ఆఖర్లో ఆడాల్సి ఉంది. జులై 25 నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్లో పర్యటించనుంది. ఈ సిరీస్తో పాటు తదుపరి టెస్ట్ షెడ్యూల్ దృష్ట్యా పాక్ రెడ్ బాల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా... కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
బిజినెస్
కస్టమర్ల కోసం TVS కొత్త కాన్సెప్ట్!
భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీ 'టీవీఎస్ ప్యాడాక్' అనే కొత్త ప్రీమియం రిటైల్ నెట్వర్క్ను ప్రారంభించింది. ప్రీమియం మోటార్సైకిల్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కంపెనీ దీనిని స్టార్ట్ చేసింది.టీవీఎస్ ప్యాడాక్ ద్వారా వినియోగదారులు సాధారణ షోరూమ్ కంటే మంచి ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. ఈ ప్రీమియం అవుట్లెట్లను లండన్కు చెందిన చెక్ల్యాండ్ కిండ్లీసైడ్స్ సంస్థ రూపొందించింది. ఇందులో కొత్త ప్రీమియం బైకుల ప్రదర్శన ఉంటుంది. అంతే కాకుండా.. వినియోగదారులకు ప్రత్యేక సలహాలు ఇచ్చే కన్సల్టేషన్ జోన్లు, బ్రాండ్కు సంబంధించిన మెర్చండైజ్ వస్తువులు, సర్వీస్ సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉంటాయి.అయితే.. తొలి టీవీఎస్ ప్యాడాక్ అవుట్లెట్లు 2027 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. ఆ తరువాత దశలవారీగా వీటిని దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. 2026 ఇన్నోవా క్రిస్టా లాంచ్!
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం రిచ్ ‘డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఆస్తులు (Assets), అప్పులు (Liabilities) మధ్య తేడాను అర్థం చేసుకోవడమే నిజమైన సంపదకు తొలి మెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టు విస్తృత చర్చకు దారి తీసింది.చాలామంది ఖర్చుతో కూడుకున్న వస్తువులను సంపదగా భావిస్తారని, అయితే అధిక ధర ఉన్నంత మాత్రాన అది ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తి కాదని కియోసాకి వివరించారు. ప్రతి నెలా మన జేబులోకి డబ్బు వస్తే అది ఆస్తి, జేబులో నుంచి డబ్బు వెళ్తే అది అప్పు అని ఆయన సరళమైన నిర్వచనం ఇచ్చారు.ఈ సందర్భంగా ఖరీదైన ఇల్లు, విలాసవంతమైన కారు వంటి వాటిని ఉదాహరణగా చూపించారు. ఇంటికి గృహ రుణం, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు ఉంటాయని, కారు కొనుగోలు చేసిన వెంటనే విలువ తగ్గడం ప్రారంభమవుతుందని తెలిపారు. అందువల్ల ఇవి ఎక్కువగా అప్పుల కిందకే వస్తాయని పేర్కొన్నారు.మరోవైపు అద్దె ఆదాయం వచ్చే రియల్ ఎస్టేట్, డివిడెండ్లు చెల్లించే షేర్లు, లాభాలు ఆర్జించే వ్యాపారాలు, రాయల్టీలు తెచ్చిపెట్టే మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ ఉత్పత్తులు వంటి వాటిని నిజమైన ఆస్తులుగా అభివర్ణించారు. ఇవి నిరంతరం నగదు ప్రవాహాన్ని సృష్టించి యజమానికి ఆదాయం అందిస్తాయని చెప్పారు.సంపన్నులు ముందుగా ఆస్తులను కొనుగోలు చేస్తారని, మధ్యతరగతి ప్రజలు ముందుగా అప్పులను పెంచుకుని తర్వాత ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు రాలేదని ఆశ్చర్యపడుతుంటారని కియోసాకి వ్యాఖ్యానించారు. పాఠశాలలు, ఆర్థిక వ్యవహారాలపై సలహాలు ఇచ్చే అనేక మంది కూడా ఈ మౌలిక సూత్రాన్ని బోధించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.అమెరికన్ డ్రీమ్ అంటే పెద్ద ఇల్లు కాదని, ఆర్థిక స్వేచ్ఛేనని కియోసాకి పేర్కొన్నారు. ప్రతి నెలా ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులను సృష్టించుకోవడం ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని తన పోస్టులో స్పష్టం చేశారు.
టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఆఫర్లు
దేశీయ వాహన దిగ్గజం టాటా మోటర్స్ (Tata Motors) ఈ జూన్ నెలలో తమ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను మరింత పెంచుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై గ్రీన్ బోనస్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు, లాయల్టీ బోనస్ల రూపంలో మొత్తం రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ముఖ్యంగా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ మోడళ్లపై అత్యధిక తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి.కర్వ్ ఈవీపై అత్యధిక బెనిఫిట్లుTata Curvv EV Discount: టాటా కర్వ్ ఈవీ ఎంపిక చేసిన నాన్-ఎక్స్ వేరియంట్లపై మొత్తం రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.3 లక్షల గ్రీన్ బోనస్తో పాటు రూ.30,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ లేదా రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉంటుంది. క్రియేటివ్ వేరియంట్లపై రూ.2.85 లక్షల వరకు ప్రయోజనాలు ఉండగా, ఎక్స్ సిరీస్ వేరియంట్లకు ఎక్స్చేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ బోనస్ల రూపంలో రూ.65,000 వరకు లభించనున్నాయి.హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల వరకు..Tata Harrier EV Offers: టాటా హారియర్ ఈవీ అన్ని వేరియంట్లపై రూ.2.75 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో రూ.50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.75,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.1 లక్ష లాయల్టీ బోనస్తో పాటు అదనంగా మరో రూ.1 లక్ష ప్రయోజనం ఉంది. దీంతో హారియర్ ఈవీ కొనుగోలుదారులకు గణనీయమైన ఆదా అవకాశం కలుగుతోంది.పంచ్ ఈవీ, టియాగో ఈవీపైనా భారీ తగ్గింపులుTata Punch EV Discount: అవుట్గోయింగ్ పంచ్ ఈవీ వేరియంట్లపై రూ.95 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ రేంజ్ (LR) వేరియంట్లకు గరిష్ఠంగా రూ.1.45 లక్షలు, మీడియం రేంజ్ (MR) వేరియంట్లకు రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.Tata Nexon EV Offers: అలాగే అవుట్గోయింగ్ టియాగో ఈవీపై రూ.65 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు ప్రకటించారు. LR XT వేరియంట్కు అత్యధికంగా రూ.1.45 లక్షల వరకు ఆఫర్ ఉండగా, ఇతర LR వేరియంట్లకు రూ.1.25 లక్షలు, MR వేరియంట్లకు రూ.65 వేల వరకు ప్రయోజనాలు అందుతున్నాయి.నెక్సాన్ ఈవీపై రూ.50 వేల వరకు..టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) సిరీస్పై మొత్తం రూ.50 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.15 వేల గ్రీన్ బోనస్, రూ.25 వేల ఎక్స్చేంజ్ బెనిఫిట్, రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అయితే ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ ఆఫర్లను ఒకేసారి పొందే అవకాశం లేదు.ఎందుకు ఇంత భారీ ఆఫర్లు?భారత ఈవీ మార్కెట్లో పోటీ పెరుగుతుండటం, కొత్త మోడళ్ల రాక, కొన్ని పాత స్టాక్లను క్లియర్ చేయాల్సిన అవసరం నేపథ్యంలో టాటా మోటార్స్ ఈ భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అవుట్గోయింగ్ పంచ్ ఈవీ, టియాగో ఈవీ వేరియంట్లపై అధిక తగ్గింపులు ఇందుకు సంకేతంగా భావిస్తున్నారు.ఈ ఆఫర్లు నగరం, డీలర్ స్టాక్ లభ్యత, వాహనం తయారీ సంవత్సరం (Model Year), వినియోగదారుడి అర్హత వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. కాబట్టి కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు సమీప టాటా డీలర్షిప్ను సంప్రదించి తాజా వివరాలు తెలుసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.ఇదీ చదవండి: హ్యుందాయ్ కార్లపై ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో దాదాపు తొమ్మిది రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. క్రితం రోజున భారీగా పతనమైన బంగారం ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు ఊరట కొనసాగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
ఫ్యామిలీ
ఆఖరి మనిషి
గాఢాంధకారం. ఎటు చూసినా చీకటే. నక్షత్రాలు తప్ప ఏమీ కనిపించనంత చీకటి అలుముకొని ఉంది. భూమి మీద ఆ రాత్రి– కాళరాత్రి కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శబ్దాల మధ్య నిశ్శబ్దంలా, అస్తిత్వం ముగిసిన తర్వాత మిగిలే శూన్యంలా భూమి కనిపిస్తోంది.ఇంతలో గాలి బలంగా వీచింది. కానీ ఆ గాలిలో జీవం లేదు. ఆ గాలి ఒకప్పుడు మానవులకు ఊపిరి పోసింది. కానీ, ఇప్పుడు జీవకోటి మొత్తం నాశనం అయి పుడమి అంతా బోసిపోయి కనిపిస్తోంది. ఆ సమయంలో ఒక కదలిక కనిపించింది. అందులో శబ్దం లేదు. అది అడుగుల చప్పుడూ కాదు. అది ఒక ఉనికి. భూమి కూడా గుర్తుపట్టని ఒక ఆకారం వస్తూ కనిపించింది. ఆమె ఆకాశం నుంచి దిగలేదు. భూమి లోతుల్లోనుంచి పైకి రాలేదు. ఆమె ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది. కానీ ఈరోజు ఆమెను చూడగలిగే కళ్ళు లేవు.ఒకప్పుడు కోట్లాది హృదయాల్లో నిశ్శబ్దంగా నివసించిన ఆమె, ఈరోజు ఖాళీ ప్రపంచంలో తన ఉనికిని తానే మోస్తోంది. ఆమె అడుగులు నేలను తాకలేదు. కానీ ఈ ధరిత్రి ఆమెను చాలాకాలం భరించింది. ఆమె నడిచి వస్తుంటే నదులు పొంగినట్లు, అడవులు కదిలినట్లు, ఉరుములు ఉరుముతున్నట్లు, పర్వతాలు ఎగురుతున్నట్లు అనిపిస్తోంది. ప్రకృతి ఆమెను ఆహ్వానించలేదు. ఆమెను అడ్డుకోలేదు కూడా. ఆమెకు అడ్డుచెప్పేవారు ఈ భూమ్మీద ఎవ్వరూ లేరు. ఆమె నడుస్తోంది. శిథిలమైన నగరాల మధ్యగా, విరిగిన గాజు ముక్కల మీదుగా, శిథిలాల నిశ్శబ్దాన్ని దాటి ఆమె వస్తోంది. ఆమె ప్రతి అడుగులో రౌద్రం కనిపిస్తోంది.ఈ భూమ్మీద మొదటి మనిషి పుట్టిన క్షణం నుంచి చివరి మనిషి శ్వాస వరకు ఆమెకు నిద్ర లేదు. ఆమెకు కాలం అనే పరిమితి లేదు. ఒక పాత నగరం మధ్యలో ఆమె ఆగింది. అక్కడ ఒక నిశ్శబ్దం మధ్యలో చిన్న శబ్దం వినిపిస్తోంది. అది ఎవరిదో శ్వాస. అది బలహీనంగా ఉంది. అది ఆఖరి మనిషి శ్వాస. ఆమె కళ్ళు మూసుకుంది. అతని కోసం ఆమె వెతకాల్సిన అవసరం లేదు. జీవం తనను తానే బయట పెట్టుకుంటుంది. భయం ఎప్పుడూ దాక్కోలేదు. ఆమె మెల్లగా ఆ దిశగా నడిచింది. ఆమె అడుగులు వేగంగా లేవు. అవి ఎప్పుడూ తొందరపడవు. కానీ ఆమె అవి సమయానికి చేరవలసిన చోటుకి చేరుకుంటాయి.ఒకప్పుడు మనుషులు, పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు, అడవులతో కళకళ లాడుతూ ఉండే ధరిత్రి అంతా రుద్రభూమిని తలపిస్తోంది. ఆమె ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆగింది. అంతటా నిశ్శబ్దం. సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆమెకు ఒక సవ్వడి వినిపించసాగింది. కొద్ది క్షణాల తరువాత అది గుండె సవ్వడిగా ఆమెకు అర్థమైంది. అది మనిషి శ్వాస. లబ్ డబ్మని వినిపిస్తున్న ఆ శబ్దం నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. అక్కడ కొద్ది దూరంలో ఉన్న కొండ పక్కన ఒక చిన్న ఇంట్లోంచి ఆ శబ్దం వస్తోంది. ఆమె ఆ శ్వాస వస్తున్న ఇంటి వైపు కదిలింది. ఇంటి మధ్యలో ఒక గోడ ఉంది. లోపల ఒక వ్యక్తి మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఆమెను చూడగానే అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చున్నాడు. ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడవటం మొదలుపెట్టాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి ఎదురుగా నిలబడింది. అతను ఒక్కసారిగా తలెత్తి ఆమెని చూశాడు. అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ముఖం మీద చెమటలు మొదలయ్యాయి. పెదవులు వణకసాగాయి. దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. అయినా సరే ఓపిక తెచ్చుకొని ‘‘నువ్వెవరు?’’ అని అడిగాడు.అతని మాటలకు ఆమె నవ్వింది. ఆ నవ్వు ఆ గది అంతా ప్రతిధ్వనించసాగింది. ఆ నవ్వులో సత్యం వినిపిస్తోంది.‘‘నేనెవరో నీకు తెలియదా?’’ అని ఆమె అతని వైపు చూస్తూ అడిగింది.అతను భయంతో వెనక్కి జరిగి, ‘‘నా...కు ను...వ్వు ఎ...వ...రో... తెలియదు’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో.‘‘నేనెవరో తెలిసినా నువ్వు అబద్ధాలాడుతున్నావు. ఎందుకంటే నేను రావడం నీకు ఇష్టం లేదు. నీకే కాదు, ఏ జీవికీ ఇష్టం ఉండదు. నేనంటే మీకు భయం. అయినా సమయం వచ్చినప్పుడు నేను రాక తప్పదు. ఇది నగ్న సత్యం. ఈ సత్యాన్ని మీరు ఒప్పుకోరు. అందరూ వెళ్లిపోయారు. నువ్వు ఒక్కడివే మిగిలావు. నిన్ను కూడా తీసికెళ్ళిపోతే నా పనై పోతుంది. బయలుదేరు. సమయం మించిపోతోంది. ఇప్పటికే ఆలస్యం అయింది’’ అంది ఆమె కోపంగా.‘‘నేను నీతో రాను. నాకు ఇక్కడ బోలెడు పనులు వున్నాయి. నేను నీతో వస్తే అవన్నీ ఆగిపోతాయి. నేను తరువాత వస్తాను. అయినా నేను నీతో ఎందుకు రావాలి? నన్ను తీసికెళ్ళడానికి నువ్వు ఎవరు? నీకేం హక్కు వుంది?’’ అని అన్నాడు అతను గోడ దగ్గరకు వెళుతూ.అతని మాటలకు ఆమె కోపంగా అతనివైపు చూసింది. అంతే! గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె అతని వైపు వెళ్ళసాగింది. ఇప్పుడు ఆమె కళ్ళలో కోపం లేదు. దయ లేదు. జాలి అంతకన్నా లేదు. ఆమె కళ్ళల్లో ఏ భావం కనిపించటం లేదు.‘‘నేనెవరో నీకు తెలుసు. అయినా మీ మనుషులు మీ గోతిని మీరే తవ్వుకున్నారు. హాయిగా బతకమని మిమ్మల్నందరినీ ఇక్కడకు పంపిస్తే మీరు ఇక్కడ వినాశనాన్ని సృష్టించారు. యుద్ధాలు మొదలయ్యాయి. అణుబాంబులు, రసాయన ఆయుధాలతో మనిషి మనిషినే చంపడం ప్రారంభించాడు. అతను రాక్షసులతో పోరాడుతున్నానని అనుకున్నాడు. కానీ తన జాతిని తానే నాశనం చేస్తున్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. చివరకు తానే తన జాతి పాలిట రాక్షసుడయ్యాడు. మీ జాతితో పాటు ఇక్కడి ప్రకృతిని, జంతుజాలాన్ని, అడవుల్ని కూడా విధ్వంసం చేశాడు. అందుకే మీరు ఇక్కడుండే అర్హత కోల్పోయారు’’ అంటూ ఆమె అతని వైపు చేయి చాపింది.‘‘ఎవరో తప్పు చేస్తే దానికి మేమెలా కారణం అవుతాము. ఎవరు తప్పు చేస్తే వాళ్ళను శిక్షించాలి. అయినా అంత తప్పు మేమేం చేశాము? మేము ప్రకృతిని స్వంతం చేసుకోవాలని చూశాము. ఆమెతో కలిసి లేకపోయాము’’ అన్నాడు ఆ వ్యక్తి.ఆ మాటలు అంటూ ఉంటే అతని కళ్ళలో నీళ్లు మెరిశాయి. అప్పుడతనికి తమ జాతి చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. నిజం ఎప్పుడూ నిజమే. అది అబద్ధం ఎప్పటికీ కాదు. ‘Truth is rarely pure and never simple’’ (సత్యం అరుదుగా స్వచ్ఛమైనది, అదెప్పుడూ సులువైనది కాదు) అన్న ‘ఆస్కార్ వైల్డ్’ మాటలు అతనికి అప్పుడు గుర్తుకు వచ్చాయి.అతని మాటలు ఆమెకు కోపాన్ని తెప్పించాయి. మీరేం తప్పు చేశారో మీకు తెలియదా? నేను చెప్పాలా? మీ కోసం ఆ దేవుడు ఈ అందమైన భూగోళాన్ని సృష్టించాడు. అది అగ్నిగోళంగా మొదలై, జలగోళంగా మారి, జీవకోటికి అనువుగా మారింది. ఈ భూమి మీద మొదటిసారిగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక సూక్ష్మకణం కదిలి జీవం పోసుకొని ప్రాణిగా మారింది. తరువాత అది జీవ పరిణామం చెందింది. విస్తరించింది. చివరకు మనిషిగా రూపుదిద్దుకుంది. అయితే మనిషి పుట్టుకనుంచే దారి తప్పాడు. ‘Nature is the source of all true knowledge’’ (సమస్త జ్ఞానానికీ ప్రకృతే మూలాధారం) అని మీ మనిషే అయిన లియోనార్డో డా విన్సీ చెప్పాడు. కానీ మీరు అతని మాటలను పెడచెవిన పెట్టారు. ప్రకృతి నుంచే జ్ఞానం పుట్టింది. కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే వినయం మనిషి కోల్పోయాడు. మనిషి గొప్ప పనులను చెయ్యగలడు. గొప్పగా ఆలోచించగలడు. సృష్టికి ప్రతిసృష్టిని చెయ్యగల నేర్పరి. అది అతని మహత్తు. అది అతని వరం. కానీ అదే అతని శాపమైంది. అతను అగ్నిని కనుగొన్నాడు. చక్రాన్ని సృష్టించాడు. భాషను కనిపెట్టాడు. లిపిని తయారు చేసుకున్నాడు. కానీ అతను తనను తాను దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు. ‘Knowledge is power, but wisdom is restraint.’’ (జ్ఞానం శక్తి, కాని వివేకం నియంత్రణ) జ్ఞానం అతనికి శక్తిని ఇచ్చింది కానీ, జ్ఞానం మీద నియంత్రణను అతను కోల్పోయాడు. అందువల్ల అదే అతని వినాశనానికి కారణభూతమైంది. ఈ భూమి మీద నాలుగు వందల కోట్ల సంవత్సరాల నిశ్శబ్ద తపస్సు తర్వాత జీవకోటి ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఈ ధరిత్రి అనేక జనన మరణాలను చూసింది. ‘The Earth does not belong to man; man belongs to the Earth.’’ (భూమి మనిషిది కాదు, మనిషి భూమికి చెందుతాడు) భూమి ఎవరికీ చెందదు. కానీ ఆ విషయాన్ని మీ మనుషులు గుర్తించలేకపోయారు. మట్టిలోంచి పుట్టిన మనిషి, మట్టిలో కలవాల్సిందే అన్న నగ్నసత్యం అతనికి ఎప్పుడూ అర్థం కాలేదు. ఫలితం– అడవులు నాశనం అయ్యాయి. నదులు ఎండిపోయాయి. పర్వతాలు తరిగిపోయాయి. తాను ప్రకృతిని జయిస్తున్నానని అనుకున్నాడు. ‘Man conquers nature only to discover he has conquered himself..’’ (మనిషి తనను తాను జయించానని కనుగొనడానికి ప్రకృతిని జయిస్తాడు) కానీ అది ఎంతటి విపరీతాలకు దారి తీస్తుందో అర్థం చేసుకోలేకపోయాడుప్రకృతిని జయించినట్టు అనిపించిన ప్రతి క్షణం, తనను తానే నాశనం చేసుకున్నాడు. ప్రకృతి ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. ఆమె హెచ్చరికలు మెల్లగా వస్తాయి. గాలి వేడెక్కింది. నీళ్లు విషపూరితం అయ్యాయి. జీవజాలం క్షీణించింది. కానీ పట్టించుకోలేదు. ‘We do not inherit the Earth from our ancestors’’ (భూమిని మనం మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందలేదు) కానీ భూమిని, దాని మీద వుండే ప్రకృతిని మీ మనుషులు తన స్వంత ఆస్తి అనుకున్నారు. దాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు.అందుకే అది మీ మీద కన్నెర్ర చేసింది. ఒక రోజు అది తన ప్రతాపాన్ని చూపింది. అందువల్ల అగ్ని వర్షాలు, ఆమ్ల వర్షాలు కురిశాయి. గాలి విషంలా మారింది. భూమి కంపించింది. మనిషి పరుగెత్తాడు. దాక్కున్నాడు. పోరాడాడు. కానీ ‘nature is not cruel, just unapologetically true to itself ’’ (ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తనకు తాను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తన స్వభావానికి కట్టుబడి ఉంటుంది) ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తన నిజ స్వరూపానికి కట్టుబడి ఉంటుంది. అది న్యాయానికి కట్టుబడి ఉంటుంది. ప్రకృతిని మీరు నాశనం చేయాలనుకున్నారు. కానీ చివరకు మీరే నాశనం అయ్యారు. అందుకే మీ జాతి అంతరించిపోయింది. చివరికి నువ్వొక్కడివే మిగిలావు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ భూమ్మీద మిగతా జీవరాశులు హాయిగా నివసిస్తున్నాయి. ఆంథ్రోపాలజీ ప్రకారం మీ మనుషులు వానర జాతి కుటుంబానికి చెందినవారు. కాలక్రమేణా మీరు ద్విపాదులయ్యారు. అటువంటి గొప్ప మానవుల్లో నువ్వు ఆఖరి మనిషివి. నిన్ను తీసికెళదామనే నేను ఇప్పుడు వచ్చాను. బయలుదేరు’’ అంది ఆమె.ఆమె మాటలకు అతను ఆశ్చర్యపోతూ, ‘‘నేను చచ్చినా రాను. ఇంతకీ నన్ను తీసికెళ్ళడానికి నువ్వెవరివి?’’ అని అడిగాడు ఆ ఆఖరి మనిషి.అతని మాటలకు ఆమె నవ్వుతూ ‘‘ఇంకా నన్ను పోల్చుకోలేదా? నేను మీ జాతిని సర్వనాశనం చెయ్యడానికి ఆ ప్రకృతి పంపించిన మృత్యుదేవతను’’ అంటూ తన చెయ్యిని అతని వైపు తిప్పింది. వెంటనే ఆ చేయి అతని వైపు కదల సాగింది. అతను స్పృహ తప్పి పడిపోతున్నాడు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. స్పర్శ ఆగిపోతున్నట్లు భావన కలుగుతోంది. అతను కొద్ది క్షణాలకు అచేతనుడయ్యాడు. వెంటనే అతను మేల్కొన్నాడు. అతను బయటకు వెళ్లి అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. అతను చాలాసేపు పరిగెత్తిన తరువాత అలసిపోవడం వల్ల బాగా దాహం వేసి ఒక చెట్టు కిందకు చేరాడు. కానీ అక్కడ నవ్వుతూ అదే మృత్యుదేవత కనిపించింది.‘‘ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎంత దూరం వెళతావు. నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీ వెంటే ఉంటాను. నీ మృత్యువు ఎప్పుడూ నీ నీడలా నీ వెంటే ఉంటుంది. అటువంటి నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నా చేతులు కబంధుడిలా చాలా పెద్దవి’’ అంది ఆమె నవ్వుతూ.అప్పుడు అతను ‘‘దయచేసి నన్ను వదిలెయ్యి. నేను కూడా చనిపోతే ఈ భూమ్మీద మనిషి అన్నవాడి ఆనవాలు లేకుండా పోతుంది. ‘I am the Last Man! ... No king, no lord, no slave, no master; but aman, alone in the world!’’ (నేను ఆఖరి మనిషిని!... రాజును కాదు, ప్రభువును కాదు, బానిసను కాదు, యజమానిని కాదు; కేవలం మనిషిని, ఈ ప్రపంచంలో ఏకాకిని) అనీ అతను వేడుకున్నాడు.అప్పుడు మృత్యువు నవ్వింది.’ You were never meant to last forever’’ (ఎల్లకాలం మనుగడ సాగించడానికి నువ్వు లేవు) మీ జాతి తన పరిమితిని దాటి వెళ్లింది. ఇక మిమ్మల్ని ఉపేక్షించే ప్రశ్నే లేదు’’ అంది అతని దగ్గరకు వస్తూ. ‘‘అమ్మా! దయచేసి నా దగ్గరకు రావద్దు. మేము తప్పు చేశాము. అంత మాత్రాన మా జాతి ఉనికి లేకుండా చేస్తావా? ఇది న్యాయమా చెప్పు?’’ అని ఆమెకు రెండు చేతులెత్తి దండం పెట్టాడు.క్షణం తరువాత ఆమె చేయి అతన్ని తాకింది. ఆ స్పర్శ చలిగా లేదు, వేడిగా లేదు; అతనికి స్పర్శ తెలియటం లేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడతనికి భయం పోయింది. అహంకారం కరిగిపోయింది. మృత్యువు అతనిని తాకింది. ఆఖరి మనిషి చరిత్ర పుటల్లో చివరి పంక్తిగా మిగిలిపోయాడు. గాలి మళ్లీ స్వచ్ఛమైంది. వర్షం మళ్లీ మృదువుగా కురిసింది. ప్రకృతి మళ్లీ మొదలైంది. మనిషి లేకుండా కూడా ఆమె సంపూర్ణమే. ‘All the world's a stage, and all the men and women merely players.’’ (ప్రపంచమంతా నాటకరంగం. స్త్రీ పురుషులంతా నటీనటులు) అని విలియం షేక్స్పియర్ చెప్పాడు. కానీ భూమ్మీద మనిషి ఆడే నాటకంలో మనిషి పాత్ర ముగిసింది. కానీ వేదిక ఇంకా ఉంది. నిశ్శబ్దం. ఆ చెట్టు కింద గాలి కూడా ఊపిరి బిగబట్టి నిలిచినట్టుంది.ఆఖరి మనిషి ఆమె ముందు అచేతనుడై పడివున్నాడు. ఆ రాత్రి ఒక మనిషి చనిపోలేదు, ఒక జాతి కథ ముగిసింది. మనిషి శాశ్వతం కాదు. మనిషి తన మూలాన్ని మరచిపోయిన క్షణమే అతని వినాశనం ప్రారంభమైంది. మనిషి ఆలోచించాడు. ఆ ఆలోచన అతనికి శక్తి ఇచ్చింది. కానీ ఆ శక్తి అతని మితిమీరిన ఆకాంక్షలకు ఆయుధమైంది. ఆకాశాన్ని తాకాడు, సముద్ర గర్భాన్ని చీల్చాడు. కానీ, తన అంతర్ముఖంలో ఉన్న లోపలి అంతరాత్మను మాత్రం జయించలేకపోయాడు. మనిషికి జ్ఞానం పెరిగింది, వివేకం తగ్గింది.కొద్ది క్షణాల తరువాత ఆమె ఒక పుస్తకం తీసి అందులో ఆఖరి మనిషి అన్న వాక్యం దగ్గర ఒక ఇంటూ మార్కు పెట్టింది. ఇప్పుడు ఆ పుస్తకం నిండా ఎర్రటి ఇంటూ మార్కులే. అది ఆ పుస్తకం చివరి పేజీ.గన్నవరపు నరసింహ మూర్తి
ఒక్క బిస్కట్కు లక్ష
ఒకటి తక్కువైంది... ఒకటి తక్కువైంది... ఇదేదో సినిమాలో డైలాగ్ కాదు, నిజంగానే ఒకటి తగ్గింది. అయితే, ఇక్కడ తగ్గింది రెస్పెక్ట్ కాదు బిస్కట్. ప్యాకెట్లో పదహారు ఉండాల్సినవి పదిహేనే ఉన్నాయి. ఆ.. ఒకటే కదా? అని చాలా మంది ‘లైట్’గా తీసుకుంటారు. కానీ ఆ వ్యక్తి అలా భావించలేదు. తనకు ఒక్కటే. పదిమంది అయితే పది... వందమంది కొంటే వంద... అదే లక్షల్లో అయితే..? ఇలా ఆలోచించాడు. కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. స్పందన లేకపోవడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. వినియోగదారులు ఎలా నష్టపోతున్నారో వివరించాడు. న్యాయం చేయాలని అభ్యర్థించాడు. ప్యాకేజ్డ్ వస్తువులపై కొంతమంది ఎక్స్పైరీ డేట్, మరికొందరు రేట్ చూస్తారు. ఎక్కువ మంది ఇవేవీ పట్టించుకోరు. కావాల్సింది కొంటారు, తింటారు. బాగోకపోతే పడేస్తారు. ఇంకొందరు అలా కాదు, అన్నీ చూస్తారు. తేడావస్తే నిలదీస్తారు. అవసరమైతే న్యాయ పోరాటమూ చేస్తారు. వినియోగదారుడిగా తనకు ఉన్న హక్కును సాధిస్తారు. ఇలాంటి కోవకే చెందిన వ్యక్తి చెన్నైకి చెందిన ఢిల్లీబాబు.అసలేం జరిగింది.. ఢిల్లీబాబు వీధి జంతువుల కోసం రెండు డజన్ల ‘మ్యారీలైట్’ బిస్కట్ ప్యాకెట్లు కొన్నాడు. రేపర్పై 16 బిస్కట్లు అని ముద్రించి ఉంది. కానీ ప్యాకెట్లో 15 మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని దుకాణ యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. ‘తాను రిటైలర్నని వచ్చిన ప్యాకెట్లు అమ్మడమే తప్ప మిగతా విషయాలతో తనకు సంబంధం లేద’ని సమాధానమిచ్చాడు. మొత్తం బాధ్యత కంపెనీదే అని చెప్పాడు. దీంతో ఢిల్లీబాబు కంపెనీకి లేఖ రాశాడు. ఎటువంటి స్పందన రాలేదు.ఫోరంలో ఫిర్యాదుఅతను అక్కడితో ఊరుకోలేదు. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. వినియోగదారుడు ఎంత నష్టపోతున్నాడో లెక్కలతో సహా వివరించాడు. ఒక్కో బిస్కట్ ధర 75 పైసలు పడింది. కంపెనీ సుమారుగా రోజుకు 50 లక్షల ప్యాకెట్లు ఉత్పత్తి చేస్తుందని అనుకుంటే, రూ. 29 లక్షల వరకు ప్రజల్ని మోసం చేసి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే నెలకు, సంవత్సరానికి? ఇలా రూ. కోట్లలో వినియోగదారులు నష్టపోతున్నారని వివరించాడు. కంపెనీ వాదన ఇలా..బిస్కట్ల సంఖ్య కాకుండా బరువు ఆధారంగా విక్రయం జరుగుతుందని కంపెనీ వాదించింది. ప్యాకెట్ నికర బరువు 76 గ్రాములని, అదే ఆధారమని పేర్కొంది. దీంతో బిస్కట్ ప్యాకెట్ను తూకం వేయాలని ఫోరం ఆదేశించింది.. 74 గ్రాములే ఉంది. తూనికలు కొలతల శాఖ నియమాల ప్రకారం ప్యాక్ చేసిన వస్తువుల బరువు 4.5 గ్రాముల వరకు అటూ ఇటుగా ఉండొచ్చని కంపెనీ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనను ఫోరం తిరస్కరించింది. కాలక్రమంలో బరువు తగ్గే వస్తువులకు ఆ నియమం వర్తిస్తుంది. రోజులు గడుస్తున్నా బిస్కట్ బరువులో ఎలాంటి మార్పు రాదని, అందువల్ల ఆ నియమం ఇక్కడ వర్తించదని ఫోరం తేల్చి చెప్పింది. బిస్కట్ల సంఖ్యను ప్యాకెట్పై స్పష్టంగా ముద్రించినప్పుడు బరువు ఆధారంగా విక్రయిస్తామనే వాదన సరికాదని తోసిపుచ్చింది. రూ. లక్ష జరిమానాఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని ఫోరం పేర్కొంది. ఫిర్యాదుదారు ఢిల్లీబాబుకు నష్టపరిహారం కింద రూ. లక్ష రూపాయలు, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 10 వేలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా పరిహారం చెల్లించకపోతే ఏడాదికి 9 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని పేర్కొంది. ఆ బ్యాచ్లో తయారు చేసిన బిస్కట్ ప్యాకెట్ల విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. కొన్ని అంశాలు చిన్నవిగా అనిపించినా, ఎక్కువ మంది వినియోగదారులు మోసపోతే అది పెద్ద నష్టమే అవుతుంది. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటేనే వస్తువుల్లో నాణ్యత, పారదర్శకత పెరుగుతుందని ఈ కేసు స్పష్టం చేస్తోంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే, చట్టం వినియోగదారుడికి రక్షణగా నిలుస్తోందని ఈ తీర్పు నిరూపించింది.
ఎండ సీసానా! వీళ్ల బండబడా!
ఎండను పట్టుకుని ఒక సీసాలో దాచి, కొన్ని నెలల తర్వాత చలికాలంలో ఆ ఎండను టీ చేసుకోవడానికి వాడుకుంటే ఎలా ఉంటుంది? మాటలే కానీ, ఇవన్నీ అయ్యే పనులేనా పెదవి విరవకండి. శాస్త్రవేత్తలు ఇంచుమించు అలాంటి టెక్కిక్నే కనిపెట్టారు!పరిశోధకులు ఒక శక్తిమంతమైన కొత్త సౌర–నిల్వ అణువును ఆవిష్కరించారు. ఇది పునర్వినియోగ బ్యాటరీలా సూర్యకాంతిని బంధించి, తరువాత దానిని వేడి రూపంలో విడుదల చేస్తుంది.సాధారణ సోలార్ ప్యానెల్స్తో సూర్యరశ్మి వెంటనే కరెంట్గా మారిపోతుంది. అయితే శాస్త్రవేత్తలు ఈ టెక్నిక్లో ఎండను ఒక ప్రత్యేకమైన ద్రవంలో రసాయన శక్తిగా దాచి ఉంచుతారు. అవసరం అయినప్పుడు తీసి వాడతారు! అదెలా సాధ్యం? ఎలాగంటే, ఒక రకమైన ద్రవ అణువులను ప్రయోగించి ఎండను ఒడిసిపడతారు. వీటిపై ఎండ పడగానే, ఇవి తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. మనం ఎండలోకి వెళ్లగానే రంగు మారే కూలింగ్ గ్లాసెస్లా అనుకోండి! అలా ఆకారం మారిన ఆ అణువులు ఎండ ఎనర్జీని తమలోనే లాక్ చేసుకుంటాయి. ఇలా కొన్నేళ్ల పాటు ఆ ఎనర్జీ నిల్వ ఉంటుంది. మనకు వేడి కావాలనుకున్నప్పుడు, ఒక చిన్న ట్రిగ్గర్ ద్వారా ఆ అణువులను మళ్లీ వాటి పాత ఆకారంలోకి వచ్చేలా చేస్తారు. అలా అవి వెనక్కి వచ్చేటప్పుడు తమలో దాగున్న సోలార్ ఎనర్జీని తీవ్రమైన వేడి రూపంలో బయటకు విడుదల చేస్తాయి. ఆ వేడి.. నీటిని మరిగించడానికి కూడా సరిపోతుంది. మన ఫోన్లు, లాప్టాప్లలో ఉండే లిథియం–అయాన్ బ్యాటరీల కంటే... ఒక కేజీ బరువుండే మోతాదులో ఈ ద్రవం చాలా ఎక్కువ శక్తిని దాచగలదు. పైగా దీనికి పెద్ద పెద్ద బ్యాటరీలు గానీ, కరెంట్ గ్రిడ్ కనెక్షన్ గానీ అవసరం ఉండదు. మాలిక్యులర్ సోలార్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ (మోస్ట్)సాధారణ సోలార్ ప్యానెల్స్ సూర్యుడు ఉన్నంత వరకే కరెంట్ను ఇస్తాయి. సూర్యుడు అస్తమించిపోయాక, లేదా ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు ఆ శక్తిని ఎలా దాచి పెట్టుకోవాలన్నది ఎప్పటి నుంచో శాస్త్రవేత్తల ముందున్న పెద్ద సవాలు. దీనికి పరిష్కారంగా.. యూసీ శాంటా బార్బరా విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేస్ హాన్, ఆమె బృందం ఒక కొత్త రకం పదార్థాన్ని తయారు చేశారు. దీనికోసం పెద్ద పెద్ద బ్యాటరీ సిస్టమ్స్ గానీ, కరెంట్ గ్రిడ్ గానీ అవసరం లేదు. ఆ పదార్థం సూర్యరశ్మిని గ్రహించి, తన రసాయన బంధాలలో దాచుకుని, అవసరమైనప్పుడు వేడి రూపంలో బయటకు వెలువరిస్తుంది. ఈ సాంకేతికతను సైన్స్ పరిశోధకులు మాలిక్యులర్ సోలార్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ (మోస్ట్) అని పిలుస్తున్నారు. ఆర్గానిక్ అణువును కనిపెట్టి..!‘మోస్ట్’ అనే ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు పైరిమిడోన్ అనే అభివృద్ధి పరచిన ఆర్గానిక్ అణువును ఉపయోగించారు. ‘‘ఇది మళ్లీ మళ్లీ వాడుకోగలిగే, రీసైకిల్ చేయగలిగే టెక్నాలజీ. మనం వాడే ఫొటోక్రోమిక్ కూలింగ్ గ్లాసెస్ (ఎండలోకి వెళ్తే నల్లగా మారే కళ్లద్దాలు) ను గుర్తు తెచ్చుకోండి. మనం ఇంట్లో ఉన్నప్పుడు అవి మామూలు అద్దాల్లా ఉంటాయి. ఎండలోకి వెళ్లగానే అవే నల్లగా మారిపోతాయి. మళ్లీ ఇంట్లోకి రాగానే మామూలుగా అయిపోతాయి. ఇదీ అటువంటి కూలింగ్ గ్లాసెస్ టెక్నాలజీనే..’’ అంటున్నారు, ఈ పరిశోధనలో ముఖ్య పాత్ర పోషించిన శాస్త్రవేత్త హాన్ గుఝెన్. కాకపోతే, ఇక్కడ రంగు మారడానికి బదులుగా.. అణువులు ఎండలో శక్తిని దాచుకుంటాయి, అవసరమైనప్పుడు ఆ శక్తిని వేడి రూపంలో బయటకు వదులుతాయి. ఆ తర్వాత ఆ పదార్థాన్ని పడేయక్కర్లేదు, మళ్లీ మళ్లీ సూర్యశక్తిని దాచడానికి వాడుకోవచ్చు.డీఎన్ఏ నుండి వచ్చిన ఐడియా!పైరిమిడోన్ అనే ప్రత్యేకమైన అణువును తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు మన శరీరంలో ఉండే డీఎన్ఏ నుండి అద్భుతమైన ఐడియా వచ్చింది. డీఎన్ఏలో సహజంగా ఉండే ఒక భాగం, సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు పడినప్పుడు తన ఆకారాన్ని మార్చుకోగలదు, మళ్లీ పాత రూపంలోకి రాగలదు. శాస్త్రవేత్తలు సరిగ్గా అలాంటి అణువునే ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేశారు. దీనివల్ల ఆ అణువు మళ్లీ మళ్లీ శక్తిని దాచడానికి, విడుదల చేయడానికి వీలైంది. ఈ అణువు శక్తిని దాచుకున్నాక, ఆ శక్తి వృథా అయిపోకుండా కొన్నేళ్లపాటు ఎలా స్థిరంగా ఉండగలుగుతుందో తెలుసుకోవడానికి యూసీఎల్ఏ ప్రొఫెసర్ కెన్ హౌక్తో ఈ బృందంతో చేతులు కలిపింది. వారు కంప్యూటర్ మోడలింగ్ సహాయంతో పరీక్షించి... ఈ పదార్థం నుండి శక్తి అస్సలు లీక్ అవ్వకుండా కొన్నేళ్ల పాటు ఎలా దాగి ఉంటుందో కనుగొన్నారు. ‘‘మేము ఈ అణువును చాలా తేలికగా, చిన్నదిగా ఉంచడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. ఈ ప్రాజెక్ట్ కోసం మాకు అవసరం లేని ప్రతి భాగాన్ని తొలగించాం. అణువు ఎంత చిన్నగా ఉంటే, అది అంత ఎక్కువ శక్తిని తనలో దాచుకోగలదు..’’ అని శాస్త్రవేత్త హాన్ నుఝెన్ వివరించారు. స్ప్రింగ్లా ఉండే బ్యాటరీస్ప్రింగ్ లాంటి ‘సౌర బ్యాటరీ’ సాధారణ సోలార్ ప్యానెల్స్లాగా ఎండను నేరుగా కరెంట్గా మార్చదు. బదులుగా, శక్తిని రసాయన రూపంలో దాచుకుంటుంది. ఈ అణువు ఒక నొక్కిపెట్టిన స్ప్రింగ్లాగా పనిచేస్తుంది. దీనిపై సూర్యరశ్మి పడగానే, ఇది గట్టిగా నొక్కిన స్ప్రింగ్ లాగా ఎక్కువ శక్తితో కూడిన రూపంలోకి మారిపోతుంది. మనం దాన్ని క్రియాశీలం చేసేంత వరకు అలాగే ఉంటుంది. దానికి కొద్దిగా వేడిని గానీ, లేదా ఒక కేటలిస్ట్ (రసాయన చర్యను వేగవంతం చేసే పదార్థం) గానీ తాకిస్తే, ఆ అణువు ఒక్క ఉదుటున పాత రూపంలోకి వచ్చేస్తుంది. నొక్కిన స్ప్రింగ్ను ఒక్కసారిగా వదిలేస్తే ఎలా దూకుతుందో అలా అన్నమాట. అలా వచ్చేటప్పుడు తనలో దాగున్న శక్తిని వేడి రూపంలో బయటకు వదులుతుంది. ‘‘మేము దీనిని రీచార్జ్ చేసుకోగలిగే సోలార్ బ్యాటరీ అని పిలుస్తాము. ఇది సూర్యరశ్మిని దాచుకుంటుంది, మళ్లీ మళ్లీ రీచార్జ్ అవుతుంది’’ అని నుఝెన్ అంటారు. ఈ అణువు లీథియం బ్యాటరీల కంటే శక్తివంతమైనది. శక్తిని దాచుకునే సామర్థ్యం చాలా ఎక్కువ. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం సాధారణ లిథియం–అయాన్ బ్యాటరీ 0.9 మెగాజూల్స్ శక్తిని దాచగలిగితే, ఈ కొత్త రకం సోలార్ ద్రవం దాచగలిగే శక్తి (ఒక కిలో బరువుకు) 1.6 మెగాజూల్స్. అంటే మన ఫోన్లలో ఉండే బ్యాటరీల కంటే ఇది చాలా ఎక్కువ శక్తిని నిల్వ చేయగలదు. గతంలో శాస్త్రవేత్తలు తయారు చేసిన ఇలాంటి పాత మోడల్స్ కంటే కూడా ఈ కొత్త మెటీరియల్ చాలా అద్భుతంగా పనిచేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.మొత్తానికైతే నీటిని మరిగించారు!ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు సాధించిన అతిపెద్ద విజయం ఏంటంటే... తాము కనిపెట్టిన సాంకేతికత కేవలం ల్యాబ్కే పరిమితం కాకుండా, నిజంగా పనిచేస్తుందని నిరూపించడం. వారు సాధారణ వాతావరణంలోనే ఈ పదార్థం నుండి వచ్చే వేడితో నీటిని విజయవంతంగా మరిగించి చూపించారు. ‘‘నీటిని మరిగించడమనేది చాలా ఎక్కువ శక్తితో కూడుకున్న పని. మేము సాధారణ వాతావరణంలోనే నీటిని మరిగించగలిగామంటే అది చాలా పెద్ద విజయం’’ అని నుఝెన్ అంటున్నారు. భవిష్యత్తులో ‘మోస్ట్’ ఉపయోగాలు‘మోస్ట్’ అనే ఈ సరికొత్త సాంకేతికత భవిష్యత్తులో మన రోజువారీ జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఇంటి అవసరాలకు: ఈ ద్రవం నీటిలో సులభంగా కరుగుతుంది. కాబట్టి, మన ఇంటి కప్పులపై ఉండే సోలార్ పైపుల్లో పగటిపూట ఈ ద్రవాన్ని తిప్పవచ్చు. అది పగలంతా ఎండను గ్రహించి, రాత్రి వేళల్లో ట్యాంకుల్లోకి చేరి మనకు కావలసిన వేడి నీటిని అందిస్తుంది.క్యాంప్లు, టూర్లు: అడవులకు లేదా కరెంట్ లేని ప్రాంతాలకు క్యాంపింగ్ వెళ్లినప్పుడు, ఎలాంటి గ్యాస్ లేదా కరెంట్ లేకుండానే కేవలం ఈ ద్రవంతో నీటిని వేడి చేసుకోవచ్చు.‘‘సాధారణ సోలార్ ప్యానెల్స్ వాడితే... శక్తిని దాచుకోవడానికి విడిగా పెద్ద బ్యాటరీ సిస్టమ్ కావాలి. కానీ ఈ మాలిక్యులర్ సోలార్ టెక్నాలజీ (మోస్ట్)లో ఆ పదార్థం దానంతట అదే సూర్యశక్తిని నేరుగా దాచుకోగలదు’’ అని ఈ పరిశోధనలో భాగస్వామి అయిన బెంజమిన్ బేకర్ చెబుతున్నారు. ఈ ‘రీచార్జ్ చేయదగిన సౌర బ్యాటరీల’ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రొఫెసర్ గ్రేస్ హాన్కు ప్రతిష్ఠాత్మకమైన ‘మూర్ ఇన్వెంటర్ ఫెలోషిప్’ లభించింది.మెగాజూల్ అంటే? కూరగాయలను ‘కిలోలలో’ కొలుస్తాం, పాలను ‘లీటర్లలో’ కొలుస్తాం కదా, అలాగే సైన్స్ ప్రపంచంలో శక్తిని లేదా వేడిని కొలవడానికి ‘జూల్స్’ అనే పదాన్ని వాడతారు. ఈ పదం 19వ శతాబ్దపు భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ ప్రెస్కాట్ జూల్ పేరులోని జూల్ నుండి వచ్చింది. భూమిపై ఉండే రకరకాల శక్తులన్నీ – వేడి, కరెంట్, కదలిక – వేర్వేరు కాదని, అవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్న భిన్న ఎనర్జీ రూపాలేనని ఆయన నిరూపించారు. ముఖ్యంగా యాంత్రిక శక్తి ఎలా వేడిగా మారుతుందో జూల్ కనిపెట్టారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం, శక్తిని కొలిచే యూనిట్కు ‘జూల్’ అని పేరు పెట్టారు.ఒక లీటరు మామూలు నీటిని స్టవ్ మీద పెట్టి, అది బాగా మరిగేలా వేడి చేయడానికి దాదాపు 0.3 మెగాజూల్స్ శక్తి అవసరమవుతుంది. అంటే, 1 మెగాజూల్ శక్తితో మనం సుమారు 3 లీటర్ల నీటిని మరిగించవచ్చు. ఒక టన్ను బరువున్న కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటే... ఆ కారులో ఉండే కదలిక శక్తి సరిగ్గా 1 మెగాజూల్ ఉంటుంది. మనం తినే ఒక చిన్న స్నికర్స్ చాక్లెట్ బార్ లేదా రెండు అరటిపండ్లు మన శరీరానికి దాదాపు 1 మెగాజూల్ శక్తి (క్యాలరీల రూపంలో)ని ఇస్తాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన ద్రవం ఒక కిలో బరువులో 1.6 మెగాజూల్స్ శక్తిని దాచగలదు. ఒక్కమాటలో చెప్పాలంటే కేవలం ఒకే ఒక్క కిలో ఆ మ్యాజిక్ ద్రవాన్ని ఎండలో పెడితే, అది తనలో ఎంత శక్తిని దాచుకుంటుందంటే... రాత్రి కాగానే ఆ ఒక్క కిలో ద్రవంతో మనం దాదాపు 5 లీటర్ల నీటిని మరిగించుకోవచ్చు! మన ఫోన్ బ్యాటరీల కంటే ఇది చాలా ఎక్కువ శక్తిని తక్కువ స్థలంలో దాచగలదు అని చెప్పడానికే శాస్త్రవేత్తలు ఈ ‘మెగాజూల్స్’ అనే పదాన్ని వాడారు. -సాక్షి స్పెషల్ డెస్క్
భోజనం అంటే గొడవే...
నాకు రెండేళ్ల పాప ఉంది. పాప అస్సలు సరిగా తినడం లేదు. పళ్లెంలో పెట్టిన ప్రతి దాన్ని తిరస్కరిస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు. భోజన సమయం అంటే ఇంట్లో గొడవే అవుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.– సునీత, విజయవాడ.రెండు సంవత్సరాల పిల్లలు తక్కువగా తినడం, సాధారణంగా కనిపించే సమస్య. దీన్ని ‘ఫస్సీ ఈటింగ్’ లేదా ‘పిక్కీ ఈటింగ్’ అంటాము. పుట్టినప్పటి నుంచి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల వరకు పిల్లలు వేగంగా పెరుగుతారు కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ రెండో సంవత్సరం నుంచి ఎదుగుదల కొంచెం నెమ్మదిస్తుంది. అందుకే ఆకలి కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది వ్యాధి కాదు, శరీరంలో సహజంగా జరిగే మార్పు. ఇలాంటి పిల్లల్లో ముందుగా భోజన సమయాన్ని ప్రశాంతంగా మార్చాలి. బలవంతంగా తినిపించడం, కోప్పడటం, పిల్లల వెంట తిరగడం వల్ల వాళ్లు ఇంకా ఎక్కువగా ఆహారాన్ని తిరస్కరిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏం తినాలి, ఎప్పుడు పెట్టాలి అనేది తల్లిదండ్రుల బాధ్యత. కానీ ఎంత తినాలి అనేది పిల్లల నిర్ణయం. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలు తక్కువ తింటున్నారని ఆందోళనతో ఒత్తిడి పెడతారు. కానీ పిల్లలు తమ ఆకలికి తగ్గట్టే తింటారు. కొత్త ఆహారాన్ని ఒకసారి తిరస్కరించిందని వెంటనే ఆపేయకూడదు. చిన్నపిల్లలు కొత్త రుచిని అంగీకరించడానికి సమయం తీసుకుంటారు. కొన్నిసార్లు ఒక ఆహారాన్ని 10 నుంచి 15 సార్లు పరిచయం చేసిన తర్వాతే అలవాటు పడతారు. కాబట్టి ఓపిక చాలా ముఖ్యం.పిల్లలకు పెద్ద పళ్లెం పెట్టడం కన్నా చిన్న పరిమాణాల్లో, రంగురంగులుగా, ఆకర్షణీయంగా ఆహారం పెట్టాలి. అలాగే మధ్య మధ్యలో బిస్కట్లు, చాక్లెట్లు, జ్యూసులు లేదా ఎక్కువ పాలు ఇస్తూ ఉంటే అసలు ఆకలి తగ్గిపోతుంది. ‘కొంచెం ఆకలి’ కూడా పిల్లలకు మంచి ఔషధం లాంటిదే. మొబైల్ లేదా టీవీ ముందు కూర్చోబెట్టి తినిపించే అలవాటు తగ్గించడం మంచిది. అప్పటికి తిన్నట్టే అనిపించినా, దీర్ఘకాలంలో అది మంచి తినే అలవాట్లను దెబ్బతీస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని తింటే పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. పిల్లలు మాటలు కన్నా మన ప్రవర్తననే ఎక్కువగా అనుకరిస్తారు. ‘ఇది తింటే చాక్లెట్ ఇస్తా’ అని లంచం ఇవ్వడం కన్నా, ‘వావ్! నువ్వు కొత్త కూర రుచి చూసావు కదా!’ అని ప్రశంసించడం మంచిది. అలాగే ఒక్కరోజు తక్కువ తిన్నారని భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల ఆకలి రోజురోజుకీ మారుతూ ఉంటుంది. ఒక భోజనం లేదా ఒక రోజు కాకుండా, మొత్తం వారం ఎలా తింటున్నారు అన్నది చూసి అంచనా వేయాలి. అయితే కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం తప్పకుండా పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. బరువు పెరగకపోవడం, తరచు వాంతులు అవడం, మింగడంలో ఇబ్బంది ఉండడం, కొన్ని ఆహారాలనే పూర్తిగా తిరస్కరించడం, చాలా అలసటగా కనిపించడం లేదా ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు ఉంటే పరీక్షలు అవసరం కావచ్చు. చాలా సందర్భాల్లో సరైన ఆహార అలవాట్లు, ఓపిక, కుటుంబ సహకారం ఉంటే పిల్లలు క్రమంగా మంచి తినే అలవాట్లు అలవరుచుకుంటారు. -డా‘‘ కె. పవన్ కుమార్-సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్
అంతర్జాతీయం
ఈ ఒక్క కారణంతో భయంకర ఆపరేషన్, దాడులు ఆగిపోయి..
ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వను చాలా లోతైన, బలమైన, రక్షణతో కూడిన ప్రదేశంలో భద్రపరచి ఉంచారా? ప్రస్తుతం దాన్ని బయటకు తీసుకురావడం లేదా వినియోగించడం సులభం కాదా? ఆ నిల్వ తక్షణ ప్రమాదం సృష్టించే స్థితిలో లేదని ట్రంప్ అంటున్నారు. అందువల్ల దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా వెంటనే సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ఒక్క కారణంతో ఎంత పెద్ద యుద్ధం ఆగిందో తెలుసా?పశ్చిమాసియా ఘర్షణ మళ్లీ తెరపైకి వచ్చిన వేళ వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య సున్నితమైన దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పలు వివరాలు తెలిపారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వెలికితీసేందుకు అమెరికా సైన్యాన్ని ఇరాన్లోకి పంపే సైనిక ప్రణాళికను పరిశీలించినప్పటికీ చివరకు తిరస్కరించినట్టు ట్రంప్ తెలిపారు.ట్రంప్ తెలిపిన వివరాలు ప్రకారం.. సరిహద్దులు దాటి చేపట్టాల్సిన ఆ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమని తేలింది. భారీ స్థాయి సైనిక సమీకరణ అవసరమయ్యేది. ఆ క్లిష్టమైన మిషన్ పూర్తి కావాలంటే కనీసం 2 వారాలు పట్టేదని, భారీ స్థాయిలో సైనిక సామగ్రిని ఇరాన్ భూభాగంలోకి తరలించాల్సి వచ్చేదని చెప్పారు. సున్నితమైన అణు పదార్థాన్ని "న్యూక్లియర్ డస్ట్"గా పేర్కొన్న ట్రంప్.. ఆ నిల్వను స్వాధీనం చేసుకునే పలు మార్గాలను పెంటగాన్ అధికారులు పూర్తిగా పరిశీలించారని తెలిపారు.యురేనియం సమాధిలో పాతిపెట్టినట్టే.. సైనిక ప్రణాళికను నిలిపివేసినా అలాంటి చర్య చేపట్టే శక్తి వాషింగ్టన్కు ఇప్పటికీ ఉందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. "మేము ఇప్పుడే దాన్ని తీసుకోగలం" అని ట్రంప్ అన్నారు. "మనం అనుకుంటే వాళ్లు మమ్మల్ని అడ్డుకోలేరని నేను భావిస్తున్నాను. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. అది సమాధిలో పాతిపెట్టినట్టే ఉంది" అని చెప్పారు. ఆ పదార్థం ప్రస్తుతం సురక్షితంగానే ఉందని, తక్షణ జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. శుద్ఙచేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలంటే టెహ్రాన్తో అధికారిక దౌత్య ఒప్పందం అవసరం లేదని కూడా చెప్పారు.అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ముఖాముఖి భేటీపై ఆసక్తి లేదని తెలిపారు. అయితే, వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య దౌత్యం ఖరారైతే, అలాంటి ఉన్నత స్థాయి సమావేశం జరగవచ్చని అంగీకరించారు. "అది జరిగితే... నేను గౌరవప్రదంగానే వ్యవహరిస్తాను" అని ట్రంప్ చెప్పారు.మొజ్తబా ఖమేనీ, తన తండ్రి హత్య అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని చేపట్టారు. ఆయన తండ్రి అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడిలో మరణించారు. ఖమేనీ కుటుంబ సభ్యులపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కచ్చితమైన దాడులు చేసినప్పటికీ, మొజ్తబా ఖమేనీ సరైన వైఖరి ప్రదర్శిస్తారని తాను ఆశిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. "మేము అతని తండ్రి, అతని భార్య, అతని కుమారుడిని చంపాము. కాబట్టి నేనంటే ఆయను ఇష్టం ఉండకపోవచ్చు. కానీ కొన్ని వర్గాల్లో కాయనకు చాలా మంచి పేరు ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇలాంటి కఠిన వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. అక్సియోస్ ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికా సీనియర్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ గురువారం టెన్నెసీలోని ఓక్ రిడ్జ్కు వెళ్లి, ఇరాన్తో జరగబోయే అణు చర్చల్లో కీలక పాత్ర పోషించనున్న సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు.వైట్ హౌస్, యుద్ధ చర్యలు నిలిపివేయడం, సమగ్ర అణు చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా టెహ్రాన్తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు సంబంధించిన సమాచారం తెలిసిన అమెరికా అధికారులు, ప్రాంతీయ మధ్యవర్తులు తెలిపినట్టు, ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాలపై రెండు ప్రభుత్వాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.ఈ అత్యంత కీలక చర్చలు తుది దశలో ఉన్నట్టు సమాచారం వచ్చినా, స్పష్టమైన పురోగతి సాధించే అవకాశం ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఓ అమెరికా అధికారి, ఓక్ రిడ్జ్కు ఉన్నత స్థాయి ప్రతినిధుల పర్యటన ఒప్పందం ఖరారవుతుందనే హామీ కాదని, అయితే చర్చలు తీవ్రమైన దశలోకి ప్రవేశించాయని సూచించే స్పష్టమైన సంకేతమని చెప్పారు.అయితే ఈ విభేదాలు ఇప్పటికీ దౌత్య ప్రక్రియకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఇరాన్ శుద్ఙచేసిన యురేనియాన్ని సాఫ్ట్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా 60 రోజుల గడువు కోరుతోంది. ఇరాన్ మాత్రం 90 రోజుల గడువుపై పట్టుదలగా ఉంది.ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, నిలిపివేసిన యూఎస్డీ 24 బిలియన్ ఆస్తుల విషయంలో దౌత్య చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నిర్ణయం ట్రంప్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.
చైనా దాచిన నిజాలు.. 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి!
ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోకి వచ్చిన వేలాది మంది యువత.. ట్యాంకులతో వారిపై విరుచుకుపడిన సైన్యం.. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 1989 టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఇప్పటికీ చైనా చరిత్రలో చెరగని మచ్చగానే మిగిలింది. ఈ ఘటనకు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాటి ఉద్యమానికి సంబంధించిన మరికొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి రావడంతో ప్రపంచ దృష్టి మరోసారి ఆ రక్తచరిత్రపైకి మళ్లింది.ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని ఘటనల్లో టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఒకటి. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు వీధుల్లోకి రావడం.. ఆ ఉద్యమాన్ని చైనా ప్రభుత్వం ట్యాంకులు, సైన్యంతో అణచివేయడం.. వందల మంది, మరికొందరి అంచనాల ప్రకారం వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం.. ఇవన్నీ చైనా చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయాయి.1980ల చివర్లో చైనా వేగంగా ఆర్థిక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛలు మాత్రం కఠిన నియంత్రణలోనే ఉండేవి. అవినీతి పెరుగుతోందన్న విమర్శలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రజాస్వామ్య సంస్కరణలపై యువతలో పెరుగుతున్న ఆకాంక్షలు దేశవ్యాప్తంగా అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సంస్కరణవాది నేత హు యాబాంగ్ మరణం ఉద్యమానికి నాంది పలికింది.హు యాబాంగ్ను విద్యార్థులు, మేధావులు మార్పుకు ప్రతీకగా భావించేవారు. ఆయన మరణం తర్వాత 1989 ఏప్రిల్లో వేలాది మంది విద్యార్థులు బీజింగ్లోని టియానన్మెన్ స్క్వేర్కు చేరుకున్నారు. మొదట ఇది కేవలం సంతాప సభగానే ప్రారంభమైనప్పటికీ, క్రమంగా అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య సంస్కరణలు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం భారీ ఉద్యమంగా రూపాంతరం చెందింది.రోజులు గడిచేకొద్దీ నిరసనల తీవ్రత పెరిగింది. విద్యార్థులతో పాటు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పౌరులు కూడా ఉద్యమంలో చేరారు. లక్షలాది మంది స్క్వేర్లో గుమికూడడంతో బీజింగ్ అంతర్జాతీయ మీడియా దృష్టిలోకి వచ్చింది. ఒక దశలో ఈ ఉద్యమం చైనా కమ్యూనిస్టు పాలనకే సవాలుగా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన ప్రభుత్వం మే నెలలో మార్షల్ లా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జూన్ 3 రాత్రి నుంచి జూన్ 4 తెల్లవారుజామున వరకు సైన్యం ట్యాంకులు, సాయుధ బలగాలతో బీజింగ్లోకి ప్రవేశించి నిరసనలను అణచివేసింది. ఆ రాత్రి ఏం జరిగిందన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, ప్రత్యక్ష సాక్షులు మరియు అంతర్జాతీయ మీడియా నివేదికలు వందల నుంచి వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మాత్రం అధికారిక మరణాల సంఖ్యను ఇప్పటికీ వెల్లడించలేదు.ఈ ఘటనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దృశ్యం “ట్యాంక్ మ్యాన్”. ట్యాంకుల వరుస ముందు ఒంటరిగా నిలబడి వాటిని అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చిత్రం ప్రభుత్వ శక్తికి ఎదురుగా వ్యక్తి ధైర్యానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది.ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన కొత్త చిత్రాలు ఆ రోజుల్లోని ఉద్రిక్త వాతావరణాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. స్క్వేర్లో గుమికూడిన విద్యార్థులు, తాత్కాలిక శిబిరాలు, ప్రజల రద్దీ, సైనిక కదలికలు, ఆందోళనల మధ్య నెలకొన్న ఉద్విగ్న పరిస్థితులు ఈ ఫొటోల ద్వారా మరోసారి ప్రపంచం ముందు ప్రత్యక్షమవుతున్నాయి. చరిత్రలో నమోదు కాని కొన్ని క్షణాలను కూడా ఇవి వెలుగులోకి తీసుకొస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.టియానన్మెన్ ఘటనలో కీలక పాత్ర పోషించిన హు యాబాంగ్ చైనా కమ్యూనిస్టు పార్టీలో సంస్కరణవాది నేతగా గుర్తింపు పొందారు. సాంస్కృతిక విప్లవ సమయంలో అన్యాయానికి గురైన వారికి పునరావాసం కల్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయనను ప్రజల్లో మరింత గౌరవనీయుడిగా మార్చాయి. 1987లో ఆయన పదవి నుంచి తప్పించబడ్డారు. 1989 ఏప్రిల్లో ఆయన మరణించడంతో విద్యార్థులు నివాళుల కోసం స్క్వేర్కు చేరుకోవడం చివరికి పెద్ద ఉద్యమంగా మారింది.ఈ ఘటనపై చైనాలో ఇప్పటికీ బహిరంగ చర్చలు పరిమితంగానే ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు, మీడియా, సోషల్ మీడియా వేదికలపై కఠిన నియంత్రణ కొనసాగుతోంది. అయినప్పటికీ విదేశాల్లోని చరిత్రకారులు, మానవ హక్కుల సంస్థలు ప్రతి సంవత్సరం ఈ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అణచివేత వల్ల ఈ ఉద్యమం లక్ష్యాన్ని సాధించకపోయినా, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చల్లో అది ఒక శాశ్వత గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ కొత్త చిత్రాలు ఆ పోరాటంలో నిలిచిన వేలాది యువత ఆశలు, భయాలు, ధైర్యానికి మరోసారి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
దక్షిణ కాకసస్ ప్రాంతంలోని అర్మేనియా దేశ రాజకీయాలు ఇప్పుడు భారత్ సహా అనేక పెద్ద దేశాలను టెన్షన్లోకి నెట్టాయి. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా రాజకీయ వర్గాలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వం మార్పు కోసం మాత్రమే కాకుండా, అర్మేనియా భవిష్యత్తులో రష్యా ప్రభావ వలయంలోనే కొనసాగుతుందా లేదా యూరప్–అమెరికా వైపు మరింత దగ్గరవుతుందా అనే కీలక నిర్ణయానికి సంకేతంగా మారాయి.పషిన్యాన్కు రాజకీయ అగ్నిపరీక్షప్రస్తుతం అర్మేనియాలో ప్రధాని నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన నాయకత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. 2018 ప్రజా ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన పషిన్యాన్, గత కొన్నేళ్లుగా రష్యాపై ఆధారాన్ని తగ్గించి యూరోపియన్ యూనియన్, అమెరికాతో సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. అయితే అభిప్రాయ సేకరణల ప్రకారం ఆయన పార్టీ అతిపెద్ద శక్తిగా నిలిచే అవకాశం ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణలకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ సాధించడం కష్టమని విశ్లేషకుల అభిప్రాయం.2023 సంఘటనతో మారిన రాజకీయ సమీకరణంఅర్మేనియా రాజకీయాల్లో పెద్ద మలుపు 2023లో చోటుచేసుకుంది. నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై అజర్బైజాన్ పూర్తి నియంత్రణ సాధించడంతో లక్ష మందికి పైగా అర్మేనియన్లు అక్కడి నుంచి తరలిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో సంప్రదాయ మిత్రదేశమైన రష్యా తగిన స్థాయిలో మద్దతు ఇవ్వలేదని అర్మేనియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో “రష్యాపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం” అనే భావన బలపడింది. ఇదే పషిన్యాన్ పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారింది.ప్రధాన ప్రత్యర్థి ఎవరు?పషిన్యాన్కు ప్రధాన సవాలు సామ్వేల్ కరపేట్యాన్ నేతృత్వంలోని స్ట్రాంగ్ అర్మేనియా కూటమి నుంచి వస్తోంది. ఈ కూటమి రష్యాతో సంప్రదాయ సంబంధాలు కొనసాగించాలని, పశ్చిమ దేశాల వైపు వేగంగా వెళ్లడం ప్రమాదకరమని వాదిస్తోంది. గత అనుభవాలను ప్రస్తావిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోంది.రష్యా ఆందోళన ఎందుకు పెరుగుతోంది?రష్యా దృష్టిలో అర్మేనియా అత్యంత కీలక వ్యూహాత్మక మిత్రదేశం. దేశంలో రష్యా సైనిక స్థావరం ఉంది. అలాగే ఇంధనం, వాణిజ్యం, భద్రత రంగాల్లో అర్మేనియా ఇప్పటికీ రష్యాపై అధికంగా ఆధారపడుతోంది. ఈ పరిస్థితుల్లో అర్మేనియా పశ్చిమ దేశాల వైపు వెళితే:దక్షిణ కాకసస్లో రష్యా ప్రభావం తగ్గుతుందిEurasian Economic Union బలహీనపడుతుందిపశ్చిమ ప్రభావం రష్యా సరిహద్దులకు మరింత చేరుతుందిఈ నేపథ్యంలో రష్యా ఎన్నికల ముందు అర్మేనియాపై ఆర్థిక ఒత్తిళ్లు పెంచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.అర్మేనియాపై రష్యా ఆర్థిక ఒత్తిళ్లు..అర్మేనియన్ పండ్లు, చేపలు, పూలు, మినరల్ వాటర్, మద్యం ఉత్పత్తులపై పరిమితులుగ్యాస్, చమురు సరఫరాలపై హెచ్చరికలుయూరోపియన్ యూనియన్ వైపు వెళితే ఆర్థిక కూటమి నుంచి తొలగించే సంకేతాలుఇవి మాస్కో వ్యూహాత్మక ఒత్తిడి చర్యలుగా విశ్లేషకులు చూస్తున్నారు.పశ్చిమ దేశాల మద్దతు..ఇక యూరోపియన్ యూనియన్ మరియు అమెరికా కూడా అర్మేనియాకు బహిరంగ మద్దతు ఇస్తున్నాయి.EU ద్వారా సుమారు 50 మిలియన్ యూరోల ఆర్థిక సహాయం ప్రణాళికఅమెరికాతో అణుశక్తి మరియు మౌలిక సదుపాయాల భాగస్వామ్యంబ్రస్సెల్స్ నుంచి యూరోపియన్ సమీకరణకు రాజకీయ సంకేతాలుఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. పషిన్యాన్ గెలిస్తే:యూరోపియన్ యూనియన్ దిశగా వేగవంతమైన అడుగులుఅజర్బైజాన్తో శాంతి చర్చలు ముందుకురష్యాతో సంబంధాల్లో ఉద్రిక్తత పెరుగుతుందిప్రతిపక్షం బలపడితే:రష్యాతో సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలుయూరోపియన్ సమీకరణ మందగింపువిదేశాంగ విధానంలో మాస్కో ప్రభావం పెరుగుతుందిప్రాంతీయ సమీకరణం..అర్మేనియా చుట్టూ ఉన్న దేశాల పాత్ర కూడా కీలకం:టర్కీ: అజర్బైజాన్కు బలమైన మిత్రుడుఅజర్బైజాన్: భూభాగ నియంత్రణ తర్వాత మరింత శక్తివంతంఇరాన్: ప్రాంతీయ సమతుల్యం కోరుకుంటుందిభారత్పై ప్రభావంగత కొన్నేళ్లలో అర్మేనియా రష్యాపై ఆధారాన్ని తగ్గిస్తూ భారత్ నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తోంది. దీని ఫలితంగా భారత్.. దక్షిణ కాకసస్లో కొత్త రక్షణ భాగస్వామిగా ఎదుగుతోంది. పశ్చిమ వైపు అర్మేనియా మరింత మొగ్గు చూపితే భారత్ పాత్ర మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, మొత్తంగా చూస్తే ఈ ఎన్నికలు కేవలం అర్మేనియా రాజకీయ పోటీ మాత్రమే కాదు. ఇది వాస్తవానికి రష్యా ప్రభావంలో కొనసాగాలా లేదా పశ్చిమ ప్రపంచానికి దగ్గరవ్వాలా? అనే నిర్ణయాత్మక పోరుగా మారింది. అందుకే ప్రపంచ శక్తులు ఈ ఎన్నికలను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి.
రూ.15 వేల కోట్ల లగ్జరీ రిసార్ట్ : ట్రంప్కి భారీ ఝలక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అల్బేనియా అడ్రియాటిక్ తీరంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ నిర్మించతలపెట్టిన లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్పై పెద్ద దుమారం చెలరేగింది. వీరు తలపెట్టిన సుమారు రూ. 15,232 కోట్ల భారీ ప్రాజెక్ట్ అక్కడి పర్యావరణ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుందంటూ అల్బేనియా రాజధాని టిరానా నగర కేంద్రంలో యువత తీవ్ర నిరసనలకు దిగింది. జారెడ్ కుష్నర్ అఫినిటీ పార్ట్నర్స్ మద్దతుతో, ఇవాంకా ట్రంప్ ప్రమేయంతో రూపొందుతున్న ప్రతిపాదిత విలాసవంతమైన పర్యాటక ప్రాజెక్టే ఈ ఆగ్రహానికి కేంద్ర బిందువు. అసలేంటీ ప్రాజెక్ట్ తెలుసుకుందాం.పర్యావరణ నష్టం, చట్టపరమైన లోపాలపై ప్రజలు, పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని టిరానా (Tirana) లో ప్రాజెక్ట్ను రద్దు చేయాలని, భూములను అసలు యజమానులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరుస నిరసనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సజాన్ ద్వీపంలో, తీరప్రాంత నగరమైన వ్లోరా సమీపంలోని జ్వెర్నెక్ వద్ద నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్ట్తో రక్షిత జాతి అయిన ఫ్లెమింగోలకు, సముద్ర తామేళ్లకు, అలాగే రక్షిత చిత్తడి నేలల ప్రాంతంలోని ఇతర జాతులకు ముప్పు కలిగిస్తాయని వారు అంటున్నారు. తీరప్రాంతంలో బుల్డోజర్లు రావడం, బీచ్లకు వెళ్లకుండా ముళ్ల కంచెలు వేయడంతో స్థానికులు, నిరసనకారులు సెక్యూరిటీ గార్డులతో ఘర్షణకు దిగారు. ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు#BREAKING #usa Protests entered a fourth night in Tirana and across Albania against a luxury resort project backed by Jared Kushner’s Affinity Partners and involving Ivanka #Trump . Demonstrators oppose the development on the protected Vjosa-Narta wetland and Sazan Island, citing… pic.twitter.com/uGA0f2K9FW— Thepagetoday (@thepagetody) June 5, 2026విదేశీ డెవలపర్లకు భూమిని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు గులాబీ రంగు ఫ్లెమింగో కటౌట్లు, అల్బేనియా నాట్ ఫర్ సేల్ అనే ప్లకార్డ్లతో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. అంతేకాదు అవినీతి ఆరోపణలుఎదుర్కొంటున్న పీడీ నాయకుడు సాలీ బెరిషాతో పాటు ప్రధానమంత్రి రామాను కూడా జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడీ రామా కార్యాలయం ముందు ప్రతిరాత్రి జరుగుతున్న ర్యాలీలను పోలీసులు వాటర్ కెనాన్లతో అదుపు చేస్తున్నారు.మరోవైపు వ్యోసా-నార్తా రక్షిత పర్యావరణ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్ట్ ధ్వంసం చేస్తుందని దాదాపు 40కి పైగా స్వచ్ఛంద సంస్థలు (NGOs) ఆందోళన వ్యక్తం చేస్తూ, పనులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాయి. ప్రతిపాదిక ప్రాజెక్ట్ సుమారు 10,000 గదులతో కూడిన ఒక కొత్త నగరం అవుతుందని, ఇది వన్యప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని అల్బేనియా పర్యావరణవేత్త జోని వోర్ప్సీ విమర్శించారు.2024లో అల్బేనియాలోని అడ్రియాటిక్ తీరంలో లగ్జరీ హోటళ్లు, విల్లాలు నిర్మించనున్నట్లు జారెడ్ కుష్నర్, ఆయన భార్య ఇవాంకా ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ను రక్షిత ప్రాంతమైన వ్యోసా-నార్తా (Vjosa-Narta) డెల్టా మరియు ఒకప్పుడు రహస్య కమ్యూనిస్ట్ సైనిక స్థావరంగా ఉన్న సజాన్ (Sazan) ద్వీపంలో నిర్మించాలని ప్రణాళికలు వేశారు. సుమారు 1.6 బిలియన్ డాలర్లు (USD) ఉంటుందని అంచనా. అయితే, సజాన్ ప్రభుత్వ ఆస్తి అయినందున, ఇందులో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంటుందని అల్బేనియా ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇక్కడ దాదాపు 4 బిలియన్ యూరోల ప్రాజెక్ట్ ఉందని, దీని వెనుక ఖతార్కు చెందిన 'పవర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్' సహ-యజమానులు ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. అల్బేనియాలో, పర్యావరణ పరిరక్షణతో సహా ప్రతిదీ పారదర్శకంగానే ఉందని, చాలా బాధ్యతాయుతంగా ఆ ప్రాజెక్ట్ను చేపట్టామని, స్థానికులకు ఉద్యోగాలు, సంపద సృష్టించడంపై దృష్టి పెట్టామని కుష్నర్ వ్యాపార భాగస్వామి, ఆషర్ అబెహ్సెరా చెప్పారు.విచారణఅల్బేనియా ప్రత్యేక అవినీతి నిరోధక ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ ప్రాజెక్ట్పై విచారణ ప్రారంభించింది. రక్షిత ప్రాంత హోదాను ఎలా మార్చారు? పబ్లిక్ టెండర్లు లేకుండా కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? మరియు నిధుల మూలాలు ఎక్కడివి? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.కాగా 1990లలో కమ్యూనిజం పతనం తర్వాత అల్బేనియాలో భూ వివాదాలు ఎక్కువయ్యాయి. కమ్యూనిస్ట్ పాలనలో 45 ఏళ్ల సంపూర్ణ జాతీయీకరణలో కోల్పోయిన తమ పూర్వీకుల భూములను తిరిగి పొందాలని వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములపై కొందరు స్థానికులు హక్కులు కోరుతున్నారు. అలాగే, భూముల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జాతీయం
ఏఐని ఆపేయండి బాబోయ్!
ఇందుగలడందు లేడన్న సందేహంబు వలదన్నట్టు... ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోకి చేరిపోతోంది. కంపెనీలు వందల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఉద్యోగాల కోత ఉంటుందా? ఉండదా? అన్నదానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయితే... ప్రపంచంలోనే అత్యంత విలువైన కృత్రిమ మేధ సంస్థ ఆంథ్రోపిక్ మాత్రం ‘‘ఆపేయండి..’’ అని అరుస్తోంది. సమయం మీరిపోకముందే కృత్రిమ మేధ వాడకాన్ని తాత్కాలికంగానైనా నిలిపేయాలని కోరుతోంది. ఎందుకలా?‘టెర్మినేటర్ –2.. జడ్జ్మెంట్ డే’, ‘ఎక్స్ మెషీనా’, ‘ద మ్యాట్రిక్స్’... మూడు హాలీవుడ్ సినిమాలే. మూడింటి స్టోరీ కూడా దాదాపు ఒకటే. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషిపైనే పెత్తనం చెలాయించడం. ఆఖరుకు హీరో ఏఐ వ్యవస్థలను పటాపంచలు చేసి మనుషులను కాపాడతాడన్న మాట. నిజజీవితంలో ఇంత విపత్తు అయితే రాలేదు కానీ.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు అంటోంది ఆంథ్రోపిక్. రెండు రోజుల క్రితం ఈ విషయమై కంపెనీ తన బ్లాగ్లో ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. ఆంథ్రోపిక్ క్లాడ్ పేరుతో ఏఐ ఏజెంట్ ఒకదాన్ని సృష్టించిన సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకొన్ని నెలల్లో మా కంపెనీలో ఇంజినీర్లు ఎవరూ సాఫ్ట్వేర్ కోడ్ రాయరు అని ఈ కంపెనీ సీఈవో ఈ మధ్యే చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ఉద్యోగాలను ఈ క్లాడ్ ఏఐ చేసి పడేస్తుందని కూడా భవిష్యవాణి పలికాడు. అయితే తాజాగా ఈ కంపెనీ ఇంజినీర్లు క్లాడ్, దీని అనుబంధ ఏఐ వ్యవస్థల పురోగతిని పరిశీలించి... ఏదో తేడా కొడుతున్నట్లు అర్థం చేసుకున్నారు. వారి అంచనా ప్రకారం.. ఈ ఏఐ వ్యవస్థలు ఇప్పటి మాదిరే ముందుకు వెళితే.. అవి చాలా తొందరగా ‘రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్’ను అందుకోగలవని వీరు గుర్తించారు. అదే జరిగితే ఈ ఏఐ వ్యవస్థలు తమని తాము మెరుగుపరుచుకునేందుకు సొంతంగా కోడ్లు రాసేసుకుంటాయని ఫలితంగా మన నియంత్రణలో లేకుండా పోతాయని వీరు అంటున్నారు. అందుకే ఏఐ వ్యవస్థలు ఈ రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సాధించాయో లేదో తెలుసుకునేందుకు ఒక పద్ధతిని సిద్ధం చేసుకునేంత వరకూ అయినా ఏఐ వాడకాన్ని నిలిపివేయాలని ఈ కంపెనీ పిలుపునిచ్చింది. ఏంటీ రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్?ఏదైనా పనిలో అత్యున్నత నైపుణ్యాన్ని సాధించేందుకు మనం ఏం చేస్తాం? లోటుపాట్లు గుర్తించి వాటిని దిద్దుకుంటాం. తద్వారా మెరుగైన పనితీరు అబ్బుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం.. ఓ ఏఐ రోబోకు ఉప్మా చేయడమెలాగో నేర్పామని అనుకుందాం. తిరగమోత పెట్టి, రవ వేయించి తెర్ల కాగుతున్న నీళ్లు పోసి ఉప్మా తయారు చేసింది ఆ రోబో. ఈ క్రమంలోనే నీళ్లు కాగడానికి చాలా సమయం పడుతున్నట్లు గుర్తించిందనుకోండి. ఇది రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సాధించిన రోబో అయితే.. వెంటనే నీళ్లు మరింత వేగంగా ఎలా కాయాలో గుర్తించి అందుకు తగ్గట్టుగా స్టౌ లేదా హీటర్ సెట్టింగ్స్లో మార్పులు చేస్తుంది. తద్వారా ఉప్మా వేగంగా తయారవుతుంది. సమయం ఏదైనా మిగిలితే రుచికరమైన చట్నీ తయారు చేస్తుంది. బాగానే ఉంది కదా అనిపిస్తోందా? నిజమే కానీ.. ఈ మార్పులన్నీ అది మానవ పర్యవేక్షణ లేకుండానే చేస్తూంటుంది. ఉప్మా స్థానంలో ఓ అణు రియాక్టర్ నిర్వహణను ఊహించుకోండి? భద్రత కోసం మనిషి చేసిన ఏర్పాట్లలో ఏదో చిన్న లోపం ఉందని మార్చేస్తే... కొంపలు అంటుకుపోతాయి!అంత తొందరగా కాదు..ఈ మొత్తం వ్యవహారంలో కొంచెం ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. క్లాడ్ దాని అనుబంధ ఏఐ వ్యవస్థలేవీ రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్థాయికి చేరుకోకపోవడం. అయితే వీటి వేగం చూస్తూంటే.. ముందు అనుకున్న దాని కంటే చాలా వేగంగానే ఆ స్థాయికి చేరతాయని కంపెనీ చెబుతోంది. ‘‘ఏఐ అభివృద్ధిని మందగింప జేసేందుకు లేదంటే తాత్కాలింగా నిలిపివేసేందుకు ఏదైనా ఏర్పాటు ఉంటే ప్రపంచానికి మేలు’’అని ఇప్పుడు ఆంథ్రోపిక్ స్వయంగా చెబుతోంది. ఈ మధ్యకాలంలో రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ను గుర్తించేందుకు, నివారించేందుకు లేదా నియంత్రించేందుకు మనిషి తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చునని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. అయితే ఈ పని అంత సులువేమీ కాదని... ఏఐ అన్నది నిశ్శబద్ధంగా ఏ మారుమూల సర్వర్లోనో వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి.. దాన్ని గుర్తించడం, నిలిపివేయడం అంత సులువు కాదని వివరించింది. అంతా ఉట్టిదే...లక్ష కోట్ల డాలర్ల విలువైన ఆంథ్రోపిక్ ఏఐ వాడకాన్ని నిలిపివేయాలని పిలుపునివ్వడంపై ఇప్పటికే కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదో ఎర అని గేరీ మార్కస్ అనే ఏఐ విమర్శకుడు వ్యాఖ్యానించారు. ఆంథ్రోపిక్ ఈ బ్లాగ్ ద్వారా అందరిలోనూ భయం నింపే ప్రయత్నం చేస్తోంది. కానీ ఏఐ వ్యవస్థలు రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్థాయికి చేరుకున్నాయి అనేందుకు రుజువులేవీ లేవు. క్లాడ్ ఏఐ కోడింగ్ వేగం బాగా పెరిగింది అంతే. అని వివరించాడు. – నేషనల్ డెస్క్, సాక్షి
పాక్ గాలితీసిన భారత మాజీ ఆర్మీచీఫ్
కోల్కతా: భారత రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవణే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- అమెరికా మధ్య పాక్ మధ్యవర్తిత్వం ఒట్టిమాటే అన్నారు. పాక్ చేసేది మధ్యవర్తిత్వం కాదని కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమేనన్నారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత మాజీ సైన్యాధిపతి నరవణే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" పుస్తకం విడుదల కాకముందే దేశంలో ప్రకంపనలు సృష్టించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని పలు అంశాలను ప్రస్థావించడంతో లోక్సభలో పెద్ద దుమారం చేలరేగింది. కాగా తాజాగా నరవణే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు.నరవణే మాట్లాడుతూ" ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చలలో పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెబుతోంది. కానీ అది కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమే, జాతీయ భద్రత ఎప్పుడూ ఆర్థిక భద్రతపైనే ముడిపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థే అన్నింటిని నడిపిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఒడిదొడుకులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రయత్నాలు ఎల్లప్పుడూ స్వయం సమృద్ధిపైనే ఉండాలి" అని అన్నారు.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా ఇవి ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి..
రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి, శిక్షించేందుకు తనిఖీలను ముమ్మరం చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. పబ్లిక్ కంపార్ట్మెంట్ల తగ్గింపు, రైళ్ల కొరత వంటి అవకతవకల కారణంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైల్వే పరిపాలన విభాగం టికెట్ ఇన్స్పెక్టర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ల నెలవారీ ఆదాయ లక్ష్యాన్ని గణనీయంగా పెంచింది.జరిమానాలు వసూలు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాల ని ప్రణాళిక వేస్తున్నారు. ప్రయాణికుడు ప్రయాణించిన దూరం ఆధారంగా ఈ జరిమానాను లెక్కిస్తారు. రిజర్వేషన్ లేకుండా రెగ్యులర్ స్లీపర్ కోచ్లలో ప్రయాణించే సీజన్ టికెట్ హోల్డర్లను టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించి జరిమానా విధిస్తారు. ప్రస్తుతం పాలక్కాడ్ డివిజన్లో స్లీపర్ కోచ్లను పర్యవేక్షించే టికెట్ ఇన్స్పెక్టర్ నెలవారీ జరిమానా పరిమితిని రూ.10,000 నుంచి రూ. 25,000కు పెంచారు. దీనివల్ల సంవత్సరానికి రూ. 27 కోట్ల వరకు జరిమానా విధించాల్సి వస్తుంది. సరైన అనుమతి లేకుండా ఖరీదైన బాక్సులకు మారడం వంటి చిన్నపాటి ఉల్లంఘనలకు ఇకపై జరిమానాలు విధిస్తారు. ఈ తీవ్రమైన చర్య ఉద్యోగులు, ప్రయాణికుల మధ్య అనవసర ఘర్షణలకు దారితీయవచ్చని రైల్వే కార్మిక సంఘాలు హెచ్చరించాయి.మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు విధించే కనీస జరిమానాలను ఈమేరకు సవరించారు. జనరల్ కోచ్లో 50 కి.మీ. వరకు ప్రయాణానికి రూ. 320, సిట్టింగ్ రిజర్వ్ కంపార్ట్మెంట్లో 50 కి.మీ. వరకు ప్రయాణానికి రూ. 335, స్లీపర్ కోచ్లో ప్రతి 200 కిలోమీటర్లకు రూ. 530 జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా, ఏసీ కోచ్కు కనీస జరిమానా రూ. 745గా, థర్డ్ ఏసీ కోచ్లో ప్రతి 300 కిలోమీటర్లకు రూ.2,070గా , సెకండ్ ఏసీ కోచ్లో ప్రతి 800 కిలోమీటర్లకు రూ. 2,070గా నిర్ణయించారు. అదే సమయంలో రెగ్యులర్, సీజన్ టికెట్ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, రైల్వే పరిపాలన రిజర్వేషన్ లేని జనరల్ కోచ్ల సంఖ్యను పెంచలేదు. దీనికి విరుద్ధంగా, ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ కోచ్లను తగ్గించి, వాటిని ఏసీ కోచ్లుగా మారుస్తున్నారు. తగినన్ని రైళ్లు లేకపోవడంతో, నిత్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కదం తొక్కిన కాక్రోచ్
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, నీట్(యూజీ)లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు శనివారం ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు భారీ స్పందన లభించింది. ఇన్నాళ్లూ సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమైన ఆ పార్టీ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగింది. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బొద్దింకల మాస్క్ లు ధరించి, భారత రాజ్యాంగ ప్రతులు, పుస్తకాలు, పువ్వులు, జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతపట్టుకొని కదం తొక్కారు. ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాల నియామక ప్రక్రియలో జవాబుదారీతనం కోరుతూ నినాదాలు చేశారు. సంస్కరణలు, పారదర్శకత కావాలని తేల్చిచెప్పారు. ధర్నాకు ఇతర రాష్ట్రాల నుంచి జనం వ్యయ ప్రయాసలను సైతం లెక్కచేయకుండా హాజరు కావడం గమనార్హం. పటిష్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం ప్రారంభమైన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. నీట్(యూజీ) వాయిదా పడడం వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీప్కే శనివారం ఉదయం అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చేతబూని ఎయిర్పోర్టు నుంచి బయటకు వచ్చారు. అనంతరం జంతర్మంతర్ వద్ద ధర్నా స్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా తమ పార్టీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చా.. ‘‘ఇది దీర్ఘకాల పోరాటం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోరాటం ప్రారంభించాం. కానీ, సిగ్గులేని పాలకులు ఆయనతో రాజీనామా చేయించకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. మన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారు. పోస్టులు తొలగించారు. మా పోస్టులను తొలగించవచ్చేమో గానీ ఈ విశ్వం నుంచి మమ్మల్ని ఎవరూ తొలగించలేరు. అన్నింటికీ సిద్ధపడే ఢిల్లీకి తిరిగొచ్చా. ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. విమానం దిగడానికి కొద్ది క్షణాల ముందు.. నా స్వేచ్ఛా జీవితపు చివరి క్షణాలను గడుపుతున్నట్లు నాకు అనిపించింది. ఆశయం కోసం నా స్వేచ్ఛను త్యాగం చేయడానికి సైతం పూర్తిగా సిద్ధమయ్యా. కొంతమంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి ఉండవచ్చు. జైలు శిక్ష పడుతుందనే భయంతో విశ్వాసాలను వదులుకున్నారు. కానీ విద్యార్థులు, యువత అలా ఎప్పటికీ లొంగిపోరు. మేము ఎవరికీ భయపడడం లేదు. నేను అమెరికాకు వెళ్లినప్పటి కంటే స్వదేశానికి తిరిగి వచి్చనప్పుడే నా తల్లి ఎక్కువగా బాధపడింది. నన్ను పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె ఆందోళన చెందుతోంది. నా తల్లి మాత్రమే కాకుండా.. రాజకీయాల గురించి మాట్లాడే ప్రతి యువతీ యుకుకుడి తల్లి భయపడుతోంది. ఇంకెన్నాళ్లు ఇలా భయపడుతూ బతుకుతారు. ఇకపై భయపడబోమని గట్టిగా చెప్పండి’’అని అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక మార్పు రావాలి పరీక్షల చుట్టూ వివాదాలు, ఫలితాలపై అనిశ్చితి, అధికారుల నుంచి జవాబుదారీతనం లేకపోవడం వంటివి విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని జంతర్మంతర్ ధర్నాలో నిరసనకారులు ఆక్షేపించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. అధికార బీజేపీతో పాటు ప్రతిపక్షాల పనితీరుపైనా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు కేవలం విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు సైతం ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పారు. తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని వారు భయపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో జనాభా స్థితిగతుల్లో వస్తున్న మార్పుల గురించి తరచుగా మాట్లాడుతున్నారు తప్ప యువత భవిష్యత్తు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎక్కువ మంది కలిసి ఒకేసారి గొంతు విప్పితే అది బలంగా వినిపిస్తుందన్న ఉద్దేశంతో ఈ ధర్నాకు హాజరయ్యామని కొందరు స్పష్టంచేశారు. ఎక్కువ మంది రాజకీయ కోణంలో స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు నచ్చడం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయం కావాలని ఆకాంక్షించారు. అవినీతి ప్రతి స్థాయిలోనూ ఉందని, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా విద్య, యువత ఆకాంక్షలు, పరిపాలన రాజకీయ మార్పుపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’పేరిట ఆన్లైన్ పోరాటం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జంతర్మంతర్ వద్ద ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతోనే ముందు జాగ్రత్త చర్యగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాక్రోచ్–ఇన్–చీఫ్ అభిజిత్ దీప్కే జంతర్మంతర్ ధర్నాలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ అగ్రనేత ఎ.రాజాతోపాటు పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యారి్థ, యువజన సంఘాల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ఎన్సీపీ(ఎస్పీ)నేత రోహిత్ పవార్ సైతం మద్దతు పలికారు. యువత శాంతియుత నిరసన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వాంగ్చుక్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అభిజిత్ దీప్కేను కాక్రోచ్–ఇన్–చీఫ్గా వాంగ్చుక్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి దించేయకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ హెచ్చరించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడారు. విద్య, పరిపాలన అంశాలపై విస్తృత యువజన ఉద్యమానికి జంతర్ మంతర్ ధర్నా నాంది పలికిందని అన్నారు. ప్రభుత్వానికి వారం రోజులపాటు సమయం ఇస్తున్నామని, ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడమో లేక ఆయనే స్వయంగా రాజీనామా చేయడమో జరగాలని తేల్చిచెప్పారు. గడువులోగా ప్రభుత్వం స్పందించపోతే మహా ఉద్యమం తప్పదన్నారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ వివిధ రాష్ట్రాల్లోని మద్దతుదారుల నుంచి తమకు సందేశాలు అందుతున్నాయని తెలిపారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే ముందు వారంరోజులపాటు వేచి చూస్తామని పేర్కొన్నారు. శనివారం నాటి నిరసన ప్రదర్శన ఒక ముఖ్యమైన ఘట్టమని వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడానికి యువత సిద్ధంగా ఉందన్నారు. మన విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆ సంస్కరణను తాము మేము ఈ రోజు ప్రారంభించామని ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, దేశంలో యువతకు ఎన్నో సమస్యలు ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు గుర్తుచేశారు. ఈ దేశంలోని జెన్ జెడ్, యువత రక్తంలో గాం«దీ, అంబేడ్కర్ ఉన్నారని స్పష్టంచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ శనివారం సాయంత్రం 5 గంటల్లోగా పదవి నుంచి దిగిపోవాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తొలుత డెడ్లైన్ విధించారు. తర్వాత ఆ పార్టీ నిర్వాహకులు డెడ్లైన్ను వారం రోజులకు పొడిగించారు.
ఎన్ఆర్ఐ
కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై అమెరికా దాడులు చేసింది.
అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ఉత్సవాలు జరిగాయి.ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు.ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. నైటా కార్యవర్గం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.(చదవండి: ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు)
ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..
అబ్దుల్లాపూర్మెట్: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్రెడ్డితోపాటు అనురూప్రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో ఇటీవల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.శనివారం లూసియానాలోని టోరోడో పార్క్లో ఉన్న సెబాన్ రివర్లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం.
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ఎన్నారై రాపోలు నందు..!
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేసూ్తనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా..నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం..కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేసూ్తనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది.– రాపోలు నందు, సింగపూర్
క్రైమ్
‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’
పరకాల: ల్యాబ్ టెక్నీషియన్ షరిఫోద్దీన్ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. రోడ్డు ప్రమాదం కాదు.. హత్య అని తేల్చిన పోలీసులు నిందితుడు టీస్టాల్ నిర్వాహకుడు జట్టబోయిన సందీప్(31)ను అరెస్ట్ చేశారు. షరిఫోద్దీన్ భార్యతో నిందితుడికి ఉన్న వివాహేతర సంబంధం వ్యవహారమే ఈ హత్యకు దారి తీసినట్లు పరకాల ఏసీపీ సతీశ్బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఈ హత్య కేసు వివరాలు వెల్లడించారు. పరకాలలోని ఓ ఇంట్లో ల్యాబ్టెక్నీషియన్ ఎండీ షరిఫోద్దీన్ అద్దెకు ఉంటున్నాడు. హనుమకొండలోని ఓ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. రోజూ డ్యూటీకి వెళ్లే సమయంలో తన భార్యకు టిఫిన్ ఇచ్చిరావాలని సమీపంలోని టీ స్టాల్ నిర్వాహకుడు సందీప్కు చెప్పేవాడు. సందీప్ రోజూ వెళ్లి టిఫిన్లు ఇచ్చే క్రమంలో అతడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. చివరికి తను చెప్పకపోయినా సందీప్ ఇంటికి వెళ్తున్నట్లు తెలుసుకున్న షరీఫొద్దీన్ ఈ నెల2న ఉదయం అతడి దగ్గరికి వెళ్లి ఈ రోజు నీతో మాట్లాడే పని ఉందని, డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పాడు. తమ వివాహేతర సంబంధం తెలిసిపోయిందని గ్రహించిన సందీప్ అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం షరిఫోద్దీన్ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే సందీప్ వేరేవ్యక్తి ఫోన్ నుంచి వాట్సాప్ కాల్ చేసి వెల్లంపల్లి రోడ్డులోని ఓ బ్రిక్స్ షెడ్డు వద్దకు రావాలని చెప్పాడు. అక్కడికి బయల్దేరిన షరీఫోద్దీన్ మార్గమధ్యలో ఓ వైన్స్ వద్ద రెండు బీర్లు కొనుక్కొని వెళ్లగా ఇద్దరు కలిసి తాగారు. మళ్లీ అతనే వెళ్లి ఇంకో రెండు బీర్లను తీసుకురాగా వాటిని తాగుతూ ‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’ అంటూ సందీప్పై షరీఫోద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సందీప్ పక్కనే ఉన్న కర్రతో షరీఫోద్దీన్ తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహాన్ని అతడి వాహనంపైనే అడ్డుగా పెట్టుకొని రోడ్డు మీదికి తీసుకొచ్చి ఎవరూ లేని సమయంలో పడేసి వెళ్లిపోయాడు. రక్తపు మరకలతో ఉన్న షర్ట్ను తన ఇంటి పక్కనున్న బాత్రూం వెనుకాల కాల్చిపడేశాడు. మిగతా దుస్తులను పిండిన దుస్తుల్లో కలిపి హత్య వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేశాడు. మృతుడి సోదరుడు రజాక్ ఇది హత్యగా అనుమానిస్తూ విచారణ చేయాలని ఫిర్యాదు చేయడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. సందీప్ ఈ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసును వేగవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ క్రాంతికుమార్, ఎస్ఐలు రమేశ్, పవన్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
భర్త చనిపోయిన బాధలో ఉంటే.. ఆమెపై కన్నేశాడు
విశాఖపట్నం: మరణించిన స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.దామోదరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.వి.రమణ తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానాపురంలో కె.ప్రసాద్ అనే వ్యక్తి భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి జీవించేవాడు. ప్రసాద్ స్నేహితుడైన ధనాల అరుణ్కుమార్ (30) కూడా అదే ప్రాంతంలో నివసించేవాడు. 2019లో ప్రసాద్ అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లక్ష్మిపై నిందితుడు కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు నిరాకరించడంతో ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. దీనిపై బాధితురాలు 2021 ఏప్రిల్లో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు అరుణ్కుమార్కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఆ తల్లిని ఓదార్చడం.. 'ఈత'రం కాదు !
వైఎస్ఆర్ కడప జిల్లా: అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు నీటిలో మునిగిపోతుంటే వారిని కాపాడేందుకు ఆ తల్లి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. నీటిలో దూకి ఇద్దరిని కాపాడింది. మరో ఇద్దరు తన కళ్లముందే నీటిలో మునిగిపోతుంటే వారిని కాపాడలేక గుండెలవిసేలా విలపించిన హృదయవిదారక ఘటన ఖాజీపేటలోని మండలం దుంపలగట్టు గ్రామంలోని గుట్టులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామం సమీపంలోని గుట్టుపై 10 ఏళ్లుగా పందులను మేపుతూ శివకృష్ణ, శ్రీవాణి దంపతులు జీవనం సాగిస్తున్నాయి. పందులను నీటి గుంటలో శుభ్రం చేసేందుకు ప్రతి రోజు శివకృష్ణ వెళ్లి వచ్చేవారు. శుక్రవారం శివకృష్ణ ఇతర పనులపై కడపకు వెళ్లారు. దీంతో శ్రీవాణి నీటిలో ఉన్న పందుల కంచె వద్దకు వెళ్లారు. ఆమెతో పాటు ఇద్దరు కుమారులు గౌతమ్, కార్తీక్తో పాటు వనం సంజన (18) వనం అర్చన (14) వెళ్లారు. శ్రీవాణి పందుల కంచె వద్ద ఉండగా నీటిలో ఈత కొడదాం అని పిల్లలు తల్లిని ఒత్తిడి చేశారు. దీంతో శ్రీవాణి అంగీకరించారు. నలుగురు పిల్లలు నీటిలోకి దిగారు. నీటిలోని కుంట లోతుగా ఉండటంతో నలుగురు నీటిలో మునిగిపోతుండగా శ్రీవాణి గుర్తించారు. వెంటనే అప్రమత్తమై గౌతమ్, కార్తీక్లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. సంజన, అర్చన అప్పటికే నీటిలో మునిగిపోవడంతో వారిని కాçపాడే ప్రయత్నం చేసేలోగానే ఇద్దరూ గల్లంతయ్యారు. గట్టిగా కేకలు వేడయంతో స్థానికులు అక్కడికి చేరుకుని పిల్లల కోసం నీటిలో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఖాజీపేట సీఐ వంశీధర్కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే చెన్నూరు నుంచి గజ ఈతగాళ్లతో పాటు స్థానికులు కలిసి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేశారు. చివరకు రోప్ సహాయంతో పిల్లల మృతదేహాలను వెలికి తీసి కడప రిమ్స్కు తరలించారు. శివకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కళ్లెదుటే మృత్యుఒడిలోకి.. శ్రీవాణి కళ్ల ఎదుటే తన ఇద్దరు కుమార్తెలు మృత్యు ఒడిలోకి వెళ్లడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. కాపడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ఆమె రోదించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పరామర్శ దుంపలగట్టు గ్రామంలో ఇద్దరు చిన్నారులు నీట మునిగిన విషయం తెలియగానే వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం కబళించింది. అంత్యక్రియలు, అస్థికల నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం బారినపడింది. దీంతో ఆ కుటుంబంలోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.పంజాబ్లోని ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిపై ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జలాలాబాద్కు చెందిన ఓ కుటుంబంలో ఇంటి పెద్ద(మహిళ) మరణించింది. దీంతో అంత్యక్రియలు, అనంతర కర్మలు పూర్తి చేసుకుని ఆ కుటుంబం పికప్ వాహనంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 28 మంది వాహనంలో ఉన్నట్లు సమాచారం.గత అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనం ఫిరోజ్పూర్-ఫజిల్కా మార్గంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకర కొండ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్తో కొట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పికప్ వాహనం అధిక వేగంతో వెళ్తుండటంతో డ్రైవర్ మలుపు వద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైలర్ను తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఢీకొట్టిన తీవ్రతకు పికప్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని ఫరీద్కోట్లోని ప్రత్యేక వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగం, ఇరుకు రహదారి, ప్రమాదకర మలుపు కలిసి ప్రమాదానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిలోని ఈ భాగం చాలా కాలంగా ప్రమాదాల కేంద్రంగా మారిందని, రహదారి విస్తరణ చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#BREAKING SEVEN TO NINE killed and 15 injured in Ferozepur, Punjab, when a truck collided with a jeep carrying a family to immerse ashes. SSP Bhupinder Singh confirmed. #Punjab #Ferozepur #RoadAccident @PunjabPoliceInd https://t.co/3CbYUL1g3A pic.twitter.com/k8W1AxtjUP— jarvis ☠️ (@Vishii14) June 6, 2026
వీడియోలు
బాబు.. లోకేష్.. పవన్ నో అపాయింట్మెంట్.. అందుకే జగన్ ను కలిసాం
పెద్దిలో జాన్వీ సీన్లు కట్..! సారీ చెప్పిన బుచ్చిబాబు..
నందుతో ఫోన్ లో... షాకింగ్ నిజాలు బయటపెట్టిన జైపాల్ రెడ్డి!
యువతుల ద్వారా కస్టమర్లకు వల వేస్తున్న పబ్ యాజమాన్యం
సారం లేని సారా కథలు.. ఎల్లో మీడియా అధిపతులకు కోరుకున్న ఉపకారాలు
ఎంపీని ఉరికించి కారును నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తులు
చల్లబడిన తెలుగు రాష్ట్రాలు
తమిళ్ పాలిటిక్స్ లోకి మరో హీరో ఎంట్రీ
ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా ఆండ్రీవా సంచలనం
నందుస్ భార్యాభర్తలకు UK గవర్నమెంట్ బిగ్ షాక్!

