ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాని మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. ఈ కష్టకాలంలో వారికి ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, మాజీ మంత్రి ఆళ్ల నాని (57) మంగళవారం విశాఖ నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత వైఎస్సార్సీపీ సర్కారులో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
బార్బర్ ఉద్యోగాలకూ AI ఎసరు.. రోబోల చేతికి కటింగ్, షేవింగ్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,ఆటోమేషన్ టెక్నాలజీ భవిష్యత్తులో కేవలం ఫ్యాక్టరీ ఉద్యోగాలనే కాకుండా, నైపుణ్యంపై ఆధారపడే సంప్రదాయ వృత్తులను కూడా ఎలా ప్రభావితం చేయవచ్చో ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఓ క్షురకుడు (బార్బర్) తన పనిని చేస్తుండగా, అతడి కదలికలను రికార్డ్ చేసి విశ్లేషించేలా ఒక హైటెక్ సెటప్ను అమర్చినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సదరు యువకుడు క్షవరం చేస్తున్నప్పుడు అతని చేతుల కదలికలు, టైమింగ్, కచ్చితత్వాన్ని ఏఐకు శిక్షణ ఇచ్చే డేటాగా సేకరిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోను షేర్ చేస్తూ..దేశంలో ఏఐ శిక్షణ జరుగుతోంది! రాబోయే రోజుల్లో క్షురకుల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడవచ్చు’అని హర్ష్ గోయంకా పేర్కొన్నారు. ఆ వీడియో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.క్షవరం చేసే సమయంలో రోబోట్లకు ముఖంపై బ్లేడ్లు అప్పగించడం ప్రమాదకరమని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. స్థానిక క్షురకుల అనుభవం, వారి మనుషుల మధ్య ఉండే సంభాషణలు, హస్తకళ నైపుణ్యాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో మానవ ప్రమేయం లేని సేవలు పెరిగే అవకాశం ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోందని నిపుణులు అంటున్నారు.గతంలో మెహందీ పెట్టే యంత్రాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసి మరికొన్ని ఉద్యోగాలు మాయం అంటూ గోయంకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ షేవింగ్ ఏఐ వీడియో టెక్నాలజీ భవిష్యత్తుపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. AI training going on India ! Even barbers job may soon be at risk 🙈 pic.twitter.com/99CAwj5m2h— Harsh Goenka (@hvgoenka) September 14, 2026
అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి
అంబానీ ఇంట గణపతి పూజోత్సవరం అంగరంగ వైభవంగా జరిగింది. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో తారలు మెరిసిపోవడంతో వేడుకకకు మరింత కళ వచ్చింది. ప్రస్తుతం ఈ వేడుకకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా సెటబ్రిటీల లక్స్, వారి సందడి నెటిజన్లును ఆకట్టుకుంటున్నాయి. మరి ఎవరెవరు హాజరయ్యారో ఒకసారి చూద్దాం రండి. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)
‘జైహింద్’ అనలేదని ఐపీఎస్ అధికారిణి బదిలీ!
ఆమె ఓ ఐపీఎస్ అధికారిణి. యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. అందులో వాళ్లను మోటివేట్ చేసేందుకు తన జర్నీనే చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఆ వీడియో నెట్టింట దుమారం రేపింది. ఓ హిందూ సంఘం అభ్యంతరాలతో ఏకంగా రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం నేపథ్యంలో.. ప్రభుత్వం ఆమెను మరో విభాగానికి బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.పశ్చిమ బెంగాల్లో ఐపీఎస్ అధికారిణి బుష్రా బానో(IPS Bushra Bano) వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖరగ్పూర్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఆమెను సోమవారం రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్గా బదిలీ చేశారు. అయితే ఆమెపై ఫిర్యాదు, ఆగమేఘాల మీద బదిలీకి మధ్య జరిగింది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.2021 బ్యాచ్కు చెందిన బుష్రా బానో(Bushra Bano).. సెప్టెంబర్ 13న యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. అందులో తాను సివిల్ సర్వీసెస్కు ఎలా సిద్ధమయ్యారో వివరించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU)లోని రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ తన యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎంతో సహాయపడిందని చెప్పారు. చదువుకు అవసరమైన స్టడీ మెటీరియల్, లైబ్రరీ, టెస్ట్ సిరీస్ వంటివి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించారు.అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. వీడియో ప్రారంభంలో ‘అస్సలామువాలైకుమ్’, మధ్యలో ‘ఇన్షా అల్లా’, చివర్లో ‘జజాకల్లా’ వంటి పదాలను ఉపయోగించారు. దీనిపై ఎక్స్(ట్విటర్)లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జై హింద్’, ‘వందేమాతరం’ వంటి జాతీయ అభివాదాలను ఆమె ఉపయోగించలేదని విమర్శించారు.హిందూ లీగల్ ఫండ్ ఫిర్యాదుఈ వ్యవహారంపై ‘హిందూ లీగల్ ఫండ్’ అనే సంస్థ పశ్చిమ బెంగాల్ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ప్రజా వేదికపై భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే సర్వీసింగ్ అధికారిణి న్యూట్రల్గా ఉండాలని, జాతీయ అభివాదాలను ఉపయోగించాలని కోరినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.అయితే ఇది జరిగాక.. బుష్రా బానో ట్రాన్స్ఫర్ అయ్యారు. అందుకు సువేందు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ రాలేదు. బుష్రా బానో బదిలీపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆమెపై వచ్చిన ఫిర్యాదు కారణమా? లేదంటే సాధారణ పరిపాలనా బదిలీయా? అన్నదానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.సౌదీ నుంచి సివిల్స్ వరకు..బుష్రా బానో ప్రయాణం కూడా ఆసక్తికరమే. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాకు చెందిన ఆమె అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మేనేజ్మెంట్ స్టడీస్లో పీహెచ్డీ చేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా సాధించారు. వివాహం, కుటుంబ బాధ్యతల మధ్య కొంతకాలం సౌదీ అరేబియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. అనంతరం భారత్కు తిరిగి వచ్చి యూపీఎస్సీకి సిద్ధమయ్యారు.ఆమె 2018లో యూపీఎస్సీలో 277వ ర్యాంక్ సాధించి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. అయితే రెండో బిడ్డకు గర్భవతిగా ఉండటంతో ఆ పోస్టులో చేరలేకపోయారు. ఆ తర్వాత మరోసారి యూపీఎస్సీ రాసి 2019లో 234వ ర్యాంక్ సాధించారు. ఈసారి ఐపీఎస్కు ఎంపికై.. పశ్చిమ బెంగాల్ కేడర్కు కేటాయించబడ్డారు.ఖరగ్పూర్ నుంచి సాయుధ పోలీసులకు..కెరీర్లో తొలి పోస్టింగ్ హుగ్లీ రూరల్ ఏఎస్పీగా చేపట్టిన బుష్రా బానో.. ఈ ఏడాది జూన్లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం ఖరగ్పూర్ అదనపు ఎస్పీగా పనిచేశారు. తాజాగా ఆమెను రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్గా బదిలీ చేశారు.ఇదీ చదవండి: వీధుల్లో దీన స్థితిలో కోటీశ్వరుడు.. ఎందుకంటే!
ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం
జెన్ ఆల్ఫా పెంపకంపై ఆది సాయికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
'బ్రిక్స్ విమెన్ ఎకనామిక్ కారిడార్' ఏర్పాటు చేయాలి: ఉపాసన
చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్
ఎంఎంసీసీసీలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
ఆళ్లనాని మృతిపై వైఎస్సార్సీపీ నేతల దిగ్భ్రాంతి
రూ. 2 వేలు దాటితే వడ్డింపు, కస్టమర్లపైనే భారం : రాహుల్
పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ .. ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
ZIM vs AUS: ట్రవిస్ హెడ్కు దిమ్మతిరిగే షాక్!
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
నీవే శరణ్యం గణేశా!
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఆంధ్రప్రదేశ్ అప్పులు
బ్యాంకు సెలవులు.. మళ్లీ 4 రోజులు! ఎక్కడెక్కడంటే?
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా
Daily Horoscope : ప్రముఖుల నుంచి కీలక సందేశం
నిన్న బంగారంతో చైనా.. ఇవాళ సౌదీ అరేబియాకు జాక్పాట్!
హెడ్కోచ్గా సౌరవ్ గంగూలీ.. బ్యాటింగ్ కోచ్గా యువరాజ్!
ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం
జెన్ ఆల్ఫా పెంపకంపై ఆది సాయికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
'బ్రిక్స్ విమెన్ ఎకనామిక్ కారిడార్' ఏర్పాటు చేయాలి: ఉపాసన
చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్
ఎంఎంసీసీసీలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
ఆళ్లనాని మృతిపై వైఎస్సార్సీపీ నేతల దిగ్భ్రాంతి
రూ. 2 వేలు దాటితే వడ్డింపు, కస్టమర్లపైనే భారం : రాహుల్
పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ .. ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
ZIM vs AUS: ట్రవిస్ హెడ్కు దిమ్మతిరిగే షాక్!
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
నీవే శరణ్యం గణేశా!
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఆంధ్రప్రదేశ్ అప్పులు
బ్యాంకు సెలవులు.. మళ్లీ 4 రోజులు! ఎక్కడెక్కడంటే?
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా
Daily Horoscope : ప్రముఖుల నుంచి కీలక సందేశం
నిన్న బంగారంతో చైనా.. ఇవాళ సౌదీ అరేబియాకు జాక్పాట్!
హెడ్కోచ్గా సౌరవ్ గంగూలీ.. బ్యాటింగ్ కోచ్గా యువరాజ్!
ఫొటోలు
సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)
హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)
'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)
ఆషికా.. బార్బీ డాల్కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)
అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
ఫ్యాన్స్ ఫైట్ చేస్తుంటే.. స్టార్స్ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)
ఖైరతాబాద్ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)
హైదరాబాద్లో వినాయక చవితి సందడి (ఫోటోలు)
'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)
సినిమా
ప్రమోషన్స్కి దూరంగా హీరోయిన్.. కారణం ఇదేనా?
ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే కష్టం. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తే కానీ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం జనాల్లోకి వెళ్లడం లేదు. పెద్ద సినిమాలకు సైతం ప్రమోషన్స్ గట్టిగానే చేయాల్సి వస్తుంది. హీరో హీరోయిన్లతో పాటు చిత్రబృందం అంతా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అప్పుడే ఆ సినిమాపై కాస్త బజ్ ఏర్పడి.. జనాల్లో దానిపై చర్చ జరుగుతుంది. ఇక చిన్న సినిమాల పరిస్థితి అయితే మరీ దారణం. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసినా.. సినిమా టైటిల్ జనాల్లోకి వెళ్లడం లేదు. అందుకే పేరున్న నటీనటులతో ఇంటర్వ్యూలు ఇప్పించడం..హీరో హీరోయిన్లతో మీడియా సమావేశాలు పెట్టి.. వీలైనంత వరకు సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లు ప్రతి ఈవెంట్లోనూ పాల్గొంటున్నారు. అయితే కొన్ని చిన్న సినిమాలో నటించిన నటీనటులు మాత్రం ప్రమోషన్స్కి దూరంగా ఉంటున్నారు. చిన్న చిన్న కారణాలు చెప్పి..ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. తాజాగా మిస్సింగ్ మేఘన అనే సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.(ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?)వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించింది. ఈ ఈవెంట్కి హీరోతో పాటు మిగతా నటీనటులంతా హాజరయ్యారు. కానీ హీరోయిన్గా నటించిన అమ్ము అభిరామి మాత్రం..ఈవెంట్కి రాలేదు. దర్శకుడితో గొడవ జరిగిందని.. అందుకే ఆమె ప్రమోషన్స్కి దూరం ఉందనే పుకార్లు కూడా ఉన్నాయి. అయితే దర్శకుడు మాత్రం తనతో ఎలాంటి గొడవ జరగలేదనే క్లారిటీ ఇచ్చాడు. తనకు ఇంకొంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉందని..అందుకే రాలేదని చెప్పాడు. అయితే హీరో మాత్రం మరోలా చెప్పాడు. తను వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉందని.. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్కి హాజరకాలేదని చెప్పాడు. అసలు కారణం ఏదో తెలియదు కానీ..ప్రమోషన్స్కి హీరోయిన్ రాకపోవడం మాత్రం సినిమాకు ఎంతో కొంత మైనస్ అనే చెప్పాలి.
ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?
సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు కొన్నివారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం బిగ్ స్క్రీన్స్పై కాకుండా నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఓటీటీల్లో హిట్ అయిన సిరీస్ల్లోని పాత్రలని తీసుకుని వాటిని సినిమాలుగా మార్చి థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. రీసెంట్ టైంలో అలా 'మీర్జాపుర్', 'ఎపిక్' వచ్చాయి. కానీ ఓటీటీలో వీటికి దక్కిన ఆదరణకు.. థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్కి ఏ మాత్రం సంబంధం లేదు. మరి వీటి విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?(ఇదీ చదవండి: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక.. అధికారిక ప్రకటన)'మీర్జాపుర్'.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్లో ఉన్న ఈ సిరీస్.. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపుర్ అనే ఊరిలో జరిగే కల్పిత కథ. తెలుగుతో ఎలాంటి సంబంధం లేదు. అయినాసరే డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మనోళ్లకు తెగ నచ్చేసింది. మున్నా భయ్యా, కాళీన్ భయ్యా, గుడ్డు భయ్యా, బబ్లూ భయ్యా.. ఇలా ఈ సిరీస్లోని పాత్రలు, కథాకథనాలు మర్చిపోలేనంతగా రిజిస్టర్ అయిపోయాయి.2018లో తొలి సీజన్ రిలీజ్ కాగా 2020లో రెండోది, 2024లో మూడో సీజన్ వచ్చాయి. తొలి సీజన్ అదరగొట్టినప్పటికీ మిగిలిన వాటికి మిశ్రమ స్పందన వచ్చింది. ఓటీటీలో అదరగొట్టిన ఈ సిరీస్ని సినిమాగా తీస్తున్నాం అనేసరికి ఇంకేం స్టోరీ చూపిస్తారా అని చాలామంది అనుకున్నారు. కానీ పాత్రల్ని మాత్రమే తీసుకుని కొత్త క్యారెక్టర్లని ప్రవేశపెట్టి భిన్నంగా ప్రెజెంట్ చేశారు. కానీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. సిరీస్లో ఉన్నట్లు హై ఇచ్చే సీన్స్ పెద్దగా లేకపోయేసరికి ఓవరాల్గా ఓకే ఓకే అనిపించుకుంది.(ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ)ఇక 'ఎపిక్' విషయానికొస్తే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన తెలుగు సినిమా ఇది. మన దగ్గరే హిట్ అయిన #90స్ వెబ్ సిరీస్లోని ఆదిత్య అనే పిల్లాడి పాత్రని తీసుకుని వాడు పెరిగి పెద్దయి.. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఓ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్తో మూవీ తీశారు. ట్రైలర్, పాటలతో కాస్త ఆసక్తి కలిగించారు గానీ మూవీని సరిగా తీయలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తా కొట్టేసింది.ప్రేమకథ అన్నారు గానీ ఏ మాత్రం రిలేటబుల్గా లేని సన్నివేశాలతో విసుగెత్తించారని 'ఎపిక్' చూసిన చాలామంది చెప్పారు. సిరీస్లో పాత్రని చూసి తమలా ఉందని చాలామంది అనుకున్నారు. అదే మూవీ చూస్తున్నప్పుడు మాత్రం అలాంటి ఫీలింగ్ రాకపోవడం పెద్ద మైనస్. ముద్దు, శృంగార సన్నివేశాలు కూడా మరీ ఎక్కువైపోవడం ఈ చిత్రానికి మరింత నెగిటివిటీకి కారణమైంది.ఈసారి ఎవరైనా దర్శకనిర్మాతలు.. ఓటీటీలో హిట్ అయిన సిరీస్లని స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు తీద్దామనుకుంటే మాత్రం ఇలాంటి తప్పుల్ని రిపీట్ చేయకుండా కాస్త రిలేటబుల్ కంటెంట్తో వస్తే బెటర్. అలా కాదని క్రేజ్ని క్యాష్ చేసుకుందామనుకుంటే మాత్రం మొదటికే మోసపోవచ్చు!(ఇదీ చదవండి: నాయకత్వం అంటే ఇది కాదు.. తమిళ బిగ్బాస్లో రాజకీయ రగడ)
’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలకు మించి విజయాన్ని మూటగట్టుకుంది. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్తో పాటు సముద్రంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాను చూసిన రజినీకాంత్ చిత్రబృందానికి మెచ్చుకున్నారు. ముఖ్యంగా సూరి నటనను ప్రశంసించారు. ఈ క్రమంలో రజినీకాంత్ స్వయంగా సూరికి ఫోన్ చేసి అభినందించారు.ఇదీ చదవండి: అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి రజినీ కాంత్ నుంచి ఫోన్ కోలీవుడ్ నటుడు సూరి హీరోగా నటించిన ‘మండాడి’ సినిమాను చూసిన రజినీకాంత్.. ఆయన నటనను మెచ్చుకుంటూ స్వయంగా ఫోన్ చేశారు. దీంతో సూరి భావోద్వేగానికి గురయ్యారు. రజినీకాంత్ నుంచి వచ్చిన ఈ కాల్ తనకు ఎంతో ప్రత్యేకమని సూరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా రజినీకాంత్తో జరిగిన సంభాషణకు సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు.ఈ చిత్రంలో సూరితో పాటు సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, మిథున్ జై శంకర్, రవీంద్ర విజయ్, బాల శరవణన్ తదితరులు నటించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తమిళం, తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబెడుతోంది. ఇది చదవండి: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక.. అధికారిక ప్రకటనకథ ఏంటంటే..శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు. ఈ సారి టీమ్లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు.పూర్తి రివ్యూ కోసం ఇది చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి
అంబానీ ఇంట గణపతి పూజోత్సవరం అంగరంగ వైభవంగా జరిగింది. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో తారలు మెరిసిపోవడంతో వేడుకకకు మరింత కళ వచ్చింది. ప్రస్తుతం ఈ వేడుకకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా సెటబ్రిటీల లక్స్, వారి సందడి నెటిజన్లును ఆకట్టుకుంటున్నాయి. మరి ఎవరెవరు హాజరయ్యారో ఒకసారి చూద్దాం రండి. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)
క్రీడలు
నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదు: బీసీసీఐ
మహిళల ఆసియా కప్-2026 ట్రోఫీ నిరాకరణ అంశం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా బహుమతి అందుకోమని ముందుగానే బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదుఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునే విషయం గురించి మేము ముందుగానే చర్చించుకున్నాము. అతడే ట్రోఫీ ఇస్తానని పట్టుబడితే తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చాము. జట్టుకు ఇదే విషయాన్ని తెలియజేశాము.ఇది బోర్డు సామూహిక నిర్ణయం. ఇందుకు నక్వీ కూడా అభ్యంతరం చెప్పలేదు. అందుకే వేదిక దగ్గరకు వచ్చి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు’’ అని తెలిపారు. కాగా మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీలో భారత జట్టు చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.అపుడు కూడా ఇలాగేదుబాయ్ వేదికగా ఆదివారం ముగిసిన ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసి హర్మన్ సేన టైటిల్ గెలుచుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్ గెలిచినప్పటికీ భారత పురుషుల క్రికెట్ జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.తాజాగా 2026లో చాంపియన్గా నిలిచిన భారత మహిళా జట్టు సైతం అదే బాటలో నడిచింది. అయితే, ఈసారి తాము ముందుగానే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోమని బీసీసీఐ ఏసీసీకి సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ నక్వీ తానే స్వయంగా బహుమతి ప్రదానం చేస్తానని వేదిక వద్దకు రాగా.. భారత జట్టు కిందే ఉండిపోగా.. రన్నరప్ శ్రీలంకకు చెక్ ఇచ్చి నక్వీ వెళ్లిపోయాడు.ట్రోఫీ ఇంకా చేతికి రాలేదుఇదిలా ఉంటే.. పురుషుల జట్టుకు రావాల్సిన ఆసియా కప్ ట్రోఫీ ఇంకా బీసీసీఐ చేతికి అందనేలేదు. తాజాగా మహిళల ట్రోఫీ కూడా ఎప్పుడు చేతికి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ఏసీసీతో సంప్రదించి త్వరలోనే రెండు ట్రోఫీలు దేశానికి చేరేలా చూస్తామని వెల్లడించారు. కాగా టీమిండియా గతేడాది ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించగా.. నక్వీ తనతో పాటే ట్రోఫీని ఎత్తుకెళ్లాడనే ప్రచారం జరిగింది. దీంతో తాజాగా మహిళల ఫైనల్ ముగిసిన తర్వాత నక్వీ స్టేడియంలోకి రాగా..‘ట్రోఫీ చోర్’ అంటూ టీమిండియా అభిమానులు నినాదాలు చేశారు. చదవండి: బాబర్ ఆజం సంచలన నిర్ణయం!
టీమిండియాలో కొందరు కోహ్లిని వ్యతిరేకించారు: భువీ
టీమిండియా టెస్టు అత్యుత్తమ కెప్టెన్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటాడు. ఈ బ్యాటింగ్ దిగ్గజం సారథ్యంలో సంప్రదాయ క్రికెట్లో భారత జట్టు ఉన్నత శిఖరాలకు చేరింది. కోహ్లి కెప్టెన్గా ఉన్న ఏడేళ్ల కాలంలో విదేశాల్లో చిరస్మరణీయ విజయాలు నమోదు చేయడంతో పాటు.. ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది.అయితే, టెస్టు సారథిగా కోహ్లి పగ్గాలు చేపట్టిన తర్వాత డ్రెసింగ్రూమ్లో చాలా మంది అతడి ఆలోచనా విధానాన్ని వ్యతిరేకించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. టీమిండియా వెటరన్ పేస్ బౌలర్, కోహ్లి సహచర ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.జతిన్ సప్రూనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా టెస్టు సారథిగా విరాట్ కోహ్లిగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. అతడి ఆలోచనా విధానం, ఉద్దేశాలు అర్థం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. కొన్ని సిరీస్లు ఆడిన తర్వాత అతడి గురించి మాకు అవగాహన వచ్చింది.కొందరు కోహ్లిని వ్యతిరేకించారుఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కెప్టెన్గా వచ్చిన కోహ్లి తన తొలి ప్రసంగంలోనే ఫిట్నెస్, డైట్ సంస్కృతి గురించి మాట్లాడాడు. అప్పుడు కొంతమంది వీటి అవసరం ఏముంది? అంటూ కోహ్లిని వ్యతిరేకించారు. కోహ్లి ఆలోచనలను ప్రశ్నించారు.అయితే, ఆ తర్వాత కొంతకాలానికే ప్రతి ఒక్కరు కోహ్లి దారిలోకి వచ్చేశారు. ఫిట్నెస్, డైట్ ప్రాముఖ్యాన్ని తెలుసుకుని అతడితో కలిసి ముందుకు నడిచారు’’ అని భువీ చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లి వైఖరి కారణంగా తాము వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతగానో విజయవంతమయ్యామని పలువురు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు సంతోషం వ్యక్తం చేశారు.రోహిత్ శర్మపైనే ఆ ఎఫెక్ట్!ఇదిలా ఉంటే.. భువీ ఎవరి పేర్లను ప్రస్తావించనప్పటికీ కోహ్లిని వ్యతిరేకించిన వాళ్లలో రోహిత్ శర్మ ముందున్నాడనే ప్రచారం గతంలో జరిగింది. కోహ్లి డిప్యూటీగా వ్యవహరించిన హిట్మ్యాన్.. యో-యో టెస్టు (ఫిట్నెస్)లో విఫలం కావడంతో 2017 ఇంగ్లండ్ పర్యటనలో అతడిని కేవలం వైట్బాల్ సిరీస్లకే ఎంపిక చేశారు.ఆ తర్వాత 2020-21లో ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సమయంలోనూ రోహిత్ శర్మ తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. దీంతో రోహిత్- కోహ్లి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయనే విమర్శలు వచ్చాయి. అయితే, ఇవన్నీ వట్టి వదంతులేనని.. కేవలం జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తామని రో-కో పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పారు.విజయవంతమైన కెప్టెన్కాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 2014లో టెస్టు పగ్గాలు చేపట్టిన కోహ్లి.. ర్యాంకింగ్స్లో ఏడో స్థానం నుంచి టీమిండియాను నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డ మీద విజయాలు అందించాడు. 2018-19లో తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్లో భారత్ను గెలిపించాడు.భువీకి మద్దతుగా కోహ్లికోహ్లి కెప్టెన్సీలో టీమిండియా 68 టెస్టు మ్యాచ్లు ఆడి.. 40 గెలిచింది. ఇదిలా ఉంటే.. భువీకి మద్దతుగా నిలిచిన కోహ్లి.. అతడికి వరుస అవకాశాలు ఇచ్చాడు. అయితే, రోహిత్ శర్మ సారథిగా వచ్చిన తర్వాత భువీ కనుమరుగైపోయాడు. ప్రస్తుతం కోహ్లితో కలిసి ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతున్న భువీ.. 2025,2026 సీజన్లలో జట్టు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా సారథులుగా పనిచేసిన రో-కో.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరూ వన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా కొనసాగుతున్నారు. ఇక నాడు కోహ్లి ఫిట్నెస్ మంత్రాకు అనుకూలంగా లేడన్న అపవాదు ఎదుర్కొన్న రోహిత్.. ఇటీవల పది కిలోలకు పైగా బరువు తగ్గి ఫిట్గా మారడం కొసమెరుపు.చదవండి: బాబర్ ఆజం సంచలన నిర్ణయం!
బాబర్ ఆజం సంచలన నిర్ణయం!
పాకిస్టాన్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏడేళ్ల తర్వాత తొలిసారి దేశవాళీ రెడ్బాల్ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అవును.. మా జట్టుకే ఆడుతున్నాడుఈ విషయాన్ని ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (OGDCL) స్పోర్ట్స్ హెడ్ ఫరా ధ్రువీకరించారు. ‘‘బాబర్ ఆజం యూకే నుంచి సెప్టెంబరు 16న పాకిస్తాన్కు తిరిగి వస్తాడు. ఆ మరుసటి రోజు OGDCL జట్టుతో చేరతాడు. ఇప్పటికే బాబర్కు సంబంధించి కిట్ ఆర్డర్ చేశాము.ఈ సీజన్లో జట్టు ఆడే రెండు, లేదంటే మూడో మ్యాచ్ నుంచి బాబర్ జట్టుతో ఉంటాడు. ఇది అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని ఫరా తెలిపారు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందే బాబర్ ఆజం మరోసారి పాకిస్తాన్ టెస్టు సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.గాయంతో మొదలు..యూకే టూర్లో భాగంగా తొలుత కౌంటీ క్లబ్ సెలెక్ట్ ఎలెవన్తో మ్యాచ్లో ఆడిన బాబర్ ఆజం గాయపడ్డాడు. దీంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇక రెండో టెస్టుతో తిరిగి వచ్చిన బాబర్.. దారుణంగా విఫలమయ్యాడు. లార్డ్స్లో జరిగిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో వరుసగా 8, 6 పరుగులు చేశాడు.వరుస వైఫల్యాల తర్వాత..ఇక ఆఖరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఏడు పరుగులకే అవుటైన బాబర్.. రెండో ఇన్నింగ్స్తో ఫామ్లోకి వచ్చాడు. మొత్తంగా 103 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 76 పరుగులతో రాణించాడు. అయితే, కెప్టెన్గా మాత్రం బాబర్కు చేదు అనుభవం మిగిలింది.బాబర్ ఆజం సారథ్యంలో ఇంగ్లండ్ చేతిలో పాక్ 3-0తో వైట్వాష్ అయింది. అంతేగాక మూడో టెస్టులో స్లో ఓవర్రేటు కారణంగా జరిమానాతో పాటు పాయింట్ల కోత (11 పాయింట్లు) ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2027 ఫైనల్ రేసు నుంచి పాక్ అనధికారికంగా నిష్క్రమించింది.చివరగా అప్పుడేఈ నేపథ్యంలోనే బోర్డు ఆదేశాల మేరకు తిరిగి దేశీ రెడ్బాల్ క్రికెట్ ఆడేందుకు బాబర్ ఆజం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ దిగ్గజ బ్యాటర్ చివరగా 2019లో క్వైడ్ ఈ ఆజం ట్రోఫీ టోర్నీలో భాగంగా సెంట్రల్ పంజాబ్ సారథిగా వ్యవహరించాడు. నాడు బాబర్ కెప్టెన్సీలో సెంట్రల్ పంజాబ్ టైటిల్ గెలిచింది. ఇక తాజాగా రీఎంట్రీ ఇస్తున్న బాబర్.. ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్ 1 ఫస్ట్క్లాస్ టోర్నమెంట్లో భాగంగా OGDCL జట్టుకు ఆడతాడు. గెస్ట్ ప్లేయర్గా అతడు OGDCLతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పాక్ మీడియా తెలిపింది. ఇక బాబర్ కంటే ముందే పేసర్ షాహిన్ ఆఫ్రిది, టీ20 కెప్టెన్ సల్మాన్ ఆఘా దేశీ రెడ్బాల్ క్రికెట్ బరిలో దిగారు.చదవండి: ‘వైభవ్ ఎందుకు ఆడట్లేదని నా భార్య అరిచేసింది’
IND vs AFG: భారత తుదిజట్టు ఇదే.. ఒకే ఒక్క మార్పు!
అఫ్గానిస్తాన్తో రెండో టీ20కి టీమిండియా సిద్ధమైంది. తొలి మ్యాచ్లో జయభేరి మోగించిన శ్రేయస్ అయ్యర్ సేన.. మంగళవారం నాటి మ్యాచ్లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.సునాయాస విజయంకాగా ఢిల్లీ వేదికగా ఆతిథ్య అఫ్గాన్తో తొలి టీ20లో టీమిండియా మంచినీళ్లప్రాయంగా గెలుపొందింది. అఫ్గాన్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 82) కారణంగా భారత్కు ఈ విజయం సాధ్యమైంది.ఇక ఈ మ్యాచ్తో తిరిగి టీమిండియాలోకి వచ్చిన మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాత్రం విఫలమయ్యాడు. కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. గత సిరీస్లో జింబాబ్వేలో సత్తా చాటిన ఈ పదిహేనేళ్ల పిల్లాడిని పక్కనపెట్టి.. సంజూకు అవకాశం ఇస్తే అతడు మాత్రం తేలిపోయాడనే విమర్శలు వస్తున్నాయి.వైభవ్ మరోసారి బెంచ్కే పరిమితం!ఈ నేపథ్యంలో అఫ్గాన్తో రెండో టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ మొదలైంది. సంజూను తప్పించి వైభవ్ను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. మెజారిటీ మంది విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సంజూకు మరో అవకాశం ఇస్తారని.. ఈ మ్యాచ్లోనూ విఫలమైతే అతడిని ఇక పూర్తిగా పక్కనపెట్టేస్తారని అభిప్రాయపడుతున్నారు.వరుస మ్యాచ్లలో విఫలమైన తర్వాత జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ.. సీనియారిటి, ప్రపంచకప్-2026 ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు ఇంకో ఛాన్స్ ఇవ్వడమే సరైందని పేర్కొంటున్నారు. ఒక మార్పు అనివార్యం!ఇదిలా ఉంటే.. సంజూ- వైభవ్ విషయం ఎలా ఉన్నా.. భారత తుదిజట్టులో ఒక మార్పు మాత్రం అనివార్యం కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా అఫ్గాన్తో మిగిలిన రెండు మ్యాచ్ల నుంచి దూరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో టీ20లో రవి బిష్ణోయి వరుణ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని తెలుస్తోంది.అఫ్గానిస్తాన్తో రెండో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయి.
న్యూస్ పాడ్కాస్ట్
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
బిజినెస్
గోల్డ్ లవర్స్కి శుభవార్త.. ధరల పతనం
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
రూ.2,000 లోపు యూపీఐ లావాదేవీలపై ఛార్జీల రద్దు
దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ద్వారా జరిగే రూ.2,000 వరకు ఉన్న రూ పే (RuPay) డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు లేదా డిజిటల్ పేమెంట్ సర్వీసు సంస్థలు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్, 2007’ చట్టంలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.సామాన్యులు, చిన్న వ్యాపారులకు ఊరటతాజా ఉత్తర్వుల ప్రకారం.. రూ.2,000 లోపు జరిపే లావాదేవీలపై చెల్లింపుదారుల నుంచి కానీ, స్వీకరించే వారి (మర్చంట్లు) నుంచి కానీ నేరుగా లేదా పరోక్షంగా ఎటువంటి రుసుమును వసూలు చేయరాదని స్పష్టంచేశారు. ఈ నిర్ణయం దేశంలోని అత్యధిక శాతం డిజిటల్ లావాదేవీలకు వర్తిస్తుంది. రోజువారీ సామాన్య ప్రజలు, చిన్న తరహా వ్యాపారులు జరిపే చిన్న మొత్తాల డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఉంచడమే దీని ప్రధాన లక్ష్యం.పెద్ద మొత్తాల లావాదేవీలపై మార్గదర్శకాలు?అయితే, ప్రభుత్వం నోటిఫికేషన్లో రూ.2,000 వరకు ఉన్న లావాదేవీలను మాత్రమే ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. అంతకంటే ఎక్కువ మొత్తం (భారీ లావాదేవీలు) జరిపే నగదు బదిలీలపై ఛార్జీలు విధించేందుకు ఇది మార్గం సుగమం చేసినట్లయింది. అయితే, పెద్ద మొత్తాల లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా లేదా, ఒకవేళ విధిస్తే ఎంత మేర ఉంటాయనే దానిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల ద్వారా మర్చంట్లు, వినియోగదారులపై భారం పడకుండా యూపీఐ ప్లాట్ఫామ్ నిర్వహణ ఖర్చులను భరించవచ్చని కేంద్రం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలో క్యాష్లెస్ ఎకానమీ మరింత వేగంగా విస్తరించనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కాలంతో పోటీపడిన సాంకేతిక శిఖరం.. మోక్షగుండం!
కాలంతో పోటీపడిన సాంకేతిక శిఖరం.. మోక్షగుండం!
ఆలోచనకు ఆకారం ఇవ్వడమే ఇంజినీరింగ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రగతికి నాంది పలికే వారే ఇంజినీర్లు. సమాజ పురోగతికి అహర్నిశలు శ్రమించే ఈ సాంకేతిక శిల్పుల త్యాగాన్ని, ప్రతిభను స్మరించుకునేందుకు ఏటా సెప్టెంబర్ 15న ‘ఇంజినీర్స్ డే’గా జరుపుకుంటాం. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ఆయనకు దేశం ఇచ్చే ఘన నివాళి. నేటి డిజిటల్ యుగంలో ‘కూర్చుంటే మాటలు.. నిలబడితే చేతలు’ అన్నట్లు కాలం గడిపే యువతకు విశ్వేశ్వరయ్య జీవితం స్ఫూర్తిమంతం.పేదరికాన్ని గెలిచిన మహోన్నత బాల్యంకర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా ముద్దెనహళ్లిలో ఒక సాధారణ పేద కుటుంబంలో 1861 సెప్టెంబర్ 15న విశ్వేశ్వరయ్య జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా తాను ధైర్యం కోల్పోలేదు. వీధిదీపాల కింద చదువుకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ విద్యనభ్యసించారు. కష్టపడేవాడికి కామధేనువు సమకూరుతుంది అన్న చందంగా, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో బీఏ, ఆపై పుణెలోని సైన్స్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్లో పూర్తి చేశారు.వృత్తి ధర్మం.. నిర్మాణాత్మక సేవలుబ్రౌన్/బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రారంభ కెరీర్ (1884 – 1908)పుణెలో ఇంజినీరింగ్ విద్య పూర్తయిన వెంటనే 1884లో బొంబాయి ప్రెసిడెన్సీలోని ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్గా చేరారు.ప్రస్తుత పాకిస్థాన్లోని సుక్కూర్ నగరంలో సింధు నది నీరు మురికిగా ఉంటే దానికి ప్రత్యేక ‘ఫిల్ట్రేషన్’ విధానాన్ని రూపొందించి స్వచ్ఛమైన నీటిని అందించారు.బ్లాక్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్: నీటి వృధాను అరికట్టడానికి కాలవల ద్వారా పొలాలకు సమంగా నీరందేలా ‘బ్లాక్ పద్ధతి’ని ప్రవేశపెట్టారు.ఆటోమేటిక్ స్లూయిస్ గేట్లు: పుణె సమీపంలోని ఖడక్వాస్లా జలాశయానికి వరద నీటి నియంత్రణ కోసం పేటెంట్ పొందిన ఆటోమేటిక్ గేట్లను రూపొందించారు. శానిటరీ ఇంజినీర్: 1901లో బొంబాయి ప్రభుత్వంలో శానిటరీ ఇంజినీర్గా సేవలు అందించారు. హైదరాబాద్ నగర రూపశిల్పిగా (1908 – 1909)1908లో హైదరాబాద్ను ముంచెత్తిన మూసీ నది తీవ్ర వరదల తర్వాత ఆనాటి నిజాం ప్రభుత్వం ఆయనను ప్రత్యేక సలహాదారుగా/చీఫ్ కన్సల్టింగ్ ఇంజినీర్గా ఆహ్వానించింది. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను డిజైన్ చేశారు. నగర రక్షణకు, తాగునీటి అవసరాలకు ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ జలాశయాల నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేశారు.మైసూర్ సంస్థానంలో కీలక భాధ్యతలు (1909 – 1918)1909లో బ్రిటిష్ సర్వీస్కు స్వచ్ఛంద విరమణ (వీఆర్ఎస్) ఇచ్చి మైసూర్ మహారాజు నాలుగో కృష్ణరాజ ఒడియార్ పిలుపు మేరకు మైసూర్ సంస్థానంలో చేరారు. మైసూర్ రాజ్యంలో ప్రజాపనుల శాఖ కార్యదర్శిగా, ప్రధాన ఇంజినీర్గా బాధ్యతలు నిర్వహించి కృష్ణరాజ సాగర్ (కేఆర్ఎస్) డ్యామ్కు రూపకల్పన చేశారు. 1912లో మైసూర్ 19వ దివాన్ (ప్రధానమంత్రి)గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కాలంలో రాజ్యాన్ని పారిశ్రామికంగా, విద్యాపరంగా అగ్రపథంలో నిలిపారు. భద్రావతిలో మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ స్థాపించారు. బెంగళూరులో యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఏర్పాటు చేశారు. మైసూర్ సోప్ ఫ్యాక్టరీ ప్రారంభించారు.ఉద్యోగ విరమణ అనంతరందివాన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన ఖాళీగా ఉండలేదు. దేశ నిర్మాణం కోసం పలు కీలక బోర్డుల్లో, కమిటీల్లో పనిచేశారు. టాటా స్టీల్ డైరెక్టర్ బోర్డులో (1927 – 1955) దాదాపు 28 ఏళ్ల పాటు సభ్యుడిగా ఉంటూ సంస్థ విస్తరణకు సలహాలు ఇచ్చారు. విశాఖపట్నం పోర్ట్లో సముద్రపు కోత నుంచి వైజాగ్ నౌకాశ్రయం దెబ్బతినకుండా రక్షణ వ్యవస్థలను రూపొందించారు. తుంగభద్ర ప్రాజెక్ట్ బోర్డ్ ఆఫ్ ఇంజినీర్స్కు ఛైర్మన్గా వ్యవహరించారు. విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 14న బెంగళూరులోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యల (సహజ కారణాల) వల్ల కన్నుమూశారు.దేశం ఇచ్చిన సర్వోన్నత గౌరవంవిశ్వేశ్వరయ్య జీవనశైలి నిరంతరం క్రమశిక్షణకు ప్రతిరూపం. ఆయన ఎప్పుడూ ‘చేప పిల్లకి ఈత నేర్పక్కర్లేదు’ అన్నట్లుగా సమర్థంగా పనిచేస్తూండేవారు. పక్కాగా సమయాన్ని పాటించేవారు. సమాజానికి ఆయన చేసిన అసమాన సేవలకుగానూ 1955లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ‘నైట్హుడ్’(సర్) బిరుదును ప్రదానం చేసింది.నేటి యవతకు ఆయన జీవితమే పాఠంతాత్కాలిక ఆకర్షణలకు లొంగిపోకుండా యువత క్రమశిక్షణ, నిబద్ధత అలవర్చుకోవాలని ఆయన జీవితం చెబుతోంది. కాలం కరిగిపోయే నీటి లాంటిది; దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అడ్డంకులు ఎదురైతే వెనుకంజ వేయకుండా పరిష్కారం వైపు ఆలోచించాలి. సాంకేతికతను కేవలం స్వార్థానికి కాకుండా సమాజాభివృద్ధికి ఉపయోగించాలని ఆయన జీవితం చెబుతోంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చూపిన ప్రగతి బాటలో పయనిస్తూ నైపుణ్యాలకు పదును పెట్టుకోవడమే నేటి యువత ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. 102 ఏళ్ల సంపూర్ణ జీవితంలో ప్రతి నిమిషాన్ని దేశ పునర్నిర్మాణానికే అంకితం చేసిన ఈ అపర విశ్వకర్మ భారతజాతికి నిత్యస్మరణీయుడు!ఇదీ చదవండి: గాడిదల వ్యాపారం.. చైనా డిమాండ్.. పాకిస్థాన్ ఆశలు!
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 54 పాయింట్లు పెరిగి 23,456 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 214 పాయింట్లు పుంజుకొని 75,008 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.59బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 5.01 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.48 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.56 శాతం పడిపోయింది.Today Nifty position 15-09-2026(time: 09:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ
'గోల్డెన్ మోదక్'..ధర ఎంతో తెలుసా!
దేశమంత అంబరాన్నంటేలా వినాయక చవితి వేడుకల సంబరాలతో సందడిగా ఉంది. ఎటూ చూసి కొలువుదీరిన రకరకాల వినాయక రూపాలు, పిల్లలు, పెద్దలు కోలహాలమే కనిపిస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న స్వీట్ షాపులు గణేశుడికి ప్రీతీకరమైన ప్రసాదాల అమ్మకాలతో రద్దీగా ఉన్నాయి. అయితే ఓ స్వీట్ షాపు మాత్రం అందర్నీ ఆకర్షించడమే కాదు నెట్టింట వైరల్గా మారింది. వినాయకుడు ఎంతో మెచ్చే ‘గోల్డెన్ మోదక్’తో అందర్నీ ఆశ్చర్యపర్చింది ఈ స్వీట్ షాపు. తినదగిని ఈ మోదకాలు ఎంతో ఆకర్షణీయంగా చూపురులను కట్టిపడేస్తున్నాయి. తినదగిన విధంగా బంగారు పొతతో తయారు చేసిన ఈ మోదకాలు నాసికాలో విద్యా వికాస్ సర్కిల్ వద్ద ఉన్న ‘సాగర్ స్వీట్స్’ షాపు వారు తయారు చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని ఈ మోదకాలు అందరీ మనసుల్ని దోచడమే కాదు, కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. నెట్టింట ఈ బంగారు మోదకాలు వైరల్ కావడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. వినాయకుడికి అమిత ప్రీతీపాత్రమైన మోదకాలకు తమ సృజనాత్మకతను జోడించి సరికొత్త ఆకర్షణను ఇచ్చి అమ్మకాలు పెంచుకునే ప్రయత్నం చేయడం విశేషం. ఇంతకీ ఈ బంగారు మోదకాలు కిలో ఎంత ధర పలుకుతున్నాయో వింటే విస్తుపోవడం ఖాయం. ఇవి కిలో అక్షరాల రూ. 27 వేలు పైమాటే. Ganesh Chaturthi Special: 'Golden Modaks' Worth Rs 27,000 Per Kg Draw Buyers In Nashik#GaneshChaturthi pic.twitter.com/VUtO0u9Dvu— NDTV (@ndtv) September 14, 2026(చదవండి: అంబానీ ఇంట ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు..!)
అంబానీ ఇంట ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు..!
అంబానీల కుటుంబంలో గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత ప్రత్యేకం. అంబానీల నివాసంలో కొలువై ఉండే ఆ వినాయకుడు 'యాంటిలియా చా రాజా'గా విశిష్టమైన అలంకరణతో పూజలందుకుంటున్నాడు. ఈ ఏడాది అంతే అట్టహాసంగా అంబానీలు ముంబైలో ఉన్న తమ అంటిలియా ఇంటికి గణపతి బప్పాను ఘనంగా స్వాగతించారు. ఈ వేడుకలను అంబానీ కుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తుల ఫ్యాషన్తో మరింత వైబ్ని తెప్పిస్తారు. ముఖ్యంగా నీతా అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె నారింజరంగు ఎత్నిక్ దుస్తులతో అక్కడున్న వారందరి దృష్టిని అమితంగా ఆకర్షించారు. అత్యంత నిరాడంబరమైన స్టైలిష్ లుక్తో పండుగ శోభను తెచ్చారామె. ఆమె దుస్తులపై ఉన్న క్లిష్టమైన ఎంబ్రాయిడరీలో ఉన్న సాంప్రదాయ వివరాలు మరింత కళను తెచ్చిపెట్టాయి. తన రూపానికి అనుగుణంగా స్టేమెంట్ చెవిపోగులు, గాజులను ధరించారు. పండుగ వాతావరణానికి అనుగుణంగా చక్కగా జడ వేసుకుని తన రూపంతోనే కళకళలాడే వాతావరణాన్ని సృష్టించిందామె. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ నీతా అంబానీ ఎరుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో హుందాగా కనిపించారు. బంగారు ఆభరణాలు, లేయర్డ్ నెక్లెస్, స్టేట్మెంట్ చెవిపోగులతో సందర్భానుసారంగా స్టైలిష్గా కనిపించడంలో ఆమెకు సాటి లేరెవెవ్వరూ. ఈ పండుగ శోభలో అంబానీ మహిళలు ధరించే దుస్తులు, జ్యువెలరీ ప్రధాన ఆకర్షణగా నిలవడమే గాక మన భారతీయ హస్త కళా వైభవాన్ని చాటుతాయి. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official)ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సులో ప్రధాన ఆకర్షణగా ఆ యువకుడు..!)
ప్రపంచంలోనే పురాతన చెట్టు..
వయసు తెలుసుకోవడానికి నరికేశారు! ఒక చెట్టు వయసు తెలుసుకోవడానికి ఏం చేస్తారు? దాని కాండం నుంచి చిన్న ముక్క తీసి పరిశీలిస్తారు. కానీ అమెరికాలో జరిగిన ఒక పరిశోధనలో మాత్రం ప్రపంచంలోని అత్యంత పురాతన చెట్లలో ఒకటైన చెట్టును పూర్తిగా నరికేశారు. ఆ తర్వాతే దాని అసలు వయసు బయటపడింది. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని వీలర్ పీక్ ప్రాంతంలో పెరిగిన ఈ చెట్టుకు స్థానికంగా ప్రోమీథియస్’ అనే పేరు ఉండేది. ఇది గ్రేట్ బేసిన్ బ్రిసిల్కోన్ పైన్ జాతికి చెందిన చెట్టు. 1964లో భూగోళ శాస్త్ర పరిశోధకుడు డొనాల్డ్ ఆర్. కర్రీ ఈ ప్రాంతంలో ఐస్ ఏజ్ అంటే మంచు యుగంపై పరిశోధన చేసే సమయంలో ప్రోమీథియస్ను గుర్తించాడు. ఈ చెట్ల కాండంలోని వలయాలు అంటే ట్రీ రింగ్స్ అనేవి గతంలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి, ఆ చెట్టు వయసును అంచనా వేయడానికి ఉపయోగపడతాయి.అనుమతి ఇచ్చిన అమెరికాకర్రీ మొదట చెట్టు నుంచి చిన్న నమూనా తీసి వయసును అంచనా వేయాలని ప్రయత్నించాడు. అయితే ప్రోమీథియస్ విషయంలో పూర్తి కాండాన్ని పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా అటవీ శాఖ అనుమతితో చివరకు ఆ చెట్టును నరికారు. అయితే దాన్ని ఎందుకు నరికాల్సి వచ్చిందన్న విషయంలో వివిధ కథనాలు ఉన్నాయి. అసలు కారణం ఏమిటో పూర్తిగా స్పష్టంగా తెలియదని నేషనల్ పార్క్ సర్వీస్ చెబుతోంది.చెట్టును నరికిన తర్వాత కాండంలోని వలయాలను లెక్కించగా 4,862 రింగ్స్ కనిపించాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక రింగు ఏర్పడకపోవచ్చని భావించి, ప్రోమీథియస్ వయసును సుమారు 4,900 సంవత్సరాలుగా అంచనా వేశారు. ఆ సమయంలో ఇదే అత్యంత పురాతనమైన చెట్టుగా రికార్డ్ అయింది.ఇప్పుడు ఆ అవసరం లేదు..నేడు ఇలాంటి పురాతన చెట్ల వయసును తెలుసుకోవడానికి వాటిని పూర్తిగా నరకాల్సిన అవసరం లేదు. చెట్టు కాండంలోకి చాలా చిన్న డ్రిల్తో వెళ్లి చెక్క నమూనాను తీసే ‘ఇంక్రిమెంట్ బోరర్’ వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఆ నమూనాలోని రింగ్స్పై రీసెర్చ్ చేసి చెట్టు వయసును అంచనా వేయవచ్చు. చెట్టుకు తక్కువ నష్టం కలిగించే మరికొన్ని సాంకేతిక పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంటే.. ప్రోమీథియస్ నరికిన 1964తో పోలిస్తే, నేడు ఇలాంటి పురాతన చెట్లను కాపాడుకుంటూనే వాటి వయసు గురించి తెలుసుకునే అవకాశాలు పెరిగాయి. నేడు ప్రోమీథియస్ లేదు. అయితే చెట్టు నరకగా మిగిలిన కాండం, మొదలు భాగం నేటికీ అక్కడే ఉంది. వయసు తెలుసుకోవడానికి చెట్టును నరకడంపై అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ ఘటన తర్వాత పురాతన చెట్లను సంరక్షించడం, వాటిపై పరిశోధనలు నిర్వహించే విధానంపై కూడా చర్చ మొదలైంది. ప్రోమీథియస్ మాత్రం 1964లో నరికే సమయానికి తెలిసిన అత్యంత పురాతన చెట్టుగా చరిత్రలో నిలిచింది. అయితే 2012లో కాలిఫోర్నియాలో 5,065 ఏళ్ల బ్రిసిల్కోన్ పైన్ అనే మరో చెట్టును గుర్తించారు. ఇప్పుడు ఇదే ప్రపంచంలో ది ఓల్డెస్ట్ ట్రీ. ఇదీ చదవండి: ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ
మైనస్ 50 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే అతి చల్లని వాతావరణంం చుట్టూ అంతులేని మంచు పర్వతాలు.. జనసంచారం చాలా తక్కువ. రష్యాలోని ఈశాన్య భాగంలో ఉన్న కోలిమా ప్రపంచంలోని అత్యంత కఠినమైన, ఏకాంత ప్రదేశాల్లో ఒకటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచం గుర్తించేలా చేసింది అక్కడి చలి మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న విషాద చరిత్ర. సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ పాలనలో కోలిమా ప్రాంతం ఒక పెద్ద లేబర్ క్యాంప్గా మారింది. గులాగ్ అనే వ్యవస్థలో భాగంగా వేలాది కిలోమీటర్ల దూరం నుంచి ఖైదీలను ఇక్కడికి తరలించేవారు. బంగారం, ఇతర ఖనిజాల తవ్వకాలు, రహదారుల నిర్మాణం వంటి అత్యంత కఠినమైన పనుల్లో వారిని ఉపయోగించేవారు.తీవ్రమైన చలి, తగిన ఆహారం లేకపోవడం, వ్యాధులు, కఠినమైన వర్కింగ్ కండిషన్స్, ఇవన్నీ అక్కడి ఖైదీల జీవితాన్ని దారుణంగా మార్చేశాయి. అసలు కొలిమాకు ఎంతమందిని తరలించారు, అక్కడ ఎంత మంది మరణించారు అనే విషయంపై చరిత్రకారుల్లోనే స్పష్టత లేదు. అయితే బాధితుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. నేడు కోలిమాలో చిన్న చిన్న పట్టణాలు, గనులు, విస్తారమైన అడవులు కనిపిస్తాయి. అయితే శీతాకాలంలో తీవ్రమైన చలి, పరిమితమైన రవాణా సదుపాయం, కఠినమైన ప్రకృతి ఈ ప్రాంతాన్ని ఛాలెంజింగ్ లొకేషన్గా మార్చాయి. కోలిమా అనేది ఒక ట్రావెల్ డెస్టినేషన్ మాత్రమే కాదు ఒకప్పుడు వేలాది మంది ఖైదీలు అనుభవించిన బాధను గుర్తు చేసే ప్రదేశంగా చరిత్రలో నిలిచిపోతోంది. పూర్తిగా మంచుతో నిండి ఉన్న ఈ నేల సోవియట్ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయానికి నేటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచిపోయింది. ఇదీ చదవండి: ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
అంతర్జాతీయం
మధ్యంతర ఎన్నికల వేళ.. ట్రంప్కు బిగ్ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టు ద్వారా ఓటు వేసే అమెరికన్లకు ఇకపై కొత్త నిబంధనలు పెట్టాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నానికి కోర్టు అడ్డుకట్ట వేసింది. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం భావించినా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు అనుమతించలేదు. దీంతో మెయిల్ బ్యాలెట్లపై ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న మార్పులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి.ట్రంప్ మార్చిలో జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆధారంగా యూఎస్ పోస్టల్ సర్వీస్ (USPS) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. మెయిల్ బ్యాలెట్లు పొందే ఓటర్ల జాబితాలను రాష్ట్రాలు పోస్టల్ సర్వీస్కు అందించాలి. అలాగే బ్యాలెట్లను పంపేందుకు, తిరిగి స్వీకరించేందుకు USPS ఆమోదించిన ప్రత్యేక కవర్లనే ఉపయోగించాలి. వాటిపై ప్రత్యేక బార్కోడ్ ఉండాలి. రాష్ట్రాలు అందించే జాబితాలో పేరు లేని ఓటర్ల బ్యాలెట్లను లేదంటే నిబంధనలకు అనుగుణంగా లేని బ్యాలెట్లను పోస్టల్ సర్వీస్ తిరస్కరించే అవకాశం ఉండేది.కోర్టుల తలుపు తట్టిన రాష్ట్రాలుఈ నిబంధనలపై డెమొక్రాట్ల పాలనలో ఉన్న పలు రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీతో పాటు ఓటింగ్ హక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కొత్త నిబంధనల వల్ల చట్టబద్ధంగా ఓటు వేసే వేలాది మంది ఓటర్ల బ్యాలెట్లు కూడా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, ఎన్నికల సమయంలో గందరగోళం తలెత్తుతుందని వారు వాదించారు.బోస్టన్లోని ఫెడరల్ జడ్జి ఇందిరా తల్వానీ సెప్టెంబర్ 4న ఈ నిబంధనల అమలును నిలిపివేశారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్రాలకే ప్రధాన అధికారం కల్పించే అమెరికా రాజ్యాంగానికి ఈ నిబంధనలు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త విధానాలను అమలు చేయడం రాష్ట్రాలకు ఆచరణాత్మకంగా కూడా కష్టమని తెలిపారు.దీనిపై ట్రంప్ ప్రభుత్వం అప్పీల్ చేసినా.. 1వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కూడా దిగువ కోర్టు ఆదేశాలను నిలిపివేయడానికి నిరాకరించింది. కొత్త నిబంధనల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని, అదే సమయంలో ఓటింగ్ మోసాలను అడ్డుకోవడంలో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బకింది కోర్టులతో చుక్కెదురు కావడంతో.. ట్రంప్ ప్రభుత్వం సెప్టెంబర్ 6న అత్యవసర పిటిషన్తో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మెయిల్ వ్యవస్థను ఎన్నికల మోసాలకు ఉపయోగించకుండా అడ్డుకోవడానికి ఈ నిబంధనలు అవసరమని వాదించింది. అయితే సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో దిగువ కోర్టు విధించిన నిషేధం కొనసాగనుంది.ఈ నిర్ణయంపై ఇద్దరు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనలపై ప్రభుత్వం చేస్తున్న అప్పీల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అలిటో అభిప్రాయపడ్డారు. మరోవైపు జస్టిస్ బ్రెట్ కవనాగ్.. USPSకు ఇలాంటి నిబంధనలు రూపొందించే అధికారం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నప్పటికీ, 2026 ఎన్నికలకు ముందు రాష్ట్రాలు, స్థానిక ఎన్నికల అధికారులు వాటిని అమలు చేసేందుకు తగిన సమయం లేదన్నారు.మెయిల్ ఓటింగ్పైనే ఎందుకింత ఫోకస్?అమెరికా ఎన్నికల్లో మెయిల్ ద్వారా ఓటింగ్కు గణనీయమైన ప్రాధాన్యం ఉంది. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మెయిల్ ఓటింగ్ అందుబాటులో ఉంది. 29 రాష్ట్రాల్లో ఎలాంటి కారణం చెప్పకుండానే ఓటర్లు మెయిల్ బ్యాలెట్ కోరుకోవచ్చు. మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిగా మెయిల్ విధానంలోనే జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ ఓటర్లు మెయిల్ బ్యాలెట్లను రిపబ్లికన్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తారని పలు సర్వేలు సూచిస్తున్నాయి. దీంతో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు మెయిల్ ఓటింగ్పై విధించే ఆంక్షలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్పై నియంత్రణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సమయంలో ఈ తీర్పు వెలువడింది.ట్రంప్ చాలాకాలంగా మెయిల్ ఓటింగ్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆయన గతంలో చేసిన పలు ఆరోపణలకు ఆధారాలు లేవని విమర్శలు వచ్చాయి. ఆసక్తికరంగా.. ట్రంప్ స్వయంగా కూడా గతంలో మెయిల్ ద్వారా ఓటు వేశారు.మెయిల్ బ్యాలెట్లపై పోరాటం ట్రంప్ పరిపాలనకు, రాష్ట్రాల అధికారాలకు మధ్య జరుగుతున్న విస్తృత న్యాయపోరులో మరో కీలక పరిణామంగా మారింది. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉండాలన్న ప్రశ్నను కూడా ఈ వివాదం మరోసారి ముందుకు తెచ్చింది.ఇదీ చదవండి: అంతా బూటకం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఏఐకి ‘కిల్ స్విచ్’ తప్పనిసరి చేయాలా? జాక్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు
లండన్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై చర్చ మరింత ముదురుతోంది. ఈ క్రమంలో ఏఐ వ్యవస్థలు ప్రమాదకరంగా మారితే వాటిని పూర్తిగా నిలిపివేయగల ‘కిల్ స్విచ్’ను కంపెనీలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా నిబంధనలు తీసుకురావాల్సి రావచ్చని ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ అభిప్రాయపడ్డారు.ప్రమాదం పెరిగితే వెంటనే ఆపేలా..ప్రస్తుతం చాలా ఏఐ సంస్థలు తమ సాఫ్ట్వేర్ను అవసరమైతే నిలిపివేసే మార్గాలను కలిగి ఉన్నాయని క్లార్క్ తెలిపారు. అయితే భవిష్యత్తులో ఏఐ మరింత శక్తివంతంగా మారే కొద్దీ ఈ ‘కిల్ స్విచ్’ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాల్సిన అవసరం రావచ్చన్నారు. అంతేకాకుండా ఆ స్విచ్ నిజంగా పనిచేస్తుందో లేదో స్వతంత్ర మూడో పక్షంతో తనిఖీ చేయించాలా అనే అంశాన్ని కూడా విధాన నిర్ణేతలు పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు.మానవాళికి ముప్పుపై ఆందోళనలుఏఐ అభివృద్ధి వేగం పెరుగుతున్న కొద్దీ.. మానవాళికి ఎదురయ్యే ముప్పుపై పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నియంత్రణ లేకుండా ఏఐను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో అది మనుషుల ఉనికికే ముప్పుగా మారే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ కీలకమైన ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలను తన నియంత్రణలోకి తీసుకుని మనుషులకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.‘10 శాతం అవకాశం ఉంది’ఆంథ్రోపిక్ పరిశోధకుడు ఇవాన్ హుబింగర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. వచ్చే పదేళ్లలో ఏఐ కారణంగా మానవాళి అంతరించిపోయే అవకాశం 10 శాతానికి మించి ఉందని ఆయన వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏఐ రంగంలో ‘గాడ్ఫాదర్ ఆఫ్ ఏఐ’గా పేరొందిన నోబెల్ విజేత జెఫ్రీ హింటన్ కూడా మానవాళిని ఏఐ అంతం చేసే అవకాశం 10 శాతం ఉండటం అసమంజసం కాదని పేర్కొన్నారు.భయాలను అతిగా చూపిస్తున్నారనే విమర్శలుఅయితే ఏఐ వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదాన్ని కొందరు అతిగా చూపిస్తున్నారని టెక్ రంగంలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఇలాంటి భయాలను ప్రచారం చేస్తున్నాయని గ్రైండర్ సంస్థ అధినేత జార్జ్ అరిసన్ విమర్శించారు. భారీ స్థాయి పెట్టుబడులు, కంపెనీల విలువలకు న్యాయం చేయాలంటే భవిష్యత్తులో ఏఐ అనేక ఉద్యోగాలను, పరిశ్రమలను ఆక్రమిస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.అమెరికాలో ‘కిల్ స్విచ్ యాక్ట్’ఏఐ ప్రమాదాలను నియంత్రించేందుకు అమెరికాలో ఇప్పటికే ‘కిల్ స్విచ్ యాక్ట్’ పేరుతో చట్ట ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రమాదకరంగా మారిన ఏఐ సాధనాలను నిలిపివేసే సామర్థ్యం కంపెనీలకు తప్పనిసరిగా ఉండేలా చేయడం, అవసరమైతే వాటిని ఆపాలని లేదా పరిమితం చేయాలని కొన్ని ప్రభుత్వ సంస్థలు ఆదేశించేలా అధికారాలు కల్పించడం ఈ ప్రతిపాదనలో ఉంది. అయితే ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేసే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.బ్రిటన్ మాత్రం వ్యతిరేకంమరోవైపు బ్రిటన్ ప్రభుత్వం ఏఐకి ప్రత్యేకంగా ‘కిల్ స్విచ్’ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించింది. ఒక దేశంలో ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినా ఇతర ప్రాంతాల్లో ఏఐ అభివృద్ధి లేదా దుర్వినియోగాన్ని అడ్డుకోలేమని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా, ఏఐ చాట్బాట్ క్లాడ్ను రూపొందించిన ఆంథ్రోపిక్ సంస్థ వరుసగా మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధి వేగం, భద్రత, ప్రభుత్వ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఏఐపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ‘బూటకం’ అంటూ కొట్టిపారేశారు!
దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ బాబ్ మాకీ కన్నుమూత
దిగ్గజ ఫ్యాషన్, కాస్ట్యూమ్ డిజైనర్ బాబ్ మాకీ (87) తుదిశ్వాస విడిచారు. ఆయన సోమవారం మరణించారు. కాగా బాబ్ మాకీ మరణ వార్తను ఆయన బృందం ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ధృవీకరించింది. 1939లో లాస్ ఏంజిల్స్ శివారు ప్రాంతంలో జన్మించిన బాబ్ మాకీకి చిన్నతనంలోనే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. బాబ్ మాకీకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే అతడి తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో జాబ్ మాకీ తన తాతయ్య, నానమ్మ వద్ద పెరిగాడు. ఈ సమయంలోనే వాళ్లిద్దరు బాబ్ మాకీని కళల పట్ల ఆసక్తి చూపేలా ప్రోత్సహించారు. తాను ఏ వృత్తిని కోరుకుంటాననేది తనకు ముందే తెలుసని బాబ్ మాకీ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.మాకీకి లభించిన తొలి ప్రధాన అవకాశాల్లో చెప్పుకోవాల్సింది మాత్రం నటి, గాయని మిట్జీ గేనార్కు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడమే. లాస్ వేగాస్ రెవ్యూకు మిట్జీకి అందమైన కాస్ట్యూమ్స్ తయారు చేయడం ద్వారా బాబ్ మాకీ పేరు తొలిసారి మార్మోగిపోయింది. ఆ తర్వాత అతను ఆమె టెలివిజన్ స్పెషల్స్ కోసం దుస్తులను రూపొందించాడు. మాకీ తన కెరీర్లో తొమ్మిది ప్రైమ్టైమ్ ఎమ్మీ అవార్డులు అందుకోవడంతో పాటు ఆస్కార్ విభాగంలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డుకు మూడుసార్లు నామినేట్ అవ్వడం విశేషం.బాబ్ మాకీ మరణవార్తను అతడి బృందం ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది. ‘‘బాబ్ మాకీ ఈ రోజు కన్నుమూశారనే వార్తను చాలా బాధతో తెలియజేస్తున్నాము. ఆయన తన 87 ఏళ్ల జీవితాన్ని సంపూర్ణంగా గడిపారు. ఫ్యాషన్, కాస్ట్యూమ్ డిజైనర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నారు, ఆయన జీవితమంతా అదే చేయాలని కోరుకున్నారు. ఆయన ప్రతిభ అసాధారణం. ఆయన రూపొందించిన డిజైన్లు ఈ ప్రపంచానికి అందాన్ని పంచుతూ శాశ్వతంగా నిలిచి ఉంటాయి.’’అని పేర్కొంది.ఇదీ చదవండి: కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
ఏఐపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ‘బూటకం’ అంటూ కొట్టిపారేశారు!
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ)పై వస్తున్న హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. ఏఐ సంస్థలపై మరిన్ని ప్రభుత్వ నియంత్రణలు అవసరమన్న పరిశ్రమ ప్రముఖుల డిమాండ్లను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. చైనాను ఏఐ రంగంలో వెనక్కి నెట్టడం అమెరికాకు ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే, ఏఐ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళనలను కొట్టిపారేస్తూ.. సోమవారం సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఏఐ వ్యవస్థలు అదుపు తప్పకుండా ఉండేందుకు తన పర్యవేక్షణ సరిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు.ఇప్పటికే ఏఐ కంపెనీలపై చర్యలు తీసుకునేంత ప్రభుత్వ నియంత్రణ, చట్టపరమైన అధికారాలు అమెరికాకు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా, ఏఐను భారీ ప్రయోజనాలు అందించే విలువైన అవకాశంగా ఆయన అభివర్ణించారు. అయితే మరోవైపు ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గే అవకాశం, భారీ డేటా సెంటర్లతో స్థానిక ప్రాంతాలపై ప్రభావం, భద్రతాపరమైన ముప్పులు వంటి అంశాలపై ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో ట్రంప్ వైఖరిపై వైట్హౌస్లోని కొందరు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం ఏఐ సంస్థలే ప్రభుత్వాన్ని నియంత్రణలు విధించాలని కోరడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కొత్త నిబంధనల పేరుతో కంపెనీలు తమకు అనుకూలమైన ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయా అనే సందేహం ఉందన్నారు. అయితే ఏఐలో ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు కూడా ఉన్నాయని అంగీకరించిన వాన్స్.. వాటిని దృష్టిలో పెట్టుకుని తగిన భద్రతా చర్యలపై ప్రభుత్వం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.మరోవైపు ఏఐ, సైబర్ భద్రత అంశాలపై ప్రభుత్వ నిపుణులతో ఈ వారంలో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అలాగే, ఏఐ కంపెనీల బాధ్యత, ప్రభుత్వ పాత్రపై చర్చించేందుకు అమెరికా కాంగ్రెస్లోనూ సమావేశాలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా ఏఐపై ఇరుదేశాల మధ్య చర్చలను మరింత విస్తరించే అవకాశముంది. గతంలో ఏఐ భద్రతపై ట్రంప్, షీ చర్చించినప్పటికీ పెద్దగా అభివృద్ధి కనిపించలేదు. తాజాగా ఏఐ అంశంపై అమెరికా-చైనా ప్రభుత్వ స్థాయి చర్చలు ఏర్పాటు చేయనున్నట్లు చైనా ప్రకటించింది.ఇదీ చదవండి: ఒమన్లో జరగాల్సిన ఇరాన్ కీలక భేటీ.. వాయిదా!
జాతీయం
గురుగ్రామ్ హిట్ అండ్ రన్ నిందితుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గురుగ్రామ్లో మహిళా బైకర్ను కారుతో ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లోని దౌసా నుంచి డ్రైవర్ కల్యాణ్ బైన్స్లాను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం అతడిపై హత్యాయత్నం అభియోగాన్ని నమోదు చేసినట్లు సమాచారం.హర్యానా గురుగ్రామ్కు చెందిన సియా.. స్పోర్ట్స్ బైక్ రైడర్. ఆమె ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్పై వెళ్తుండగా ఆదివారం గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. మరోవైపు కల్యాణ్ ఆ సమయంలో తెల్లటి సెడాన్ కారును నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కసారిగా కుడివైపునకు మళ్లిన కారు.. హెల్మెట్ ధరించి బైక్పై వెళ్తున్న సియాను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోగా.. బైక్ కొంతదూరం జారుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.సీసీటీవీ ఆధారంగా హత్యాయత్నం కేసుప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు ఫుటేజీల్లో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించి దౌసాలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరానికి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.‘జాలిపడితే.. ఎందుకు ఆపలేదు?’ ప్రమాదం తర్వాత కల్యాణ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఆ యువతి మహిళో, పురుషుడో తెలియదని, ఘటనలో ఒకవైపు కథనం మాత్రమే బయటకు వచ్చిందని చెప్పాడు. ఆమెపై తనకు చాలా బాధ కలిగిందని పేర్కొన్నాడు. అదే సమయంలో అతని లాయర్.. కేవలం వ్యూస్, ఫాలోవర్స్ కోసమే ఆ మహిళా బైకర్ ఇలా చేస్తోందని ఆరోపించాడు. అయితే కల్యాణ్, అతని లాయర్ వ్యాఖ్యలపై సియా తీవ్రంగా స్పందించింది. “నాపై నిజంగా జాలిపడితే.. ప్రమాదం జరిగిన వెంటనే ఎందుకు ఆపలేదు? నేను గాయపడ్డానా లేదా అని చూడటం నీ బాధ్యత కాదా?” అని ప్రశ్నించింది. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయిన తీరును సీసీటీవీ ఫుటేజీలు స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొంది. అలాగే అతని లాయర్ పైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.I don’t think Gurgaon is safe for girls anymore. The guy hit her intentionally as you can see in this clip, he asked her to Stop but she didn’t for her safety. So he hit and run her so badly. https://t.co/eyWEwXt3bn pic.twitter.com/bNdtEw5aSl— LUCK7773 (@Luck_7773) September 15, 2026‘చనిపోయి ఉండొచ్చు’ఈ ప్రమాదంలో తనకు మరింత తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉందని సియా తెలిపింది. “నా ఎముకలు విరిగి ఉండొచ్చు. అక్కడికక్కడే చనిపోయి ఉండొచ్చు. అదృష్టవశాత్తూ అలా జరగలేదు” అని చెప్పింది. ప్రమాదం తర్వాత ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్లిపోవడం తనను మరింత బాధించిందని పేర్కొంది. సియా తండ్రి రోషన్ చౌహాన్ కూడా నిందితుడికి శిక్ష పడే వరకు తమ కుటుంబం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.మళ్లీ బైక్ నడుపుతా..గురుగ్రామ్ హిట్ అండ్ రన్ ఘటనలో గాయపడిన బైకర్ సియా మళ్లీ బైక్ నడుపుతానని, అయితే రోడ్లపైకి ఒంటరిగా వెళ్లాలంటే భయంగా ఉంటుందని తెలిపింది. ఆ కారు నడుపుతున్న వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని.. అంటే ఉద్దేశపూర్వకంగా కారు దగ్గరకు వెళ్లడం, కట్ కొట్టడం నేను చేయలేదు. రోడ్లపై నా భద్రత నేను చూసుకుంటా. ప్రమాదానికి ముందు కారు తనను పదేపదే వెంబడిస్తూ బైక్కు దగ్గరగా వచ్చిందని, దీంతో భయపడి కారు నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పింది. అనవసరంగా సమస్యను ఎందుకు సృష్టించుకుంటాను? అని సియా అంటోంది. అయినా కారు వేగంగా వచ్చి తన బైక్ను ఢీకొట్టి వెళ్లిపోయిందని వివరించింది. ఈ ఘటన తనను తీవ్రంగా భయపెట్టిందని, ముఖ్యంగా మహిళా బైకర్లు రోడ్లపై ప్రయాణించాలంటే ఆందోళన కలిగించేలా ఉందని సియా పేర్కొంది.VIDEO | Delhi: "I am not interested in 'pinching' a car driver; my own safety on the road is paramount, why would I try to cause unnecessary trouble?" says Siya, woman biker who was hit by a car in Gurugram.(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/rUpg6NAzVs— Press Trust of India (@PTI_News) September 15, 2026ఇదీ చదవండి: జై హింద్ అనలేదని ట్రాన్స్ఫర్ చేశారా?
నందిగ్రామ్ ఉప ఎన్నిక: ముఖ్యమంత్రి పీఏ తల్లికి టికెట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో సఖరవ్ సర్కార్, హసిరాణి రాథ్ పేర్లకు ఆమోదం లభించింది. రేజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సఖరవ్ సర్కార్ పోటీ చేయనున్నారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి రబియుల్ ఆలం చౌధురితో తలపడనున్నారు. మరోవైపు నందిగ్రామ్ నుంచి హసిరాణి రాథ్ను బీజేపీ బరిలోకి దించింది. అక్కడ టీఎంసీ అభ్యర్థి సంచిత ప్రధాన్తో పోటీ పడనున్నారు.హసిరాణి రాథ్ ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకునిగా పనిచేసిన చంద్రనాథ్ రాథ్కు ఆమె తల్లి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే చంద్రనాథ్ రాథ్ హత్యకు గురయ్యారు. నందిగ్రామ్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై హసిరాణి రాథ్ మీడియాతో మాట్లాడారు. ‘నందిగ్రామ్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు పార్టీ కల్పించింది. ఇక్కడ పార్టీ మా వెంట ఉంది. నందిగ్రామ్ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాం’ అని ఆమె పేర్కొన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో నందిగ్రామ్ నుంచి హసిరాణి రాథ్ పేరు ఆసక్తికరంగా మారింది. రేజీనగర్లో సఖరవ్ సర్కార్, నందిగ్రామ్లో హసిరాణి రాథ్ బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ టీఎంసీ అభ్యర్థులతో బీజేపీ అభ్యర్థులు తలపడనున్నారు.ఇదీ చదవండి: హౌతీల మెరుపు దాడులతో సౌదీలో ఉద్రిక్తత
బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్
దేశవ్యాప్తంగా బొజ్జ గణపయ్య వేడుకలు ఘనంగా జరుగుతుండగా, తమిళనాడులోని తిరునెల్వేలిలో ఒక బిర్యానీ దుకాణం యజమానికి భారీ షాక్ తగిలింది. గణేశుడిని అవమానించాడనే ఆరోపణల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమైంది అంటే.. తమిళనాడులోని పలు నగరాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలతో వాతావరణం సందడిగా ఉంది. ఇంత కోలాహలం మధ్య తిరునెల్వేలిలోని బిర్యానీ దుకాణం యజమాని 30 ఏళ్ల జయంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుకాణం బయటగణపతి బిర్యానీ తింటున్నట్లుగా ఒకబ్యానర్ ఏర్పాటు చేసిశాడు.ఇదే వివాదానికి దారి తీసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడంటూ 42 ఏళ్ల సెల్వరాజ్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.తమిళనాడులో వాడవాడలా వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలోని కపాలీశ్వరర్ ఆలయంలో ఉదయం గణపతి హోమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నర్తన వినాయకర్ విగ్రహానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, బంగారు కవచంతో అలంకరించారు.మధురై మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయంలో 7 అడుగుల ఎత్తైన ముక్కురుణి వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల కోసం భారీ ముక్కురుణి కొడకట్టై (కుడుములు) తయారు చేశారు. తిరుచిరాపల్లిలో రాక్ఫోర్ట్ పై ఉన్న ఈ ఆలయంలో 417 మెట్లు ఎక్కి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 25 కేజీల కుడుము నైవేద్యంతో 14 రోజుల పెరువిళా వేడుకలు ప్రారంభమయ్యాయి.అంతేకాదు తిరువన్నామలైలో 51,000 రుద్రాక్షలతో తయారు చేసిన గణేశ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మధురైలో దర్భ గడ్డితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కోయంబత్తూర్లో కోయంబత్తూర్లో రూ. 5 లక్షల విలువైన 500 రూపాయల నోట్లతో కూడిన దండతో విగ్రహాన్ని అలంకరించగా, చెన్నైలోని టి.నగర్లో కరెన్సీ నాణేలతో చేసిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంది.కాగా తమిళనాడు వ్యాప్తంగా నిమజ్జన ఊరేగింపులు సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరగనున్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను వినియోగించనున్నారు. పర్యావరణ నిబంధనల దృష్ట్యా పట్టినాబాక్కం, నీలంకరై బీచ్లలోని సాంప్రదాయ నిమజ్జన ప్రాంతాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
విమర్శలకు భయపడొద్దు.. సోషల్ మీడియాకు తలొగ్గొద్దు: సీజేఐ
న్యాయవ్యవస్థపై సోషల్ మీడియానో, ఇతర బయటి శక్తుల ప్రభావం ఉండకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అలాగని విమర్శలకు న్యాయవ్యవస్థను అతీతంగా ఉంచడం కూడా సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన 6వ రామ్ జెఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ‘జస్టిస్ సీన్ టు బీ డన్: ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ యాజ్ పిల్లర్స్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతం కాదని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. కోర్టుల పనితీరుపై వచ్చే నిష్పాక్షిక, నిర్మాణాత్మక విమర్శలు న్యాయవ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే కోర్టులు విమర్శలకు, పరిశీలనకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.కోర్టు తీర్పును మాత్రమే కాకుండా.. ఆ తీర్పు వెనుక ఉన్న కారణాలను కూడా ప్రజలు పరిశీలించే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. తీర్పు ప్రకటించి, దాని వెనుక ఉన్న కారణాలను మాత్రం ప్రజలకు తెలియకుండా ఉంచితే దాన్ని పూర్తి పారదర్శకతగా చెప్పలేమన్నారు.సోషల్ మీడియా ప్రభావం మాత్రం వద్దు..అయితే పారదర్శకత పేరుతో కోర్టు వ్యవహారాలను సోషల్ మీడియా ప్రభావానికి వదిలేయకూడదని సీజేఐ హెచ్చరించారు. న్యాయస్థానాలపై బాహ్య ఒత్తిళ్లు, ప్రజాభిప్రాయ ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. మీడియా లేదంటే సోషల్ మీడియా తమ సొంత అభిప్రాయాలతో వ్యవహరించే పరిస్థితుల్లో.. న్యాయం జరగడమే కాకుండా అది నిష్పాక్షికంగా కనిపించేలా ఉండటం కూడా ముఖ్యమని వివరించారు.ప్రజల మెప్పు కాదు.. నమ్మకమే ముఖ్యంకోర్టులు ప్రజల మెప్పు పొందడం ద్వారా విశ్వాసాన్ని సంపాదించలేవని సీజేఐ అన్నారు. కేసులో ఓడిపోయిన వ్యక్తి సైతం.. తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును ఇచ్చిన ప్రక్రియ న్యాయంగా జరిగిందని నమ్మినప్పుడే న్యాయవ్యవస్థపై నిజమైన విశ్వాసం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజల ఆమోదం కంటే న్యాయ ప్రక్రియలోని నిష్పాక్షికతే కోర్టుల విశ్వసనీయతకు కీలకమన్నారు.న్యాయవేత్త టామ్ ఆర్. టైలర్ పరిశోధనలను ప్రస్తావిస్తూ.. కేసులో ఓడిపోయినా ప్రక్రియ న్యాయంగా జరిగిందని భావించే వ్యక్తులు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. గెలుపు కంటే న్యాయమైన ప్రక్రియే కోర్టులకు చట్టబద్ధత, విశ్వసనీయతను తెచ్చిపెడుతుందని అన్నారు.‘న్యాయం జరగాలి.. కనిపించాలి’‘జస్టిస్ ఈజ్ డన్’తో పాటు ‘జస్టిస్ సీన్ టు బీ డన్’ అనే సూత్రాన్ని కూడా సీజేఐ ప్రస్తావించారు. 1924లో ఇంగ్లండ్లోని ‘ఆర్ వర్సెస్ ససెక్స్ జస్టీసెస్’ కేసును ఉదాహరణగా తీసుకున్నారు. సంబంధిత కేసుతో అనుబంధం ఉన్న సంస్థలో కోర్టు క్లర్క్ పనిచేస్తున్న విషయం బయటపడటంతో.. అతను న్యాయమూర్తుల నిర్ణయాన్ని ప్రభావితం చేశాడనే ఆధారాలు లేకపోయినా, పక్షపాతానికి అవకాశం కనిపించిందనే కారణంతో తీర్పును రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. న్యాయం చేయడం మాత్రమే కాదు.. అది న్యాయంగా జరిగిందని ప్రజలకు కనిపించడమూ అంతే ముఖ్యమని అన్నారు.ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థ బలంఅలెగ్జాండర్ హామిల్టన్ రాసిన ‘ది ఫెడరలిస్ట్ నంబర్ 78’ను కూడా సీజేఐ ప్రస్తావించారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాలకు ఆర్థిక, బలప్రయోగ అధికారాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థకు ప్రధానంగా తీర్పు ఇచ్చే అధికారమే ఉందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా కోర్టుల తీర్పులను గౌరవించడానికి కారణం.. న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసమేనన్నారు.ఆ విశ్వాసం ఒక్కసారి సంపాదించుకుంటే సరిపోదని.. ప్రతి దశలోనూ దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థకు అత్యంత విలువైన మూలధనమని చెప్పారు.సామాన్యుడికి న్యాయం చేరాలికోర్టు భవనం అందుబాటులో ఉండటం మాత్రమే న్యాయానికి ప్రాప్యత కాదని సీజేఐ అన్నారు. సామాన్య పౌరుడు న్యాయవ్యవస్థను చేరుకోగలగాలి, అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలగాలి, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం తనకు మరో పోరాటంగా మారకూడదని చెప్పారు. ఈ సందర్భంగా ఈ-కోర్టుల ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న పలు చర్యలను ప్రస్తావించారు. సింగిల్ సైన్-ఆన్ పోర్టల్, ఎలక్ట్రానిక్గా సమన్ల జారీ, జైలు-కోర్టు రికార్డుల అనుసంధానం వంటి చర్యలు న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయని వివరించారు. ఈ-సేవా కేంద్రాల మొబైల్ వాహనాల ద్వారా కోర్టు సేవలు, న్యాయ సహాయాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లే ప్రయత్నాలను కూడా ప్రస్తావించారు.ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రామ్ జెఠ్మలానీ. దేశంలోనే అత్యంత పేరున్న న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన.. ఎన్నో సంచలన కేసుల్లో వాదించారు. రామ్ జెఠ్మలానీ పారదర్శకత, జవాబుదారీతనం కోసం చేసిన కృషిని గుర్తుచేసిన సీజేఐ.. న్యాయవ్యవస్థలో పారదర్శకతను పునాదిగా చేసుకుని, ప్రజల విశ్వాసాన్ని నిరంతరం పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయం జరగడమే కాదు.. అది జరిగినట్లు ప్రజలకు కనిపించాలన్న సూత్రం న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: విజయ్కు షాకిచ్చిన వామపక్షాలు
ఎన్ఆర్ఐ
90 నిమిషాల్లో ఇద్దరు స్నేహితులను చంపిన ఆమె దొరికిపోయింది..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరు కేరళకు చెందిన స్నేహితుల హత్య కేసులో భారత సంతతికి చెందిన అనిలా బేబీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 28న శాన్జోస్, మిల్పిటాస్ ప్రాంతాల్లో 90 నిమిషాల వ్యవధిలో 2 హత్యలు జరిగాయి. మృతులను యాన్ మేరీ మ్యాథ్యూ(35), అంజనా హరి(35)గా గుర్తించారు. అనిలా బేబీతో పాటు మిగతా ఇద్దరు కేరళ మూలాలు ఉన్నవారే.మొదటి ఘటన శాన్జోస్లోని మ్యాథ్యూ ఇంట్లో జరిగింది. ఆమెను గొంతు నులిమి, కత్తితో పొడిచినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. శాన్జోస్ పోలీసులు కూడా ఆమెకు కత్తిపోట్లు ఉన్నాయని, ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు.దాదాపు 90 నిమిషాల తర్వాత మిల్పిటాస్లోని తమ అపార్ట్మెంట్ సముదాయం పార్కింగ్ ప్రదేశానికి అంజనా హరిని అనిలా బేబీ పిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్ సముదాయంలో నివసించేవారు. అంజనా అనిలా బేబీ వాహనం వద్దకు వెళ్లిన సమయంలో వాహనం ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి ఆమెను ఢీకొట్టి, హత్య చేసింది. అనంతరం అనిలా అక్కడి నుంచి పారిపోయి మరో మూడు వాహనాలను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత పోలీసులు ఓ దుకాణం సమీపంలో నీలిరంగు టయోటా వాహనాన్ని గుర్తించారు. వాహనం నడిపింది అనిలా బేబీనేనని గుర్తించారు. ఆమె అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కనిపించిందని, చేతులు, కాళ్లపై రక్తం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి శాంటా క్లారా కౌంటీ ప్రధాన జైలుకు తరలించారు.ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు శాన్జోస్ పోలీసులు తెలిపారు. అనిలా బేబీపై 2 హత్య కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే 50 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది.మృతుల భౌతిక కాయాలను భారత్కు, ముఖ్యంగా కేరళకు తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత రాయబార కార్యాలయం, కాలిఫోర్నియాలోని మలయాళీ సంఘం కూడా కుటుంబాలకు సహాయం చేస్తున్నాయి. శవపరీక్ష, ఇతర న్యాయపరమైన ప్రక్రియలు త్వరగా పూర్తి కావాలని వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
భారత సంతతి మహిళను ఫాలో అయ్యాడు.. చివరకు కాల్పులు
అమెరికాలోని కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల భారత సంతతికి చెందిన ఓ మహిళ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. నెలల తరబడి ఓ వ్యక్తి ఆమె వెంటపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. అమెరికాలో నిషేధాజ్ఞ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని సంప్రదించడం, కలవడం లేదా దగ్గరకు వెళ్లడాన్ని చట్టపరంగా నిరోధించే ఆదేశం.షాలిని ఠాకూర్ (38) తన కారుకు సమీపంలో నిలబడి ఉండగా.. భారతదేశానికి చెందిన చట్టబద్ధ పత్రాలు లేని వలసదారు రోహిత్ ఆమె వద్దకు వచ్చినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. షాలిని తప్పించుకునేందుకు ప్రయత్నించగా రోహిత్ ఆమెను వెంబడించి తలపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాల్పుల ఘటనపై స్పందించిన పోలీసులు రోహిత్ను కొద్దిసేపటికే పట్టుకున్నారు. అధికారుల ప్రకారం.. ఆ తర్వాత అతడు తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంటల తరబడి కారు నిలిపి.. కాల్పుల ఘటనకు ముందు రోహిత్ నెలల తరబడి షాలినిని వెంటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలినికి అతడు డోర్డ్యాష్ డెలివరీ డ్రైవర్గా తెలుసని ఏబీసీ 10 తెలిపింది. అతడు ఆమె ఇంటి బయట గంటల తరబడి కారు నిలిపి.. ప్రతిరోజూ ఆమెతో మాట్లాడేవాడని పేర్కొంది.ఓ దశలో రోహిత్ తనను పెళ్లి చేసుకోవాలని షాలినిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతరులతో స్నేహంగా ఉండకుండా కూడా ఆమెను అడ్డుకున్నాడు. ఆమె ఎవరినైనా కలిస్తే ఆ వ్యక్తిని లేదా తనను తాను తుపాకీతో కాల్చుకుంటానని రోహిత్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత రోహిత్ షాలిని కారు టైర్లలోని గాలిని తీసేసి.. ఆమె పనిచేసే చోటుకూ వెంబడించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించేవాడని చెప్పారు. షాలిని అపార్ట్మెంట్ తాళం చెవి నకలును కూడా రోహిత్ సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించేందుకే అతడు ఆ నకలు తాళం చెవిని సంపాదించినట్లు తెలుస్తోంది.మేలో షాలిని చివరకు రోహిత్పై నిషేధాజ్ఞ పొందింది. అయినప్పటికీ అతడు ఆమెను ఫాలో కావడం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలిని తల్లి సుదేశ్ కుమారి మాట్లాడుతూ తన కుమార్తె పలుసార్లు పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. చివరకు మంగళవారం శాక్రమెంటో కౌంటీలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో షాలిని ప్రాణాలు కోల్పోయింది.
ఫీనిక్స్లో ‘రాజా 50’ : వేలాది మందిని కట్టిపడేసిన ఇళయరాజా!
శంకర నేత్రాలయ సేవలపై అవగాహన కల్పించే లక్ష్యంతో అరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా, ‘రాజా 50’ పేరుతో ప్రత్యక్ష సంగీత కార్యక్రమంలో ఆహూతులను అలరించింది. దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను తన సంగీత ప్రపంచంలో విహరింపజేశారు. ఫీనిక్స్లో గతంలో ఎన్నో భారతీయ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో లైవ్ సింఫనీ సంగీత బృందంతో జరిగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.దాదాపు 40 మంది సంగీత కళాకారులతో కూడిన బృందం ఇళయరాజాతో కలిసి వేదికను పంచుకుంది. ఒక్కో వాయిద్యం సంగీతంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇళయరాజా స్వయంగా వివరించడం ఈ కార్యక్రమాన్ని సాధారణ సంగీత కచేరీకి భిన్నంగా నిలిపింది.Arizona Financial Theatreలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 4వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు వివిధ భారతీయ భాషలు, ప్రాంతాలకు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంగీతానికి భాషా సరిహద్దులు లేవని మరోసారి చాటింది.‘రాజా 50’ ఫీనిక్స్లో ఒక విజయవంతమైన సంగీత కార్యక్రమంగా మాత్రమే కాకుండా, శంకర నేత్రాలయ సేవలను 4,000 మందికి పైగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమైన అవగాహన వేదికగా నిలిచింది. ముఖ్యంగా MESU కార్యక్రమాన్ని పరిచయం చేయడం, దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించడం ద్వారా సంగీత వేదికపై సేవా సందేశాన్ని కూడా వినిపించే అవకాశం లభించింది. ఇళయరాజా సంగీతం ప్రజలను ఒకచోట చేరిస్తే, ఆ అవకాశాన్ని శంకర నేత్రాలయ సేవలను మరింత మందికి పరిచయం చేయడానికి ఉపయోగించుకోవడం ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకతను ఇచ్చింది. సంగీతం, సమాజం, సేవ ఒకే చోట కలిసిన మరపురాని రాత్రిగా ‘రాజా 50’ నిలిచిపోయింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నేత్ర వైద్య సేవలను చేరువ చేయడంలో MESU చేస్తున్న సేవలను పరిచయం చేస్తూ, దానికి సంబంధించిన వీడియోలను కూడా వేదికపై ప్రదర్శించారు. సంగీతం కోసం వచ్చిన వేలాది మందికి శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలను చూపించగలగడం ఈ వేదికకు ప్రత్యేకమైన సామాజిక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.ఈ కార్యక్రమానికి ఫీనిక్స్లోని వివిధ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంఘాలు, ఇతర భారతీయ సామాజిక సంస్థల ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, స్పాన్సర్లు, వాలంటీర్లు తమ వంతు సహకారం అందించారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఒక మంచి కార్యక్రమం కోసం అందరూ కలిసి రావడం ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. నిర్వాహకులతో పాటు వివిధ సంఘాలు, స్పాన్సర్లు, వాలంటీర్లు, శంకర నేత్రాలయ శ్రేయోభిలాషులు, ఫీనిక్స్ భారతీయ సమాజం అందించిన సహకారం ఇందులో భాగమైంది.ఇంత పెద్ద కార్యక్రమం వెనుక ఆది మొర్రెడ్డి, అనిల్ భరద్వాజ్, విజయ్ రాజ్, చెన్నా రెడ్డి మద్దూరి, చిత్రప్రియ, సుబ్బు ఉప్పులూరి, జ్ఞాని మారుపాకుల, జెగ్గీ క్రిష్, డా. కార్తిక్ రెడ్డి దొనూర్, లక్ష్మి బొగ్గరపు, ప్రవీణ్ సామల, శరవ్ సుబ్రమణియన్, సచ్చిదానంద ప్రభు, సతీష్ పంచాక్షరం, సతి శివం, శ్యామ్ బైరా, శ్రీజిత్ శ్రీనివాసన్, గుప్తా, శ్రీని సుబ్రమణియన్, వంశీ కృష్ణ ఇరువారం, ధీరజ్ రెడ్డి పోల తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు.ఇళయరాజా సంగీత ప్రయాణానికి యాభై సంవత్సరాలు అనే సందర్భంలో జరిగిన ఈ కార్యక్రమం తరాలను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాటలను ఆస్వాదిస్తున్న తరం పక్కనే నేటి యువతరం కూడా అదే సంగీతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించింది. వివిధ వయసులు, భాషలు, ప్రాంతాలకు చెందిన వేలాది మంది సంగీతంతో ఒక్కటయ్యారు.
అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు
అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు విద్యారంగానికి భారీ విరాళం అందించారు. టెక్సాస్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్కు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు ఏకంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.167 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళం అందించిన అనురాధ, వికాస్ సిన్హా దంపతుల పేరుతోనే కొత్త కాలేజీకి ‘అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్’ అని పేరు పెట్టనున్నారు.AI, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విద్య, పరిశోధనలకు ఈ కాలేజీ కేంద్రంగా పనిచేయనుంది. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ సైన్స్, లెర్నింగ్ టెక్నాలజీస్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ కాలేజీ ఉపయోగపడుతుందని వర్సిటీ అధ్యక్షుడు హారిసన్ కెల్లర్ తెలిపారు.ఈ విరాళంతో కాలేజీ నాయకత్వం, విద్యార్థుల స్కాలర్షిప్లు, ప్రొఫెసర్షిప్లు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతుగా ఆరు శాశ్వత ఎండోమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే *అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్*ను కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇది వర్సిటీలోని వివిధ విభాగాల మధ్య AI, డేటా సైన్స్ పరిశోధనలకు సమన్వయం చేస్తూ పరిశ్రమలతో భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనుంది.చదువు కోసం అమెరికాకు.. ఇప్పుడు భారీ విరాళంవికాస్, అనురాధ ఇద్దరూ భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. వికాస్ సిన్హా నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీలోనూ చదివి, 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచే పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాడ్కామ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు.సిన్హా దంపతులు ఇప్పటికే UNTకు పలు సందర్భాల్లో భారీగా అండగా నిలిచారు. 2024లో వారు అందించిన విరాళంతో అనురాధ అండ్ వికాస్ సిన్హా డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, అధ్యాపకులు, పరిశోధనలకు మద్దతుగా ఎండోమెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదికే మరో భారీ విరాళంతో సిన్హా ఇన్నోవేషన్ ల్యాబ్ ఫర్ డేటా సైన్స్ను ఏర్పాటు చేశారు.“మాకు ఈ విరాళం అంటే అవకాశాన్ని మరో తరానికి అందించడం. వలస వచ్చినవారు అమెరికన్ డ్రీమ్లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. దాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్య మా జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరికొందరికి తెరిచి ఉంచాలనుకుంటున్నాం” అని వికాస్ సిన్హా తెలిపారు.AI, డేటా ఆధారంగా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్త తరం విద్యార్థులను అందుకు సిద్ధం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం ఈ కొత్త కాలేజీ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!)
క్రైమ్
అనంత ఘోర ప్రమాదం: యువతి స్పాట్ డెడ్.. ఆస్పత్రిలో మరొకరు
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్ను ఢీకొట్టి ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అందులో ఉన్న ఓ యువతి అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గాయపడ్డ మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉదయం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి అనంతపురం వస్తున్న టాటా సఫారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్ను ఢీకొట్టి.. అక్కడి హోటల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని గుత్తికి చెందిన హరితగా పోలీసులు గుర్తించారు.అనంతపురం హౌసింగ్ బోర్డుకు చెందిన శ్రీధర్రెడ్డి, సింగనమల మండలం సలకం చెరువుకు చెందిన కుమార్, గుత్తికి చెందిన హరితతో పాటు మరో యువతి ప్రమాద సమయంలో కారులో ఉన్నారు. మరో యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ఇద్దరు యువకులకు కూడా గాయాలు కావడంతో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ముగ్గురిలో మరణించిన మరొకరు ఎవరనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ప్రమాద సమయంలో కారు ఎందుకు అదుపుతప్పిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్కు నిద్రమత్తు వచ్చిందా? లేదంటే మద్యం సేవించి వాహనం నడిపారా? అనే కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ప్రియుడితో పట్టాలపై ముచ్చట్లు.. ఇంతలో విషాదం
మహిళా బైకర్ ఘటన : నిందితుడు జిమ్ ఓనర్, బాడీ బిల్డర్?
హర్యానాలోని గురుగ్రామ్లో తన స్నేహితుడి మారుతి సియాజ్ కారుతో మహిళా బైకర్ సియాను ఢీకొట్టిన ఘటనలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. సియా పట్ల అనుచితంగా ప్రవర్తించి, వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది.దీంతో కారు యజమాని స్పందించారు. తన కారును రెండు రోజుల కరితం స్నేహితుడి కిచ్చానని, తనకు ఈ ప్రమాదానికి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కళ్యాణ్ బైన్స్లా వెలుగులోకి వచ్చాడు. దీంతో నిందితుడి వివరాలు నెట్టింట సంచలనంగా మారాయి. అలాగే ఈ కేసును స్యుమోటోగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. పల్వాల్కు చెందిన, KBT జిమ్ యజమాని అని తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ ఫోటోలో కండలుతిరిగి ఫోటోలతోపాటు, తనను తాను 'అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్, 'భారత రగ్బీ జట్టు' సభ్యుడిని అని చెప్పుకున్నాడు. అతను 'అమెచ్యూర్ ఒలింపియా ఇండియా'(Amateur Olympia India) అనే బాడీ బిల్డింగ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచానని కూడా అతను పేర్కొన్నాడు. అయితే ఈ వివరాలను ధృవీకరించాల్సి ఉంది. బైన్స్లా ఇన్స్టాలో కసరత్తు చేస్తూ, కండలు చూపిస్తూ కనిపిస్తాడు. ఇతనికి ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. అయితే ఈ ఘటన తరువాత అతని అకౌంట్ను డియాక్టివేట్ చేశాడు.ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటనఢిల్లీ-ఎన్సీఆర్ రోడ్లపై భద్రత మరింత ప్రశ్నార్థకంగా నిలిచింది. . ఒక మహిళ బైక్ నడపడాన్ని జీర్ణించుకోలేక, నిన్న గురుగ్రామ్ రోడ్లపై అనే మహిళా మోటార్సైక్లిస్ట్ను ఢీకొట్టడం ద్వారా కళ్యాణ్ బైన్స్లా ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు సోషల్మీడియాలో దుమారం రేగింది.కండలు పెంచినంత మాత్రాన నువ్వు 'మర్ద్' (అసలైన మగాడివి) అయిపోవు. అలా ఒకరిని గుద్ది పారిపోవడం కరెక్ట్ కాదు అంటూ మండి పడుతున్నారు.ఇదీ చదవండి: గురుగ్రామ్లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్మాట’!కాగా ఆదివారం రాత్రి, కారులోని వ్యక్తులు తనను వేధిస్తున్న వీడియోను ఆ మహిళ షేర్ చేశారు. ఈ వీడిమో కారు కుడివైపుకు దూసుకెళ్లి, ఆమెను పక్క నుండి ఢీకొట్టి, వేగంగా వెళ్లిపోయింది. ఆమె రోడ్డుపై పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.
మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన
గురుగ్రామ్లో ఒక మహిళా బైకర్ను కారుతో ఢీకొట్టి, పారిపోయిన ఘటన, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కారు నంబరుతో సహా బాధితురాలు షేర్ చేయడంతో కారు యజమాని మీడియా ద్వారా స్పందించారు. దీంతో ఆయన ప్రకటన కీలకంగా మారింది.వాహనాన్నిఎవరు నడిపారనే దానిపై కారు యజమాని మనీష్ స్పష్టత ఇచ్చారు. కారు తనదేనని యజమాని అంగీకరించినప్పటికీ, ఈ ప్రమాద ఘటనలో తన పాత్ర ఏమీ లేదన్నారు. తాను ఆర్మీ ఉద్యోగినని, ప్రస్తుతం తాను విధి నిర్వహణలో భాగంగా అస్సాంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తన స్నేహితుడు కళ్యాణ్ కారు నడిపినట్టు వెల్లడించారు. తన స్నేహితుడు తన కుటుంబం నుండి కారును తీసుకున్నాడని తెలిపారు.ఇదీ చదవండి: గురుగ్రామ్లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్మాట’!సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే తనకు ఈ ఘటన గురించి తెలిసిందని ఆయన చెప్పారు. తన స్నేహితుడు కళ్యాణ్ సింగ్ రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లాలని చెప్పి కారును తీసుకున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే తాను తన స్నేహితుడికి ఫోన్ చేశానని, కానీ అతను ఫోన్ తీయలేదని మనీష్ చెప్పారు.. తన తండ్రిని, ఇతరులను కూడా అతని ఇంటికి పంపించానని, కళ్యాణ్ సింగ్ హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందినవాడని కూడా కూడా చెప్పారు. కాగా 'మారుతి సుజుకి సియాజ్' (Maruti Suzuki Ciaz), దీని రిజిస్ట్రేషన్ నంబర్ HR30Y4949. ఇది హర్యానాలోని పల్వాల్ నివాసిమనీష్ పేరు మీద నమోదై ఉంది.
‘చచ్చిపో..’ అన్న భర్త.. నిజంగానే చచ్చిపోయిన భార్య!
వరంగల్ జిల్లా: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రిసోల్ గ్రామానికి చెందిన గుప్తేశ్వర్ బిష్యాన్కు అతడి మేనకోడలు మిల్లీ బిస్వాస్(21)తో ఈ ఏడాది జూన్ 14న పూరి జగన్నాథ దేవాలయంలో వివాహం జరిగింది. వివాహ అనంతరం ఆ దంపతులు వరంగల్కు వచ్చి గీసుకొండ మండలం ధర్మారం గ్రామంలో కిరాయికి ఉంటున్నారు. ఈక్రమంలో గుప్తేశ్వర్ అనుమానంతో తరచూ భర్యను వేధింపులకు గురి చేసేవాడు. దీనిపై ఈ నెల 8న మిల్లీ తన తల్లికి ఫోన్ చేసి తనను భర్త వేధిస్తున్నాడని, తనకు భార్య అవసరం లేదని, ఇంటి నుంచి వెళ్లిపోయవాలని లేదా చనిపోవాలని అంటున్నాడని ఏడుస్తూ చెప్పింది. దీంతో కుటుంబీకులు ధర్మారం చేరుకుని పరిశీలించగా భర్త వేధింపులతో మిల్లీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు గుప్తేశ్వర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఇదీ చదవండి: కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం
వీడియోలు
సొంత పార్టీ దళిత నేతకు మరో నేత బెదిరింపులు.. వైరల్ అవుతున్న కాల్ రికార్డింగ్
ఢీకొట్టి పరార్.. రంగంలోకి మహిళా కమిషన్ కళ్యాణీ జైన్ స్లాపై మర్డర్ కేసు
5 లక్షలు ఇస్తా వారంలో రెండు సార్లు మాత్రమే.. ఛీ DHEE RAJU ఇంత నీచుడా?
ఆళ్ల నాని మృతి పట్ల YS జగన్ దిగ్భ్రాంతి
ఆళ్ల నాని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు
గిన్నెలు గట్టిగా తోమిండు.. కానీ, ఈ వీక్ కెప్టెన్ ఎవరంటే?
బిచ్చగాడు కాదు... బీజేపీ MLA
Big Breaking : మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి
కొబ్బరి బోండంలో సైనైడ్ పోసి హత్య.. మళ్లీ పోలీసుల చేతికి సాధిక్
చంద్రబాబు ఎలాంటివాడో నా కంటే వంశీకే బాగా తెలుసు కొడాలి నాని సెటైర్లు అదుర్స్

