‘నెతన్యాహూ ఫోన్ చేసి అంతా చెడగొట్టారు’
న్యూఢిల్లీ: తాము చర్చల మధ్యలో ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు చేసిన ఫోన్ కాల్ చేసి మొత్తం చెడగొట్టారని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్-అమెరికా ప్రతిష్టంభనలో ఒక కీలక పురోగతికి దారితీయగల చర్చలను పట్టాలు తప్పించింది మాత్రం కచ్చితంగా నెతన్యాహూ ఫోన్ కాలేనని అంటోంది. అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం చెందిన అనంతరం పాక్ నుంచి వెనుదిరిగిన కొన్ని గంటల తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా పలు ఆరోపణలు చేశారు. మేం చర్చల్లో బిజీగా ఉన్నాం, మా చర్చలు కీలక దశకు రాబోతున్న తరుణంలో నెతన్యాహూ నుండి వాన్స్కు ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత అంతా గందరగోళమైంది. అప్పటిదాకా సజావుగా సాగిన చర్చలు ఆ ఒక్క ఫోన్ కాల్ తర్వాత మొత్తం మారిపోయింది. అప్పటివరకూ అమెరికా-ఇరాన్ల మధ్య సాగిన చర్చలు మొత్తం ఇజ్రాయెల్కు లబ్ధి చేకూర్చాలనే దిశగా వెళ్లిపోయాయి. ఆ ఫోన్ కాల్తో అమెరికా-ఇరాన్ల దృష్టి మళ్లింది’ అంటూ అరాఘ్చీ పేర్కొన్నారు. తాము ఎంతో నమ్మకంతో పాకిస్తాన్కు చర్చలకు వచ్చామని, కానీ ఎటువంటి పురోగతి కనబడలేదన్నారు. ఇదీ చదవండి: ఇక నుంచి హర్మూజ్లోకి ఏ నౌక వచ్చినా..: ట్రంప్
‘విజయ్ అంటే విజయకాంత్ కాదు’
చెన్నై: తమిళనాడులో డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత నేత, సినీనటుడు “కెప్టెన్” విజయకాంత్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన భార్య ప్రేమలత పోరాడుతున్నారు. విజయకాంత్ 2023 డిసెంబరు 28న కన్నుమూశారు. కొన్ని నెలల క్రితం సినీనటుడు విజయ్ కూడా టీవీకే పేరుతో పార్టీని స్థాపించారు. అయితే, కొందరు విజయకాంత్ను విజయ్తో పోల్చుతుండడం సరికాదన్నట్లు ప్రేమలత మాట్లాడారు. తాజాగా ఆమె తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.విజయ్ను కొందరు విజయకాంత్తో పోల్చుతుండడం పట్ల తాను ఎలాంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేనని తెలిపారు. విజయకాంత్ కేవలం నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మాత్రమే కాదని, ప్రజల మధ్య వారి కోసం నిలిచిన నాయకుని చెప్పారు.“కెప్టెన్ ప్రజల నాయకుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన అభిమాన సంఘాలను రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల్లోకి వచ్చారు. ఏ సమస్య వచ్చినా ముందుగా అక్కడికి వెళ్లేవారు. ప్రజలతో నిలబడేవారు. నాయకుడు వేరుగా, ప్రజలు వేరుగా ఉంటే ఆ బంధం నిలబడదు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. విజయకాంత్ కలలు, లక్ష్యాలను నెరవేర్చడమే డీఎండీకే లక్ష్యం. రాజకీయాల్లో లింగ వివక్ష లేదు. నేను పురుషుడు, మహిళ అనే కోణంలో ఆలోచించను. సరైనది ఏదైతే అదే చేస్తాం. మాతృభాషను రక్షించాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి. మాతృభాష మన కళ్లలా.. ఇతర భాషలు కళ్లద్దాల్లా.. అవసరమైనప్పుడు వాడుతాం. తమిళనాడులో ఎప్పటినుంచో రెండు భాషల విధానం ఉంది. మూడు భాషల విధానం లేదు’ అని తెలిపారు.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లి హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఫిల్ సాల్ట్తో ఆర్సీబీ ఇన్నింగ్స్ను ప్రారంభించిన విరాట్.. ముంబై బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.తొలుత దూకుడుగా ఆడిన కోహ్లి, మిడిల్ ఇన్నింగ్స్లో కాస్త నెమ్మదించాడు. ఫిల్ సాల్ట్తో కలిసి తొలి వికెట్ ఏకంగా 124 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నమోదు చేశాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 50 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో కింగ్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవేఐపీఎల్లో ముంబై ఇండియన్స్పై 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్గా విరాట్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, సీఎస్కేపై 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు.అదేవిధంగా టీ20ల్లో అత్యధిక సెంచరీ (100+) భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆయన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(29), పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం(28)లను కోహ్లి అధిగమించాడు.
నెంబర్వన్.. అల్లు అర్జున్ ఆలోచన అదేనా?
స్టార్స్ జీవితంలో ఒక భారీ విజయం దక్కడం సులభమే కావచ్చు... కానీ దానిని నిలబెట్టుకోవడం కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ డమ్ అనేది చాలా అస్థిమితంగా మారింది. ఖచ్చితంగా నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు ఒక్కో ఏడాది ఒక్కో హీరో చిత్రానికి పట్టం కడుతుండడంతో నెంబర్లాట దోబూచులాటగా మారుతోంది.ఈ పరిస్థితిలో ప్రస్తుతానికి మాత్రం ఇటు కలెక్షన్స్ పరంగా చూసినా అటు రెమ్యునరేషన్ పరంగా చూసినా, అల్లు అర్జున్ నెం1గా నిలుస్తున్నాడనేది నిర్వివాదం. తాజాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన చిత్రం ’రాకా’ కోసం ఏకంగా రూ.300 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుని సమకాలీన హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు బన్నీ. ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకూ 5, 6 స్థానంలో ఉన్న స్టైలిష్ స్టార్ కాస్తా ఒక్క ఉదుటున నెం1 ఐకాన్ స్టార్గా చేసింది పుష్పరాజ్ పాత్ర. ప్రస్తుతం అల్లు అర్జున్ హవా నడుస్తున్నప్పటికీ ఇది వన్ సినిమా వండర్ అనీ త్వరలోనే మరో టాప్ హీరో నెం1 ఛెయిర్ని ఆక్రమిస్తాడని సినీ పండితుల్లో పలువురు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ మాత్రం ఈ ఊహాగానాలను పటాపంచలు చేయాలని, తన స్టార్ డమ్ని మరింత పెంచే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం 2030 వరకూ తన ప్లేస్ని శాశ్వతం చేసుకునేలా తదుపరి ప్రాజెక్టులను ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు.పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎంపికలు చూస్తే ఆ విషయం సులభంగా అర్ధమవుతుంది. జవాన్ లాంటి భారీ హిట్ ఇచ్చిన అట్లీని తన తదుపరి సినిమాకు ఎంపిక చేసుకోవడం ద్వారా తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాదిలో భారీ హిట్స్కి కేరాఫ్గా నిలిచిన లోకేష్ కనగరాజ్, అదే విధంగా మళయాళ పరిశ్రమకు చెందిన బాసిల్ జోసెఫ్లను ఐకాన్ స్టార్ జోడీ కట్టడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం, అతని రాబోయే ప్రాజెక్ట్లతో ముడిపడి ఉన్న ఇతర పేర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే విభిన్నమైన జానర్ల మిశ్రమాన్ని అందించడం ద్వారా భారతీయ చిత్రసీమలో తనదైన హవాను ఆయన కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు అర్ధం అవుతుంది.ఉత్కంఠభరితమైన కథనాలకు చిరునామా లాంటి సందీప్ రెడ్డి వంగా , విభిన్న తరహా యాక్షన్ విన్యాసాలకు కేరాఫ్ లాంటి ప్రశాంత్ నీల్ , జనరంజక చిత్రాలకు పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ విలక్షణమైన శైలికి మరోపేరు లాంటి బాసిల్ జోసెఫ్, వైవిధ్యభరిత హీరోచిత కధలను తెరకెక్కించే లోకేష్ కనగరాజ్ ల వరకు ఆయన ఎంపిక వెనుక ఆలోచనల గాఢతను మనకు తెలియజెబుతాయి. ఈ దర్శకుల చిత్రాలు కమర్షియల్ సక్సెస్కు గ్యారెంటీతో పాటు అవకాశాన్ని బట్టి సెన్సేషన్ను కూడా సృష్టించగలవు. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే నెం1 కుర్చీకి అత్యంత సమీపంలో ఉంటూ, స్పిరిట్ వంటి సినిమాలతో దూసుకొస్తున్న ప్రభాస్ , రాజమౌళి సినిమా ద్వారా మహేష్ బాబు...లతో పాటు పలువురు టాప్ హీరోలు బన్నీ దక్కించుకున్న స్థానానికి గట్టి పోటీని ఇవ్వడం ఖాయం. వీటిని తిప్పికొట్టేలా బన్నీ ఎంపికలు ఉంటాయా లేదా అనేది త్వరలోనే తేలుతుంది.
ప్రభుత్వానికి భేషజాలు లేవు
హద్దులెరుగని జ్ఞానం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా..
నిషేధం కాదు... కంటెంట్ కావాలి!
ఆర్సీబీ జోరు.. ముంబైకి హ్యాట్రిక్ ఓటమి
విజయ్ జననాయగన్ లీక్ సీన్స్ కలకలం
ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ?
‘నెతన్యాహూ ఫోన్ చేసి అంతా చెడగొట్టారు’
తక్కువ ధరకే లభించే వంట గ్యాస్ ఏది?.. ఎల్పీజీనా, ఎలక్ట్రిక్నా, హైడ్రోజన్నా?
‘విజయ్ అంటే విజయకాంత్ కాదు’
రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్!
నా పెంపకంలో ఈ స్థాయికి ఎదిగింది
సిలిండర్ కథ కంచికి.. హైడ్రోజన్ పొయ్యి మన ఇంటికి!
దానికి టైమ్ ఉంది.. కొంచెం ఓపిక పట్టాలి!
చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..?
'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో
నేడు పాక్ లో కాల్పుల విరమణపై చర్చలు
పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు..
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఇలా..
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ముగిసిన చర్చలు.. ఇరాన్-అమెరికా కీలక వ్యాఖ్యలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు.
ఆ తప్పే మా కొంపముంచింది: సన్రైజర్స్ కెప్టెన్
ఇరాన్కు కొత్త టెన్షన్..
‘భారత్ వ్యతిరేక సెంటిమెంట్తో కొంపముంచిన నిర్ణయం’
అప్పులు చేస్తే అధికార హోదాలో సీఎంగా ఉండాలి కానీ.. దేశం విడిచిపోవడం ఏమిటో!!
చర్చలు విఫలమైతే సర్వనాశనమే: పాక్ ప్రధాని
బీడు భూమితో లాభాలు.. రైతులకు మాధవన్ చూపిన దారి
ప్రభుత్వానికి భేషజాలు లేవు
హద్దులెరుగని జ్ఞానం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా..
నిషేధం కాదు... కంటెంట్ కావాలి!
ఆర్సీబీ జోరు.. ముంబైకి హ్యాట్రిక్ ఓటమి
విజయ్ జననాయగన్ లీక్ సీన్స్ కలకలం
ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ?
‘నెతన్యాహూ ఫోన్ చేసి అంతా చెడగొట్టారు’
తక్కువ ధరకే లభించే వంట గ్యాస్ ఏది?.. ఎల్పీజీనా, ఎలక్ట్రిక్నా, హైడ్రోజన్నా?
‘విజయ్ అంటే విజయకాంత్ కాదు’
రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్!
నా పెంపకంలో ఈ స్థాయికి ఎదిగింది
సిలిండర్ కథ కంచికి.. హైడ్రోజన్ పొయ్యి మన ఇంటికి!
దానికి టైమ్ ఉంది.. కొంచెం ఓపిక పట్టాలి!
చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..?
'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో
నేడు పాక్ లో కాల్పుల విరమణపై చర్చలు
పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు..
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఇలా..
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ముగిసిన చర్చలు.. ఇరాన్-అమెరికా కీలక వ్యాఖ్యలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు.
ఆ తప్పే మా కొంపముంచింది: సన్రైజర్స్ కెప్టెన్
ఇరాన్కు కొత్త టెన్షన్..
‘భారత్ వ్యతిరేక సెంటిమెంట్తో కొంపముంచిన నిర్ణయం’
అప్పులు చేస్తే అధికార హోదాలో సీఎంగా ఉండాలి కానీ.. దేశం విడిచిపోవడం ఏమిటో!!
చర్చలు విఫలమైతే సర్వనాశనమే: పాక్ ప్రధాని
బీడు భూమితో లాభాలు.. రైతులకు మాధవన్ చూపిన దారి
ఫొటోలు
‘డెకాయిట్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
కరీనకపూర్ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్ స్టైలిష్ లుక్..!
ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)
హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)
తమిళ హీరోయిన్ అతుల్య రవి డీసెంట్ లుక్స్ (ఫోటోలు)
‘పాపం ప్రతాప్’ సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
ఆర్టెమిస్-2 గ్రాండ్ సక్సెస్...నాసా విడుదల చేసిన (ఫొటోలు)
శర్వానంద్ 'బైకర్' థాంక్యూ మీట్ (ఫోటోలు)
ట్రెండింగ్లో తెలుగు హీరోయిన్ మానస వారణాసి (ఫోటోలు)
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)
సినిమా
నెంబర్వన్.. అల్లు అర్జున్ ఆలోచన అదేనా?
స్టార్స్ జీవితంలో ఒక భారీ విజయం దక్కడం సులభమే కావచ్చు... కానీ దానిని నిలబెట్టుకోవడం కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ డమ్ అనేది చాలా అస్థిమితంగా మారింది. ఖచ్చితంగా నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు ఒక్కో ఏడాది ఒక్కో హీరో చిత్రానికి పట్టం కడుతుండడంతో నెంబర్లాట దోబూచులాటగా మారుతోంది.ఈ పరిస్థితిలో ప్రస్తుతానికి మాత్రం ఇటు కలెక్షన్స్ పరంగా చూసినా అటు రెమ్యునరేషన్ పరంగా చూసినా, అల్లు అర్జున్ నెం1గా నిలుస్తున్నాడనేది నిర్వివాదం. తాజాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన చిత్రం ’రాకా’ కోసం ఏకంగా రూ.300 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుని సమకాలీన హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు బన్నీ. ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకూ 5, 6 స్థానంలో ఉన్న స్టైలిష్ స్టార్ కాస్తా ఒక్క ఉదుటున నెం1 ఐకాన్ స్టార్గా చేసింది పుష్పరాజ్ పాత్ర. ప్రస్తుతం అల్లు అర్జున్ హవా నడుస్తున్నప్పటికీ ఇది వన్ సినిమా వండర్ అనీ త్వరలోనే మరో టాప్ హీరో నెం1 ఛెయిర్ని ఆక్రమిస్తాడని సినీ పండితుల్లో పలువురు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ మాత్రం ఈ ఊహాగానాలను పటాపంచలు చేయాలని, తన స్టార్ డమ్ని మరింత పెంచే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం 2030 వరకూ తన ప్లేస్ని శాశ్వతం చేసుకునేలా తదుపరి ప్రాజెక్టులను ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు.పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎంపికలు చూస్తే ఆ విషయం సులభంగా అర్ధమవుతుంది. జవాన్ లాంటి భారీ హిట్ ఇచ్చిన అట్లీని తన తదుపరి సినిమాకు ఎంపిక చేసుకోవడం ద్వారా తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాదిలో భారీ హిట్స్కి కేరాఫ్గా నిలిచిన లోకేష్ కనగరాజ్, అదే విధంగా మళయాళ పరిశ్రమకు చెందిన బాసిల్ జోసెఫ్లను ఐకాన్ స్టార్ జోడీ కట్టడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం, అతని రాబోయే ప్రాజెక్ట్లతో ముడిపడి ఉన్న ఇతర పేర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే విభిన్నమైన జానర్ల మిశ్రమాన్ని అందించడం ద్వారా భారతీయ చిత్రసీమలో తనదైన హవాను ఆయన కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు అర్ధం అవుతుంది.ఉత్కంఠభరితమైన కథనాలకు చిరునామా లాంటి సందీప్ రెడ్డి వంగా , విభిన్న తరహా యాక్షన్ విన్యాసాలకు కేరాఫ్ లాంటి ప్రశాంత్ నీల్ , జనరంజక చిత్రాలకు పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ విలక్షణమైన శైలికి మరోపేరు లాంటి బాసిల్ జోసెఫ్, వైవిధ్యభరిత హీరోచిత కధలను తెరకెక్కించే లోకేష్ కనగరాజ్ ల వరకు ఆయన ఎంపిక వెనుక ఆలోచనల గాఢతను మనకు తెలియజెబుతాయి. ఈ దర్శకుల చిత్రాలు కమర్షియల్ సక్సెస్కు గ్యారెంటీతో పాటు అవకాశాన్ని బట్టి సెన్సేషన్ను కూడా సృష్టించగలవు. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే నెం1 కుర్చీకి అత్యంత సమీపంలో ఉంటూ, స్పిరిట్ వంటి సినిమాలతో దూసుకొస్తున్న ప్రభాస్ , రాజమౌళి సినిమా ద్వారా మహేష్ బాబు...లతో పాటు పలువురు టాప్ హీరోలు బన్నీ దక్కించుకున్న స్థానానికి గట్టి పోటీని ఇవ్వడం ఖాయం. వీటిని తిప్పికొట్టేలా బన్నీ ఎంపికలు ఉంటాయా లేదా అనేది త్వరలోనే తేలుతుంది.
ఆశా భోస్లే మరణం.. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే?
లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం వేళ ఆశా సింగర్గా ఎంత సంపాందించారన్న విషయంపై బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆస్తులు దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై తన గాత్రాన్ని వినిపించిన ఆమె బాగానే సంపాదించారు. అంతే కాకుండా ఆమె సొంత రెస్టారెంట్ను ఆశాస్ పేరుతో ప్రారంభించారు. ఇది దుబాయ్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో విస్తరించింది. ఆశా భోస్లే తన డబ్బును రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజా నివేదికల ప్రకారం కేవలం ముంబై, పూణేలలోని విలాసవంతమైన గృహాలతో పాటు ఆమె ఆస్తుల విలువ రూ.80 -రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం.
'అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయాం'.. మెగాస్టార్, ఎన్టీఆర్ నివాళి
ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మరణంపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె గాత్ర తరతరాలుగా ఎన్నో రకాల భావోద్వేగాలను మోసుకొస్తూ.. భారతీయ సినిమాకు ఓ శాశ్వతమైన తోడుగా నిలిచిందని ట్వీట్ చేశారు. ఆమె ప్రతి పాటకు తీసుకొచ్చిన అప్రయత్నమైన సౌందర్యాన్ని.. బహుముఖ ప్రజ్ఞను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని మెగాస్టార్ రాసుకొచ్చారు. భారతీయ సినిమా అత్యంత అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయిందన్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చిరు పోస్ట్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ నివాళి..లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారి మరణ వార్త విని తీవ్ర బాధపడ్డానని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆమె మధురమైన గాత్రం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణనాడిగా నిలిచిందన్నారు. ఆమె స్వరం లక్షలాది హృదయాలను తాకిందని.. ఆమె తరతరాలుగా నిలిచిపోయే వారసత్వాన్ని వదిలివెళ్లారని సంతాపం వ్యక్తం చేశారు. అది ఎల్లప్పుడూ గౌరవంతో, ప్రేమతో గుర్తుంచుకోవాలని.. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే సేవలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.లెజండరి సింగర్, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) ఇవాళ కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. Growing up meant waking up to melodies that felt like home, and so many of them carried the voice of Asha Bhosle ji.From old radios in the morning to late-night songs playing softly in the background, she was always there, without us even realizing how deeply she shaped our… pic.twitter.com/OV8Ythx6ms— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) April 12, 2026 Asha Bhosle ji’s voice has been a timeless companion to Indian cinema, carrying a spectrum of emotions across generations. I have always admired the effortless grace and versatility she brought to every song.Indian cinema has lost one of its most irreplaceable voices. My… pic.twitter.com/3zpUS7MqNj— Chiranjeevi Konidela (@KChiruTweets) April 12, 2026 Deeply saddened by the news of Asha Bhosle ji’s passing. Her magical voice was the heartbeat of Indian cinema for decades and touched millions of hearts. She leaves behind a legacy that will live on for generations and will always be remembered with respect and love. My deepest… pic.twitter.com/U81F2NBBeD— Jr NTR (@tarak9999) April 12, 2026
మృణాల్.. టాలీవుడ్ హీరోనే పెళ్లి చేసుకో : అల్లు అరవింద్
స్టేజ్పై సరదాగా మాట్లాడే టాలీవుడ్ ప్రముఖుల్లో నిర్మాత అల్లు అరవింద్ ఒకరు. సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో ఆయన స్పీచ్ ఎప్పుడూ నవ్వించేలా ఉంటుంది. అలాగే టాలెంట్ ఉన్న యువ నటీనటులను ప్రోత్సహించేలా ఆయన మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాళ్ల ప్రేమ విషయాలను కూడా బయటపెడుతుంటాడు. అయితే ఆయనకు తెలిసి అంటాడో తెలియక అంటాడో తెలియదు కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కొన్నిసార్లు నిజమవుతుంటాయి. ఓ సినిమా ఈవెంట్లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ..‘తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు.కాబట్టి ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని దీవించగా..ఆయన మాటలే నిజమై.. వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా ఆయన మరో నటిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. సీతారామం ఫేం మృణాల్ ఠాకుర్ని కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.తాజాగా ఆయన అడివి శేష్-మృణాల్ జంటగా నటించిన ‘డెకాయిట్’ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృణాల్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. లావణ్య మాదిరే నువ్వు కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. ‘ఇంతకు ముందు ఒక అమ్మాయిని(లావణ్య త్రిపాఠి) దీవించాను. ఆమె మా వరుణ్ తేజ్ భార్య అయిపోయింది. అలాగే నువ్వు(మృణాల్) కూడా ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాకు(టాలీవుడ్) కావాలి. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని అరవింద్ నవ్వుతూ అన్నాడు. #AlluAravind to #MrunalThakur,"You should marry somebody from here (Tfi ) and settle."We all know what happened when #AlluAravind said this on stage last time🤫😙 pic.twitter.com/3F9KQxvYft— MovieMind (@_MovieMind) April 12, 2026
క్రీడలు
ముంబైపై ఆర్సీబీ ఘన విజయం
MI vs RCB Live Updates: ఐపీఎల్-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.ఆర్సీబీ ఘన విజయంఆర్సీబీ తిరిగి గెలుపు బాట పట్టింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్ఫర్డ్(71 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(40), ర్యాన్ రికెల్టన్(37), సూర్యకుమార్ యాదవ్(33) ఫర్వాలేదన్పించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు, జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా తలా వికెట్ సాధించారు.ముంబై నాలుగో వికెట్ డౌన్ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. జాకబ్ డఫీ బౌలింగ్లో ఔటయ్యాడు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 46 బంతుల్లో 120 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో ముంబై రెండు వికెట్లు డౌన్ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో తొలి బంతికి ర్యాన్ రికెల్టన్(37) ఔట్ కాగా.. ఐదో బంతికి తిలక్ వర్మ(1) ఔటయ్యారు. 9 ముంబై ఇడియన్స్కు స్కోర్: 85/2రోహిత్ రిటైర్డ్ హార్ట్ముంబైకి భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 7 ఓవర్లకు ముంబై స్కోర్: 72/0దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లు3 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(29), రోహిత్ శర్మ(9) ఉన్నారు.దుమ్ములేపిన ఆర్సీబీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 78) టాప్ స్కోరర్గా నిలవగా.. రజత్ పాటిదార్(53), విరాట్ కోహ్లి(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరితో పాటు టిమ్ డేవిడ్(16 బంతుల్లో 34) మెరుపులు మెరిపించాడు.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్రజత్ పాటిదార్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేసిన పాటిదార్.. శాంట్నర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 194/3ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 38 బంతుల్లో 58 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. 14.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 185-2ఆర్సీబీ తొలి వికెట్ డౌన్ఫిల్ సాల్ట్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 36 బంతుల్లో 78 పరుగులు చేసిన సాల్ట్.. శార్థూల్ ఠాకూర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 167/1. క్రీజులో విరాట్ కోహ్లి(47), రజత్ పాటిదార్(9 బంతుల్లో 34)ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు7 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(49), విరాట్ కోహ్లి(24) ఉన్నారు.3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 33/03 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(13), ఫిల్ సాల్ట్(17) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ప్లేయింగ్ ఎలెవన్లోకి మిచెల్ శాంట్నర్, మయాంక్ మార్కండే వచ్చారు. మరోవైపు ఆర్సీబీ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. జోష్ హాజిల్వుడ్కు విశ్రాంతి ఇవ్వగా జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా
అరుదైన మైలురాయిని తాకిన గిల్.. కోహ్లి కంటే వేగంగా..!
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 12) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో గిల్ 4000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.గిల్ ఈ మైలురాయిని 118వ ఇన్నింగ్స్లో చేరుకోగా.. రాహుల్ 105, క్రిస్ గేల్ 112, డేవిడ్ వార్నర్ 114, జోస్ట్ బట్లర్ 116 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితా టాప్-5లో గిల్ రెండో భారత ప్లేయర్గా నిలిచాడు. దిగ్గజం విరాట్ కోహ్లికి ఈ మైలురాయిని తాకేందుకు 128 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. గిల్ అతని కంటే వేగంగా ఈ ఘనత సాధించాడు.బంతుల ప్రకారం చూస్తే.. అత్యంత వేగంగా 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉండగా.. దిగ్గజం విరాట్ కోహ్లి టాప్-5లో కూడా లేడు.అత్యంత వేగంగా (బంతులు) 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు..సూర్యకుమార్ యాదవ్- 2714శుభ్మన్ గిల్- 2875సురేష్ రైనా- 2886 ఎంఎస్ ధోని- 2887 సంజూ శాంసన్- 2915మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతోంది.
IPL 2026: రాకాసి బౌన్సర్ దెబ్బకు పుర్రె పగిలిపోయేది..!
లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ ఛౌదరి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 2026 ఎడిషన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఫాస్ట్ బౌలర్ అశోక్ కుమార్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ ముకుల్ ఛౌదరి తలను బలంగా తాకింది. గంటకు 150 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతి ముకుల్ హెల్మెట్ను తగిలి థర్డ్ మన్ దిశగా చాలా దూరం వెళ్లింది. దీన్ని బట్టి బంతి ఎంత వేగంగా వచ్చిందో అంచాన వేయవచ్చు. pic.twitter.com/c7dQanPPqN— crictalk (@crictalk7) April 12, 2026ఈ దెబ్బకు హెల్మెట్ ఉన్నా, ముకుల్ దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన తర్వాత మైదానం మొత్తం ఒక్క క్షణం నిశబ్దం ఆవహించింది. ఫిజియో హుటాహుటిన వచ్చి ముకుల్కు కంకషన్ టెస్ట్ చేశాడు. అదృష్టవశాత్తూ ముకుల్కు ఎలాంటి అపాయం జరగలేదు. ఒకవేళ ఆ బంతి హెల్మెట్ కవర్ చేయని ప్రాంతంలో తగిలి ఉంటే, ముకుల్ పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టంగా ఉండేది. ఒకవేళ ముకుల్ హెల్మెట్ లేకుండా బరిలోకి దిగుంటే అతని పుర్రె పగిలిపోయేది. అశోక్ ఎంత వేగవంతమైన బౌలరో ఇదివరకే రుజువైంది. ఈ సీజన్తోనే అరంగేట్రం చేసిన అతను.. క్రమం తప్పకుండా 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బంతి (154.2) కూడా అశోక్ ఖాతాలోనే ఉంది.ముకుల్ విషయానికొస్తే.. ఇతగాడు గత మ్యాచ్లో (కేకేఆర్పై) లక్నోను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపుపై ఎమాత్రం అంచనాలు లేని సమయంలో 27 బంతుల్లో 54 పరుగులు చేసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్లో ముకుల్ కొట్టిన 7 సిక్సర్లు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్తో ముకుల్ వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు. ముకుల్ కూడా ధోని తరహాలోనే వికెట్కీపింగ్ బ్యాటర్గా ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతుంది.
'అతడే మన బెస్ట్ బౌలర్.. గెలిచే మ్యాచ్లను దగ్గరుండి ఓడిస్తాడు'
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ వైఫల్యం కొనసాగుతోంది. బ్యాటింగ్లో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ, బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు పెద్ద మైనస్గా మారింది. శనివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది.220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుత జట్టులో సీనియర్ పేసర్గా ఉన్న జయదేవ్ ఉనద్కట్ దారుణంగా విఫలమవుతున్నాడు. గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అయితే జయదేవ్ పూర్తిగా తేలిపోయాడు.సరైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్లో అతడు తీవ్రంగా శ్రమించాడు. పంజాబ్ బ్యాటర్లు అతడి బౌలింగ్ను ఓ ఆట ఆడుకున్నాడు. ఉనద్కట్ తన మూడు ఓవర్ల కోటాలో 13.30 ఏకానమీతో 40 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అతడు విఫలమయ్యాడు.ఆ మ్యాచ్లో అయితే ఉనద్కట్ 3.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. ఈ రెండు మ్యాచ్లలో కూడా అతడు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. మొత్తంగా అతడు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి 4 వికెట్లు సాధించాడు. జయదేవ్ ఏకానమీ రేటు 10.90గా ఉంది.దీంతో ఇంతదారుణంగా విఫలమవుతున్నప్పటికి అతడిని ప్లేయింగ్ ఎలెవన్లో కొనసాగించడం పట్ల ఎస్ఆర్హెచ్ అభిమానులు మండిపడుతున్నారు. ఉనద్కట్ను సైతం ట్రోల్ చేస్తున్నారు. "బ్యాటింగ్లో కోహ్లి రన్ మిషన్ అయితే, బౌలింగ్లో ఉనద్కట్ ఒక రన్ మిషన్" అంటూ పోస్ట్లు పెడుతున్నారు. 'జయదేవ్ ఉనద్కట్ మన బెస్ట్ బౌలర్.. గెలిచే మ్యాచ్లను దగ్గరుండి ఓడిస్తాడు' అని మరొక నెటిజన్ ఈ సెటైరికల్ పోస్ట్ చేశాడు. అతడి స్ధానంలో ప్రఫుల్ హింగే, ఓంకర్ తర్మాలే వంటి యువ పేసర్లకు అవకాశమివ్వాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. తదుపరి మ్యాచ్కైనా ఉనద్కట్పై ఎస్ఆర్హెచ్ వేటు వేస్తుందో లేదో చూడాలి.చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! ఒకవేళ అదే జరిగితే?
న్యూస్ పాడ్కాస్ట్
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, వారి నాగరికతను నాశనం చేస్తాం. తీవ్రంగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి దినదిన గండం... ఐదో రోజూ స్తంభించిన ఓపీ, అత్యవసర వైద్యసేవలు
లోక్సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
బిజినెస్
ఇల్లు ఈజీగా కొనండి.. ధనవంతులు అవ్వండి!!
రాబర్ట్ కియోసాకి రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించే ఒక మార్గదర్శి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి సంపదను ఎలా సృష్టించాలో ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తుంది. అసలు తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి? సొంత ఇంటి కల ఎలా నెరవేర్చుకోవాలి? ఆ వివరాలు మీకోసం..ఆస్తి అంటే..కియోసాకి చెప్పే ప్రాథమిక సూత్రం ఒకటే: మీ జేబులోకి డబ్బును తీసుకొచ్చేది 'ఆస్తి' (Asset), మీ జేబులో నుండి డబ్బును బయటకు పంపేది 'అప్పు' (Liability). చాలా మంది తాము నివసించే ఇంటిని అతిపెద్ద ఆస్తిగా భావిస్తారు. కానీ, కియోసాకి దృష్టిలో అది ఒక లయబిలిటీ. ఎందుకంటే దాని వల్ల ప్రతి నెలా మెయింటెనెన్స్, ట్యాక్సుల రూపంలో డబ్బు బయటకు వెళ్తుంది. అదే మీరు ఒక ఇంటిని కొని అద్దెకు ఇస్తే, అది మీకు ప్రతి నెలా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుడు మాత్రమే అది నిజమైన 'ఆస్తి' అవుతుంది.తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ శ్రీకారంరియల్ ఎస్టేట్ అంటే కోట్ల రూపాయలు ఉండాలని భయపడక్కర్లేదు. తక్కువ మొత్తంతో ప్రారంభించడానికి ఈ మార్గాలు చూడండి..ఓపెన్ ప్లాట్లు: నగరం శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చిన్న ప్లాట్లను కొనుగోలు చేయడం ఉత్తమం. వీటి ధర తక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి.రీట్స్: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs)తో స్టాక్ మార్కెట్ లాగే, మీరు రియల్ ఎస్టేట్లో నేరుగా ఆస్తి కొనకుండానే తక్కువ మొత్తంతో (కొన్ని వేల రూపాయలతో) షేర్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు.క్రౌడ్ ఫండింగ్: గ్రూపుగా ఏర్పడి నమ్మకమైన స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఉమ్మడిగా ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా రిస్క్, పెట్టుబడి భారం తగ్గుతాయి.సొంతిల్లు సాకారమయ్యే టిప్స్సొంత ఇంటి కల నెరవేరాలంటే కియోసాకి స్టైల్లో ఈ వ్యూహాలు అనుసరించండి..ముందుగా ఆదాయ వనరుల సృష్టి: నేరుగా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే, మొదట చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం (Passive Income) మీ ఇంటి EMI చెల్లించేలా ప్లాన్ చేయండి.లోకేషన్ ముఖ్యం: అభివృద్ధి చెందుతున్న హైవేలు, ఐటీ కారిడార్లు లేదా మెట్రో ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాలను గుర్తించి ముందే పెట్టుబడి పెట్టండి.పన్ను ప్రయోజనాలు: రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లభించే పన్ను మినహాయింపుల గురించి అవగాహన పెంచుకోండి. ఇది మీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.కియోసాకి గోల్డెన్ రూల్: 'డబ్బు కోసం పని చేయకండి'ధనవంతులు డబ్బు కోసం పని చేయరు, వారి డబ్బు వారి కోసం పని చేసేలా చూసుకుంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన మార్గం."పెద్ద ఇల్లు కొనడం తప్పు కాదు, కానీ ఆ ఇంటి ఖర్చులను మీ జేబులో నుండి కాకుండా, మీరు పెట్టిన ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలతో చెల్లించడమే అసలైన ఆర్థిక తెలివితేటలు."
వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్
ముంబై: దేశీయంగా సహజసిద్ధమైన వజ్రాభరణాల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఇది రూ. 1.50 లక్షల కోట్లకు చేరనుంది. పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు ఇందుకు దోహదపడనున్నాయి. డిబీర్స్ గ్రూప్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.భారత్లో నేచురల్ డైమండ్ జ్యుయలరీ మార్కెట్ భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని రిపోర్ట్ పేర్కొంది. డైమండ్స్ అనేవి వివాహంలాంటి సంప్రదాయ సందర్భాలకే పరిమితం కాకుండా రోజువారీ ధరించేందుకు కొనుగోలు చేసే ఉత్పత్తుల కేటగిరీలోకి చేరుతున్నాయని వివరించింది. మహిళల్లో ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుండటం, జనరేషన్ జెడ్, మిలీనియల్స్ ఆకాంక్షలు ఇందుకు తోడ్పడుతున్నాయి.ఈ వర్గం వాటా మొత్తం మార్కెట్ విలువలో 86 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. వజ్రాలకు డిమాండ్ కేవలం మెట్రోల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా గణనీయంగా కనిపిస్తోంది. వ్యక్తిగత ఆదాయాలు పెరిగే కొద్దీ కొత్త తరం వినియోగదారులు సిసలైన, అరుదైన, సహజసిద్ధమైన వజ్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని డిబీర్స్ గ్రూప్ గ్లోబల్ ఎస్వీపీ శ్వేతా హరిత్ తెలిపారు.
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఇలా..
దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
పసిడి, ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ఇటీవల తగ్గముఖం పట్టిన భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో 9.063 బిలియన్ డాలర్లు పెరిగి 697.121 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు (మార్చి 27) వారంలో ఇవి 10.288 బిలియన్ డాలర్లు క్షీణించి 688.058 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది.ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.784 బిలియన్ డాలర్లు పెరిగి, 552.856 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 7.221 బిలియన్ డాలర్లు పెరిగి 120.742 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఫ్యామిలీ
నా పెంపకంలో ఈ స్థాయికి ఎదిగింది
విజయవాడ దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రభావిత మదనజనక సోదరీ..’ అంటూ గాయని శ్రీలలిత పాడిన పాటను ప్రధాని నరేంద్ర మోదీ ట్యాగ్ చేయడంతో వైరల్గా మారింది. శ్రీలలిత తల్లి భమిడిపాటి సత్యవాణి ఈ సంతోషాన్ని పంచుకుంటూ, శ్రీలలిత చిన్ననాటి నుంచి తను తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.‘‘పాప పుట్టినప్పుడు తను ఏ స్థాయికి వెళ్లాలి అనుకున్నానో, ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. బాబు శ్రీనికేత్, తర్వాత శ్రీలలిత. మావారు భమిడిపాటి రాజశేఖర్ బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా కొన్నాళ్లు బిహార్లో ఉన్నాం. నాకు మా పిల్లల నెలల వయసు నుంచే వారిని సంగీతంలో తీర్చిదిద్దాలనే ఆలోచన ఉండేది. మా పుట్టిల్లు, మెట్టిల్లు వైపు పాతికమంది వరకు సంగీత విద్వాంసులు ఉన్నారు. నేనూ సంగీతం క్లాసులు తీసుకుంటాను. పిల్లలు స్టేజీపైన ప్రదర్శన ఇవ్వడానికి వారిలో భయం ఉండకూడదు. అందుకని, చిన్నప్పుడే బేబీ షోలలో పాల్గొనేలా చేసేదాన్ని. లలితకు ఎనిమిది నెలల వయసులో చీరకట్టి, పెళ్లికూతురులా రెడీ చేసి, బేబీ షోలో స్టేజీపైన నిలబెట్టాను. ఆ వయసులోనే తనకు ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది. కూరగాయలతోనూ డ్రెస్సులు కుట్టి, వేసి, షోలకు తీసుకెళ్లేదాన్ని. నాకు మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి పాప డ్రెస్సులన్నీ నేనే కుట్టేదాన్ని. బొమ్మలను తయారుచేసి ఇచ్చేదాన్ని. పాప రెండేళ్ల వయసులో తణుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఉద్యోగరీత్యా ఎటు మారినా, ఎక్కడ పిల్లల ప్రదర్శన జరిగినా, అక్కడకు శ్రీలలితను తీసుకెళ్లేదాన్ని.ఒడిలో కూర్చోబెట్టుకొని...పాప మూడేళ్ల వయసులో ఓ షోలో పాల్గొనడానికి ఇంగ్లిష్ రైమ్ నేర్పించాను. కాని, అక్కడకు వెళ్లాక లింగాష్టకం పాడింది. ‘మూడేళ్ల వయసులో ఎలా పాడింది’ అంటూ అందరితో సహా నేనూ ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అనిపించింది. ఉదయాన్నే పూజ చేసేటప్పుడు పాప అటూ ఇటూ వెళ్లకుండా ఒడిలో కూర్చోబెట్టుకొని, శ్లోకాలు, స్తోత్రాలు చదువుతుండేదాన్ని. తను కూడా వాటిని వింటూ, పాడుతూ అమ్మవారికి పూలు పెడుతూ అలాగే కూర్చొనేది. ఒడిలో కూర్చోబెట్టుకొని రోజూ స్తోత్రాలు చదవడం వల్ల, అవన్నీ గుర్తుపెట్టుకుని, అలవోకగా పాడేసిందని అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి ‘పాట’ తన చెవిన పడాలి అని తపించేదాన్ని. మూడేళ్ల వయసులోనే...మూడేళ్ల వయసులో నేను తీసుకునే మ్యూజిక్ క్లాస్ తను తీసుకుంటాననేది. నా పని ముగించుకొని, క్లాస్కు వచ్చేసరికి పిల్లలందరినీ కూర్చోబెట్టి, పాడుతుండేది. ఒక సిరీస్ అంతా ఘంటసాల పాటలు పాడించాం. ఇంట్లో ఓ మైకు ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం అయ్యిందంటే మా అందరి ప్రోగ్రామ్ పాటలే! దీక్ష తీసుకునేవాళ్లం..మా బంధువుల్లో చాలా మంది నన్ను కొంచెం విసుక్కునేవారు ‘ఏంటో నువ్వు, పిల్లకు పాత తరంలోలాగా లంగా జాకెట్టు, పెద్ద బొట్టు.. అమ్మాయిని ట్రెండ్కు తగినట్టుగా పెంచడం లేదు..’ అనేవారు. వాటిని పట్టించుకునేదాన్ని కాదు. లలిత అంటే నాకు అమ్మవారు. అలాగే ఉండాలనుకునేదాన్ని. బాలసుబ్రహ్మణ్యం, కోటిగారు ‘లలిత పాడుతుంటే అమ్మవారే పాడుతున్నట్టు’ ఉంది అనేవారు. ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా, అక్కడకు నేను, మావారు వెళ్లిపోయి, ఓ పక్కన కాళ్లు లాగేస్తున్నా నిల్చుండేవాళ్లం. తను ఎక్కడెక్కడ పాడింది, ఎవరితో పాడింది, ఎవరెవరు తనను ప్రోత్సహించారు– అవన్నీ ఫొటో ఆల్బమ్గా చేసి, తనతో పాటు తీసుకెళ్లి, అక్కడున్నవారికి చూపించేవాళ్లం. సంగీతంలో లలిత ఉన్నత దశకు చేరుకోవాలనే తపన తప్ప మరింకేమీ లేదు. ఇన్నేళ్లలో మేం ఒక్క సినిమాకి వెళ్లింది లేదు, టీవీ చూసింది లేదు, ఒక యాత్రకు వెళ్లింది లేదు. సాధన మానకూడదు..ఏ రియాల్టి షో అయినా నేను, లలితనే వెళ్లేవాళ్లం. షో ముగించుకొని బయల్దేరేసరికి చాలాసార్లు అర్ధరాత్రి దాటిపోయేది. విదేశాలకు, ఏ ఊరు వెళ్లాలన్నా మా వారు వెంట వెళ్లేవారు. ఇంటి దగ్గరే ఉండి, టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి, 90 శాతం మార్కులు తెచ్చుకుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. లలిత పుట్టకముందు మా ప్రపంచం సంగీతం. పుట్టాక మా ప్రపంచం అంతా లలితనే అయిపోయింది. తను ఎక్కడా డల్ అవకుండా చూసేవాళ్లం. ఎవరో ప్రోత్సహించడం లేదనో, ప్రైజు రాలేదనో ఆలోచన పెట్టుకోవద్దని, ప్రాక్టీస్ ఎప్పుడూ మానద్దని చెప్పేవాళ్లం. ఆరేళ్లపాటు యూ ట్యూబ్లో..దసరా రోజుల్లో అమ్మవారి దీక్ష తీసుకుంటాను. నాతో పాటు శ్రీలలిత కూడా దీక్ష తీసుకుంటుంది. కరోనా సమయంలో మా అబ్బాయి చెల్లెలి కోసం యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేశాడు. ఆరేళ్లపాటు వరుసగా శ్రీలలితతో సాంగ్స్ చేయించాం. దుర్గా నవరాత్రుల సందర్భంగా చేసిన పాటలకు మంచి పేరొచ్చింది. కాంతారా పాటకు అన్నాచెల్లెళ్లిద్దరూ చాలా కష్టపడ్డారు. మా అబ్బాయి మంగళూరులో ధార్మిక పాఠశాలను ప్రారంభించాడు. అమ్మాయి పెళ్లి చేసి, అత్తగారింటికి పంపించాక ఇప్పుడు మా జర్నీని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాం. పిల్లలకు సంగీతం క్లాసులు చెబుతుంటాను. బొమ్మలు చేస్తుంటాను.’’ అని చెప్పారు సత్యవాణి.∙ నిర్మలారెడ్డి
హెయిర్ కట్.. 2కోట్లు!
జుట్టు ఉన్న ఆమె ఎన్ని ముడులైనా వేస్తుందట....అలానే ఓ యువతి తన కురులను మరింత అందంగా.. ఆకట్టుకునేలా మార్చుకోవాలనుకుంది..దీనికోసం స్టార్ హోటల్లోని ఓ బ్యూటీ సెలూన్కి వెళ్లింది. ఎలా చేయాలో హెయిర్ డ్రెస్సర్కు చెప్పింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది..అందం మాట అటుంచి..ఉన్న జుట్టును కోల్పోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని, పరిహారం అందించాలని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. పెద్ద మొత్తంలో పరిహారాన్ని కోరింది..ఏడేళ్ల పాటు ఈ కేసు సాగింది. ఓ హెయిర్ కట్ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది..చివరకు పరిహారం విషయంలో కీలక తీర్పుతో కేసు ముగిసింది.ఢిల్లీకి చెందిన ఆశ్నా రాయ్ ఓ కార్పొరేట్ ఉద్యోగి. ఓ ప్రముఖ హోటల్లోని బ్యూటీ సెలూన్కి వెళ్లి...తన జుట్టును చివరి నుంచి నాలుగు అంగుళాలు కత్తిరించాలని చెప్పింది. అయితే, ఆమె చెప్పిన దానికి భిన్నంగా జరిగింది. పైనుంచి కిందికి నాలుగు అంగు ళాలు మాత్రమే జుట్టు మిగిలింది. దీనిపై నిర్వాహకులను నిలదీసింది..‘సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..’ అని ఆమె అంతటితో సరిపెట్టుకోలేదు. న్యాయపోరాటం ప్రారంభంఆశ్నారాయ్ 2018లో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని ఆశ్రయించింది. సేవల్లో లోపంపై ఫిర్యాదు చేసింది. మానసికంగా తాను పడిన ఆవేదనను వెళ్లగక్కింది. మోడలింగ్, సినిమా రంగాల్లోకి అడుగు పెట్టాలనుకున్నానని..తన జుట్టు కారణంగా ఉన్న ఉపాధి అవకాశాలు పోయాయని, కొత్తవి చేజారాయని ఫిర్యాదులో పేర్కొంది. విచారణ అనంతరం ఆమెకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుఆ తీర్పును సవాల్ చేస్తూ హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సేవల లోపంపై కమిషన్ నిర్ధారణను ‘సుప్రీం’ సమర్థించింది..కానీ ‘పరిహారాన్ని కేవలం డిమాండ్ ఆధారంగా కాకుండా, సరైన ఆధారాలతో నిర్ణయించాలని స్పష్టం చేసింది. కేసును తిరిగి కమిషన్కు పంపింది. మరోసారి విచారించి రూ. 2 కోట్ల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలపై సందేహాలుబాధితురాలి వాదనతో యాజమాన్యం ఏకీభవించ లేదు. సమర్పించిన పత్రాలన్నీ ఫొటోకాపీలేనని, వాటికి విశ్వసనీయత లేదని వాదించింది. తనకు జరిగిన నష్టం, మానసిక వేదనకు పరిహారం చెల్లింపులో సాంకేతిక అంశాలు అడ్డంకి కాకూడదని బాధితురాలు వేడుకుంది. తన పత్రాల్లో లోపాలు లేవని పేర్కొంది. తుది తీర్పు.. కీలక సందేశంరూ.కోట్లలో నష్ట పరిహారం కోరినా విశ్వసనీయ ఆధారాలు సమర్పించలేదని ఆశ్నా రాయ్ను ‘సుప్రీం’ తప్పుబట్టింది. ఆమె సమర్పించిన పత్రాల్లోని లోపాలను ఎత్తి చూపింది. ‘‘కేవలం ఊహాగానాలు లేదా వ్యక్తిగత భావాల ఆధారంగా భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించలేం, నష్టం జరిగినట్టు స్పష్టమైన, నమ్మదగిన సాక్ష్యాలు ఉండాలి’’ అని బెంచ్ స్పష్టం చేసింది. రూ. 2 కోట్ల పరిహారం ఆర్డర్ను రద్దు చే సింది. రూ. 25 లక్షలు తుది పరిహారంగా ప్రకటించింది. సేవల్లో లోపం ఉంటే పరిహారం కోరే హక్కు ఉంది..అయితే తగిన, బలమైన సాక్ష్యాలు అవసరమని ఈ తీర్పు స్పష్టం చేసింది. ‘న్యాయం భావోద్వేగాలపై కాదు, ఆధారాలపై నిలబడాలి’ అనే సూత్రాన్ని ఈ కేసు మరోసారి బలంగా తెలియజేసింది. మరోవైపు, ఈ తీర్పు పరిహారం నిర్ణయంలో మార్గదర్శకంగా నిలవనుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అమెరికాకు చెందిన జోనథాన్ లీ రిచెస్ ప్రపంచంలోనే అత్యధిక వ్యాజ్యాలు దాఖలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇతను సుమారుగా 2,600 పై చిలుకు కేసులు వేసినట్టు సమాచారం. ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై కూడా కేసులు దాఖలు చేశాడు..అతను బిల్గేట్స్, జార్జ్బుష్ వంటి ప్రముఖులే కాదు.. ఈఫిల్టవర్, చివరికి ఫ్లూటో గ్రహం తనపై ప్రభావం చూపిందని ఆ గ్రహంపై కూడా కేసు వేశాడు. ఇలా నిత్యం ఏదో ఒక కేసు దాఖలు చేసి వార్తల్లో నిలవడంతో గిన్నిస్ బుక్ సైతం ఇతని పేరును రికార్డుల్లోకెక్కించింది.తన ప్రమేయం లేకుండా పేరు నమోదు చేశారంటూ గిన్నిస్ బుక్ నిర్వాహకులపై సైతం రిచెస్ కేసు వేయడం విశేషం. ఎక్కువ కేసులు సరైన ఆధారాలు లేవని, అసంబద్ధంగా ఉన్నాయని కోర్టులు కొట్టేశాయి. అర్థం,పర్థం లేని అంశాలపై కేసులు వేసి కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని తీవ్రమైన హెచ్చరికలు సైతం జారీ చేశాయి. ఓ కేసులో ఇతను శిక్షను సైతం అనుభవించాడు. అతడి మానసిక స్థితి సరిగా లేని కారణంగానే ఈ విధంగా ప్రవరిస్తున్నాడని పలువురు విమర్శించారు. దిలీప్ మాదిరెడ్డి
పుష్పవిలాసం... ఉద్యాన వినోదం
ప్రకృతి ప్రేమికులకు పండుగ సమయం వచ్చేసింది. టులిప్పూల నేల నెదర్లాండ్స్లోని క్యూకెన్ హాఫ్ గార్డెన్ సందర్శకుల కోసం ముస్తాబయింది. మార్చి 19న ప్రారంభమైన ఈ పూలతోట వేడుకను మే 10 వరకు వీక్షించవచ్చు. పెరటితోట స్థాయి నుంచి ప్రపంచ వేదికగా మారిన ఈ అందమైన పూలవనం చరిత్ర చాలా పురాతనమైంది. ఈ తోట 1949లో చిన్నగా మొదలై, నేటికి 34 హెక్టార్లకు చేరుకుని భూతల స్వర్గాన్ని తలపిస్తోంది.డచ్ భాషలో ‘క్యూకెన్ హాఫ్’ అంటే వంటింటి తోట అని అర్థం. పదిహేనో శతాబ్దంలో కౌంటెస్ జాకోబా వాన్ బీరెన్ తన వంటింటి ఉపయోగం కోసం ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలను పండించేవారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడిపోయింది. ఆమె 1417 నుంచి 1433 వరకు బావేరియా–స్ట్రాబింగ్, హాలండ్, జీలండ్ కౌంటెస్, హైనాట్ కౌంటెస్గా ఉన్నారు. డచ్ ఈస్టిండియా కంపెనీలో కెప్టెన్గా పనిచేసి, 1627లో పదవీ విరమణ చేసిన తర్వాత, ఆడ్రియన్ మార్టెన్ బ్లాక్ క్యూకెన్ హాఫ్ కోటలోకి మారారు. ఆయన విధుల్లో ఉన్నప్పుడే ఈ కోట నిర్మాణానికి పునాది వేశారు. అనంతరం ఎన్నో ఏళ్ల తరువాత 1857లో ప్రసిద్ధ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్లు జాన్ డేవిడ్ జోచర్, అతని కుమారుడు లూయిస్ పాల్ జోచర్ కోట చుట్టూ పార్కును రూపొందించారు. వీరు డిజైన్ చేసిన ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ శైలే నేటి ఆధునిక క్యూకెన్హాఫ్ తోటలకు పునాది.ఈ ఆధునిక క్యూకెన్ హాఫ్ చరిత్ర 1949లో మొదలైంది. అప్పటి లిస్సే మేయర్ నేతృత్వంలో 20 మంది డచ్ పూల పెంపకందారులు ఏకమై, నెదర్లాండ్స్ పూల ఎగుమతులను ప్రోత్సహించేందుకు దీనిని ఒక ప్రదర్శన కేంద్రంగా మార్చారు. మొదటిసారిగా 1950లో ఈ తోటలోకి పర్యాటకులను అనుమతించగా, తొలి ఏడాదిలోనే 2.36 లక్షల మంది సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి శరదృతువులో 32 హెక్టార్ల విస్తీర్ణంలో, తోటమాలులు 70 లక్షల టులిప్ పూల మొక్కలను ఒక ప్రత్యేకమైన డిజైన్ లో చేతులతో నాటుతారు. ఇందులో సుమారుగా 800 రకాల విభిన్నమైన టులిప్ మొక్కలు ఉంటాయి. వీటిని నాటడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది.టులిప్ తోటలతో పాటు క్యూకెన్ హాఫ్లో ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ గార్డెన్, జాపనీస్ ల్యాండ్స్కేప్ గార్డెన్, స్ప్రింగ్ మెడో, నేచురల్ గార్డెన్, చారిత్రక వనాలు, గార్డెన్ మేజ్ వంటి ప్రతి ఏడాది ప్రత్యేకంగా నాటే అనేక అందమైన తోటలు ఉన్నాయి. ప్రకృతి ఒడిలో రంగురంగుల పూల మధ్య ఆహ్లాదంగా గడపాలనుకునే వారికి, చరిత్రను ఆస్వాదించాలనుకునే వారికి క్యూకెన్ హాఫ్ ఒక మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అంతేకాదు నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే పూల పరిశ్రమకు ఒక సజీవ ప్రదర్శనశాల ఈ ఫ్లవర్ గార్డెన్స్.
మండుటెండల్లో... అనారోగ్య సమస్యల బారిన పడకూడదంటే..!
వేసవి వచ్చేసింది. ఎండలు చండప్రచండంగా నిప్పులు చెరుగుతున్నాయి. భూతాపం పెరుగుతుండటం వల్ల ఇటీవలి ఏడాదుల్లో వేసవులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. భూతాపం పెరుగుదల ఫలితంగా సముద్రాలు వేడెక్కుతున్నాయి. ఆ ప్రభావం భూమ్మీద ప్రతిచోటా పడుతోంది. నడి వేసవిలో దేశవ్యాప్తంగా పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తాకిడి పెరుగుతున్నాయి. వేసవిలో ఎండల బాధ ఒకవైపు అయితే, మరోవైపు ఎండలతో పాటు ఇబ్బంది పెట్టే రకరకాల ఆరోగ్య సమస్యలు జనాలను సతమతం చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, వేసవి తాపం నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పగటి వేళల్లో ఆరుబయటకు వెళ్లడం క్షేమంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండల ధాటి ఎలా ఉన్నా, అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులు, కార్మికులు సహా రకరకాల వృత్తుల్లోని వారు నడివేసవి మధ్యాహ్న వేళల్లో కూడా ఆరుబయటకు వెళ్లక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి. వేసవి తీవ్రత నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వేసవిలో వడదెబ్బ బారినపడటం; దాహార్తి తట్టుకోలేక వీథుల్లో అపరిశుభ్ర పరిసరాల్లో దొరికే చెరకు రసం, పండ్లరసాలు వంటివి తాగడం వల్ల జీర్ణకోశ సమస్యల బారినపడటం; ఎండ ధాటికి చర్మం కమిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండల ధాటికి తోడు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా జనాలను బాధిస్తాయి.వేసవిలో ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ సోకడం; శరీరమంతా చెమటకాయలు పుట్టుకొచ్చి చర్మం మంటపెట్టడం; విపరీతమైన చెమటల వల్ల ఒంట్లోని నీరంతా బయటకు పోయి డీహైడ్రేషన్ ఏర్పడటం; వేడి వాతావరణంగా అలసట, నీరసం; చర్మంపై ర్యాష్, దురదలు, ఇన్ఫెక్షన్లు పెరగడం; కళ్లు పొడిబారి ఎర్రబడటం, కళ్లకు ఇన్ఫెక్షన్లు ఏర్పడటం; ఎండ వేడి నుంచి సేదదీరడానికి ఈతకొలనుల్లోకి దిగితే, వాటిలోని నీటి కాలుష్యం వల్ల చెవులకు, ఇన్ఫెక్షన్లు సోకడం; ఉబ్బసం రోగులకు సమస్య తీవ్రం కావడం; రకరకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం; నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల రకరకాల జీర్ణకోశ సమస్యలు కలగడం వంటి సమస్యలు బాధిస్తాయి. తగిన ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలను చాలా వరకు నివారించుకోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒకవేళ ఈ సమస్యలు తలెత్తినట్లయితే, వెంటనే ప్రాథమిక చికిత్స చేయడం, అవసరమైతే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.వడదెబ్బ బారిన పడొద్దు...వేసవిలో ఎండ వేడి వల్ల తలెత్తే సమస్యల్లో తీవ్రమైనది వడదెబ్బ. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ప్రాంతాల్లో వడదెబ్బ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, ఒక్కోసారి వడదెబ్బ ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండటం, తగినంత నీరు తాగకపోవడం, ధారాళంగా గాలి సోకని ప్రదేశాల్లో ఉండటం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మితిమీరిన శారీరక శ్రమ చేయడం వల్ల వడదెబ్బ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ సోకినప్పుడు తీవ్రమైన జ్వరం రావచ్చు. తలనొప్పి, తలతిరగడం, విపరీతమైన నిస్సత్తువ, అలసట, చర్మం పొడిబారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లేదా మలబద్ధకం ఏర్పడటం, గందరగోళానికి లోనవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి రోజూ తగినంత నీరు తాగడం, కొబ్బరినీరు, మజ్జిగ, తాజా పండ్లరసాలు తాగడం మంచిది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ ధరించడం, చలవ కళ్లద్దాలు పెట్టుకోవడం, వదులైన కాటన్ దుస్తులు ధరించడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది. వడదెబ్బ ముప్పు తగ్గాలంటే, కెఫీన్ పానీయాలు, మద్యపానం బాగా తగ్గించుకోవాలి.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి వడదెబ్బ సోకవచ్చు. అలాంటప్పుడు వడదెబ్బ సోకిన బాధితులను వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువెళ్లాలి. ఫ్యాన్ లేదా ఏసీ కింద ఉంచాలి. శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. చల్లని నీళ్లు లేదా ఓఆర్ఎస్ ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమై, స్పృహకోల్పోయే పరిస్థితులు ఉంటే, వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.జీర్ణకోశ సమస్యలు...వేసవిలోని వేడి వాతావరణంలో వండిన ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండదు. పగలు వండిన ఆహారం సాయంత్రానికే పాడైపోతుంది. అపరిశుభ్ర పరిసరాల్లో ఆహారం వండే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. అలాగే, అపరిశుభ్ర పరిసరాల్లోని పండ్లరసాలు, చెరకురసం బండ్ల వద్ద పానీయాలు తాగకుండా ఉండటం మంచిది. అపరిశుభ్ర పరిసరాల్లో పాడైన ఆహారం తీసుకున్నా, పానీయాలు తీసుకున్నా వేసవిలో జీర్ణకోశ సమస్యల ముప్పు ఎక్కువవుతుంది. కలుషిత ఆహార పానీయాల కారణంగా వేసవిలో టైఫాయిడ్, అతిసార వ్యాధులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, ఇంట్లో తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారమైనా ఎక్కువసేపు నిల్వ ఉన్నది తినకపోవడమే మంచిది. తాగే నీరు, తినే ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండేటట్లు చూసుకుంటే వేసవిలో జీర్ణకోశ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఒకవేళ వాంతులు, విరోచనాలు, జ్వరం, తలతిరగడం, నిస్సత్తువ వంటి సమస్యలు తలెత్తితే, డీహైడ్రేషన్ వల్ల నీరసించిపోకుండా ఉండటానికి ఓఆర్ఎస్ తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు మందులు వాడుకోవడం తప్పనిసరి.వేసవిలో దోమల బెడదవేసవిలో కూడా కొన్నిచోట్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే చోట్ల, పరిసరాల్లో మురుగునీటి గుంతలు ఉండే పరిసరాల్లో దోమలు విజృంభిస్తాయి. వేసవి రాత్రుళ్లలో గాలి సోకడం కోసం చాలామంది ఇళ్ల కిటికీలను తెరిచి ఉంచుతారు. ఇవి దోమలకు రాచమార్గంగా ఉంటాయి. కిటికీలు తెరిచినా, దోమల బెడద లేకుండా ఉండాలంటే, కిటికీలకు దోమలు చొరబడని రీతిలో తెరలను అమర్చుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడాలి. దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరానికి క్రీమ్స్ రాసుకోవాలి. దోమల బారిన పడితే డెంగీ, మలేరియా, చికున్ గున్యాలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యా«ధులు సోకితే జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి.వేసవిలో కంటి సమస్యలువేసవిలో ఎండ తీవ్రతకు రకరకాల కంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండలోని అతినీలలోహిత కిరణాల ప్రభావంతో పాటు దుమ్ము« దూళి కాలుష్యం వల్ల కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు కారడం, తరచుగా పుసులు రావడం, కళ్లు మంటపెట్టడం, కళ్ల వాపు, వెలుతురు చూసినప్పుడు ఇబ్బంది కలగడం, కనుపాపపై పుండుç ఏర్పడం వంటి సమస్యలు కలుగుతాయి. వీటిలో కొన్ని అలెర్జీల వల్ల, ఇంకొన్ని ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు పదేపదే చేతితో కళ్లు రుద్దకుండా ఉండాలి.కళ్లు తుడుచుకోవడానికి శుభ్రమైన పొడి రుమాలు లేదా న్యాప్కిన్ వాడుకోవాలి. కళ్లు బాగా ఎర్రబడటం, పుసులు రావడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కంటివైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవడం మంచిది. వేసవిలో కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అతినీలలోహిత కిరణాలను వడగట్టగలిగే చలవ కళ్లద్దాలను ధరించడం మంచిది. అలాగే, నేరుగా ఎండ కళ్ల మీద పడకుండా ఉండటానికి గొడుగు లేదా టోపీ వాడుకోవడం మంచిది.ఎండల ధాటిని మనం ఎలాగూ తగ్గించలేం. కాబట్టి, ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే చేయగలం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి తగినట్లుగా వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి ఇంట్లో ఎవరో ఒకరు వడదెబ్బ బారినపడి, తీవ్ర అనారోగ్యానికి లోను కావచ్చు. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఎండల తీవ్రత పెరిగే కొద్ది ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే, ఎండల వేడి వల్ల వచ్చే ఇబ్బందులను పూర్తిగా అధిగమించి, సురక్షితంగా ఉండవచ్చు. చర్మ సమస్యలువేసవిలో ఎండలోని అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కందిపోవడం, చెమటలు ఎక్కువై చెమటకాయలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చెమటకాయలను నివారించుకోవాలంటే రోజుకు రెండు మూడుసార్లు శుభ్రంగా స్నానం చేయాలి. శరీరాన్ని పూర్తిగా పొడిగా తుడుచుకున్న తర్వాత వదులుగా ఉండేలా చెమటను తేలికగా పీల్చుకునే కాటన్ దుస్తులు ధరించాలి. ఉక్కపోత ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది. అప్పటికీ చెమటకాయలు ఉంటే, ఉపశమనానికి ప్రిక్లీహీట్ పౌడర్ లేదా కేలమైన్ లోషన్ వాడటం మంచిది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా సన్స్క్రీన్ వాడాలి. సన్స్క్రీన్ వల్ల చర్మం కందిపోకుండా ఉంటుంది.రోజూ తగినంత మంచినీరు, కొబ్బరినీరు, పానకం, తాజా పండ్ల రసాలు వంటివి తీసుకోవడం, తేలికగా జీర్ణమయ్యేలా తాజాగా వండిన ఆహారం తీసుకోవడం మంచిది. వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం వల్ల చెమటకాయలే కాకుండా, చర్మానికి రకరకాల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఉంటుంది. రోజూ శుభ్రంగా స్నానం చేయడం, చర్మం పొడిగా ఉండేట్లు చూసుకోవడం, గాలిసోకి చెమటను పీల్చుకునేలా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా చర్మానికి ఇన్ఫెక్షన్లు సోకినట్లయితే, వారు వాడే తువ్వాళ్లు, దుస్తులు వేరుగా ఉంచి, ఉతకడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనలపై తగిన చికిత్స తీసుకోవాలి.వృద్ధులకు జాగ్రత్తలువేసవిలో వృద్ధులు మరింతగా ఇబ్బంది పడతారు. ఎండల ధాటికి వృద్ధులు త్వరగా అలసట చెంది, నీరసించిపోతారు. ఇక డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారి పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. వేసవిలో వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కగలుగుతారు.⇒ వేసవిలో వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తరచు మంచినీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగడం మంచిది.⇒ చక్కగా గాలి వచ్చే గదుల్లో ఉండాలి. ఫ్యాన్, కూలర్, ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది.⇒ ఎండ తీవ్రత ఉన్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.⇒ బీపీ, సుగర్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనపై వేళకు మందులు వేసుకోవాలి.⇒ ఉప్పు, నూనెలు తక్కువగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.⇒ తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి.⇒ విపరీతంగా చెమటలు పోయడం, తలతిరగడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి.పిల్లలకు జాగ్రత్తలువేసవి తీవ్రత ఆరోగ్యవంతులైన పెద్దలకే దుర్భరంగా ఉంటుంది. అలాంటప్పుడు వేసవిలో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే, వేసవి తాపం నుంచి పిల్లలకు రక్షణ కల్పించవచ్చు.⇒ పిల్లలు ఆటల్లో పడితే ఆకలి దప్పులను మరచిపోతారు. వేసవిలో దాహంగా ఉన్నా, లేకపోయినా పిల్లల చేత మంచినీళ్లు, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగిస్తూ ఉండాలి.⇒ పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఆటలు ఆడనివ్వకండి.⇒ ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ లేదా గొడుగు వాడాలి.⇒ పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి. ఇంట్లో తాజాగా వండిన ఆహారంతో పాటు పుచ్చకాయలు, కీరదోసకాయలు, పెరుగు వంటివి ఇవ్వడం మంచిది.⇒ పిల్లలకు వేసవిలో తేలికపాటి వదులైన కాటన్ దుస్తులు వేయడం మంచిది.⇒ చెమటకాయల నివారణ కోసం తరచు స్నానం చేయించాలి. స్నానం తర్వాత శరీరం పూర్తిగా పొడిగా ఉండేలా తుడిచాక దుస్తులు తొడగాలి.⇒ పిల్లల్లో అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఎండ తీవ్రత ఎప్పుడు ప్రమాదకరం?వేసవిలో ఎండ తీవ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినప్పటి నుంచి సమస్యలు పెరుగుతాయి. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నప్పుడు బయట ఎక్కువసేపు తిరిగే వారిలో డీహైడ్రేషన్, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎండల ధాటి 40–45 డిగ్రీలకు చేరుకుంటే, ప్రమాద స్థాయి మరింతగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరినప్పుడు బయట ఎక్కువసేపు ఉంటే త్వరగా అలసట, నీరసం ముంచుకొచ్చి, డీహైడ్రేషన్కు లోనవడం, వాంతులు, తలతిరగడం, వడదెబ్బకు లోనవడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చు.ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లయితే, వడదెబ్బ సోకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. గడచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.5–42.5 డిగ్రీల వరకు; తెలంగాణలో 41.5 నుంచి 43.5 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. విజయవాడ, కర్నూలు, రామగుండం, భద్రాచలం వంటి కొన్ని ప్రాంతాల్లో వేసవి సగటు గరిష్ఠ ఉస్ణోగ్రతలు 45–47 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. అందువల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకినప్పటి నుంచి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది.
అంతర్జాతీయం
ఇరానియన్లకు ట్రంప్ ఝలక్
వాషింగ్టన్: అమెరికాలో దీర్ఘకాలంగా నివాసముంటున్న ఇరాన్ ప్రస్తుత, మాజీ సీనియర్ అధికారుల సంబంధీకుల గ్రీన్కార్డులను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. తాజాగా, లాస్ఏంజెలెస్కు చెందిన సైకాలజీ ఉపాధ్యాయుడు సయ్యద్ ఈసా హషేమీ, ఆయన భార్య, కుమారుడి గ్రీన్కార్డులను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.అయితే, వీరంతా ఇరాన్లో జన్మించి, అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కలిగిన వారని వివరించింది. వీరిని నిర్బంధంలోకి తీసుకున్న అధికారులు త్వరలోనే స్వదేశానికి పంపనున్నారని తెలిపింది. 1979లో టెహ్రాన్లోని అమెరికా ఎంబసీపై దాడి చేసిన వారికి ప్రతినిధిగా వ్యవహరించిన మసౌమె ఎబ్తెకర్ కుమారుడే హషేమీ. అనంతరం మసౌమె ఇరాన్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలయ్యారు.కాగా, 2020లో బాగ్దాద్పై అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మాజీ చీఫ్ కసెమ్ సొలెమానీ కుటుంబీకుల గ్రీన్ కార్డులను గత వారం విదేశాంగ శాఖ రద్దు చేయడం తెల్సిందే. పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ట్రంప్ ‘మ్యాజిక్ పెయింట్’.. మండిపడుతున్న నిపుణులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విభిన్నమైన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. రెండోసారి అధికార పీఠం ఎక్కిన తర్వాత తన ప్రత్యేకమైన అభిరుచి మేరకు వైట్హౌస్ పరిసరాల రూపురేఖలు మార్చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఆయన ఏకంగా ‘మ్యాజిక్ పెయింట్’ అనే కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక అద్భుత భవనానికి ఈ రంగు వేయాలన్న ఆయన నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.1888లో గ్రానైట్ రాయితో నిర్మించిన ఐసెన్హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ వైట్హౌస్కు ఆనుకునే ఉంటుంది. జాతీయ భద్రతా మండలి, ఉపాధ్యక్షుడి కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. 553 విశాలమైన గదులు, అద్భుతమైన చెక్క అలంకరణలు, చేతితో చిత్రించిన టైల్స్ ఉన్న ఈ సువిశాల భవనానికి పూర్తి తెలుపు రంగు వేయాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దీనికోసం సిలికేట్తో కూడిన మ్యాజిక్ పెయింట్ వాడాలని ఆయన సూచిస్తున్నారు. ఈ రంగు కారణంగా రాతి గోడలు మరింత దృఢంగా మారుతాయని, మరకలు పడవని, భవిష్యత్తులో మళ్లీ రంగు వేసే పని ఉండదని వైట్హౌస్ వర్గాలు చెబుతున్నాయి. 1800ల చివరి నుండి ఈ భవన నిర్వహణను నిర్లక్ష్యం చేశారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫైన్ ఆర్ట్స్ కమిషన్కు నివేదికలు సమర్పించారు.అయితే ఈ ప్రతిపాదనను చరిత్రక కట్టడాల పరిరక్షణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ చెబుతున్న సిలికేట్ మ్యాజిక్ పెయింట్ ఆ గ్రానైట్ భవనానికి ఏమాత్రం సరిపడదు. ఈ పెయింట్ వాడటం వల్ల చరిత్రక భవనానికి ముప్పు వాటిల్లుతుందని, పైగా ఇది చట్టవిరుద్ధమని సాంస్కృతిక వారసత్వ భాగస్వామ్య పక్షాలు కోర్టును ఆశ్రయించాయి. ఎన్ని అడ్డంకులు వస్తున్నా ట్రంప్ ప్రతిపాదన మాత్రం ముందుకు సాగుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: సిలిండర్ కథ కంచికి.. హైడ్రోజన్ పొయ్యి మన ఇంటికి!
అందుకే ఒప్పందం కుదరలేదు: ఇరాన్ కీలక ప్రకటన
ఇస్లామాబాద్: అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ వెల్లడించింది. యూఎస్ మితిమీరిన డిమాండ్ల వల్లే ఒప్పందం కుదరలేదని.. చర్చల అనంతరం వివాదాస్పద అంశాలు లేవనెత్తారని ఇరాన్ పేర్కొంది. హర్మూజ్ జలసంధి, అణు హక్కుల వంటి వివాదస్పద అంశాలు ప్రస్తావించారన్న ఇరాన్.. ఏమీ తేలకుండానే అమెరికాతో చర్చలు ముగిశాయని పేర్కొంది.పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. 14 గంటలపాటు చర్చలు సాగాయి. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్తో డీల్ లేదని ఆయన స్పష్టం చేశారు.ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. తాము విధించిన షరతులను ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్ పేర్కొన్నారు. చర్చల్లో తాము చాలా సానుకూలంగా వ్యవహరించామంటూ చెప్పుకున్న వాన్స్.. దురదృష్టవశాత్తు ఎలాంటి పురోగతి సాధించలేకపోయామన్నారు.హార్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలని.. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదంటూ ఇరాన్ తేల్చి చెబుతోంది. గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు. ఇరాన్పై అమెరికాతోపాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి’’ అని ఇరాన్ డిమాండ్ చేస్తూ వస్తోంది.మరోవైపు, ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదని అమెరికా డిమాండ్ చేస్తోంది. యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి. హార్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు’’ అని అమెరికా స్పష్టం చేసింది.
ఇరాన్ యుద్ధం.. చైనాకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్లో ఇరాన్, అమెరికా చర్చలు జరుగుతున్న వేళ చైనాకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు చైనా ఆయుధ సాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. చైనా ఇరాన్కు ఆయుధాలు పంపితే, పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాగా, ట్రంప్.. మియామీ ప్రయాణానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే, ఇరాన్కు మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. ఈ మేరకు సీఎన్ఎన్ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్ప్యాడ్ ఆయుధాలను ఇరాన్కు చైనా తరలిస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. మ్యాన్ప్యాడ్ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చు. హెలికాప్టర్ల ఇంజిన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే ‘హీట్–సీకింగ్’సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. అమెరికా ఎఫ్–15ఇ యుద్ధ విమానం, బ్లాక్హాక్ హెలికాప్టర్లను ఇరాన్ ఇటీవల ఇవే యాంటీ–ఎయిర్–మిస్సైళ్ల వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి.#WATCH | On reports of China shipping weapons to Iran, US President Donald Trump says, "If China does that, China is going to have big problems." (Source: US Network Pool Via Reuters) pic.twitter.com/YiSlLe3TI6— ANI (@ANI) April 12, 2026నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలుచేసేలా వ్యూహం రచించిందని సమాచారం. చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ–ఎయిర్ మిస్సైళ్ల వ్యవస్థలను ఇరాన్ కొనుగోలుచేస్తోందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్ ఇంధనం తయారీవాడే ముడిపదార్థం సోడియం పర్క్లోరేట్తో నిండిన రెండు సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్కు చైనా పంపిందని తెలుస్తోంది.మరోవైపు.. ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది. ఈ ఆరోపణలను చైనా ఖండించింది. ఈ సందర్బంగా వాషింగ్టన్లోని చైనా రాయబారి కార్యాలయం స్పందిస్తూ.. “మేము ఎప్పుడూ యుద్ధంలో ఉన్న ఏ పక్షానికీ ఆయుధాలు ఇవ్వలేదు” అని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్కు చైనా, రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములు. పాశ్చాత్య ఆంక్షల మధ్య వీరి మద్దతు ఇరాన్కు కీలకంగా మారింది. అమెరికా మాత్రం ఈ సహకారాన్ని పెద్ద తప్పుగా పరిగణిస్తోంది.
జాతీయం
‘దళపతి’కి భారీ షాక్.. బరిలో ఇంతమంది ‘విజయ్’లా?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకూ వేడెక్కుతోంది. 2026, ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలిచేందుకు రాజకీయ పార్టీలు సరికొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు తమిళనాట అత్యంత హాట్ టాపిక్గా మారిన అంశం ‘డమ్మీ అభ్యర్థుల వ్యూహం’ ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్, డీఎంకే నేత సెంథిల్ బాలాజీ వంటి ఉద్దండులను టార్గెట్ చేస్తూ పలు పార్టీలు ఒకే పేరుతో పలువురు అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఇది ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేసి, ఓట్లను చీల్చేందుకు ప్రతిపక్షాలు పన్నుతున్న పక్కా మాస్టర్ ప్లాన్ అని విశ్లేషకులు చెబుతున్నారు.అసలు ఏమిటీ డమ్మీ అభ్యర్థుల వ్యూహం?ఒక ప్రముఖ నేత పేరుతో మరికొంత మంది డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు టీవీకే పార్టీ నుండి ‘విజయ్’ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో.. ఏ విజయ్, కె విజయ్ కుమార్, ఎం విజయ్, విజయ్ రాజ్ వంటి పేర్లతో అభ్యర్థులు దర్శనమిస్తారు. పార్టీ గుర్తులపై పెద్దగా అవగాహన లేని ఓటర్లు, కంగారులో తమ అభిమాన నేత పేరు చూసి వేరే ‘విజయ్’కి ఓటు వేసే అవకాశం ఉంది.ఇప్పుడిది ఎందుకు ట్రెండ్ అవుతోంది?మీడియాకు అందిన నివేదికల ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా వందకు పైగా ఇలాంటి ‘ఒకే పేరున్న అభ్యర్థులు’ బరిలో నిలిచారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న నేతలను టార్గెట్ చేస్తూ పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఈ వ్యూహాన్ని ఎక్కువగా అమలు చేస్తున్నారు. కొత్త పార్టీలు బరిలో ఉండటం, ఈసారి పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో ఇది ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా మారింది.‘విజయ్’నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం. యువతలో ఆయనకున్న విపరీతమైన క్రేజ్, సోషల్ మీడియా మద్దతు, ఎన్నికల బరిలో పార్టీ వేగంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. విజయ్కి పడే ఓట్లను చీల్చడం ద్వారా ఆయన గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనేదే ఈ డమ్మీ కాండిడేట్ల ప్రణాళిక.కొత్త ఓటర్లపై ప్రభావం2026 తమిళనాడు ఎన్నికల్లో దాదాపు 12 లక్షల 50 వేల మంది యువత తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరు పార్టీ గుర్తుల కంటే నాయకుల పేర్లను చూసి ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కేవలం ఒకటి లేదా 2 శాతం ఓట్లు చీలిపోయినా తుది ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇది చట్టబద్ధమేనా?ఒకే పేరున్న వారు పోటీ చేయడం చట్ట ప్రకారం పూర్తిగా సమ్మతమే. ఏ పౌరుడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారి పేర్లు ఒకేలా ఉన్నాయనే కారణంతో నామినేషన్లను తిరస్కరించడానికి వీల్లేదు. అయితే, ఓటర్లలో ఏర్పడే గందరగోళాన్ని తగ్గించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈవీఎంల మీద అభ్యర్థుల ఫోటోలు, పార్టీ గుర్తులను స్పష్టంగా ముద్రిస్తుంది. అయినా సరే ఓటర్లు కంగారు పడినప్పుడు కన్ఫ్యూజన్ తప్పదు.ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఉంది?చెన్నైలోని పట్టణ నియోజకవర్గాలు, దక్షిణ తమిళనాడులోని ప్రధాన ప్రాంతాలు, ముఖ్యంగా పెరంబూర్, తిరునెల్వేలి, మదురై శివార్లలో, కోయంబత్తూర్ అర్బన్ జోన్లలో ఈ డమ్మీ అభ్యర్థుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో అభ్యర్థుల మధ్య గెలుపు మార్జిన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు మెజారిటీ రెండు వేల ఓట్లు ఉన్నప్పుడు, డమ్మీ అభ్యర్థికి 1500 ఓట్లు పడితే అసలు అభ్యర్థి ఓడిపోయే ఛాన్స్ స్పష్టంగా ఉంటుంది.ఓటర్లు ఏం చేయాలి?ఈ గందరగోళాన్ని అధిగమించడానికి ఓటర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓటు వేసేటప్పుడు కంగారు పడకుండా, పార్టీ గుర్తును నిశితంగా పరిశీలించాలి. ఈవీఎంపై ఉన్న అభ్యర్థి ఫోటోను కచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు కేవలం మేనిఫెస్టోలు, పొత్తులకే పరిమితం కాలేదు.. బ్యాలెట్ మీద ఎవరున్నారు, వారిని ఓటర్లు ఎలా గుర్తిస్తున్నారు అనేది కీలకం కాబోతోందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: ‘దీదీ’కి మైండ్ బ్లాంక్.. బెంగాల్ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం
హార్మూజ్ను దాటిన జగ్ విక్రమ్
న్యూఢిల్లీ: భారతీయ జెండా కలిగిన ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ హార్మూజ్ను విజయవంతంగా దాటేసింది. అమెరికా–ఇరాన్ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక హార్మూజ్ను దాటిన మొదటి భారతీయ ట్యాంకర్ ఇది. శనివారం మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్ను దాటి భారత్ దిశగా సాగుతోంది. ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి చెందిన జగ్ విక్రమ్ సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. కాగా, మార్చి మొదటి వారం నుంచి హార్మూజ్ను వీడిన 9వ భారతీయ ట్యాంకర్ ఇది. మరో 15 భారతీయ నౌకలు ఇప్పటికీ అక్కడే వేచి ఉన్నాయి. వీటితోపాటు వివిధ దేశాలకు చేరుకోవాల్సిన మొత్తం 426 ట్యాంకర్లు, 34 ఎల్పీజీ, 19 ఎల్ఎన్జీ క్యారియర్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా చెబుతోంది.
భవానీపూర్లో నా అభ్యర్థిత్వం చెల్లకుండా కుట్ర
కోల్కతా: భవానీపూర్లో తన అభ్యర్థిత్వం చెల్లకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందులో భాగంగా రెండు తప్పుడు కేసుల్లో తనను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు, టీఎంసీ కార్యకర్తలు వమ్ము చేశారన్నారు. ఆమె శనివారం పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాలో జరిగిన టీఎంసీ ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు. ‘ఈసీ సాయంతో భవానీపూర్లో నా అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు శుక్రవారం బీజేపీ నాకు వ్యతిరేకంగా రెండు తప్పుడు అఫిడవిట్లు సమర్పించేందుకు కుట్ర పన్నింది. వారి ప్రయత్నాలను మేం భగ్నం చేశాం’అని ఆమె ప్రకటించారు. భవానీపూర్లో మమతకు ప్రధాన ప్రత్యర్థిగా ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉండటం తెల్సిందే. సర్ ప్రక్రియ సందర్భంగా బీజేపీ బలవంతంగా ఓటరు జాబితాల్లోని 90 లక్షల ఓటర్ల పేర్లను తొలగించిందని మమత విమర్శించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి నెగ్గే సత్తా లేకనే బీజేపీ దొడ్డిదారిన ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మార్చుకునేందుకు ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకూ బీజేపీ పథకం వేస్తోందన్నారు.
సానుభూతి కోసం బాధిత కార్డు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమి త్ షా నిప్పులు చెరిగారు. ప్రజల సానుభూతి కోసం సీఎం మమత బాధితురా లినంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరో పించారు. టీఎంసీ 15 ఏళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థికంగా, శాంతిభద్రతల విషయంలో పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. అమిత్ షా శనివారం బంకురా, పురూలియా జిల్లాల్లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. బీజేపీకి అధికారమిస్తే టీఎంసీ సిండికేట్ పాలనకు ముగింపు తప్పదన్నారు. మహిళలకు అన్ని వేళలా రక్షణ కల్పిస్తామని తెలిపారు. అన్యాయానికి గురవుతున్న మహిళలకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ‘సీఎం మమత బాధితురాలినంటూ చెప్పుకుంటున్నారు. కాలికో తలకో బ్యాండేజీ కట్టుకుని కనిపిస్తుంటారు. ఈసారి అలా జరగదు. కాలికి, చేతికి, తలకు బ్యాండేజీతో కనిపించినా బెంగాల్ ప్రజలు ఆమెకు ఓటేయరు’అని ఆయన స్పష్టం చేశారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు.
న్యూయార్క్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
క్రైమ్
కోడల్ని ఇంట్లోంచి లాక్కొచ్చి, రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ దౌర్జన్యం
కాన్పూర్లో వరకట్నం కోసం ఒక మహిళపై నడిరోడ్డుపై జరిగిన అమాను దాడి కలకలం రేపింది. మీనాక్షి పాండే అనే మహిళపై ఆమె మామ, రిటైర్డ్ రైల్వే అధికారి దారుణంగా దాడిచేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.భారతీయ రైల్వేలో అధికారిగా పనిచేసిన రమేష్ దూబే, కోడలు మీనాక్షిని వీధిలోకి బలవంతంగా ఈడ్చుకుంటూ వచ్చి, చేయి చేసుకోవడం, తన్నుతూ హింసించాడు. హృదయ విదారంగా ఆమె సాయం కోసం అర్థించిన వైనం వీడియోలో రికార్డైంది. ఈ క్రమంలో ఆమె బట్టలు కూడా చిరిగిపోయాయి. అయినా వదలకుండా వేధింపుల పర్వాన్ని కొనసాగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వెల్లు వెత్తింది. ఈ దారుణం జరుగుతున్న సమయంలో పోలీసు అధికారులున్నప్పటికీ, వారు జోక్యం చేసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.రూ. 20 లక్షల వరకట్నం కోసం రూ. 20 లక్షల కట్నం తేవాలంటూ గత కొన్నాళ్లుగా భర్త , అత్తమామలు వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని మీనాక్షి పాండే అత్తమామలపై సంచలన ఆరోపణలు గుప్పించింది. నిరంతర వేధింపుల పర్వం సాగుతోందని, ఏళ్ల తరబడి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. అంతేకాదు తనకు విడాకులివ్వకుండానే, హిందూ వివాహ చట్టానికి విరుద్ధంగా తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని కూడా మీనాక్షి ఆరోపించారు.🚨Kanpur Dowry Horror: Retired Railway Official Savagely Beats Meenakshi Pandey - Daughter need help 🙏Incident :A shocking viral video shows retired railway official Ramesh Dubey dragging his daughter-in-law, Meenakshi Pandey, onto the street. He brutally assaulted her,… pic.twitter.com/S5Vd1cdSoN— Ramesh Tiwari (@rameshofficial0) April 11, 2026సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహంఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రజలు తీవ్రంగా స్పందించారు. మహిళల రక్షణ కోసం, వరకట్నం హింసను నిషేధించే అనేక చట్టాలు ఉన్నప్పటికీ, మహిళలపై ఈ హింస ఇంకా కొనసాగుతోందనడానికి ఈ సంఘటన ఒక విషాదకరమైన నిదర్శనం. చట్టాలు ఎన్ని ఉన్నా, వరకట్న వేధింపులు ఇంకా కొనసాగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.పట్టపగలు, నడిరోడ్డుపై ఒక మహిళను ఇలా హింసిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?" అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని, ముఖ్యంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడం, ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో కాన్పూర్ పోలీసులు స్పందించారు.కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మీనాక్షి చేసిన ఆరోపణలపై సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్
రక్తపు మడుగులో: ఏపీ టెకీ రిషి కేష్ హత్య కలకలం
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణానికి చెందిన ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్యానాలోని పంచకుల జిల్లాలో శుక్రవారం ఉదయం హత్యకు గురయ్యాడు. పదిరోజుల క్రితమే కంపెనీలో చేరిన యువ ఇంజనీర్ బండ్ల రిషికేష్ (27) రక్తపు మడుగులో కనిపించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.రిషికేష్ పంచకులలోని 'వేది టెక్నాలజీస్' అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాడు. అతను సుమారు పది రోజుల క్రితం కంపెనీలో చేరడానికి ఇంటి నుండి బయలుదేరాడు. అయితే అనూహ్యంగా కన్నుమూసిన వైనం కుటుంబంలో తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. కంపెనీ అందించిన వసతి గృహంలో రిషికేష్ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉండటాన్ని అతని సహోద్యోగులు కనుగొన్నారు. కంపెనీ యాజమాన్యం వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. హర్యానా పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా, గుడివాడ వన్ టౌన్ పోలీసులు బెతవోలులోని రిషికేష్ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. విధుల్లో చేరిన పది రోజుల్లోనే తమ కుమారుడు విగతజీవిగా మారిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీర వుతున్నారు. పుట్టెడు దుఃఖంతో హర్యానాకు బయలుదేరారు. ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!హర్యానా పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రిషికేష్ చాలా సౌమ్యుడని ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోంది. సహోద్యోగులతో గొడవలా? పాత కక్షలు ఉన్నాయా?. దోపిడీ ఏమైనా జరిగిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని, కాల్ డేటా రికార్డులను తనిఖీ చేస్తున్నారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి బీటెక్ పూర్తి చేసిన రుషికేష్, మెరుగైన అవకాశాల కోసం హర్యానాకు వెళ్లడానికి ముందు మూడేళ్లపాటు హైదరాబాద్లో పనిచేసినట్టు లింక్డ్ఇన్ ప్రొఫైల్ వివరాలను బట్టి తెలుస్తోంది.
27ఏళ్ల యువకుడితో 57ఏళ్ల టీచర్ వివాహేతర సంబంధం
కర్ణాటక: ప్రభుత్వ టీచర్ని నమ్మించి హత్య చేసిన దుండగుని బాగోతమిది. వివరాలు.. బీదర్ జిల్లా బాల్కి తాలూకా వంజార్ ఖేడ్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి కపాళె ’(57) అనే మహిళను అమర్ (27)అనే యువకుడు హత్య చేశాడు. బీదర్లో నివసిస్తున్న జ్యోతి వారానికి ఒకసారి కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కల్మూడ గ్రామంలోని పుట్టింటికి వస్తుండేది. ఈ క్రమంలో నిందితుడు అమర్తో పరిచయమై సన్నిహితంగా మెలిగేవారు. అతనికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.రూ.20 లక్షలు తీసుకుని..6 రోజుల క్రితం కల్మూడ గ్రామం శివారులో నిర్జన ప్రదేశంలో జ్యోతి శవం కాలిన స్థితిలో లభించింది. జ్యోతి వివాహం చేసుకోలేదు. ఒంటరిగా జీవిస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేసేది. అమర్ ఆమె వద్ద సుమారు రూ.20 లక్షల వరకూ అప్పు తీసుకున్నాడు. డబ్బులు వెనక్కు ఇవ్వాలని జ్యోతి ఒత్తిడి చేయడంతో మాట్లాడదామని నమ్మించి 3వ తేదీన ఆమెను ఊరి బయటకు తీసుకెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు కాల్ డిటైల్స్, ఇతర సాక్ష్యాధాల ఆధారంగా అమర్ ఈ హత్య చేశాడని గుర్తించి అరెస్టు చేశారు.
పోక్సో కేసులో 76 ఏళ్ల డాక్టర్కు ఏడేళ్ల జైలు
కేపీహెచ్బీకాలనీ: బాలికతో అనుచితంగా ప్రవర్తించిన ఓ డాక్టర్కు కూకట్పల్లి ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన మేరకు.. 2023లో ఓ బాలికతో ఆదిత్యనగర్కు చెందిన డాక్టర్ కందుల సుబ్బారావు (76) అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో సుబ్బారావుకు ఏడేళ్ల ఏళ్ల జైలు శిక్ష, 30 వేల రూపాయల జరిమానా విధిస్తూ కూకట్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు తీర్పు వెలువరించారు. తీర్పు అనంతరం డాక్టర్ సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
వీడియోలు
కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు
శాంతి చర్చలు విఫలం.. పాక్ ఆందోళన..
షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..
ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.
ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్
సంగీత ప్రపంచానికి తీరని లోటు..
ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్
ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా


