బింబిసారుడి వేల కోట్ల బంగారం.. ఆ రహస్య గుహ ఎక్కడుందో తెలుసా?
దేవాలయాలు గుప్త నిధులకు కేంద్రాలు అని చెబుతుంటారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మనం ఇంతకు ముందు వీడియోలో.. అపార నిధులకు కేంద్ర బిందువైన కమ్రూనాగ్ సరస్సు గురించి కూడా చెప్పుకొన్నాం. అయితే.. మగధ సామ్రాజ్య కాలంలో దాచిన బంగారు నిధులు ఎక్కడున్నాయో తెలుసా? తెలుగులో వచ్చిన బింబిసారుడు సినిమాలో చూపిన రహస్య గుహలు నిజంగా ఉన్నాయా? సోన్ భండార్ గుహలు ఆ కోవలోకే వస్తాయా? బ్రిటిష్ వారు ఫిరంగులతో పేల్చినా.. ఆ రాతి ద్వారం ఎందుకు చెక్కు చెదరలేదు?? ఈ సందేహాలను ఇవాళ్టి వీడియోలో నివృత్తి చేసుకుందాం.
చంద్రబాబు ‘ఈ మంగళవారం’ అప్పు రూ.2,600 కోట్లు
సాక్షి,అమరావతి: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం రోజురోజుకూ అప్పులమయంగా మారుతోంది. ఇప్పటికే అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర స్థితిగతులను మరింత దిగజార్చుతూ కూటమి సర్కార్ తాజాగా మంగళవారం మరో భారీ అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సెక్యూరిటీల వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 2,600 కోట్ల అప్పును తీసుకుంది. ఈ తాజా రుణంతో కలిపి, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన 25 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రం చేసిన మొత్తం అప్పుల విలువ ఏకంగా రూ. 3,55,000 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు ఆర్థిక రంగాన్ని, రాజకీయ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం కేవలం అధికారిక బడ్జెట్ ద్వారానే కాకుండా, వివిధ కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బడ్జెట్ వెలుపల కూడా భారీగా నిధులను సమీకరిస్తోందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.చంద్రబాబు పాలనలో జరిగిన అప్పుల అంతర్గత వివరాలు పరిశీలిస్తే.. బడ్జెటరీ అప్పులు రూ. 1,97,000 కోట్లు కాగా, బడ్జెట్ వెలుపలి అప్పులు రూ. 1,12,504 కోట్లుగా ఉన్నాయి. వీటికి తోడు అమరావతి పేరిట మరో రూ. 47,387 కోట్ల మేర రుణాలను సేకరించారు.
సీఎం విజయ్కు వైకో మద్దతు.. నిలదీసిన రిపోర్టర్పై తీవ్ర ఆగ్రహం!
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రెండు రోజులకే, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో విలేకరుల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చెంగల్పట్టులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన వైకో, ఆ సమయంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయారు. సదర జర్నలిస్టుపై నోరు పారేసుకున్నారు. గత ఐదేళ్ల డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలిందని, భూ రిజిస్ట్రేషన్ల నుండి ప్రతిదానిలోనూ ‘కటింగ్, కమిషన్’ వసూలు చేశారని వైకో ఆరోపించారు. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ జోక్యం చేసుకుంటూ..గత ఐదేళ్లుగా అదే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ అవినీతిపై ఎందుకు నోరు మెదపలేదు?అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. కూటమి రాజకీయాల్లో కొన్ని పరిమితులు ఉంటాయని, కూటమి ధర్మాన్ని పాటించడం వల్లే అప్పుడు మాట్లాడలేకపోయానని వైకో వివరణ ఇచ్చారు.అయితే సదరు జర్నలిస్ట్ అదే ప్రశ్నపై పట్టుబట్టడంతో వైకో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నువ్వు ఒక దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చావు. నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు? మీ యజమాని పత్రికను అమ్ముకున్నాడు. నువ్వు కూడా ఒక అమ్ముడుపోయిన వ్యక్తివి’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతటితో ఆగకుండా సదరు విలేకరిని ప్రెస్ మీట్ వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించారు. వైకో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న ఎండీఎంకే కార్యకర్తలు, మద్దతుదారులు సదరు జర్నలిస్ట్పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు, డీఎంకే కూటమి నుండి బయటకు వస్తున్నట్లు జూన్ 27న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో వైకో అధికారికంగా ప్రకటించారు. గత తొమ్మిదేళ్లుగా కూటమిలో తమకు సరైన గౌరవం దక్కలేదని, డీఎంకే గుర్తుపై పోటీ చేయాల్సి రావడం తమ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని ఎండీఎంకే నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే కూటమి వీడిన వైకో, ఇప్పుడు డీఎంకే ప్రభుత్వ అవినీతిని టార్గెట్ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనానికి పాజిటివ్గా చర్చలు
శరద్ పవార్(85)కు చెందిన ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు మార్గం సుగమమవుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్ విలీన చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, తుది దశకు చేరినట్లు సమాచారం.ఇందుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశంపై చర్చలు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. విలీనంపై అధిష్ఠానంతో చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. "కాంగ్రెస్, శరద్ పవార్ లౌకికవాద సిద్ధాంతాలను విశ్వసించే వారికి మా పార్టీలోకి ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాం" అని ఆయన చెప్పారు.శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. 2023లో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా అదే విధంగా ఎన్సీపీని చీల్చారు. అజిత్ పవార్ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తీసుకుని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. దీంతో ఆ ప్రాంతీయ రాజకీయ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రాంతీయ నాయకులకు ఇటీవల రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలిన సమయంలో కాంగ్రెస్తో విలీనం జరిగే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి. ఆయా పార్టీల్లో కీలక నేతలు ఇటీవల ప్రత్యేక వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సొంత పార్టీల నుంచి దూరమయ్యారు. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలిపిందని కూడా సమాచారం. ఎన్డీఏలో చేరదాం శరద్ పవార్ పార్టీ భవిష్యత్తుపై రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. ఒక వర్గం ఎన్డీఏలో చేరాలని భావిస్తోంది. పార్టీకి ఉన్న పార్లమెంటు బలం ఆధారంగా ఎన్డీఏలో భాగస్వామ్యం లభిస్తుందని ఆ వర్గం వాదిస్తోంది. ప్రతిపక్షంలో ఉండటం వల్ల రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో అభివృద్ధి పనులు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కష్టంగా మారిందని కూడా ఆ వర్గ నాయకులు భావిస్తున్నారని సమాచారం.పార్టీ రెండు వర్గాలు మళ్లీ కలిస్తే ఎన్డీఏలోనే కొనసాగాలని దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోరుకున్నారని కూడా సమాచారం. ఆయన మరణం తర్వాత రెండు ఎన్సీపీ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే అవకాశం తగ్గిపోయిందని సమాచారం. అయినప్పటికీ స్వతంత్రంగా ఎన్డీఏలో చేరేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని ఆ వర్గం భావిస్తోంది. అయితే పార్టీలోని మరో వర్గం కాంగ్రెస్లో విలీనం కావాలని కోరుకుంటోందని సమాచారం.
కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనానికి పాజిటివ్గా చర్చలు
వెబ్సైట్ మొరాయింపు.. ఐదు రోజులుగా 'స్టాంప్స్' సేవలు బంద్
'అందుకు నన్ను క్షమించండి.. ఈ సారి నేను మాట్లాడను'
పసిడి ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు!
అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్కు ఎదురుదెబ్బ
రావు బహదూర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
‘ప్రభుత్వ భూములు అమ్ముకోవచ్చు’.. బాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్
చెలరేగిన ఆసీస్ బౌలర్లు.. 125 పరుగులకే పరిమితమైన విండీస్
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. జూలైలో 8 రోజుల సెలవు!
‘‘పుష్ప’’ను మించిపోయిన స్మగ్లర్ల ప్లాన్.. ఏం చేశారంటే?
టోక్యో: సిగ్నల్ పడలేదు.. ఎర్ర చీర చూసి ఆగిపోయారంతే!
ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికుల ఫైర్
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్లో తెలంగాణ పిల్ల
ప్రజలు మత్తులో ఉంటే పాలన చిత్తుగా ఉన్నా అడిగేవాడు ఉండడు సార్! సంపద సృష్టి ఐడియా అదుర్స్ సార్!!
మనకు ఆ ప్రాబ్లం ఉండదులే! మన ప్రభుత్వం అప్పులు అడుక్కుంటుంది.. మనమూ అడుక్కుంటున్నాం!!
అమరావతిని అంతర్జాతీయపటంలో చూపిస్తా, క్వాంటం టెక్నాలజీని తెస్తా అని.. వైద్య పరీక్షలకు హైదరాబాద్ వెళ్లడమేంటి సార్!!
రోచ్ ట్రిపుల్ సెంచరీ
ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు
కొత్త క్యాబినెట్లో అమిత్ షాకు కీలక బాధ్యతలు?
ఈ రాశి వారికి సన్నిహితులు నుంచి ధనలబ్ధి.. గృహయోగం
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
పోన్లెండి సార్! ఏదో రకంగా పబ్లిసిటీ వస్తుందిగా!
భారత్పై ఘన విజయం.. ఐర్లాండ్కు భారీ షాక్
నేడే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్
ముడి చమురుకు బై బై.. భారత్లోకి జపాన్ మిథేన్ పవర్
అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట
'పెద్ది'తో తెలుగు అయిపోయింది.. ఇక తమిళంలోకి
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ స్టార్లు.. టెస్టు హిస్టరీలోనే తొలిసారి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
కూల్డ్రింక్ కంటే.. బీరే మంచిది!
కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనానికి పాజిటివ్గా చర్చలు
వెబ్సైట్ మొరాయింపు.. ఐదు రోజులుగా 'స్టాంప్స్' సేవలు బంద్
'అందుకు నన్ను క్షమించండి.. ఈ సారి నేను మాట్లాడను'
పసిడి ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు!
అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్కు ఎదురుదెబ్బ
రావు బహదూర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
‘ప్రభుత్వ భూములు అమ్ముకోవచ్చు’.. బాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్
చెలరేగిన ఆసీస్ బౌలర్లు.. 125 పరుగులకే పరిమితమైన విండీస్
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. జూలైలో 8 రోజుల సెలవు!
‘‘పుష్ప’’ను మించిపోయిన స్మగ్లర్ల ప్లాన్.. ఏం చేశారంటే?
టోక్యో: సిగ్నల్ పడలేదు.. ఎర్ర చీర చూసి ఆగిపోయారంతే!
ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికుల ఫైర్
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్లో తెలంగాణ పిల్ల
ప్రజలు మత్తులో ఉంటే పాలన చిత్తుగా ఉన్నా అడిగేవాడు ఉండడు సార్! సంపద సృష్టి ఐడియా అదుర్స్ సార్!!
మనకు ఆ ప్రాబ్లం ఉండదులే! మన ప్రభుత్వం అప్పులు అడుక్కుంటుంది.. మనమూ అడుక్కుంటున్నాం!!
అమరావతిని అంతర్జాతీయపటంలో చూపిస్తా, క్వాంటం టెక్నాలజీని తెస్తా అని.. వైద్య పరీక్షలకు హైదరాబాద్ వెళ్లడమేంటి సార్!!
రోచ్ ట్రిపుల్ సెంచరీ
ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు
కొత్త క్యాబినెట్లో అమిత్ షాకు కీలక బాధ్యతలు?
ఈ రాశి వారికి సన్నిహితులు నుంచి ధనలబ్ధి.. గృహయోగం
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
పోన్లెండి సార్! ఏదో రకంగా పబ్లిసిటీ వస్తుందిగా!
భారత్పై ఘన విజయం.. ఐర్లాండ్కు భారీ షాక్
నేడే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్
ముడి చమురుకు బై బై.. భారత్లోకి జపాన్ మిథేన్ పవర్
అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట
'పెద్ది'తో తెలుగు అయిపోయింది.. ఇక తమిళంలోకి
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ స్టార్లు.. టెస్టు హిస్టరీలోనే తొలిసారి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
కూల్డ్రింక్ కంటే.. బీరే మంచిది!
ఫొటోలు
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. (ఫోటోలు)
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్
‘హ్యాంగ్మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)
గ్లామరస్గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)
రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)
పట్టుకోండి చూద్దాం!(ఫోటోలు)
అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)
రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)
లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)
సినిమా
'నిజమేంటో తెలుసుకోండి.. డెలివరీ బాయ్ వివాదంపై అఖిల్ రాజ్'
డెలివరీ బాయ్ వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ స్పందించారు. అతన్ని కావాలని తాను కొట్టలేదన్నారు. అమ్మతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతోనే నేను అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. తప్పుడు అడ్రస్లో ఇచ్చిన అతను.. మా అమ్మతో అసభ్యంగా మాట్లాడారని అఖిల్ రాజ్ తెలిపారు. మా అమ్మను నీచంగా మాట్లాడడంతోనే నాకు కోపం వచ్చిందని అఖిల్ రాజ్ వెల్లడించారు. అంతే కానీ ఆ అబ్బాయిని కొట్టాల్సిన అవసరం నాకు ఏముందని అన్నారు. అతన్ని కొడితే నా కెరీర్కు ఏమైనా ఉపయోగపడుతుందా? అని ప్రశ్నించారు. ఇలా అడ్రస్ పొరపాటుగా ఇప్పటికీ దాదాపు పదిసార్లు జరిగిందని అఖిల్ రాజ్ తెలిపారు. నేను కూడా ఒకప్పుడు డెలివరీగా బాయ్గా పనిచేసి ఈ స్థాయికి వచ్చానని వెల్లడించారు. అడ్రస్ పొరపాటు వల్ల ఒకసారి కండోమ్స్, సిగరెట్స్ కూడా మా ఇంటికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొడవతో మా అమ్మ, నాన్న కూడా పానిక్ అయ్యారని పేర్కొన్నారు. నెేనైతే అతనిపై కావాలని కొప్పడలేదని అమ్మతో అసభ్యంగా మాట్లాడడం వల్లే తనకు కోపం వచ్చిందన్నారు. మాకు సంబంధం లేని ఆర్డర్ తీసుకొచ్చి నానా హంగామా చేసిన డెలివరీ బాయ్ను మీరు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఈ వివాదంపై అఖిల్ రాజ్ స్పందిస్తూ..' మా ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. అయినా ఫుడ్ పార్శిల్ వచ్చింది. మా అమ్మ ఆ పార్శిల్ తీసుకుని ఎవరు ఆర్డర్ పెట్టారని అడిగింది. ఎవరూ ఆర్డర్ చేయలేదు అని తెలుసుకుని పక్కనే పెట్టేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఫ్రీగా వస్తే తీసుకుంటారా అంటూ మా అమ్మను దుర్భాషలాడాడు. తాగిన మత్తులో ఉన్న ఆ డెలివరీ బాయ్ మా అమ్మను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒక కొడుకుగా నా బాధ్యతగా డెలివరీ బాయ్ను మర్యాదగా మాట్లాడమని మందలించా. ఆ డెలివరీ బాయ్ ఆ వీడియో తీసి ఇదంతా సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అసలు జరిగింది తెలుసుకోకుండా కొందరు నాపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఊరుకుంటారా. నేను ఒక హీరోగా ఇంకాస్త సంయమనం పాటించాల్సి ఉండాల్సింది. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సింది. అయితే మా అమ్మను తిట్టినందుకు కోపం ఆపుకోలేకపోయా. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినే. ఇలా డెలివరీ బాయ్ పనులు చేసిన వాడినే. నా సినిమాలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చెప్పాం. అలాంటి నేను అకారణంగా డెలివరీ బాయ్తో ఎందుకు గొడవపెట్టుకుంటా. అతనితో గొడవ పెట్టుకుంటే నాకు వచ్చేదేంటి. నన్ను సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్న మిత్రుల కోసమే ఈ వివరణ ఇస్తున్నా' అని అన్నారు.
చంపేస్తామంటూ బెదిరింపులు.. ‘ఎక్స్’ నుంచి తప్పుకున్న రాహుల్ రవీంద్రన్
సోషల్ మీడియాలో నెగెటివిటీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కొంతమంది నెటిజన్స్ ద్వేషపూరిత కామెంట్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీల విషయంలో నెగెటివ్ ప్రచారం, బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. సంబంధం లేని విషయాలల్లోకి వాళ్లను లాగుతూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ విషయంలో ఇదే జరిగింది. తనను ట్రోల్ చేయడమే కాకుండా తన పిల్లలను చంపుతామంటూ బెదిరింపు కామెంట్స్ చేయడంతో ఆయన ‘ఎక్స్’కి గుడ్బై చెప్పాడు. తన ముబైల్ నుంచి ‘ఎక్స్’ యాప్ని తొలగిస్తున్నానని..ఇక నుంచి దీనికి చూడనంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించాడు.అసలేం జరిగింది?ఇటీవల పూణెలో హత్యకు గురైన కేతన్ అగర్వాల్ కేసుచుట్టూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఓ నెటిజన్ రాహుల్ను ట్యాగ్ చేస్తూ మహిళల సమస్యలపై సినిమా తీసినట్లే పురుషులపై జరుగుతున్న అన్యాయాలపై కూడా తీస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రాహుల్ సమాజంలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం బలంగానే ఉందని అభిప్రాయపడ్డాడు.ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కొందరు అతన్ని దూషించడమే కాకుండా, ఆయన సతీమణి చిన్మయిపై కూడా వ్యక్తిగత దాడులకు దిగడం ప్రారంభించారు.ఆ కామెంట్స్ తీవ్ర ఆవేదన కలిగించాయిఈ వాదనలు కేవలం సినిమా చర్చలకే పరిమితం కాలేదు. ఆయన పిల్లను చంపేస్తామని బెదిరింపులు స్థాయికి వెళ్లాయి. ఓ వ్యక్తి తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తూ చేసిన కామెంట్స్ని రాహుల్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. ఇలాంటి నెగెటివిటీని తన మనసులోకి తీసుకోలేకనే ఎక్స్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.బ్రెజిల్, జపాన్ ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో ఫుట్బాల్ ఆటకు సంబంధించిన ట్విటర్ అకౌంట్ కోసం ఈ యాప్(ఎక్స్) ఓపెన్ చేశా. పొరపాటున నోటిఫికేషన్లు చూశా. అవి చదివిన తర్వాత నా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ కనిపించిన వ్యాఖ్యలు నాలో తీవ్ర కోపం, ఆవేదన కలిగించాయి. ఆ కామెంట్ చేసిన వాడిని ఎలాగైనా వెతికి పట్టుకొని ఏదైనా చేయాలనే నా మైండ్లోకి వచ్చింది. కోపం వచ్చినప్పుడు మామూలుగా నేను నన్ను నేను శాంతించుకోమని చెప్పుకుంటాను. కానీ ఈసారి అలా చేయాలనిపించలేదు. నా తల చాలా వేడిగా ఉంది. చాలా సేపటి వరకు అక్కడే కూర్చొని, టీవీలో ఆటను చూడకుండానే దాని వైపు చూస్తూ ఉండిపోయాను. చాలా నెమ్మదిగా నా హృదయ స్పందన రేటు కొంతవరకు సాధారణ స్థితికి వచ్చింది.నా ఆలోచనలు నాకే నచ్చలేదుబహుశా నేను అతిగా స్పందిస్తున్నానేమో. ఇది నా తప్పేమో.. నా పిల్లలు ఈ ద్వేషానికి అర్హులమేమో. కానీ నాకు ఈ యాప్తో పని అయిపోయింది. కొంతకాలంగా దీని నుంచి బయటపడాలని అనుకుంటున్నాను. నేను అలా చేయలేకపోవడానికి ఏకైక కారణం, క్రీడల వార్తలకు ఇది అత్యుత్తమ మూలం కావడమే. కానీ నాకు ఇక చాలు. ఆ ట్వీట్ చదివిన తర్వాత అరగంట పాటు నేను ప్రవర్తించిన తీరు నాకే నచ్చలేదు. నా ఆలోచనలు నాకే నచ్చలేదు. అంతేకాక, నా ఆత్మగౌరవం చాలా బలమైనది, దేనినీ నాపై ఆధిపత్యం చెలాయించనివ్వను. నా ఫోన్ నుంచి ఈ యాప్ను తొలగిస్తున్నాను’అని రాహుల్ రవీంద్రన్ ఎక్స్లో రాసుకొచ్చాడు. I was sitting and watching the Brazil v Japan game. I wanted to check a football related Twitter account about something and I opened this app. Unfortunately, I made the mistake of checking my notifications too. And I came across this tweet. I wish I hadn’t. I kept staring at… pic.twitter.com/abRnWC58Y2— Rahul Ravindran (@23_rahulr) June 29, 2026
ఖరీదైన కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట
బుల్లితెర డాక్టర్బాబుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిరుపమ్. కార్తీకదీపం సీరియల్తో ఫేమ్ తెచ్చకున్న నటుడు నిరుపమ్. తన సహనటి మంజులనే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తున్నారు. టాలీవుడ్లోని ఫేమ్ ఉన్న బుల్లితెర జంటల్లో వీరిద్దరు ముందుంటారు.తాజాగా ఈ జంట ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రముఖ ఎంజీ బ్రాండ్కు చెందిన ఈవీ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. నా కొత్త కారు అంటూ అంటూ తన భర్తతో దిగిన ఫోటోలను నటి మంజుల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు చెబుతున్నారు. ఈ కారు విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.కాగా.. చంద్రముఖి అనే సీరియల్ లో నిరుపమ్, మంజుల కలిసి నటించారు. అలా ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. నిరుపమ్.. కార్తీకదీపం సీరియల్ తో మూగమనసులు, అత్తారింటికి దారేది, రాధకు నీవే రా ప్రాణం సీరియల్స్ చేయగా.. మంజుల కూడా ఆకాశమంత, కృష్ణవేణి, ఇద్దరమ్మాయిలు, జానకి కలగనలేదు తదితర సీరియల్స్ లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Manjula Paritala (@manjula_paritala_official)
'ప్రభాస్ను అడిగితే మూడు కోట్లు ఇస్తాడు.. కానీ'
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్గా మెప్పించిన కృష్ణ మాయ.. దాదాపు 80కి పైగా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్గా రాణించారు. టాలీవుడ్లో దొంగల ముఠా, రైల్వే స్టేషన్, లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రభాస్ అనే వ్యక్తి సొంతంగా ఇమేజ్ తెచ్చుకున్న హీరో అని కృష్ణ మాయ తెలిపారు. ప్రభాస్ యాక్టింగ్లో ప్రత్యేక వెరియేషన్ ఉంటుందన్నారు. ఆయన సొంతంగా చిరుత పులి అనే బ్రాండ్ను సొంతం చేసుకున్నారని కృష్ణ మాయ కొనియాడారు. ఆయనతో చేసిన ఈశ్వర్ సినిమాతోనే మా అందరికీ గుర్తింపు వచ్చిందన్నారు. ఆ మూవీ షూటింగ్ టైమ్లో ఒక డీసీఎంలో ఎక్కి ప్రభాస్ మాతో పాటే చార్మినార్కు వచ్చారని తెలిపారు.అప్పుడున్న ప్రభాస్కు.. ఇప్పుడున్న ప్రభాస్కు చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగారని ప్రశంసించారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లగలమా? అని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం అంతా మా అదృష్టమని కృష్ణ మాయ వెల్లడించారు. ప్రభాస్ సాహో మూవీకి కూడా తాను పనిచేశానని పేర్కొన్నారు.'ఇటీవల ఫౌజీ మూవీ టైమ్లో ప్రభాస్ దగ్గరికి వెళ్లా. ఆయన నా చేయి పట్టుకుని మరి నాతో మాట్లాడారు. ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు అని చేయి పట్టుకుని అడిగారు. ఒకవేళ నేను ప్రభాస్ను అడిగితే రెండు, మూడు కోట్లు ఇచ్చే కెపాసిటీ ఆయన సొంతం. అలా అడిగితే నా ఫ్రెండ్షిప్తో పాటు మర్యాద కూడా పొద్ది.. నాకు డబ్బులు అవసరం లేదు.. నాకు నేను సంపాదించుకుంటున్నా. ఆ టైమ్లో నన్ను చూసిన ప్రభాస్ ఒక పాత స్నేహితుడిని చూసినంతగా ఫీలయ్యాడు' అని కృష్ణ మాయ ఆనందం వ్యక్తం చేశారు. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్పై కృష్ణ మాయ చేసిన కామెంట్స్తో టాలీవుడ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
క్రీడలు
ఆసీస్తో సెమీస్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న విండీస్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. లండన్ వేదికగా జరుగుతున్న ఈ నాకౌట్ పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.తుది జట్లువెస్టిండీస్: ఖియానా జోసెఫ్, హేలీ మాథ్యూస్(కెప్టెన్), షెమైన్ క్యాంప్బెల్(వికెట్ కీపర్), స్టెఫానీ టేలర్, డియాండ్రా డాటిన్, చినెల్ హెన్రీ, జహజారా క్లాక్స్టన్, జానిలియా గ్లాస్గో, ఆలియా అల్లీన్, అఫీ ఫ్లెచర్, కరిష్మా రామ్హరక్ఆస్ట్రేలియా: జార్జియా వోల్, బెత్ మూనీ(వికెట్ కీపర్), ఫోబ్ లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, యాష్లీ గార్డనర్, జార్జియా వేర్హామ్, అన్నబెల్ సదర్లాండ్, నికోలా క్యారీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్
కరీంనగర్ ఘన విజయం.. 99 పరుగులకే మెదక్ ఆలౌట్
తెలంగాణ టీ20 లీగ్లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో 133 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది.మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) రాణించారు. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు.కుప్పకూలిన మెదక్అనంతరం 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్.. కరీంనగర్ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. మెదక్ బ్యాటర్లలో తెలకపల్లి రవితేజ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కరీంనగర్ బౌలర్లలో శ్రీవాస్తవ్, శుభమ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హారీష్, నారయణ్, సతీష్ కుమార్, సాత్విక్ రెడ్డి తలా వికెట్ సాధించారు.
కమ్బ్యాక్ కోసం కసరత్తు.. గంభీర్ ముందున్న కీలక సవాళ్లు ఇవే
ఐర్లాండ్ గడ్డపై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా.. మూడు రోజులు తిరగకముందే మరో కీలక పోరుకు సిద్దమైంది. జూలై 1 (బుధవారం) భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ సిరీస్లో చేసిన తప్పులను ఇంగ్లండ్లో పునరావృతం చేయకూడదని భారత్ భావిస్తోంది. బెల్ఫాస్ట్లోని బౌన్సీ పిచ్లపై పూర్తిగా విఫలమైన భారత బ్యాటర్లు.. ఇప్పుడు ఇంగ్లీష్ కండీషన్స్ తగట్టు రాణించేందుకు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ కీలక సిరీస్కు ముందు భారత్ ముందున్న ప్రధాన సమస్యలపై ఓ లుక్కేద్దాం.ఐర్లాండ్ చేతిలో ఘోర పరాయం తర్వాత భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు ఆటగాళ్లను మార్చాలని, కోచ్ను తొలగించాలని డిమాండ్ చేస్తుంటే.. మరికొందరు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రెండు వాదనలూ పూర్తిగా కరెక్ట్ కావు. ఆగస్టు 2023 తర్వాత భారత్ ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. టీ20 ప్రపంచకప్-2028 సైకిల్లో భారత్కు ఇదే తొలి టీ20 సిరీస్. మొదటి సిరీస్లోనే భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఒక్క ఓటమికే పూర్తిగా మార్చేయాల్సిన అవసరం లేదు, అలాగని ఆటగాళ్ల నిర్లక్ష్య ధోరణిని కూడా సమర్ధించకూడదు. ఇంగ్లండ్ టూర్లో విజయవంతం కావాలంటే జట్టు మొత్తం సమిష్టింగా రాణించాలి.సంజూకు మద్దతిస్తారా? వైభవ్ను ఆడిస్తారా?ఐర్లాండ్ సిరీస్కు ముందు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్ను కనబరిచాడు. టీ20 ప్రపంచకప్-2026తో పాటు ఐపీఎల్లోనూ దుమ్ములేపాడు. కానీ ఐర్లాండ్కు వచ్చేటప్పటికి మాత్రం పరిస్థితి తారుమారు అయిపోయింది. రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం 5 బంతులు మాత్రమే క్రీజులో నిలబడగలిగాడు. మరోవైపు సంచలన బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకొన్న వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈ సిరీస్లో బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ సిరీస్లో వైభవ్ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు.కానీ రెండు మ్యాచ్లలోనూ వైభవ్కు తుది జట్టులో చోటు దక్కలేదు. మొదటి టీ20లో సంజూ విఫలమైనప్పటికి, రెండో మ్యాచ్కు కూడా అతడిని కొనసాగించారు. మరోఓపెనర్ అభిషేక్ శర్మ రెండో మ్యాచ్లో విఫలమైన మొదటి టీ20లో విఫలమయ్యాడు. ప్రస్తుతానికి టీమ్ మెనెజ్మెంట్ వైభవ్ కంటే సంజూకే ఎక్కువగా మద్దతు ఇస్తోంది. కానీ ఇషాన్ కిషన్ లాంటి మరో వికెట్ కీపర్ కూడా అందుబాటులో ఉండడంతో సంజూ ప్లేస్ డెంజర్లో పడినట్లే. సంజూ ఇంగ్లండ్ సిరీస్లో రాణించకపోతే జట్టు నుంచి పక్కన పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతడి స్ధానంలో వైభవ్ను ఓపెనర్గా పంపే అవకాశముంది.కలవరపెడుతున్న తిలక్ ఫామ్ఇక హైదరాబాదీ తిలక్ వర్మ భారత టీ20 జట్టులో గత కొంతకాలంగా కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే అతడి ప్రస్తుత ఫామ్ టీమ్ మేనెజ్మెంట్ను కలవరపెడుతోంది. ముఖ్యంగా స్ట్రైక్ రేట్ పరంగా తిలక్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఐర్లాండ్ సిరీస్లో తొలి మ్యాచ్లో 21 బంతుల్లో 19 పరుగులు చేసిన తిలక్.. రెండో టీ20లో 46 బంతుల్లో 55 రన్స్ చేశాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కూడా తిలక్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్-2025 నుంచి స్పిన్నర్లపై అతడి స్ట్రైక్ రేట్ కేవలం 115.50 మాత్రమే. మిడిలార్డర్లో స్పిన్ బాగా ఆడే బ్యాటర్లు అవసరం. కానీ తిలక్ మాత్రం తన లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు.వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి?ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియడం లేదు. పేరుకే ఆల్రౌండర్ కానీ, అతడి సేవలను మేనెజ్మెంట్ ఉపయోగించుకోవడం లేదు. ఐర్లాండ్ సిరీస్లో అతడు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అయితే ఆ మ్యాచ్లో అతడు కేవలం ఒకే ఓవర్ వేశాడు. అది కూడా 16 ఓవర్లో బౌలింగ్ ఇవ్వడం అందరిని షాక్కు గురిచేసింది. డెత్ ఓవర్ల బౌలర్ కాని సుందర్కు అంత ఆలస్యంగా బంతిని ఎందుకు ఇచ్చారో ఎవరికి ఆర్దం కాలేదు. ఆ ఓవర్లో అతడు ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. గౌతమ్ గంభీర్ హయంలో సుందర్ సగటున మ్యాచ్కు 2 ఓవర్లు కూడా వేయడం లేదు. 16 మ్యాచ్ల్లో కేవలం 30.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇక బ్యాటింగ్లోనూ అతని స్థానంపై స్పష్టత లేదు. 18 మ్యాచ్ల్లో అతను బ్యాటింగ్ చేసింది కేవలం 11 సార్లు మాత్రమే. పైగా ప్రస్తుతం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ ఒకే మిడిల్ ఆర్డర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరికే చోటు దక్కుతుంది. అలాంటిప్పుడు సుందర్ను ఎందుకు టీ20లకు ఎంపిక చేస్తున్నార్నని మాజీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
రాహుల్ సూపర్ సెంచరీ.. మెదక్ ముందు భారీ టార్గెట్
తెలంగాణ ప్రీమియర్ లీగ్-2026లో మరో సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కరీంనగర్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో రాదేశ్ తన విరోచిత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మెదక్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు.
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో వానల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతన్నలు. పలు జిల్లాల్లో లోటు వర్షపాతం
విత్తనం నుంచి బీమా వరకు అన్నింటా సమస్యలే... ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
ఏపీ రాజధానిలో గూండారాజ్... రైతుల ఆహ్వానం మేరకు భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో తెలుగుదేశం మూకల దాడి
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ ‘అప్పుల క్యాలెండర్’ విడుదల... నెలకు 7 వేల 266 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేయబోతున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు. యాప్లో ఓటీపీలు రాక.. వేలిముద్రలు మ్యాచ్ కాక తిప్పలు
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన.. ఇవాళ మహిమాన్విత ఆలయానికి కలశస్థాపన చేయనున్న YSRCP అధినేత..
చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో భీతావహ పాలన... పోలీసులంటేనే ప్రజలు భయపడిపోతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే... గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్డెత్ ఘటనలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
బిజినెస్
టెక్కీల ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్న సీఈఓ!
సాఫ్ట్వేర్ రంగం అంటేనే విలాసవంతమైన జీవితం, లక్షల్లో జీతాలు అనుకునే వారికి ఐటీ పరిశ్రమలోని మరో చీకటి కోణం షాక్కు గురిచేస్తోంది. ప్రాజెక్ట్ డెడ్లైన్ల పేరిట ఉద్యోగుల మానసిక ప్రశాంతతను హరిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ఒక టాక్సిక్ (విషపూరిత) సీఈఓ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారాంతాలతో (ఆదివారాలు) కలిపి రోజుకు 14 గంటల పాటు గొడ్డుచాకిరీ చేయించుకోవడమే కాకుండా.. ఉద్యోగుల విద్య, సామర్థ్యం, చివరికి వారి కుటుంబాలను లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ఒక సీఈఓ దారుణ ప్రవర్తనను ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు.ఆ ప్రాజెక్ట్ ముగిసేలోపే ఇంకోదానికి..కంపెనీలో చేరినప్పటి నుంచి తనకు ఎదురవుతున్న నరకాన్ని సదరు టెక్కీ సుదీర్ఘ పోస్ట్లో వివరించారు. సంస్థలో జాయిన్ అయినప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ పూర్తికాకముందే మరో దానికి మారుస్తున్నారని, దీనివల్ల దేనిపైనా స్పష్టత లేకుండా పోతోందని పేర్కొన్నారు. ‘గత నెల రోజులుగా నేను ఒక క్లయింట్-ఫేసింగ్ డేటా-మ్యాపింగ్ ప్రాజెక్ట్లో బృందంతో కలిసి పని చేస్తున్నాను. మా కంపెనీ సీఈఓనే మాకు మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. ఆయనే మాకు ఒక నిర్దిష్ట లాజిక్ ఇచ్చారు. అందుబాటులో ఉన్న డేటాను బట్టి మేము ఆ లాజిక్ను వర్తింపజేసి, విశ్లేషణను పూర్తి చేసి అవుట్పుట్ సమర్పించాం. తీరా చూస్తే, ఆ మ్యాపింగ్ తప్పని క్లయింట్ చెప్పారు’ అని టెక్కీ తెలిపారు.ఉద్యోగులపై నింద!కంపెనీకి క్లయింట్ ఇచ్చిన డేటానే అసంపూర్ణంగా ఉన్నప్పటికీ సీఈఓ మాత్రం మొత్తం నిందను బృందంపైనే నెట్టేసినట్లు డెవలపర్ ఆరోపించారు. ‘గత వారం రోజులుగా మీటింగుల్లో ఆయన ప్రవర్తన చాలా వ్యక్తిగతంగా, అవమానకరంగా మారింది. ఇది ఇక పనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కాదు. మా విద్య, సామర్థ్యాలు, కుటుంబాలు, విలువపై ఆయన దాడి చేస్తున్నారు. మేము సాంకేతిక పరిమితులను వివరించడానికి ప్రయత్నించినా లేదా ఇప్పటికే పూర్తి చేసిన పనిని చూపించినా ఆయన అసలు వినడం లేదు’ అన్నారు. బృందంలోని వారందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తానంటూ సదరు సీఈఓ నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు టెక్కీ వాపోయారు.ఆదివారాలూ వదలకుండా 14 గంటల చాకిరీఈ సంస్థలో పని గంటలు ఊహకందని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆదివారాలతో సహా నిరంతరం పని చేయించుకుంటున్నారని తెలిపారు. ‘ఇటీవలే మా టీమ్ మొత్తం ఆదివారం కూడా రాత్రి దాకా పని చేసింది. కానీ సోమవారం ఉదయం మీటింగ్కు వచ్చిన సీఈఓ.. మేము అసలు మాట వినడం లేదని, సరిగా పని చేయడం లేదని మమ్మల్ని నిందించారు. నేను మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోయాను. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి లేదా మరో ఉద్యోగానికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా నాకు సమయం దొరకడం లేదు’ అని సదరు టెక్కీ తెలిపారు. ఈ ప్రతికూల వాతావరణంలో కొనసాగాలా లేక రాజీనామా చేయాలా అని ఆన్లైన్ కమ్యూనిటీని సలహా కోరారు.నెటిజన్ల సలహాఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో ఐటీ నిపుణులు, సోషల్ మీడియా వినియోగదారులు సదరు సీఈఓ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ ఉద్యోగాన్ని వదిలేయాలంటూ టెక్కీకి మద్దతుగా నిలిచారు. ‘ఆ సీఈఓకు వ్యక్తిత్వ సమస్య ఉంది. బహుశా అతనికి థెరపీ అవసరం. ఆర్థికపరమైన కట్టుబాట్లు లేకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం వృథా’ అని ఒక యూజర్ స్పందించారు. ‘మీరు వెంటనే రాజీనామా చేయండి’ అని మరో యూజర్ చెప్పారు.కార్పొరేట్ రంగంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చ జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి నరకప్రాయమైన మేనేజ్మెంట్ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి సాధించే విజయాలు ఏ కంపెనీకైనా శాశ్వతం కాదనే సత్యాన్ని సంస్థలు గ్రహించాలని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్!
కరుగుతోన్న పసిడి కాంతులకు కారణాలు ఇవే..
గడిచిన కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలకు చేరుకుంటూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు, ఇటీవల అనూహ్యంగా కిందికి దిగివస్తున్నాయి. ఈ రోజు (జూన్ 30, 2026) హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ.1,40,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర సుమారు రూ.1,29,000 స్థాయికి దిగివచ్చింది. గత వారంతో పోలిస్తే ఇది భారీ పతనమనే చెప్పాలి. ఈ ఆకస్మిక మార్పునకు గల ఆర్థిక కారణాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో బంగారంపై రాబడులు అందుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణాత్మక కథనం మీకోసం.ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుపసిడి మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తే ప్రస్తుతం మూడు ప్రధానాంశాలు ఈ పతనానికి కారణమవుతున్నట్లు స్పష్టమవుతోంది.1. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరిఅమెరికా కేంద్రీయ బ్యాంక్ (యూఎస్ ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేసినప్పటికీ తాజా పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును 2027కు వాయిదా వేసింది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు, ఇతర స్థిర ఆదాయ వనరులపై రాబడి పెరుగుతుంది. దీంతో వడ్డీ లేదా డివిడెండ్ ఇవ్వని బంగారం వైపు నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.2. బలపడుతున్న అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ఫెడ్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ ఇండెక్స్ ఏడాది కాలంలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. తద్వారా డిమాండ్ తగ్గి ధరలు క్షీణిస్తాయి. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి, ముఖ్యంగా ఆసియా మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లడం దీనికి అద్దం పడుతోంది.3. పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలుగత కొద్ది నెలల్లో బంగారం ధరలు భారీగా పెరగడానికి రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా (ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్) సంక్షోభాలు ప్రధాన కారణం. అయితే ఇటీవల ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చల సరళి, కీలకమైన హార్ముజ్ జలసంధి పాక్షికంగా తెరచుకోవడం వంటి పరిణామాల వల్ల గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు 30% తగ్గాయి. దాంతో అంతర్జాతీయ ఒడిదొడుకులు తగ్గి సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్ ప్రీమియం ఒక్కసారిగా ఆవిరైపోయింది.భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ మార్గాలుప్రస్తుత ధరల తగ్గుదల అనేది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అవకాశంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర బ్యాంకుల వద్ద డీ-డాలరైజేషన్ (డాలర్పై ఆధారపడటం తగ్గించడం) ప్రక్రియలో భాగంగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి ఇంకా కొనసాగుతోంది. అయితే కేవలం భౌతిక బంగారం (నగలు) రూపంలో కాకుండా కొన్ని మార్గాల్లో పెట్టుబడి పెడితే మెరుగైన రాబడులు సాధించవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్లు: స్టాక్ మార్కెట్ ద్వారా డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ మార్గం. ఇందులో ఎలాంటి మేకింగ్ ఛార్జీలు, తరుగు ఉండవు. మనకు నచ్చినప్పుడు కరెంట్ మార్కెట్ ధరకే విక్రయించుకోవచ్చు. లాకర్ ఖర్చులు, దొంగతనం భయాలు ఉండవు.సవరీన్ గోల్డ్ బాండ్లు: ప్రభుత్వం/ఆర్బీఐ జారీ చేసే ఈ బాండ్లు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వరం. దీని ద్వారా బంగారం ధర పెరిగితే వచ్చే లాభంతో పాటు, ఏటా స్థిర వడ్డీ (అదనపు ఆదాయం) లభిస్తుంది. అంతేకాకుండా గడువు ముగిసిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉండదు. అయితే, ప్రస్తుతానికి ఈ బాండ్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది.డిజిటల్ గోల్డ్: మొబైల్ వాలెట్లు, సర్టిఫైడ్ ప్లాట్ఫారమ్ల ద్వారా కేవలం రూ.100తో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ప్రతి నెలా కొద్దికొద్దిగా బంగారం జమ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.భౌతిక బంగారం (కాయిన్స్/బిస్కెట్లు): ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటే నగల రూపంలో కాకుండా 24 క్యారెట్ల హాల్మార్క్ ఉన్న కాయిన్స్ లేదా బిస్కెట్లు కొనడం మేలు. దీనివల్ల రీసేల్ (తిరిగి అమ్మే) సమయంలో పూర్తి విలువ లభిస్తుంది.మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారానికి 10% నుంచి 15% వరకు మాత్రమే పరిమితం చేయడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒకేసారి కాకుండా ప్రస్తుత ధరల పతనాన్ని ఆసరాగా చేసుకుని విడతల వారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో స్థిరమైన, సురక్షితమైన రాబడులను అందుకోవచ్చు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు ఢమాల్!
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 249.70 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 76,478.67 వద్ద, నిఫ్టీ 80.50 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 23,865.75 వద్ద నిలిచాయి.ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్, దివ్గి టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ లిమిటెడ్, దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్, బిల్కేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహాలక్ష్మి ఫ్యాబ్రిక్ మిల్స్ లిమిటెడ్, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, AION-TECH సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కాందిశీకుల కలలపై ‘ఖర్చు’ల కత్తి!
బ్రిటన్లో అక్రమ వలసల నియంత్రణే లక్ష్యంగా అధికార లేబర్ పార్టీ ప్రభుత్వం కీలకమైన నూతన ఆశ్రయ నిబంధనలను ప్రకటించింది. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ నిర్ణయం ప్రకారం.. భవిష్యత్తులో బ్రిటన్లో ఆశ్రయం పొందే, శాశ్వత నివాసం (పీఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే శరణార్థులు ప్రభుత్వం తమపై చేసే ఖర్చును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?బ్రిటన్ హోం శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, దేశంలో శాశ్వత నివాసం పొందాలంటే అంతకుముందు ప్రభుత్వం తమ వసతి, జీవన భత్యం కోసం ఖర్చు చేసిన 10,000 పౌండ్లు (సుమారు రూ.11 లక్షలు) తిరిగి చెల్లించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనల అమలుపై ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.భవిష్యత్తులో బ్రిటన్కు వచ్చే, ఈ మొత్తాన్ని చెల్లించగల ఆర్థిక స్థోమత ఉన్న వయోజనులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.ఈ నిబంధనలు గతంలో ఆశ్రయం పొందిన వారికి వర్తించవు. అలాగే చిన్నారులకు దీని నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.శరణార్థులు ఈ డబ్బు చెల్లించడం వల్ల పూర్తిగా పేదరికంలోకి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు కూడా చట్టంలో పొందుపరిచారు.బ్రిటన్ హోం శాఖ అంచనాల ప్రకారం ఆశ్రయం కోరుకునేవారికి తాత్కాలిక వసతి కల్పించేందుకు సగటున ఒక్కో వ్యక్తికి రోజుకు 23.25 పౌండ్లు(సుమారు రూ.2,600), హోటళ్లలో ఉంచితే రోజుకు 144 పౌండ్ల(రూ.16,000) వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా వారానికి జీవన భత్యం కూడా చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది ఆశ్రయ వసతి, సంబంధిత సాయం కోసం బ్రిటన్ సుమారు 400 కోట్ల పౌండ్లు(సుమారు 44,000 కోట్ల రూపాయలు) ఖర్చు చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో బ్రిటన్ హోం సెక్రటరీ షబానా మహమూద్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్ పన్ను చెల్లింపుదారులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఆశ్రయ సాయం పొందడం కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత కూడా. శరణార్థులకు ఆర్థిక స్థోమత చేకూరిన తర్వాత బ్రిటన్ ప్రజలకు ప్రతిగా వారు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలి’ అన్నారు.రాజకీయ ఉద్రిక్తతలు - లేబర్ పార్టీ వ్యూహంబ్రిటన్ రాజకీయాల్లో వలసల అంశం అత్యంత సున్నితమైనది. ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే ప్రధానాంశాల్లో ఇది ఒకటిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇది స్థానిక ఉద్రిక్తతలు, నిరసనలకు కూడా కారణమవుతోంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న సెంటర్ లిఫ్ట్-లేబర్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని కొందరు భావిస్తున్నారు. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రైట్ వింగ్-రిఫార్మ్ యూకే పార్టీ దేశంలో రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. దేశంలోని సుమారు ఆరు లక్షల మంది శరణార్థులను వెనక్కి పంపించేస్తామంటూ రిఫార్మ్ యూకే ఇస్తున్న హామీలు స్థానిక ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టేందుకే లేబర్ పార్టీ ఈ చర్యలకు పూనుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్!
ఫ్యామిలీ
ఇక్కడ ఒక్క రోజు గడిస్తే.. బయట 2 వారాలు అవుతుందా?!
భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లోకి వెళ్లడానికి టైమ్ మిషన్ను ఉపయోగించడం సినిమాల్లో చూశాం..! ఒక గ్రహంపై ఒక్క రోజు గడిపితే.. బయటి ప్రపంచానికి కొన్ని సంవత్సరాలవుతుందని ‘ఇంటర్స్టెల్లార్’ లాంటి సినిమాల్లో చూసి ఆశ్చర్యపోయాం..! అవన్నీ కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలే అనుకున్నాం..! అయితే.. మన భూమి మీద కూడా నిజంగానే కాలం చాలా వేగంగా పరుగెత్తే వింత ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? మనం ఇంతకు ముందు వీడియోలో.. బృందావనంలోని 'నిధివన్'లో ఇప్పటికీ ద్వాపరయుగం కొనసాగుతోందని భక్తులు విశ్వసిస్తారని చెప్పుకున్నాం.అదేవిధంగా.. పవిత్ర కైలాస శిఖరంపై కాలం ఊహించని వేగంతో పరుగెడుతుందంటే మీరు నమ్ముతారా?అక్కడ కేవలం ఒక్కరోజు గడిపితే.. బయటి ప్రపంచానికి రెండు వారాలతో సమానమవుతుందని, అక్కడకు వెళ్లినవారి జుట్టు, గోళ్లు విపరీతమైన వేగంతో పెరుగుతాయని చెబుతుంటారు! సైన్స్కు కూడా అంతుచిక్కని, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా సాగే ఆ కైలాస పర్వత కాల గమనం వెనుక ఉన్న రహస్యాలేంటో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరున్న ఎవరెస్టును ఇప్పటి వరకు కొన్ని వేల మంది అధిరోహించారు. కానీ, దానికంటే తక్కువ ఎత్తు ఉన్న కైలాస శిఖరాన్ని మాత్రం ఇప్పటి వరకు ఒక్క పర్వతారోహకుడు కూడా అధిరోహించలేకపోయాడు. ఎందుకంటే.. కైలాస శిఖరం పరమశివుడికి నివాస స్థానం. ఆ కైలాస శిఖరం దగ్గరకు వెళ్తే.. వయసు వేగంగా పెరిగిపోతుంది. సైన్స్ సైతం అంగీకరించిన నిగూఢ అంతరిక్ష రహస్యం వెనక మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. గతంలో దీనిపై జరిగిన చరిత్రాత్మక పరిశోధనల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కైలాస పర్వతానికి సమీపంగా వెళ్లేవారు వింత అనుభవాలకు గురవుతారు. అక్కడ కాలం వేగంగా కదలడం.. గోళ్లు, జుట్టు విపరీతంగా పెరిగిపోవడం వంటి పరిణామాలను గుర్తిస్తారు. అంటే.. బయటి ప్రపంచంలో రెండు వారాల్లో జరిగే మార్పులు.. ఇక్కడ ఒక్కరోజులో చోటుచేసుకోవడం గమనార్హం..!కైలాస శిఖరం వద్ద కాల గమన వింతపై గత కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. 1926వ సంవత్సరంలో.. బ్రిటిష్ పర్వతారోహకుడు హ్యూ రూట్లేజ్ కైలాస పర్వతాన్ని పరిశోధించి, దీని చుట్టూ ఏదో అదృశ్య శక్తి ఉందని, దీనిని అధిరోహించడం అసాధ్యమని తన డైరీలో రాసుకున్నారు. 1999వ సంవత్సరంలో రష్యాకు చెందిన ప్రఖ్యాత కంటి సర్జన్, సైంటిస్ట్ డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్ నేతృత్వంలోని జియాలజిస్టులు, ఫిజిసిస్టుల బృందం కైలాస పర్వతంపై ఒక సంచలన పరిశోధన చేసింది. వారి నివేదిక ప్రకారం.. కైలాస పర్వతం అనేది ఒక సహజమైన కొండ కాదు. అది మానవాతీత శక్తులు లేదా ప్రాచీన సాంకేతికతతో నిర్మితమైన ఒక భారీ 'రాతి పిరమిడ్' అని తేలింది. ఈ పర్వతం చుట్టూ వందలాది చిన్న చిన్న పిరమిడ్లు కలిసి ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. 2015-16 కాలంలో.. ఆధునిక క్వాంటమ్ ఫిజిక్స్ పరిశోధకులు ఇక్కడి ఎనర్జీ గ్రిడ్లను మ్యాప్ చేశారు. పిరమిడ్ ఆకారంతోపాటు.. తీవ్రమైన కాస్మిక్ ఎనర్జీ రేడియేషన్ వల్ల అక్కడ 'టైమ్ డైలేషన్' జరుగుతోందని, అందుకే అక్కడ సమయం వేగంగా ముందుకు సాగుతుందని సైన్స్ పరంగా నిర్ధారించారు.ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్ని పిరమిడ్ ఎఫెక్ట్ లేదా మాగ్నెటిక్ ఫోర్స్ అంటుంటే.. మన పురాణాలు మాత్రం దీన్ని విశ్వానికి కేంద్ర బిందువు అయిన 'యాక్సిస్ ముండి' అని వేల ఏళ్ల క్రితమే చెప్పాయి. ఉత్తర ధ్రువానికి, దక్షిణ ధ్రువానికి సరిగ్గా.. మధ్యలో.. భూమికి, ఆకాశానికి వారధిలా ఈ కైలాస పర్వతం ఉంది. ఇక్కడి నుంచే విశ్వ శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ భూమి పైకి వస్తుందని చెబుతారు. పురాణాల ప్రకారం.. సిద్ధ పురుషులు, కిన్నెరులు నేటికీ ఇక్కడ సూక్ష్మ రూపంలో సంచరిస్తూ ఉంటారు. వారు ఉన్నతమైన లోకాలకు ప్రయాణించడానికి వీలుగా ఇక్కడ కాలం వేగాన్ని మార్చినట్లు తెలుస్తోంది.చూశారు కదా? సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా.. స్పేస్ రీసెర్చ్లు నెక్స్ట్ లెవల్లో జరుగుతున్నా.. కైలాస పర్వతం చుట్టూ ఉన్న కాల ప్రవాహ రహస్యాన్ని మాత్రం పూర్తిగా డీకోడ్ చేయలేకపోయారు మన శాస్త్రవేత్తలు. అక్కడ గడియారాలు తప్పు చూపిస్తాయి, దిక్సూచి అంటే.. కంపాస్ పనిచేయదు. రష్యా శాస్త్రవేత్తల నివేదికలు సైతం అంగీకరించిన ఈ కాల గమన వింత.. పరమశివుడి అనంత శక్తికి ఒక సజీవ సాక్ష్యం. ప్రకృతి, పరమాత్మ దాచిన ఈ కైలాస కోడ్ ఎప్పటికీ ఒక పవిత్ర మిస్టరీనే! దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్సవ్వకుండా ఉండేందుకు మా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి..
ఐవీఎఫ్ ప్రయాణం అంత ఈజీ కాదు..! ఏకంగా 150 ఇంజెక్షన్లు..
బాలీవుడ్ నటి, మోడల్ అనుష్క రంజన్ తన ఐవీఎఫ్ జర్నీ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. త్వరలో అమ్మ కాబోతున్న ఈ నటి ఐవీఎఫ్ అంటే ఆషామాషి కాదని అంటోంది. ఆ ప్రక్రియని మానసిక, శారీరక బాధల్ని అనుభవించే భయానక స్థితిగా పేర్కోంది. నిజానికి పిల్లలు లేరంటే ఐవీఎఫ్ అని నోటితో చెప్పినంత ఈజీకాదు ఫేస్ చేయడం అని అంటోంది. చాలా ఏళ్లుగా ఇది పూర్తిగా తెలియని నిషిద్ధ అంశంగా ఉండిపోయింది. అసలు ఇదేంటి, ఎలా చేస్తారు అనేదానిపై అందరకీ అవగాహన ఉండాలంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుందామె.నటి అనుష్కరంజన్ ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన భర్త ఆదిత్య సీల్తో కలిసి కుటుంబ జీవితాన్ని ప్రారంభించే ప్రయత్నంలో ఉన్న ఆమె తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి సవివరంగా వెల్లడించింంది. ఐవీఎఫ్ జర్నీ అంత సులభం కాదని అంటోంది. ఈ పద్ధతిలో తీసుకునే ఇంజెక్షన్లు, మందుల సంఖ్య ఒక మహిళకు మాటలు కాదు అని అన్నారు. ఒకవేళ ఆ స్త్రీకి కుటుంబ ఒత్తిడి తోపాటు భావోద్వేగ ఒత్తిడి కూడా తోడైతే ఈ ప్రక్రియ మరింత సవాలుగా మారుతుందని అంటున్నారు. అయితే ఆ విషయంలో తన కుటుంబానికి చాలా రుణపడి ఉంటానని అంది. ఎందుకంటే వాళ్లంతా తనకు ఈ జర్నీలో ఎంతో అండగా నిలిచారని చెప్పారామె. తాను తన భర్త 2023-24 నుంచి సంతానం గురించి ఆలోచించడం ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన సోదరి సలహా మేరకు వైద్యులను సంప్రదించగా.. పరీక్ష ఫలితాలన్ని సరిగ్గా వచ్చినప్పటికీ..తాము సహజంగా గర్భం దాల్చలేమని తేల్చి చెప్పారు. తదుపరి చర్యగా ఐవీఎఫ్(IVF) వైపుకి వెళ్లమని సూచించారు. ఐవీఎఫ్ అంటే మీ శరీరంలో ఏదో లోపం ఉందని కాదు. ఇది కేవలం శరీరానికి శరీరం, జీవితానికి జీవితం, వ్యక్తికి వ్యక్తి మధ్య జరిగే ప్రక్రియ అని అంటోందామె. అంతేగాదు అందుకోసం తాను దగ్గర దగ్గర సుమారు 150కి పైగా ఇంజెక్షన్లు తీసుకుని ఉంటానని అన్నారామె. వాటిలో ఒక ఇంజెక్షన్ ఎంత చిక్కగా ఉందంటే..అది ఇస్తున్నప్పుడల్లా నొప్పితే ఏడ్చేదాన్ని అని చెప్పుకొచ్చారామె. అంతేగాదు ఈ ప్రక్రియ తర్వాత మహిళల దృఢసంకల్పం పట్ల అపారమైన గౌరవం కలిగిందని చెబుతోంది. అంతేగాదు ఐవీఎఫ్ అప్రోచ్ అవుతున్న ప్రతి మహిళ ఆ ప్రక్రియలో ఎదురయ్యే ప్రతిదానికి సిద్ధంగా ఉండేలా శక్తిమంతంగా ఉండాలంటూ తన పోస్ట్ని ముగించిందామె. View this post on Instagram A post shared by Just Pakao (@anushka.and.aditya) (చదవండి: ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు..)
మధుమేహం మందులకు ప్రత్యామ్నాయంగా కాకరకాయను వాడొచ్చా..!?
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ దీర్ఘకాలిక వ్యాధి డయాబెటిస్ బారిన పడుతుండటం బాధకరం. ముఖ్యంగా సరైన ఆహరపు అలవాట్లు, జీవనశైలి లేమి కారణంగానే అధిక సంఖ్యలో ఈ వ్యాధి బారినపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇదంతా ఎందుకంటే చాలామంది మధుమేహానికి కారకరకాయ విరుగడని చాలామంది ఆయా మందులు తీసుకోవడం మానేస్తుంటారు. దీనిలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉందని బలంగా విశ్వసిస్తారు చాలామంది. ఇదంత నిజమేనా అంటే..కాదనే చెబుతున్నారు ఏఐసి-ఎస్ఆర్ఎస్-ఐసిఎఆర్-ఎన్డిఆర్ఐ ఫౌండేషన్ డైరెక్టర్ ఆదర్శ గౌడ. మరి వాస్తవం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందామారక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచగల సామర్థ్యం కాకరకాయకు ఉందని, ఇది గ్లూకోజ్ని ప్రాసెస్ చేసే విధానం అత్యంత విభిన్నంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు ఆదర్శగౌడ. కానీ కొన్ని అధ్యయన ఫలితాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. మరి ఏ కారణంగా కాకరకాయని షుగర్కు విరుగుడు అని ఎందుకు అంటున్నారంటే..ఇందులో ఏం ఉంటాయంటే..విటమిన్ సిపీచుపదార్థం (ఫైబర్)ఫోలేట్పొటాషియంయాంటీఆక్సిడెంట్లుఈ కాకరకాయలోని సమ్మేళనాలు గ్లూకోజ్ జీవక్రియపై ప్రభావవంతంగా పనిచేయడమే ప్రధాన కారణమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కలిగే లాభాలు..ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను కాపాడటంలో సహాయపడుతుందియాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థం అందిస్తుందిసంపూర్ణ పోషణకు తోడ్పడుతుందితక్కువ కేలరీలుసమతుల్య భోజనంలో సులభంగా చేర్చుకోవచ్చుఎలా తీసుకోవాలంటే..సమతుల్య భోజనంలో భాగంగా, కాకరకాయను గుడ్లతో కలిపి వేయించుకుని, సూప్లలో కలుపుకుని, లేదా ఉల్లిపాయలు, వెల్లుల్లితో తేలికగా వేయించుకుని ఆస్వాదించొచ్చు.అయితే కాకరకాయ శరీరంలో ఇన్సులిన్లాగా పనిచేయదని తేల్చి చెబుతున్నారు నిపుణులు. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ మధుమేహ మందులకు ప్రత్యామ్నాయంగా వాడకూడదు.మధుమేహం ఉన్నా లేదా రక్తంలో చక్కెరను తగ్గించే మందులు వాడుతున్నా, కాకరకాయను రోజూ వాడే ముందు వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి..తీసుకోవాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: నెయిల్ ఆర్టిస్ట్గా నెలకు రూ. 10 లక్షలు..! కట్చేస్తే కొద్ది నెలల్లోనే..)
ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు..
అమ్మ పిల్లల కోసం ఏం చేసేందుకైనా వెనకాడదు. పిల్లలు అభ్యున్నతి కోసమే అహర్నిశలు కష్టపడుతుంది. ఆ శ్రమ ఫలించి బిడ్డలు ప్రయోజకులుగా మారితే ఆ తల్లికి అంతకు మించిన ఆనందం ఏం ఉటుంది. ఆ సంతోషాన్నే తన తల్లికి అందిచింది ఈ కూతురు. ఆమె ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అందుకు అమ్మే కారణం అంటూ తన విజయ ప్రస్థానాన్ని షేర్ చేసుకుంది.అనుస్మిత మహాపాత్ర అనే యువతి తన తల్లి చేసిన త్యాగం తన ఉద్యోగ కెరీర్కు దారితీసేలా స్ఫూర్తిని కలిగించిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. తన కాలేజ్ అడ్మిషన్ ఫీజు కోసం అమ్మ తన బంగారు గాజులున తాకట్టుపెట్టిందని. దాని వల్ల ఈ రోజు ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ పనిచేసే స్థాయికి రాగలిగానని అంటోంది. ఇది తనకు ఉద్యోగం కాదని అంతకు మించి అని భావోద్వేగంగా చెబుతోంది. తాను ఇవాళ ఉద్యోగానికి వెళ్తున్నానంటే అది ఆమె ఆనాడు చేసిన త్యాగం కారణంగానే అంటోంది. ఇది ఆమె చేసిన త్యాగానికి నిదర్శనమని భావోద్వేగంగా అంటోంది. ఈ విషయాన్ని ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయం చెప్పే సమయం ఆసన్నమైంది. ఆమె మా కోసం అన్ని చేసిందంటూ తల్లి గురించి ఇలా రాసుకొచ్చింది. "తనతల్లి అమితా మహాపాత్ర అని. ఆమె ఒక ఉపాధ్యాయురాలని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడూ కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వ ఉపాధ్యాయు వృత్తిలో చేరిందని. నెలకు కేవలం రూ. 3000 జీతం అందుకునేది. రెగ్యులర్ అయ్యేదాక ఆరేళ్లు కాంట్రాక్టుగానే పనిచేసింది. అది కూడా భువనేశ్వర్ నుంచి రైలులో దాదాపు 12 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఒడిశాలోని రాయగడ జిల్లాలో పనిచేయాల్సి ఉంది. అందుకోసం తనను తమ్ముడిని వదిలివెళ్ల లేక ఎంతలా ఏడ్చేదో..నాటి సంఘటనను గుర్తుచేసుకుంది. అప్పుడు తాను ఐదోతరగతి, తమ్ముడు మూడో తరగతి చదువుతుండే వాళ్లం. సెలవుల కోసం ఇంటికి వచ్చిన తన తల్లి తిరిగి తన ఉద్యోగ స్థలానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వెళ్లలేక ఆమె కళ్లల్లో కన్నీళ్లు తిరిగేవి. ఆరోజు పనికోసం ఎక్కడికో ఒక చోటుకి వెళ్లక తప్పదు కదా అని ఓదార్చిన సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేను. అంతేగాదు నిట్లో చేరేందుకు దాదాపు ₹1.25 లక్షలు అవసరమైతే ఏ మాత్రం ఆలోచించకుండా తన బంగారుపు గాజులను అమ్మేసింది. తాను ఇంటర్న్షిప్లు సంపాదించుకునేంత వరకు తన కాలేజ్ ఫీజులను ప్రతి సెమిస్టర్కు ఆమెనే చెల్లిస్తూ వచ్చారు. అలాగే తమ్ముడికి, నాకు రూ. 60 వేలు ఖరీదు చేసే చెరొక ల్యాప్టాప్ కొనిచ్చింది. తన సంపాదన అంత తక్కువే అయినా..మా కోసం అన్ని చేసింది. తన కోసం అంటూ ఏమి దాచుకోకుండా మొత్తం మాకే ఖర్చు చేసింది. అందుకు ఆమెకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఈ రోజు నేను చేస్తున్నదంతా ఆమె కోసమే. ఆమె మాకు ఇచ్చినదాంట్లో కనీసం కొంత భాగమైన తిరిగి ఇచ్చేలా ప్రయత్నిస్తున్నా. ఆమెకు తగిన జీవితాన్ని అందించడానికి నేను చేయగలిగిందంతా చేస్తూనే ఉంటాను అంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మేడమ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Anusmita (@anusmitaaa) (చదవండి: భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పలేమా.? వెనెజువెలాలో ఆ కారణంగానే..)
అంతర్జాతీయం
అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ట్రంప్కు భారీ బూస్ట్
అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వతంత్ర ఫెడరల్ ఏజెన్సీల అధిపతులను ఎలాంటి కారణం చెప్పుకుండానే తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. 91 ఏళ్ల నాటి కీలక న్యాయసూత్రాన్ని పక్కనబెట్టింది. తద్వారా అమెరికా అధ్యక్షుడి అధికారాలను గణనీయంగా విస్తరించేందుకు మార్గం సుగమం చేసింది. అదే సమయంలో.. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతకు మాత్రం రక్షణ కల్పించింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు వేసింది. ఈ రెండు తీర్పులు కలిసి అమెరికాలో అధ్యక్షుడి అధికారాలు, కేంద్ర బ్యాంకు స్వతంత్రతపై కొత్త చర్చకు తెరలేపాయి.స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం ఈ తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష అధికారాలకు సంబంధించిన అత్యంత కీలక తీర్పుల్లో ఇదొకటని పేర్కొన్నారు. అయితే లీసా కుక్ కేసులో సాంకేతిక కారణాలతో మాత్రమే తీర్పు వచ్చిందని, ఆమెపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని సోషల్ మీడియాలో వెల్లడించారు.దశాబ్దాల.. న్యాయసూత్రానికి ముగింపుఫెడరల్ ఏజెన్సీల అధిపతుల్ని తొలగించే కేసులో.. 6-3 మెజారిటీతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 1935లో వచ్చిన హంపేరీస్ ఎగ్జిక్యూటర్ Humphrey's Executor తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పు ప్రకారం ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) వంటి స్వతంత్ర సంస్థల సభ్యులను అధ్యక్షుడు విధానపరమైన విభేదాల కారణంగా తొలగించలేడు. ఇప్పుడు ఆ పరిమితిని తొలగిస్తూ.. అలాంటి రక్షణలు రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షుడికి స్వతంత్ర ఫెడరల్ సంస్థలపై మరింత నియంత్రణ లభించినట్టైంది. ఏయే సంస్థలపై ప్రభావం?ఈ తీర్పు ప్రభావం కేవలం ఫెడరల్ ట్రేడ్ కమిషన్కే పరిమితం కాదు. నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ (NLRB), మెరిట్ సిస్టమ్స్ ప్రొటెక్షన్ బోర్డ్, కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ వంటి అనేక స్వతంత్ర సంస్థల బోర్డు సభ్యులను కూడా అధ్యక్షుడు అవసరమైతే పదవి నుంచి తొలగించే అవకాశం ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో వైట్హౌస్ ప్రభావం ఈ సంస్థలపై మరింత పెరిగే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఫెడరల్ రిజర్వ్కు మాత్రం.. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా భావించే ఫెడరల్ రిజర్వ్ విషయంలో సుప్రీంకోర్టు భిన్నమైన వైఖరి తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించాలన్న అభ్యర్థనను 5-4 మెజారిటీతో తిరస్కరించింది. చట్టం కల్పించిన విధివిధానాలు పాటించకుండా ఆమెను తొలగించలేరని స్పష్టం చేసింది. కేసు పూర్తయ్యే వరకు లీసా కుక్ పదవిలో కొనసాగవచ్చని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ తన తీర్పులో ఫెడరల్ రిజర్వ్ చరిత్రను ప్రస్తావిస్తూ.. ఈ సంస్థ రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రత్యేక రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. అధ్యక్షుడి ఇష్టానుసారంగా గవర్నర్లను తొలగించే అవకాశం ఉంటే, వడ్డీ రేట్లపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. లీసా కుక్పై ఆరోపణలు ఏమిటి?2025 ఆగస్టులో ట్రంప్, లీసా కుక్పై మార్ట్గేజ్ మోసం ఆరోపణలు చేస్తూ ఆమెను తొలగించే ఉత్తర్వులు జారీ చేశారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లోని రెండు ఇళ్లను ఒకేసారి ప్రధాన నివాసంగా చూపించి గృహ రుణాల్లో అక్రమ ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. అయితే ఇవి నిరూపితం కాని ఆరోపణలేనని, అసలు ఉద్దేశం తనను వడ్డీ విధానంపై రాజకీయ ఒత్తిడికి లోను చేయడమేనని లీసా కుక్ ఆరోపించారు. తనపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని కూడా స్పష్టం చేశారు.ట్రంప్ లక్ష్యం వేరే.. తన రెండో అధ్యక్ష పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ వడ్డీ రేట్లు వేగంగా తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లతో ప్రభుత్వ రుణభారం తగ్గడమే కాకుండా, గృహ, వాహన రుణాలు కూడా చౌకవుతాయని ఆయన వాదిస్తున్నారు. కానీ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ విభేదాల నేపథ్యంలోనే కుక్, అలాగే మాజీ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి పెంచిందని విమర్శలు వచ్చాయి. పావెల్పై దర్యాప్తు కూడా..ఫెడరల్ రిజర్వ్ మాజీ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై కూడా ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఫెడ్ ప్రధాన కార్యాలయ భవనాల పునరుద్ధరణ వ్యయాల పేరుతో విచారణ చేపట్టినా, అది వడ్డీ రేట్లపై ప్రభావం చూపేందుకు చేసిన ప్రయత్నమేనని పావెల్ ఆరోపించారు. అనంతరం కోర్టు జోక్యంతో ఆ విచారణ నిలిచిపోయి, చివరకు అమెరికా న్యాయశాఖ దానిని ఉపసంహరించుకుంది.ఒకవైపు అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలను మరింత బలోపేతం చేస్తూనే, మరోవైపు ఫెడరల్ రిజర్వ్ వంటి అత్యంత కీలక ఆర్థిక సంస్థ రాజకీయ జోక్యానికి గురికాకుండా రక్షణ కల్పించింది. అమెరికా సుప్రీం కోర్టు వెల్లడించిన ఈ రెండు తీర్పులు.. అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. అధ్యక్ష అధికారాలు ఎంతవరకు ఉండాలి? స్వతంత్ర సంస్థల స్వేచ్ఛ ఎంతవరకు కాపాడాలి? అనే చర్చలకు ఈ తీర్పు కొత్త దిశ చూపిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గంటకో బ్రేక్.. హెల్త్కి బూస్ట్!
వాషింగ్టన్: రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యమంటారు. రోజంతా ఆఫీసు పనితోనే సరిపోతూంటే వ్యాయామానికి తీరుబడి ఎక్కడ అంటారు చాలామంది. అచ్చంగా ఇలాంటి వారి కోసమే ఈ కథనం. స్పెషల్ టైమ్ అని కాకుండా... ఆఫీసు లేదా ఇంట్లోనే గంటకోసారి ఐదు నిమిషాలపాటు అటు ఇటు నడిచినా చాలు.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేంత వ్యాయామం చేసినట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా.. ఈ ఐదు నిమిషాల బ్రేక్ మీ మూడ్ను సరిచేయడంతోపాటు నిస్సత్తువను తగ్గిస్తుందని.. అదే సమయంలో మీ పని సామర్థ్యం మాత్రం తగ్గదని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం తెలిపింది. అమెరికాలోని నేషనల్ పబ్లిక్ రేడియో ‘బాడీ ఎలక్ట్రిక్ చాలెంజ్’పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో సుమారు 19,300 మంది పాల్గొన్నారు. వీరిలో సుమారు 11,484 మంది వారికి ఇష్టం వచ్చిన సమయంలో ఐదు నిమిషాలపాటు వాకింగ్ చేసేవారు. కొందరు అరగంటకు ఒకసారి చేస్తే మరికొందరు 60, 120 నిమిషాల విరామంతో చేసేవాళ్లు. ఇలా 21 రోజులు గడిచిన తరువాత వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ బ్రేక్లు వారి శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిలోనూ సానుకూల మార్పు తెచ్చినట్లు తెలిసింది. కాకపోతే అరగంటకు ఒకసారి కాకుండా.. రెండు గంటలకు ఒక బ్రేక్ ఇవ్వడం ఆచరణసాధ్యమైన విషయంగా గుర్తించారు.
మృత్యుంజయులు వీరు
కారకస్: జంట భూకంపాల తాకిడికి అల్లాడిపోయిన వెనెజువెలా తేరుకుంటోంది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు జరుపుతున్న సహాయక చర్యలూ ఊపందుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం 7.2, 7.5 తీవ్రతలతో సంభవించిన భూకంపాల కారణంగా ఇప్పటివరకూ 1,700 మంది మరణించగా సుమారు 3,150 మంది గాయపడ్డారు. ఇంకో 50,000 మందికిపైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. భూకంపాల తాకిడికి సుమారు 189 భవనాలు ధ్వంసమయ్యాయి. భవన శిథిలాల కింది నుంచి ఇప్పటివరకూ 33 మంది ప్రాణాలతో కాపాడటం విశేషం. తాజాగా ఆదివారం రాజధాని కారకస్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని కారాబెల్లెడా వద్ద ప్రాంతంలో ఫ్రాన్స్, వర్జీనియాలకు చెందిన సహాయక బృందాలు తండ్రీ కొడుకులు ఇద్దరిని శిథిలాల నుంచి వెలికితీశాయి. నాలుగు రోజులుగా శిథిలాల కిందే చిక్కుకుపోయిన ఆ తండ్రి కాళ్లను చూసిన సహాయకులు నెమ్మదిగా అతడిని బయటకు తీశారు. తిండితిప్పల్లేకపోవడంతో చాలా బలహీనంగా ఉన్న ఆయన చేతిలోని స్మార్ట్ఫోన్ను గట్టిగా పట్టుకుని కనిపించారు. రక్షించిన వెంటనే అతడికి అత్యవసర వైద్యం అందించారు. కొంత సమయానికే ఆ ప్రాంతంలోనే ఒక యువకుడిని సైతం గుర్తించి రక్షించారు. వీరిద్దరూ తండ్రీకొడుకులని తెలిసింది. సహాయక బృందాల హర్షాతిరేకాల మధ్య తండ్రీకొడుకులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. బుధవారంనాటి జంట భూకంపాల తర్వాత వేలాది మంది గల్లంతైన నేపథ్యంలో సామాన్య పౌరులు శిథిలాల కింద క్షతగాత్రుల కోసం అన్వేíÙంచడం మొదలుపెట్టారు. ఒకట్రెండు రోజుల తరువాత పలు దేశాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో శనివారం లా గుయేరా నగరంలో కూలిపోయిన అపార్ట్మెంట్ శిథిలాల నుంచి పలువురు పసికందులు, 12 ఏళ్ల బాలుడిని రక్షించినట్లు సమాచారం. వీరితోపాటే ఓ పెంపుడు కుక్క సురక్షితంగా బయటపడింది. లా గువైరాలో మళ్లీ ప్రకంపనలు భూకంపం తీవ్ర ప్రభావం చూపిన లా గువైరా రాష్ట్రంలో సోమవారం మరోసారి భూమి కంపించింది. ఈ ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం దీని తీవ్రత 5.1దాకా ఉందని తెలిపింది. వెనెజువెలా కరీబియన్ తీరంలోని కారాబల్లెడాకు 27 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనం సంభవించినట్లు అధికారులు తెలిపారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కారకస్లో భారత్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ ఆపరేషన్ అమిస్తాడ్లో భాగంగా భారత ఆర్మీ వెనెజువెలా రాజధాని కారకస్లో 24 గంటలూ సేవలందించే ఫీల్డ్ హాస్పిటల్ను ప్రారంభించింది. ఇంటర్నేషనల్ లా రింకోనాడా రేస్ ట్రాక్ వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని భారత దౌత్యకార్యాలయం తెలిపింది. అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు భూకంప బాధితులకు అన్ని సేవలను ఉచితంగా అందజేస్తారంది.
నేడు దోహాలో చర్చలు
దుబాయ్: ఇరాన్పై ఓవైపు దాడులు చేస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘దాడులకు తట్టుకోలేక మాతో సమావేశానికి ఇరాన్ సిద్ధపడింది. అందుకే మంగళవారం ఇరాన్ ప్రతినిధి బృందంతో సమావేశంకాబోతున్నాం. ఖతర్ రాజధాని నగరం దోహాలో ఈ సమావేశం జరగనుంది’’అని ట్రంప్ ప్రకటించారు. హార్మూజ్లో విదేశీ చమురునౌకపై ఇరాన్ దాడిచేసిందని ప్రతిగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణి స్థావరాలపై అమెరికా దాడిచేయడం, ఇందుకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడటంతో మళ్లీ పరస్పర దాడులు మొదలయ్యాయని పశి్చమాసియాలో ప్రబలిన భయాందోళనల మధ్య తదుపరి దశ చర్చలున్నాయంటూ ట్రంప్ సోమవారం ప్రకటన చేయడం గమనార్హం. అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. మంగళవారం చర్చల కోసం ఎలాంటి షెడ్యూల్ లేదు అని ఇరాన్ సీనియర్ మధ్యవర్తి కాజెమ్ ఘరిబాబాడీ స్పష్టంచేశారు. మరోవైపు చర్చల ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రకారం ఖతర్ తమకు చెందిన గతంలో స్తంభింపజేసిన 6 బిలియన్ కోట్ల డాలర్ల ఆస్తులను త్వరలో విడిపించనుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోమవారంప్రకటించారు. హార్మూజ్ జలసంధిపై తమకు ఇంకా పట్టు ఉందని, ఒప్పందానికి ఇరాన్ ప్రజల మద్దతు ఉందని తెలియజేసేందుకే పెజెష్కియాన్ ఈ ప్రకటన చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మంగళవారం చర్చలు ఉంటాయని ఈ అంశంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. సాంకేతిక అంశాలపై మరి కొద్ది రోజుల్లో చర్చలు ప్రారంభమవుతాయని అమెరికా సైతం మరో ప్రకటనలో పేర్కొంది.
జాతీయం
కొత్త క్యాబినెట్లో అమిత్ షాకు కీలక బాధ్యతలు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరగబోయే విస్తరణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్ర మరింత కీలకం కానున్నదనే చర్చ జోరందుకుంది. 2019 మే 30న తొలిసారి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, 2025 ఆగస్టులో లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉన్న 2,256 రోజుల రికార్డును అధిగమించి, భారత చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు సృష్టించారు.2029 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా చేపడుతున్న ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కొత్త తరాన్ని ప్రోత్సహించే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉండగా.. అమిత్ షా సాధించిన పరిపాలనా విజయాల కారణంగా ఆయన రాజకీయ ప్రాధాన్యత మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అమిత్ షా తన ఏడేళ్ల హోంమంత్రిత్వ కాలంలో దేశ భద్రత, రాజకీయ వ్యూహాల్లో ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించారు. 2019లో జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆమోదం, 2023లో కొత్త నేర చట్టాలను తీసుకురావడం వంటివి ఆయన కెరీర్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఈశాన్య రాష్ట్రాలలో శాంతి స్థాపన కోసం 12కు పైగా చారిత్రాత్మక ఒప్పందాల ద్వారా దాదాపు 11,000 మంది తీవ్రవాదులను ప్రధాన స్రవంతిలోకి అమిత్ షా తీసుకువచ్చారు. అలాగే, 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుండి విముక్తి చేశారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన అమిత్ షా, ఎంపీగా తన సొంత నియోజకవర్గమైన గాంధీనగర్లో నిరంతరం పర్యటిస్తూనే, పార్టీ మేనేజ్మెంట్లో సునీల్ బన్సల్, వినోద్ తావ్డే వంటి నేతలను తీర్చిదిద్దారు. 2026 మే నెలలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత, బంగ్లాదేశ్ నుండి వచ్చే చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దులో ఫెన్సింగ్ పనులను వేగవంతం చేశారు. అలాగే, 2026 జూన్లో హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య చారిత్రాత్మక ‘యమునా జలాల ఒప్పందం కుదర్చడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ బయోడేటా ఆధారంగానే మోదీ క్యాబినెట్లో ఆయనకు మరింత పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
మోదీ సరిగా నిద్రపోరు.. ఆయన నా టైపే!
భారత్–అమెరికా సంబంధాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత అనుబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఆ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF) లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ స్నేహంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం మియామిలో జరిగిన యూఎఫ్సీ ఈవెంట్ సందర్భంగా ట్రంప్తో కలిసి బ్యాక్స్టేజ్లో ఉన్నప్పుడు.. ఒక్కసారిగా "ప్రధాని మోదీకి ఫోన్ చేద్దాం" అని ట్రంప్ చెప్పారన్నారు. అయితే.. అప్పటికే భారత్లో ఉదయం 6 గంటలు అవుతుందని.. బాగా వేకువజామున అని తాను చెప్పగా, ట్రంప్ వెంటనే..‘‘ఆయన(మోదీ) ఈపాటికే లేచి ఉంటారు. ఆయన నాలాగే. నిద్ర తక్కువే (He's like me). సరిగా నిద్రపోరు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చినట్లు గోర్ వివరించారు. అయితే ఆ రోజు కాల్ చేయకపోయినా.. మరుసటి రోజు ఇద్దరూ మాట్లాడుకున్నారని తెలిపారు. అయితే ఈ సంఘటనలో ప్రధాన విషయం ఫోన్ కాల్ కాదని.. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహబంధమేనని గోర్ వ్యాఖ్యానించారు."ఎవరైనా నిజమైన స్నేహితులైతే ప్రతి విషయం ముందుగానే షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ నిజంగానే ప్రధాని మోదీని తన స్నేహితుడిగా భావిస్తారు" అని ఆయన అన్నారు.భారత్తో బంధానికి ట్రంప్ ప్రాధాన్యంభారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ట్రంప్ ఉన్నారని సెర్గియో గోర్ స్పష్టం చేశారు. ఇటీవల వాషింగ్టన్లో ట్రంప్తో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన సందర్భంగా కూడా ఆయన భారత్ గురించి ఎంతో అభిమానంతో మాట్లాడారని చెప్పారు. ట్రంప్కు తన గత భారత పర్యటన ఇప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని, భారత్పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని గోర్ తెలిపారు. రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా ట్రంప్ భారత్ను సందర్శిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ట్రంప్ భారత్లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే.మొదటి టర్మ్లోనే బలపడిన స్నేహంట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలోనే మోదీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమం, భారత్లో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' సభలు ఆ ఇద్దరి స్నేహానికి ప్రతీకగా నిలిచాయి. అప్పటి నుంచి రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి కీలక రంగాల్లో రెండు దేశాల సహకారం మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు.భవిష్యత్తుపై ఆశలువచ్చే రెండేళ్లు భారత్-అమెరికా సంబంధాలకు అత్యంత కీలకమని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో మరింత స్పష్టమైన ఫలితాలు సాధించడంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు.
‘ముస్లిం అయివుంటే..’.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో జరిగిన ఓ ర్యాలీలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవేళ మందిర్ ట్రస్ట్లో గనుక ముస్లిం ఉండి ఉంటే, ఈపాటికే ప్రభుత్వం అతనిని ఎన్కౌంటర్లో కాల్చిచంపి, బుల్డోజర్లతో ఇల్లు కూల్చివేసేదని ఒవైసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హైప్రొఫైల్ నిందితులను రక్షించేందుకే పోలీసులు కస్టడీ కోరడం లేదని, నిందితులు ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నారని ఆయన ఆరోపించారు.ఈ భారీ విరాళాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయగా, మరో ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా వైదొలిగారు. ఆలయ పుస్తకాల రికార్డుల ప్రకారం సుమారు రూ. 7 నుండి 7.5 కోట్ల నగదు మాయమైనట్లు అంచనా వేస్తుండగా, పోలీసులు ఇప్పటివరకు నిందితుల నుండి దాదాపు రూ. 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే వారిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తామని, ఎవరినీ విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ అంశాన్ని బహిరంగంగా లేవనెత్తిన తర్వాత, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు ఆదేశించింది. జూన్ 25న ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన తొలి ఎఫ్ఐఆర్ (ఎఫ్ఐఆర్) ఆధారంగా విరాళాల లెక్కింపు సిబ్బందికి చెందిన అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రాతో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం ఆలయ నిర్వహణ వ్యవస్థల సమూల మార్పునకు, రాజకీయ విమర్శలకు దారితీసింది.ఇది కూడా చదవండి: ఉద్ధవ్కు మరో షాక్: షిండే గూటికి ఎమ్మెల్సీ సచిన్ అహిర్
హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు
ముంబయిలో మరోసారి హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. గిర్గావ్ ప్రాంతంలోని ఒక హోటల్లో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసి, ఇద్దరు నటీమణులను రక్షించారు. ఈ వ్యవహారంలో పింప్ (మధ్యవర్తి)గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం, రక్షించిన వారిలో ఒకరు మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రధాన నటి కాగా, మరొకరు బెంగాలీ చిత్రాల్లో నటించడంతో పాటు బాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్రలు (కామియో రోల్స్) పోషించారు. బాధితుల ప్రైవసీచ భద్రత దృష్ట్యా వారి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. వారిని నిందితులుగా కాకుండా బాధితులుగానే పరిగణించి రక్షించినట్టు తెలిపారు.మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నట్లు చెబుతున్న నిందితుడిని పోలీసులు రెడ్-హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇతనికి సినీ పరిశ్రమలోని పలువురితో ఉన్న సంబంధాలు, పరిచయాలతోనే ఈ గలీజు దందాకు తెరతీశాడు. అయితే ఈ ముఠా ద్వారా మరికొంతమంది మహిళలను వేధించారు అనే కోణంలో పోలీసులు అతని కాంటాక్ట్లను పరిశీలిస్తున్నారు. అలాగే ఆ నటీమణులు ఆ హోటల్కు ఎలా వచ్చారు? వారిని ఎవరైనా బెదిరించారా లేదా ఆర్థికంగా వాడుకున్నారా? అనే విషయాలపై విచారణ జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!దీనికి కొద్ది రోజుల ముందే థానేలోని కల్యాణ్ ప్రాంతంలో కూడా ఒక హోటల్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. అక్కడ ఒక మహిళా అడ్వకేట్ (న్యాయవాది) ఈ ముఠాను నడుపుతున్నట్లు తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆమె ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు సాధారణ దుస్తుల్లో కస్టమర్లలా వెళ్లి నిఘా పెట్టి, ఇద్దరు మహిళలను రక్షించారు. ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ రెండు కేసులకు సంబంధించిన ఫోన్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తూ, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్
ఎన్ఆర్ఐ
ఫిన్లాండ్లో విద్యార్థి మణిదీప్ రెడ్డి మిస్సింగ్
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. 🚨 MISSING IN FINLAND 🇫🇮Manideep Reddy Gujja has been missing in Finland.Family and friends are urgently seeking any information regarding his whereabouts.📍 Last Contacted: May 5, 2026🎓 University: LUT University📍 City: Lahti, FinlandContact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026
మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అమెరికాలోని మిస్సోరి (Missouri) రాష్ట్రంలో స్కైడైవింగ్ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి కార్తీక్ వర్మ దాట్ల కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన మొత్తం 12 మందిలో ఆయన ఒక్కరే భారతీయుడు.ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి' నుండి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కాన్సాస్ సిటీలో హెల్త్కేర్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో కాప్జెమినీ (Capgemini) లో పనిచేసిన ఆయన, ప్రస్తుతం అడ్వెంట్హెల్త్ (AdventHealth) సంస్థలో క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్కాన్సాస్ సిటీకి దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుండి ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయ్యింది. పైలట్తో పాటు 11 మంది స్కైడైవర్లతో ప్రయాణిస్తున్న 'పసిఫిక్ ఏరోస్పేస్ 750XL' విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానం భూమికి దాదాపు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎడమవైపునకు తిరిగి, పొలాల్లో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. విమానంలో ఇంజన్ పవర్ తగ్గిపోవడం వల్లే పైలట్ హైవేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని ఎయిర్పోర్ట్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. దీంతో విమానంలోవారందరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అమెరికా పారాచూట్ అసోసియేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జెన్ షార్ప్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి 20 లక్షలు : ఎలా?సాధారణ కమర్షియల్ విమానాల్లో ఉండేలాంటి 'బ్లాక్ బాక్స్' (డేటా రికార్డర్) ఈ చిన్న విమానంలో లభ్యం కాలేదు. దీంతో ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఇతర డిజిటల్ పరికరాలు, సాక్షుల ప్రకటనలు, వీడియోలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన పసిఫిక్ ఏరోస్పేస్ 750XL అనేది సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం. ఇది స్కైడైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ విమానం ప్రమాదానికి ముందు కూడా తొమ్మిదిసార్లు విజయవంతంగా ప్రయాణించిందని విమాన ట్రాకింగ్ సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!
అబుదాబిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అబుదాబి భారత రాయబార కార్యాలయంలో జూన్ 13, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సాంస్కృతిక శోభతో నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగువారి ఐక్యత, తెలంగాణ సంస్కృతి, జానపద వైభవం, చిన్నారుల ప్రతిభ—అన్నీ ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్జీ జార్జ్ , గౌరవ అతిథిగా వి. ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. వివిధ భారతీయ సంఘాల ప్రముఖులు.. ఇండియా సోషల్ సెంటర్ నుంచి బిజీ థామస్, లింసన్, బీహార్, జార్కండ్ సమాజ్ దివాకర్, ఉత్తర ప్రదేశ్ సమాజ్ వివేక్, తెలుగు అసోసియెషన్ రమేష్, ఐఎఫ్సీఏ నుంచి వినాయక్ అవాటె, మహారాష్ట్ర మండల్ నుంచి సంజయ్, ఇటిసిఏ నుంచి కిరణ్ కుమార్, సంస్కృతీ నుంచి రాజశేఖర్, తల్లిదండ్రులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం తెలంగాణ డప్పుల స్వాగతంతో ప్రారంభమై, దీపప్రజ్వలన, అరబిక్, భారత జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతంతో కొనసాగింది. అనంతరం డా. అందె శ్రీ, తెలంగాణ ఉద్యమ అమరులకు ఒక నిమిషం మౌనం పాటించారు.తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా స్వాగత ప్రసంగం అందిస్తూ ప్రవాస తెలంగాణవాసుల ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, యువతలో నాయకత్వ వికాసం వంటి అంశాలపై ప్రేరణాత్మకంగా మాట్లాడారు. చివరగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు)
యూట్యూబర్ నందు కేసులో విస్తుపోయే అంశాలు
సాక్షి, హైదరాబాద్: జాగర్లమూడి మధుకర్, రమానందన వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్లు ఇవ్వడం జాగర్లమూడి కపుల్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారు. యూకేలో వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.యూకేలో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన నందు దంపతులపై చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్తో రమానందన మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇచ్చే అర్హతను నందూస్ వరల్డ్ కిచెన్ కోల్పోయింది. జాగర్లమూడి కంపెనీలకు యూకే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇవ్వకుండా బ్రేక్ పడింది.యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయి.
క్రైమ్
నా భర్త అర్ధరాత్రి మేనమరదలు ఇంటికి వెళ్తాడు..!
హనుమకొండ జిల్లా: తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టింది ఓ మహిళ. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో సోమవారం చోటుచేసుకుంది.బాధితురాలి కథనం మేరకు.. ఐనవోలు మండలం వెంకటాపూర్కు చెందిన శ్రీజకు గుండేడుకు చెందిన డెంగు రాజుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కట్నంగా రూ.12 లక్షల నగదు, 16 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. పెళ్లైన మూడు నెలల నుంచే భర్త, అత్త తీవ్ర వేధింపులకు గురి చేస్తూ శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపింది.పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరగగా, తనదే తప్పు అని ఒప్పుకుని హైదరాబాద్కు తీసుకెళ్లాడని తెలిపింది. అక్కడ మద్యం సేవించి వచ్చి తనను కొట్టేవాడని ఆరోపించింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లి వచ్చేవాడని, ఆన్లైన్లో పేకాట ఆడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని వచ్చి అదనపు కట్నం కోసం వేధిస్తూ పుస్తెల తాడుతో ఉరి బిగించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.ప్రస్తుతం తన మేనమరదలుతో ఉంటున్నాడని, “నువ్వేం చేసుకుంటావో చేసుకో” అంటూ ఇంట్లోంచి తరిమేశాడని కంటతడి పెట్టుకుంది. సుమారు 20 నెలలుగా తాను పుట్టింట్లోనే ఉంటున్నానని, పోలీసుల వద్దకు పిలిపించినా తనకేమీ ఇవ్వనన్నాడని ఆరోపించింది.ఇచ్చిన కట్నం మొత్తం తమకు తిరిగి ఇచ్చి న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది.
ఏసీబీ అన్నా.. ఏం భయం లేదన్నాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అనగనగా ఒక రైతు. ఆయన పొలానికి మట్టి తరలింపు అనుమతికి ఓ ఉద్యోగి లంచం అడిగాడు. ఇలాగే లంచం అడిగిన ఓ అధికారిని ఏసీబీకి పట్టించానని రైతు హెచ్చరించాడు.. కానీ అవినీతి అధికారి తేలిగ్గా తీసుకున్నాడు.. లంచం ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పాడు.. రైతు నుంచి రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాలివి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈఈగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్.శ్రీనివాస్ను ఓ రైతు తన పొలానికి చెరువు మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. కొద్ది రోజులుగా తిరుగుతుండగా, మట్టి తరలింపునకు రూ.4 లక్షలు ఇవ్వాలని ఏఈఈ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చివరకు రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. ఈ మేరకు సోమవారం రాత్రి కార్యాలయంలో బాధిత రైతు నుంచి ఏఈఈ రూ.2 లక్షలు తీసుకుని తన డెస్క్లో పెట్టుకోగా.. ఏసీబీ అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకోవడంతో ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ పేరు చెప్పినా..:ఏఈఈ శ్రీనివాస్ను ఇంకొందరు రైతులు కూడా చెరువుల నుంచి మట్టి తరలింపునకు అనుమతి ఇవ్వాలని కోరితే లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే, ఇదే రైతు తాను గతంలో ఓ ఉద్యోగిని ఏసీబీకి పట్టించానని చెప్పినా.. లంచం ముట్టచెబితే తప్ప అనుమతి ఇచ్చేది లేదని శ్రీనివాస్ తెగేసి చెప్పినట్లు సమాచారం
వివాహేతర సంబంధం.. భర్తను లేపేసిన భార్య..!
దేవరకద్ర రూరల్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు భర్తను బలితీసుకున్నాయి. భర్తపై కత్తితో దాడిచేసి భార్య హతమార్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాయపల్లికి చెందిన కుర్వ నాగేశ్ (38)కు కోయిల్కొండ మండలం మల్కాపూర్కు చెందిన కవితతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. నాగేశ్ గొర్రెల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అతడికి అనుమానం కలగడంతో దంపతులిద్దరి మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాగేశ్ పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ, మద్యానికి బానిస కావడంతో కుటుంబ కలహాలు మరింత తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న నాగేశ్కు కవితకు మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నాగేశ్పై కవిత కత్తితో దాడికి పాల్పడింది. ఈ సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్న చిన్న కుమారుడు రాము తండ్రి ఆర్తనాదాలు విని మేల్కొన్నాడు. తండ్రిపై తల్లి దాడి చేస్తుండటాన్ని చూసి భయంతో బయటకు వచ్చి కేకలు వేశాడు. బయట నిద్రిస్తున్న ఇతర కుటుంబసభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకోగా అప్పటికే నాగేశ్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తన వదినకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతోనే గొడవలు జరుగుతున్నాయని, అదే కక్షతో తన అన్నపై కత్తితో దాడిచేసి హతమార్చిందని మృతుడి సోదరుడు రాజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు.
Hyderabad: కార్ ఆపి ఉంటే ఫ్యామిలీ రిస్క్లో ఉంటుండే..
హైదరాబాద్: కార్లలో వెళ్తున్న మహిళలను పోకిరీలు వెంబండించి భయాందోళనకు గురిచేశారు. కార్ డ్యాష్ క్యామ్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. బోడుప్పల్కు చెందిన ఓ కుటుంబం ఓ ఫంక్షన్కు వెళ్లి ఘట్కేసర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి మీదుగా కారులో తిరిగి వస్తోంది.ఆ సమయంలో కొందరు వ్యక్తులు కత్తులు, ఆయుధాలతో వెంబడించారు. దీంతో కారులో ఉన్న మహిళలు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఘట్కేసర్ వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా చోటు చేసుకుంది. ఈ దృశ్యాలన్నీ కారు డ్యాష్ క్యామ్లో రికార్డయ్యాయి. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నడి రోడ్డుపై కారును వెంబడిస్తూ పోకిరీల హల్చల్హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ నుండి బోడుప్పల్ హైవే మీద అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్లి కారులో వస్తున్న కుటుంబాన్ని బైక్లపై వెంబడిస్తూ, భయబ్రాంతులకు గురిచేసిన పోకిరీలుకారు డ్యాష్ క్యామ్లో రికార్డైన దృశ్యాలు కారులో మహిళలు,… pic.twitter.com/vmuyB3yIN5— Telugu Scribe (@TeluguScribe) June 29, 2026
వీడియోలు
నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!
2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!
జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్
YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్
కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!
మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!
High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు
సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు
ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు
రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!


