జర్రమొచ్చింది.. సైలెంట్ మోడ్లో సేనాని!
సరిగ్గా పరీక్షలు ఉన్నప్పుడే బడీ దొంగ పిల్లాడికి జ్వరం వచ్చినట్లు, ఇంట్లో ఎక్కువ పని ఉన్నప్పుడే తోడికోడలు కడుపునొప్పి అంటూ పని ఎగ్గొట్టినట్లు.. పెద్ద మేనేజర్ తో మీటింగ్ ఉన్నరోజే తెలివైన చిన్న మేనేజర్ క్యాజువల్ లీవ్ పెట్టినట్లు. పవన్ కళ్యాణ్ కూడా సరిగ్గా సమయం చూసి టాలెంట్ చూపెడుతున్నారు. సమయం .. సందర్భం చూసి తనకు సమాధానం చెప్పే దమ్ము లేదని తెలుసుకుని ఆ ఎపిసోడ్ నుంచి తప్పుంచుకుని రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. గతంలో పలుమార్లు ఉద్దేశపూర్వకంగా ఏపీ కేబినెట్ సమావేశాలను ఎగ్గొట్టిన పవన్ కళ్యాణ్ ఆనాడు జరిగిన నిర్ణయాలు, భూ కేటాయింపులకు తానూ బాధ్యుడిని కాను అని లోకానికి చెప్పే అప్షన్ తనవద్ద ఉంచుకున్నారు. రేపు ఎప్పుడైనా ఈ భూకేటాయింపులు.. అస్తవ్యస్త నిర్ణయాలమీద ప్రజా వ్యతిరేకత మొదలైతే తనకు ఆ అంశంతో సంబంధం లేదని చెప్పుకునేందుకు స్విచ్ తనవద్దనే ఉంచుకున్నారు.విశాఖ పెట్టుబడుల సదస్సుతోబాటు దావోస్కు సైతం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. వేరే ఏదో కారణాలు చెప్పి అయన దూరంగా ఉంటున్నారు. దీంతో బాటు అసెంబ్లీ సమావేశాలకు సైతం తరచూ పవన్ డుమ్మాకొడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఆమధ్య టీడీపీ కార్యకర్తలు చిరంజీవిని సైతం ఒక అంశంలో దుమ్మెత్తి పోశారు.. చిరంజీవి ఇమేజిని దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో పోస్టులమీద పోస్టులు పెట్టారు. ఆ సందర్భాల్లో కూడా పవన్ సైలెంట్ అయ్యారు.. పైగా జ్వరం అంటూ హైదరాబాద్ వెళ్లిపోయారు తప్ప ఈ అంశంలో ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. టీడీపీ వారిని కంట్రోల్ చేయలేకపోయారా ? లోలోన వేరే ఏదో ఎజెండాతో సైలెంట్ అయ్యారా అనేది మాత్రం ఇప్పటికీ మిష్టరీగా ఉంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ శని ఆదివారాల్లో ప్రచారం చేస్తారని షెడ్యూల్ విడుదల చేసారు. ఈమేరకు తెలంగాణాలో జనసేన అభిమానులు సైతం దీనికోసం ఏర్పాట్లు చేసారు. కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ జర్రమొచ్చింది అంటూ మంచమెక్కారు. ప్రచారం షెడ్యూలు రద్దు అంటూ సమాచారం వచ్చింది. తెలంగాణాలో బిజెపి.. జనసేన తరఫున అయన ప్రచారం చేస్తారని అన్నారు కానీ అయన తన నిర్ణయం మార్చుకున్నారు.ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఉన్నారన్న సమాచారం తెలంగాణ వ్యాప్తంగా పాకింది. పవన్ ఇమేజ్ సైతం బాగా తగ్గింది.. ఈనేపథ్యంలో అయన ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం లేదని పార్టీ వర్గాలు భావించి ఇదే సమాచారాన్ని ఆయనకు చేరవేయగా ఓడిపోయేదానికి ప్రచారం ఎందుకులే అని ఆయనే జ్వరం పేరిట ప్రచారాన్ని ఎగ్గొట్టారని అంటున్నారు. మొత్తానికి మాంచి టైం చూసి పవన్కు జ్వరం వస్తుంది అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది::సిమ్మాదిరప్పన్న
ఇరాన్కు దగ్గరగా అబ్రహం లింకన్... ఏక్షణానైనా దాడి?
అరేబియా మహా సముద్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా యుద్ద నౌక అబ్రహం లింకన్ ఇరాన్కు అత్యంత దగ్గరగా వచ్చింది. అమెరికా బలగాలు అబ్రహాంలింకన్ యుద్ధ నౌకపై యుద్ధవిమానాలు, డ్రోన్లు, ఇతర ఆయుధ సామాగ్రి మోహరించాయి. ఒకవేళ ఇరాన్తో చర్చలు గనుక విఫలమైతే అమెరికా ఏ క్షణాన్నైన ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉంది.అయితే ఇరాన్పై అణు ఒప్పందంపై ఒత్తిడి చేసేందుకే ఈ విధంగా యుద్ధనౌకను దగ్గరగా మోహరించినట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులుభావిస్తున్నారు. కాగా ఇటీవలే ఇరాన్కు చెందిన డ్రోన్ను అమెరికా కూల్చివేసింది. యుద్ధనౌకకు దగ్గరగా వచ్చినందుకే భద్రతా కారణాలతో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.అణుఒప్పందంపై చర్చలకు ఇరు దేశాలు సముఖంగా ఉన్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే యుద్ధం తలెత్తడం అనివార్యంగా కనిపిస్తుంది.ట్రంప్ ఈ సారి వెనిజువెలాను మించి దాడి ఉంటుందని ప్రకటించగా, ఖమేనీ సైతం తగ్గేదేలే అన్నారు.
ఎట్టకేలకు దొరికిన పులి.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు
సాక్షి,తూర్పు గోదావరి: జిల్లాలో గత కొద్దిరోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పులి కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. కూర్మాపురంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి బెబ్బులిని బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులిని పట్టుకోవడానికిన పూణేకు చెందిన ప్రత్యేక బృందం రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐదు గంటల పాటు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేసి దానిని పట్టుకున్నారు. జిల్లాలో గత వారం రోజులుగా ఎక్కడ చూసిన పులి జాడ హాట్ టాపిగ్గా మారింది. రోజుకో,పూటకో రూటు మారుస్తూ అటవీ శాఖ అధికారులకు దొరకకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆరురోజుల కిందట సీతానగరం మండలం తొర్రేడులో ఆవులపై దాడి చేసి చంపిన పులి రఘనాథపురంలో గేదేను బలికొంది. అనంతరం యర్రపాలెంలో మూడు లేగదూడలను చంపింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పులి తమపై ఎక్కడ దాడి చేస్తుందా అని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ క్రమంలో పులిని పట్టుకునేందుకు నేషనల్ ఎక్స్ఫర్ట్ టీమ్ను తెప్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పులిని పట్టుకునేందుకు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాలను సిద్ధం చేశామన్నారు. అయితే ఈ రోజు( శుక్రవారం) ఉదయం రాయవరం మండలంలోకి ప్రవేశించన పులి జి. ఎర్రపాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లింది. తాజాగా అక్కడే రెస్క్యూ బృందాలు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పులిని బంధించారు. దీంతో జిల్లా హమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
టైటిల్: యుఫోరియానటీనటులు: భూమిక, సారా అర్జున్, విఘ్నేశ్ గవిరెడ్డి, గౌతమ్ మేనన్, రోహిత్, ఆదర్శ్ బాలకృష్ణ, నాజర్, రవి ప్రకాశ్, నవీన రెడ్డి తదితరులునిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా ముఖి, రాగిణి గుణరచన-దర్శకత్వం: గుణశేఖర్సంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె పోతన్ఎడిటర్: ప్రవీణ్ పూడివిడుదల తేది: ఫిబ్రవరి 06, 2026తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల జాబితాలో గుణశేఖర్ పేరు ఉంటుంది. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఒక్కడు, రుద్రమదేవి, రామాయణం వంటి చిత్రాలతో చరిత్రాత్మక, సామాజిక, యాక్షన్ జానర్లలో తన ప్రత్యేక ముద్ర వేశారు. అయితే, గత కొన్నేళ్లుగా గుణశేఖర్కు సరైన విజయం దక్కలేదు. శాకుంతలం ఫ్లాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్తో 'యుఫోరియా' మూవీని తెరకెక్కించారు. యువతరం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుందో నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించారు.కథచైత్ర (సారా అర్జున్) చదువులో టాపర్.. ఐఏఎస్ కావాలనే కోరికతో సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయి కూడా .. ఒకరోజు తన స్నేహితురాలు పిలుపుమేరకు ఓ పబ్కు వెళ్తుంది. అక్కడ చైత్రకు పరిచయమైన ఐదుగురు కుర్రాళ్లలో వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి) ఆమెపై కన్నేస్తాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న వారందరూ చైత్రను నమ్మించి కారులో తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. చైత్ర ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు.అయితే, చైత్రను అత్యాచారం చేసిన ఐదుగురు కుర్రాళ్ల బ్యాక్గ్రౌండ్ చాలా బలంగా ఉంటుంది. వారిలో సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పాటు రాజకీయ, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు. ఇలాంటి క్లిస్టసమయంలో కమిషనర్ జయదేవ్ కేసును ఎలా ఛేదించారు..? ఈ కేసులో నేను కూడా నేరం చేశానని వింధ్య వేములపల్లి (భూమిక) ఎంట్రీ ఇస్తుంది.. ఇంతకీ ఈ నేరంతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి..? తనకు శిక్ష విధించాలని హైకోర్టును ఎందుకు కోరుతుంది..? ఈ కేసుని డీల్ చేస్తున్న సిటీ కమిషనర్ జయదేవ్కు వింధ్య చేసిన సాయం ఏంటి..? తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వింధ్య ఎలాంటి సాహసం చేసింది..? తెలియాలంటే యుఫోరియా మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..2022 మే 28న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్రేప్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనలో 6 మంది యువకులు (వారిలో 5 మంది మైనర్లు) పాల్గొన్నారు. ఈ ఘటనతో పాటు మరికొన్ని కీలక సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు గుణశేఖర్ యుఫోరియా కథను వెండితెరపై చూపించారని అర్థమౌతుంది. నేటి యువతరం విచ్చలివిడిగా తమ ఆనందం కోసం మాదకద్రవ్యాలకు బానిసలై ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో ఈ మూవీలో చూపించారు. ఈ క్రమంలో తమ కన్నవాళ్ల జీవితాలు కూడా నరకంగా మారుతున్నాయని ఈ కుర్రాళ్ల కథ చెబుతుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు మనం రెగ్యులర్గా న్యూస్లో చూసిన విధంగానే పలు అత్యాచార సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి. మైనర్ల మీద అత్యాచారం అనే ఘటనలు విన్న ప్రతిసారి మనలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇలాంటి సీన్స్ పదేపదే కనిపించడంతో మూవీలో ఉన్న ఆసక్తి కాస్త తగ్గుతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అనిపించదు. సినిమా ప్రారంభంలోనే చైత్రపై వికాశ్ గ్యాంగ్ చేసిన అత్యాచార ఘటన చాలా భయాందోళనగా కనిపిస్తుంది. ఈ కేసులో వెంటనే కదలిక రావడం ఆపై భూమిక తెరపైకి కనిపించడం వంటి సీన్లు కథపై పట్టును కోల్పోనియదు. కమిషనర్ జయదేవ్ విచారణ శైలి మెప్పిస్తుంది. సమాజంలో ఇలాంటి కేసులో నిత్యం జరుగుతూనే ఉంటాయి.అలాంటి సమయంలో పోలీసులు కేసును ఎలా ఛేదిస్తారనేది ఆసక్తిగా చూపించారు. మైనర్లపై అత్యాచారం సంఘటనల్లో పోక్సో చట్టం ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పడంలో గుణశేఖర్ సక్సెస్ అయ్యాడు. చైత్ర కేసులో కొడుకు చేసిన తప్పుకు తల్లిగా భూమిక అనుభవించిన క్షోభ ఎలా ఉంటుందో అందరినీ కదిలిస్తుంది. కొడుకు చేసిన తప్పు వల్ల ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కుమారుడు చేసిన తప్పును తనపై వేసుకుని కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఇలాంటి సీన్లు అన్నీ కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. అయితే, సెకండాఫ్లో కథ కాస్త గాడితప్పింది. కొడుకు, తల్లి మధ్య చూపించిన బంధం బాగున్నప్పటికీ దానిని సరైన రీతిలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూపించలేదనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే.. 'యుఫోరియా' కథలో ప్రధాన బలం సారా అర్జున్దే అని చెప్పాలి. చైత్రగా ఆమె చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో మెప్పించింది. అత్యాచార బాధితురాలు సమాజంలో ఎలాంటి ఇబ్బంది పడుతుందో తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆపై వింధ్య వేములపల్లిగా భూమిక అదరగొట్టింది. చైత్ర తర్వాత భూమిక లీడ్రోల్లో కనిపిస్తుంది. కొడుకు తప్పు చేసినా సరే చట్టం ముందు శిక్ష పడాల్సిందేనని న్యాయవ్యవస్థ పట్ల ఉండాల్సిన గౌరవాన్ని చూపుతూ... మరోపైపు కొడుకు జీవితం గురించి తల్లడిల్లిపోయే ఒక తల్లిగా భూమిక జీవించింది. వికాశ్ పాత్రలో విఘ్నే, జయదేవ్ పాత్రలో గౌతమ్ మేనన్ తమ పరిదిమేరకు మెప్పించారు. కాల భైరవ సంగీతం బాగుంది. నేటి యువతరం చూడాల్సిన సినిమాగా 'యుఫోరియా' కథ ఉంటుంది. సినిమాలో చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ సమాజానికి చాలా అవసరమైన మూవీని గుణశేఖర్ తీశారని చెప్పొచ్చు.
మ్యాన్హోల్ మూతల దొంగలు.. పదేళ్లు జైలు, రూ.50 లక్షలు ఫైన్!
అమెరికా వరస్ట్ క్రిమినల్స్ లిస్టులో 89 మంది భారతీయులు
బైక్ కోసం తండ్రిని చంపిన కొడుకు
ఇక ఆర్ఆర్ఆర్ 161 ఏఏ
బ్యాక్ టు బాలీవుడ్?
ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ధనలబ్ధి పొందుతారు
పవర్ఫుల్ అబ్దాలి
ఇది సీరియస్ మేటర్
జోడీ రిపీట్
అల్లు అర్జున్ నుదురుపై డైలాగ్ పేపర్.. అదీ కారణం
పసిడి, వెండి గుడ్న్యూస్.. రేట్లు రివర్స్!!
ఉద్యోగుల జీతాల చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం!
పాక్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
IND vs PAK: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!
మన వాళ్లు నిఘా విభాగం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నార్సార్!
భారత్తో జరగాల్సిన మ్యాచ్కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
ఏపీలో జంగిల్రాజ్
IND vs PAK: పాకిస్తాన్కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ
వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి నూతనోత్సాహం.. ఆర్థిక ప్రగతి
చర్లపల్లి కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. తల్లికి ఫోన్ చేసి..
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
అక్కడ బీఆర్ఎస్తో ఇక్కడ బీజేపీతో ఎక్కువ చోట్ల మనవాళ్లతోనే పోటీ సార్!
అంతసేపు పని చేయడం నావల్ల కావట్లేదు!
వాళ్లు మా సోదరులు: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
సోనమ్ను మించిన ఖతర్నాక్ అంజూ.. ఈ హనీమూన్ కథలో ట్విస్టులెన్నో!
మ్యాన్హోల్ మూతల దొంగలు.. పదేళ్లు జైలు, రూ.50 లక్షలు ఫైన్!
అమెరికా వరస్ట్ క్రిమినల్స్ లిస్టులో 89 మంది భారతీయులు
బైక్ కోసం తండ్రిని చంపిన కొడుకు
ఇక ఆర్ఆర్ఆర్ 161 ఏఏ
బ్యాక్ టు బాలీవుడ్?
ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ధనలబ్ధి పొందుతారు
పవర్ఫుల్ అబ్దాలి
ఇది సీరియస్ మేటర్
జోడీ రిపీట్
అల్లు అర్జున్ నుదురుపై డైలాగ్ పేపర్.. అదీ కారణం
పసిడి, వెండి గుడ్న్యూస్.. రేట్లు రివర్స్!!
ఉద్యోగుల జీతాల చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం!
పాక్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
IND vs PAK: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!
మన వాళ్లు నిఘా విభాగం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నార్సార్!
భారత్తో జరగాల్సిన మ్యాచ్కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
ఏపీలో జంగిల్రాజ్
IND vs PAK: పాకిస్తాన్కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ
వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి నూతనోత్సాహం.. ఆర్థిక ప్రగతి
చర్లపల్లి కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. తల్లికి ఫోన్ చేసి..
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
అక్కడ బీఆర్ఎస్తో ఇక్కడ బీజేపీతో ఎక్కువ చోట్ల మనవాళ్లతోనే పోటీ సార్!
అంతసేపు పని చేయడం నావల్ల కావట్లేదు!
వాళ్లు మా సోదరులు: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
సోనమ్ను మించిన ఖతర్నాక్ అంజూ.. ఈ హనీమూన్ కథలో ట్విస్టులెన్నో!
ఫొటోలు
జగన్ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)
హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
బంజారాహిల్స్ : సజ్జనర్ సార్.. నేనూ పోలీసింగ్ చేస్తా.. (ఫొటోలు)
‘యుఫోరియా’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
బ్లూ డ్రెస్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)
ఈయనే నా కెప్టెన్: శేఖర్ కమ్ముల కూతురు (ఫోటోలు)
ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)
సినిమా
'ఏడేళ్లప్పుడు ఆ ఒక్క సంఘటన.. ఆ దెబ్బకు మారిపోయా'
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగ తెలిసిందే. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడగా.. అది కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. తన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. కేవలం తాను కుక్కుల క్షేమం కోసమే పనిచేస్తున్నానని చాలా సార్లు వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్.. తాను వేగాన్గా మారడానికి కారణాలను పంచుకుంది.తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక మేక పిల్లను బలి ఇవ్వడం చూశానని రేణు దేశాయ్ తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టుకోలేదని రేణు వెల్లడించింది. మాది బ్రాహ్మణ కుటుంబమని.. అయినప్పటికీ నాన్న మాంసం తినేవారని పేర్కొంది. కానీ మా అమ్మ మమ్మల్ని తినద్దని ఎప్పుడు ఆపలేదని.. కానీ నేను తినకూడదని నిర్ణయించుకున్నాని రేణు దేశాయ్ పంచుకుంది. ఏడేళ్ల వయసులో ఆ సంఘటన చూసినప్పటి నుంచి పూర్తి వేగాన్గా మారిపోయానని తెలిపింది. మా అమ్మ కఠినమైన శాకాహారి..వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినకపోయేదని రేణు వివరించింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
జపాన్లో పుష్ప-2.. అక్కడ కూడా తగ్గేదేలే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ పుష్ప-2. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఏకంగా వరల్డ్ వైడ్గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ చిత్రాల జాబితాలో రెండో పేస్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2200 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.అయితే జపాన్లో మన తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మన హిట్ సినిమాలను జపనీస్లోకి డబ్ చేసి అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల పుష్ప-2 మూవీని కూడా జపాన్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మూవీని జనవరి 16న జపాన్లో 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల చేశారు. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అక్కడ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా జపాన్ బాక్సాఫీస్ వద్ద రూ.139.73 కోట్ల వసూళ్లతో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది.ఇటీవల జపాన్లో రిలీజైన పుష్ప-2 సైతం జపాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా మూవీ రిలీజైన 14 రోజుల్లోనే ఇండియన్ చిత్రాల జాబితాలో టాప్-10లో అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.రూ.6.06 కోట్ల వసూళ్లతో ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3 (రూ6.03 కోట్లు) వసూళ్లను అధిగమించి 10వ స్థానంలో నిలిచింది. దీంతో జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాలలో పుష్ప 2 చోటు దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించింది. జపాన్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితా..ఆర్ఆర్ఆర్ - రూ.139.73 కోట్లుముత్తు - రూ.23.39 కోట్లుబాహుబలి 2: ది కన్క్లూజన్ - రూ.17.61 కోట్లు3 ఇడియట్స్- రూ.9.81 కోట్లుఇంగ్లీష్ వింగ్లీష్- రూ.9.24 కోట్లుది లంచ్బాక్స్- రూ.8.66 కోట్లుసాహో- రూ.7.56 కోట్లుమగధీర- రూ.7.51 కోట్లుఎంతిరన్ (రోబో - రూ.6.33 కోట్లుపుష్ప 2: ది రూల్- రూ.6.06 కోట్లు
ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.టాప్లో ట్రెండింగ్..థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.తాజాగా నెట్ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్లో కొనసాగడం విశేషం.కాగా.. ధురంధర్లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw— Netflix India (@NetflixIndia) February 4, 2026
‘సుమతీ శతకం’ మూవీ రివ్యూ
బిగ్బాస్ షో తర్వాత బుల్లితెర హీరో అమర్దీప్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలు టీవీ షోలతో పాటు సినిమా చాన్స్లు కూడా వస్తున్నాయి. బుల్లితెరపై ఓ మార్క్ వేసిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా ‘సుమతీ శతకం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన కృష్ణ (అమర్ దీప్)కి పెళ్లిపై చాలా ఆశలు ఉంటాయి. ఊర్లోనే ఉంటూ కిరాణ కొట్టు నడుపుతుండడంతో అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఊర్లో జరిగే జాతరలో అందరి సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుంటానంటూ నాన్నమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టలేకపోతోన్నందుకు కృష్ణ బాధపడుతుంటాడు. అలాంటి సమయంలో పక్క గ్రామానికి అంగన్వాడీ టీచర్గా వచ్చిన సుమతి(శైలి చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరి కిరాణం కొట్టు నడిపే కృష్ణతో సుమతీ ఎలా ప్రేమలో పడింది? పెళ్లికి ఆమె పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు కృష్ణ పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఈ విలేజ్ లవ్స్టోరీకి భక్తి, సందేశాత్మక అంశాలు మేళవించి కమర్షియల్ పంథాలో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎంఎం నాయుడు. ప్రారంభంలో కాస్త కథ ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్కి కథలో లీనమయ్యేలా ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తారు. అయితే ఇందులో ట్విస్ట్స్ పెద్దగా లేకపోవడం, ఊహకందేలా సాగడం, విలనిజం కూడా గట్టిగా పండకపోవడంతో ఈ సినిమాకు మైనస్.అయితే ఎమోషనల్ సన్నివేశాలతో ఆ లోపాలను కొంతమేర కప్పిపుచ్చారు.పెళ్లి చుట్టూ రాసుకున్న కథ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నింటినీ సమపాళ్లలో చూపించారు. కానీ ముందుగా చెప్పినట్లుగా ఊహకందేలా కథనం సాగడంతో కథనం రక్తి కట్టించదు. సరదాగా, సాఫీగా సాగే గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రకు అమర్దీప్ న్యాయం చేశాడు. పల్లెటూరి యువకుడిగా కృష్ణ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ను పండించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శైలి చౌదరి నటన పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఊరి ప్రెసిడెంట్గా మహేష్ విట్టా, హీరో స్నేహితుడిగా టేస్టీ తేజ కొన్ని సీన్లలో నవ్వులు పూయించారు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ చిత్రంలోని చాలా విజువల్స్ బాగుంటాయి. రూరల్ బ్యాక్డ్రాప్ను సినిమాటోగ్రాఫర్ ఎస్ హాలేష్ బాగా క్యాప్చర్ చేశారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన పాటల్లో పల్లెటూరి ఫీల్ వచ్చింది. నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఖర్చు విషయంలో రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.
క్రీడలు
భారత్-పాక్ మ్యాచ్పై ఐసీసీ కీలక నిర్ణయం
టీ20 ప్రపంచకప్-2026లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దాదాపుగా లేనట్టే. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు సంబంధించి టికెట్ల అమ్మకాలను ఐసీసీ (ICC) తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడాల్సి ఉంది. కానీ రాజకీయ ఉద్రిక్తల కారణంగా భారత్తో మ్యాచ్ను బాయ్కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.కానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటికీ ఐసీసీకి ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ మ్యాచ్ను బాయ్కట్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించినప్పటకి పాక్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి లేఖ రాసింది.ఈ మ్యాచ్ రద్దయితే అన్ని విధాలగా తమ దేశం భారీగా నష్టపోతుందని ఆ లేఖలో శ్రీలంక క్రికెట్ పేర్కొంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని లంక బోర్డు కోరింది. అయినా కూడా పీసీబీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ సందిగ్ధత వల్లే టికెట్లు విక్రయించిన తర్వాత ఒకవేళ మ్యాచ్ రద్దయితే, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఐసీసీ బుకింగ్స్ను నిలిపివేసింది. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఇతర ఎనిమిది మ్యాచ్ల టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం బుకింగ్ పోర్టల్లో కనిపించడం లేదు. ఈ మెగా టోర్నీ శనివారం(ఫిబ్రవరి 7) నుంచి ప్రారంభం కానుంది.
'పాక్కు చుక్కలు చూపిస్తాం'.. పసికూన బౌలర్ వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో కొలంబో వేదికగా పాకిస్తాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టుకు నెదర్లాండ్స్ సీనియర్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వాన్ మీకెరెన్ తాజాగా క్రిక్స్ అనే స్పోర్ట్స్ వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వాన్ మీకెరెన్కు పాక్తో మ్యాచ్ కోసం ఏమైనా ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నారా? అన్న ప్రశ్న ఎదురైంది."పాకిస్థాన్తో మ్యాచ్ను మేము ప్రత్యేకంగా చూడడం లేదు. ఇది కూడా మిగిలిన మ్యాచ్ల్లాగే. మా గ్రూపులో భారత్ వంటి బలమైన జట్టుతో పాటు అమెరికా, నమీబియా వంటి టీమ్స్ కూడా ఉన్నాయి. మా దృష్టి కేవలం పాక్ మ్యాచ్పైనే లేదు. టోర్నీ తొలి మ్యాచ్లో పాక్ ఓడించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. 2009 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో మేము సంచలన విజయం సాధించాము. ఇప్పుడే అదే ఫలితాన్ని పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉన్నాము" అని వాన్ మీకెరెన్ పేర్కొన్నాడు.అదేవిధంగా పాక్ పేస్ బౌలింగ్ చూసి భయపడుతున్నారా? అన్న ప్రశ్నకు వాన్ మీకెరెన్ బదులిస్తూ: ఒకప్పుడు పాక్ బౌలర్లను చూసి భయపడేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్లో పాక్ జట్టుతో మ్యాచ్లు ఆడాము. పాక్ బలాలు, బలహీనతలపై మాకు ఒక అవగహన ఉందని చెప్పుకొచ్చాడు.కాగా డచ్ జట్టుతో మ్యాచ్కు పాక్కు చాలా కీలకం. భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్తో మ్యాచ్ పాయింట్లు కోల్పోనుండటంతో.. పాక్ తదుపరి రౌండ్కు వెళ్లాలంటే నెదర్లాండ్స్, అమెరికా, నమీబియాలతో జరిగే మిగిలిన మూడు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాల్సిందే.
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అయితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ త్వరగా ఔటైనప్పటికి వైభవ్ మాత్రం కెప్టెన్ ఆయూష్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి బ్యాటింగ్ చూసి ప్రత్యర్ది బౌలర్లు గజగజ వణికిపోయారు. ఈ క్రమంలో అతడు కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు మాత్రే(53), అభిజ్ఞాన్ కుండు(40), కనిష్క్ చౌహాన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు.టీమిండియా సరికొత్త చరిత్రఅండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్పై ఆసీస్ 253 పరుగులు చేసింది. తాజా మ్యాచ్లో 411 పరుగులు చేసిన యంగ్ ఇండియా.. కంగారుల ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.అండర్-19 ప్రపంచకప్లో 400 పరుగుల మార్కును అత్యధిక సార్లు దాటిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. టీమిండియా మూడు సార్లు 400కు పైగా టోటల్స్ను నమోదు చేసింది.
T20 WC: ఐసీసీని విమర్శించిన కామెంటేటర్కు చోటు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కామెంటేటర్ల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈసారి కూడా అత్యుత్తమ కామెంట్రీతో ఆకట్టుకునేందుకు ఐసీసీ టీవీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రేక్షకులకు వరల్డ్క్లాస్ అనుభూతిని అందించేందుకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని పేర్కొంది.బంగ్లాదేశ్- పాకిస్తాన్కు మద్దతుగాఅయితే, ఈ కామెంటేటర్ల లిస్టులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్కు చోటు ఇవ్వడం పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్- పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతూ.. భారత్, ఐసీసీని నాసిర్ హొసేన్ విమర్శించిన విషయం తెలిసిందే. బంగ్లా, పాక్లను ఒక విధంగా.. టీమిండియాను మరో విధంగా ఐసీసీ చూస్తోందని.. ఇదెక్కడి న్యాయం అని అతడు ప్రశ్నించాడు.భారత్ దగ్గర డబ్బు ఉందని ఆ జట్టు అభిమానులు అనుకోవచ్చని.. అయితే, ఐసీసీ అందరినీ సమానంగా చూడాలంటూ నాసిర్ హొసేన్ వ్యాఖ్యానించాడు. కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతం ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఐసీసీఐ బీసీసీఐ ఆధిపత్యం చెలాయిస్తోందనేలా నాసిర్ మాట్లాడాడు.మరచిపోతే ఎలా?అయితే, నెటిజన్లు అతడికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. జింబాబ్వే విషయంలో ఇంగ్లండ్ ఏం చేసిందో గుర్తు చేసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా భారత్లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్.. తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది.అయినా సరే బంగ్లా పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో బంగ్లాకు మద్దతుగా నిలుస్తామంటూ భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. అదే జరిగితే ఐసీసీతో పాటు ఐసీసీ సభ్య దేశాల ఆదాయం భారీగా తగ్గిపోతుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 నిర్వహణకు షెడ్యూల్ ఖారారైంది. ఈ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి.ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్-2026 కామెంటేటర్లు వీరేరవిశాస్త్రి, నాసిర్ హుస్సేన్, ఇయాన్ స్మిత్, ఇయాన్ బిషప్, ఆరోన్ ఫించ్, దినేశ్ కార్తీక్, కుమార్ సంగక్కర, శామ్యూల్ బద్రీ, రాబిన్ ఉతప్ప, కార్లోస్ బ్రాత్వైట్, ఇయాన్ మోర్గాన్, వసీం అక్రమ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, డేల్ స్టెయిన్, మైఖేల్ అథర్టన్.....వకార్ యూనిస్, సైమన్ డౌల్, షాన్ పొలాక్, కేటీ మార్టిన్, హర్ష భోగ్లే, పుమెలెలో ఎంబంగ్వా, నటాలీ జర్మనోస్, డానీ మోరిసన్, అలాన్ విల్కిన్స్, ఇయాన్ వార్డ్, మార్క్ హోవార్డ్..నిక్ నైట్, అథర్ అలీ ఖాన్, కాస్ నైడూ, బాజిద్ ఖాన్, రౌనక్ కపూర్, నియాల్ ఓ'బ్రియన్, ప్రెస్టన్ మామ్సెన్, ఆండ్రూ లియోనార్డ్, రస్సెల్ ఆర్నాల్డ్, రోషన్ అబేసింఘే, ఏంజెలో మాథ్యూస్, టెంబా బావుమా.చదవండి: T20 WC 2026: సిరాజ్కు గోల్డెన్ ఛాన్స్!
న్యూస్ పాడ్కాస్ట్
‘లిఫ్ట్’ తాకట్టుపై రాయలసీమ కన్నెర్ర... ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
జీవీఎంసీలో రౌడీ రాజ్యం... గీతం కబ్జాకు పచ్చజెండా... కనీస చర్చ లేకుండానే భూముల క్రమబద్దీకరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో రీ సర్వే సూపర్. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ, మార్కెట్ సంస్కరణలు భేష్ అని పొగిడిన కేంద్ర ఆర్థిక సర్వే
YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు... సీబీఐ దర్యాప్తులో వెల్లడి... బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం
బిజినెస్
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు కొత్త మార్కెట్ దిగువ స్థాయికి చేరుకునే వరకు బిట్కాయిన్ (BTC), బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల ఊగిసలాట కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన పోస్ట్లో, అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న “అత్యంత పెద్ద సమస్య”గా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో సంబంధం ఉన్న భవిష్యత్ బాధ్యతలను కలిపితే మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య” అని కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడే కొనేది లేదువెండి ధర 60 డాలర్లు, బిట్కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. “నేను కొన్ని బిట్కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు” అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ కొత్త దిగువ స్థాయిల కోసం “ఓపికగా వేచి చూస్తున్నాను” అని అన్నారు.గురువారం సెషన్లో బిట్కాయిన్ ధర 60,100 డాలర్ల వరకు పడిపోయి, రాత్రికి 65,600 డాలర్లకు చేరింది. అయినప్పటికీ, గత 24 గంటల్లో ఇది ఇంకా 6.6% తగ్గుదలలోనే ఉంది. స్టాక్ట్విట్స్ ప్రకారం.. బిట్కాయిన్పై రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏడాది కనిష్టానికి చేరి ‘అత్యంత బేరిష్’ జోన్లోకి వెళ్లింది. చర్చల స్థాయి మాత్రం ‘అత్యధికం’గా ఉంది.బంగారం, వెండి మార్కెట్ పరిస్థితిగురువారం రాత్రి బంగారం ఔన్స్కు సుమారు 4,400 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ, గత రోజుతో పోలిస్తే 1.95% లాభపడింది. అయితే, స్పైడర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్ (GLD) రెగ్యులర్ ట్రేడింగ్లో 2.66% పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్స్లో మరో 0.92% తగ్గింది. స్టాక్ట్విట్స్లో పసిడిపై సెంటిమెంట్ ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి తగ్గింది.ఇదీ చదవండి: క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండిఇక వెండి ధరలు గురువారం రాత్రి 4.4% పెరిగి 73.8 డాలర్లకు చేరుకున్నాయి. రెగ్యులర్ సెషన్లో 15.77% పతనం తర్వాత, ఐషేర్స్ సిల్వర్ ట్రస్ట్ (SLV) ఆఫ్టర్ అవర్స్లో మరో 4.63% తగ్గింది. వెండి చుట్టూ రిటైల్ సెంటిమెంట్ కూడా ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి దిగింది. చర్చల తీవ్రత ‘చాలా ఎక్కువ’ నుంచి ‘ఎక్కువ’కు తగ్గింది.సమయం, సహనం కీలకంధరలు తక్కువ స్థాయికి చేరేవరకు వేచి ఉండాలని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. వెండి ధర 74 డాలర్లకి, బంగారం 4,000 డాలర్లకు పడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం తగినంత ఎథీరియం ఉందని, భవిష్యత్తులో ఆ వాటాను పెంచుకోవడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.“లాభం మీరు కొనుగోలు చేసినప్పుడు వస్తుంది… అమ్మినప్పుడు కాదు,” అని రిచ్ డాడ్ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని, ధరల ర్యాలీలను వెంబడించవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. చివరగా, ఆయన తరచూ చెప్పే “పందులు లావవుతాయి… కానీ అత్యాశ పందులు మాంసంగా మారుతాయి” అన్న మాటను మరోసారి గుర్తుచేశారు.AS I POSTED on X earlier. I stopped buying silver at $60.I stopped buying Bitcoin at $6000.I stopped buying gold at $300.I have sold some Bitcoin and some gold. I hate selling because I hate paying capital gain taxes.Today…. I wait patiently for new bottoms for gold…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 6, 2026
హైదరాబాద్లో మరో కొత్త జీసీసీ.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్: దిగ్గజ వెల్ మేనేజ్మెంట్ ఎల్పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ హైదరాబాద్లో ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. అలాగే కొత్త కార్యకలాపాలకు హెడ్గా రమేష్ కాజాను నియమించుకున్నట్లు తెలిపింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ తమ టెక్నాలజీ, కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఆర్థిక సేవల్లో విస్తృతంగా ప్రతిభావంతుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, వ్యాపారాన్ని కొనసాగించేందుకు సంబంధించిన సానుకూలాంశాలు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది.భారీగా ఉద్యోగావకాశాలువచ్చే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాలకు సంబంధించి హైదరాబాద్లో ఎల్పీఎల్ వందల కొద్దీ ఉద్యోగాలను కల్పించనుంది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రస్తుతం తమ టీమ్ కోసం ప్రతిభావంతులను నియమించుకునే ప్రక్రియలో ఉంది. నెట్వర్క్ సెక్యూరిటీ, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఇంజినీరింగ్, డేటా ప్లాట్ఫామ్స్, మిడిల్వేర్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్వ్యాప్తంగా నిపుణులైన ఇంజినీర్లు, టెక్నాలజిస్టులు వీరిలో ఉండనున్నారు.భారత్లోని ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో ఉద్యోగావకాశాల కోసం ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లింక్డ్ఇన్ (LinkedIn) పేజీ, ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కెరియర్స్ సైట్ని సందర్శించాలని కంపెనీ సూచించింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గురించి..ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఎల్పీఎల్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (Nasdaq: LPLA) అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటి. 32,000 మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు, 1,200కు పైగా ఆర్థిక సంస్థల వెల్త్ మేనేజ్మెంట్ విధానాలకు సపోర్ట్ అందిస్తూ దాదాపు 80 లక్షల మందికి సంబంధించి 2.4 ట్రిలియన్ డాలర్ల నిధులను నిర్వహిస్తోంది.అధునాతన ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు, అప్లికేషన్ల వినూత్న ప్లాట్ఫాం దన్నుతో, ఆర్థిక సలహాదారులు తమ క్లయింట్లకు వ్యక్తిగతీకరించిన ఆర్థిక ప్రణాళికలను అందించడానికి ఉపయోగించే ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ , వెల్త్ మేనేజ్మెంట్ ప్రోడక్టులను ఎల్పీఎల్ ఫైనాన్షియల్ అందిస్తోంది.
క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
బంగారం, వెండి ధరలు మళ్లీ క్రాష్ అయ్యాయి. మరోసారి భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి విధాన సమీక్ష.కీలక రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో వరుస రేటు తగ్గింపుల తర్వాత ఇప్పుడు తటస్థ వైఖరి తీసుకుంది. గత ఫిబ్రవరి నుండి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడు కోతల ద్వారా రెపో రేటును మొత్తం 100 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది.గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటును జూన్ లో 5.5 శాతానికి తగ్గించింది. ఒక బేసిస్ పాయింట్ అంటే ఒక పర్సెంటేజ్ పాయింట్ లో వందవ వంతుకు సమానం. రెపో రేటు తగ్గింపుతో పాటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్ డిఎఫ్) రేటును 5 శాతంగా ఉంచారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎంఎస్ ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు రెండూ 5.50 శాతంగా నిర్ణయించింది. ద్రవ్యోల్బణం టాలరెన్స్ బ్యాండ్ కంటే తక్కువగా ఉంది. అధిక ఫ్రీక్వెన్సీ సూచికలు ఈ సంవత్సరం మరియు అంతకు మించి బలమైన వృద్ధి వేగాన్ని కొనసాగించాలని సూచిస్తున్నాయి.యూరోపియన్ యూనియన్, యుఎస్ తో మైలురాయి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం వల్ల వృద్ధి వేగం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణ ప్రస్తుత ప్రపంచ క్రమాన్ని విప్పుతోంది. ఆర్థిక స్థిరత్వ ఆందోళనలను ప్రతిబింబించే బాండ్ మార్కెట్ సెంటిమెంట్లు బేరిష్ గా ఉన్నాయి.డిసెంబర్ ఎంపీసీ సమావేశంలో ఏం జరిగిందంటే..డిసెంబర్ పాలసీ సమావేశంలో, ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతం నుండి 5.25 శాతానికి తగ్గించింది. ఆ సమయంలో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5.00 శాతంగా నిర్ణయించారు, అయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటును 5.50 శాతంగా నిర్ణయించారు.
ఫ్యామిలీ
Parliament session: స్టైలిష్ సిల్క్ చీరలో మెరిసిన కంగనా..!
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ యాక్టింగ్ పరంగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సొంతం చేసుకున్న అందాల నటి. ఫ్యాషన్ పరంగాను ఆమె సాటిలేరవ్వరూ అన్నంతగా హుందాగా, స్టైలిష్గా ఉంటారామె. ఈనెల ఫిబ్రవరి 04న జరిగిన పార్లమెంట్ సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఒక్కసారిగా ఆమె అభిమానులు రాజకీయనాయకురాలిగా హుందాగా కనిపించడంలో నీకు సాటిరావెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు ముంచెత్తారు. ఆమె ఆధునిక మహిళలా బ్రోకెడ్ ఎంబ్రాయిడరీతో కూడిన పట్టు చీర విత్ ట్రెంచ్ కోట్-శైలి జాకెట్తో అత్యంత అందంగా కనిపించారామె. అచ్చం సాంప్రదాయ శైలి చీర కట్టుతో చక్కగా మడత పెట్టిన పల్లు, ఫుల్హ్యాండ్స్ జాకెట్తో పార్లమెంట్ రేంజ్కి తగినట్లుగా అత్యంత హుందాగా ఉంది ఆమె ఆహార్యం. అలాగే లైట్ మేకప్, బ్యాక్సన్గ్లాస్, చేతిలో హెర్మెస్ బ్యాగ్తో అత్యంత ముగ్దమనోహరంగా ఉందామె. సింపుల్గా చెప్పాలంటే ఆత్మవిశ్వాసంతో కూడిన రాజకీయ నాయకురాలిలా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రత్యేకంగా కనిపించారామె. View this post on Instagram A post shared by Ecnopolis India (@ecnopolis.india) (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు)
70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు
ఓ వృద్ధ మహిళ దీర్ఘకాలికంగా విపరీతమైన తలతిరగడం సమస్యతో బాధపడుతోంది. ఎన్నో ఆస్ప్రతులు, పలు స్కానింగ్ పరీక్షలు చేసినా..ఎందువల్ల ఈ సమస్య అనేది ఎవ్వరు చెప్పలేకపోయారు. వెద్యులకే అంతుపట్టని మిస్టరీ వైద్య సమస్యలా మారింది ఆమె బాధ. అయితే చివరికి న్యూరాలజిస్ట్లు ఎందువల్ల ఆమెకు ఈ సమస్య వచ్చిందో తెలిసి విస్తుపోయారు. పైగా ఆ వైద్యుడు ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 70 ఏళ్ల మహిళకు విపరీతమైన తలతిరడం సమస్యతో బాధపడుతుంది. ఒంటిరిగా వెళ్లాలన్నా..కాసేపు నుంచొన్న పడిపోతానేమో అనే భయంతో విలవిలలాడింది. ఆ సమస్యతో తాళ్లలేక పలు ఆస్పత్రులు సందర్శించినా..ఎలాంటి సమస్యల లేదని తేల్చి చెప్పారు. ఎమ్మారై నుంచి ప్రతి స్కాన్లో రిపోర్టు నార్మల్గానే రావడంతో వైద్యలు సైతం ఇదొక అంతుపట్టని మిస్టరీ సమస్యగా పేర్కొన్నారు. బ్రెయిన్లో కణితి లేక స్ట్రోక్ వల్ల వస్తుందేమోనని బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్లు చేసినా..ఫలితం శూన్యం. దాంతో చివరికి ఆమె న్యూరోలజిస్ట్ని సంప్రదించగా..ఆయన ఆమె సమస్యను క్షణ్ణంగా పరిశీలించారు. ఆయన ఆమె ఎదుర్కొంటుంది సాధారణ తలతిరుగుడు సమస్య కాదని గుర్తించారు. దాంతో ఆమెను లేచి నిలబడి ఉండమని చెప్పినప్పుడూ..కొంచెం సేపు నుంచోలేకపోవడం గమనించారు. ఆ తర్వాత ఆమె ఆహారపు అలవాట్లు గురించి విచారించగా..అసలు సమస్య ఎక్కడ ఉందో ఆయన గుర్తించి సవివరంగా చెప్పారు. పైగా ఇలాంటి సమస్యను చాలామది ఫేస్ చేస్తున్నారని. అయితే వాళ్లే తేలిగ్గా తీసుకోవడంతోనే వెలుగులోకి రాలేదన్నారు. ఎందువల్ల అంటే..ఆ మహిళ దీర్ఘకాలం పాటు పూర్తిగా శాకాహారం, పాల ఉత్పత్తులను నివారించడంతోనే పోషకాహారం లోపం ఏర్పడి.. నరాలు, కీళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఆమె నుంచొన్నప్పుడు కాలి వేళ్ల స్పర్శను అనుభూతి పొందలేకపోయిందని చెప్పారు. కాలి చీలమండలం దాక ఎలాంటి సెన్సేషన్ లేకపోవడం గుర్తించారు వైద్యులు. నిలబడుతున్నప్పుడూ ఆ మహిళ బ్యాలెన్స్ చేసుకోలేనట్టుగా ఊగిపోవడం గమనించారు. అది సాధారణ తలతిరగడం సమస్య కిందకు రాదని అన్నారు న్యూరాలజిస్ట్ వైద్యులు. కఠిన శాకాహారిగా తక్కువ పాల ఉత్పత్తులు తీసుకోవడంతో వచ్చిన సమస్యగా వెల్లడించారు. అంతేగాదు దీన్ని బీ12 లోపంగా పేర్కొన్నారాయన. బీ12 లోపం అంటే..నరాలను రక్షించే మైలిన్ తొడుగును నిర్వహించడానికి బీ12 చాలా అవసరం. అది లేకపోతే మెదడుకి సంకేతాలు పంపే పెద్ద ఫైబర్ నరాలు పనిచేయడం మానేస్తాయి. సదరు మహిళకు శరీరంలో బీ12 స్థాయిలు 153 pg/mL ఉన్నాయి . అంటే సాధారణ మనిషికి ఉండాల్సిన దానికంటే అత్యంత తక్కువ. దాంతో వైద్యులు ఆమెకు కండరాల ద్వారా బీ12 ఇంజెక్షన్లు అందించినట్లు తెలిపారు. దాంతో ఆమెకు కొన్ని వారాల్లోనే నడక బ్యాలెన్స్ అయ్యిందని, అలాగే పడిపోతాననే భయం మాయమైందని చెప్పారు. ఆమెకు ఇదివరకటిలా గోడలను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యను రోగ నిర్థారణ స్కాన్లతో గుర్తించలేమని చెప్పారు. అంతేగాదు పాల ఉత్పత్తులు, లేదా సప్లిమెంట్లు లేకుండా దీర్ఘకాలం పాటు శాకాహారం తీసుకుంటే బీ12 విటమిన్ లోపం వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇలాంటి సమస్యని(బీ12 లోపం) ముందుగా గుర్తిస్తేనే నయం చేయగలమని లేదంటే శాశ్వత వైకల్యాన్ని ఎదుర్కొనక తప్పదని అంటున్నారు న్యూరాలజిస్ట్లు.When the Brain Was Blamed; but the Nerves Told the TruthShe was 70, soft-spoken, and deeply worried.For six weeks, she had been feeling dizzy and unsteady, especially while walking. She described it as “the ground moving under my feet.” At times, she felt she might fall if… pic.twitter.com/do925kj2OZ— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 4, 2026 (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..)
స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా..
స్ట్రాబెర్రీలు ఈ సీజన్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యం, అందాన్నివ్వడంలోనూ మేలు చేస్తాయి. వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరిచి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.స్ట్రాబెర్రీలు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి.వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.వయస్సు తోపాటు వచ్చే కంటి సమస్యలను నివారించడంలో స్ట్రాబెర్రీలు సహాయపడుతాయి.అనేక సౌందర్య సాధనాల్లో ఉపయోగించే స్ట్రాబెర్రీ గుజ్జును ముఖానికి ప్యాక్లా వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులోని ఎల్లాజిక్ యాసిడ్ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుందిస్ట్రాబెర్రీలలో ఉండే మాలిక్ యాసిడ్ దంతాలపై ఉండే పసుపు రంగు మరకలను తొలగించి, దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్ సి శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. (చదవండి: ప్లీజ్ కూల్డ్రింక్స్కి దూరంగా ఉండండి..!)
ప్లీజ్ కూల్డ్రింక్స్కి దూరంగా ఉండండి..!
శీతల పానీయాలు తాగొద్దని వైద్యులు పదేపదే సూచిస్తుంటారు. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఫ్యాటీ లివర్, కిడ్నీ సంబంధిత అనారోగాల బారిన పడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణుల సదా హెచ్చరిస్తుంటారు. అయినాసరే ఏం కాదులే అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తూ..తాగేస్తుంటారు చాలామంది. అయితే అది ఎలా ఆరోగ్యాన్ని సమస్యల కోరల్లో చిక్కుకునేలా చేస్తోంది అస్సలు గ్రహించం అంటూ ఇక్కడొక వ్యక్తి కన్నీరుమున్నీరు విలపిస్తున్న కథ వింటే కచ్చితంగా విస్తుపోతారు. అంతేగాదు ఈ కూల్డ్రింక్స్ తాగాలా వద్దా అనే సందేహం కచ్చితంగా ఎదురవ్వుతుంది. ఎందుకంటే..నెట్టింట వైరల్ అవ్వుతున్న ఓ వీడియో అందర్నీ ఆలోచింపచేశాలా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శీతల పానీయాలు తాగడం మానేయండి అంటూ వేడుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తన తముమ్మడు అలాంటి పానీయాలు తాగే ఆరోగ్యం పాడుచేసుకున్నాడంటూ భావోద్వేగం మాట్లాడటం చూడొచ్చు. అతడి ఆరోగ్యం దారుణంగా పాడైందని, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపాడు. దాంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులో పడిందని పేర్కొన్నాడు. తన తమ్ముడిలా ఎవ్వరూ ఆరోగ్యం పాడుచేసుకోకండి అని కోరడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంతేగాదు ఈ శీతల పానీయాన్ని విషంగా పేర్కొన్నాడు. దీని కారణంగా తన సోదరుడు జీవితం పాడైందంటూ కన్నీరుమున్నీరు విలపించాడు ఆ వ్యక్తి వీడియోలో. చాలామంది నెటిజన్లు అవును ఇది మంచిది కాదని తెలిసి విషాన్ని తాగుతున్నామని అంగీకరించారు. ఈ ఘటన అందరికి కనువిప్పు అని పేర్కొంటూ కొందరు పోస్టులు పెట్టగా, మరికొందరు మాత్రం అతను రోజు కూల్డ్రింక్స్ తాగుతున్నాడని తెలిసినప్పుడూ ఎందుకు అదుపుచేయలేకపోయారు అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Updated Bharat.in™ | Latest News (@updatedbharat.in) (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..)
అంతర్జాతీయం
కశ్చిరీలకు మద్దతుగా పాక్లో ర్యాలీలు
ఇస్లామాబాద్: కశ్చిరీ ప్రజలకు సంఘీభావంగా గురువారం పాకిస్తాన్ వ్యాప్తంగా ర్యాలీలు జరిగాయి. జమ్మూకశ్చిర్ సమస్యకు పరిష్కారం కశ్చిర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయడమేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. కశ్చిర్ సాలిడారిటీ డేను పురస్కరించుకుని ముజఫరాబాద్లోని పీవోకే అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కశ్చిర్ పాకిస్తాన్లో భాగంగా మారనుందన్నారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నా ప్రకటించిన విధంగానే దేశ విదేశాంగ విధానానికి కశ్చిరే ప్రాతిపదికగా ఉంటుందని తెలిపారు. కశ్చిర్ అంశాన్ని పాలస్తీనాతో ముడిపెట్టిన షెహబాజ్ షరీఫ్ ఈ సందర్భంగా హతులైన ఉగ్రవాదులు బుర్హాన్ వనీ, సయ్యద్ అలీ జిలానీ వంటి వారి పేర్లను ప్రస్తావించారు. అనంతరం సరిహద్దుల్లోని ఫార్వర్డ్ పోస్ట్ను సందర్శించి, సైనికులతో మాట్లాడారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్, అధ్యక్షుడు జర్దారీ కూడా కశ్చిర్ ప్రజలకు సంఘీభావం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. సదస్సులు, సమావేశాలతోపాటు ఉదయం 10 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఒక నిమిషం మౌనం పాటించినట్లు ప్రభుత్వ రేడియో వెల్లడించింది.
విద్యా వెలుగులు పంచిన టీచరమ్మకు గ్లోబల్ ప్రైజ్
దుబాయ్: పాఠశాల ముఖం చూడని పేద చిన్నారులకు విద్యనందిస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులకు విద్యాభాగ్యం కల్పిస్తున్న ఉపాధ్యాయురాలు, ముంబైకి చెందిన రూబల్ నాగీని ప్రతిష్టాత్మక జెమ్స్ ఎడ్యుకేషన్ ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’వరించింది. అవార్డ్తోపాటు 10లక్షల డాలర్లు(దాదాపు రూ.9 కోట్ల)నగదు బహుమతినీ ఆమె గెల్చుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో గురువారం జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సదస్సులో ఈమెకు అవార్డ్ను ప్రదానంచేశారు. దేశవ్యాప్తంగా రూబల్ నాగీ ఆర్ట్ ఫౌండేషన్(ఆర్ఎన్ఏఎఫ్) ద్వారా బోధనాకేంద్రాలను ఏర్పాటు విద్యార్థులకు చదువు చెబుతున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో గోడలపై చిత్రాలను గీసి వాటి ద్వారా చిన్నారులకు సాహిత్యం, సామాన్య శాస్త్రం, గణితం, చరిత్ర, పర్యావరణ అవగాహన, సామాజిక బాధ్యత తదితర సబ్జెక్టులను బోధిస్తున్నారు. విద్యావేత్త అయిన నాగీ దాదాపు 20 సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా 100కుపైగా మురికివాడల్లో తన ఆర్ఎన్ఏఎఫ్ సంస్థ ద్వారా 800కుపైగా లెర్నింగ్ సెంటర్లను నెలకొల్పి విద్యాదానం మొదలెట్టారు. అద్భుత ప్రతిభాశాలి.. ‘‘లెర్నింగ్ సెంటర్లలో గోడలపై కొలువుతీరింది సజీవ కుడ్య పాండిత్యం. వీటి ద్వారా చిన్నారులు ఎంతో సులభంగా సబ్జెక్టులు, పలు విద్యాంశాలను నేర్చుకుంటున్నారు. అర్థంచేసుకుంటున్నారు. పేద పిల్లలే కాదు వాళ్ల తల్లిదండ్రులుసైతం పేదరికం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహం, బడి మాని్పంచే సంస్కృతి, మౌలిక వసతుల లేమి వంటి అంశాలపై అవగాహన పెంచుకున్నారు. పునరి్వనియోగ వస్తువులను సద్వినియోగం చేసుకుంటూ ఈ లెర్నింగ్ సెంటర్లలో బోధన కొనసాగుతోంది. ఈమె కృషితో ఆయా ప్రాంతాల్లో పేదపిల్లలు బడిమానేసే సంస్కృతి 50 శాతం తగ్గిపోయింది. ఈమె600 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. చదువు చెప్పడంతోపాటు చక్కగా చిత్రలేఖనం చేస్తారు. 850కి పైగా కుడ్యచిత్రాలు వేశారు. ప్రతిమలు సృష్టించారు. ఈమె చేతుల్లో రూపుదిద్దుకున్న కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా 200 ఎగ్జిబిషన్లలో ప్రదర్శితమయ్యాయి’’అని టీచరమ్మను జెమ్స్ ఫౌండేషన్ పొగిడింది. అవార్డ్తోపాటు తాను అందుకున్న కోట్ల రూపాయల నగదుతో కొత్త విద్యా కేంద్రాన్ని నెలకొల్పి ఉచితంగా వృత్తివిద్యా శిక్షణ ఇప్పిస్తానని నాగీ ప్రకటించారు. లాభాపేక్షలేని జెమ్స్ ఎడ్యుకేషన్ కంపెనీని ఏర్పాటుచేసి ఈజిప్ట్, ఖతార్, యూఏఈల్లో డజన్లకొద్దీ పాఠశాలలను నడుపుతున్న వర్కీ ఫౌండేషన్ 11 సంవత్సరాల క్రితం ఈ ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’అవార్డ్ను ఇవ్వడం మొదలెట్టింది. ఇప్పటిదాకా 9 మంది ప్రతిభావంతులైన టీచర్లకు ఈ అవార్డ్ దక్కింది. తన జీతభత్యాల్లో అగ్రభాగాన్ని పేదల కోసం కేటాయిస్తూ ఉచితంగా పాఠాలు చెప్పే కెన్యా టీచర్కు గతంలో ఈ అవార్డ్ దక్కింది. అహింసా సంబంధ పాఠాలు బోధిస్తూ పిల్లల్లో హింసా ప్రవృత్తిని తరిమికొట్టేందుకు కృషిచేస్తున్న పాలస్తీనియన్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిని సైతం గతంలో ఈ అవార్డ్ వరించింది. సౌదీ అరేబియాలో పేదల కోసం పాటుపడుతున్న మన్సూర్–అల్–మన్సూర్ అనే టీచర్కు గత ఏడాది ఇదే అవార్డ్ను అందజేశారు.
జాక్పాట్ తగిలింది.. లాటరీలో రూ.49కోట్లు సొంతం చేసుకున్నాడు
అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో కర్ణాటకకు చెందిన వ్యక్తి అదృష్టవంతుడిగా నిలిచారు. ఆయన రూ.49 కోట్ల జాక్పాట్ను గెలుచుకున్నాడు. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శంతను శెట్టిగర్ అదృష్టవంతుడిగా నిలిచారు. ఆయన టికెట్ నంబర్ ఎంపిక కావడంతో రూ.49 కోట్లను(AED 22 మిలియన్) సొంతం చేసుకున్నారు.కర్ణాటకకు చెందిన శంతను గల్ఫ్లో ఉద్యోగం చేస్తూ, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. అనుకోకుండా ఆయన టికెట్ నంబర్ డ్రాలో ఎంపిక కావడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది.విజయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందంలో మునిగిపోయారు. ఇది మా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన క్షణం. ఈ డబ్బుతో కుటుంబానికి భద్రత కల్పిస్తాం, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాం’అని ఆయన భావోద్వేగంగా తెలిపారు.1992లో అబుదాబి విమానాశ్రయంలో ప్రారంభమైన ఈ లాటరీ, గల్ఫ్లో అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రతి నెలా కోట్ల రూపాయల విలువైన జాక్పాట్తో పాటు లగ్జరీ కార్లు, ఇతర బహుమతులు అందజేస్తారు.గతంలో కూడా అనేక భారతీయులు ఈ లాటరీలో భారీ మొత్తాలు గెలుచుకున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు ఎక్కువగా పాల్గొంటారు.ఈ విజయం కర్ణాటకలోని ఆయన గ్రామం ఉడిపికి గర్వకారణమైంది. స్థానికులు మన ప్రాంతం నుంచి అంత పెద్ద మొత్తాన్ని గెలుచుకోవడం గొప్ప విషయం అని ఆనందం వ్యక్తం చేశారు. గల్ఫ్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు ఇది ఒక ఆశాకిరణంలా మారింది.
భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. కడుపు మంటలో పాకిస్థాన్
ఇస్లామాబాద్: అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ పాకిస్థాన్ పాలకుల పరిస్థితిని గందరగోళంలోకి నెట్టింది. పొగడ్తలతో, ఫోటోలకు ఫోజులిచ్చే ప్రయత్నాలు సరిపోవని ప్రజలు, మాజీ మంత్రులు,ఆర్థిక నిపుణులు గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఒత్తిడిలో పాక్ ప్రధాని షెహబాజ్ పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఉంటే, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాత్రం ‘నిస్సహాయ ప్రేమికుడు’ అనే అపవాదు మూటగట్టుకుంటున్నారనే చర్చ మొదలైంది. మరి ఈ ట్రేడ్ డీల్ పాకిస్థాన్ పాలకుల పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చిందా?ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో స్తబ్ధుగా ఉన్న సంబంధాలు తాజాగా భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య పరమైన ఒప్పందాలతో పరిస్థితులు మెరుగున పడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్లో ప్రజలు తమ నేతల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు భారత్ గ్లోబల్ వాణిజ్యంలో ముందడుగు వేస్తుంటే..పాక్ ప్రజలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారుట్రంప్ సేవలో అసిమ్ మునీర్ఈ సందర్భంగా తమ పాలకుల తీరును గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పలు దుమ్మెత్తి పోస్తున్నారు. అమెరికాకు మరింత దగ్గరై వాణిజ్యంతో పాటు ఇతర అంశాల్లో లబ్ధి పొందేందుకు పడరాని పాట్లు పడింది. గతేడాది ట్రంప్ను కీర్తిస్తూ పాక్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్తో కలిసి విందులో పాల్గొన్నారు. పైగా, ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఆపినందుకు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు సైతం పంపించింది దాయాది దేశం.ఆర్ధిక ఇబ్బందులతో సతమతంఅయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం పాక్పై కొంచెం కూడా కనికరం చూపించలేదు. పాక్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై 19శాతం సుంకాల్ని విధించింది. ఆ సుంకాలను చెల్లిస్తూ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంది. భారత్ మాత్రం తన ఎగుమతులపై సుంకాలను 18 శాతానికి తగ్గించినా అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల ఒప్పందాల నుంచి తప్పుకుంది. తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. తాజాగా, అమెరికాతో ట్రేడ్డీల్ కుదుర్చుకున్న భారత్పై పాక్ దేశస్థులు ప్రశంసలు కురిపిస్తూనే తమదేశాది నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. భారత్ను చూసి నేర్చుకోండి. ఫొటోలకు ఫోజులివ్వడం కాదని, దేశానికి లబ్ధి చేకూరే పనులు చేయాలని సూచిస్తున్నారు. ఇక దాయాది మాజీ మంత్రులు ఎక్స్ వేదికగా పాలకులపై సెటైర్లు వేస్తున్నారు. మాజీ పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) మంత్రి హమ్మాద్ అజ్హర్ ఇలా ట్వీట్ చేశారు. 21వ శతాబ్దంలో విదేశాంగ విధానం అనేది కేవలం చూపులు, వ్యక్తిగత సంబంధాల గురించి కాదు. అది ఆర్థిక శక్తిని వినియోగించడం, సుంకాల తగ్గింపు, దేశీయ మార్కెట్ను మరింత విస్తరించడం. భారత్ ఇటీవల యూరోపియన్ యూనియన్ (EU), అమెరికాతో చేసిన వాణిజ్య ఒప్పందాలు దీనికి నిదర్శనం. అతిగా పొగడ్తలు కురిపించడం, ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు అర్రులు చాచడం వంటివి పనికి రావు’ అని పేర్కొన్నారు. ట్రంప్ను నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయకపోయినా సుంకాల విషయంలో తాను ఏది కావాలనుకుందో భారత్ అది సాధించింది. ట్రంప్ పాకిస్థానికి ఇచ్చింది అదనంగా షూ పాలిష్ చేసుకునే అవకాశం తప్ప ఇంకేముంది?’ అని పాకిస్తాన్ ఆర్థికవేత్త జావేద్ హసన్ ఎద్దేవా చేశారు.మొత్తానికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్లో ఎవరికి ఎంత లాభం అనేది పక్కనపెడితే.. దౌత్య పరంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు పాక్ పాలకులకు మాత్రం కంట్లో నలుసులా, గోటి చుట్టూ రోకటి పోటులా మారాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ ఆర్ధిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.
జాతీయం
సిక్కింలో అర్ధరాత్రి భూకంపం
గాంగ్టక్: సిక్కింలో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిక్కింలోని గ్యాల్షింగ్ ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంపం అర్ధరాత్రి 1:09 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. ప్రకంపనల వల్ల ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. తదుపరి ప్రకంపనలు (ఆఫ్టర్ షాక్స్) వస్తాయేమోనన్న ఆందోళనతో చాలా మంది నిమిషాల తరబడి బయటే ఉండిపోయారు.ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిక్కింలో అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారుజాము వరకు సుమారు 12 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో అత్యంత శక్తివంతమైనది 1:09 గంటలకు వచ్చిన ప్రకంపనలు 4.5 తీవ్రత కలిగిఉంది. భూ కేంద్రం గ్యాల్షింగ్ ప్రాంతంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. కేవలం గ్యాల్షింగ్లో మాత్రమే కాకుండా గాంగ్టక్, మాంగన్, నామ్చి ప్రాంతాల్లో కూడా 2 నుండి 4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.మయన్మార్లో..భారత పొరుగు దేశమైన మయన్మార్లో కూడా శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 6:03 గంటలకు వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 96 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. మయన్మార్లో గతంలో కూడా భూకంపాలు సంభవించాయి. 2025లో వచ్చిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.
'సేవా' కుటుంబం
కుటుంబం అంతా కలిసి పాల్గొనే సేవా కార్యక్రమాలు పిల్లల వ్యక్తిత్వాన్ని చక్కగా రూపుదిద్దటమే కాకుండా, వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దుతాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ఒక మంచి పని కోసం కుటుంబం అంతా కలిసికట్టుగా శ్రమించటం వల్ల, పిల్లలు పెరిగి పెద్దయ్యాక అవి తీపి జ్ఞాపకాలుగామిగిలిపోతాయని మనోవికాస నిపుణలు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇతరులకు సహాయం చేయడంలోని గొప్పతనం, ఔన్నత్యం ‘వాలంటీరింగ్’ ద్వారా పిల్లలకు అర్థం అవుతుంది. దీనివల్ల వారిలో జాలి, దయ, కరుణ, ఓర్పు, కృతజ్ఞతా భావం వంటి మంచి గుణాలు ఏర్పడతాయి. మనం చేసే చిన్న సాయమైనా ఒకరి జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో పిల్లలు స్వయంగా తెలుసుకుంటారు.ఆత్మ విశ్వాసం పెరుగుతుందితల్లిదండ్రులు పిల్లల్ని తరచూ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవటానికి తీసుకెళ్లటం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరుల పట్ల ప్రేమతో మెలుగుతారు. నలుగురితో కలిసి పని చేయటం నేర్చుకుంటారు. సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను అలవరచుకుంటారు. కుటుంబ బంధం బలపడుతుందిఇంట్లో అందరూ కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, రోజూవారీ పనుల ఒత్తిడి లేకుండా కుటుంబ సభ్యులందరూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు. ఫోన్లకు, టీవీలకు లేదా ఇంటి పనులకే పరిమితం అయిపోకుండా.. ఒక మంచి లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేసినట్లవుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను బలపరుస్తుంది.ఎలాంటి సేవల్ని ఎంచుకోవాలి?పిల్లల వయసును బట్టి, వారికి ఆసక్తి ఉన్న పనులు ఎంచుకోవడం ముఖ్యం. చిన్న పిల్లలైతే చేతులతో చేసే చిన్న చిన్న పనులను ఇష్టపడతారు, అదే కొంచెం పెద్ద పిల్లలైతే బాధ్యత తీసుకునే పనులను లేదా నాయకత్వం వహించే పనులకు చొరవ చూపుతారు. ఏమైనా, అది వారికి సరదాగా అనిపించాలి. ఆ పని తప్పక చేయాలనే ఉత్సాహం వారిలో కలగాలి. పనుల ఎంపికకు ఇవే గీటురాళ్లు. నెలకు ఒక్కసారి.. కుదరకపోతే రెండునెలలకు ఒక్కసారైనా వాలంటీరింగ్ చేసినా చాలు, అది పిల్లల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. నివేదికలు..అధ్యయనాలు‘పాయింట్స్ ఆఫ్ లైట్’ అనే స్వచ్ఛంద సంస్థ ఏటా ‘ఫ్యామిలీ వాలంటీర్ డే’ ని నిర్వహిస్తుంది. కుటుంబంతో కలిసి సేవ చేయడం వల్ల పిల్లల్లో సహానుభూతి పెరుగుతుందని, సామాజిక బాధ్యత అలవడుతుందని వారి అధ్యయనాలు చెబుతున్నాయి.యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సర్వే ప్రకారం, స్వచ్ఛంద సేవల్లో పాల్గొనే పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు 18 నుంచి 35 శాతం వరకు తక్కువగా ఉంటున్నాయి. ఇండియానా యూనివర్సిటీ జరిపిన సర్వేలో టీనేజర్లు, బాలలు సేవా కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా సమాజం తీరును గ్రహిస్తున్నారు. సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకుంటున్నారు. చిన్నప్పటి నుండి సేవ చేసే అలవాటు ఉన్న పిల్లలు, పెద్దయ్యాక కూడా సమాజానికి సేవ చేసే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉంటుందని ‘కార్పొరేషన్ ఫర్ నేషనల్ అండ్ కమ్యూనిటీ సర్వీస్’ గణాంకాలు చెబుతున్నాయి.
ప్రతి పిటిషన్పై మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రతి అంశంపై మళ్లీ మళ్లీ ‘మినీ ట్రయల్స్’నిర్వహించడం సాధ్యం కాదని, దర్యాప్తును వేగంగా ముగించాలని జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్తో కూడిన ధర్మాసనం సీబీఐని గురువారం ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్నా విచారణ కొలిక్కి రాకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటే అది అంతులేకుండా పోతుందని, న్యాయం జరగడంలో జాప్యం అవుతుందని హెచ్చరించింది. ఇలాగే సాగదీస్తే మూడు నాలుగేళ్లు పడుతుంది.. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సునీతారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ ట్రయల్ కోర్టు కేవలం ఒక నిర్దిష్ట అంశంపైనే దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించినట్లు చెప్పారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు సాగదీతపై ఘాటుగా స్పందించింది. ‘ప్రతి పిటిషన్పై మేం మినీ ట్రయల్ నిర్వహించలేం. ఇలాంటి విజ్ఞప్తులను అనుమతిస్తూ పోతే ఈ కేసు అంతులేకుండా ముందుకు వెళుతుంది. ఇలాగే విచారణను సాగదీస్తే దర్యాప్తు పూర్తి కావడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. ఇది న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించడమే అవుతుంది’అని జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు. సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘ఈ కేసులో ప్రధాన దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అదనపు విచారణ కొనసాగిస్తున్నాం. కేసును ఒక ముగింపు దిశగా తెచ్చే క్రమంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం’అని నివేదించారు. నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు పేరుతో విచారణను సాగదీస్తున్నారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున అన్ని కోణాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. పిటిషనర్లు తమ వద్ద ఉన్న అదనపు సమాచారాన్ని సీబీఐకి అందజేయవచ్చని సూచించింది. ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబోం... దర్యాప్తును ఒక నెల కాలపరిమితిలోగా ముగించాలన్న అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘ఎవరిని విచారించాలి? ఎవరిని అదుపులోకి తీసుకోవాలి? అనే అంశాలపై మేం ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబోం. అది పూర్తిగా దర్యాప్తు సంస్థ విచక్షణకు సంబంధించిన విషయం. ట్రయల్ కోర్టు పర్యవేక్షణలో విచారణ వేగంగా జరగడమే ముఖ్యం. దర్యాప్తు అనేది నిరంతర ప్రక్రియ. కొత్త నిజాలు తెలిసినప్పుడు వాటిని విస్మరించలేం. దర్యాప్తు సంస్థపై కాలపరిమితి పేరుతో అనవసరమైన ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి’అని పేర్కొంది. ట్రయల్ కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ, సీబీఐ తన విధి నిర్వహణలో స్వతంత్రంగా వ్యవహరించవచ్చని పేర్కొంది. సుమారు 13,16,964 ఫైళ్లతో కూడిన సమాచారాన్ని, హార్డ్ డిస్క్లను విశ్లేషించాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టు దృష్టికి తెచ్చింది. ఇంత భారీ స్థాయిలో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి సమయం పడుతుందని, అందుకే గడువు విషయంలో వెసులుబాటు కల్పించాలని సీబీఐ కోరింది. సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై స్పష్టతనిస్తూ, కాలయాపన చేయకుండా కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
తూర్పు నాగాలాండ్ అభివృద్ధికి పాటుపడతా
న్యూఢిల్లీ: శాంతిస్థాపనకు పాటుపడుతూ నాగాలాండ్ రాష్ట్రంలోని ఆరు వెనకబడిన జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. టుయెన్సంగ్, మోన్, కిఫిరే, లోంగ్లెంగ్, నోక్లాక, షమాటార్ జిల్లాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్లతో గురువారం ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమిత్ షా ప్రసంగించారు. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా ‘ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ(ఎఫ్ఎన్టీఏ)ను ఏర్పాటుచేస్తాం. త్రైపాక్షిక ఒప్పందం మేరకు 6 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా 46 అంశాలకు సంబంధించిన నిర్ణయాధికారం కేంద్రం నుంచి ఎఫ్ఎన్టీఏకు దఖలుపడుతుంది. ఎఫ్ఎన్టీఏ కోసం చిన్న సచివాలయం నిర్మిస్తారు. రాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి సారథ్యంలో ఈ మినీ సెక్రటేరియట్ పనిచేస్తుంది. జనాభా ప్రాతిపదికన నాగాలాండ్ ప్రధాన భూభాగానికి తగ్గట్లే తూర్పునాగాలాండ్కూ అభివృద్ధి నిధుల్లో కేటాయింపులు జరుగుతాయి. ఆర్థిక స్వావలంభన, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక సాధికారత, వనరుల సది్వనియోగ సాధనకు తీసుకున్న నిర్ణయాత్మక ముందడుగు ఇది’’అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఎన్ఆర్ఐ
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!)
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు.
TPAD అధ్యక్షురాలిగా వరుసగా మూడోసారీ మహిళకే పట్టం
డల్లాస్, టెక్సాస్లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్, డల్లాస్లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.టీప్యాడ్ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్త కమిటీ సభ్యులు లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .నూతన ఈసీ సభ్యులు:బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.టీప్యాడ్ 2026 కార్యవర్గం:ఎగ్జిక్యూటివ్ కమిటీ:లక్ష్మి పోరెడ్డి (President), అనురాధ మేకల (Past President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల, రత్న వుప్పల, బాల గణపవరపు.బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.ఫౌండేషన్ కమిటీ:రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి
క్రైమ్
కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి!
చిత్తూరు అర్బన్: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని మహిళ చెప్పడంతో వృద్ధురాలిని హత్య చేయబోయాడు ఓ బాలుడు. చిత్తూరు వన్టౌన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. చిత్తూరు నగరం, గిరింపేటకు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు స్థానికంగా నివాసం ఉంటున్న 37 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు పెళ్లయి, 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాలుడితో ఉన్న బంధం కారణంగా తరచూ ఇంట్లో గొడవలు అయ్యేవి. ఈ నేపథ్యంలో తమకు అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపేయాలని ఆ మహిళ, బాలుడికి అతను చెప్పడంతో బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్యకు ప్రయత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గమనించి, ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని ప్రేరేపించిన మహిళ పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు.
సోనమ్ను మించిన ఖతర్నాక్ అంజూ.. ఈ హనీమూన్ కథలో ట్విస్టులెన్నో!
ఆ దంపతులకు పెళ్లయి అప్పటికే మూడు నెలలే అయ్యింది. కొత్త కాపురంలో ఎంతో అన్యోన్యంగా మెలిగారు వాళ్లు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఓ సరదా సాయంత్రం ఇద్దరూ హైవేపై వాకింగ్కని బయల్దేరారు. ఇంతలో ఓ వాహనం హఠాత్తుగా దూసుకొచ్చి ఇద్దరినీ ఢీ కొట్టింది. భర్త అశీష్కు వాహనం బలంగా తగలడంతో స్పాట్లోనే చనిపోయాడు. భార్య అంజూ అపస్మాకర స్థితిలో రోడ్డ పక్కన పడిపోయింది. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు వాళ్లను గమనించి వాళ్లను ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. అశీశ్ మృతదేహం స్ట్రెచ్చర్ మీద ఉంది. తన ప్రియాతిప్రియమైన భర్త ఇక లేడని తెలిసి గుండెలు అవిసెలా రోదిస్తున్న అంజూను చూసి అంతా ‘‘అయ్యో పాపం’’ అనుకున్నారు. ఈ ఘటనను తొలుత హిట్ అండ్ రన్ కేసుగా పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. అయితే విచారణలో అంజూ తడబడింది. పైగా తన బంగారు చెవి పొగులు కనిపించడం లేదని.. ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారని చెప్పింది. దీంతో విచారణను పోలీసులు పలు కోణాల్లో జరపగా.. ఈ కేసు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది.హనీమూన్ పేరిట భర్తను రాష్ట్రంకాని రాష్ట్రానికి తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో ప్రియుడితో కలిసి హత్య చేయించింది మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన సోనమ్. ఆపై ఎలాంటి అనుమానాలు రాకుండా పెద్ద కథే నడిపించింది. హనీమూన్ మర్డర్ కేసుగా మేఘాలయాలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన నెల వ్యవధిలో.. తెలంగాణలోని గద్వాల జిల్లాలో సర్వేయర్గా పని చేసే తేజేశ్వర్ను అతని భార్య ఐశ్వర్య ఖతర్నాక్ స్కెచ్తో మర్డర్ చేయించింది. ఈ రెండు ఘటనలు ఆ జంటకు పెళ్లైన స్వల్పకాలంలో జరగడంతో.. సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చే నడిచింది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఘటనే.. రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో మరో హనీమూన్ మర్డర్ కేసు బయటపడింది. పెళ్లైన కొన్నాళ్లకే తన భర్త అశీశ్ను ప్రియుడి&కోతో కలిసి కిరాతకంగా హత్య చేయించింది భార్య అంజూ. అంతేకాదు.. కేసును హిట్ అండ్ రన్ కేసుగా క్లోజ్ చేయించేందుకు శతవిధాల ప్రయత్నించింది. జనవరి 30వ తేదీ సాయంత్రం జరిగింది ఇదే.. అశీష్-అంజూలు జంటగా.. సాయంత్రం షికారు పేరుతో వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన సంజూ(అంజూ ప్రియుడు) అశీశ్పై బలంగా దాడి చేశాడు. కింద పడిపోయిన అశీల్ను రాకీ (రోహిత్), బాదల్ (సిద్ధార్థ్) గట్టిగా పట్టుకోగా.. సంజూ-అంజూలు ఊపిరి ఆగేదాకా గొంతు నులిమారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అశీష్ మృతదేహాన్ని తమ వాహనంతో బలంగా ఢీ కొట్టి దూరం పడిపోయేలా చేశారు. ఆపై తన ఒంటిపై ఉన్న నగలను ప్రియుడికి అప్పగించి.. రోడ్డుకు ఓ పక్కన పడిపోయినట్లు నటించింది అంజూ. అక్కడే దొరికింది.. అయితే వాంగ్మూలాల సమయంలో ఒక్కోసారి ఒక్కోలా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్.. ఆమెను అడ్డంగా దొరికిపోయేలా చేసింది. అనుమానంతో అంజూ ఫోన్ రికార్డులు పరిశీలించగా.. అందులో సంజూ అనే వ్యక్తితో తరచూ ఆమె మాట్లాడినట్లు తేలింది. అంతేకాదు.. అశీశ్ కలిశాక ఆ కాల్స్ మరింత ఎక్కువ అయ్యాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించగా.. అంజూ-సంజూలు నిజం ఒప్పేసుకున్నారు. అశీశ్తో తనకు వివాహం ఇష్టం లేదని.. పెద్దల బలవంతం మేరకే చేసుకున్నానని.. పెళ్లి తర్వాత ఓరోజు సంజూ ఇంటికి వెళ్లి తన భర్తను అడ్డు తొలగించుకోవడం గురించి మాట్లాడుకున్నామని.. ఈ ప్లాన్ను సంజూ తన స్నేహితులతో అమలు చేశాడని వాంగ్మూలం ఇచ్చింది. ఆపై దొంగతనం జరిగినట్లు నాటకం ఆడాలని ప్రయత్నిస్తే.. పోలీసులే హిట్ అండ్ రన్గా కేసు నమోదు చేసుకోవడంతో తన పని తేలిక అయ్యిందని భావించానని.. కానీ, పోలీసుల విచారణలో కంగారులో తడబడ్డానని అంజూ చెప్పుకొచ్చింది. దీంతో.. కేసును హత్య కేసుగా మార్చుకున్న పోలీసులు అశీశ్ భార్య అంజు, ఆమె ప్రియడు సంజు, సంజూ స్నేహితులు రాకీ, బాదల్ను అరెస్టు చేశారు. సోనమ్ కూడా..కిందటి ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన హనీమూన్ హత్య కేసు గుర్తుండే ఉంటుంంది. సోనమ్ తన తండ్రి దగ్గర పని చేసే రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని ప్రేమించి.. ఆపై భర్త రాజా రఘువంశీని ఇష్టంలేని పెళ్లి చేసుకుని.. మంచిగా నటిస్తూ హనీమూన్ పేరిట భర్తను మేఘాలయాకు తీసుకెళ్లి అక్కడ ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేయించిది. ఆపై ఏం ఎరగనట్లు కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి.. ఆపై రోడ్డుపై ఓ దాబాకు దీనావస్థలో(డ్రామా) చేరి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
వంద సీసీ కెమెరాల వడబోత
సికింద్రాబాద్: నాలుగు రోజులుగా రైల్వే పోలీసుల ఉరుకులు పరుగులు... పలువురి విచారణలు పూర్తిచేసినప్పటికీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పిన్నింటి విజయశాంతిరెడ్డి బలవన్మరణం ఘటన మిస్టరీ వీడలేదు. ఆమె ఎనిమిదేళ్లుగా నివసిస్తున్న కాలనీ, పనిచే స్తున్న కార్యాలయం, పిల్లలు చదువుతున్న విద్యా సంస్థల్లో సుమారు 200 మందిని కలిసి జీఆర్పీ పోలీసులు విచారించారు. తల్లీ పిల్లలను ఢీ కొట్టిన రైలు లోకోపైలట్ను కూడా విచారించారు. ఎక్కడా ఘటనకు సంబంధించిన వివరాలు రాలేదు.ఘటనకు కొద్దిరోజుల ముందు నుంచి ఆమె కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన సమాచారం రాబట్టలేక పోయారు. ఘటన రోజు ఆమె ఇంటి దగ్గరి నుంచి ఇరువురు పిల్లల కళాశాలలు తిరిగి చర్లపల్లి రైల్వేస్టేషన్ చేరుకునే వరకు 100 సీసీ కెమెరా పుటేజీలను తెప్పించి పరిశీలించారు. వాటన్నింటిలోనూ తల్లి వెళ్లడం.. ఇరువురు పిల్లలను తోడుకుని రావడం మినహా మరెవ్వ రితోనూ కలిసిన దాఖలాలు కనిపించలేదు.ఆ ఒక్క రోజుపైనే దృష్టంతా....గత నెల 27న కూతురు చైతన్యరెడ్డిని విజయశాంతిరెడ్డి (Vijayashanti Reddy) పటాన్చెరు హాస్టల్ నుంచి ఔటింగ్ తీసుకొచ్చారు. ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసిన అనంతరం 29న తిరిగి హాస్టల్లో డ్రాప్ చేసి వచ్చారు. 30న రాత్రి 8 గంటల ప్రాంతంలో కుమారుడిని వెంట తీసుకుని మళ్లీ ఔటింగ్ కావాలని చైతన్యరెడ్డి హాస్టల్కు వెళ్లారు. ఒక్క రోజులోనే మళ్లీ ఔటింగ్ ఎందుకని హాస్టల్ నిర్వాహకులు ప్రశ్నించగా.. బంధువు చనిపోయారని చెప్పారు. ఆ తరువాత ఇద్దరు పిల్లలతో కలిసి విజయ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.కొద్ది రోజులు ముందే బలవన్మరణం నిర్ణయం తీసుకుని ఉంటే కూతురిని ఐఐటీ పరీక్ష (IIT Exam) అనంతరం తిరిగి హాస్టల్లో డ్రాప్ చేసేవారు కాదని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కరోజులోనే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం వెనుక కారణాలు ఏంటన్న విషయాలు విచారణలో తేలడం లేదు. కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాల కోణంలోనూ బలమైన అంశాలేవీ కానరావడం లేదు.అందుకే పిల్లలు ఆమె వెంట వెళ్లారు: విజయశాంతిరెడ్డి భర్తఆత్మహత్యల సమయంలో భర్త సురేందర్రెడ్డి (Surendar Reddy) దుబాయ్లో ఉన్నందున ఆయన పాత్ర ఉండక పోవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ దశదిన కర్మ అనంతరం సురేందర్రెడ్డి ద్వారా కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆమె మొబైల్, ల్యాప్టాప్కు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక అందితే ఏదైనా క్లూ దొరుకుతుందని భావిస్తున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయీశ్వర్గౌడ్ నేతృత్వంలోని బృందం గురువారం చెంగిచెర్లలోని విజయశాంతి నివాసంలో సోదాలు చేసేందుకు వెళ్లనుంది.
కడపలో ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సోషల్ మీడియాలో లైకులు, షేరులు.. పాపులారిటీ కోసం కొందరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ యువకుడు రీల్స్ పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ముబారక్(20) తన స్నేహితుడితో కలిసి బైక్ స్టంట్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. వాటికి కొద్ది కొదద్దిగా వ్యూస్ రావడం ప్రారంభించింది. దీంతో ఎక్కువ వ్యూస్ రావాలనే ఆశతో మితిమీరి స్టంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. బైక్పై విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటనలో ముబారక్ అక్కడికక్కడే మరణించాడు. వెనకాల కూర్చున్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనలో స్కూటీ తక్కుతుక్కుగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది.
వీడియోలు
జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్
దమ్మున్నోడి దెబ్బ.. ఒక్కడిని ఎదుర్కోవడానికి 9 మంది ప్రెస్ మీట్
బాబోయ్ పెద్ద పులి..!
పారిశుధ్య కార్మికురాలి కాళ్లు మొక్కిన తమిళ నటుడు
జగన్ కోసం ఎదురుచూస్తున్న వల్లభనేని వంశీ
జన సునామిని చూసి కూటమికి ప్యాంటు తడిసిపోతుంది
బన్నీ మూవీలో రష్మిక కీ రోల్ ..! అట్లీ ప్లాన్ అదుర్స్
జగనన్న పాటకు డ్యాన్స్ లు వేసిన జనం
పిల్లాడిని ముద్దాడిన జగన్..
గోల్డ్, సిల్వర్ రేట్స్ సీన్ రివర్స్.. ఒక్కసారే రూ. 20000 ఢమాల్

