సమంత తన డెలివరీ కోసం మరో దేశం వెళ్తారా..?
త్వరలోనే అమ్మకానున్న సమంత డెలివరీపై అప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న తర్వాత తక్కువ గ్యాప్లోనే మాతృత్వ దశలోకి అడుగుపెట్టింది సమంత. ఈ ఏడాది డిసెంబర్లోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవలే వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సమంత పూర్తిగా తన నివాసానికే పరిమితమైంది. కాగా తన డెలివరీ కోసం ఎక్కడికి వెళ్తుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సంపన్నులు, సెలబ్రిటీలు తరచుగా అనుసరించే ‘బర్త్ టూరిజం’పై కూడా చర్చ జరుగుతోంది. అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో పుట్టిన బిడ్డకు పౌరసత్వం లభించే అవకాశం ఉండటంతో చాలామంది ఆ దిశగా వెళ్తారు. అయితే అమెరికాలో బర్త్ టూరిజంపై ఇటీవల గందరగోళం నెలకొనింది. వీసా సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సమంత అమెరికా వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. కెనడా కూడా పుట్టుకతోనే పౌరసత్వం ఇచ్చే నిబంధనలు కలిగి ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లే ఆలోచన లేదని తెలుస్తోంది. సమంత టీమ్కు చెందిన క్లోజ్ సర్కిల్ మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తోంది. ఆమె ఇండియాలోనే బిడ్డకు జన్మనిస్తుందని స్పష్టంగా చెబుతున్నారు. అయితే హైదరాబాద్లో కాకుండా, ముంబయిలో డెలివరీ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నారని సమాచారం. దీంతో సమంత డెలివరీ ఎక్కడ జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
ఐబీ ఆఫీసర్ హత్య కేసు: ఆప్ మాజీ నేతను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)) ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్తో పాటు మరో నలుగురిని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు దోషులుగా తేల్చింది.ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా, మొత్తం ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది కోర్టు, ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్తుది తీర్పును వెలువరించారు. 11 మంది నిందితులకు గాను తాహిర్ హుస్సేన్, హసీన్ (అలియాస్ ముల్లాజీ), నజీమ్, కాసిమ్, సమీర్ ఖాన్లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. మరో ఆరుగురిని సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా వదిలేసింది. దోషులుగా తేలిన వారిపై హత్య (302), అల్లర్లు (147, 148), మత విద్వేషాలు రెచ్చగొట్టడం (153A) తదితర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు రుజువయ్యాయి. దోషులకు విధించే శిక్షల వివరాలను త్వరలోనే కోర్టు ఖరారు చేయనుంది.2020, ఫిబ్రవరి 25వ తేదీన సీఏఏ అల్లర్ల సమయంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని చాంద్బాగ్ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో పడేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంకిత్ శర్మ ఇక తిరిగి రాలేదు. ఆ రోజు అప్పుడే ఇంటికి వచ్చిన అంకిత్ శర్మ.. అల్లరి మూకలు స్థానికంగా రెచ్చిపోవడం గమనించారు. దాంతో బయటకు వెళ్లి వారిని సద్దుమణిచే యత్నం చేశారు. అలా ఆప్ కౌన్సిలర్గా ఉన్న హుస్సేన్ ఇంటికి వెళ్లిన అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేసి డ్రెయిన్లో పడేశారు. తన కొడుకు ఎంతకీ ఇంటికీ రాకపోయే సరికి ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు తండ్రి రవీందర్ కుమార్. దాంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ యువకుని మృతదేహం డ్రెయిన్లో ఉన్న విషయం గమనించడంతో అతను అంకిత్ శర్మగా నిర్దారణ అయ్యింది. దీనిపై హుస్సేన్తో పాటు 11 మందిపై కేసు నమోదైంది. అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేశారు. విచారణలో అంకిత్ శర్మ 51 కత్తిపోట్లకు గురైనట్లు తేలింది.2023. మార్చిలో , అల్లర్లు, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, హత్య, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు సంబంధించి హుస్సేన్తో సహా 11 మంది నిందితులపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఆ సమయంలో తన గ్రూపును హుస్సేన్ రెచ్చగొట్టారనే ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు సమర్ధించడంతో వారికి జైలు శిక్ష పడింది.తన బెయిల్కు చేసుకున్న అభ్యర్థనను కూడా అంతకుముందు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్పై అభియోగాలు తీవ్రంగా ఉండటంతో బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. తాజాగా వారిని దోషులుగా తేల్చుతూ కర్కర్దూమా కోర్టు తీర్పును వెలువరించింది.
సైన్స్కు షాక్ ఇచ్చిన గణేశుడు.. ఆర్నెల్లు నలుపు.. ఆర్నెల్లు తెలుపు
మనం ఇప్పటి వరకు ఆధ్యాత్మకతకు సైన్స్ను జోడిస్తూ.. సైన్స్ కూడా ఛేదించలేని కొన్ని ఆలయాల విశేషాలు తెలుసుకున్నాం కదా? నేను ఈరోజు మీకు అలాంటి మరో అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఒక్కసారి ఊహించుకోండి..! దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నించే నాస్తికులను సైతం ముక్కున వేలువేసుకునేలా చేస్తున్న బ్లాక్ అండ్ వైట్ గణేశుడి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఆ గణపతి విగ్రహం ఇప్పటికీ సైన్స్కు అంతు చిక్కలేదు. విశేషం ఏంటనుకుంటున్నారా?సంవత్సరంలో రెండు ఆయనాలుంటాయి. అవి ఉత్తరాయణం, దక్షిణాయనం. ఆ గణపతి విగ్రహం ఉత్తరాయణంలో నలుపు రంగులో.. దక్షిణాయనంలో తెలుపురంగులో ఉంటుంది. ఆ విగ్రహం ఎదుట ఉండే బావిలో నీరు విగ్రహం రంగుకు వ్యతిరేక వర్ణంలో ఉండడం గమనార్హం..! అంటే.. విగ్రహం తెల్లగా ఉన్నప్పుడు బావినీళ్లు నల్లగా.. విగ్రహం నలుపు రంగులో ఉన్నప్పుడు బావినీళ్లు తెల్లగా ఉంటాయి. అంతేకాదు.. ఆ ఆలయంలోని మర్రిచెట్టు వింత కూడా సైన్స్కు చిక్కడం లేదు.తమిళనాడు – కేరళ సరిహద్దుల్లో ఉన్న కన్యాకుమారి జిల్లా సమీపంలో.. నాగర్కోయిల్కు దగ్గర్లోని కేరళపురం అనే గ్రామంలో ఉన్న 'శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం' ఈ కోవలోకే వస్తుంది. పేరులోనే ఉంది కదా.. 'అతిశయ వినాయకర్'.. అంటేనే అద్భుతాలు చేసే వినాయకుడు అని అర్థం. ఈ రోజు ఈ వీడియోలో ఆ ఆలయం గురించి తెలుసుకుందామా?
షాబాద్ హత్యలకు ముందు సెల్ఫీవీడియో
సాక్షి, హైదరాబాద్: షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. హత్యలకు ఒక రోజు ముందు నిందితుడు తన ఫోన్లో ఒక సెల్ఫీ వీడియో తీసినట్లు తెలిపారు.. అందులో " నేను అమ్మాయిని నమ్ముకొని చాలా మోసపోయా, ఆ కుటుంబం నన్ను అన్ని విధాలా వాడుకుంది. నాపై కేసు పెట్టి నన్ను మోసం చేశారు. అందుకే వాళ్లని చంపాలనుకున్నా చివరకి నా పిల్లలకి కూడా భూమి లేకుండా పోయింది. డబ్బుమెుత్తం ఇచ్చేసి అప్పులపాలయ్యాను జీవితం మీద విరక్తి కలిగింది." అని రికార్డు చేసినట్లు తెలిపారు.షాబాద్ నిందితుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన అనంతరం అతని వద్ద లభించిన మొబైల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిలో భాగంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. "ఆ ఘటన జరిగిన రోజు 10.30 గంటల ప్రాంతంలో నిందితుడు రాజ్ కుమార్ ఉర్లోకి వచ్చాడు. అమ్మాయిని తీసుకొని దేవరకొండకు వచ్చాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. జీపీఎస్ ఆధారంగా పట్టుకునేందుకు యత్నించాము" అని సీపీ పేర్కొన్నారు.కాగా షాబాద్ హత్య కేసుల నిందితుడు రాజ్కుమార్ మృతిచెందాడు. కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతున్న సమయంలో అతని మృతదేహం లభించడం చర్చనీయాంశమైంది.రాజ్కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనబడింది. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అనుమతుల సాధనే లక్ష్యంగా పనిచేయాలి
మనసా...
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్: కె. నిహారిక దాసరి
తెరిచి నెల.. యూనిఫాం ఓ కల!
ఇండో-నేపాల్ బోర్డర్లో అమెరికా మాజీ సైనికుడి అరెస్ట్?
విమాన చార్జీల దోపీడీపై 'సుప్రీం' సీరియస్
గ్రీన్ సిగ్నల్?
విరాళాల గల్లంతుపై సుప్రీం సీరియస్
ఆ నేరగాడు చిక్కినట్టేనా!
మా అమ్మ భావోద్వేగానికి గురయ్యారు: భాగ్యశ్రీ బోర్సే
ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం
డిప్యూటీ సీఎం కొడుకుతో నిశ్చితార్థం.. ఎవరీ కైనత్?
మీకు సంతానం తక్కువ సంపద ఎక్కువ ఎలా సాధ్యం సార్!
కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి
ఇంగ్లండ్ టెస్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్!
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్
రవాణా మంత్రినే బస్సు దింపేసిన కండక్టర్
సాక్షి కార్టూన్: 13-07-2026
ఈ రాశి వారికి సోదరుల నుంచి ఆస్తిలాభాలు
ఇప్పుడే ఏదో కొత్తగా తప్పారని మాట్లాడుతున్నారేంటీ! వెళ్లు వెళ్లమా!
వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో.. జులైలో ఏప్రిల్-మే ఎండలు!
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్
రూ.6 కోట్ల ఇల్లు.. ఇది నిజంగా మధ్యతరగతి ఇల్లేనా?
జగన్నాథుని వంటశాల ఎలా ఉంటుందంటే..! ఆఖరికి పొయ్యిలు కూడా..
యూట్యూబ్ను షేక్ చేస్తున్న 'బాసింగ బలాలే' పాట
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ..!
టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్!
మారిన పరిస్థితి.. బంగారం భారీ పతనం!
ఇరాన్ చేరుకున్న రష్యా ప్రళయ విమానం
అనుమతుల సాధనే లక్ష్యంగా పనిచేయాలి
మనసా...
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్: కె. నిహారిక దాసరి
తెరిచి నెల.. యూనిఫాం ఓ కల!
ఇండో-నేపాల్ బోర్డర్లో అమెరికా మాజీ సైనికుడి అరెస్ట్?
విమాన చార్జీల దోపీడీపై 'సుప్రీం' సీరియస్
గ్రీన్ సిగ్నల్?
విరాళాల గల్లంతుపై సుప్రీం సీరియస్
ఆ నేరగాడు చిక్కినట్టేనా!
మా అమ్మ భావోద్వేగానికి గురయ్యారు: భాగ్యశ్రీ బోర్సే
ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం
డిప్యూటీ సీఎం కొడుకుతో నిశ్చితార్థం.. ఎవరీ కైనత్?
మీకు సంతానం తక్కువ సంపద ఎక్కువ ఎలా సాధ్యం సార్!
కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి
ఇంగ్లండ్ టెస్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్!
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్
రవాణా మంత్రినే బస్సు దింపేసిన కండక్టర్
సాక్షి కార్టూన్: 13-07-2026
ఈ రాశి వారికి సోదరుల నుంచి ఆస్తిలాభాలు
ఇప్పుడే ఏదో కొత్తగా తప్పారని మాట్లాడుతున్నారేంటీ! వెళ్లు వెళ్లమా!
వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో.. జులైలో ఏప్రిల్-మే ఎండలు!
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్
రూ.6 కోట్ల ఇల్లు.. ఇది నిజంగా మధ్యతరగతి ఇల్లేనా?
జగన్నాథుని వంటశాల ఎలా ఉంటుందంటే..! ఆఖరికి పొయ్యిలు కూడా..
యూట్యూబ్ను షేక్ చేస్తున్న 'బాసింగ బలాలే' పాట
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ..!
టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్!
మారిన పరిస్థితి.. బంగారం భారీ పతనం!
ఇరాన్ చేరుకున్న రష్యా ప్రళయ విమానం
ఫొటోలు
ఎల్లో శారీలో కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి గ్లామర్.. ఫోటోలు
సింగిల్ మూవీ బ్యూటీ ఇవానా గ్లామరస్ పిక్స్.. ఫోటోలు
శారీలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ అందాలు.. ఫోటోలు
దర్శకుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)
హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి రాశి ఖన్నా (ఫొటోలు)
'శ్రీనివాస మంగాపురం' మూవీ HD స్టిల్స్
వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్ (ఫొటోలు)
వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెటర్ల హల్చల్.. స్పెషల్ అట్రాక్షన్ వైభవ్ సూర్యవంశీ (ఫొటోలు)
ఘనంగా ముగిసిన టీజీ20 లీగ్... విజేతగా హైదరాబాద్ (ఫొటోలు)
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)
సినిమా
డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. జానీ మాస్టర్ రియాక్షన్
టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం జానీ మాస్టర్ స్పందించారు. శేఖర్ మాస్టర్తో తనకు ఎలాంటి గొడవలు లేవని అన్నారు. మా ఇద్దరి మధ్య విభేదాలు అని వస్తోన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఆదివారం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలిసింది. శేఖర్ మాస్టర్ ఆగ్రహంతో మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలోవైరలయ్యాయి. దీంతో డ్యాన్సర్స్ అసోసియేషన్లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గ్రూపులు ఘర్షణకు దిగారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. మా యూనియన్లో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. నేను, శేఖర్ మాస్టర్ ఈ రోజు మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోజనం కూడా చేశామని వెల్లడించారు. మాకు చిరంజీవి ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తారని అన్నారు. ఇది యూనియన్లో జరుగుతున్న చిన్న సమస్య మాత్రమేనని తెలిపారు. అంతే కానీ మా డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కేవలం చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయభేదాలు మాత్రమే వచ్చాయని క్లారిటీ ఇచ్చారు.
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. టీజర్ వచ్చేసింది
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మా ఊరు పెనుకొండ అంటూ వరుణ్ తేజ్ డైలాగ్స్తో టీజర్ ప్రారంభమైంది. కొరియన్ దెయ్యం కాన్సెప్ట్తో ఈ మూవీ రానుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. కమెడియన్ సత్యతో కామెడీ సీన్స్ ఆకట్టకుంటున్నాయి. ఈ హారర్ కామెడీ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు.
విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ముందే రికార్డ్స్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ రిలీజ్ కాలేదు. తాజాగా ఇటీవల సెన్సార్ బోర్డ్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 24న జన నాయగన్ విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఇటీవల ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అప్పుడే రికార్డ్స్ సృష్టిస్తోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో యూకేలో అప్పుడే రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని ఏషియన్ బాక్స్ ఆఫీస్ సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాకుండా యూకేలో జన నాయగన్ అన్కట్ వెర్షన్ విడుదల చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. మరి కొన్ని దేశాల్లోనూ అన్కట్ వెర్షన్ను ప్రదర్శించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు.
లెనిన్ సక్సెస్.. అఖిల్పై మెగాస్టార్ ప్రశంసలు
అక్కినేని అఖిల్పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. లెనిన్ గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని తెలిపారు. అఖిల్ నాకు మరో కొడుకు లాంటి వాడని అన్నారు. ప్రతి సినిమాతో అతను ఎదుగుతుండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. సక్సెస్ సాధించిన లెనిన్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. త్వరలో 'లెనిన్' సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాని రాసుకొచ్చారు.స్పందించిన అఖిల్...మెగాస్టార్ ట్వీట్కు అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. పెదనాన్న మీ ప్రేమ ఎప్పుడూ అమితమైంది. మీ సహకారానికి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ధన్యవాదాలు చిరంజీవి. నా కుటుంబానికి, నాకు మీరు ఎప్పుడూ సపోర్ట్గా నిలిచారు. సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందిని రాసుకొచ్చారు.అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ మూవీ జూలై 10న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలిరోజు రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లెనిన్.. రెండో రోజే రూ.32 కోట్లు దాటేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద లెనిన్ మూవీ సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ సినిమాకు మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.Congratulations to my dear friend @iamnagarjuna, the entire…— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2026
క్రీడలు
వారిని చూసి నేర్చుకోండి.. టీమిండియాపై భారీ ట్రోలింగ్
చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్, ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో 270 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా లార్డ్స్లో నిర్వహించిన తొలి మహిళల టెస్టులో విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర పుటల్లోకెక్కింది.ఈ విజయానంతరం సోషల్ మీడియాలో భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు సమిష్టి ప్రదర్శనను అభిమానులు కొనియాడుతున్నారు. ముఖ్యంగా హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వాన్ని, యస్తిక భాటియా, క్రాంతి గౌడ్, స్మృతి మంధాన, స్నేహ్ రాణా ప్రదర్శనలను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.కొందరు అభిమానులు ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ను 0-4తో కోల్పోయిన భారత పురుషుల జట్టును ప్రస్తావిస్తూ, "మహిళల జట్టును చూసి నేర్చుకోండి" అంటూ చురకలంటిస్తున్నారు.కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో క్రాంతి గౌడ్ 5 వికెట్లతో.. రెండో ఇన్నింగ్స్లో యస్తిక భాటియా సూపర్ శతకంతో.. స్మృతి మంధాన రెండు ఇన్నింగ్స్ల్లో రెండు అర్ధశతకాలతో.. రెండో ఇన్నింగ్స్లో స్నేహ్ రాణా నాలుగు వికెట్ల ప్రదర్శనలతో అదరగొట్టి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన 83 పరుగులతో రాణించగా, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అర్ధశతకాలతో జట్టును బలమైన స్థితిలో నిలబెట్టారు.తర్వాత బౌలింగ్లో యువ పేసర్ క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ను 170 పరుగులకే ఆలౌట్ చేసింది. మహిళల టెస్టుల్లో లార్డ్స్లో తొలి ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్గా ఆమె రికార్డు సృష్టించింది.రెండో ఇన్నింగ్స్లో భారత్ 341/7 వద్ద డిక్లేర్ చేసింది. యస్తిక భాటియా 113 పరుగుల శతకం సాధించి లార్డ్స్లో మహిళల టెస్టులో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించగా, స్మృతి మంధాన మరో అర్ధశతకంతో ఆకట్టుకుంది. దీంతో భారత్ ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.చివరి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు మరోసారి చెలరేగారు. స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ను ఘోరంగా దెబ్బకొట్టింది. దీంతో ఆతిథ్య జట్టు 186 పరుగులకే ఆలౌటై, 270 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.ఈ విజయంతో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై 12 సంవత్సరాల తర్వాత టెస్టు విజయం సాధించింది.
భారత్తో మ్యాచ్.. శ్రీలంక బ్యాటర్ డబుల్ సెంచరీ
భారత్ అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్లో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. వన్డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీతో చెలరేగి.. లంక జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. శ్రీలంక 2-1తో గెలిచింది. తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించగా.. చివరి రెండు మ్యాచ్లు గెలిచి శ్రీలంక సిరీస్ను కైవసం చేసుకుంది.ఓపెనర్లను త్వరగానే అవుట్ చేసినా..ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలే వేదికగా సోమవారం తొలి యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలింగ్కు దిగింది. భారత పేసర్ కావ్యా పటేల్ ఆరంభంలోనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు.ఓపెనర్లలో దుల్నిత్ సిగెరను డకౌట్ చేసిన కావ్యా పటేల్.. దిమంత మహవితనను రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు పంపాడు. అయితే, భారత జట్టుకు ఈ ఆనందం ఎంతో కాసేపే మిగిలింది. వన్డౌన్లో వచ్చిన సెనుజ వెకునగొడ క్రీజులో పాతుకుపోయి డబుల్ సెంచరీ కొట్టాడు.203 పరుగులతో అజేయంగా..తొలి రోజు ఆట ముగిసే సరికి సెనుజ మొత్తంగా 227 బంతులు ఎదుర్కొని 31 ఫోర్ల సాయంతో 203 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్ విమత్ దిన్సారా అర్ధ శతకం (52)తో ఆకట్టుకోగా.. కవిజ గెమాగే 49 పరుగులతో రాణించాడు. చమిక హీనతిగల 33 పరుగులతో సెనుజతో కలిసి క్రీజులో నిలిచాడు.ఫలితంగా సోమవారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక 89 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 344 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత్ ఆదిలో వికెట్లు తీసినప్పటికీ.. సెనుజ ద్విశతక ఇన్నింగ్స్ కారణంగా లంకదే పైచేయి అయింది. భారత బౌలర్లలో కావ్యా పటేల్ రెండు వికెట్లు తీయగా.. ప్రణవ్ రాఘవేంద్ర, కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చారిత్రక మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం
ఆసియా ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ల హవా.. 15 పతకాలు ఖరారు
ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా అండర్-19, అండర్-23 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. అండర్-23 పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్కు చేరుకోగా, మరో ఏడుగురు సెమీఫైనల్లో ఓడినా కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు.మహిళల అండర్-23 విభాగంలో నిషా (54 కేజీలు) దక్షిణ కొరియాకు చెందిన హ్యేజూ లీపై విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. నికితా చంద్ (60 కేజీలు) జపాన్కు చెందిన సారీ కొకుఫును ఓడించగా, కాజల్ (65 కేజీలు) కిర్గిజ్స్తాన్కు చెందిన గుల్జినా మెల్స్వెక్పై ఏకపక్ష విజయం సాధించింది.ముస్కాన్ (75 కేజీలు) ఉజ్బెకిస్థాన్కు చెందిన టోయిరోవా ఓయ్షాపై 5-0 తేడాతో గెలవగా, ప్రియాంక (80 కేజీలు) కజకిస్థాన్కు చెందిన పనార్ సెయిట్ఖాంకిజీపై అదే 5-0 స్కోరుతో విజయం సాధించింది. ఈ మూడు బౌట్లలో భారత బాక్సర్ల ఆధిపత్యం కారణంగా రిఫరీ పోటీలను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.పురుషుల అండర్-23 విభాగంలో విశ్వనాథ్ సురేశ్ (50 కేజీలు) ఫిలిప్పీన్స్ ప్రత్యర్థిని 5-0తో చిత్తు చేశాడు. గంగా (55 కేజీలు) జపాన్ బాక్సర్పై 3-2 స్ప్లిట్ డెసిషన్తో గెలిచి ఫైనల్కు చేరాడు. వంశజ్ (65 కేజీలు) కిర్గిజ్స్తాన్ ప్రత్యర్థిపై 4-1 తేడాతో విజయం సాధించి బంగారు పతక పోరుకు అర్హత సాధించాడు.భారత్ ఖాతాలో చేరిన ఏడు కాంస్య పతకాలుమహిళల అండర్-23 విభాగంలో తను (51 కేజీలు), ప్రాచి (57 కేజీలు), శివాని (70 కేజీలు), నైనా (80 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో హితేష్ (70 కేజీలు), నీరజ్ (75 కేజీలు), ఇషాన్ కటారియా (90 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.ఫైనల్కు చేరిన ఎనిమిది మందితో కలుపుకుంటే భారత్కు మొత్తం 15 పతకాలు (8 స్వర్ణాలు లేదా రజతాలు) ఖరారయ్యాయి.
చారిత్రక మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం
‘క్రికెట్ మక్కా’ లార్డ్స్లో భారత్ చారిత్రక విజయం సాధించింది. ఈ మైదానంలో మహిళల టెస్టు ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 270 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా లార్డ్స్లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి మహిళా జట్టుగా హర్మన్ సేన చరిత్రకెక్కింది.స్మృతి మంధాన అర్ధ శతకంలండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్- భారత్ మహిళా జట్ల మధ్య శుక్రవారం ఏకైక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లలో షఫాలీ వర్మ డకౌట్ కాగా.. స్మృతి మంధాన అర్ధ శతకం (83)తో మెరిసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన వారిలో జెమీమా రోడ్రిగ్స్ (35) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ అర్ధ శతకం (52)తో రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది.క్రాంతికి ఐదు వికెట్లుఇక భారత బౌలర్లలో పేసర్ క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. తద్వారా లార్డ్స్లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన మహిళా బౌలర్గా చరిత్ర సృష్టించింది. మిగిలిన వారిలో సయాలీ సత్ఘరే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.యస్తికా సెంచరీఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (115 పరుగులు) కలుపుకొని రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. ఏడు వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా సెంచరీ (113)తో సత్తా చాటింది.ఇంగ్లండ్ లక్ష్యం 457ఫలితంగా టీమిండియా ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి నాలుగో రోజు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ కేవలం 130 పరుగులు చేసింది. ఈ క్రమంలో 130/6 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి చివరి రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మరో 56 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.ఆఖరి రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లిస్టోన్ టెస్టుల్లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకుంది. యాభై పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె పదో వికెట్గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. భారత్ 270 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు కూల్చారు.సంక్షిప్త స్కోర్లుభారత్ : 285 &3 41/7 డిక్లేర్డ్ఇంగ్లండ్ : 170 & 186ఫలితం : ఇంగ్లండ్పై 270 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపు.చదవండి: టీమిండియాలోకి సూర్య!
న్యూస్ పాడ్కాస్ట్
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
టీచర్ల ‘టెట్’ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు?... ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
టెట్ మినహాయింపునకు కృషి. టీచర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలకు వైఎస్ జగన్ భరోసా
విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు
ప్రశ్నించే గొంతును నొక్కడానికి అత్యంత ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారు... ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించాం. పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించాం. ప్రధాని మోదీ వెల్లడి
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ మైలురాయి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
బిజినెస్
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 47.01 పాయింట్లు లేదా 0.061 శాతం లాభంతో 77,616.40 వద్ద, నిఫ్టీ 4.10 పాయింట్లు లేదా 0.017 శాతం లాభంతో 24,211.00 వద్ద నిలిచాయి.తైన్వాలా కెమికల్స్ & ప్లాస్టిక్స్ (ఇండియా) లిమిటెడ్, బీఎఫ్ యూటిలిటీస్ లిమిటెడ్, బోరోసిల్ లిమిటెడ్, జీఎన్ఎ యాక్సిల్స్ లిమిటెడ్, సంగమ్ (ఇండియా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, యూనికెమ్ లాబొరేటరీస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్, ఎస్జీ మార్ట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
భారత్లోని E85 బైకులు: ధర, వివరాలు ఇలా..
భారతదేశం పెట్రోల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. కొన్ని వాహన తయారీ సంస్థలు కూడా ఇథనాల్ వినియోగానికి సరిపడే వెహికల్స్ తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. మరికొన్ని సంస్థలు ఇప్పటికే మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్సైకిళ్లను లాంచ్ చేశాయి. ఈ బైక్లు E20 నుంచి E85 వరకు (20% నుంచి 85% వరకు ఇథనాల్ కలిగిన ఇంధనం) ఉపయోగించగలవు.ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్సైకిళ్లకు కంపెనీలు ప్రత్యేకమైన ఫ్యూయల్ సిస్టమ్, ఇంజిన్ భాగాలు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చాయి. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న నాలుగు ఈ85 బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హీరో స్ప్లెండర్ ప్లస్ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్సైకిళ్లలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. దీని ధర రూ. 82,710 (ఎక్స్-షోరూమ్). ఇది సాధారణ స్ప్లెండర్ మోడల్ ఆధారంగా రూపొందించినప్పటికీ, ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించేందుకు ఇంధన వ్యవస్థ, ఇంజిన్ నిర్వహణ, కొన్ని విడిభాగాల్లో మార్పులు చేశారు. ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు కూడా మెరుగ్గా ఉంటుందని సమాచారం.హీరో హెచ్ఎఫ్ డీలక్స్హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా స్ప్లెండర్ మాదిరిగానే 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఇది కూడా E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేస్తుంది. ఈ బైక్ ధర రూ. 72,792 (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చవకైన ఈ85 మోటార్సైకిళ్లలో ఇది ఒకటి.సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250సుజుకి సంస్థ కమ్యూటర్ విభాగానికే మాత్రమే కాకుండా.. ప్రీమియం సెగ్మెంట్లో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతను అందించింది. ఇందులో భాగంగానే కంపెనీ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకును ఇథనాల్తో పనిచేసాల రూపొందించింది. ఇది 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. దీని ధర రూ.2,00,896 (ఎక్స్ షోరూమ్).యమహా ఎఫ్జెడ్ బ్లూయమహా కంపెనీ జూలై 2026లో ఎఫ్జెడ్ బ్లూ ఫ్లెక్స్ మోడల్ను లాంచ్ చేయడంతో.. భారత ఫ్లెక్స్ ఫ్యూయల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది పాపులర్ ఎఫ్జెడ్ ప్లాట్ఫారమ్ ఆధారంగా నిర్మితమైంది. ఈ బైక్ E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించగలదు. ఇందులో 149 సీసీ సింగిల్ సిలిండర్ బ్లూ కోర్ ఇంజిన్ అమర్చారు. దీని ప్రారంభ ధర రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్).
సెబీ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిలో మార్పులు
దేశీయ మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తన ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను మార్చేసింది. ప్రయోజనాల ఘర్షణ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్) నివారణకు, పారదర్శకతను పెంచడానికి సరికొత్త ‘సెబీ (ఎంప్లాయీస్ సర్వీస్ అమెండ్మెంట్) రెగ్యులేషన్స్, 2026’ నిబంధనలను నోటిఫై చేసింది. ఈ కోడ్ ప్రకారం ఉద్యోగులు విధులను వీడిన తర్వాత పాటించాల్సిన నిబంధనలతో పాటు వారి వ్యక్తిగత పెట్టుబడులపై కూడా నిఘా ఉంచనున్నారు.కీలక మార్పులుసెబీ నుంచి రిటైర్ అయినా లేదా రాజీనామా చేసి తప్పుకున్నా.. ఆ తర్వాతి రెండేళ్ల వరకు సదరు మాజీ ఉద్యోగులు ఎలాంటి క్లయింట్ల తరఫున సెబీ ముందు హాజరు కాకూడదు. ఏదైనా కేసుల విచారణ, సెటిల్మెంట్లు లేదా అప్రూవల్స్ వంటి విషయాల్లో బోర్డు ముందు క్లయింట్ల పక్షాన వాదించడం లేదా ప్రాతినిధ్యం వహించడంపై పూర్తిగా నిషేధం విధించారు.నిబంధనల అమలు కోసం ‘కుటుంబం, ఆధారపడిన వారు (డిపెండెంట్స్)’ అనే పదాల నిర్వచనాన్ని సెబీ మరింత విస్తరించింది. ఇకపై దత్తత తీసుకున్న పిల్లలు, సవతి పిల్లలతో పాటు ఉద్యోగిపై ఆర్థికంగా ఆధారపడే ప్రతి ఒక్కరూ ఈ పరిధిలోకి వస్తారు. దీనివల్ల ఉద్యోగుల కుటుంబ సభ్యుల పెట్టుబడుల డిక్లరేషన్ల పరిధి మరింత పెరగనుంది.సెబీలో పని చేస్తూనే బయటి కార్పొరేట్ సంస్థలు లేదా ఇతర యజమానులతో ఉద్యోగ చర్చలు జరిపితే ఆ చర్చలు ప్రారంభించిన నెల రోజుల్లోగా బోర్డుకు డిజిటల్ రికార్డుల రూపంలో సమాచారం అందించడం తప్పనిసరి.పెట్టుబడులపై కఠిన ఆంక్షలుసెబీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మార్కెట్ సమాచారాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగతంగా లాభపడకుండా ఉండేందుకు ఇన్వెస్ట్మెంట్లపై స్పష్టమైన నిఘా ఉంచారు.ఉద్యోగ కాలంలో కొత్తగా షేర్లు, డెరివేటివ్స్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం పూర్తి నిషేధం.మ్యూచువల్ ఫండ్స్, రీట్స్ వంటి నిపుణుల ద్వారా నిర్వహించే పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులకు అనుమతి.కొన్ని రకాల నియంత్రిత పెట్టుబడి సాధనాల్లో గరిష్టంగా మొత్తం పోర్ట్ఫోలియోలో 25 శాతానికి మించి పెట్టుబడి పెట్టకూడదు.మినహాయింపులు: ఉద్యోగి జీవితభాగస్వామికి వారి సొంత ఆఫీస్ నుంచి లభించే ఈసాప్స్ (ESOPs), డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) వంటి పరిమిత అంశాలకు మాత్రమే కొన్ని మినహాయింపులు ఇచ్చారు.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..
గగన్యాన్ దిశగా భారత్ ముందడుగు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్యాన్’ మానవసహిత అంతరిక్ష యాత్ర సాధన దిశగా మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. వ్యోమగాముల భద్రతకు ప్రధానంగా ఉన్న ‘క్రూ మాడ్యూల్’ వ్యవస్థలకు సంబంధించిన మూడు క్వాలిఫికేషన్ పరీక్షలను శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. అంతరిక్ష ప్రయాణం ముగించుకుని భూమికి తిరిగి వచ్చే క్రమంలోనూ, సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత వ్యోమగాముల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షించే సాంకేతికతలను ఈ పరీక్షల ద్వారా ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.మొదటిది..ఈ ప్రక్రియలో మొదటిది ‘క్రూ మాడ్యూల్ అప్రైటింగ్ సిస్టమ్’. గగన్యాన్ యాత్ర ముగిసిన తర్వాత వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్ సురక్షితంగా భారత సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అలా పడినప్పుడు సముద్రపు అలల ఉధృతికి మాడ్యూల్ తలకిందులుగా తిరగబడే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ఇస్రో ప్రత్యేకంగా కోల్డ్-గ్యాస్ ఆధారిత అప్రైటింగ్ వ్యవస్థను రూపొందించింది. సముద్రంలో పడిన వెంటనే ఈ వ్యవస్థ యాక్టివేట్ అయి క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చేస్తుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలో ఫ్లోటేషన్ బ్యాగులను విజయవంతంగా ఉబ్బించి, వివిధ రకాల పీడన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ కచ్చితత్వంతో పనిచేస్తుందని నిరూపించారు.రెండవది..రెండవది ‘అంబిలికల్ సెపరేషన్ టెస్ట్’. వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్కు అవసరమైన ఇంధనం, విద్యుత్ శక్తి, రక్షణ వ్యవస్థలకు అనుసంధానంగా ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఈ రెండు మాడ్యూళ్లు విడిపోవాల్సి ఉంటుంది. ఒక కృత్రిమ క్రూ మాడ్యూల్ను ఉపయోగించి ఈ వేరుపడే ప్రక్రియను విజయవంతంగా పరీక్షించారు. ఎలాంటి ఆటంకం లేకుండా అత్యంత క్లీన్గా ఈ సెపరేషన్ జరిగిందని ఇస్రో తెలిపింది.మూడవది, ‘అపెక్స్ కవర్ సెపరేషన్ లోడ్స్’. క్రూ మాడ్యూల్ భూ వాతావరణంలోకి తిరిగి వచ్చేటప్పుడు ఉత్పన్నమయ్యే తీవ్రమైన వేడి, ఘర్షణ నుంచి లోపల ఉండే పారాచూట్లను రక్షించడానికి పైభాగంలో ‘అపెక్స్ కవర్’ రక్షణగా ఉంటుంది. పారాచూట్లు తెరుచుకోవడానికి ముందే ఈ అపెక్స్ కవర్ సురక్షితంగా విడిపోవాలి. ఈ కవర్ విడిపోయే సమయంలో క్రూ మాడ్యూల్ నిర్మాణంపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అసలు మిషన్లో ఎదురయ్యే గరిష్ట ఒత్తిడి కంటే సుమారు 1.75 రెట్లు ఎక్కువ లోడ్ను కృత్రిమంగా ప్రయోగించి పరీక్షించారు. ఈ భీకర ఒత్తిడిలోనూ క్రూ మాడ్యూల్ ఆకృతి ఎక్కడా దెబ్బతినకుండా స్థిరంగా ఉందని స్పష్టమైంది.అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్లను నింగిలోకి పంపడం ఒకెత్తయితే.. మానవసహిత మిషన్లలో వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడం మరో ఎత్తు. ఇస్రో తాజాగా పూర్తి చేసిన ఈ మూడు క్వాలిఫికేషన్ పరీక్షలు కేవలం సాంకేతిక విజయాలు మాత్రమే కాదు.. వ్యోమగాముల ప్రాణాలకు ఇస్రో ఇస్తున్న అత్యున్నత రక్షణ గ్యారంటీకి నిదర్శనాలు. త్వరలోనే ప్రయోగించనున్న మానవరహిత మొదటి గగన్యాన్ (జీ1) మిషన్కు ఈ విజయాలు తిరుగులేని విశ్వాసాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..
ఫ్యామిలీ
ఆ ప్రాంతం పేరు వింటే ఇప్పటకీ భయమే..! నేటికీ అది మిస్టరీనే..
మనిషి ఎంత అన్వేషించినా ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని ప్రపంచంలోని కొన్ని వింత ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని నేటికీ అంతు చిక్కని మిస్టరీలానే మిగిలిపోయాయి. ఆఖరికి సైన్సుకి, టెక్నాలజీ సైతం ఆ ప్రాంతాల వద్దకు వచ్చేటప్పటికీ చతికిలపడ్డాయని చెప్పొచ్చు. అందుకు ప్రధాన కారణం ఇక్కడ జరిగిన ఎన్నో విచిత్రమైన సంఘటనలే. ఈ ప్రాంతంలో ప్రవేశించిన కొన్ని షిప్స్ విమానాలు అకస్మాతుగా తమ కమ్యూనికేషన్ కోల్పోయి అదృశ్యమయ్యాయి. ఎందువల్ల ఇలా జరుగుతుందని అప్పటికప్పుడూ రెస్కూ చర్యలు చేపట్టేందుకు పంపిన మరో ఓడ సైతం తనలోకి లాగేసుకుంది. చివరికి వాటి శకలాలు అదృశ్యమైన ప్రదేశంలో కాకుండా వందల కిలోమీటర్ల దూరంలో కనిపించాయి. అయితే ఇందులో ప్రయాణించిన మనుషుల జాడ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అంతేగాదు ఈ ప్రాంతం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు సముద్ర గర్భంలో ఒక భారి వర్టెక్స్(సుడిగాలి) ఉందని, మరికొందరు అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని..ఇలా ఏవేవో కథనాలు కల్పించేస్తుంటారు. ఆ ప్రాంతమే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్లోరిడా ప్యూటోరికో బెర్మిడా దీవులను కలుపుతూ ఏర్పడే ఒక ఊహాజనిత త్రిభుజ ఆకార ప్రాంతమైన బర్మిడా ట్రయాంగల్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?. ఎందుకు ఆ ప్రాంతానికి 5 లక్షల చెదరపు మైళ్ల పరిధిలో వందల సంఖ్యలో నౌకలు, విమానాలు ఆనవాలు లేకుండా మాయమైపోయాయి, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు?. నిజంగానే ఇది సైన్స్ ఇంకా పూర్తిగా చేదించలేని ఒక మిస్టరీనా లేక మానవ మేదస్సుకు అందని రహస్యమా తదితర విశేషాల గురించి ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి. (చదవండి: ఐఐటీ నేపథ్యం కాదు..కానీ ఏకంగా యూఎస్ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం)
ఈ ఆదివారం పసందైన వంటకాలు ట్రై చేయండిలా..!
మూలీ పరాఠాకావలసినవి: ముల్లంగి తురుము: 2 కప్పులు, గోధుమ పిండి: 3 కప్పులు, పచ్చిమిర్చి తరుగు: టీస్పూన్, అల్లం తురుము: టీస్పూన్, కారం: 1/2 స్పూన్, వాము: 1/2 స్పూన్, జీలకర్ర పొడి: 1/2 స్పూన్, గరం మసాలా: పావు చెంచా, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా, నెయ్యి లేదా నూనె: పరాఠాలు కాల్చడానికి.తయారీ: ముల్లంగి తురుములో కొద్దిగా ఉప్పు కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఉప్పు వేయడం వల్ల ముల్లంగిలోని నీరంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత ఒక కాటన్ బట్టలో లేదా చేతులతో ముల్లంగి తురుమును గట్టిగా పిండి, నీటిని పూర్తిగా వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, ఒక చెంచా నూనె వేసి, ముల్లంగి తురుమును పిండగా వచ్చిన నీటిని ఉపయోగించి చపాతీ ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత నీరు తీసేసిన ముల్లంగి తురుములోకి పచ్చిమిర్చి, అల్లం తురుము, వాము, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని చిన్న పూరీలా ఒత్తి, దాని మధ్యలో రెండు చెంచాల ముల్లంగి మిశ్రమాన్ని ఉంచాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న పిండిని పైకి తెచ్చి స్టఫింగ్ను పూర్తిగా క్లోజ్ చేయాలి. ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా తయారుచేసుకున్న వాటిని పెనంపై వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. కాల్చేటప్పుడు నెయ్యి లేదా నూనె రాస్తే పరాఠాలు రుచిగా వస్తాయి.స్టఫ్డ్ డేట్స్ కావలసినవి: ఖర్జూరాలు: 15–20, బాదం పప్పులు: 10, జీడిపప్పు: 10, పిస్తా పప్పులు: స్పూన్ (సన్నని తరుగు), పీనట్ బటర్ లేదా ఆల్మండ్ బటర్: 4 స్పూన్లు, డార్క్ చాక్లెట్: 1/2 కప్పు, సీ సాల్ట్ : ఒక చిటికెడు, (టేస్ట్ పెంచడానికి)తయారీ: ముందుగా ఖర్జూరాలను తడి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు ప్రతి ఖర్జూరాన్ని ఒక వైపు మాత్రమే చాకుతో నిలువుగా కట్ చేసి, లోపల ఉన్న గింజను జాగ్రత్తగా తీసేయాలి. ఖర్జూరం రెండు ముక్కలుగా విడిపోకుండా కేవలం మధ్యలో పాకెట్ లాగా ఓపెన్ అవ్వాలి. ఒక చిన్న పాన్లో నూనె లేదా నెయ్యి లేకుండా బాదం, జీడిపప్పులను లో–ఫ్లేమ్పై దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గింజ తీసేసిన ప్రతి ఖర్జూరం మధ్యలో పావు చెంచా పీనట్ బటర్ను నింపాలి. ఆ తర్వాత దానిపై ఒక వేయించిన బాదం పప్పు, ఒక జీడిపప్పు ముక్కను గట్టిగా నొక్కి పెట్టాలి. చివరగా పైభాగంలో సన్నగా తరిగిన పిస్తా ముక్కలు, ఒక చిటికెడు సీ సాల్ట్ చల్లాలి. చివరిగా ఈ స్టఫింగ్ చేసిన ఖర్జూరాలను కరిగించిన డార్క్ చాక్లెట్లో ముంచి, ఒక ప్లేట్లో పెట్టి 15 నిమిషాల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. చాక్లెట్ గట్టిపడిన తర్వాత ఇది హోమ్మేడ్ క్యాండీ బార్ లాగా మారుతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో దాచుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి.కుర్కురీ భేండికావలసినవి: శెనగపిండి: 4 స్పూన్లు, వరిపిండి: 2 చెంచాలు, కారం: స్పూన్, పసుపు: పావు చెంచా, ధనియాల పొడి: స్పూన్, జీలకర్ర పొడి: 1/2 స్పూన్, నిమ్మరసం: స్పూన్, వాము: 1/2 స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: డీప్ ఫ్రైకి తగినంత.తయారీ: ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, పొడి కాటన్ బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు వాటికి ఇరువైపులా తొడిమలు తీసేసి, నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని, ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, వాము వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో శెనగపిండి, వరిపిండి చల్లి చేతులతో కలుపుతూ పిండిని బెండకాయ ముక్కలకు బాగా పట్టించాలి. బెండకాయలో ఉండే సహజమైన తేమ వల్ల పిండి ముక్కలకు అంటుకుంటుంది. ఇపుడు బాండీలో నూనె పోసి బాగా కాగాక, సిద్ధం చేసుకున్న బెండకాయ ముక్కలను విడివిడిగా వేస్తూ, మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. బెండకాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి, కరకరలాడే వరకు వేయించి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే వేడివేడి కుర్కురి భేండి సిద్ధం. ఈ ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా చల్లుకుని, కొన్ని చుక్కల నిమ్మరసం పిండుకుని తింటే రుచి అమోఘంగా ఉంటుంది.(చదవండి: 'వాకింగ్'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..!)
'వాకింగ్'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..! కానీ హారన్ కొట్టారో..
నగరాల్లో వాకింగ్ వెళ్లాలంటే విసుగొచ్చేస్తుంది. కొద్ది దూరం నడిచేటప్పటికే అలసట, చికాకు అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే రద్దీగా ఉండే రహదారులు, వీధులు, ఓ పక్క హారన్ మోతలలో హోరెత్తిపోతుంది. కాబట్టి హాయిగా నడవడం చాలా కష్టం. ఏ పార్క్ లేదా చక్కటి ఉద్యానవనం లాంటి ప్రదేశాల్లోనే ప్రశాంతంగా వాకింగ్ చేయగలం అంతే. కానీ భారత్లోనే ఓ నగరం వాకింగ్ అత్యంత అనుకూలమైంది. అక్కడ నడిస్తే ఎంత హాయిగా అనిపిస్తుందంటే..అలసట కూడా తెలియదు. మన దేశంలో ఎక్కడుందంటే ఆ నగరం..పట్టణ ప్రాంతాలు ఎల్లప్పుడూ వాకింగ్కి అనుకూలంగా ఉండవనేది తెలిసిందే. భారత్లో ప్రతిచోటా ట్రాఫిక్, మరోవైపు ఫుట్పాత్లపై కూడా ద్విచక్రవాహనాలు దర్శనం ఇవ్వడంతో..నడకకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలే లేని ప్రశాంతమైన నగరం భారత్లో ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ట్రావెల్ వ్లాగర్ తాన్య ఖనిజో ఆ నగరం గురించి నెటింట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చంది. ఆమె తన వీడియోకి ‘భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం’ అనే క్యాప్షన్ జోడించి మరి ఆ నగరం విశేషాల గురించి వీడియోలో వివరించారు. అది ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంత రాష్ట్రమైన సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ అని పేర్కొంది. తాన్యా పోస్ట్లో తన అభిప్రాయంలో, భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం ఇదే అని రాశారు. ఈ గ్యాంగ్టక్ భారతదేశంలోని పట్టణ నగరాలలో ప్రత్యేకంగా నిలిచే, పాదచారులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానం. నగరంలోని ఎత్తైన నడక మార్గాలు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటి వరకు వెళ్లిన నగరాలలో నడవడానికి అనుకూలమైన నగరం ఇదే. ఇక్కడ ట్రాఫిక్కు అంతరాయం కలిగించని, అంతరాయం లేని ఎత్తైన ఫుట్పాత్లు చాలానే ఉన్నాయన్నారు. నడుస్తున్నప్పుడు ఎంతో హాయిగా సురక్షితంగా ఉంటుందన్నారు. ఒకవేళ హారన్ కొట్టారో ఏకంగా రూ. 1000 జరిమానా పడుతుందని తెలిపింది. అందువల్ల ఈ నగరం ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని వెల్లడించింది. ఈ నగరం ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన సుదీర్ఘ నడకలను ప్రోత్సహిస్తుందని, అందువల్లే తాను తెలియకుండానే అరగంటపైనే నడిచానని సంబరంగా చెప్పింది. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఇబ్బందికరమైన చూపులు లేదా వేధింపులకు గురికాకపోవడం వల్ల సురక్షితంగా భావిస్తారని పేర్కొంది. మహిళలు సోలాగా వాక్ చేయాలనుకుంటే ఈ నగరమే అత్యంత అనుకూలమైందని అంటోంది. చివరగా వ్లాగర్ తాన్య నడవడానికి అనువైన ప్రాంతాల విషయంలో ఇంతటి ఉన్నత ప్రమాణాలు, మహిళల ప్రదేశాలకు ఇచ్చే గౌరవం, సామాన్య ప్రజల అవసరాలపై అవగాహన తదితరాలను చూసి ఆశ్చర్యంగా అనిపిస్తోందని అంటోంది. నగరాలన్ని ఇలానే ఉంటే బాగుండును అంటూ తన వీడియోని ముగించింది. నెటిజన్లు కూడా నగరాన్ని అందరికీ నివాసయోగ్యంగా మార్చడానికి గ్యాంగ్టక్ చూపిస్తున్న నిబద్ధతను ప్రశంసించగా, మరికొందరు ప్లీజ్ దీని గురించి మరి ఎక్కువగా ప్రచారం చేయకండి, లేదంటే ప్రజలంతా తండొపతండాలుగా వచ్చి ఆ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కూడా పాడుచేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Tanya Khanijow (@tanyakhanijow) (చదవండి: ఐఐటీ నేపథ్యం కాదు..కానీ ఏకంగా యూఎస్ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం)
ముఖవర్చస్సు కోసం..!
వయసు పైబడే కొద్దీ ముఖంపై మార్పులు రావడం సహజం. ముఖ్యంగా కళ్ల కింద వాపులు, పెదవుల చుట్టూ వచ్చే ముడతలు చాలా మందిని వేధించే ప్రధాన సమస్య. ఈ వృద్ధాప్య ఛాయలను తొలగించి, ముఖాన్ని మళ్లీ యవ్వనవంతంగా మార్చేందుకు బ్యూటీ రంగంలో సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అదే మైక్రోకరెంట్ లైన్–స్మూతింగ్ టెక్నాలజీతో పనిచేసే ‘బేర్ 2 ఐస్ అండ్ లిప్స్’ డివైజ్. ఈ సరికొత్త హ్యాండ్హెల్డ్ డివైజ్ ఇప్పుడు సౌందర్య ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఫేస్లో అత్యంత సున్నితంగా ఉండే కళ్ల చుట్టూ ఉన్న చర్మం, పెదవుల రక్షణే ధ్యేయంగా ఈ పరికరం పనిచేస్తుంది. కేవలం చర్మం పైపైన మాత్రమే కాకుండా, లోపలి కండరాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ డివైజ్ నుంచి వెలువడే అత్యల్ప విద్యుత్ ప్రవాహం చర్మంలో కొలాజెన్, ఎలాస్టిన్ అనే ప్రొటీన్ల ఉత్పత్తిని వేగవంతం చేసి, చర్మానికి మంచి బిగుతును అందిస్తుంది. ముఖంలో రక్త ప్రసరణను పెంచి, చర్మ కణాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. ముఖంలో పేరుకుపోయిన అదనపు నీరు, వ్యర్థాలను తొలగించి, కళ్ల కింద వచ్చిన వాపును తక్షణమే తగ్గేలా చేస్తుంది.పచ్చరాయితో ఫేస్ రోలర్!చైనా రాజకుటుంబీకులు తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి సహజ సిద్ధంగా లభించే జేడ్ రత్నాలతో తయారు చేసిన రోలర్స్తో మసాజ్ చేసుకునేవారు. ముఖంపై ముడతలు తగ్గించడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఉపయోగించే ఈ రోలర్ వెనుక సుమారుగా 1300 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ జేడ్ రోలర్లు అప్పట్లో కేవలం రాణులు, ఉన్నత వర్గాల మహిళలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. చైనాను సుదీర్ఘకాలం పాలించిన ప్రసిద్ధ మహారాణి సిక్సీ ప్రతిరోజూ ఈ జేడ్ రోలర్ను ఉపయోగించేది. జేడ్ రత్నానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, ఇది ఎల్లప్పుడూ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనం ముఖంలోని రక్తనాళాలను సంకోచింపజేసి, చర్మంపై వచ్చే ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ ముఖంపై మసాజ్ చేయడం వల్ల ముఖ కండరాలు దృఢపడి, కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, ముడతలు తగ్గుతాయి.వర్షంలో తడుస్తున్నారా? వర్షాకాలంలో తలలో జిడ్డు, మురికి త్వరగా పేరుకుపోతాయి. అందువల్ల జుట్టు తత్వానికి సరిపోయే మైల్డ్ షాంపూతో క్రమం తప్పకుండా తలస్నానం చేయాలి. అలాగే వర్షంలో తడవడం సరదాగా అనిపించినా, వాన నీటిలోని ఆమ్లాలు, కాలుష్య కారకాలు జుట్టును దెబ్బతీస్తాయి. ఒకవేళ అనుకోకుండా వానలో తడిస్తే, వెంటనే మంచినీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్కోట్ తప్పనిసరిగా వాడాలి. ఈ సీజన్లో జుట్టును స్ట్రెయిటెనింగ్ చేయడం కోసం హీటింగ్ టూల్స్ ఉపయోగించడం వల్ల్ల జుట్టు మరింత బలహీనపడి తెగిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కేవలం పైపూతలే కాకుండా, పోషకాహారం కూడా ముఖ్యమే!(చదవండి: ధగ ధగ మెరిసే ఆభరణాలు లేకుండానే..పెళ్లికూతురు రూపం!)
అంతర్జాతీయం
ట్రంప్ ‘ట్రంప్కార్డ్’ ఇక లేరు.. గ్రాహం మృతిపై అనుమానాల కలకలం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఉన్న సెనేటర్ లిండ్సే గ్రాహం (71) ఇక లేరు. ఆకస్మిక అనారోగ్యంతో ఆయన శనివారం కన్నుమూశారు. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.గ్రాహం కార్యాలయం తొలుత దీనిని ‘‘ఆకస్మిక అనారోగ్యం’’గా పేర్కొంది. అయితే వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక.. మరణంపై మరో ప్రకటన చేసింది. గుండెకు అనుసంధానమైన ప్రధాన ధమని ఏఓర్టాలో చీలిక (aortic dissection) కారణంగానే ఆయన కన్నుమూసినట్లు తెలిపింది. తన సన్నిహితుడు గ్రాహం మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత నమ్మకమైన మిత్రుల్లో ఒకరిని కోల్పోయానని పేర్కొన్నారు.‘‘లిండ్సే గ్రాహం గొప్ప వ్యక్తి, గొప్ప సెనేటర్. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు. నిజమైన అమెరికన్ దేశభక్తుడు’’ అంటూ ట్రంప్ నివాళులర్పించారు. మరణానికి ముందు రోజు రాత్రి కూడా గ్రాహం తనతో మాట్లాడారని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ పర్యటన గురించి వివరించారని, సుదీర్ఘ ప్రయాణం కారణంగా అలసిపోయినట్లు చెప్పారని వెల్లడించారు.భారత్పై ద్వేషం.. అంతర్జాతీయ రాజకీయాల్లో గ్రాహం పేరు ఇటీవల భారత్ విషయంలో ఎక్కువగా వినిపించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ సహా ఆ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. ‘‘రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఊతమిస్తే.. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది’’ అంటూ గతంలో గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్కు కీలక వారధిలిండ్సే గ్రాహం అమెరికా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ప్రభావం చూపిన నేత. 2002లో సెనేట్కు ఎన్నికైన ఆయన.. రక్షణ, విదేశాంగ విధానాల్లో రిపబ్లికన్ పార్టీకి కీలక స్వరంగా ఎదిగారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో విమర్శకుడిగా ఉన్నప్పటికీ.. తర్వాత ఆయనకు అత్యంత సన్నిహిత మద్దతుదారుల్లో ఒకరిగా మారారు. ట్రంప్ ‘‘అమెరికా ఫస్ట్’’ విధానానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం కొనసాగాలని గ్రాహం బలంగా నమ్మేవారు.ట్రంప్ శిబిరానికి భారీ లోటులిండ్సే గ్రాహం మరణం ట్రంప్ రాజకీయ శిబిరానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. సెనేట్లో ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలిచే కీలక గొంతుకల్లో ఒకటి ఇప్పుడు లేకుండా పోయింది. ఉక్రెయిన్ పర్యటన తర్వాతే మృతి.. అనుమానాల కలకలంమరణానికి ముందు రోజు గ్రాహం ఉక్రెయిన్లో పర్యటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సమావేశమై.. రష్యాపై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్కు మద్దతు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన మరణంపై కొన్ని MAGA వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా లేదంటే ఇరాన్ ప్రమేయం ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. మరికొందరు.. ఉక్రెయిన్ పర్యటన, రష్యాపై ఆంక్షల పిలుపు, గతంలో వచ్చిన బెదిరింపులను ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అధికారులు కూడా ఎలాంటి కుట్ర కోణాన్ని నిర్ధారించలేదు. గ్రాహం కుటుంబంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉందని కూడా సమాచారం.ఇరాన్పై కఠిన వైఖరి.. ఇజ్రాయెల్కు మద్దతుగ్రాహం ఇరాన్ విషయంలో కూడా కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైనిక చర్యలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్కు ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనపై మధ్యప్రాచ్యంలో విమర్శలు కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. గ్రాహంను ‘‘ఇజ్రాయెల్కు గొప్ప మిత్రుడు’’గా అభివర్ణించారు.ఇక గ్రాహం స్థానంలో ఎవరు?గ్రాహం మృతితో దక్షిణ కరోలినా సెనేట్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతానికి ఆయన స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసే అధికారం రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్మాస్టర్కు ఉంది. ఆయన తాత్కాలిక సెనేటర్ను నియమించనున్నారు. ఈ రేసులో నాన్సీ మేస్ (Nancy Mace)(దక్షిణ కరోలినా ప్రతినిధుల సభ సభ్యురాలు), రిపబ్లికన్ హౌస్ సభ్యుడు రస్సెల్ ఫ్రై (Russell Fry), లెఫ్టినెంట్ గవర్నర్పామెలా ఎవెట్ (Pamela Evette).. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇది తాత్కాలిక నియామకం మాత్రమే. గ్రాహం ఈ ఏడాది తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నందున.. ప్రత్యేక రిపబ్లికన్ ప్రైమరీ నిర్వహించి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ సాధారణ ఎన్నికల్లో తుది పోటీ జరుగుతుంది.
మెక్సికో రోడ్డు ప్రమాదం: తొమ్మిది మంది మృతి, పది మందికి గాయాలు
జలిస్కో: మెక్సికోలోని జలిస్కో రాష్ట్ర హైవేపై ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్లు సహా తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వాడలజారా, టెపిక్ నగరాలను అనుసంధానించే జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఒక ట్రాక్టర్-ట్రైలర్ నియంత్రణ కోల్పోయి పలు వాహనాలను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 🚨🚒 Choque múltiple en la autopista Guadalajara–Tepic dejó un saldo preliminar de 16 muertos y 6 heridos, luego de que un tráiler embistiera a trabajadores de mantenimiento. La circulación hacia Nayarit permanece cerrada; el operador fue retenido. pic.twitter.com/cUqHqvZAqu— LuisCardenasMX (@LuisCardenasMx) July 12, 2026ప్రమాదం వెంటనే పలు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, హైవే అంతటా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ప్రమాద తీవ్రతకు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. క్షతగాత్రులలో నలుగురు అమెరికా పౌరులతో పాటు ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బంది కూడా ఉన్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన నేషనల్ గార్డ్ సభ్యులను గ్వాడలజారాలోని మాగ్డలీనా ఆసుపత్రికి తరలించారు.🚨 Trágico accidente en la autopista Guadalajara–Tepic. Un tractocamión embistió a trabajadores de mantenimiento cerca de la caseta Plan de Barrancas. El saldo preliminar es de 10 muertos, 6 heridos, 3 desaparecidos y 8 vehículos involucrados. pic.twitter.com/PWQSdc7GDo— LuisCardenasMX (@LuisCardenasMx) July 12, 2026ఈ ప్రమాదంపై జలిస్కో సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్వల్పంగా గాయపడిన నలుగురు అమెరికా పౌరులను ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా గ్వాడలజారాలోని అర్బోలెడాస్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది. స్థానిక రెస్క్యూ టీమ్స్, అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
వియత్నాం విషాదం: హైదరాబాద్ చేరుకున్న బాధితులు
న్యూఢిల్లీ: వియత్నాంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయుల మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరనున్నాయి. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు పర్యాటకులు ఆదివారం రాత్రి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్) చేరుకున్నారు. కాగా హోచి మిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్లైన్స్ (VN979) విమానంలో 15 మంది భారతీయుల మృతదేహాలను ముంబయికి తరలిస్తున్నట్లు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరే ఈ విమానం.. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:35 గంటలకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా వెల్లడించింది.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాయబార కార్యాలయం వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. ముంబయి చేరుకున్న తర్వాత మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు వీలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించామని, బాధిత కుటుంబాలతో సమన్వయం చేసుకోవాలని కోరినట్లు పేర్కొంది. మృతుల్లో 10 మంది తమిళనాడుకు చెందినవారు కాగా.. ముగ్గురు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు కేరళ వాసులు ఉన్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.వియత్నాం పత్రిక 'విఎన్ ఎక్స్ప్రెస్' కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఫు క్వాక్ ద్వీపకల్పం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ‘ఓషన్ పెర్ల్ ఐలాండ్’ సంస్థకు చెందిన ఓ స్పీడ్బోట్ 36 మంది ప్రయాణికులతో ‘హాన్ మే రట్’ దీవి నుంచి ‘అన్ థోయ్’ రేవుకు వెళ్తుండగా ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
కాఠ్మాండు రణరంగం: అటు వరద ముంపు.. ఇటు అణచివేత!
కాఠ్మాండు: నిలువ నీడ లేని నిరుపేదలను పునరావాసం కల్పించకుండానే బలవంతంగా వారిన ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారని, సామాజిక కార్యకర్తలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నేపాల్లో వందలాది మంది యువతీ యువకులు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. కాఠ్మాండులో నివాసాల ఖాళీ ప్రక్రియను నిరసిస్తూ, బాధిత నిరుపేదలకు న్యాయం చేయాలని, గృహ హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కార్యాలయం వెలుపల భారీ ఎత్తున బైఠాయించారు.‘జాయింట్ నేషనల్ స్క్వాటర్స్ ఫ్రంట్’ ఆధ్వర్యంలో కాఠ్మాండులోని సింహదర్బార్ సెక్రటేరియట్ సమీపంలో ఉన్న మైతీఘర్ మండలా వద్ద ఈ నిరసన ప్రదర్శన జరిగింది. పేద కుటుంబాలను వేధించడం ఆపాలని, మానవ హక్కులను గౌరవించాలని, అక్రమ అరెస్టులను నిలిపివేయాలని, నిరాశ్రయులైన నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించాలని నిరసనకారులు ప్లకార్డులతో డిమాండ్ చేశారు.పోలీసుల చర్యలతో పెరిగిన ఉద్రిక్తతలుశుక్రవారం రాత్రి కాఠ్మాండులోని కీర్తీపూర్ లో ఉన్న ఒక ప్రభుత్వ తాత్కాలిక పునరావాస కేంద్రం వరద ముంపునకు గురైంది. అక్కడ సుమారు 150 మంది నిరుపేదలు ఆశ్రయం పొందుతున్నారు. భద్రతా సిబ్బంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ, మరుసటి రోజు పరిస్థితిని సమీక్షించడానికి వెళ్లిన ‘జెన్ జీ’యువ సామాజిక కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, పలువురిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ లాఠీఛార్జ్లో ఒక నిరసనకారుడి ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించారు.పోలీసుల చర్యలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ కుమార్ థాపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను ఖండిస్తూ, అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆదివారం నాడు కోశి ప్రాంతంలోని మోరంగ్ జిల్లా పోలీసు కార్యాలయం వెలుపల శాంతియుతంగా నిరసన తెలుపుతున్న 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివాదానికి ప్రధాన కారణం ఇదే..ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన నివాసాల ఖాళీ ప్రక్రియే ప్రస్తుత వివాదానికి కారణం. ఏప్రిల్ నెలలో కాఠ్మాండు లోయతో పాటు నేపాల్లోని ఇతర ప్రాంతాలలో ఉన్న పేదల బస్తీలను అధికారులు ఖాళీ చేయించారు. దీనివల్ల సుమారు 2,600 కుటుంబాలకు చెందిన 15,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో వందలాది మందిని తాత్కాలిక కేంద్రాలకు తరలించిన ప్రభుత్వం, జూలై 6 లోగా వాటిని కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. అయితే, శాశ్వత పునరావాస ప్రణాళిక ఏదీ లేకపోవడంతో డజన్ల కొద్దీ కుటుంబాలు ఇప్పటికీ ఆ తాత్కాలిక కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి.
జాతీయం
ఏసీ కోచ్లలో దుప్పట్లు, ఫేస్ షీట్ల చోరీ : 4 ఏళ్లలో రూ. 104 కోట్లు
భారతీయ రైల్వేలోని ఎయిర్ కండిషన్డ్ (AC) కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులు జనవరి 2022 మరియు మే 2026 మధ్య కాలంలో ఏకంగా 1.27 కోట్లకు పైగా దుప్పట్లు, తువ్వాళ్లు (బెడ్రోల్ వస్తువులను) దొంగిలించినట్లు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' చేసిన దర్యాప్తులో వెల్లడైంది. దీనివల్ల లినెన్ కాంట్రాక్టర్లకు రూ. 104 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.దేశంలోని 18 రైల్వే జోన్లలో 16 జోన్ల పరిధిలోని 54 రైల్వే డివిజన్ల నుండి సేకరించిన ఆర్టీఐ సమాధానాల ప్రకారం.. 2022 -2025 మధ్య కాలంలో లినెన్ వస్తువుల దొంగతనాలు 56 శాతం పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన బెడ్రోల్ సేవలను జనవరి 2022లో పూర్తిగా పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహుతో పాటు 13 మంది టార్గెట్? ఇరాన్ రివెంజ్ లిస్ట్ కలకలం సాధారణంగా ఏసీ కోచ్లలో ప్రయాణించే వారికి రెండు బెడ్షీట్లు, ఒక బ్లాంకెట్ (కంబళి), ఒక దిండు, దిండు కవర్ ఒక ఫేస్ టవల్ (ముఖం తుడుచుకునే తువ్వాలు) ఉన్న బెడ్రోల్ కిట్ను అందిస్తారు. దొంగిలించబడిన వస్తువుల సంఖ్యను లెక్కగడితే.. ప్రతి 1,000 మంది ప్రయాణికులలో ఒకరు ఒక వస్తువును దొంగిలించినట్లు అవుతుంది. అయితే, నాలుగేళ్ల కాలంలో దొంగిలించబడిన వస్తువులలో ఫేస్ టవల్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ మొత్తం నష్టం రైల్వే అధికారులకు, కాంట్రాక్టర్లకు పెద్ద ఆందోళనగా మారింది. బడాబాబులు కొట్టేసిన వస్తువుల వివరాలు: ఫేస్ టవల్స్: 46.54 లక్షలుబెడ్షీట్లు: 41.13 లక్షలుదిండు కవర్లు: 23.59 లక్షలుబ్లాంకెట్లు (కంబళ్లు): 12.95 లక్షలుదిండ్లు: 2.76 లక్షలు (ఇవి పరిమాణంలో పెద్దవిగా ఉండటం వల్ల తక్కువగా దొంగిలించబడ్డాయి).ఎక్కువగా దొంగతనాలు జరిగిన ప్రాంతాలు:ఆర్టీఐ నివేదిక ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చాలా ఎక్కువగా జరిగాయి:బికనీర్: 25.76 లక్షల వస్తువులతో అగ్రస్థానంలో ఉంది.రాంచీ: 9.31 లక్షలుఢిల్లీ: 8.21 లక్షలుముంబై: 8.17 లక్షలుజోధ్పూర్: 8.09 లక్షలుఅహ్మదాబాద్: 6.94 లక్షలుఈ భారం ఎవరికి?కోచ్ల లోపల లినెన్ వస్తువుల సంరక్షణ బాధ్యత అంతా బెడ్రోల్స్ పంపిణీ చేసే కాంట్రాక్ట్ ఏజెన్సీదేనని రైల్వే ప్రతినిధి తెలిపారు. వస్తువులు కనిపించకుండా పోతే, వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే ఆర్థిక భారం పూర్తిగా కాంట్రాక్టరే భరించాల్సి ఉంటుంది. ఈ నిరంతర దొంగతనాల వల్ల తలెత్తే కొరతను అధిగమించడానికి అదనపు లినెన్ సెట్లను ఏర్పాటు చేయడం కాంట్రాక్టర్లకు పెద్ద సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?
సరస్సులు మాయం, రిజర్వాయర్లు ఖాళీ
దేశంలోని ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై వంటి ప్రధాన నగరాలు భారీ వర్షాలతో జలమయమై, వరదలతో అతలాకుతలమవుతుంటే, దేశ ఐటీ రాజధాని బెంగళూరు మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. తీవ్రమైన వర్షపాత లేమి, కరవు కోరల్లో చిక్కుకున్న ఈ మెట్రో నగరం భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక జలాశయాలు ఎండిపోవడంతో, కోట్లాది మంది జనాభా ఉన్న ఈ సిలికాన్ వ్యాలీ కేవలం ఒక్క కావేరి నదిపైనే ఆధారపడాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అసలు బెంగళూరును వేధిస్తున్న ఈ నీటి సంక్షోభం వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.పడిపోతున్న వర్షపాతం.. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. జూన్ 1 నుండి జూలై 9 మధ్య కాలంలో బెంగళూరు నగరంలో ఏకంగా 35 శాతం వర్షపాత లోటు నమోదైంది. అలాగే కర్ణాటక దక్షిణ అంతర్గత ప్రాంతంలో కూడా 24 శాతం తక్కువ వర్షపాతం రికార్డయ్యింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు ముంచెత్తుతున్నా, బెంగళూరులో మాత్రం ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.మూడు నెలలకే నీళ్లు.. అధికారుల లెక్కలివేనగరంలో వర్షాలు లేకపోయినా, బెంగళూరు జలమండలి మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. ప్రస్తుతం నగరానికి రాబోయే మూడు నుండి నాలుగు నెలల వరకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని భరోసా ఇస్తోంది. అయితే, అంతర్గతంగా భూగర్భ జలాలు భారీగా పడిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో అప్పుడే తీవ్రమైన నీటి ఎద్దడి మొదలైన విషయాన్ని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.600 మీటర్ల లిఫ్టింగ్.. బెంగళూరు నగరానికి అసలు నీరు ఎక్కడి నుండి వస్తుందనేది ఒక పెద్ద ఇంజనీరింగ్ అద్భుతం. నగరం సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో ఉంది. కావేరి నది నుండి తోరకదానహళ్లి పంపింగ్ స్టేషన్ ద్వారా నీటిని సేకరించి, దాదాపు 500 నుండి 600 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి పైప్లైన్ల ద్వారా నగరానికి తరలిస్తారు. ఇది దేశంలోనే అత్యంత ఎక్కువ విద్యుత్, వ్యయంతో కూడిన నీటి సరఫరా వ్యవస్థగా నిలిచింది.ప్రధాన సరస్సులు ఖాళీ.. ఒకప్పుడు బెంగళూరు దాహాన్ని తీర్చిన అర్కావతి నదిపై నిర్మించిన చారిత్రక హెసరఘట్ట సరస్సు, తిప్పగొండనహళ్లి జలాశయాలు ఇప్పుడు మూలనపడ్డాయి. విపరీతమైన పట్టణీకరణ, అక్రమ ఆక్రమణలు, కాలుష్యం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ జలాశయాలకు నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల స్థానిక వనరులు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి.సాగు నీటికే పరిమితమైన మంచనబేలె డ్యామ్బెంగళూరుకు సమీపంలో, సుమారు 40 కిలోమీటర్ల దూరంలో అర్కావతి నదిపైనే ఉన్న మరొక రిజర్వాయర్ ‘మంచనబేలె’. అయితే, ఇది కేవలం నగరానికి ఒక అనుబంధ వనరుగా మాత్రమే ఉంది. దీనిలోని నీటిని తాగునీటి అవసరాల కంటే ఎక్కువగా చుట్టుపక్కల ప్రాంతాల వ్యవసాయ సాగు అవసరాల కోసమే ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. దీంతో తాగునీటి కోసం కావేరి వైపు చూడక తప్పడం లేదు.రోజుకు 1500 మిలియన్ లీటర్లుబెంగళూరు జలమండలి లెక్కల ప్రకారం.. నగరంలోని సుమారు 1.4 నుండి 1.5 కోట్ల మంది ప్రజల కోసం ప్రతిరోజూ 1,450 నుండి 1,500 మిలియన్ లీటర్ల శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ పంపిణీ నగరం మొత్తం సమానంగా లేదు. వారు నివసించే ప్రాంతాన్ని బట్టి నీటి లభ్యత మారుతోంది. ముంబై లాంటి నగరాలకు స్థానిక రిజర్వాయర్లు ఉన్నట్లు బెంగళూరుకు లేకపోవడమే ఇక్కడి అసలు సమస్య. కావేరి బేసిన్లో వర్షాలు పడితేనే ఐటీ రాజధాని గొంతు తడుస్తుంది.. లేదంటే ప్రమాద ఘంటికలు తప్పవు!ఇది కూడా చదవండి: 14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్!
ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం
సాక్షి ముంబై: ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పండరీపూర్కు వెళ్లే భక్తుల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పించింది. దీంతో ఉత్సవాలకు రాకపోకలు సాగించే భక్తులకు ఎంతో ఊరట లభించింది. ఈ సౌకర్యం సొంత వాహనాల్లో వెళ్లే భక్తులతోపాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, అద్దె కార్లు, ఇతర పికప్ వాహనాలు సహా గ్రూపు బుకింగ్ చేసుకున్న మహరాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ (ఎమ్మెస్సార్టీసీ) బస్సులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందు నుంచి ముగిసేవరకూ.. ఈ నెల 25న పండరీపూర్లో ఆషాఢ ఏకాదశి (Ashadi Ekadashi) ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి భక్తులు పల్లకీలతో సహా కాలినడకన పక్షం రోజుల ముందే పండరీపూర్కు బయలుదేరతారు. ఏకాదశికి ముందు లేదా అదేరోజున అక్కడికి చేరుకుంటారు. కొందరు భక్తులు సొంత వాహనాల్లో మరికొందరు అద్దె వాహనాల్లో వస్తారు. దీంతో పండరీపూర్ సుమారు వారం రోజులపాటు భక్తులతో కిటకిటలాడుతుంది. ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముగిసేవరకు అంటే ఈ నెల 29 వరకు అన్ని రకాల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాస్ ఇలా పొందాలి... అయితే ఈ సౌకర్యాన్ని పొందాలనుకునేవారు కొ న్ని నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్ప ష్టం చేసింది. పండరీపూర్ వెళ్లే వాహనాలు ‘ఆషాఢి ఏకాదశి–2026’ అనే స్టిక్కర్ లేదా పాస్ కోసం ముందుగా స్ధానిక పోలీసు స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాఫిక్ ఫోలీసు శాఖ లేదా ప్రాంతీయ రవాణా కార్యాలయం అనమతి పొందాలి. ఈ స్టిక్కర్ లేదా పాస్ను వాహనం విండ్ షీల్డ్ (అద్దం ముందు భాగం) పై అతికించాలి. గ్రూపు బుకింగ్ చేసుకునే బస్సులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అప్పుడే టోల్ నాకాల మీదుగా ఉచితంగా ఒకసారి వెళ్లి , తిరిగి రావడానికి (వన్ టైం) వీలుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.చదవండి: బీజేపీ నాయకులపై రాజ్ఠాక్రే ధ్వజంఅన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి ఇదిలాఉండగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షం (Mumbai Rains) కారణంగా అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్సవాలకు ముందే మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వాహనాల్లో వెళ్లే వారితోపాటు పల్లకీలతో కాలిబాటన వెళ్లే భక్తులు మార్గమధ్యంలో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలని సూచించింది. వాహనాలను క్రమబద్దీకరించేందుకు మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులను నియమించాలని, రోడ్డు ప్రమాదానికి గురైన, రిపేర్లతో ఆగిపోయిన వాహనాలను తరలించేందుకు టోవింగ్ వ్యాన్లు అందుబాటులో ఉంచాలని స్ధానిక పోలీసు స్టేషన్లకు సూచించింది.
రౌడీషీటర్ బర్త్డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి
బెంగళూరు: తమిళనాడులోని బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ దాసా అలియాస్ ‘కింగ్ మేకర్ దాసా’ పుట్టినరోజు వేడుకల్లో యలహంక బీజేపీ శాసనసభ్యుడు ఎస్ఆర్ విశ్వనాథ్ పాల్గొనడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. నెలకుంట్ల పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.ఈ వీడియోలో రౌడీషీటర్ దాసా కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే విశ్వనాథ్ ఆయనకు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేతో పాటు పలువురు స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ సంబరాల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ వేడుకల సమయంలో పోలీసులెవ్వరూ అక్కడ లేకపోవడం గమనార్హం.చిక్కజాల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్గా నమోదైన దాసాపై యలహంక, నెలమంగళ, దాసరహళ్లి ప్రాంతాల్లో భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది కూడా దాసా పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఒక బెంగళూరు పోలీసు ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఏడాది ప్రజాప్రతినిధి స్వయంగా రౌడీషీటర్ వేడుకల్లో పాల్గొనడంపై నెటిజన్లు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మాదానాయకనహళ్లి పోలీసులు స్పందిస్తూ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు!
ఎన్ఆర్ఐ
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్బర్గ్లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కెనడాలోని టొరొంటో నగరంలో వైభవంగా వైఎస్సార్ జయంతి వేడుకలు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వర్చువల్గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్బర్గ్లో భారీ కేక్ కట్ చేస్తున్న అభిమానులు ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్త్లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్ త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ అభిమానులు మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వీనర్ భరత్, విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిష్క్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలోని పెర్త్లో వైఎస్సార్ జయంతి వేడుకలు
సీఎం విజయ్ పర్యటనను నియంత్రించజాలం
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట కేసులో నిందితుడిగా లేరని, ఆయన పర్యటనను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం విజయ్ పర్యటనను ప్రశ్నిస్తూ, అలాగే ఈ వ్యవహారంలో మంత్రులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే వేసిన పిటిషన్పై మంగళవారం జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరా«ధేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ముఖ్యమంత్రి పర్యటనను నియంత్రించాలని, ఆయన పర్యటన షెడ్యూల్ను కూడా మేమే ఖరారు చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఇదెలా సాధ్యం?’అని ప్రశ్నించింది.న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దని వ్యాఖ్యానించింది. పిటిషనర్గా ఉన్న డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే ప్రభుత్వంలోని మంత్రులు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అలాంటప్పుడు, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలపై ధిక్కార పిటిషన్ వేయాలని కూడా డీఎంకే ఆలోచిస్తోందన్నారు.ఈ కేసు గురించి సీఎం, మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం..‘అంటే వాక్ స్వాతంత్య్రంపై మేం నిషేధాజ్ఞలు విధించాలని కోరుకుంటున్నారా? వారి మాటలకు మీరు కూడా మాటలతోనే సమాధానం చెప్పండి. ఈ కేసును సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేసింది. అలాంటప్పుడు, ఒక రాజకీయ ప్రత్యర్థి ఈ కేసులో ఒక పక్షంగా చేరాలని ఎలా కోరగలరు?’అని ప్రశ్నించింది. అయితే, సీబీఐ దర్యాప్తు ముగిసే వరకు కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, విచారణను ప్రభావితం చేయరాదన్నది మాత్రమే తమ ఉద్దేశమని రంజిత్ కుమార్ వివరించారు.వాక్ స్వాతంత్య్రాన్ని మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలన్నది డీఎంకే పార్టీ అభిమతమన్నారు. మరలాంటప్పుడు, ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచి్చన విధంగా తొక్కిసలాట బాధితులకు రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి చొప్పున ఉద్యోగం ఇవ్వడం దర్యాప్తును ఎలా ప్రభావితం చేయగలదని ధర్మాసనం లాయర్ రంజిత్ కుమార్ను అడిగింది. పిటిషన్ను ఉపసంహరించుకునే అవకా>శం డీఎంకేకు కల్పిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డు జస్టిస్ అజయ్ రస్తోగి సారథ్యంలోని కమిటీని ఆశ్రయించవచ్చని సూచించింది.
ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర
సాక్షి, అమరావతి : మాట ఇస్తే మడమ తిప్పని నైజం.. కలిసిన ప్రతి ఒక్కరినీ పేరుతో పలకరింపు.. ఇలా ఎన్నో లక్షణాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని జననేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాయని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి కార్తీక్ యల్లాప్రగడ కొనియాడారు. జర్మనీలోని ఇన్గాల్స్ట్యాట్ నగరంలో ఆదివారం వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించి భారీ కేక్ను కట్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్తీక్ మాట్లాడుతూ.. జన సంక్షేమమే ధ్యేయంగా.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం.. ఇవన్నీ కలగలిపిన రూపం మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ ఏపీ అభివృద్ధికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ కూడా తన ఐదేళ్ల పాలనలో తండ్రిని తలపించేలా పాలన అందించారని చెప్పారు. మాజీమంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ సాంబశివారెడ్డి వర్చువల్గా పాల్గొని మాట్లాడారు. జర్మనీ, ఐర్లాండ్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీతో పాటు యూరప్లోని పలు దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని వైఎస్సార్కు నివాళులర్పించారు. వైఎస్ ఆశయాలు, దార్శనికతను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ జర్మనీ కమిటీ అధ్యక్షుడు కృష్ణతేజారెడ్డి గడ్డం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నెదర్లాండ్స్ కన్వీనర్ శరత్రెడ్డి వంగా, ఐర్లాండ్ కన్వీనర్ ఆకేపాటి కిషోర్రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ
ఓ భారత మహిళ అబుదాబిలో జాక్పాట్ కొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 62 కోట్ల లాటరీని గెలుచుకుంది. ఢిల్లీకి చెందిన కనికా అరోరా అనే గృహిణి కొన్న లాటరీ టికెట్కు రూ. 62 కోట్ల ప్రైజ్మనీ వరించింది. అబుదాబి బిగ్ టికెట్ సిరీస్లో భాగంగా ప్రతీనెల లాటరీ టికెట్ కొనే ఆ మహిళకు జూన్ 30వ తేదీన తీసిన లాటరీలో 25 మిలియన్ దిర్హమ్ల భారీ మొత్తం వరించింది. తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవడంతో సదరు మహిళ ఉబ్బితబ్బిబ్బై పోతోంది. సంవత్సరాలుగా ఢిల్లీకి చెందిన ఆమె కుటుంబానికి బిగ్ టికెట్ ఎంట్రీ కొనడం నెలవారీ అలవాటుగా మారింది. గృహిణి అయిన కనికా అరోరా అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 288 డ్రాలో 25 మిలియన్ దిర్హమ్ల (AED) గ్రాండ్ ప్రైజ్ (సుమారు రూ. 62 కోట్లు) గెలుచుకుని, చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నారు.దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా ఆ టికెట్ను కొనుగోలు చేశాం. అబుదాబిలో లాటరీ టికెట్ల కొనుగోలులో ఒక రకమైన ప్రమాదం ఉన్నప్పటికీ, వాటిని మాత్రం ప్రతీనెలా కొంటూనే ఉన్నాం. ఇన్నాళ్లకు మా కల సాకారమైంది. లాటరీలో బహుమతి గెలిస్తే ఆ మొత్తాన్ని ఏం చేయాలో అనే దానిపై నా భర్త, నేను మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు నిజంగా గెలవడంతో ఎక్కడ నుంచి ప్రారంభించాలో కూడా తెలియడం లేదు. ప్రతీ ఒక్కరూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. మన కల ఎలా నిజమౌతుందో చెప్పలేం కదా’ అంటూ ఆనందం వ్యక్తం చేసిదామె.
క్రైమ్
సంతకం చేయి.. లేకపోతే నీ భార్యపై లైంగిక దాడి చేస్తాం..!
వికారాబాదు జిల్లా: కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో బాధితుడిపై దాడి చేసి, అతని భార్యపై లైంగిక దాడిచేస్తామని బెదిరించిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. ఆల్విన్ కాలనీ ఫేజ్–1లో గుంటి వేణుగోపాల్తో పాటు తన సోదరులు శ్రీనివాస్, రవి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 2022లో వీరి తండ్రి నాగభూషణం చనిపోయారు. కొన్ని రోజుల నుండి శ్రీనివాస్, రవి ఇప్పుడుంటున్న 100 గజాల ఇంటి ప్రాపర్టీ విషయమై రిజిస్ట్రేషన్ చేయించుకొని రుణం తీసుకుంటున్నట్లు దీనికి గాను తన తమ్ముడు వేణుగోపాల్ను సంతకం చేయమని కోరారు. దీనికి తాను ఒప్పుకోనని, తనకు రావాల్సిన వాటా చెల్లించిన తర్వాతే ఆస్తి పత్రాలపై సంతకం చేస్తానని వేణుగోపాల్ చెప్పడంతో గొడవ మొదలైంది. ఈ విషయమై శనివారం మధ్యాహ్నం మాట్లాడాలని వేణుగోపాల్ని పిలిచారు. వెళ్లగానే అన్నలు శ్రీనివాస్, రవిలు పిడిగుద్దులు గుద్దుతూ ఆస్తి పత్రాలపై సంతకం చేయాలని వేణుగోపాల్పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో పొత్తికడుపు, ఎడమ కాలి బొటనవేలికి గాయాలయ్యాయి. అంతే కాకుండా అడ్డు వచ్చిన బాధితుడి భార్యను అన్న రవి లైంగికదాడి చేస్తామని అసభ్య పదజాలంతో దూషించి తోసేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒక ఆమ్లెట్.. ఓ కుటుంబంలో పెను విషాదం
శ్రీకాకుళం క్రైమ్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాకేంద్రంలోని ఆదివారంపేటలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మేన్గా పనిచేస్తున్న కోనాడ నాగరాజు పొందూరు మండలం బొడ్డేపల్లికి చెందినషర్మిల(26)ను ఏడాది కిందట వివాహం చేసుకున్నాడు. నాగరాజు తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆదివారంపేటలో ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఆమ్లెట్ వేయనందుకు..! నాగరాజు కాస్త అమాయకుడు కావడంతో అత్త దమయంతితో షర్మిలకు తరచూ తగాదాలొచ్చేవి. ఈ క్రమంలో ఈ నెల 8న షాపులో విధులు ముగించుకుని వచ్చిన భర్తకు భోజనంతో పాటు ఆమ్లెట్ పెట్టింది. పక్కనే తింటున్న చిన్న కుమారుడికి ఆమ్లెట్ పెట్టలేదని అత్త దమయంతి ప్లేట్ విసిరికొట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో భర్త నాగరాజు స్పందించకపోవడంతో శనివారం మరోసారి గొడవపడింది. దీంతో షర్మిల మనస్థాపానికి గురై అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
మేనమామతో పెళ్లి.. నా కూతురికి చుక్కలు చూపించాడు!
ఇచ్ఛాపురం రూరల్: ‘సొంతవాడే కదా.. మా బిడ్డను బంగారంగా చూసుకుంటాడు’ అనే ఆశతో కుమార్తెను మేనమామకు ఇచ్చి వివాహం చేసిన తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన మరడ రుక్మిణమ్మ, దేవేందర్ల కుమార్తె ధనలక్ష్మి(27)ని 2018 ఆగస్టులో ఒడిశా రాష్ట్రం రొంపా బొరడా గ్రామానికి చెందిన నందిక లోకనాథంకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఏడేళ్ల కుమారుడు రక్షిత్ ఉన్నాడు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతుండటంతో ధనలక్ష్మి కన్నవారి గ్రామం ధర్మపురంలో ఉంటోంది. పెద్దలు పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ భర్త వేధింపులు తీవ్రంగా ఉండటంతో మనస్థాపం చెందిన ధనలక్ష్మి శనివారం రాత్రి కన్నవారింట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతదేహం వద్ద రక్షిత్ ‘అమ్మా.. లేవమ్మా.. నాతో మాట్లాడమ్మా..!’ అంటూ అమాయకంగా పిలుస్తూ కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మృతురాలి తల్లి రుక్మిణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ రావులపాలెంలో యువకుడు దారుణ హత్య..
ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు దుండగులచేతిలో హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా, రావులపాలెంలో విషాదకర ఘటన జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు తలను బండరాళ్లతో మోది కిరాతకంగా హత్యచేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి అను సాయి అలియాస్ నల్లసాయిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వీడియోలు
జానీ మాస్టర్ వైఫ్ సుమలతపై లేడీ డాన్సర్ సంచలన కామెంట్స్
చలో భీమవరం.. జగన్ పర్యటనపై సమావేశం
సైన్స్ కు పెద్ద సవాల్.. బ్లాక్ అండ్ వైట్ గణేశ..!
ప్రశాంతగా చచ్చిండు.. రాజ్ కుమార్ చావు పై అన్న రియాక్షన్
బెయిల్ మీద బయటికొచ్చి 6 మందిని ఎలా చంపాడంటే.. పోలీసులు చెప్పిన నిజాలు
క్లూజ్ టీమ్ చేతికి ఆధారాలు
ఆరుగురిని చంపిన సైకో చచ్చాడు..
YS జగన్ కృషి...పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 మెడికల్ సీట్లు
అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
సైకో కిల్లర్ రాజ్కుమార్ మృతి


