మళ్లీ ఢిల్లీనే...
వడోదర: ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ ఫైనల్ చేరింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన జట్టుగా ఢిల్లీ ఘనత వహించింది. గురువారం జరిగే టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో క్యాపిటల్స్ తలపడుతుంది. 2024లోనూ ఇరు జట్లు టైటిల్ కోసం ఢీకొనగా ఆర్సీబీ విజేతగా నిలిచింది. మొదట గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (51 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, జార్జియా వేర్హమ్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడింది. స్టార్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ (0), కెప్టెన్ యాష్లీ గార్డ్నర్ (0) విఫలమయ్యారు. చినెల్లి హెన్రీ 3 వికెట్లు, నందిని శర్మ 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి గెలిచింది. లిజెల్లీ లీ (24 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (23 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. షఫాలీ వర్మ (21 బంతుల్లో 31; 7 ఫోర్లు), లౌరా వోల్వార్డ్ (24 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. వేర్హమ్కు 2 వికెట్లు దక్కాయి.స్కోరు వివరాలుగుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (నాటౌట్) 62; సోఫీ డివైన్ (సి) లిజెల్లీ (బి) హెన్రీ 6; అనుష్క (సి) హెన్రీ (బి) నందిని 16; యాష్లీ గార్డ్నర్ (సి) స్నేహ్ రాణా (బి) నందిని 0; కనిక (స్టంప్డ్) లిజెల్లీ (బి) మిన్ను మణి 6; వేర్హమ్ (సి) వోల్వార్డ్ (బి) హెన్రీ 35; భారతి (సి అండ్ బి) హెన్రీ 0; కాశ్వీ గౌతమ్ (రనౌట్) 18; తనూజ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 25; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–38, 4–59, 5–120, 6–125, 7–164. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–32–0, చినెల్లీ హెన్రీ 4–0–35–3, నందిని శర్మ 4–0–44–2, మిన్ను మణి 4–0–23–1, స్నేహ్ రాణా 1–0–3–0, శ్రీచరణి 3–0–25–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లిజెల్లీ లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) వేర్హమ్ 43; షఫాలీ వర్మ (బి) వేర్హమ్ 31; వోల్వార్డ్ (నాటౌట్) 32; జెమీమా (సి) సోఫీ (బి) రాజేశ్వరి 41; మరిజాన్ కాప్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 18; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–89, 2–92, 3–160. బౌలింగ్: రేణుక 2–0–27–0, కాశ్వీ గౌతమ్ 2–0–17–0, రాజేశ్వరి 3–0–33–1, సోఫీ డివైన్ 3–0–35–0, జార్జియా వేర్హమ్ 3.4–0–28–2, తనూజ 1–0–5–0, యాష్లీ గార్డ్నర్ 1–0–15–0.
మళ్లీ ట్రెండ్లోకి వెండి
న్యూఢిల్లీ: జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి వరుసగా మూడు రోజుల పాటు తీవ్ర పతనాన్ని చూసిన వెండి, బంగారం ధరలు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాల మధ్య ఢిల్లీ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ర్యాలీ చేశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.24,000 పెరిగి (9.23 శాతం) రూ.2.84 లక్షలకు (పన్నులతో కలుపుకుని) చేరింది. పసిడి సైతం 10 గ్రాములకు రూ.5,000 లాభపడి (3.3 శాతం) రూ.1,57,700 స్థాయిని తాకింది. జనవరి 29న వెండి రూ.4,04,500 వద్ద, పసిడి సైతం రూ.1,83,000 వద్ద ఆల్టైమ్ గరిష్టాలను నమోదు చేయడం తెలిసిందే.కొనుగోళ్ల మద్దతు.. ‘‘బంగారం ఇటీవలి నష్టాలను మంగళవారం కొంత భర్తీ చేసుకుంది. వెండి ధర సైతం గణనీయంగా పెరిగింది. రెండు రోజుల భారీ విక్రయాలతో ధరలు క్షీణించడాన్ని ఇన్వెస్టర్లు చక్కని అవకాశంగా చూశారు’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. దీర్ఘకాల పొజిషన్లు తీసుకునేందుకు దిద్దుబాటు కోసం వేచి చూసిన ఇన్వెస్టర్లు.. ధరలు దిగిరావడాన్ని అవకాశంగా భావించినట్టు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి స్పాట్ ధర ఔన్స్కు 9.55 డాలర్లు (12.07) పుంజుకుని 88.77 డాలర్లకు చేరింది.బంగారం సైతం ఔన్స్కు (31.10 గ్రాములు) 275 డాలర్లు లాభపడి (5.91 శాతం) 4,935.49 డాలర్ల స్థాయిని తాకింది. బంగారం, వెండికి అధిక మార్జిన్లు అవసరం కావడం, ఈ ఏడాది మేలో ఫెడ్ చైర్మన్ పావెల్ పదవీ కాలం ముగిసే వరకూ రేట్ల సవరణ ఉండదన్న అంచనాలు, రేట్ల పరంగా కఠిన దృక్పథం కలిగిన వార్‡్షను కొత్త చైర్మన్గా ప్రతిపాదించడం క్రితం మూడు సెషన్లలో బంగారం, వెండిలో విక్రయాలకు దారితీసినట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ ఏవీపీ కేనత్ చైన్వాలా వివరించారు. వీటి ధరలు సమీప కాలంలో అస్థిరంగానే ఉండొచ్చన్నారు.
డిస్కమ్ల ప్రైవేటీకరణ!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కమ్)ల ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా డిస్కమ్లను ప్రైవేటీకరించాలని 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి భారంగా మారిన డిస్కమ్లను వదిలించుకోవాలని స్పష్టం చేసింది. అదే సమయంలో డిస్కమ్లను కొనుగోలు చేసే సంస్థలు నష్టాల్లో ఉన్నట్టయితే అవి మరింత నష్టాల్లోకి వెళ్లకుండా.. ఇప్పటికే ఉన్న నష్టాల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుత నష్టాలను ఆ ఎస్పీవీకి మళ్లించి రుణాల పునర్వ్యవస్థీకరణ చేయాలని, ఆ రుణాల చెల్లింపులు వెంటనే చేయాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. ఇందుకోసం 16వ ఆర్థిక సంఘం కింద వచ్చే మూలధన పెట్టుబడి ప్రత్యేక ఆర్థిక సాయం నిధులు వినియోగించుకోవాలని సూచించింది. అయితే ఈ ప్రత్యేక ఆర్థిక సాయం నిధులను డిస్కమ్లను ప్రైవేటీకరించిన తర్వాత మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం చేసిన ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడమే కాకుండా, పార్లమెంట్లోనూ ప్రవేశపెట్టింది. రాష్ట్ర డిస్కమ్లు దాదాపు రూ.25 వేల కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నట్లు సమాచారం.ఈ తరహా పీఎస్యూలనూ వదిలించుకోవాలిమూడు నాలుగేళ్ల నుంచి వరుస నష్టాల్లో ఉంటూ.. సరిగా పనిచేయని ప్రభుత్వ రంగ సంస్థలను సమీక్షించి వాటిని మూసివేయాలని లేని పక్షంలో వదిలించుకోవాలంటూ 16వ ఆర్థిక సంఘం మరో కీలక సిఫారసు చేయడం గమనార్హం. రాష్ట్రాల్లో ఇలా సరిగా పనిచేయని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు 308 ఉన్నట్లు ఫైనాన్స్ కమిషన్ గుర్తించింది. ఆయా సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు విధానాన్ని రూపొందించుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది. మూడునాలుగేళ్లుగా నష్టాల్లో ఉన్న, పనితీరు సరిగా లేని మరిన్ని సంస్థలను గుర్తించి అవి కేంద్రానివైతే కేంద్ర మంత్రివర్గం ముందుకు, రాష్ట్రాలకు చెందినవైతే రాష్ట్రాల మంత్రివర్గాల ముందుకు తీసుకుని రావాలని సూచించింది. ఆయా మంత్రివర్గాలు వాటిని మూసేయడమా? ప్రైవేటీకరించడమా? వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నవాటిని కొనసాగించడమా? ఏదో ఒకటి చేయాలని స్పష్టం చేసింది. సబ్సిడీల వ్యయం హేతుబద్ధీకరణరాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీల వ్యయంపై సమీక్షలు నిర్వహించాలని, సబ్సిడీలను హేతుబద్ధం చేయాలంటూ ఆర్థిక సంఘం స్పష్టమైన సిఫారసు చేసింది. షరతులు లేని కొన్ని పథకాల్లో నగదు బదిలీ కారణంగా నిధులు దురి్వనియోగం అవుతున్నాయని వెల్లడించింది. ఏ వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలో అందుకు తగిన విధంగా కఠిన తరమైన సమీక్షలు నిర్వహించాలని, ప్రత్యేకమైన ప్రాతిపదికన అమలు చేయాలని సూచించింది. బడ్జెటేతర రుణాలు తీసుకుని ఆర్థిక సబ్సిడీలకు వినియోగించుకునే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల సబ్సిడీలు, వాటిని బదిలీలకు సంబంధించి ఒకేరకమైన విధానం లేదని ఆక్షేపించింది. ఈ సబ్సిడీ నిధులను సహాయం, గ్రాంట్లు, ఇతర వ్యయంగా చూపిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్డీపీలో వార్షిక ద్రవ్యలోటు మూడు శాతానికి మించి ఉండరాదని స్పష్టం చేసింది. బడ్జెటేతర రుణాలను కూడా ఇకపై బడ్జెట్లో తప్పనిసరిగా చూపించాలని తెలిపింది.నిబంధనలు పాటిస్తేనే నిధులు!రానున్న ఐదేళ్లలో రాష్ట్రానికి పంచాయతీరాజ్, మునిసిపల్ స్థానిక సంస్థలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ కింద 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రూ.21, 517 కోట్లు రానున్నాయి. ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం ప్రాథమిక వినియోగానికి, మరో 50 శాతం విధిగా పారిశుధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణకు, తాగునీటి సౌకర్యం కోసం వినియోగించాలనే నిబంధన పెట్టింది. స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు ప్రాథమిక నిధుల కింద రూ.7,974 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థల పనితీరుకు రూ.997 కోట్లు, రాష్ట్ర పనితీరుకు రూ.997 కోట్లు కేటాయించింది. పట్టణ సంస్థలకు సంబంధించి రూ.9,239 కోట్లు ప్రాథమిక సౌకర్యాలకు, పట్టణ సంస్థల పనితీరుకు రూ.1,155 కోట్లు, రాష్ట పనితీరుకు రూ.1,155 కోట్లు కేటాయించింది. జనాభా నియంత్రణకు పనిచేసిన రాష్ట్రాలకు వెయిటేజీ ఉంటుందని 16వ ఆర్థిక సంఘం పేర్కొంది. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడంతో పాటు అన్ని స్థానిక సంస్థల ఆడిటింగ్ పూర్తి చేస్తే ఆర్థిక సంఘం నిధులు అందుతాయని వెల్లడించింది. అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాల్సి ఉంటుందని తెలిపింది.
మౌనంగానే మెడలు వంచి!
అసలే అతను డొనాల్డ్ ట్రంప్. శత్రువులా, మిత్రులా అన్న తేడా కూడా లేకుండా అన్ని దేశాలనూ హడలెత్తిస్తూ వస్తున్న వ్యక్తి! కఠిన పదజాలంతో కూడిన బెదిరింపులతో, ఎడాపెడా టారిఫ్ల బాదుడుతో వణుకు పుట్టించడాన్నే తన నైజంగా మార్చుకున్నారు. రెండోసారి అధికారం చేపట్టింది మొదలు, ఈ ఏడాది కాలంలో ప్రపంచ దేశాలకు ఒకరకంగా పీడకలలా పరిణమించారు. చివరికి దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలు కూడా ట్రంప్ బెదిరింపులకు జడిసి ఆయన డిమాండ్లకు అనుగుణంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు తలొగ్గాల్సి వచ్చింది.ఇలాంటి పరిస్థితుల్లో భారత్ విషయంలో మాత్రం ట్రంప్ హఠాత్తుగా దిగొచ్చిన తీరు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తోంది. భారత్పై 50 శాతం టారిఫ్లను ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సోమవారం ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీన్ని భారత్ సాధించిన ఘన విజయంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో తొలినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గకుండా, మాటల యుద్ధానికి బదులివ్వకుండా సంయమనం పాటిస్తూనే చివరికి మౌనంగానే ఆయన మెడలు వంచారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ వుతోంది. బెదిరింపులనే తిరుగులేని ఆయుధంగా చేసుకుంటూ గత ఏడాది కాలంలో ట్రంప్ చెలరేగి పోయారు. దేశాధినేతలంతా తాను చెప్పినట్టు వినాలన్న ఒంటెత్తు పోకడ ప్రదర్శించారు. చివరికి నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడినంటూ ప్రకటనలు చేయాల్సిందిగా వారిని ఒత్తిడి చేసే స్థాయికీ వెళ్లారు! పాక్ లాంటి పలు దేశాల అధినేతలు అందుకు తలొగ్గారు కూడా. కానీ మోదీ నుంచి మాత్రం మౌనమే సమాధానమైంది. దాంతో ట్రంప్ ఇగో దెబ్బ తిన్నది కూడా. మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేయనందుకే భారత్తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ బాహాటంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పట్టాయి. ప్రధాని మాత్రం వీటిని పట్టించుకోలేదు. అంతేగాక ట్రంప్ బెదిరింపుల ఉచ్చులో పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.ఒప్పందం విషయమై ట్రంప్ నాలుగుసార్లు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినా పట్టించుకోలేదు. ఆయన కారాలు, మిరియాలు నూరుతున్నా లక్ష్యపెట్టకుండా బ్రిటన్, న్యూజిలాండ్, అనంతరం ఒమన్లతో లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తద్వారా స్వతహాగా వ్యాపారి అయిన ట్రంప్నే మించిపోయే స్థాయిలో మోదీ వ్యాపార దక్షత ప్రదర్శించారు. ఈ చర్యతో ఆయనను పునరాలోచనలో పడేశారు. ఇక గత నెలలో యూరోపియన్ యూనియన్తో అతి కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీదని కొనియాడుతున్న ఈ డీల్ భారత్పై దూకుడు విషయంలో ట్రంప్కు గట్టిగా బ్రేకులు వేసిందని చెబుతున్నారు.27 దేశాల కూటమి అయిన ఈయూతో కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ వేదికపై భారత స్థాయిని మరింత పెంచింది. ట్రంప్ చపలచిత్తం పుణ్యమా అని ఇతర దేశాల దృష్టిలో అమెరికా శరవేగంగా విశ్వసనీయతను కోల్పోతూ వస్తోంది. అందుకు విరుద్ధంగా భారత్ మాత్రం అత్యంత నమ్మదగ్గ భాగస్వామ్య దేశంగా తన ప్రతిష్టను పెంచుకుంటూ వచ్చింది. పైగా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ను ఏ దేశమూ ఇప్పుడు తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇందుకు అమెరికా కూడా మినహయింపు కాదు. అందుకే వ్యవసాయ, పాడి తదితర కీలక రంగాలను అమెరికా పరిశ్రమలకు బాహాటంగా తెరిచేందుకు కరాఖండిగా నిరాకరించి కూడా ఒప్పందానికి ట్రంప్ను భారత్ ఒప్పించగలిగింది! అదే సమయంలో ట్రంప్ ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ప్రతి వ్యాఖ్యలకు దిగకుండా మోదీ పరిణతి ప్రదర్శించారు. చైనాతో స్నేహ గీతంట్రంప్ దూకుడుకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా వ్యూహాత్మకంగా చైనాకు దగ్గరయ్యేందుకు కూడా భారత్ వెనకాడలేదు. గతేడాది షాంఘై సహకార సమాఖ్య భేటీకి హాజరయ్యేందుకు ఏడేళ్ల అనంతరం మోదీ చైనాలో పర్యటించారు! ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చివరికి ట్రంప్ కూడా వాటిపై చిర్రబుర్రులాడారు. భారత్, రష్యాలను అమెరికా చివరికి చైనాకు కోల్పోయిందంటూ నిట్టూర్చారు! ఆ తర్వాత రెండు నెలలకే పుతిన్కు ఢిల్లీలో మోదీ రాచమర్యాదలు చేశారు.రష్యాతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఇలా పలు అగ్ర రాజ్యాలతో భారత్ వ్యూహాత్మకంగా ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకుంటున్న వైనం కూడా ట్రంప్ను పునరాలోచనలో పడేసింది. భారత్ అక్కడితోనే ఆగలేదు. ట్రంప్ టారిఫ్లకు ప్రతీకా రంగా తాను కూడా అమెరికాపై సుంకాలు బాదింది! అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, తృణధాన్యాలపై ఏకంగా 30 శాతం టారిఫ్లు విధించింది. ట్రంప్లా గొంతెత్తి ప్రకటనలు చేయకుండా మౌనంగానే గత నవంబర్ నుంచే వాటిని వసూలు చేయడం కూడా ప్రారంభించింది.‘ఒప్పందం’పై మోదీ మౌనంభారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయిందని ట్రంప్ ప్రకటించినా, దానిపై మోదీ మాత్రం సూటిగా స్పందించకపోవడం విశేషం. అంతేగాక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్ ఒప్పుకుందని, అమెరికా నుంచి దిగుమతులను ఏకంగా 500 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లనుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైనా మోదీ మౌనమే వహించారు. కేవలం టారిఫ్ల తగ్గింపుకు హర్షం వ్యక్తం చేయడానికే తన స్పందనను పరిమితం చేయడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ ‘గోర్’ ఫ్యాక్టర్సెర్గియో గోర్. భారత్లో అమెరికా నూతన రాయబారి. భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం, టారిఫ్ల తగ్గింపు వెనక ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. ఇరు దేశాల సంబంధాలు కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిన తరుణంలో గత జనవరి 12న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎన్నడూ లేనంత బలోపేతం చేయడమే ఆ సందర్భంగా స్పష్టంగా ప్రకటించారు. ‘నిజమైన మిత్రులు తొలుత విభేదించవచ్చు. కానీ అంతిమంగా ఒక్కతాటిపైకే వస్తారు’ అని చెప్పుకొచ్చారు. అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరేదీ లేదని కూడా స్పష్టం చేశారు.ఖనిజాల అన్వేషణ, ఏఐ టెక్నాలజీ వాడకానికి సంబంధించి అమెరికా ఏర్పాటు చేసిన ‘పాక్స్ సిలికా’ కూటమిలో చేరాల్సిందిగా భారత్ను ఆహ్వానించారు కూడా. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సుదీర్ఘ ప్రతిష్టంభన కాస్తా ఆయన వచ్చిన మూడు వారాల్లోపే వీడిపోవడం విశేషం. ట్రంప్కు అత్యంత సన్నిహితునిగా గోర్కు పేరుంది. ఏ సందర్భంలోనైనా గోర్ను తాను పూర్తిగా విశ్వసిస్తానని ట్రంప్ చెబుతుంటారు. భారత్తో ఒప్పందం, టారిఫ్ల తగ్గింపు విషయంలో ట్రంప్పై ఆయన ప్రభావం చాలా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.మాకు సమాచారం లేదు: రష్యా మాస్కో: చమురు కొనుగోళ్ల నిలిపి వేతపై భారత్ నుంచి ఇప్పటి దాకా అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదని రష్యా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్ అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఇకపై వెనెజువెలా నుంచే భారత్ అధికంగా చమురు కొనుగోలు చేస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారం ఈ మేరకు స్పందించారు. భారత్తో వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.ట్రంప్ వ్యాఖ్య లను నిశితంగా పరిశీలి స్తున్నట్టు రష్యా ఇంధన రంగ వ్యవహారాలు చూసే ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ చెప్పారు. భారత రిఫైనరీల నుంచి ఒప్పందాల రద్దు దిశగా ఎలాంటి నోటీసులూ అందలేదని రష్యా ఇంధన శాఖ వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఉక్రెయిన్తో యుద్ధం అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. ఆ దేశం నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశంగా కూడా నిలిచింది. దీనిపై అమెరికాతో పాటు యూరప్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా లెక్కచేయని సంగతి తెలిసిందే.
వికెట్పడ్డా.. టెస్టుల్లో ఇక ఆఖరి ఓవర్లో 6 బంతులు పడాల్సిందే!
రూపాయి రయ్.. రయ్..!
యమహా ఈసీ06
సెన్సెక్స్ సునామీ
క్యాన్సర్ చికిత్సలో సరికొత్త ఆవిష్కరణలు.. వయొలెంట్ కణంపై సైలెంట్ రణం!
యాసలందు అన్నియాసలూ భేషు
ఐదు భాషల్లో పళ్లి చట్టంబి
వన్స్ మోర్
తాలిబన్ల కఠిన ఆంక్షలు.. దిక్కులేక ఇంటివద్దే ప్రసవాలు
ఈ మధ్య అదే రాజ్యమేలుతోంది!!
కుప్పకూలిన బంగారం, వెండి!.. కియోసాకి ట్వీట్
ప్రపంచకప్ మ్యాచ్లకు భారత జట్టు ప్రకటన
పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్
అమ్మ ఎందుకలా చేసిందో..!
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
అందుకే పిల్లలు వెళ్లారు: విజయశాంతి రెడ్డి భర్త
సాయంత్రానికి మరింత క్రాష్.. గంటల్లోనే పడిపోయిన బంగారం
టారిఫ్ తగ్గింపుతో బలపడిన రూపాయి
ఈ బడ్జెట్ వల్ల ఎవరికి ప్రయోజనం అని నా చిలకను ఎందుకు అడిగావయ్యా!
దలైలామాకు గ్రామీ అవార్డు - తీవ్ర నిరసన తెలిపిన చైనా
రీఎంట్రీలో అదరగొట్టిన తిలక్ వర్మ
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్
కపటనాటక సూత్రధారి
ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు.. వ్యాపారవృద్ధి
కుర్రాళ్లు కుమ్మేశారు.. అమెరికాపై భారత్ ఘన విజయం
మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్
భారత తుది జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్కు నో ఛాన్స్?
సాక్షి కార్టూన్ 02-02-2026
వికెట్పడ్డా.. టెస్టుల్లో ఇక ఆఖరి ఓవర్లో 6 బంతులు పడాల్సిందే!
రూపాయి రయ్.. రయ్..!
యమహా ఈసీ06
సెన్సెక్స్ సునామీ
క్యాన్సర్ చికిత్సలో సరికొత్త ఆవిష్కరణలు.. వయొలెంట్ కణంపై సైలెంట్ రణం!
యాసలందు అన్నియాసలూ భేషు
ఐదు భాషల్లో పళ్లి చట్టంబి
వన్స్ మోర్
తాలిబన్ల కఠిన ఆంక్షలు.. దిక్కులేక ఇంటివద్దే ప్రసవాలు
ఈ మధ్య అదే రాజ్యమేలుతోంది!!
కుప్పకూలిన బంగారం, వెండి!.. కియోసాకి ట్వీట్
ప్రపంచకప్ మ్యాచ్లకు భారత జట్టు ప్రకటన
పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్
అమ్మ ఎందుకలా చేసిందో..!
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
అందుకే పిల్లలు వెళ్లారు: విజయశాంతి రెడ్డి భర్త
సాయంత్రానికి మరింత క్రాష్.. గంటల్లోనే పడిపోయిన బంగారం
టారిఫ్ తగ్గింపుతో బలపడిన రూపాయి
ఈ బడ్జెట్ వల్ల ఎవరికి ప్రయోజనం అని నా చిలకను ఎందుకు అడిగావయ్యా!
దలైలామాకు గ్రామీ అవార్డు - తీవ్ర నిరసన తెలిపిన చైనా
రీఎంట్రీలో అదరగొట్టిన తిలక్ వర్మ
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్
కపటనాటక సూత్రధారి
ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు.. వ్యాపారవృద్ధి
కుర్రాళ్లు కుమ్మేశారు.. అమెరికాపై భారత్ ఘన విజయం
మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్
భారత తుది జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్కు నో ఛాన్స్?
సాక్షి కార్టూన్ 02-02-2026
ఫొటోలు
జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)
క్యూట్ జోడీ.. జనవరి ఎంజాయ్ చేశారిలా (ఫొటోలు)
అనసూయ డైలీ రొటీన్ ఇదే.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)
హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు (ఫొటోలు)
'హనీ' ఈవెంట్లో అందంగా దివి (ఫొటోలు)
’వెరైటీ ఇండియా పార్టీ‘లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్ ఈవెంట్ లో మెరిసిన హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)
నిర్మల్ : ఘనంగా ముజ్గి మల్లన్న జాతర (ఫొటోలు)
'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
నేరుగా ఓటీటీకి ఆనంద్ దేవరకొండ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
అనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తక్షకుడు. ఈ సినిమాకు వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మిడిల్క్లాస్ మెలొడీస్ సూపర్హిట్గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. టీజర్ చూస్తుంటే ఆనంద్ దేవరకొండ మునుపెన్నడు చేయని డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. 'వాడు ఇక్కడే ఉన్నాడు.. నా కళ్లముందే ఉన్నాడు.. కానీ కనిపెట్టలేకపోతున్నాను..' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.కాగా.. ఈ మూవీలో లపతా లేడీస్ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.
శర్వానంద్ బైకర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు.ఈ సమ్మర్ కానుకగా బైకర్ థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. The engine's revved up 🏍️The track is ready 🛣️Now, THERE IS NO STOPPING HIM ❤️🔥#BIKER grand release worldwide on April 3rd, 2026 💥💥#BIKERMovie #GoAllTheWay 🏁#BikerOnApril3rdCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha… pic.twitter.com/HhIsmshA7i— UV Creations (@UV_Creations) February 3, 2026
పడుకుని పోజులిచ్చిన మీనాక్షి.. బ్లాక్ డ్రస్లో మాళవిక
కింద పడుకుని పోజులిచ్చేసిన మీనాక్షి చౌదరిబ్లాక్ డ్రస్లో రచ్చ లేపుతున్న మాళవిక మోహనన్క్యూట్ అండ్ స్వీట్ లుక్స్లో అనన్య నాగళ్లముంబై జ్ఞాపకాలు పోస్ట్ చేసిన రుక్మిణి వసంత్తెగ నవ్వేస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sai Dhanshika (@saidhanshika)
సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్
శృంగారం లేదా సె*క్స్ ఎడ్యుకేషన్ అనే పదాలు వింటే చాలు చాలామంది అదేదో బూతులా చూస్తారు. అసలు ఈ పదాలు ఉచ్ఛరించడమే తప్పు అన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ ప్రస్తుత జనరేషన్లో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది పలు రకాలుగా అవగాహన తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీశారు. దాని టీజర్ ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)'సూపర్ సుబ్బు' పేరుతో తీసిన ఈ సిరీస్లో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేశాడు. నెట్ఫ్లిక్స్లో త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ముంబైలో మంగళవారం ఓ ఈవెంట్ నిర్వహించిన సదరు ఓటీటీ సంస్థ.. అక్కడ దీని టీజర్ రిలీజ్ చేసిది. కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసింది. టీజర్ బట్టి చూస్తే.. సుబ్బు.. చిన్నప్పటి నుంచి చిలిపి కుర్రాడు. పెద్దయిన తర్వాత కూడా అలానే ప్రవర్తిస్తుంటాడు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడనుకుంటే ఏకంగా 60 మంది అమ్మాయిలు ఇతడిని రిజెక్ట్ చేస్తారు.మరోవైపు సుబ్బుకి టీచర్గా అవకాశమొస్తుంది. కాకపోతే ఓ పల్లెటూరిలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు వెళ్లిన పనిలో సక్సెస్ అయ్యాడా లేదా? అనేదే కాన్సెప్ట్లా అనిపిస్తుంది. ఈ సిరీస్లో సందీప్ కిషన్కి జోడీగా మిథిలా పాల్కర్ నటించింది. మురళీ శర్మ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు చేశారు. (ఇదీ చదవండి: నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!)
క్రీడలు
మళ్లీ ఢిల్లీనే...
వడోదర: ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ ఫైనల్ చేరింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన జట్టుగా ఢిల్లీ ఘనత వహించింది. గురువారం జరిగే టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో క్యాపిటల్స్ తలపడుతుంది. 2024లోనూ ఇరు జట్లు టైటిల్ కోసం ఢీకొనగా ఆర్సీబీ విజేతగా నిలిచింది. మొదట గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (51 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, జార్జియా వేర్హమ్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడింది. స్టార్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ (0), కెప్టెన్ యాష్లీ గార్డ్నర్ (0) విఫలమయ్యారు. చినెల్లి హెన్రీ 3 వికెట్లు, నందిని శర్మ 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి గెలిచింది. లిజెల్లీ లీ (24 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (23 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. షఫాలీ వర్మ (21 బంతుల్లో 31; 7 ఫోర్లు), లౌరా వోల్వార్డ్ (24 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. వేర్హమ్కు 2 వికెట్లు దక్కాయి.స్కోరు వివరాలుగుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (నాటౌట్) 62; సోఫీ డివైన్ (సి) లిజెల్లీ (బి) హెన్రీ 6; అనుష్క (సి) హెన్రీ (బి) నందిని 16; యాష్లీ గార్డ్నర్ (సి) స్నేహ్ రాణా (బి) నందిని 0; కనిక (స్టంప్డ్) లిజెల్లీ (బి) మిన్ను మణి 6; వేర్హమ్ (సి) వోల్వార్డ్ (బి) హెన్రీ 35; భారతి (సి అండ్ బి) హెన్రీ 0; కాశ్వీ గౌతమ్ (రనౌట్) 18; తనూజ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 25; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–38, 4–59, 5–120, 6–125, 7–164. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–32–0, చినెల్లీ హెన్రీ 4–0–35–3, నందిని శర్మ 4–0–44–2, మిన్ను మణి 4–0–23–1, స్నేహ్ రాణా 1–0–3–0, శ్రీచరణి 3–0–25–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లిజెల్లీ లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) వేర్హమ్ 43; షఫాలీ వర్మ (బి) వేర్హమ్ 31; వోల్వార్డ్ (నాటౌట్) 32; జెమీమా (సి) సోఫీ (బి) రాజేశ్వరి 41; మరిజాన్ కాప్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 18; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–89, 2–92, 3–160. బౌలింగ్: రేణుక 2–0–27–0, కాశ్వీ గౌతమ్ 2–0–17–0, రాజేశ్వరి 3–0–33–1, సోఫీ డివైన్ 3–0–35–0, జార్జియా వేర్హమ్ 3.4–0–28–2, తనూజ 1–0–5–0, యాష్లీ గార్డ్నర్ 1–0–15–0.
WPL Eliminator: దంచికొట్టిన బెత్ మూనీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ చేరగా.. మరో బెర్తు కోసం గుజరాత్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది.దంచికొట్టిన బెత్ మూనీఇందులో భాగంగా కొటాంబిలోని వడోదర స్టేడియంలో మంగళవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్లో ఇరుజట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గుజరాత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ బెత్ మూనీ అజేయ అర్ధ శతకం (51 బంతుల్లో 62) మెరవగా.. మరో ఓపెనర్ సోఫీ డివైన్ (6), వన్డౌన్ బ్యాటర్ అనుష్క శర్మ (16) నిరాశపరిచారు.ఇక కెప్టెన్ ఆష్లే గార్డ్నర్, భారతి ఫల్మలి డకౌట్గా వెనుదిరగగా.. కనిక అహుజా సైతం 6 పరుగులకే అవుటైంది. జార్జియా వారేహమ్ (25 బంతుల్లో 35), కశ్వీ గౌతం (10 బంతుల్లో 18) మెరుగ్గా రాణించారు. ఫలితంగా గుజరాత్ 150 పరుగుల మార్కు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో చినెల్లి హెన్రీ మూడు వికెట్లతో చెలరేగగా.. నందాని శర్మ రెండు, మిన్ను మణి ఒక వికెట్ పడగొట్టారు. గుజరాత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్కు చేరాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది.డబ్ల్యూపీఎల్-2026 ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఢిల్లీతుదిజట్లుగుజరాత్బెత్ మూనీ (వికెట్ కీపర్), సోఫీ డివైన్, అనుష్క శర్మ, ఆష్లే గార్డ్నర్ (కెప్టెన్), జార్జియా వరేహమ్, భారతి ఫల్మలి, కనిక అహుజా, కశ్వీ గౌతం, తనుజా కన్వేర్, రేణుకా సింగ్ ఠాకూర్, రాజేశ్వరి గైక్వాడ్.ఢిల్లీలిజెల్లి లీ (వికెట్ కీపర్), షఫాలి వర్మ, లారా వల్వర్ట్, జెమీమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మరిజానే కాప్, చినెల్లి హెన్రీ, నికీ ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందాని శర్మ. Beth Mooney dances down the track and puts it away for a much-needed boundary 👊Will Mooney anchor Gujarat Giants to a big total in this eliminator clash? 👀#TATAWPL Eliminator | #GGvDC 👉 LIVE NOW ➡️ https://t.co/Bd8nlT8AGe pic.twitter.com/YO8yPWT0VJ— Star Sports (@StarSportsIndia) February 3, 2026
T20 WC 2026: తోపు జట్టు ఇదే.. వివరాలు, విశ్లేషణ
టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీకి శనివారం (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో మెరుపు వేగంతో పరుగుల వరద మొదలవ్వనుంది. ఈ పరుగుల సునామీలో టాప్లో ఉండేదెవరు? తోపుగా నిలిచేదెవరు? ఈ సారి కొత్త రికార్డులు నమోదవుతాయా? ఆటగాళ్లు తమ రికార్డులను తిరిగి బ్రేక్ చేస్తారా? ఈసారీ టీమిండియా హాట్ ఫేవరెట్గా ఉన్నా.. భారత్ ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి?టీమిండియా బలాలు, బలహీనతలుఏమిటి?? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు సమాధానంగా సాక్షి స్పోర్ట్స్ పలు పారామితులతో, అల్గారిథమ్లతో ఓ విశ్లేషణను రూపొందించింది. అదేంటో తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి.
WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్
ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్కంఠగా సాగిన సెమీస్ మ్యాచ్లో ఆసీస్ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకువెళ్లింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్కప్ టోర్నీలో సూపర్ సిక్స్ గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ సెమీ ఫైనల్కు అర్హత సాధించగా.. గ్రూప్-2 నుంచి భారత్ , ఇంగ్లండ్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్- ఇంగ్లండ్ మంగళవారం తలపడ్డాయి.థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్బులవాయోలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో బెన్ డాకిన్స్ (1) విఫలం కాగా.. జోసెఫ్ మూర్స్ 25 పరుగులు.. వన్డౌన్లో వచ్చిన బెన్ మేయ్స్ 24 రన్స్ చేశారు. టాపార్డర్ ఇలా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.శతకంతో చెలరేగిన థామస్.. మొత్తంగా 107 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 110 పరుగులు సాధించాడు. మిగతావాళ్లలో కలేబ్ ఫాల్కనర్ 40 పరుగులతో రాణించగా.. ఫర్హాన్ అహ్మద్ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.ఆసీస్ బౌలర్లలో హేడెన్ షీలర్, నడేన్ కూరే చెరో రెండు వికెట్లు తీయగా.. విల్ బైరమ్, ఆర్యన్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటంఓపెనర్ విల్ మలాజుక్ 15, వన్డౌన్ బ్యాటర్ 3 పరుగుల చేసి అవుటయ్యారు. మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ 83 బంతుల్లో 47 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ (3), జేడన్ డ్రేపర్ (12) నిరాశపరిచారు.ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటం చేశాడు. 88 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న ఒలీవర్ పదో వికెట్గా వెనుదిరిగడంతో ఇంగ్లండ్ గెలుపు ఖరారైంది. టార్గెట్ ఛేదనలో 47.3 ఓవర్లలో 250 పరుగులకే పరిమితమై ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థామస్ రూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక రెండో సెమీ ఫైనల్లో భారత్- అఫ్గనిస్తాన్ బుధవారం తలపడతాయి.అండర్-19 వరల్డ్కప్ ఆసీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు👉ఇంగ్లండ్-277/7(50)👉ఆస్ట్రేలియా- 250(47.3). చదవండి: ICC vs PCB: పాకిస్తాన్కు భారీ షాక్!
న్యూస్ పాడ్కాస్ట్
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
జీవీఎంసీలో రౌడీ రాజ్యం... గీతం కబ్జాకు పచ్చజెండా... కనీస చర్చ లేకుండానే భూముల క్రమబద్దీకరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో రీ సర్వే సూపర్. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ, మార్కెట్ సంస్కరణలు భేష్ అని పొగిడిన కేంద్ర ఆర్థిక సర్వే
YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు... సీబీఐ దర్యాప్తులో వెల్లడి... బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు
కరెంట్ చార్జీలపై ఏపీ సర్కారు కహానీ. చార్జీలు తగ్గిస్తామంటూనే 20వేల కోట్ల రూపాయల భారం
వెలిగొండ ఆశలపై నీళ్లు... నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం
బిజినెస్
మళ్లీ పుంజుకున్న గోల్డ్, సిల్వర్: కొత్త ధరలు ఇలా..
జనవరి 30 నుంచి భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేటు మళ్లీ పెరుగుదల దిశగా పయనించింది. ఈ రోజు (మంగళవారం) ఉదయం రూ. 151750 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మారిపోయింది. దీంతో పసిడి కొనుగోలుదారుల్లో మరోమారు ఒకింత ఆందోళన మొదలైంది. అయితే ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,53,930 (రూ.760 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,41,100 వద్ద (రూ. 700 పెరిగింది) ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ.740 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ.700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,54,080 రూపాయల దగ్గర, 22 క్యారెట్స్ తులం పసిడి ధర రూ.1,41,250 వద్ద నిలిచాయి.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయానికి వస్తే.. ఇక్కడ బంగారం ధర దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3,490 రూపాయలు పెరిగి రూ.1,55,670 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ తులం రేటు 3200 రూపాయలు పెరిగి రూ.1,42,700 వద్దకు చేరింది.సిల్వర్ రేటుమంగళవారం ఉదయం రూ.20 వేలు తగ్గిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి అంతే పెరిగింది (రూ.20,000 పెరిగింది). దీంతో రూ. 2.80 లక్షల దగ్గర ఉన్న కేజీ వెండి రేటు రూ. 3 లక్షలకు చేరింది.ఇదీ చదవండి: జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీలు.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో నెల, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ ఉన్నాయి. అయితే ఈ కథనంలో 84 రోజుల పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్రూ.469 ప్లాన్: కంపెనీ అందించే 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. అపరిమిత కాల్స్ లభిస్తాయి. అయితే డేటా లభించదు. నెంబర్ యాక్టివ్గా ఉంచుకోవాలన్నా.. కేవలం కాలింగ్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలన్నా యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.548 ప్లాన్: 84 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. 7 జీబీ డేటా కూడా పొందవచ్చు. ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డేటా ఎక్కువ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అంత ఉపయోగకరంగా ఉండదు.రూ.979 ప్లాన్: రోజుకు 2జీబీ డేటా కావాలనుకునే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్. 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. సోనీ లివ్ యాప్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. మొత్తం 168 జీబీ డేటా లభిస్తుందన్నమాట.రిలయన్స్ జియోరూ.448 ప్లాన్: జియో అందిస్తున్న ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో డేటా లభించదు. కానీ అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో కాల్స్ చేయాలకునేవారు లేదా నెంబర్ యాక్టివ్గా ఉంచుకోవాలకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.రూ.799 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులే. అయితే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. జియో టీవీ, జియో ఎయిర్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి.రూ.859 ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా కావాలనే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ (168 జీబీ డేటా).. మూడు నెలలు జియో హాట్స్టార్కు ఫ్రీ యాక్సిస్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా యూజర్లు గూగుల్ జెమినీ ప్రోకు 18 నెలలు సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
మారుతి కారు.. అమ్మకాలు జోరు!
మారుతి సుజుకి.. మార్కెట్లో విక్టోరిస్ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఈ మోడల్ కేవలం నాలుగు నెలల కాలంలో 50,000 సేల్స్ సాధించగలిగింది. జనవరి 2026లో దీని అమ్మకాలు 15240 యూనిట్లు. నవంబర్ & డిసెంబర్లలో అమ్మకాలు వరుసగా 12,300 & 6,210 యూనిట్లు.మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.మైల్డ్-హైబ్రిడ్ టెక్తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.
బంపరాఫర్.. ఐఫోన్పై రూ.24000 తగ్గింపు!
గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఎంతోమంది యాపిల్ ప్రియులను ఆకట్టుకున్న 'ఐఫోన్ ఎయిర్' మోడల్ మీద అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 24వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.మార్కెట్లో రూ.1,19,900లకు లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్.. అమెజాన్ ఇండియాలో రూ.99 వేలకు (రూ.20900 తగ్గింపు) కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు ఐఫోన్ ఎయిర్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ కింద (క్రెడిట్ కార్డుపై) రూ.4,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే మొత్తం రూ. 24900 తగ్గింపు పొందవచ్చన్నమాట.ఐఫోన్ ఎయిర్ మొబైల్.. స్కై బ్లూ, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ & లైట్ గోల్డ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఇది 6.5 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. అంతే కాకుండా యాపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్తో కూడిన యాపిల్ A19 ప్రో చిప్సెట్ పొందుతుంది.ఇదీ చదవండి: 15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!ఐఫోన్ ఎయిర్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్పై ఆధారపడి ఉంటుంది. ఇందులో బేస్ వేరియంట్ 12GB RAM & 256GB ఇంటర్నల్ స్టోరేజ్ను పొందుతుంది.కెమెరా సెటప్ విషయానికి వస్తే.. సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన సింగిల్ రియర్ 48 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ రియర్ షూటర్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్ల కోసం, ఫోన్లో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. హ్యాండ్సెట్ 3149mAh బ్యాటరీ & 20W MagSafe వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పనిచేస్తుంది.
ఫ్యామిలీ
ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..
అధిక బరువు కేవలం సామాన్యులనే వేధించే సమస్య కాదు. ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు కౌన్సలింగ్ ఇచ్చి బరువు తగ్గేలా చేసే ఒబెసిటీ వైద్యులు సైతం అధిక బరువు బాధితులే. అందుకు ఉదాహరణ ఈ వైద్యుడు కెవిన్ జెండ్రూ. అందరికి ఆరోగ్యకరమై జీవిన విధానానికి కౌన్సిలింగ్ ఇచ్చే ఈ ఒబెసిటి డాక్టరే తన స్వతం జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపించడంలో విఫలమై అధిక బరువుతో బాధపడ్డాడు. అధిక పని ఒత్తిడికి ఈ వైద్యుడు సైతం సామాన్యుడిలా అధిక బరువు బారినపడ్డాడు. రోగులకు కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తే సరైన జీవన విధానం అవలంభించకలేక ఇబ్బందిపడ్డాడు. చివరికి ఆ ఒక్క దురదృష్టకర ఘటన అతడి జీవితాన్ని ఊహించని మలుపుతిప్పి బరువు తగ్గేందుకు దారితీయడమే కాదు..వెయిట్లాస్ అవ్వడంలో స్ఫూర్తిగా నిలిచాడు. మరి ఆ వైద్యుడి వెయిట్లాస్ జర్నీ ఎలా మొదలైందంటే..మసాచుసెట్స్కి చెందిన కెవిన్ జెండ్రూ ఒకప్పుడూ 138 కిలోల బరువు ఉండేవాడు. అతడి వృత్తి ఊబకాయంతో బాధపడే రోగులకు వైద్యం చేయడం. విచిత్రం ఏంటంటే అతడే ఓ ఒబెసిటీ రోగి..పైగా తన లైఫ్ని ఆరోగ్యప్రదంగా ఉంచుకోలేదు. కానీ రోగులకు అధిక బరువు తగ్గించుకునేలా చికిత్స, కౌన్సిలింగ్ ఇస్తుండటం విశేషం. సుదీర్ఘ గంటల పని ఒత్తిడి అతడిని తరుచుగా ఏదో ఒకటి తినేలా చిరుతిండికి బానిసగా మార్చేసింది. అది కాస్త ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలైంది. మరోవైపు అతడి తండ్రికి టెర్మినల్ మెలనోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ఏం తింటున్నాడో..ఎలా ఉంటున్నాడనే దానిపై స్పృహ లేకుండా జంక్ఫుడ్ తీసుకునేవాడు. అదికూడా నిర్ణిత సమయం అంటూ లేకుండా తినాలనిపించినా..లేకపోయినా..వీలు దొరికినప్పుడల్లా తినడం ఓ అలవాటుగా మారి..విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల బారినపడ్డాడు. ఊబకాయం ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన ఉన్న వైద్యుడే ఊబకాయంతో బాధపడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనడం ఒకింత సిగ్గుగా అనిపించడం మొదలైంది కెవిన్కి. ఇంతలో సోదరికి కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అవ్వడం ఒక్కసారిగా కెవిన్ ఉలిక్కిపడ్డాడు. ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి అంతే అని ఫిక్స్ అయ్యి..ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టిపెట్టడం ప్రారంభించాడు. తన పిల్లల కోసమైన ఆరోగ్యం ఉండాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు.ఎలా తగ్గాడంటే..సాధారణ ఆహార మార్పులు, అడపాదడపా ఉపవాసం తదితరాలను ప్రారంభించాడు. అలాగే తనకున్న వైద్య పరిజ్ఞానంతో ఆరోగ్యకరంగా బరువు తగ్గే ప్రణాళిలు ఏర్పాటు చేసుకుని మరి బరువు తగ్గేందుకు ప్రయత్నించాడు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక ఫైబర్ ఉండే ఆహారం, బెర్రీలను తీసుకోవడం ప్రారంభించాడు. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, శుద్ధి చేసిన చక్కెరను నివారించాడు. అతని సాధారణ భోజనంలో గ్రిల్డ్ చికెన్, సిర్లోయిన్ స్టీక్ లేదా చేపలు, కాల్చిన నాన్-స్టార్చీ కూరగాయలు ఉంటాయి. దాంతోపాటు అవకాడో, గింజలు, ఆలివ్ నూనె, గుడ్లు, చీజ్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మైండ్పెట్టి తినడం, కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేవాడు. ఇక అడదడపా ఉపవాసాన్ని కూడా హెల్దీగా చేసినట్లు తెలిపాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వ్యవధిలో తక్కువ కార్బ్, చక్కెర ఉన్న ప్రోటీన్ భోజనం మాత్రమే తీసుకునేవాడు. దీనివల్ల చక్కెర స్థాయిలు సాధారణస్థితికి వచ్చి డయాబెటిస్ అదుపులోకి వచ్చింది. వర్కౌట్ల దగ్గరకు వచ్చేటప్పటికీ..రోజుకి పదివేల నుంచి పదిహైను వేల వరకు నడక వంటివి కచ్చితంగా చేసేవాడు.ఇలా ఆరోగ్యకరమైన అలవాట్లతో కేవలం 18 నెలల్లో 138 నుంచి ఏకంగా 56 కిలోలు బరువు తగ్గాడు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన బరువుతో 20లలో ఉన్న వ్యక్తిలా అన్నిపనులు సునాయాసంగా చేయగలుగుతున్నానంటూ తన వెయిట్లాస్ స్టోరీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. (చదవండి: ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!)
ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!
ఈ రోజుల్లో చేసిన సాయాన్నిగుర్తించుకుని కృతజ్ఞత చూపించడం అత్యంత అరుదు. ఒక వేళ ఆయా వ్యక్తులు తారసపడిన ముఖం చాటేస్తుంటారు చాలామంది. కానీ ఈ జంట ఎప్పుడో చేసిన వైద్యుడి సాయాన్ని గుర్తించుకోవడం కాదు, అతడు తారసపడిన వెంటనే చేసిన పనికి ఆ డాక్టర్ సైతం కంగుతిన్నాడు, ఆనందపారవశ్యంలో మునిగిపోయాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఆ వైద్యుడు నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..ఆఫ్రికన్ డాక్టర్ ఇద్రిస్ తాహిర్కి ఈ అరుదైన అనుభవం ఎదురైంది. ఆ సాయంత్రం ఒక రెస్టారెంట్లో చేసిన భోజనం తానొక గొప్ప జ్ఞాపకంగా మిగలనుందని అతడి ఆ సమయంలో తెలియదు. ఒక రోజు సాయంత్రం డాక్టర్ ఇంద్రిస్ ఒక రెస్టారెంట్లో డిన్నర్ కోసం వెళ్లాడు. అక్కడ డైనింగ్ టేబుల మీద ఇద్దరు బ్యూటివఫుల్ ట్విన్స్తో ఉన్న జంటను చూస్తాడు. ఆ కవలలను చూసి ఆ వైద్యుడుకి చాలా ముచ్చటేస్తుంది. ఆ తర్వాత వాళ్లంతా తమకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకుని తినడం జరుగుతుంది. ఆ తర్వాత వైద్యుడు డిన్నర్ పూర్తి అవ్వగానే బిల్లు పే చేద్దామని వెళ్తుండగా కవలల తండ్రి ఆపి తాను బిల్లు పే చేశానని చెబుతాడు. దాంతో తాహిర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అసలు ఎవరతను తన బిల్లు ఎందుకు కట్టాడని కన్ఫ్యూజన్లో ఉండగా..ఆ జంట డాక్టర్ గారు..మీరు మమల్ని గుర్తుపట్టలేదని అర్థమైంది. ఐదు నెలలు క్రితం తాను తన భార్య ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చామని, అక్కడ తన భార్యకు కవలలను ప్రసవించేలా సాయం చేసింది మీరేనని వివరిస్తాడు. దాంతో ఒక్కసారిగా ఆ డాక్టర్కి ఏం మాట్లాడలేక ఆ దంపతులు చూపిన కృతజ్ఞతకు ఆనందంతో తడిసి ముద్దవుతాడు. అస్సలు ఈ సాయంత్రం డిన్నర్ ఇంతలా తన జీవితంలో ఓ గొప్ప మరుపురాని జ్ఞాపకంగా ఉంటుందని ఊహించలేదు అంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. నెటిజన్లు సైతం వృత్తిలో ఆ డాక్టర్ చూపిస్తున్న నిబద్ధతకు అంతా ప్రశంసించడమే కాదు..సేవకు దక్కుతున్న గౌరవం అది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. I saw a couple at a restaurant with their beautiful twins. Just as I was about to pay my bill, the husband insisted he’d already taken care of it. He said, “You probably won’t recognize me, but you’re the one who operated on my wife five months ago, those are the twins you…— Idris Tahir (@Idrees_taheer) February 1, 2026 (చదవండి: ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో..)
ధ్యాన ప్రయాణం
కొన్ని పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వచ్చాక ఎంతకాలమైనా అవి మన హృదయాన్ని వీడిపోవు. అక్కడి ప్రకృతి సౌందర్యం, అద్భుతమైన మనుషుల ప్రవర్తన మన మనసులో అలాగే నిలిచిపోతాయి. అలాంటి వాటిలో అత్యుత్తమమైన స్థానం ‘తవాంగ్’కి దక్కుతుంది. అరుణాచల్ప్రదేశ్లో ఉన్న ‘తవాంగ్’ ఒక హిల్ స్టేషన్ మాత్రమే కాదు. మన మనసుకు ప్రశాంతతను ఇచ్చే అత్యుత్తమమైన డెస్టినేషన్. పర్వతాల మధ్యలో, మేఘాల నడుమ, బౌద్ధ మత సారాన్ని గ్రహిస్తూ సాగే ధ్యాన ప్రయాణం విశేషాల గురించి ట్రావెలర్ ఎం.జి. కిషోర్ వివరిస్తున్నారు...మహిళా సన్యాసుల మఠాలుతవాంగ్లో కొన్ని బౌద్ధ మఠాలను కేవలం మహిళా సన్యాసులు మాత్రమే నిర్వహిస్తారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా తవాంగ్ వెళ్లాను. ఒక మహిళా మఠానికి వెళ్లినప్పుడు, అక్కడ వారు ఇచ్చిన యాక్ (జడలు బర్రె) మిల్క్తో చేసిన టీ తాగాను. బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉన్నా, నాలాంటి ప్రయాణికులు వచ్చినప్పుడు నిష్కల్మషమైన చిరునవ్వుతో పలకరించే విధానం అరుదుగా కనిపించే విషయం.తవాంగ్లో కొన్ని బౌద్ధ మఠాలను కేవలం మహిళా సన్యాసులు మాత్రమే నిర్వహిస్తారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా తవాంగ్ వెళ్లాను. ఒక మహిళా మఠానికి వెళ్లినప్పుడు, అక్కడ వారు ఇచ్చిన యాక్ (జడలు బర్రె) మిల్క్తో చేసిన టీ తాగాను. బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉన్నా, నాలాంటి ప్రయాణికులు వచ్చినప్పుడు నిష్కల్మషమైన చిరునవ్వుతో పలకరించే విధానం అరుదుగా కనిపించే విషయం.ఇక్కడ చేయాల్సిన 5 పనులు 1. తవాంగ్కు బయల్దేరినప్పుడు మీకు ఊపిరి పీల్చుకోవడంలో కాస్త ఇబ్బంది అనిపిస్తే అరుణాచల్ ప్రదేశ్లో అతి ఎత్తైన పర్వత మార్గం ‘సేలా పాస్’ వచ్చిందని అర్థం. ఘనీభవించిన సేలా సరస్సు మీదుగా ప్రయాణించవచ్చు. స్వర్గ సరస్సు అని దీనికి పేరు. ఈ ప్రయాణం అత్యద్భుతంగా అనిపిస్తుంది.2. తవాంగ్లో వార్ మెమోరియల్, పీ.టి.సో లేక్, ఉర్గేలింగ్ మోనాస్టరీ ... తప్పక సందర్శించదగినవి. 3. అతిపెద్ద బుద్ధుడి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్లి, శిలాఫలకాలపై చెక్కిన సూక్తులు చదివి, అర్ధం చేసుకోవచ్చు.4. బౌద్ధమతంలో కీలక ప్రదేశం కాబట్టి ఇక్కడ జీవహింసకు తావు ఉండదు. కాబట్టి మీరు చీకటి పడ్డాక బయటికి వెళ్తే ఒక డజను కుక్కలు కనిపిస్తే షాక్ అవ్వకండి. అలాగని ఈ కొండ కుక్కలను తేలికగా తీసుకోకండి. ఎక్కడ బయట తిరగాలన్నా చీకటి పడేలోపే అని గుర్తుంచుకోవాలి. 5. తవాంగ్ మోనాస్టరీలో మీరు బౌద్ధ సన్యాసులను జీవితం గురించి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగొచ్చు.సందర్శనీయ స్థలాలు తవాంగ్లో అన్ని దిశల్లో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. తవాంగ్ మోనాస్టరీ నుంచి అన్నీస్ నన్నరీ అనే మహిళల మఠం, లోకల్ మార్కెట్లు, ఇక్కడి చిన్న చిన్న కేఫ్లు, విండ్ హార్స్ అని పిలిచే రంగురంగుల పతాకాలు, ఇవన్నీ ఎవర్గ్రీన్ మెమరీలుగా మిగిలిపోతాయి. ఇక టౌన్ నుంచి బయటికి వస్తే మాధురీ లేక్ చుట్టూ ఉన్న ప్రశాంతత, భారత్–చైనా సరిహద్దు వద్ద ఉన్న బూమ్లా పాస్ ప్రయాణం, మధ్య మధ్యలో కనిపించే ఎన్నో సరస్సులు, ఇవన్నీ మర్చిపోవడం దాదాపు అసాధ్యం.చైనా బార్డర్ ఉన్న బూమ్లా పాస్ వెళ్లాలంటే మీకు ఇన్నర్ లైన్ పర్మిట్తో పాటు లోకల్ అధికారుల నుంచి అనుమతి కూడా అవసరం అవుతుంది. మీరు ఇక్కడ బైక్ రెంట్కు తీసుకుని కూడా ప్రయాణించవచ్చు. ఆర్మీ క్యాంపుల వద్ద ఫోటోగ్రఫీ నిషేధం అని తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం.చూరా సబ్జీఅరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయినప్పటి నుంచి మెనూలో మార్పు కనిపిస్తుంది. ఇక్కడ తూ΄ా, చౌమీన్, మోమోస్, అ΄ాంగ్, చూరా సబ్జీతో ΄ాటు అనేక రకాల కొత్త రుచులను ఆస్వాదించవచ్చు.నేను బస చేసిన వారికే ఉదయం బ్రేక్ఫాస్ట్, రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయమని చె΄్పాను. దాంతో మధ్యాహ్నం సమయంలోనే ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ చేయగలిగాను. మీరు డ్రాగన్ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల నార్త్ ఈస్ట్ వెరైటీలు లభిస్తాయి.ఇక్కడ ప్రతి ఇంటి ముందు టన్నుల కొద్దీ బంగాళాదుంపలు కనిపిస్తాయి. వాటిని కూరల్లో వినియోగించడంతో ΄ాటు జస్ట్ ఉడకబెట్టి ఉప్పు, మసాలా వేసుకుని తినేస్తారు. ఈ అలవాటు నాకు కాస్త కొత్తగా అనిపించింది. ఎలా వెళ్లాలి?!∙తవాంగ్కు వెళ్లే మార్గం కూడా తవాంగ్ ఎక్స్పీరియెన్స్ లో భాగమే. గమ్యం కన్నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలని నేర్పే జర్నీ ఇది. ∙గౌహతికి అన్ని ప్రాంతాల నుంచి బస్సు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ∙గౌహతి నుంచి తవాంగ్ వెళ్లే దారిలో పర్వతాల మధ్య మెలికలు తిరిగే రహదారులు, మధ్యలో చేతికి అందేంత దూరంలో మేఘాలు, బ్రహ్మపుత్ర లోయ, దిరాంగ్ వ్యాలీ, వాటిని తడిపేస్తూ ముందుకు వెళ్తున్న బ్రహ్మపుత్ర నది.. ఇవన్నీ మనసును మరో లోకంలో విహరింపజేస్తాయి. గమనిక : తవాంగ్ వెళ్లడం కోసం మంచి ట్రావెల్ హిస్టరీ ఉన్న బస్సు లేదా ట్యాక్సీని మాత్రమే ఎంచుకోవాలి.ఎక్కడ ఉండాలి?∙తవాంగ్లో హోమ్స్టేలు, లోకల్ హౌసులు, మోనాస్టరీ చుట్టూ ఉన్న చిన్న చిన్న లాడ్జీలు అన్నీ కూడా ఈ టౌన్ థీమ్లో పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. ∙హిల్ వ్యూ ఉన్న రూమ్లోంచి ఉదయం సూర్యోదయం చూసిన తరువాత అరుణాచల్ ప్రదేశ్ను ‘‘ది ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్’’ అని ఎందుకు అంటారో అర్థం అవుతుంది. ఎందుకంటే భానుడి తొలికిరణం ఇక్కడే పడుతుంది.అతిపెద్ద మఠంభారతదేశంలోనే అతిపెద్ద మోనాస్టరీ అనే మఠం తవాంగ్లో ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మఠం. ఈ మోనాస్టరీలో ఉదయం, సాయంత్రం బౌద్ధ సన్యాసుల ్రపార్థనలు, యాక్ నెయ్యితో వెలిగే దీపాలు, సన్యాసులు నడిచే మార్గాలు, మోనాస్టరీ లోపల చిత్రకళ... ఇవన్నీ మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.లోనార్ లేక్ దక్కన్ పీఠభూమిలో అంతరిక్ష రహస్యంభూమికి, అంతరిక్షానికి మధ్య జరిగిన ఒక భయంకరమైన ఘటనకు సాక్ష్యంగా నిలుస్తుంది మహారాష్ట్రలోని లోనార్ సరస్సు. ఎన్నో సందేహాలతో పాటు కుతూహలం కలిగించే ప్రదేశం ఇది. అలాగే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశం కూడా. ఎందుకంటే ఇది మనకు తెలిసిన చరిత్రకు ముందు జరిగిన చరిత్ర.ఇక్కడ ఒకానొక కాలంలో ఉల్క పడటం వల్ల భారీ గుండం ఏర్పడింది అని, అది తరువాత సరస్సుగా మారిందని చెబుతారు. సాధారణంగా ఇలాంటి క్రేటర్లు వేల నుంచి లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయి. ఈ క్రేటర్లు భూమి – అంతరిక్షం మధ్య ఉన్న చరిత్రకు సాక్ష్యాలు. సౌరమండలంలో జరిగిన మార్పులకు చిహ్నాలు అని కూడా చెప్పవచ్చు. అలాగే భూమిపై జీవనం ఎలా వికసించింది అనేది తెలుసుకోవడానికి కూడా ఇవి సహాయపడతాయి. చుట్టుపక్కల ఉన్న రాళ్లలో అయస్కాంత లక్షణాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. కావాలంటే మీరూ ఒకసారి ప్రయత్నించవచ్చు. ఉదయం వేళ పక్షుల కిలకిలారావాలతో పాటు, చాలా తక్కువ సంఖ్యలో పర్యాటకులను కూడా చూడవచ్చు. లోనార్ లేక్ పర్యావరణ వ్యవస్థ అనేది చాలా సున్నితమైనది. అందుకే దీనిని పర్యాటక ప్రాంతంగా ప్రమోట్ చేయడం లేదు. ఇక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయవచ్చు. పర్యాటకులు పరిశీలించవచ్చు. అంతే కానీ, లోనార్కు వెళ్లి ‘చూసొచ్చాం’ అని కాకుండా భూమి చరిత్రను ‘తెలుసుకుని వచ్చాం’ అని చెప్పడం బెస్ట్.ఫోన్లో ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎక్కడ సేవ్ చేయాలి?!ప్రయాణాల్లో డాక్యుమెంట్స్ చూపించమని అధికారులు కోరితే పేపర్లు వెతికే అవసరంఈ రోజుల్లో లేదు. మీ ఫోన్ లోనే అన్నీ సేవ్ చేసుకోండి. ఈ సింపుల్ టిప్స్ మీకోసం..∙ఈ రోజుల్లో చాలా మంది ప్రయాణికులు తమ డాక్యుమెంట్స్ అంటే ఐడీ ప్రూఫ్స్, హోటల్ బుకింగ్, ట్రైన్ వివరాలు అన్నీ కూడా ఫోన్ లోనే సేవ్ చేసుకుని బయల్దేరుతున్నారు. పేపర్ ఫైల్స్ క్యారీ చేయడం కన్నా స్క్రీన్ పై డిపెండ్ అవ్వడం ఇప్పుడు సాధారణం అయింది. అయితే దీని కోసం ఒక చిన్న డిజిటల్ ట్రావెల్ హ్యాబిట్ను మీరు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ∙ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లౌడ్ స్టోరేజీలో (Google Drive లాంటివి) ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి స్టోర్ చేసుకోండి.∙ఇందులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ , టికెట్లు, కన్ఫర్మేషన్స్ , వీసా.. ఇలా అన్ని డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫోన్ పోయినా లేదా బ్యాటరీ లో అయినా గూగుల్ డ్రైవ్ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు.∙తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. ఎయిర్పోర్టులో, రైల్వే కౌంటర్లో, హోటల్ రిసెప్షన్ లో హఠాత్తుగా ఎవరైనా డాక్యుమెంట్స్ అడిగినప్పుడు బ్యాగ్లలో వెతకడం కన్నా ఫోన్ లో డాక్యుమెంట్స్ క్షణాల్లో వారికి చూపించవచ్చు.హంపి ఇక్కడ ప్రతి రాయికీ ఓ కథ ఉందిహంపి అంటే చాలా మంది శిధిలాల నగరం అని పిలుస్తుంటారు. కానీ హంపిలో అడుగుపెట్టగానే మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్.. ఇవి శిథిలాలు కాదు. ఇవి పురాతనమైన నగరం తాలుకూ ఙ్ఞాపకాలు అని!హిస్టరీ క్లాసుల్లో వినేటప్పుడు బోర్ కొట్టిన విషయాలను ఇక్కడి శిథిలాలు నోరు తెరచి తమ కథను చెబుతున్నట్టు అనిపిస్తుంది. రాళ్లకు జీవం ఉండదు. అయితే హంపీ జీవం లేని ప్రదేశం కాదు. ఇక్కడ రాళ్లు, ఆలయాలు, నదీ శబ్దం ఇన్నీ కూడా మనల్ని పర్యాటకులుగా కాదు ఒక చరిత్రకారుడిలా ట్రీట్ చేస్తాయి. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి మనం గతంలోకి వెళ్లిపోతాం. సూర్యాస్తమయం సమయంలో హంపీ రంగులు ఒక అందమైన కవిత్వంలా కనిపిస్తాయి. రాళ్ల రంగును డామినేట్ చేసే బంగారు వర్ణం ఒక డిఫరెంట్ షేడ్లా మారిపోతాయి. చరిత్రను మనం పుస్తకాల్లో చదవడం అలవాటు చేసుకున్నాం. కాని పుస్తకాలు దాటి అర్థం చేసుకునే అవకాశం మాత్రం హంపీ లాంటి ప్రదేశాల్లోనే దొరకుతుంది.లంగ్కావిస్ట్రెస్ నుంచి బ్రేక్...లంగ్కావి వెళ్తే సరి!మలేషియాలోని లాంగ్కావి ద్వీపంలో అడుగు పెట్టగానే టైమ్ బ్రేక్ తీసుకుందేమో అనిపించకమానదు. అంతా కాస్త స్లో అవుతుంది. అండమాన్ సముద్ర తీరంలో ఉన్న ఈ ఐలాండ్ బీచులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. క్రౌడ్, సౌండ్, హడావిడి లేని బీచ్ ఎక్స్పీరియెన్స్ కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. మొత్తానికి, స్లో టూరిజం ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.ఎలా చేరుకోవాలంటే...లంగ్కావికి విమానంలో సులభంగా చేరుకోవచ్చు. కౌలాలంపూర్ నుంచి ప్రతీ రోజూ డైరెక్ట్ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రయాణికులు ముందుగా కౌలాలంపూర్ చేరుకుని, అక్కడి నుంచి దేశీయ విమానాల్లో లాంగ్కావికి ప్రయాణిస్తారు. అలాగే, ఇక్కడికి చేరుకునేందుకు ఫెర్రీ ఆప్షన్ కూడా ఉంది. పెనాంగ్ లేదా కౌలా కెదాహ్ నుంచి లాంగ్కావికి రెగ్యులర్ ఫెర్రీలు నడుస్తాయి.చిరుగాలుల సవ్వడి..లాంగ్కావిలో యాక్టివిటీస్ అంటే సుడిగాలిలా కాకుండా చిరుగాలిలా ఉంటాయి. సింపుల్ అండ్ స్మూత్ యాక్టివిటీస్ ఉంటాయి. బీచ్ వాక్, సన్ సెట్ చూడటం, మాంగ్రోవ్ వనాల్లో బోట్. లాంగ్కావి అనేది సాధారణ పర్యాటక ప్రదేశం కాదు. హడావిడి ఉండదు, ట్రావెల్ లిస్ట్ కంప్లీట్ చేయాలనే తొందర కూడా కనిపించదు. కాబట్టి, నిజంగా బుర్రకు బ్రేక్ కావాలి అంటే.. లాంగ్కావి బెస్ట్ ప్లేస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.పర్యటన కాలం∙ పర్యటనకు సరైన సమయం అనేది సీజన్ ను బట్టి మారుతుంది. మంచు చూడాలనుకుంటే చలికాలంలో వెళ్లొచ్చు. ∙ తవాంగ్ను ప్రశాంతంగా చూడాలంటే చలికాలానికి ముందు వెళ్లడం మంచిది. ∙ వర్షాకాలం మాత్రం ప్లాన్ చేయకపోవడం ఉత్తమం.∙ మొత్తానికి నార్త్ ఈస్ట్ ఎంత అందంగా ఉంటుందో స్వయంగా కళ్లతో సందర్శిస్తేనే తెలుస్తుంది. ఒక్కసారి వెళ్తే ఈ ప్రయాణం మైండ్లో స్టోర్ అయి, గుండెలో రిపీట్ మోడ్లో ప్లే అవుతూనే ఉంటుంది.– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు
ఆకుపచ్చని చీరలో మెరిసిపోతున్న మాధురి దీకిత్..!
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహ సీజన్ని తలంపుకి వచ్చేలా ఆమె లుక్ మెస్మరైజ్ చేస్తోంది. ఆరు గజాల బాటిల్ గ్రీన్ షేడ్ సిల్క్ చీరలో ఈ ఐదు పదుల బ్యూటీ ముగ్దమనోహరంగా ఉంది. కనుచూపుని తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్తో ఆకర్షిస్తోంది. జనవరి 31న, మాధురి ఇన్స్టాగ్రామ్లో “పియా తోసే నైనా లాగే రే (1965 చిత్రం గైడ్ నుండి లతా మంగేష్కర్ పాట)” అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో తన బ్యూటీఫుల్ ఫోటోలను షేర్ చేశారామె. ఆ పచ్చదనం మాధురికి రాచరికపు లుక్ని అందించింది. ఈ చీర అంచుల వెంబరడి జర్దోజీ ఎంబ్రాయిడరీ చీర విలాసవంతమైన లుక్ని హైలెట్ చేసింది. ఆ చీరకు సరిపోయేలా అదే కలర్లోని ఎంబ్రాయిడరీ బ్లైజ్ ఈ వివాహ వేడుకలకు లేటెస్ట్ ఫ్యాషన్స్టైల్గా నిలిచింది. స్టైలిష్గా కూర్చొన్న తీరు..జాలు వారుతున్న ఆ శారీ పల్లు రాజదర్బారులో కూర్చొన్న మహారాణిలా హుందాగా కనిపించింది మాధురి. జయంతి రెడ్డి లేబుల్ నుంచి వచ్చిన ఈ ఆకుపచ్చని చీర ధర వింటే నోరెళ్లబెడతారు. ఎంతంటే..అక్షరాలు రూ. 1,39,900లు పలుకుతుంది. ఆ చీరకు తగ్గట్టు మాధురి ఎంచుకున్న మేకప్, హెయిర్స్టయిల్ ఆమె లుక్ని మరింత గ్రాండ్గా కనబడేలా చేసింది. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) (చదవండి: కిచెన్పై బడ్జెట్ ప్రభావం..ఏం తగ్గనున్నాయంటే..!)
అంతర్జాతీయం
‘బడ్జెట్’తో బుద్ధి చెప్పిన భారత్.. తేరుకోని బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్లో పొరుగు దేశం బంగ్లాదేశ్కు ఇచ్చే అభివృద్ధి సహాయాన్ని భారత్ భారీగా తగ్గించింది. గత ఏడాది బడ్జెట్లో బంగ్లాదేశ్కు రూ. 120 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని సగానికి అంటే రూ. 60 కోట్లకు కుదించింది. దీని వెనుకగల కారణం ఏమిటి? మిగిలిన పొరుగు దేశాల విషయంలో ఉదారత చూపిన భారత్ ‘బంగ్లా’ విషయంలో ఎందుకిలా చేసింది?భూటాన్కు అత్యధిక సాయంగత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య సఖ్యత కొరవడింది. ఢాకాలో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు, ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం బడ్ఢెట్ కేటాయింపుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా పొరుగు దేశాలైన భూటాన్.. భారత్ నుంచి రూ.2,288 కోట్లతో అత్యధికంగా లబ్ధి పొందుతుండగా, నేపాల్కు రూ. 800 కోట్లు, మాల్దీవులు, మారిషస్లకు చెరో రూ. 550 కోట్లు కేటాయించారు.క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాలు2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్తో సన్నిహితంగా ఉండటం గమనార్హం. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఇప్పటికే బంగ్లాదేశీయులకు టూరిస్ట్ వీసాలను పరిమితం చేయడమే కాకుండా, ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తమ దౌత్యవేత్తల కుటుంబాలను వెనక్కి పిలిపించింది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయి, ఆ దేశంతో సంబంధాలను బలపరుచుకోవడం భారత్కు తీవ్ర అసంతృప్తి కలిగించింది.క్రీడారంగానికీ పాకిన వైరంఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా క్రీడారంగానికి కూడా పాకాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుండి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలగించడంతో మొదలైన వివాదం మరింత ముదిరింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో తమ గ్రూప్ మ్యాచ్లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో, బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుండి తప్పుకుంది. మరోవైపు, పాకిస్థాన్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఆతిథ్య దేశమైన భారత్తో తలపడకూడదని ఆంక్షలు విధించింది. దీనివల్ల ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ డైలమాలో పడింది.తాలిబాన్ ప్రభుత్వానికి సహకారం పెంపుఒకవైపు బంగ్లాదేశ్కు నిధులు తగ్గించినా, మరోవైపు ఆఫ్ఘనిస్థాన్తో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తాలిబాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిపిన భారత్, ఆ దేశానికి ఇచ్చే సాయాన్ని రూ. 150 కోట్లకు పెంచింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ బడ్జెట్లో మొత్తం రూ. 22,118 కోట్లు కేటాయించారు. మైనారిటీల రక్షణ విషయంలో బంగ్లాదేశ్ను నిలదీస్తూనే, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా తన ‘నైబర్హుడ్ ఫస్ట్’ విధానాన్ని భారత్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంకకు రూ. 400 కోట్లు, మయన్మార్కు రూ. 300 కోట్లు కేటాయించి , ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేసింది.ఇది కూడా చదవండి: ‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు
దలైలామాకు గ్రామీ
లాస్ఏంజెలెస్: టిబెటన్ల అ త్యున్నత ఆధ్యాత్మిక నేత దలై లామాకు అత్యంత ప్రతిష్టా త్మకమైన గ్రామీ సంగీత పుర స్కారం లభించింది. ఆయన ఆడియో ఆల్బం ‘మెడిటేషన్స్: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా’కు ఈ గౌరవం దక్కింది. ఆడియో బుక్స్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ విభాగంలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. కేథీ గేర్వర్, ట్రెవర్ నోవా, కెటాంజీ బ్రౌన్ జాక్సన్, ఫాబ్ మోర్వన్ తదితరులతో పోటీపడి మరీ దలైలామా గ్రామీ నెగ్గడం విశేషం. ఆదివారం రాత్రి లాస్ఏంజెలెస్లో జరిగిన 68వ గ్రామీ వేడుకల్లో ఆయన తరఫున గాయకుడు రఫుస్ వెయిన్రైట్ అవార్డును స్వీకరించారు. కబీర్ సెహగల్ నిర్మాణంలో రూపొందిన దలైలామా ‘మెడిటేషన్స్’ ఆడియో ఆల్బంకు ప్రఖ్యాత సరోద్ నిపుణుడు ఉస్తాద్ అమ్జాద్ అలీ ఖాన్ సంగీతం అందించారు. ఆయన కుమారులు అమాన్ అలీ బంగాష్, అయాన్ అలీఖాన్, అమెరికా శాక్సోఫోనిస్ట్ టాడ్ నాష్, గాయక–రచయిత దేబీ నోవా తదితరులు కూడా ఆల్బం రూపకల్పనలో పాలుపంచుకున్నారు. 90 ఏళ్ల వయసులో తొలిసారిగా గ్రామీ అవార్డు దక్కించుకుని దలైలా మా రికార్డు సృష్టించడం విశేషం. దాంతో దలైలామా నివాసముంటున్న హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన శిష్యులు, అనుయా యుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా మాత్రం దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించింది.మనోళ్లకు దక్కని గౌరవందక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కె–పాప్ బృందం కూడా ఈసారి తొలిసారిగా గ్రామీ పురస్కారం దక్కించుకుంది. వారి యానిమేటెడ్ మ్యూజికల్ యాక్షన్ మూవీ ‘కే పాప్ డెమన్ హంటర్స్’ ఆల్బంలో పాపులర్ గీతం ‘గోల్డెన్’ను గ్రామీ వరించింది. అలాగే ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా తొలిసారి గ్రామీ పురస్కారం దక్కించుకున్నారు. ఆయన రూపొందించిన మ్యూజిక్ ఫర్ జాన్ విలియమ్స్’ డాక్యుమెంటరీకి మ్యూజిక్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కింది. దాంతో ప్రఖ్యాత ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీ (ఈజీఓటీ) అవార్డు లన్నింటినీ అందుకున్న అరుదైన ప్రముఖుల జాబితాలో స్పీల్బర్గ్ స్థానం సంపాదించుకున్నారు. భారత్ నుంచి అనౌష్క శంకర్, సిద్ధాంత్ భాటి యాతో పాటు శక్తి ఫ్యూజన్బాండ్ కూడా పోటీపడ్డా ఎవరికీ అవార్డు దక్కలేదు.దలైలామా హర్షంధర్మశాల: గ్రామీ అవార్డు పట్ల దలైలామా హర్షం వెలిబుచ్చారు. ‘‘ఈ పురస్కారాన్ని సవినయంగా, కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరిస్తున్నా. ఇది వ్యక్తిగత ఘనత కాదు. ప్రపంచ పౌరులందరి సమష్టి భాగస్వామ్యానికి గుర్తింపు. శాంతి, కరుణ, పర్యావరణ పట్ల శ్రద్ధ, మానవ ఐక్యతపై స్పష్టమై న అవగాహన మానవాళి శ్రేయస్సుకు చాలా ము ఖ్యం. ఈ కీలక సందేశాన్ని మరింతగా చాటేందుకు గ్రామీ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుంది. అందుకు నిర్వాహకులకు కృతజ్ఞున్ని’’ అని పేర్కొన్నారు.
నార్వే యువరాణి కుమారుడు అరెస్టు
ఓస్లో: నార్వే రాజకుటుంబానికి మరో ఇబ్బందికర పరిణామం. యువరాణి మెట్టె మారిట్ పేరు వివాదాస్పద ఎప్స్టీన్ ఫైల్స్లో చోటుచేసుకున్న ఉదంతం ఓవైపు కలకలం రేపుతుండగానే, మరోవైపు ఆమె పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హిబ్బీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై అత్యాచారాలు, దాడులు తదితర అభియోగాలు కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. వాటిపై మంగళవారం ఓస్లో జిల్లా కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా అరెస్టు చోటుచేసుకోవడం గమనార్హం. మామూలోడు కాదు! యువరాజు హాకన్కు హిబ్బీ సవతి కొడుకు. యువరాణి మారిట్కు గత సంబంధం ద్వారా జని్మంచారు. ఆయనకు రాచరికపు హోదా గానీ, విధులు గానీ ఏమీ లేవు. కానీ హిబ్బీ నేరచరిత్ర అంతా ఇంతా కాదు! ఆయనపై ఇప్పటిదాకా ఏకంగా 38 రకాల అభియోగాలు దాఖలయ్యాయి. వాటిలో నాలుగు అత్యాచారాలు, సన్నిహితంగా సహజీవనం చేసిన వ్యక్తిపై తీవ్ర వేధింపులు, మరో భాగస్వామిపై హింసతో పాటు మారిజువానా రవాణా వంటివి ఉన్నాయి. వీటికి సంబంధించి 2024 నుంచి ఆయన్ను పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారు. అయితే అభియోగాల నమోదు అనంతరం వదిలేశారు. హిబ్బీ సాధారణ నార్వే పౌరునితో సమానమేనని యువరాజు హాకన్ ఇటీవలే పేర్కొన్నారు. చిక్కుల్లో రాజకుటుంబం నార్వే రాజకుటుంబానికి ప్రజల్లో మంచి పేరుంది. కానీ హిబ్బీ నిర్వాకాలు ఆ ఇమేజీకి మచ్చ తెచ్చేవిగా మారాయి. యువరాణి మారిట్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో చోటుచేసుకోవడంతో రాజకుటుంబం ఇప్పటికే తల పట్టుకుంటోంది. అమెరికాతో పాటు పలు దేశాల రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులకు మైనర్లను, మహిళలకు జెఫ్రీ ఎప్స్టీన్ ఎరగా వేసిన వైనం సంచలనం సృష్టించడం తెలిసిందే. దానికి సంబంధించి ఫైళ్లు కొద్దిరోజులుగా వెలుగు చూస్తున్నాయి. తాజా ఫైళ్లలో మారిట్ పేరు వందలసార్లు ప్రస్తావనకు రావడం నార్వేలో కలకలం రేపుతోంది! 2013లో ఫ్లోరిడాలోని పామ్బీచ్లో ఎప్స్టీన్కు చెందిన ఓ విలాసవంతమైన భవనంలో మారిట్ కొద్ది రోజుల పాటు ఉన్నట్టు వాటి ద్వారా వెలుగులోకి వచ్చింది. ఎప్స్టీన్ నేపథ్యం తెలుసుకోకుండా అతనితో సంబంధం పెట్టుకోవడం పొరపాటేనని మారిట్ చెప్పుకొచ్చారు. హాకన్ సోదరి ప్రిన్సెస్ మార్తా లూయిస్ అక్రమ వ్యాపార వ్యవహారాలు, అమెరికాకు చెందిన తంత్రవాది దురెక్ వెరెట్తో ఆమె వివాహం తదితరాలు కూడా నార్వో ప్రజలకు రుచించలేదు.
హసీనాకు పదేళ్ల జైలు
ఢాకా: పదవీచ్యుత బంగ్లాదేశ్ మహిళా ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఢాకా కోర్టు పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ప్రభుత్వ గృహాల ప్రాజెక్టులో భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన రెండు కేసుల్లో హసీనాతోపాటు ఆమె బంధువులను ఢాకా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దోషిగా తేల్చారు. లబి్ధదారులకు బదులుగా హసీనా తన బంధువు, బ్రిటన్ లేబర్ పార్టీ మహిళా ఎంపీ, మాజీ బ్రిటన్ మంత్రి తులిప్ సిద్ధిఖ్సహా పలువురికి రెసిడెన్షియల్ ప్లాట్లను కేటాయించారన్న వాదనలతో న్యాయమూర్తి రూబియుల్ ఆలమ్ ఏకీభవించారు. ఢాకా శివారులోని పూర్బకోల్లోని రజూక్ న్యూ టౌన్ ప్రాజెక్టులో ఈ అక్రమాలు వెలుగుచూశాయని గతంలో కేసు నమోదైంది. శిక్ష పడిన హసీనా ఇద్దరు మేనకోడళ్లు, మేనల్లుడిని పోలీసులు వెంటనే వేర్వేరు కారాగారాలకు తరలించారు. సిద్ధిఖ్ చిన్న సోదరి ఆలజమాన్ సిద్ధిఖ్, సోదరుడు రద్వాన్ ముజీబ్ సిద్ధిఖ్ బాబీలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష వేస్తూ సోమవారం మధ్యాహ్నం 12. 30 గంటలకు జడ్జి తీర్పు వెలువర్చారు. 16 మంది నిందితులకు గాను ప్లాట్లు కేటాయించిన రజూక్ ప్రాజెక్టు సీనియర్ అధికారి ఖుర్షీద్ ఆలమ్ మాత్రమే కోర్టు హాలులో హాజరయ్యారు. గృహశాఖ సహాయ మాజీ మంత్రి ,అదే శాఖలో మాజీ కార్యదర్శి, రజూక్ ప్రాజెక్ట్ చైర్మన్, ఇతర అధికారులకు ఐదేళ్ల కారాగార శిక్ష పడింది. తన శిక్షపడడంపై హసీనా స్పందించారు. ‘‘ఇలాంటి తీర్పును ముందే ఊహించాం. ఈ కేసులన్నీ మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం కక్షసాధింపుతో వేసిన తప్పుడు కేసులు. ఇవన్నీ కుట్రపూరితంగా తప్పుడు సాక్ష్యాలతో అల్లిన కేసులు’’అని హసీనా వ్యాఖ్యానించారు. నాటి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో నాకెలాంటి సంబంధం లేదు. అయినాసరే నాపై ఏడాదిన్నరగా తప్పుడు ఆరోపణలు ప్రచారంచేస్తున్నారు’’అని తులిప్ సిద్ధిఖ్ అన్నారు. 2024 ఆగస్ట్ ఐదున బంగ్లాదేశ్ విద్యార్థులు, యువత సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ‘జూలై ఉద్యమం’ధాటికి షేక్ హసీనా సారథ్యంలోని అవామీలీగ్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం విదితమే. ఆ తర్వాత హసీనాపై కేసుల పరంపర మొదలైంది.
జాతీయం
ముంబై మేయర్ పీఠం: ‘మహాయుతి’లో ముదిరిన పేచీ
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో అధికార పంపిణీకి సంబంధించి బీజేపీ- ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరింది. రెండు పార్టీలు వేర్వేరు బృందాలుగా దీనిపై రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, పదవుల కేటాయింపుపై తెర వెనుక బేరసారాలు జరుగుతున్నాయని సమాచారం. కాగా అత్యంత ప్రతిష్టాత్మకమైన మేయర్ పీఠంపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం దేశంలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీ మేయర్ పదవిని బీజేపీ దక్కించుకోనుంది. దీనికి ప్రతిగా షిండే నేతృత్వంలోని శివసేనకు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించేందుకు ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉన్నా, ఈ పదవుల పంపకంపై మహాయుతి కూటమిలో ఇప్పటికే ఒక ఫ్రేమ్వర్క్ సిద్ధమైనట్లు సమాచారం.అయితే ఇప్పుడు అసలైన పేచీ ‘స్టాండింగ్ కమిటీ’ చైర్మన్ పదవి వద్ద మొదలైంది. మున్సిపల్ నిధులు, కీలక ప్రాజెక్టుల నిర్ణయాలను నియంత్రించే ఈ కమిటీ పీఠాన్ని వదులుకునేందుకు బీజేపీ ససేమిరా అంటోంది. ఆర్థిక పరమైన అధికారాలు కలిగి ఉండే ఈ పదవిని తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ పట్టుబడుతుండగా, షిండే సేన కూడా దీని కోసం గట్టిగానే ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: దగ్గు మందు కలకలం: నాలుగేళ్ల బాలుడు మృతి
దగ్గు మందు కలకలం: నాలుగేళ్ల బాలుడు మృతి
బెతుల్: మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు హర్ష్.. ‘కోల్డ్రిఫ్’ (Coldrif) దగ్గు మందు సేవించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఈ సిరప్ తాగిన తర్వాత హర్ష్ కోమాలోకి వెళ్లగా, అప్పటి నుండి నాగ్పూర్ ఎయిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి తుదిశ్వాస విడిచినట్లు వైద్యలు తెలిపారు. సోమవారం నాగ్పూర్లో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు బెతుల్ జిల్లా వైద్యాధికారి మనోజ్ హుర్మాడే వెల్లడించారు.చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ కోల్డ్రిఫ్ సిరప్పై జరిగిన విచారణలో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. చెన్నైలోని ప్రభుత్వ ఔషధ పరీక్షల ప్రయోగశాలలో నిర్వహించిన విశ్లేషణలో ఈ మందులో ‘డైథైలిన్ గ్లైకాల్’ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం, కాంచీపురానికి చెందిన ‘స్రేసన్ ఫార్మాస్యూటికల్స్’ తయారు చేసిన ఈ సిరప్లో ఏకంగా 48.8 శాతం మేర ఈ కల్తీ రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీసే అత్యంత ప్రమాదకరమైన పదార్థం.మధ్యప్రదేశ్లోని చింద్వారా, బెతుల్ జిల్లాల్లో ఈ కల్తీ దగ్గు మందు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ సిరప్ తాగిన చిన్నారుల్లో వాంతులు, జ్వరం, మూత్ర విసర్జన చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. హర్ష్ మరణంతో కలిపి ఈ తరహా ఘటనల్లో మరణించిన చిన్నారుల సంఖ్య 24కు చేరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. పలువురు చిన్నారులు ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సమగ్ర విచారణ చేపట్టింది. ఈ ప్రాణాంతక సిరప్ను సిఫార్సు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రభుత్వ వైద్యునితో పాటు, తయారీ సంస్థ యజమానిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్లోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సిరప్ విక్రయాలపై నిషేధం విధించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా 700కు పైగా దగ్గు మందు తయారీ సంస్థలపై ప్రభుత్వం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది.ఇది కూడా చదవండి: బొగ్గు కుంభకోణం: 10 చోట్ల ఈడీ మెరుపు దాడులు
బొగ్గు కుంభకోణం: 10 చోట్ల ఈడీ మెరుపు దాడులు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బొగ్గు అక్రమ మైనింగ్, రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ ఉదంతంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో పలుచోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.బొగ్గు అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా ద్వారా భారీగా నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ అధికారులు పదికిపైగా ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. ప్రధానంగా రాష్ట్ర పోలీసు అధికారి మనోరంజన్ మొండల్కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టడం సంచలనంగా మారింది. ఆయనతో పాటు ఈ అక్రమ రవాణా వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వారి ఆస్తులపై కూడా ఈడీ దృష్టి పెట్టింది.గత నెలలో కోల్కతాలోని రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-పాక్ (I-PAC) కార్యాలయంపై జరిగిన బొగ్గు కుంభకోణం దాడులతో ప్రస్తుత సోదాలకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇది ఒక స్వతంత్రమైన విచారణ అని, బొగ్గు మైనింగ్ నెట్వర్క్లో జరుగుతున్న ఆర్థిక అవకతవకలను వెలికితీసేందుకే ఈ ప్రత్యేక దాడులు చేపట్టినట్లు వారు వెల్లడించారు. బొగ్గు మాఫియాకు, అధికారులకు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల మూలాలను గుర్తించేందుకు అధికారులు డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.ఇది కూడా చదవండి: లాయర్ కుటుంబం: ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి
లాయర్ కుటుంబం: ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి!
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని అశోక్ నగర్ జిల్లాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడగా, అందులో యువ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని మిహిర్గా పోలీసులు గుర్తించారు. కోల్కతాలో సీఏ పూర్తి చేసిన మిహిర్, ఇటీవలే రాంచీలోని తమ ఇంటికి తిరిగి వచ్చాడు.పోలీసుల కథనం ప్రకారం మిహిర్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొరుగువారితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అతడు మృతి చెందాడు. మిహిర్ ఆత్మహత్య చేసుకున్న సమయంలోనే, అతని తల్లి స్నేహ అఖౌరీ, 14 ఏళ్ల చెల్లెలు కూడా విషం తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. స్నేహ అఖౌరీ జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వారిద్దరినీ రాంచీలోని గురునానక్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే ఇంట్లో కుమారుడు ఉరివేసుకోవడం, వెనువెంటనే తల్లి, కుమార్తె విషం సేవించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు మిహిర్ కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని సమాచారం. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించినట్లు తెలుస్తోంది. వీరి కుటుంబంపై ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఒత్తిళ్లు బయటకు కనిపించకపోవడంతో, ఈ ఆత్మహత్యాయత్నాల వెనుక ఉన్న కారణాలు అంతుచిక్కడం లేదు. పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించాయి. ఈ సామూహిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తె స్పృహలోకి వస్తేనే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. పోలీసులు కేసును అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘సింధు’ వివాదం: ‘హేగ్’ఆదేశాలపై భారత్ ఆగ్రహం
ఎన్ఆర్ఐ
అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి బిగ్ అలర్ట్!
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక చేసిన మొదటి పని.. వలసవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తరపున ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అన్లిమిటెడ్ పవర్ కట్టబెట్టారు. అమెరికా భద్రత పేరిట లైంగిక దాడులు, గృహ హింస, మాదక ద్రవ్యాల కేసులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడినవారిని ఐస్ లోకల్ పోలీసులతో గుర్తించి అరెస్టులు చేసి చర్యలు తీసుకునేది. అయితే ఇప్పుడు ఆ దృష్టి పార్ట్టైం జాబులు చేసే భారతీయ విద్యార్థులు.. ప్రొఫెషనల్ జాబులు చేసేవాళ్లపైకి మళ్లడం ఇండియన్ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది..తాజాగా.. మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్లోని ఒక భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఐస్ (Immigration and Customs Enforcement) అధికారులు అరెస్టు చేశారు. అలాగే.. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగిని ఏకంగా కంపెనీలోకి వెళ్లి మరీ బేడీలు వేసి లాళ్లినట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ఈ రెండు కేసుల్లో తమ వద్ద అధికారిక ప్రతాలు చూపించినా.. తమకేం తెలియదని వాళ్లు ఎంత మొత్తుకున్నా అక్కడి అధికారులు వినలేదు. అధ్వాన్నమైన పరిస్థితులు ఉండే డిటెన్షన్ సెంటర్లో గంటల తరబడి కూర్చోబెట్టి.. చివరాఖరికి పంపించేశారు.అమెరికాకు ఉన్నత విద్య కోసం భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వెళ్తుంటారు. ముఖ్యంగా F1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు ఖర్చులు తీర్చుకోవడానికి పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే, అమెరికా వీసా నిబంధనల ప్రకారం క్యాంపస్ వెలుపల నిర్దిష్ట గంటలకు మించి పనిచేయడం చట్టవిరుద్ధం. అలా అక్రమంగా పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తే అరెస్టులు తప్పవని ఐస్ గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తోంది. అయితే..ట్రంప్ పదవిలోకి వచ్చాక ఐస్ తన తనిఖీలను మరింత ఉధృతం చేసింది. గత ఏడాది వేలాది మందిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసింది. అందులో అక్రమంగా చొరబడిన భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు.. సోషల్ మీడియా వేదికలలోని చర్చలు భారతీయులపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు సంకేతాలను ఇస్తున్నాయి. అందుకే ప్రత్యేకించి భారతీయులే మీద ఐసీఈ ఫోకస్ పెట్టిందన్న చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం. కాబట్టి.. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయవద్దని విద్యార్థులను నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త.. తెలుగోడా!పైన చెప్పిన రెండు అరెస్టులలో.. బాధితులు తెలుగువాళ్లే కావడం గమనార్హం!. వాళ్లను ఎందుకు నిర్బంధించారో కూడా అధికారులు వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే.. ఏ రకంగా వాళ్ల దృష్టిలో పడ్డ తాట తీస్తారనే సంకేతాలు పంపించినట్లయ్యిందన్నమాట. ఈ పరిస్థితుల్లో న్యూమన్ గ్రూప్ లాయర్లు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది..మా నాయకుడు గొప్పని.. మా కులం గొప్పని కొందరు దేశంకాని దేశంలో ఉంటూ వ్యాఖ్యలు చేస్తుండడం, సోషల్ మీడియాలో పోస్టులు తరచూ చూస్తుండేదే. అలా అమెరికాలో ఉండి ఇక్కడి సినిమాలు, రాజకీయాల కోసం అడ్డగోలుగా మాట్లాడడం, సో.మీ.లో పోస్టులు చేయడం ఏమాత్రం మంచిది కాదని న్యూమన్ గ్రూప్ లాయర్లు సూచిస్తున్నారు. అలాగే కులం పేరిట అతి ప్రదర్శనలు కూడా చేయొద్దంటున్నారు. ఇవి చట్ట విరుద్ధమైన చర్యలు కావు కదా అని ఫీల్ అయిన కూడా.. అక్కడి అధికారుల దృష్టిలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తే అరెస్టు, డిపోర్టేషన్ ప్రమాదం తప్పదని కుండబద్ధలు కొడుతున్నారు.మనిషి చచ్చాక యమ భటులు వచ్చి లాక్కెళ్తారు కదా.. ఒకవేళ భారతీయులు గనుక అదుపులో ఉండకపోతే ఐస్(ICE) అధికారులు అంతకు మించి ట్రీట్మెంట్తో లాక్కెళ్లే ప్రమాదం ఉందనేది సోషల్ మీడియాలో ఓ యూజర్ చేసిన పోస్ట్ సారాంశం.. అమెరికాలో అటు రాజకీయ నాయకుల్లో, ఇటు సోషల్ మీడియాలో భారతీయుల మీద పెరుగుతున్న వ్యతిరేకత..ఇలాంటి సమయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అంటున్న అమెరికా లాయర్ న్యూమన్ గ్రూప్..అమెరికాలో సినిమాల కోసం, రాజకీయాల కోసం అతి చేయొద్దు అని ముఖ్యమైన సలహా ఇస్తున్న లాయర్లు..సినిమా ఇంకా… pic.twitter.com/uIZKc9TGKD— UttarandhraNow (@UttarandhraNow) January 21, 2026
ఆంధ్రా అల్లుడు.. మళ్లీ తండ్రి కాబోతున్నాడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి గుడ్న్యూస్ను అందరితో పంచుకున్నారు. మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని అటు ఆయన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ కూడా ధృవీకరించారు. దీంతో వాళ్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వాన్స్ దంపతులు త్వరలోనే నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జులై చివరిలో పండంటి మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నట్లు తెలిపారు. జేడీ- ఉషా వాన్స్లకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఈవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జేడీ వాన్స్ (James David Vance).. 1984 ఆగస్టు 2న ఓహియో స్టేట్లోని మిడిల్టౌన్లో జన్మించారు. స్థానిక స్టేట్ యూనివర్సిటీలో చదివి, తరువాత యేల్ లా స్కూల్లో న్యాయ విద్య పూర్తి చేశారు. 2016లో ఆయన ఆత్మకథ “Hillbilly Elegy” అమెరికా అంతటా విశేష ఆదరణ పొందింది. ఈ పుస్తకం ఆధారంగా Netflix చిత్రం కూడా రూపొందింది. 2022లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి, ఓహాయో నుంచి సెనేటర్గా ఎన్నికయ్యారు. తన స్పష్టమైన అభిప్రాయాలు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం వల్ల జనాదరణ పొందగలిగారు. 2025 జనవరి 20న జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఆయన వైట్ హౌస్లో పనిచేస్తున్నారు.ఉషా చిలుకూరి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేశారు. We’re very happy to share some exciting news. Our family is growing! pic.twitter.com/0RohEBYXM7— Second Lady Usha Vance (@SLOTUS) January 20, 2026యేల్ లా స్కూల్లోనే ఉషా, జేడీ వాన్స్ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. ఈ క్రమంలో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. జేడీ వాన్స్ క్రిస్టియానిటీ, ఉష హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు.
థాంక్యూ అమెరికా..కానీ భారత్ అంటే ప్రేమ..!
అమెరికాలో నివశిస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి చేసిన పోస్ట్ నెట్టింట అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఓ పక్క అమెరికాను మెచ్చుకుంటూనే.. భారత్పై ఉన్న తన ఇష్టాన్ని గురించి కూడా వివరించాడు. అతడి పోస్ట్ అత్యంత ఆలోచనాత్మకంగ..విదేశాల్లో ఉండే సౌకర్యాలు, అక్కడి తీరు తెన్నులు..వలస వచ్చిన భారతీయలుకు ఎలాంటి ఛాలెంజ్లు, అవకాశాలు అందిస్తుందో వివరించాడు. ఈ పోస్ట్ ఎన్నారైలందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి పోస్ట్లో ఏం రాశాడంటే..యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఇన్వెస్టర్ వేణు తాను అమెరికా వెళ్లడంతో తన జీవిత గమనం ఎలా పూర్తిగా మారిపోయిందో షేర్ చేసుకున్నారు. అమెరికాలో లభించే అవకాశాల గురించి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాను అమెరికాలో సక్సెస్ అందుకున్నప్పటికీ..తాను పుట్టిన మాతృగడ్డ భారతదేశాన్ని జీవిత కాలం ప్రేమిస్తానంటూ దేశభక్తిని కూడా చాటుకున్నారు. ఆయన పోస్ట్లో తాను అమెరికాకు వెళ్లడాన్ని తన జీవిత గమనాన్ని ఊహించని విధంగా మార్చేసిన అరుదైన అవకాశంగా అభివర్ణించారు. "కృషి, క్రమశిక్షణ, స్థిరత్వానికి ప్రతిఫలమిచ్చే అమెరికన్ వ్యవస్థను ఎంతగానో కొనియాడారు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తులు, ముఖ్యంగా రిస్కులు తీసుకోవడానికి సిద్ధపడే వారికి, ఓపికతో ఉండేవారికి తప్పక మంచి ఫలితాలు అందించి లైఫ్నే అద్భుతంగా మార్చుకునే అద్భుత అవకాశాన్ని అందిస్తుందని పోస్ట్లో వేణు రాసుకొచ్చారు. అంతేగాదు చాలామంది ఇతర దేశాల్లో జీవితాన్ని అనుభవించకుండానే అమెరికాని విమర్శిస్తుంటారని కూడా అన్నారు. ప్రపంచంలో మరోవైపు నిశిసించిన తర్వాత..ఈ స్థాయి అవకాశం ఎంత అరుదైనదో అర్థమవుతుంది. ఇక్కడ జన్మించడం లేదా ఇక్కడే మంచిగా జీవితాన్ని నిర్మించుకోవడం ఓ అద్భుతమైన ప్రయోజనమని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానంటూ తన పోస్ట్ని ముగించారు. ఈ పోస్ట్ భారతీయ ప్రవాసులలో చాలామందిని ఆకట్టుకుంది. అతడి పోస్ట్లోని కృతజ్ఞత, అమెరికన్ డ్రీమ్ గురించి అతడు రాసిన విలువైన భావాలు ప్రతి భారతీయుడి మనసుని తాకడమే గాక భారత వలసదారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతులో కూడిన స్పందన రావడం విశేషం. సోదరా మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ పోస్టులు కూడా పెట్టారు. Since it’s a long weekend, a small thought.I’m genuinely grateful to the United States. It was a one-time opportunity that completely changed my life. I love India and always will, but coming here altered my trajectory in ways I couldn’t have imagined.This country rewards…— Venu (@Venu_7_) January 19, 2026 (చదవండి: కళ్లకు గంతలు...సహా ఆ సిటీలో వెరైటీ డేటింగ్స్ ఎన్నో...)
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ నూతన అధ్యక్షురాలిగా లోకిరెడ్డి మాధవి
తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం - టాంటెక్స్ నూతన అధ్యక్షురాలిగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన లోకిరెడ్డి మాధవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల డాలస్లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో 2026 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ మేరకు లోకిరెడ్డి మాధవి మాట్లాడుతూ..1986లో ప్రారంభమై 40వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం - టాంటెక్స్ సంస్థకు అధ్యక్షురాలిగా సేవలందించడం తన అదృష్టంగా భావిస్తున్నా. తనకు ఈ బాధ్యత ఇచ్చిన సంస్థ సభ్యులకు ధన్యవాదాలు. సంస్థ ప్రమాణాలను పెంచే నూతన కార్యక్రమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు." లోకిరెడ్డి మాధవి.2026 కార్యవర్గం :అధ్యక్షురాలు- మాధవి లోకిరెడ్డిఉపాధ్యక్షుడు- సునీల్ సూరపరాజుకార్యదర్శి- ఎల్ఎన్ కోయాకోశాధికారి- దీప్తి సూర్యదేవరసహాయ కార్యదర్శి- వీర లెనిన్ తుళ్లూరిసహాయ కోశాధికారి- లక్ష్మినరసింహ పోపూరిఉత్తరాధ్యక్షుడు- ఉదయ్ కిరణ్ నిడిగంటితక్షణ పూర్వాధ్యక్షుడు- చంద్రశేఖరరెడ్డి పొట్టిపాటికార్యవర్గ సభ్యులు- దీపికా రెడ్డి, RBS రెడ్డి, శివా రెడ్డి వల్లూరు, రవి కదిరి , అర్పిత ఓబులరెడ్డి, అనిత ముప్పిడి, పార్థ సారథి గొర్ల, శాంతి నూతి, మల్లికార్జున మురారి, పవన్ నర్రా, కమలాకర్ దేవరకొండ, వెంకట్ బొల్లాపాలక మండలి అధ్యక్షుడు- దయాకర్ మాడాపాలక మండలి ఉపాధ్యక్షురాలు- జ్యోతి వనంపాలక మండలి సభ్యులు- శ్రీనాధ వట్టం, శ్రీనాధరెడ్డి పలవల, రాజారెడ్డి, ప్రవీణ్ బిల్లా, కల్యాణి తాడిమేటికొత్త పాలక మండలి, కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో 2026లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు మాధవి లోకిరెడ్డి తెలిపారు. 2025 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా పని చేసి, పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి మాట్లాడుతూ మాధవి లోకిరెడ్డి నేతృత్వంలో ఏర్పడిన 2026 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ మాధవి లోకిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. TPAD సభ్యులు అజయ్ రెడ్డి ఏలేటి, రావు కలవల, రఘువీర్ బండారు మరియు జానకిరామ్ మందాడి, TANTEX నుండి సుబ్బు జొన్నలగడ్డ, మహేష్ ఆదిభట్ల, డా. యు. నరసిమ్హారెడ్డి, సతీష్ బండారు, శారద సింగిరెడ్డి, DARA నుంచి శివారెడ్డి లేవంక, తిరుమల రెడ్డి కుంభం తదితరులు ఈ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొని మాధవికి అభినందనలు తెలిపారు.(చదవండి: అమెరికాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు)
క్రైమ్
ఆడుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు..
రంగారెడ్డి జిల్లా: చెరువు ఒడ్డున ఆడుకుంటూ అందులో జారిపడిన ఇద్దరు చిన్నారులు శవాలుగా తేలారు. సీఐ వెంకటేశ్వర్లు, స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్వాల్చెరువుతండాకు చెందిన జాటోత్ బద్రీనాథ్ (8), జాటోత్ మోహన్రామ్ (రిషీ 7), కరణ్టోత్ శోభిత్ ముగ్గురూ స్నేహితులు. వీరు ఆదివారం సాయంత్రం తండా సమీపంలోని కొత్వాల్చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. చెరువు ఒడ్డుమీద ఉన్న బండరాయిపై కూర్చుని ఆడుకుంటుండగా బద్రీనాథ్, మోహన్రామ్ నీటిలో పడిపోయారు. ఇది గమనించిన శోభిత్ భయంతో ఏడుస్తూ తండాకు పరుగెత్తి, తల్లిదండ్రు లకు చెప్పాడు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న స్థానికులు మహేశ్వరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా ఆదివారం అర్ధరాత్రి వరకూ ఆచూకీ దొరక లేదు. సోమవారం ఉదయాన్నే మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా, రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. బద్రీనాథ్ తండాలోనే మూడో తరగతి, మోహన్రామ్ ఒకటో తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సబితారెడ్డి నివాళి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి చిన్నారుల మృతదేహాలకు నివాళులరి్పంచారు. బాధిత తల్లిదండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చెరువు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.
20 రోజుల్లో కూతురు పెళ్లి.. అంతలోనే మృత్యు ఒడికి
రంగారెడ్డి జిల్లా: కూతురి పెళ్లి ఘనంగా చేసి మురిసిపోదాం అనుకున్న ఆ తండ్రి కల చెదిరిపోయింది. మరో 20 రోజుల్లో పెళ్లి ఉందనగా రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఈ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం తంగడుపల్లి గ్రామానికి చెందిన రవీందర్గౌడ్ (42) ప్రైవేటు ఉద్యోగి. భార్య లలిత, కూతురు ఉంది. కొడుకు ఏడాదిన్నర క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు పటాన్చెరు మండలం ముత్తంగిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే రవీందర్గౌడ్ కూతురి వివాహం నిశ్చయం కాగా.. ఈనెల 22న పెళ్లి ఉంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కూతురి వివాహ పనుల నిమితం తన ద్విచక్రవాహనంపై సిమెంటు బస్తా వేసుకొని సొంత గ్రామానికి బయలుదేరాడు. బైక్ ఎర్వగూడ గేటు వద్ద ఉండగా.. ఎదురుగా వికారాబాద్ వైపు నుంచి వస్తున్న కారు అతివేగం, అజాగ్రత్తగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్ గౌడ్ తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 20 రోజుల్లో పెళ్లి ఉందనగా ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బంజారాహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీక్ వంటి కోణాల్లో పోలీసులు, ఫైర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
ముక్కలుగా కోసి.. చెత్తకుప్పలో వేసి
కామారెడ్డి క్రైం: ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా కోసి.. సంచిలో మూటకట్టి చెత్తకుప్పలో వేసిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. పట్టణంలోని అశోక్నగర్ కాలనీలోని ఖాళీ ప్రదేశంలో చెత్తాచెదారం వేస్తుంటారు. ఉద యం ఓ సంచిలో పురుషుడికి సంబంధించిన నడుము నుంచి కింది శరీర భాగాన్ని స్థానికులు గమనించారు. వారి సమాచారం మేరకు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఎక్కడో వ్యక్తిని హత్య చేసి మూటను ఇక్కడ పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి శరీరాన్ని రెండు, లేదా మూడు ముక్కలు చేసి ఓ భాగాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానిస్తు న్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆ«ధారాలతో దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు.
వీడియోలు
దాడులను మళ్లీ రిపీట్ చేస్తాం.. గల్లా మాధవి అంబటికి వార్నింగ్..
ఆమె మాట్లాడింది తప్పు కాదా.. ఇప్పటికైనా ఆపకపోతే
తప్పించుకోలేరు.. సతీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
నా భార్య మా అత్తతో చెప్పిన చివరి మాట ఇదే..
పోలీసులు లేకుండా రండి ఎవడి బలం ఏంటో తెలుస్తుంది
జైల్లో అంబటిని కలిసిన ముద్రగడ
Brahmaji : నావల్లే పూరి సినిమా ప్లాప్ అయ్యింది
అంబటి అల్లుడు,కూతురుని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్
ఎవర్ని వదిలిపెట్టం.. బైరెడ్డి వార్నింగ్
KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ కు పాతర

