Top Stories
ప్రధాన వార్తలు
Kho Kho World Cup: రెండు ప్రపంచకప్లు మనవే..
న్యూఢిల్లీ: భారత ఖోఖో మహిళల జట్టు ప్రపంచకప్లో విజేతగా నిలిచిన కాసేపటికే.. భారత పురుషుల జట్టు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్తో జరిగిన తుదిపోరులోభారత్ 54-36 తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత పురుషుల జట్టు.. అదే జోరును ఇక్కడ కూడా కొనసాగించింది. ప్రత్యర్థి నేపాల్ ను కట్టిపడేసిన భారత్.. విశ్వవిజేతగా అవతరించింది. మొట్టమొదటి ఖోఖో వరల్డ్కప్లో భారత మహిళలు, పురుషుల జట్లు చాంపియన్స్గా నిలవడంవిశేషం. ముందుగా జరిగిన మహిళల ఖోఖో వరల్డ్కప్ ఫైనల్లో ఖోఖో ప్రపంచకప్(Kho Kho World Cup 2025) విజేతగా భారత్ మహిళల జట్టు అవతరించింది.ఈ ప్రపంచకప్లో ఆద్యంతం చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఈరోజు(ఆదివారం) జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్(Nepal) జట్టును ఓడించింది. ఫలితంగా తొలి ఖోఖో ప్రపంచకప్లో జగజ్జేతగా నిలిచింది.ఈ ఫైనల్లో టాస్ గెలిచిన నేపాల్.. ముందుగా భారత్ ను అటాక్ రమ్మని ఆహ్వానించింది. ఇది ఆతిథ్య భారత్కు వరంగా మారగా, పర్యాటక జట్టు నేపాల్కు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత జట్టు. నేపాల్ను వరుస విరామాల్లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఎక్కడా కూడా నేపాల్కు అవకాశం ఇవ్వకుండా భారత్ తన ఆధిపత్యాన్నిప్రదర్శించింది. కడవరకూ ఇదే ఆట తీరుతో చెలరేగిపోయిన భారత జట్టు.. నేపాల్ను మట్టికరిపించి ప్రపంచకప్ను ముద్దాడింది.ఇరు జట్లకు వైఎస్ జగన్ అభినందనలుఖోఖో వరల్డ్కప్-2025లో విశ్వవిజేతలుగా నిలిచిన భారత మహిళల, పురుషుల జట్లకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్లో మరిన్ని టోర్నీల్లో రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
గువహతి:కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై అస్సాంలోని గువహతి పోలీస్ స్టేషన్లో ఆదివారం(జనవరి19) ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది. మోన్జిత్ చాటియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిమితులను దాటాయని,అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా తన ఫిర్యాదులో తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అశాంతితో పాటు,వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్కు ఉందని చాటియా పేర్కొన్నారు. కాగా,ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ ఆరెస్సెస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. తాము ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్తోపాటు భారత దేశంపై కూడా పోరాడుతున్నామన్నారు. ఈవ్యాఖ్యలను పలువురు కేంద్ర మంత్రులు తప్పుబట్టారు.కాంగ్రెస్ అసలురూపం ఈ వ్యాఖ్యలతో బయటపడిందని బీజేపీ నేతలు విమర్శించారు.
బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా ఎక్కడో కూర్చుని మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు.. కొట్టేసిన సొమ్మును తమ వద్దకు చేర్చుకునేందుకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వాడుతున్నారు. తమ చేతికి నేరం అంటుకోకుండా కమీషన్ల ఆశజూపి అమాయకులనే చివరకు బలి చేస్తున్నారు. ‘మ్యూల్’బ్యాంకు ఖాతాలతో మొత్తంగా ముంచేస్తున్నారు. ఒకటి కాదు...రెండు కాదు..దేశవ్యాప్తంగా ఐదు లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) 2024లో మొత్తం 1.14 లక్షల సైబర్ నేరాలు నమోదు చేయగా..ఈ కేసులలో ప్రతి కేసులో కనీసం ఐదు మ్యూల్ బ్యాంకు ఖాతాలు వినియోగించినట్టు తెలిపారు. aఅమాయకుల నుంచి వివిధ మోసపూరిత విధానాల్లో కొల్లగొట్టిన సొమ్మును పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సైబర్ నేరగాళ్లు వీటిని వెంటవెంటనే పలు బ్యాంకు ఖాతాల్లోకి (మ్యూల్ ఖాతాల్లోకి) బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు కొట్టేసిన సొమ్ము ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లోకి చిన్నచిన్న మొత్తాలుగా చేసి బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు వందల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దర్యాప్తు అధికారులు ఆ సొమ్మును గుర్తించడం..తిరిగి ఫ్రీజ్ చేయడం సవాల్గా మారుతోంది. ఇలా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన సొమ్మును చివరగా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాల్లోని ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంత రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు కొన్ని బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించిన తర్వాత వెంటనే వాటిని నగదు రూపంలో విత్డ్రా చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని మధ్యవర్తుల ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాలకు పంపుతున్నారు. ఇటీవలే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ తరహా ముఠాలోని 21 మందిని 2024 డిసెంబర్ 24న అరెస్టు చేశారు. బ్యాంకుల సమన్వయంతోనే కట్టడి సాధ్యం.. మ్యూల్ బ్యాంకు ఖాతాల బెడద తగ్గించడంలో బ్యాంకు అధికారులది కీలకపాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్టుగా గుర్తిస్తే అలాంటి బ్యాంకు ఖాతాలకు రెడ్ప్లాగ్ పెట్టుకుని, వెనువెంటనే దర్యాప్తు సంస్థలకు తెలియజేస్తే ఫలితం ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఒక బ్యాంకు ఖాతాదారుడి అకౌంట్లో అకస్మాత్తుగా లక్షల రూపాయలు జమ అవుతుండటం..అదేరీతిలో లక్షల్లో డబ్బులు ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నట్టు గుర్తిస్తే అలాంటివి మ్యూల్ బ్యాంకు ఖాతాలుగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. కానీ వాస్తవానికి ఈ సమన్వయం లోపిస్తోంది. బ్యాంకుల సాధారణ ప్రక్రియలో భాగంగా ఇలాంటి రెడ్ఫ్లాగ్ ఖాతాల (అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన ఖాతాలు) వివరాలు ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కు చేరవేస్తాయి. కొన్ని నెలల తర్వాత సంబంధిత పోలీసులకు ఆ సమాచారం చేరుతుంది. ఈలోగా సైబర్ నేరగాళ్లు నిధులను విదేశాలకు మళ్లించడం పూర్తి చేస్తుండటంతో ఆ సమాచారం పోలీసులకు నిరుపయోగంగా మారుతోంది. మ్యూల్ బ్యాంకు ఖాతా అంటే..? ఒకరి వివరాలతో ఉన్న బ్యాంకు ఖాతాను నేరపూరిత లావాదేవీలకు ఇతరులు వినియోగిస్తే (నిజమైన ఖాతాదారుడికి తెలిసి ఇది జరగవచ్చు.. తెలియకుండా కూడా జరగొచ్చు) ఇలాంటి బ్యాంకు ఖాతాను మ్యూల్ బ్యాంక్ అకౌంట్గా చెబుతారు. కొందరు నెలవారీ కమీషన్లకు ఆశపడి తమ అధికారిక ధ్రువపత్రాలు ఉపయోగించి తెరచిన బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగిస్తున్నారు. ఇలాంటి బ్యాంకు ఖాతాల్లో ఎవరి నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. అవి మళ్లీ ఎక్కడికి బదిలీ అవుతున్నాయన్న వివరాలు ఖాతాదారుడికి తెలిసే అవకాశం కూడా ఉండదు. మ్యూల్ బ్యాంకు ఖాతాలు ఇలా తెరిపిస్తారు.. సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆశజూపి అమాయకులకు వల వేస్తారు. వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచేలా ఒప్పిస్తారు. ఆ తర్వాత నిజమైన బ్యాంకు ఖాతాదారుడి నుంచి బ్యాంకు పాస్బుక్, డెబిట్ కార్డులు, పాస్వర్డ్లు మోసగాళ్లు తమ ఏజెంట్ల ద్వారా ఆ బ్యాంకు ఖాతాలు పూర్తిగా తమ ఆ«దీనంలోకి తీసుకుంటారు. సైబర్ మోసాల్లో కొల్లగొట్టే సొమ్మును ఈ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం..తర్వాత ఇతర ఖాతాల్లోకి మళ్లించడం వంటి లావాదేవీలు చేస్తుంటారు. ఖాతాదారులకు సూచనలు.. ఇతరులు నెలవారీ కమీషన్ ఇస్తామంటే ఆశపడి మీ బ్యాంకు ఖాతాను ఇతరులకు ఇవ్వొద్దు. మీ బ్యాంకు ఖాతా నిలిపివేయబడుతుంది. మీరు మళ్లీ కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పేరిట ఉన్న మ్యూల్ బ్యాంక్ ఖాతా నేరస్తులు అక్రమ నిధుల బదిలీకి, లేదా మనీలాండరింగ్ చేయడానికి ఉపయోగించే అవకాశం ఉన్నందున చట్టపరంగా అసలు ఖాతాదారులకు శిక్ష తప్పదు. ప్రధానంగా మ్యూల్ బ్యాంకు ఖాతాల బాధితులు వీరే..సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగులు ఈ ఉచ్చులో చిక్కుతున్నారు. వివరాలు ఇస్తే నెలకు కొంత కమీషన్ వస్తుందని ఆశపడి నిరుద్యోగ యువత వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి మ్యూల్ ఖాతాలుగా వాడేందుకు ఇస్తున్నారు. ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని, నేరస్తులు కమీషన్లు ఆశజూపి రైతులను ఈ ఉచ్చులో దింపుతున్నారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ప్రకారం..జిమ్ ట్రైనర్లు, టైలర్లు, ప్రైవేటు కాంట్రాక్టర్లు, హోటల్స్ నిర్వాహకులు ఇలా పలువురు మ్యూల్ ఖాతాల బాధితులే.
ధనుశ్తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019లో తాను తెరకెక్కించిన చిత్రం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న గౌతమ్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.గతంలో 2019లో ధనుశ్తో(Dhanush) కలిసి ఎనై నోకి పాయుమ్ తోట అనే మూవీని గౌతమ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. ఎనై నోకి పాయుమ్ తోట పేరు వినగానే గౌతమ్ రియాక్ట్ అయ్యారు. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ చిత్రాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అది నా సినిమా కాదు. వేరే వాళ్లది అయి ఉంటుందని అన్నారు. అయితే గౌతమ్ మీనన్ అలా రియాక్ట్ కావడంపై నెటిజన్స్ భిన్నంగా చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఈ సినిమా తొలి భాగాన్ని గౌతమ్ ఎంతో ఫోకస్ పెట్టి తెరకెక్కించారు. షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడితో రెండో భాగాన్ని స్పీడ్గా తెరకెక్కించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. గౌతమ్ మీనన్ ప్రస్తుతం డొమినిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టం
భారతదేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతూ ఉంది. వీరిలో చాలా మంది లెక్కకు మించిన డబ్బు సంపాదించడమే కాకుండా.. ఉదారంగా దాతృత్వ కార్యక్రమాలకు మద్దతిస్తూ.. వేలకోట్లు దానం చేస్తుంటారు. ఇందులో చెప్పుకోదగ్గ వ్యక్తి బిలియనీర్ 'శివ్ నాడార్' (Shiv Nadar). అయితే ఈయన హెచ్సీఎల్ టెక్ కంపెనీ షేర్స్ మంగళవారం 9 శాతం క్షీణించాయి. దీంతో ఒక్క రోజులోనే రూ. 46,485 కోట్లు నష్టం వాటిల్లింది.హెచ్సీఎల్ టెక్ మార్కెట్ విలువభారతదేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో ఒకటైన హెచ్సీఎల్.. డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫమయ్యాయి. దీంతో సంస్థ స్టాక్ ధరలో కూడా భారీ క్షీణత కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో కంపెనీ షేర్లు 8.63% పతనమై, ఒక్కో షేరుకు రూ.1,813.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో, స్టాక్ మొత్తం 9.41% క్షీణతను ప్రతిబింబిస్తూ రూ. 1,798.40 కనిష్ట స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేరు 8.51 శాతం క్షీణించి రూ.1,819.95 వద్ద ముగిసింది. ఫలితంగా జనవరి 14 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది.శివ్ నాడార్ నికర విలువఒక్క రోజులో వేలకోట్ల నష్టం వాటిల్లినప్పటికీ.. శివ్ నాడార్ నికర విలువ ఫోర్బ్స్ ప్రకారం 39.4 బిలియన్ డాలర్లు లేదా రూ. 3,40,793 కోట్లుగా ఉంది. ఇది ఆయన బలమైన పునాదిని & ఐటీ రంగంలో కంపెనీ బలానికి నిదర్శనం అని తెలుస్తోంది.అత్యంత ఉదార దాతశివ్ నాడార్ కేవలం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో ఒకరుగా మాత్రమే కాకుండా.. అత్యంత ఉదారమైన పరోపకారిగా కూడా గుర్తింపు పొందారు.శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. దీంతో ఎడెల్గివ్ హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు.ఇదీ చదవండి: ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అస్థిరత ఫలితంగా హెచ్సీఎల్ టెక్ వాల్యుయేషన్లో తాత్కాలిక తగ్గుదల ఏర్పడినప్పటికీ, భారతదేశ ఐటీ రంగానికి శివ్ నాడార్ చేసిన కృషి, అతని దాతృత్వ ప్రయత్నాల కారణంగా అతనిని నిజమైన మార్గదర్శకుడిగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ తరాలకు రోల్ మోడల్గా నిలిపింది.
స్టీల్ ప్లాంట్ను ఏం చేస్తారో చెప్పండి: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:స్టీల్ప్లాంట్కు కేంద్రం ఇటీవల ఇచ్చిన ప్యాకేజీపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం(జనవరి19) బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ఎందుకు చెప్పలేదు. దీపం పథకంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆపడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రధాని,అమిత్షా, సీఎం చంద్రబాబు ప్రయివేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్పై ముసుగులో గుద్దులాట వద్దు.మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఇచ్చే 11 వేల కోట్లకు ఎన్నో షరతులు పెట్టారు. ప్యాకేజీ వెనుక ఏదో మతలబు ఉంది.కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తిరుపతి సంఘటనపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చెయ్యాలి. సొంతగా గనులు కేటాయించాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తాం.మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. కేంద్రహోం మంత్రి వస్తే రాష్ర్ట ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఏమి చేస్తున్నాడు అని మట్లాడుకుంటున్నారా. రుషి కొండ భవనాల కోసం డిన్నర్ మీటింగ్ పెట్టరా. వైఎస్ జగన్కు ఎన్ని బెడ్ రూములు, ఎన్ని బాత్ రూములు ఉన్నాయన్న దాని మీద చర్చిస్తారా. రాష్ట్రానికి ఇదేం ఖర్మ. చంద్రబాబు ప్రచారం కోసం దుబారా ఖర్చులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చుకుంటారో వారి ఇష్టం’అని బొత్స అన్నారు.
అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన దాడి ప్రత్యేకంగా టార్గెట్ చేసిన దాడి కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar). అతనొక దొంగ అని, కేవలం దొంగతనం కోసమే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ దొంగ బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి అని, అతను దొంగతనంలో భాగంగానే ఆ ఇంట్లో చొరబడినట్లు తెలిపారు. అసలు అది సైఫ్ ఇల్లు అనే విషయం ఆ దొంగకు తెలీదన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. ముంబైలో లా అండ్ ఆర్డర్ విఫలమైందంటూ ప్రత్యర్థి పార్టీలు పదే పదే ఆరోపణలు చేయడం తగదన్నారు.‘అతను బంగ్లాదేశ్ నుంచి ముంబైకి వచ్చాడు. తొలుత కోల్కతాకు చేరుకుని ఆ తర్వాత ముంబై(Mumbai)కి వచ్చాడు. దొంగతనం కోసం ఒక ఇంటిని ఎంచుకున్నాడు. అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అనే విషయం అతనికి తెలీదు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని మాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’ అని అజిత్ పవార్ మండిపడ్డారు.కాగా, సైఫ్ అలీఖాన్పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు.నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం.కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగ్గా, దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందతుడ్ని అరెస్ట్ చేశారు.
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
బెంగళూరు: ‘ మీరు సైబర్ స్కామ్ నేరగాళ్ల(Cyber Scam) నుంచి జాగ్రత్తగా ఉండండి. తాము ప్రభుత్వ అధికారులమని మీ వివరాలు కావాలంటూ ఫోన్ చేసే వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అంటూ మనకు ఫోన్లో కాలర్ టోన్ రూపంలో తరచు వినిపిస్తున్న మాట. అది పాట అయినా మాట అయినా కానీ ఆ కాలర్ ట్యూన్ ఉద్దేశం మాత్రం.. ఫోన్ చేసే ఎవరైనా మీ వ్యక్తిగత డేటా ఏ రూపంలో అడిగినా ఇవ్వొద్దనేది దాని సారాంశం.అయితే బెంగళూరు టెకీ(Bengaluru Techie) మాత్రం,, అచ్చం ఇదే తరహాలో మోసం పోయి రూ. 11 కోట్లు పోగొట్టుకున్నాడు. ఓ సంస్థలో టెకీగా ఉద్యోగం చేస్తూ కొంత నగదును ‘మార్కెట్ ఇన్వెస్ట్మెంట్’లో పెట్టాడు. రూ. 50 లక్షలు పెడితే దాని విలువ రూ. 12 కోట్లకు చేరింది.ఈ విషయాన్ని పసిగట్టిన నిందితుడు.. బాధితుడ్ని అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నాడు. విజయ్ కుమార్ అనే టెకీ నుంచి భారీ మొత్తంలో దోచుకుపోయాడు. తాము ఈడీ అధికారులమని, ప్రభుత్వ అదికారులమని చెబుతూ విజయ్ కుమార్ భయభ్రాంతలకు గురి చేసిందో ఓ ముఠా. మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని, మిమ్ముల్ని అరెస్ట్ చేస్తామని తరచు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన విజయ్ కుమార్.. వారు చెప్పినట్లు చేశాడు. వారు అడిగిన ఆధార్, పాన్ కార్డువివరాలతో పాటు తన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా వారికి అందించాడు.అంతే.. దాంతో సైబర్ నేరగాళ్ల పని ఈజీ అయ్యింది. ఇంకేముంది బాధితుడికి ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 11 కోట్లను స్వాహా చేశారు. సుమారు ఏడు కోట్ల రూపాయలను ఒకే అకౌంట్ సుంచి దొంగిలించడం గమనార్హం.ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులుతాను నష్టపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నబాధితుడు విజయ్ కుమార్ లబోదిబో మన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇదే దుబాయ్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్(Cyber Fraud) కు సంబంధించిన ఘటనలో తరుణ్ నటానీ, కరణ్, దవల్ షాలను అరెస్ట్ చేశారు. షా అనే నిందితుడు దుబాయ్ చెందిన సైబర్ స్కామ్లో ఆరితేరిన ఓ వ్యక్తి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి గాను కోటిన్నరకు ఒప్పందం చేసుకున్నాడు సదరు దుబాయ్ చెందిన సైబర్ నేరగాడు.
కోల్కతా డాక్టర్ కేసు: దోషి సంజయ్ తల్లి సంచలన వ్యాఖ్యలు
కోల్కతా:ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను కోల్కతా కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చింది. కోర్టు తీర్పుపై సంజయ్రాయ్ తల్లి మాలతీరాయ్ స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా తగిన శిక్ష విధించాల్సిందేనన్నారు. తనకు కూడా ముగ్గురు కుమార్తెలున్నారని, తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని చెప్పారు.మహిళా డాక్టర్ పడిన బాధను,నరకాన్ని అర్థం చేసుకోగలనన్నారు.ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకుగాను సంజయ్కు జీవించే హక్కు లేదన్నారు. అతడికి మరణ శిక్ష విధించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు.చనిపోయిన వైద్యురాలు తనకు కూతురితో సమానమని, కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లీ ఊరుకోదన్నారు.ఈ కేసుపై సుప్రీం కోర్టుకు వెళ్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ సోదరి మాట్లాడుతూ తమకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అతడు ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని తామెప్పుడూ అనుకోలేదన్నారు.అయితే నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్తో పాటు మరికొంతమంది ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని,ఈ విషయంపై పోలీసులు,సీబీఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన శిక్ష విధించాలని కోరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సంజయ్రాయ్ ఎంత శిక్ష విధించబోయేదీ సిల్దా కోర్టు సోమవారం తేల్చనుంది. సంజయ్రాయ్కి మరణశిక్ష విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముప్పైఒక ఏళ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని గత ఏడాది ఆగస్టు 10న ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్హాల్లో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో శనినవారం సిల్దా కోర్ట తీర్పువెలువరించింది. విచారణలో భాగంగా కోర్టు 100 మందికిపైగా సాక్షులను విచారించింది. ఈ కేసులో అరెస్టయినప్పటి నుంచి సంజయ్రాయ్ కుటుంబ సభ్యులెవరు అతడిని కలవడానికి ప్రయత్నించలేదు. అతడి తరపున కేసు వాదించడానికి కూడా న్యాయవాదిని కోర్టే న్యాయ సహాయంలో భాగంగా నియమించింది.
పనిగంటలు కాదు.. అదే ముఖ్యం: భారత్పే సీఈఓ
ఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి.. అంటూ వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పిన లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు దీనిని ఖండిస్తూ.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇప్పుడు తాజాగా భారత్పే సీఈఓ 'నలిన్ నేగి' (Nalin Negi) చేరారు.ఫిన్టెక్ సంస్థ పని చేసే ప్రదేశాలలో ఎక్కువ గంటలు ఉండదని, పని ప్రదేశాల్లో ఉద్యోగుల ఫలితాలు.. ఉత్పాదకతలో నాణ్యత మాత్రమే ముఖ్యమని నలిన్ నేగి అన్నారు. వారానికి 90 గంటలు పనిచేయడం అనేది చాలా కష్టం. ఇది ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతుంది. దానివల్ల సరైన ఉత్పాదక ఉండదు. కాబట్టి ఎన్ని గంటలు పనిచేశామనేది కాకుండా.. నాణ్యమైన ఉత్పాదకత ఎంత ఉంది అని చూడటం ముఖ్యమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.భారత్పే చీఫ్ మాట్లాడుతూ.. ఒక కంపెనీ ఉద్యోగాలను ఇవ్వడం మాత్రమే కాదు, ఉద్యోగులకు మంచి భవిష్యత్తును కూడా ఇవ్వాలి అని అన్నారు. ప్రస్తుతం ఇదే మా లక్ష్యం అంటూ వెల్లడించారు. ఒక ఉద్యోగి సంతోషంగా పనిచేస్తేనే.. సంస్థకు లాభం ఉంటుంది. కాబట్టి వారానికి 90 గంటల పనిపై నాకు నమ్మకం లేదు అని అన్నారు.వారానికి 90 గంటల పని చేయాలనే వ్యాఖ్యలపై.. 'ఆనంద్ మహీంద్రా', సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' మొదలైనవారు కూడా స్పందించారు.ఆనంద్ మహీంద్రాఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్అదార్ పూనావల్లాఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.
ఈ తూరి నవ్వించేకి వస్తుండా
పనీ – పాటా
కేరళ కాలింగ్
ప్రేమంటే?
ప్రపంచానికి ఏం రాసి పెట్టి ఉంది?
పనిగంటలు కాదు.. అదే ముఖ్యం: భారత్పే సీఈఓ
Kho Kho World Cup: రెండు ప్రపంచకప్లు మనవే..
బిగ్బాస్ దివి స్టన్నింగ్ పిక్స్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు
ధనుశ్తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
కళ్లు చెదిరే ఇన్స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
బిగ్బాస్ దివి స్టన్నింగ్ పిక్స్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
హైదరాబాద్ నార్త్ సిటీ మెట్రో రైల్.. రెండు రూట్లలో డబుల్ డెక్కర్!
తిరుమలలో చాగంటికి అవమానం
టీ20 వరల్డ్కప్లో బోణీ కొట్టిన భారత్
ఇందిరమ్మ ఇంటికి కటాఫ్.. 1994
పవన్ పార్ట్నర్కు 1,200 ఎకరాలు
దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
పోర్న్ వీడియో కేసులో మరో ఇద్దరి అరెస్ట్ట్
ఈ తూరి నవ్వించేకి వస్తుండా
పనీ – పాటా
కేరళ కాలింగ్
ప్రేమంటే?
ప్రపంచానికి ఏం రాసి పెట్టి ఉంది?
పనిగంటలు కాదు.. అదే ముఖ్యం: భారత్పే సీఈఓ
Kho Kho World Cup: రెండు ప్రపంచకప్లు మనవే..
బిగ్బాస్ దివి స్టన్నింగ్ పిక్స్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు
ధనుశ్తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
కళ్లు చెదిరే ఇన్స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
బిగ్బాస్ దివి స్టన్నింగ్ పిక్స్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
హైదరాబాద్ నార్త్ సిటీ మెట్రో రైల్.. రెండు రూట్లలో డబుల్ డెక్కర్!
తిరుమలలో చాగంటికి అవమానం
టీ20 వరల్డ్కప్లో బోణీ కొట్టిన భారత్
ఇందిరమ్మ ఇంటికి కటాఫ్.. 1994
పవన్ పార్ట్నర్కు 1,200 ఎకరాలు
దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
పోర్న్ వీడియో కేసులో మరో ఇద్దరి అరెస్ట్ట్
సినిమా
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే.. పవిత్రా లోకేశ్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ మరో ఏడాది పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదారాబాద్లో ఆయన జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ సందర్భంగా నరేశ్పై ప్రశంసలు కురిపించారు పవిత్రా లోకేశ్.పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' నరేశ్ గారి బర్త్ డేను అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం శుభ పరిణామం. ఆయన వేసుకున్న షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను. పెద్దల ఆశీర్వాదం ఆయనకు ఎప్పుడు ఉంటుంది. నరేశ్ గారికి ఇద్దరు గురువులు. వారిలో ఒకరు జంధ్యాల అయితే.. మరొకరు విజయనిర్మల. ప్రతి రోజు గురువుగారిని తలచుకుంటారు. తన కుటుంబాన్ని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. దాదాపు 10 మందికి ఉండే ఎనర్జీ నరేశ్ గారికి ఉంటుంది. ఏపని చేసినా చాలా సిస్టమాటిక్గా చేస్తారు. యంగ్ డైరెక్టర్స్కు చాలా టైమ్ ఇస్తారు. వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. గతంలో వీరిద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీ చాలా వివాదానికి దారి తీసింది. అప్పట్లో నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం టాలీవుడ్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.Latest Visuals of Actor #VKNaresh along with #PavitraLokesh pic.twitter.com/39UnKTPV4e— Telugu Film Producers Council (@tfpcin) January 19, 2025#TFNExclusive: Visuals of Actor @ItsActorNaresh's birthday celebrations in Hyderabad!!🎊#Naresh #PavitraLokesh #TeluguFilmNagar pic.twitter.com/2kXbVEmaWr— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025
నిర్మాత లవ్ రిజెక్ట్ చేశా.. ఆ కోపంతో రైల్లో నుంచి తోసేయాలని..: దృశ్యం నటి
దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్ (Anjali Nair). తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. అంజలి మాట్లాడుతూ.. ఉన్నయే కాదలిప్పన్ (Unnaiye Kadhalipen) అనే తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నాకు ప్రపోజ్ చేశాడు. అతడు ఆ సినిమాను నిర్మించడంతో పాటు అందులో విలన్గానూ నటించాడు. తన ప్రపోజల్ను నేను తిరస్కరించాను. దాంతో అతడు నేను వేరే సినిమాకు వెళ్లినప్పుడు ఆ సెట్స్కు వచ్చి వేధింపులకు గురి చేశాడు.రైల్లో నుంచి నెట్టేయాలని..ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా వచ్చి నా బ్యాగు తీసుకున్నాడు. తిరిగిచ్చేయమని అతడిని వెంబడించినప్పుడు రైలు డోర్ దగ్గర నన్ను బయటకు నెట్టేయాలని చూశాడు. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్ చేసి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. నన్ను చూడాలని కలవరిస్తోందని చెప్పింది. అతడు ఇంట్లో ఉంటే రానని చెప్పాను. అందుకామె.. తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్లాండ్కు వెళ్లిపోయాడని, కంగారుపడాల్సినం అవసరం లేదని సర్ది చెప్పింది.కత్తితో బెదిరించి సంతకం..నిజమేననుకుని వెళ్లాను. నేను ఇంట్లో ఓ గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టారు. ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. కత్తితో బెదిరించడంతో సంతకం చేశాను. ఆ పేపర్లలో లవ్ లెటర్ కూడా ఉంది. తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి బయటపడ్డాను. అయితే అతడి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్గా నటించాలని కాంట్రాక్ట్ పేపర్పై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని అర్థమైంది.(చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!)అంత చెండాలంగా లెటర్ రాస్తారా?నేను సినిమా చేయనని చెప్పాను. ఆధారాలతో సహా అతడిపై కేసు పెట్టాను. అప్పుడు అతడు నేను రాసినట్లుగా లవ్ లెటర్స్ను సాక్ష్యంగా చూపించాడు. నేనొకటే అడిగా.. ప్రేమించే ఏ అమ్మాయైనా అంత చెండాలంగా లవ్ లెటర్ రాస్తుందా? అని ప్రశ్నించాను. ఆ కేసు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడు నాకు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది. సినిమాఅంజలి.. మలయాళంలో ద కింగ్ అండ్ ద కమిషనర్, 5 సుందరికల్, పట్టం పోలే, వెనిసిలె వ్యాపారి, ఏంజెల్స్, టమార్ పడార్, 100 డిగ్రీ సెల్సియస్, సెకండ్స్, సెంట్రల్ థియేటర్, లైలా ఓ లైలా, బెన్, దూరం, తీరం, ఆమి, దృశ్యం 2, మాన్స్టర్ సినిమాలు చేసింది. తమిళంలో ఇదువుమ్ కాదంధు పొగుం, నెల్లు, ఆగడు సినిమాలు చేసింది. ఇటీవలే చిత్తా(తెలుగులో చిన్నా) సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్రీయ అవార్డు గెలుచుకుంది. కాగా అంజలి దర్శకుడు అనీశ్ను 2011లో పెళ్లి చేసుకుంది. వీరికి అవని అనే కూతురు ఉంది. 2016లో అతడికి విడాకులు ఇచ్చింది. 2022లో అజిత్ రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు పుట్టింది.చదవండి: నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా!
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్పై అనిల్ రావిపూడి.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam Movie). ఈ మూవీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీమామ. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.200 కోట్లక దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ఇటీవల హైదరాబాద్లో సక్సెస్ మీట్ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.(ఇది చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!)అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. యాంకర్ సుమతో ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం -2 కథ అక్కడి నుంచే మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ సంక్రాంతికే వస్తామని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా చేసేందుకు స్పేస్ ఉందని.. రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి.. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మిరాకిల్తో మీ ముందుకు వస్తామని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అద్భుతంగా ఉందంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.ఓవర్సీస్లో రికార్డ్ వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. సంక్రాంతికి వస్తున్నాం 2 కథ అక్కడ మొదలవుతుంది - #AnilRavipudi#SankranthikiVasthunam#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary #TeluguFilmNagar pic.twitter.com/ekTYLB9cpQ— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025
నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా!
వైవిధ్యభరిత కథాచిత్రాలకు కేరాఫ్ అడ్రస్ పా.రంజిత్. చుట్టూ ఉన్న సామాజిక అంశాలనే కథావస్తువులుగా తీసుకుని సినిమా అనే శిల్పంగా చెక్కుతుంటాడు. ఈయన సినిమాలు డైరెక్ట్ చేయడంతో పాటు పలు సినిమాలను నిర్మిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లో బాటిల్ రాధ అనే సినిమా నిర్మిస్తున్నాడు. తాగుడుకు బానిసైన వ్యక్తి దాన్నుంచి ఎలా బయటపడ్డాడన్నదే కథ.పా.రంజిత్ ఎమోషనల్ఈ మూవీ ట్రైలర్ లాంచ్లో పా.రంజిత్ (Pa. Ranjith) తన గతాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తోంది. తినే తిండి కోసం మనం ఎవరిపైనా ఆధారపడకూడదు. మా నాన్న కూడా ఎప్పుడూ అలాంటి పరిస్థితి రానివ్వలేదు. ఏనాడూ మమ్మల్ని పస్తులుంచలేదు. మేము మంచి బట్టలు వేసుకోవాలని, బాగా చదువుకోవాలని చెప్తుండేవాడు. అందుకోసం ఎంతో కష్టపడేవాడు.(చదవండి: పిల్లలతో ఇదేం పని? టీఆర్పీ కోసం ఏదైనా చేయిస్తారా?)పండగరోజు అమ్మ ఏడుస్తూ..కానీ ఎప్పుడైతే తాగడం మొదలుపెట్టాడో తనను తానే కోల్పోయాడు. నాకు బాగా గుర్తుంది.. ఓ పండగరోజు ఊర్లోని అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మా ఇంట్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు నేను పన్నెండవ తరగతి చదువుతున్నాను. మా అమ్మ అలా నిత్యం ఏడుస్తుంటే చూడలేకపోయాను. తన బాధ భరించలేకపోయాను. చచ్చిపోదామనుకున్నాను. మా నాన్నతో మందు మాన్పించాలని అమ్మతో పాటు నా సోదరులు కూడా చాలా ప్రయత్నించారు.మద్యానికి బానిసై చనిపోయాడుచివరకు ఆస్పత్రిపాలయ్యాడు. ఆరు నెలలకంటే ఎక్కువ బతకడని చెప్పారు. కానీ వారం రోజుల్లోనే కన్నుమూశాడు. నాన్న.. మా అమ్మను కష్టపెట్టినట్లుగా నేను నా భార్యాపిల్లల్ని బాధ పెట్టకూడదని ఆరోజే నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. బాటిల్ రాధ సినిమా (Bottle Radha Movie) విషయానికి వస్తే.. దినకరణ్ శివలింగం డైరెక్ట్ చేసిన ఈ మూవీలో గురు సోమసుందరం, సంచన నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ జనవరి 24న విడుదల కానుంది.విభిన్న సినిమాల డైరెక్టర్పా.రంజిత్ విషయానికి వస్తే.. అట్టకత్తి సినిమాతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు. కార్తీతో మద్రాస్ మూవీ చేశాడు. రజనీకాంత్తో కబాలి, కాలా సినిమాలు చేశాడు. సార్పట్ట పరంపరై, నచ్చత్రం నగర్గిరదు మూవీస్ తెరకెక్కించిన ఈయన చివరగా తంగలాన్ చేశాడు. హిందీలోనూ నేరుగా ఓ సినిమా చేస్తానని గతేడాది ప్రకటించాడు. దీనికి బిర్సా ముండా అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశాడు. ఎవరీ బిర్సా ముండాబిర్సా ముండా ఆదివాసీ నాయకుడు. 19వ శతాబ్దంలో జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 22 ఏళ్ల వయసులోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా నామకరణం చేశారు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!
న్యూస్ పాడ్కాస్ట్
తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష... ఇళ్లు నిర్మించుకోనివారి స్థలాల కేటాయింపులు రద్దు
హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?... ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
మహా కుంభమేళాకు తరలివస్తున్న అశేష జనవాహిని.. రెండ్రోజుల్లో రెండున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
తిరుపతి తొక్కిసలాట ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపణ
తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం
హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ, శిక్షేమీ విధించడం లేదు... న్యూయార్క్ కోర్టు తీర్పు
ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనలో చంద్రబాబే మొదటి ముద్దాయి, తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
క్రీడలు
టీ20 వరల్డ్కప్లో బోణీ కొట్టిన భారత్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్-2025లో భారత్ బోణీ కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ను భారత బౌలర్లు 44 పరుగులకే (13.2 ఓవర్లలో) కుప్పకూల్చారు. పరుణిక సిసోడియా మూడు, ఆయుశి శుక్లా, జోషిత్ వీజే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముగ్గురు విండీస్ బ్యాటర్లు రనౌటయ్యారు. విండీస్ ఇన్నింగ్స్లో అసాబి ఖలందర్ (12), కేనిక కస్సార్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏకంగా ఐదుగురు విండీస్ బ్యాటర్లు డకౌటయ్యారు.45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష 4 పరుగులు చేసి ఔట్ కాగా.. జి కమలిని (16), సనికా ఛల్కే (18) భారత్ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్ క్లాక్స్టన్కు త్రిష వికెట్ దక్కింది. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో భారత్.. శ్రీలంక, మలేసియా, వెస్టిండీస్తో కలిసి గ్రూప్-ఏలో పోటీ పడుతుంది.గ్రూప్-ఏలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ జరిగింది. మలేసియాపై శ్రీలంక 139 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో దహామి సనేత్మ (55) అర్ద సెంచరీతో రాణించింది. 163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 23 పరుగులకే ఆలౌటైంది. మలేసియా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. లంక బౌలర్లలో చమోది ప్రబోద (4-2-5-3) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసింది. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది.
ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట తీవ్ర విషాదం
పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ (జనవరి 19) ఉదయం మనూ బాకర్ అమ్మమ్మ, మామ రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందారు. హర్యానాలోని చర్కీ దాద్రిలో గల మహేంద్రఘర్ బైపాస్ రోడ్డులో ఈ ఘటన సంభవించింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో స్కూటర్పై వెళ్తున్న మనూ బాకర్ అమ్మమ్మ, మామను బ్రీజా కారు ఢీకొంది. మానూ బాకర్ అమ్మమ్మ, మామ స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు.కాగా, మనూ బాకర్ రెండు రోజుల కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకుంది. మనూ బాకర్ గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మనూ.. ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది. పారిస్ ఒలింపిక్స్లో మనూ 10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం (సరబ్జోత్ సింగ్తో కలిసి) ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది.
విండీస్ స్పిన్నర్ మాయాజాలం.. 157 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 157 పరుగులకే కుప్పకూలింది. విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ ఏడు వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. మరో స్పిన్నర్ గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీశాడు. పాక్ ఇన్నింగ్స్లో ఇద్దరు (షాన్ మసూద్, ఖుర్రమ్ షెహజాద్) రనౌట్ అయ్యారు. షాన్ మసూద్ 52, ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని పాక్ విండీస్ ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో విండీస్ సైతం తడబడుతుంది. ఆ జట్టు 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ గెలవాలంటే మరో 221 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్(12), కీసీ కార్తీ (6) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (11), కవెమ్ హాడ్జ్ (0) క్రీజ్లో ఉన్నారు. సాజిద్ ఖాన్కు రెండు వికెట్లు దక్కాయి.అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 137 పరుగులకే కుప్పకూలింది. పాక్ స్పిన్నర్లు నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. వీరిద్దరు చివరి వికెట్కు 46 పరుగులు జోడించి విండీస్ పరువు కాపాడారు. లేకపోతే విండీస్ 100లోపే ఆలౌటయ్యేది. విండీస్ ఇన్నింగ్స్లో వీరితో పాటు బ్రాత్వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మికైల్ లూయిస్ 1, కీసీ కార్తీ 0, కవెమ్ హాడ్జ్ 4, అలిక్ అథనాజ్ 6, జస్టిన్ గ్రీవ్స్ 4, టెవిన్ ఇమ్లాచ్ 6 పరుగులు చేశారు.
రంజీల్లో ఆడనున్న రోహిత్, పంత్.. కోహ్లి, రాహుల్ దూరం
టీమిండియా ఆటగాళ్లంతా దేశవాలీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (పంజాబ్), స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (ముంబై), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు సిద్దమయ్యారు. ముంబై రంజీ జట్టు తరఫున తాను తర్వాతి మ్యాచ్ బరిలోకి దిగుతానని రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు. ఈ నెల 23నుంచి ముంబైలోనే జమ్ము కశ్మీర్తో జరిగే పోరులో అతను ఆడతాడు. గత 6–7 ఏళ్లలో తాము అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉండటం వల్ల దేశవాళీ మ్యాచ్లు ఆడలేకపోయామని, రంజీ ట్రోఫీ స్థాయిని తక్కువ చేయలేమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ పదేళ్ల క్రితం తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. 2015 సీజన్లో ఉత్తర్ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ 113 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేశాడు. గడిచిన 17 ఏళ్లలో రంజీ మ్యాచ్ ఆడనున్న తొలి భారత కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు.కోహ్లి, రాహుల్ దూరంమరో వైపు మెడ నొప్పితో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... తాను ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడలేనని స్పష్టం చేయగా... మోచేతి గాయంతో కేఎల్ రాహుల్ (కర్ణాటక) కూడా రంజీ పోరుకు దూరమయ్యాడు.ఢిల్లీ జట్టులో పంత్రంజీ ట్రోఫీ తదుపరి లీగ్ మ్యాచ్లు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ లెగ్ మ్యాచ్ల కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ 21 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషబ్ పంత్ పేరుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్లో సౌరాష్ట్రను ఢీకొంటుంది. ఢిల్లీ జట్టుకు ఆయుశ్ బదోని కెప్టెన్గా వ్యవహరిస్తాడు.ఢిల్లీ రంజీ జట్టు: ఆయుశ్ బదోని (కెప్టెన్), సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), జాంటీ సిద్ధూ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్వంశీ (వికెట్కీపర్), వైభవ్ కంద్పాల్, మయాంక్ గుస్సేన్ , గగన్ వాట్స్, ఆయుష్ దోసెజా, రౌనక్ వాఘేలా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోత్, జితేష్ సింగ్.
బిజినెస్
ఒక్కో ఫోన్లో ఒక్కోలా.. రైడ్ సంస్థల మాయాజాలం!
ఫుడ్, ట్రావెల్, కిరణా.. ఇలా అన్నింటికీ ఇప్పుడు ఆన్లైన్ యాప్లనే చాలా మంది వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రవాణా కోసం అనేక రైడ్ హెయిలింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి ధరలు ఒక్కో ఫోన్లో ఒక్కో రకంగా ఉంటున్నాయని, వేరు ధరలతో వినియోగదారులను మోసగిస్తున్నాయన్న ఆందోళనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఒక ఎంట్రప్రెన్యూర్ ఉబర్ (Uber) ధరల అల్గారిథమ్పై చేసిన ప్రయోగం రైడ్-హెయిలింగ్ సేవల్లో పారదర్శకత, నైతికత గురించి ఆన్లైన్లో చర్చకు దారితీసింది.టెక్కీలకు ప్లేస్మెంట్ సర్వీసులు అందించే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన ఇంజనీర్హబ్ వ్యవస్థాపకుడు రిషబ్ సింగ్ వివిధ ఫోన్లలో, వేరు వేరు బ్యాటరీ స్థాయిలలో ఉబర్ చార్జీలపై ధరలను పరీక్షించి ఆ ఫలితాలను స్క్రీన్ షాట్లతో సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఉబర్ ధరల వ్యత్యాసాన్ని పరీక్షించేందుకు రిషబ్ సింగ్ రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, రెండు ఐఫోన్లు వినియోగించారు. అన్నింటిలోనూ ఒకే ఉబర్ ఖాతాలోకి లాగిన్ అయ్యారు.ఒకే సమయంలో ఒకే విధమైన రైడ్లకు ఛార్జీలు ఎలా మారుతున్నాయో రిషబ్ సింగ్ గమనించారు.ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో ఛార్జీల వ్యత్యాసాలను రిషబ్ సింగ్ గమనించారు. డిస్కౌంట్లలోనూ తేడాలు కనిపించాయి. ఒక దాంట్లో 13% తగ్గింపు అని మరో దాంట్లో "50% తగ్గింపు"ను కంపెనీ పేర్కొంది. దీన్నిబట్టి పరికర ప్లాట్ఫామ్ ఆధారంగా ఉబర్ ధర భిన్నంగా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఒకే ఖాతా, లొకేషన్, సమయం ఒకే విధమైన షరతులు ఉన్నప్పటికీ ధరలు మారుతూ కనిపించాయని రిషబ్ సింగ్ పేర్కొన్నారు.బ్యాటరీ శాతం ప్రభావంపూర్తిగా ఛార్జ్ చేసిన ఫోన్లతో పోలిస్తే చార్జింగ్ తక్కువగా ఉన్న ఫోన్లో ఎక్కువ ఛార్జీలు కనిపించాయి. ఇది ప్రవర్తనా వ్యూహమని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు ఎక్కువ ఛార్జీలు చెల్లించే అవకాశం ఉంటుందని రిషబ్ వివరించారు. తక్కువ బ్యాటరీలు ఉన్న వినియోగదారులు అత్యవసరం కారణంగా అధిక ధరలను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉందని భావించే సిద్ధాంతానికి ఇది అనుగుణంగా ఉందని రాసుకొచ్చారు. దీనినే "బిహేవియరల్ ఎకనామిక్స్" అంటారని, బ్యాటరీ డేటాను తెలుసుకోవడం ద్వారా, ధరల అల్గారిథమ్లు వినియోగదారు పరిస్థితులను ఉపయోగించుకుంటాయని వివరించారు.ఈ ప్రయోగం ద్వారా రైడ్ కంపెనీల చార్జీల పారదర్శకత గురించి ఆందోళనలను ఆయన లేవనెత్తారు. ఛార్జీలను సర్దుబాటు చేయడానికి ఉబర్ అల్గారిథమ్లు ఫోన్ల రకం, బ్యాటరీ స్థాయి వంటి వినియోగదారు డేటాను ఉపయోగించుకుంటాయా అని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు కూడా ప్రతిస్పందించారు. రిషబ్ సింగ్ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు.
బ్లేడ్ బ్యాటరీ బస్సు.. బుల్లి కారు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో (Bharat mobility expo 2025)వివిధ కంపెనీల నుంచి నూతన ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరాయి. వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ ఆటో భారత్కు ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. వీఎఫ్–7, వీఎఫ్–6 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరినాటికి వీటిని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రం స్థాపించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది రెండవ అర్ద భాగంలో ఈ ప్లాంటు రెడీ అవుతుందని విన్ఫాస్ట్ ఆసియా సీఈవో పామ్ సాన్ ఛావ్ తెలిపారు.హ్యుండై టీవీఎస్ జోడీహ్యుండై మోటార్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీ చేతులు కలిపాయి. అధునాతన ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లు, చిన్న ఫోర్–వీలర్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని అన్వేషించనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా హ్యుండై తన మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఈవీలను ఆవిష్కరించింది. ఈ భాగస్వామ్యం కార్యరూపం దాలిస్తే డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని హ్యుండై యోచిస్తోంది. అయితే భారత్లో ఈ వాహనాల తయారీ, మార్కెటింగ్పై టీవీఎస్ దృష్టి పెడుతుంది.కొలువుదీరిన ఎంజీ మోడళ్లుజేఎస్డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా మజెస్టర్ పేరుతో మధ్యస్థాయి ఎస్యూవీని ఆవిష్కరించింది. కాంపాక్ట్ కార్స్ కంటే పెద్దగా, పూర్తి స్థాయి కార్స్ కంటే చిన్నగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఐఎం5, ఐఎం6, ఎంజీ హెచ్ఎస్, ఎంజీ7 ట్రోఫీ ఎడిషన్ మోడళ్లను సైతం కంపెనీ ప్రదర్శించింది. మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త మోడళ్లుమురుగప్ప గ్రూప్ కంపెనీ మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త వాహనాలను లాంచ్ చేసింది. ఈవియేటర్ పేరుతో చిన్న తరహా వాణిజ్య వాహనాన్ని, సూపర్ కార్గో పేరుతో త్రీవీలర్ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్తో ఈవియేటర్ 245 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.15.99 లక్షలు. సూపర్ కార్గో ఈ–త్రీవీలర్ 200 కిలోమీటర్లపైగా పరుగెడుతుంది. పూర్తి ఛార్జింగ్ కోసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.4.37 లక్షలు. కంపెనీ 55 టన్నుల హెవీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ రైనో సైతం ప్రదర్శించింది. బీవైడీ సీలయన్–7..చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ భారత్లో సీలయన్–7 కూపే–ఎస్యూవీ ఆవిష్కరించింది. కంపెనీ నుంచి ఇది భారత మార్కెట్లో నాల్గవ మోడల్గా నిలవనుంది. 82.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్నుబట్టి 542–567 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పర్ఫామెన్స్ వేరియంట్ 4.5 సెకన్లలో, ప్రీమియం వేరియంట్ 6.7 సెకన్లలో అందుకుంటుంది.ఒలెక్ట్రా బ్లేడ్ బ్యాటరీ ఛాసీ..హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా 12 మీటర్ల పొడవున్న బ్లేడ్ బ్యాటరీ ఛాసీని ఆవిష్కరించింది. 9 మీటర్ల పొడవున్న సిటీ బస్, 12 మీటర్ల పొడవుతో కోచ్ బస్ సైతం ప్రదర్శించింది. బ్లేడ్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి 2,200లకుపైగా యూనిట్ల ఎలక్ట్రిక్ బస్లను సరఫరా చేసి ప్రజా రవాణా రూపు రేఖలను మార్చినట్టు ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. అశోక్ లేలాండ్ సాథీవాణిజ్య వాహనాలు, బస్ల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ సాథి పేరుతో తేలికపాటి చిన్న వాణిజ్య వాహనాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఎల్ఎన్టీ సాంకేతికతతో తయారైంది. 45 హెచ్పీ పవర్, 110 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 1,120 కిలోల బరువు మోయగలదు. ధర రూ.6.49 లక్షలు. అలాగే మల్టీ యాక్సెల్, ఫ్రంట్ ఇంజన్, 15 మీటర్ల పొడవున్న గరుడ్–15 ప్రీమియం బస్ సైతం కొలువుదీరింది. 42 స్లీపర్ బెర్తులను ఈ బస్లో ఏర్పాటు చేశారు. కాగా, ఈ–టిరాన్ పేరుతో ఎలక్ట్రిక్ పోర్ట్ టెర్మినల్ ట్రాక్టర్ను సైతం కంపెనీ ఆవిష్కరించింది. మైక్రో మొబిలిటీతో బజాజ్?స్విట్జర్లాండ్కు చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్లో వాటాను కొనుగోలు చేయడంతో సహా ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిళ్లను ఉత్పత్తి, ఎగుమతి చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం బజాజ్ ఆటో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మైక్రోలీనో పేరుతో రెండు సీట్ల ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ను, అలాగే మైక్రోలెటా పేరుతో మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ను మైక్రో మొబిలిటీ తయారు చేస్తోంది. నగరాల్లో తక్కువ దూరం ప్రయాణానికి అనువైన వాహనాల తయారీలో మైక్రో మొబిలిటీ సిస్టమ్స్కు పేరుంది.జేబీఎం ఎలక్ట్రిక్ కొత్త వాహనాలుజేబీఎం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్పో వేదికగా గెలాక్సీ లగ్జరీ కోచ్, ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ బస్, లో ఫ్లోర్ మెడికల్ మొబైల్ యూనిట్ ఈ–మెడిలైఫ్, దేశంలో తొలిసారిగా 9 మీటర్ల పొడవున్న టార్మాక్ కోచ్ ఈ–స్కైలైఫ్ను విడుదల చేసింది. లిథియం–అయాన్ బ్యాటరీలు కలిగిన ఈ వాహనాలకు ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. ఇప్పటికే కంపెనీ భారత్తోపాటు యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో 1,800 ఎలక్ట్రిక్ బస్లను విక్రయించింది. 10,000 పైచిలుకు ఈ–బస్లకు ఆర్డర్ బుక్ ఉందని జేబీఎం గ్రూప్ వైస్ చైర్మన్ నిశాంత్ ఆర్య తెలిపారు.
బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?
తదుపరి పార్లమెంటు బడ్జెట్ (Budget) సెషన్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (new income tax bill) ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సులభ తరం, అర్థమయ్యేలా చేస్తుందని, అలాగే పేజీల సంఖ్యను 60% తగ్గిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.‘ఇది కొత్త చట్టం. ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ముసాయి దా చట్టాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీ లిస్తోంది. దీనిని బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని తెలిపాయి. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం–1961ని ఆరు నెల ల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.బడ్జెట్ సెషన్ జనవరి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. మొదటి అర్ధభాగం (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. 2025-26కి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.పార్లమెంటు మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఐటీ చట్టం 1961 సమగ్ర సమీక్ష కోసం సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రకటన మేరకు సమీక్షను పర్యవేక్షించడానికి, చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అంతర్గత కమిటీని సీబీడీటీ ఏర్పాటు చేసింది. అలాగే చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 ప్రత్యేక సబ్కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
విశాలమైన ఇళ్ల కొనుగోలు.. టైర్–2 జోరు
కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ (Work form Home) నేటికీ కొనసాగుతుండటంతో ‘టైర్–2’ (tier 2 cities) ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపు తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబై లోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్కే, ఆపై పడక గదుల గృహాల్లో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది.ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని అంచనా వేసింది.
ఫ్యామిలీ
అచ్చం రాజమౌళి మూవీ 'ఈగ' లాంటి చీమ..!
రాజమౌళి ‘ఈగ’కు ఎన్ని శక్తులు ఉన్నాయో, అన్ని శక్తులూ ఉన్నాయి ఫొటోలోని ఈ చీమకు. కందిరీగ జాతికి చెందిన దీని పేరు ‘ట్రామాటోముటిల్లా బైఫర్కా’. మృదువైన వెంట్రుకల కారణంగా దీనిని బ్రెజిలియన్ వెల్వెట్ చీమ అని కూడా అంటారు. లక్షన్నర జాతుల చీమలు, కందిరీగలు, ఈగలు, తేనెటీగల కంటే కారునలుపులో ఉంటుందిది. ఇది ప్రపంచంలోనే అత్యంత కారునలుపు చీమ, అత్యంత తీవ్రమైన నొప్పి పుట్టించే చీమ కూడా ఇదే! ఈ మధ్యనే దీని బాహ్య నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ‘బీల్స్టెయిన్ జర్నల్ ఆఫ్ నానోటెక్నాలజీ’ అధ్యయనం ప్రకారం ఈ చీమకు మెలనిన్తోపాటు, సూపర్ డార్క్ కలరింగ్ ప్లేట్లెట్లు ఎక్కువ. వీటి కారణంగానే దాని శరీరం ఉపరితలంపై పడిన కాంతితో 0.5 శాతం కంటే తక్కువ పరావర్తనం చెందుతుంది. ఈ చీమకు అతినీలలోహిత కాంతిని కూడా గ్రహించే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వంటగది ఇంటీరియర్ డిజైన్..!)
నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చినట్లు ఉంటా!
సానియా అయ్యప్పన్.. నర్తకిగా అడుగుపెట్టి నటిగా స్థిరపడింది. తన అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. అవార్డులనూ అందుకుంది. ఆమె గురించి కొన్ని విషయాలు..⇒చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది.. సూపర్ డాన్సర్ అనే రియాలిటీ షో విన్నర్గా! తర్వాత ఢీ2, ఢీ4 షోల్లోనూ పాల్గొని పాపులారిటీతోపాటు సినీ అవకాశాన్నీ అందుకుంది.⇒సానియా అయ్యప్పన్ సొంతూరు కేరళలోని కోచ్చి. నలంద పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.⇒‘బాల్యకాలసఖి’ మలయాళ చిత్రంతో బాలనటిగా ఎంటరై, ‘క్వీన్’తో హీరోయిన్గా మారింది. ఈ చిత్రం ఆమెకు బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్గా ‘ఫిల్మ్ఫేర్’, ‘వనిత ఫిల్మ్ అవార్డ్స్’ ను తెచ్చిపెట్టింది. తర్వాత మోహన్లాల్ నటించిన ‘లూసిఫర్’లో నటించి, ఉత్తమ సహాయ నటిగా ‘సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్’ను గెలుచుకుంది. అటుపై వచ్చిన ‘ద ప్రీస్ట్’, ‘ప్రేతమ్ 2’, ‘సెల్యూట్’, ‘సాటర్డే నైట్’ వంటి పలు సినిమాల్లో మాత్రం అతిథి పాత్రకే పరిమితమైంది.స్క్రిప్ట్ను నమ్మి చేసిన ‘కృష్ణన్కుట్టి పని తుడంగి’ హారర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ‘ఇరుగప్పట్రు’, ‘సొర్గవాసల్’లు కూడా ఫీల్గుడ్ మూవీస్గా మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఈ రెండూ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నాయి.⇒ చేతినిండా అవకాశాల కంటే గుర్తుండిపోయే పాత్రలతోనే మెప్పించాలని కొంత గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్లో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, ‘బిలవ్డ్’ ‘స్ట్రింగ్స్’ అనే షార్ట్ ఫిల్మ్స్లో నటించింది.⇒ నెగటివ్ కామెంట్స్ను పట్టించుకోను. అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను. కొడతాను కూడా. నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చిన ట్లు ఉంటా!– సానియా అయ్యప్పన్
చిన్నారుల నోట్లో పుండ్లు?
కొంతమంది పిల్లల్లో నోట్లో, నాలుక మీద, గొంతు లోపల తరచూ పుండ్లలా వస్తుంటాయి. చిన్నారుల్లో ఈ సమస్య కనిపించినప్పుడు నొప్పితో బాధపడటం, నోరూ, గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటిలా ఎర్రబారడమూ జరుగుతుంది. ఏమీ తినలేక సన్నబడతారు. ఇలా వచ్చే పుండ్లను వైద్యపరిభాషలో ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. కారణాలు: ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. ఉదా... నోట్లో గాయాలు కావడం (బ్రషింగ్ వల్ల, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని అబ్రేసివ్ ఆహారపదార్థాల వల్ల గాయాలవుతుంటాయి) విటమిన్లు, పోషకాల లోపం... (ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) అనేక కారణాలతో నీరసించిపోవడం (ఫెటీగ్) వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం సరిపడకపోవడం, తరచూ జ్వరాలు... వంటి అనేక శారీరక సమస్యలతోపాటు మానసికంగా ఉద్వేగ పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల కూడా పిల్లల్లో ఈ తరహా పుండ్లు (మౌత్ అల్సర్స్) కనిపించవచ్చు.చికిత్స / మేనేజ్మెంట్: నోట్లో పుండ్లు పడ్డ పిల్లలకు బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్లు; పోషకాహార లోపం వల్ల సమస్య వస్తే వాళ్లలో విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా మౌత్ అల్సర్స్ కనిపించినప్పుడు పీడియాట్రీషియన్ లేదా డెంటల్ నిపుణులను సంప్రదించాలి.
కేన్సర్ కాటు..? వద్దు కుంగుబాటు
కేన్సర్ బాధితుల ఎదుట రెండు సవాళ్లు ఉంటాయి. మనోబలంతో కేన్సర్ను ఎదుర్కోవడం మొదటిదైతే... ఇక రెండోది... కేన్సర్ చికిత్స కారణంగా తమలో ఉండే విపరీతమైన నీరసం, తీవ్రమైన నిస్సత్తువలను అధిగమించడం.ముఖ్యంగా కీమోథెరపీ తీసుకునేవాళ్లలో ఈ నీరసం, నిస్సత్తువ చాలా ఎక్కువ. తమకు కేన్సర్ వచ్చిందని తెలియగానే బాధితులు కుంగిపోతారు. ఆపైన ఏ పనీ చేయనివ్వని తమ నీరసం మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. వాళ్లలో కలిగే ఈ నీరసాన్ని ‘కేన్సర్ ఫెటీగ్’గా చెబుతారు. రూన్సర్పై తమ పోరాటానికి తోడు ఈ నీరసం, నిస్సత్తువలపై పోరాటమే మరింత పెద్ద సవాలుగా మారుతుంది. ఈ ‘కేన్సర్ ఫెటీగ్’ ఎందుకు వస్తుంది, దాన్ని అధిగమించడమెలా అనే అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.కేన్సర్కు చికిత్స తీసుకుంటున్న చాలామంది తమలోని నీరసం, బలహీనతల కారణంగా రోజువారీ పనులను సమర్థంగా చేసుకోలేరు. దాంతో జీవితం చాలా నిస్సారం గా అనిపించడం, జీవితాన్ని ఆస్వాదించలేక΄ోవడంతో కుంగుబాటు (డిప్రెషన్)కు గురవుతారు. ఈ నీరసాలూ, నిస్సత్తువలకు అనేక అంశాలు కారణమవుతాయి. కొంత కృషి చేస్తే దీన్ని అధిగమించడం అంత కష్టం కాదు. కానీ తమ జబ్బు, కుంగుబాటు కారణంగా తామీ ‘ఫెటీగ్’ను అధిగమించగలమనే ఆత్మవిశ్వాసాన్ని చాలామంది కోల్పోతారు. కాస్తంత కృషితోనే నీరసాలను జయించడం అంత కష్టమేమీ కాదు. తొలుత ఈ ‘ఫెటీగ్’కు కారణమయ్యే అంశాలేమిటో చూద్దాం...కారణాలు... రక్తహీనత (అనీమియా) : కేన్సర్ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, నిస్సత్తువలకు ‘అనీమియా’ ఓ ముఖ్యమైన కారణం. సాధారణంగా క్యాన్సర్ బాధితుల్లో, అందునా మరీ ముఖ్యంగా బ్లడ్క్యాన్సర్ బాధితుల్లో ఎముక మూలుగ దెబ్బతినడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తీ, వాటి సంఖ్యా తగ్గుతాయి. ఈ ఎర్రరక్తకణాలే శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్ అందజేస్తాయన్న సంగతి తెలిసిందే. ఇవి తగ్గడంతో దేహంలోని కణాలకు అవసరమైన ΄ోషకాలూ, ఆక్సిజన్ కూడా తగ్గి బాధితుల్లో నీరసం కనిపిస్తుంది. విషాలు (టాక్సిన్స్) బయటకు వెళ్లకపోవడం: ఎర్రరక్తకణాలు దేహంలోని కణాలకు ఆక్సిజన్ను అందించడంతో పాటు జీవక్రియల కారణంగా అక్కడ ఏర్పడ్డ కార్బన్ డై ఆక్సైడ్, ఇతర విషపదార్థాల (టాక్సిన్స్)ను బయటకు పంపడానికి సహాయపడతాయి. అయితే ఎర్రరక్తకణాలు తగ్గడంతో బయటకు విసర్జితం కావాల్సిన విషపదార్థాలూ పోవాల్సినంతగా బయటకు వెళ్లవు. దేహంలో ఉండిపోయిన ఈ టాక్సిన్స్... ఇతర జీవక్రియలకూ అంతరాయం కలిగిస్తుంటాయి. ఫలితంగా బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడి వాళ్లు తీవ్రమైన అలసటతో ఉన్నట్లుగా కనిపిస్తుంటారు.చికిత్సల కారణంగా: చాలా సందర్భాల్లో బాధితులు తీసుకునే కీమో, రేడియోథెరపీ వంటి చికిత్సల వల్ల, అలాగే బోన్ మ్యారో క్యాన్సర్ బాధితులకు అందించే మందుల కారణంగా తీవ్రమైన నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ మందులు నిజానికి క్యాన్సర్ కణాలను నశింపజేయల్సి ఉంటుంది. కానీ ఈ క్రమంలో అవి ఆరోగ్యవంతమైన కణాలనూ ఎంతోకొంత దెబ్బతీస్తుంటాయి. ఇలా ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతిని నశించిపోవడంతో కేన్సర్ బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. ఇక కీమో తీసుకుంటున్నవారిలో దేహం చాలా వేడిగా ఉన్నట్లు అనిపించడం, ఒంట్లోంచి వేడి బయటకు వస్తున్న ఫీలింగ్తో నిద్రాభంగం అవుతుండటం, నిద్రలో అంతరాయాలు, ఆకలి తగ్గినట్లుగా ఉండటంతో సరిగా భోజనం తీసుకోక΄ోవడం వంటి అంశాలు కూడా నీరసం, నిస్సత్తువ (ఫెటీగ్)కు కారణమవుతాయి.ఫెటీగ్ను అధిగమించడమిలా... తినాలని మనస్కరించక΄ోయినా వేళకు పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, మెల్లమెల్లగా వ్యాయామాలకు ఉపక్రమించి, క్రమబద్ధంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం... మనసు ఇచ్చగించకపోయినప్పటికీ ఇలాంటివి క్రమం తప్పకుండా చేస్తూ చురుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తే ‘కేన్సర్ ఫెటీగ్’ సమస్యను సులువుగానే అధిగమించవచ్చు. ఇలాంటి వ్యాయామాలతో ఎండార్ఫిన్స్ అనే రసాయనాల స్రావాల వల్ల సంతోషం పెరగడం, దాంతో క్రమంగా చురుగ్గా ఉండటం సాధ్యమవుతాయి. న్యూట్రిషన్ కౌన్సెలింగ్: క్యాన్సర్ బాధితులు ఆహారం సరిగా తీసుకోక΄ోవడంతో బరువు కోల్పోయి... సన్నబడతారు. ఆకలి లేక΄ోవడం, కుంగుబాటు (డిప్రెషన్), మందుల వల్ల కలిగే వికారం వంటివి వారిని సరిగా తిననివ్వవు. దాంతో దేహానికి అవసరమైన పోషకాలు అందక΄ోవడంతో సన్నబడి నీరసించిపోతారు. బాధితుల నోటికి రుచిగా ఉండేలాంటి ఆహారాల తయారీ, అవసరమైన పోషకాలు అందడానికి తీసుకోవాల్సిన పదార్థాల వంటివి తెలుసుకోడానికి ‘న్యూట్రిషనిస్ట్ / డైటీషియన్’ను సంప్రదించాలి. విశ్రాంతి : రోజులో తగినంత చురుగ్గా ఉండటంతోపాటు తగినంత విశ్రాంతి తీసుకోవడమూ అవసరమే. ఈ విశ్రాంతి తమ శక్తిసామర్థ్యాలను మరింత శక్తి పుంజుకుని మళ్లీ క్రీయాశీలం కావడానికి ఉపయోగపడుతుందని బాధితులు గ్రహించాలి. ఇతర విషయాలపైకి దృష్టి మళ్లించడం (డిస్ట్రాక్షన్): ఎప్పుడూ వ్యాధి గురించే ఆలోచించకుండా... తమ దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించాలి. మంచి పుస్తకాలు చదవడం, హాస్యభరితమైన, వినోదాత్మకమైన సినిమాలు చూడటం, ఫ్రెండ్స్తో మాట్లాడుతుండటం, సమయాన్ని సరదాగా గడపడం వంటి వాటితో జబ్బునుంచి దృష్టిమళ్లించగలిగితే ఇది కూడా ఫెటీగ్ను అధిగమించడానికి తోడ్పడుతుంది. కంటి నిండా నిద్ర : క్యాన్సర్ బాధితుల్లో చాలామందికి నిద్రపట్టడం కష్టమై తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దాంతో మరింత నిస్సత్తువగా అనిపిస్తుంటుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి ప్రక్రియల ద్వారా బాధితులు ఈ సమస్యను అధిగ మించవచ్చు. అలాగే కాఫీ లేదా కెఫిన్ ఉండే ద్రవాహారాలను తగ్గించడం కూడా మంచిదే. చిన్నపాటి కునుకు తీయడం, మధ్యాహ్నం కాసేపు ఓ పవర్న్యాప్ వంటి వాటితోపాటు వేళకు పెందలాడే నిద్రించి పెందలాడే లేవడం లాంటి మంచి నిద్ర అలవాట్లతో నిద్ర సమస్యను తేలిగ్గానే అధిగమించవచ్చు. అలాగే మంచి నిద్ర కోసం చీకటిగా ఉండే గది (డార్క్ రూమ్) లో నిద్ర΄ోవడంతో గాఢంగా నిద్రపట్టి నిద్ర సమస్యలు దూరమయ్యే అవకాశముంది. అప్పటికీ నిద్రపట్టనివాళ్లలో డాక్టర్లు ‘మెలటోనిన్’ సప్లిమెంట్లు ఇవ్వడం వంటి (ముఖ్యంగా కీమోధెరపీ తీసుకునే బాధితులకు) జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరాన్ని బట్టి మందులు: బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఎక్కువగా ఉన్నప్పుడు కారణాలను బట్టి డాక్టర్లు వారికి కొన్ని మందుల్ని సూచిస్తారు. ఉదాహరణకు రక్తహీనత ఉన్నవారికి ఐరన్ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర సప్లిమెంట్లు, మానసిక సమస్యలను బట్టి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి మందులు ఇస్తారు. కేన్సర్ ఫెటీగ్తో బాధపడుతున్నవారు పై సూచనలు పాటిస్తే తమంతట తామే సమస్యలను అధిగమించవచ్చు. కుదరకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవచ్చు. కేన్సర్ ఫెటీగ్ అధిమించలేని సమస్యేమీ కాదని గ్రహించడం అన్నిటికంటే ముఖ్యం.డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్
ఫొటోలు
Neeraj Chopra Marriage : పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. ఫోటోలు వైరల్
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
దిగ్గజ కంపెనీలన్నీ ఒకేచోట: అబ్బురపరుస్తున్న కొత్త వెహికల్స్ (ఫోటోలు)
kiara Advani: భర్తతో గేమ్ ఛేంజర్ బ్యూటీ వెకేషన్ (ఫోటోలు)
ఫ్లాప్స్, ట్రోలింగ్తో డిప్రెషన్లో.. ఇప్పుడు వరుస హిట్స్తో దూకుడు (ఫోటోలు)
ప్రపంచం చూపు.. ప్రయాగ్రాజ్ వైపు.. మహా కుంభమేళా చిత్రాలు
అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను.. కొడతాను (ఫొటోలు)
20 ఏళ్ల తర్వాత తెలుగులో సినిమా.. బెస్ట్ మూవీ అవార్డ్ అందుకున్న హీరోయిన్ (ఫొటోలు)
విశాఖపట్నం : కైలాసగిరి..సందడే సందడి (ఫొటోలు)
చంపేంత కోపం.. చచ్చేంత ప్రేమ.. పుకార్లకు ఒబామా దంపతుల ఫుల్స్టాప్ (ఫొటోలు)
National View all
సంస్కృతి సంప్రదాయం మహాసమ్మేళనం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం...
రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
గువహతి:కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్(Con
అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
బెంగళూరు: ‘ మీర
కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ
International View all
వచ్చే 10 ఏళ్లలో ప్రపంచానికి అతి పెద్ద ముప్పు ఏంటో తెలుసా?
ఈ ప్రపంచం వచ్చే రెండేళ్లలో, అలాగే వచ్చే పదేళ్లలో ఎదుర్కొనే అతి పెద్ద ముప్పు (Global Risk) ఏమిటి?
గాజా ఒప్పందం ఆలస్యం!.. హమాస్కు ఇజ్రాయెల్ వార్నింగ్!
జెరుసలేం : గాజాలో శాంతి ఒప్పందం వేళ ఇజ్రాయెల్ సైన్యం హమాస్
ట్రంప్ అధ్యక్ష పట్టాభిషేకం.. ఈ విశేషాలు తెలుసా?
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్హౌజ్లో అడుగుపె
భారత్లో ట్రంప్ పర్యటన.. ఎప్పుడంటే?
వాషింగ్టన్ : అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారానికి మ
పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 70 మంది మృతి
అబుజా : నైజీరియా ( Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది.
NRI View all
హెచ్-1బీ వీసా కొత్త రూల్స్ : వాళ్లకి నష్టం, భారతీయులకు ఇష్టం!
హెచ్-1బీ వీసాలకు సంబంధించిన కొత్త నియమాలు ఈ రోజు (జనవరి 17, 2025) అమల్లోకి వస్తాయి.
వైట్హౌస్ కేసు.. సాయివర్షిత్కు 8 ఏళ్ల జైలు శిక్ష
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్పై దాడికి యత్నించిన భారత సంతతి యువకుడు కందుల సాయివర్షిత్కు శిక్ష ఖరారైంది.
13 ఏళ్లకే రెండు శతకాలు రాసిన సంకీర్త్
తెలుగు పదాలను, పద్యాలను సరిగా పలకలేని విద్యార్ధులు ఉన్న ఈ తరంలో 13 ఏళ్ల వయసులోనే జనార్ద, శ్రీనరసింహ శతకాలను రాసి చ
తెలుగు, సాహితీ ప్రియులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!
తానా సంస్థ సాహిత్యవిభాగంగా మే, 2020 న ఆవిర్భవించిన “తానా ప్రపంచసాహిత్య వేదిక ‘నెలానెలా తెలుగువెలుగు’ పేరిట విభిన్న సాహిత
Sankranti 2025 : జపాన్లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు.
క్రైమ్
పల్లగిరిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
పల్లగిరి(ఎన్టీఆర్ జిల్లా): ఏపీలో రోజు రోజుకు హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. విద్వేషమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు దుండగులు. నందిగామ నియోజకవర్గం పల్లగిరిలో వైఎస్సార్ీపీ కార్యకర్త దారుణంగా హత్యగావించబడ్డాడు. శనివారం నాగుల్ మీరా అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు దుండగులు.నాగుల్ మీరాను హతమార్చి ఊరి బయట నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ విషాద ఘటన సమాచారాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు.. నాగుల్ మీరా మృతదేహాన్ని పరిశీలించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారాయన.
దుండగుడి కోసం వేట
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా 35 పోలీసు బృందాలు ఆగంతకుడి కోసం గాలిస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దర్యాప్తుపై హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి. దుండగుడిని త్వరలో వారు పట్టుకుంటారు’అని తెలిపారు. ఇందుకు సంబంధించి వారిస్ అలీ సల్మానీ అనే ఓ కార్పెంటర్ను ప్రశ్నిస్తున్నట్లు అంతకుముందు ముంబై పోలీసులు ప్రకటించారు. ఘటనకు ముందు రెండు రోజులపాటు అతడు సైఫ్ ఫ్లాట్లోనే పనులు చేశాడన్నారు. విచారణ అనంతరం అతడికి దాడితో సంబంధం లేదని తేలడంతో వదిలేశామన్నారు. ఆగంతకుడికి ఎలాంటి నేర ముఠాలతోనూ సంబంధం లేదని అందిన ఆధారాలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని బట్టి అతడు 1.37 గంటల సమయంలో మెట్ల ద్వారా ఇంట్లోకి చేరుకున్నట్లు వెల్లడైందన్నారు. అతడుదొంగతనానికి వెళ్లింది సైఫ్ ఇంట్లోకి అనే విషయం కూడా అతడికి తెలిసుండకపోవచ్చని చెప్పారు. కాగా, సైఫ్పై దాడి ఘటనతో అండర్ వరల్డ్ గ్యాంగ్లకు సంబంధం లేదని మహారాష్ట్ర హోం శాఖ ఉప మంత్రి యోగేశ్ కదమ్ స్పష్టం చేశారు. బెదిరింపులు వచ్చినట్లుగా సైఫ్ అలీ ఖాన్ సైతం ఎన్నడూ పోలీసులకు చెప్పలేదని, భద్రత కల్పించాలని కోరలేదని కూడా మంత్రి తెలిపారు. ఆయన అడిగితే భద్రత నిబంధనల మేరకు కలి్పంచి ఉండేవారమన్నారు. దాడి ఘటనకు చోరీ యత్నం మాత్రమే కారణమని వివరించారు. ఇలా ఉండగా, సైఫ్ ఇంట్లో చోరీకి యతి్నంచిన దుండగుడే ఈ నెల 14వ తేదీన బాలీవుడ్ మరో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ కోలుకుంటున్నారు: ఆస్పత్రి వర్గాలు తీవ్ర కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆయన కొద్దిసేపు నడిచారని, వెన్నెముకకు తీవ్ర గాయమైనందున బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించామని పేర్కొంది. ఆయనకు ఎలాంటి సమస్యా లేకుంటే మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే చెప్పారు. ‘ఓ వైపు రక్తమోడుతూనే ఆయన ఆస్పత్రి లోపలికి సింహంలా నడుచుకుంటూ వచ్చారు. పక్కన కుమారుడు ఆరేడేళ్ల తైమూర్ మాత్రమే ఉన్నాడు’’ అంటూ గురువారం వేకువజామున సైఫ్ చూపిన గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు డాక్టర్ డాంగే. నేను, సైఫ్ అలీ ఖాన్.. గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో రక్తంతో తడిచిన కుర్తాతో తాను తీసుకెళ్లిన వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ అనే విషయం లీలావతి ఆస్పత్రికి వెళ్లేదాకా తనకు తెలియదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు. ఆస్పత్రి గేటు వద్దకు వెళ్లాక అక్కడి గార్డుతో.. స్ట్రెచర్ తీసుకురా, నేను..సైఫ్ అలీ ఖాన్ను అని ఆయన చెప్పాకనే ఆ విషయం తెలిసిందని రాణా శుక్రవారం ముంబైలో మీడియాకు తెలిపారు. ‘సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్టుమెంట్ సమీపం నుంచి వెళ్తుండగా ఒక మహిళ, మరికొందరు తన ఆటోను ఆపారు. అనంతరం రక్తంతో తడిచిన కుర్తాతో ఓ వ్యక్తి ఆటోలో కూర్చున్నారు. ఆయనతోపాటు 8 ఏళ్ల బాలుడు, ఓ యువకుడు, మహిళ కూర్చున్నారు. మొదట వాళ్లు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. కానీ, సైఫ్ లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో, అక్కడికే ఆటోను పోనిచ్చాను. అక్కడికెళ్లాక సైఫ్ ఆస్పత్రి గేట్ వద్ద గార్డును పిలిచారు. దయచేసి స్ట్రెచర్ తీసుకురా..నేను, సైఫ్ అలీ ఖాన్ అని అన్నారు. అప్పుడు సమయం దాదాపు మూడైంది. ఏడెనిమిది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాం’అని రాణా వివరించారు. అప్పటి దాకా ఆయన సైఫ్ అలీ ఖాన్ అనే సంగతి గమనించలేదని చెప్పారు.
బిహార్ గ్యాంగ్ పనేనా?
సాక్షి, హైదరాబాద్ : బీదర్లో డబ్బు దోచుకోవడానికి.. పట్టుబడతామనే భయంతో అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన దుండగులు బిహార్కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిని బిహార్కు చెందిన పాతనేరగాడు మనీశ్కుష్వాడగా గుర్తించినట్టు తెలిసింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఉదంతాల్లో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా, శుక్రవారం తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, బిహార్ల్లో గాలిస్తున్నా యి. మరోపక్క కర్ణాటక పోలీసులు నగరానికి చేరుకొని కేసు దర్యాప్తులో పాలుపంచుకున్నారు. ఆటోలో ఎంజీబీఎస్ వైపు నుంచి ..: బీదర్లో దుండగులిద్దరూ ‘ఏపీ’రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బైక్పై రూ.93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకొని ఉడాయించారు. అక్కడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చి మార్గమధ్యలో ఆ డబ్బును బ్యాగ్లోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని ßæనుమాన్ టెంపుల్ వద్ద గల సీసీ ఫుటేజీల్లో దుండగులు కనిపించారు. సుల్తాన్పూర్, డప్పూర్, హత్నూర్, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ వెళ్లారు. అయితే ఆ డబ్బా, బైక్ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తేలలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని, మరొకరు బ్యాక్ ప్యాక్ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఈ ద్వయం ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఫోన్ నంబర్ ఇచ్చి... రాయ్పూర్ వెళ్లడానికి అమిత్కుమార్ పేరుతో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ సెల్నంబర్ ఇచ్చారు. బస్సు, సీట్ల నంబర్లు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని, సరిచూసుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగుడు తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గం, మార్గమ«ధ్యలో దాని స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మదీనాలో రెండు బ్యాగ్స్ ఖరీదు.... రూ.93 లక్షలతో కూడిన బ్యాగ్ను చేత్తో పట్టుకొని మోయడం కష్టంగా ఉండటంతో ట్రాలీ బ్యాగ్ ఖరీదు చేయాలని భావించారు. అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగారు. మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా, అక్కడకు వెళ్లి రెండు ట్రాలీ బ్యాగ్స్ ఖరీదు చేశారు. మూసీనది సమీపంలో లేదా పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి పెద్ద బ్యాగ్లో ఉన్న నగదును ఓ ట్రాలీలోకి మార్చారు. మరో దాంట్లో కొన్ని వ్రస్తాలతోపాటు హెల్మెట్ పెట్టారు. బ్యాక్ ప్యాక్లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు. కాల్పులు జరిపింది మినీ బస్సులోనే... రోషన్ ట్రావెల్స్ కార్యాలయం అఫ్జల్గంజ్ బస్టాప్లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో..రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు, బీదర్ పోలీసులతో కలిసి ఇద్దరు దుండగులూ ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా, అందులో నగదు ఉండటంతో ఓ దుండగుడు తన బ్యాక్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్ తొలుత టైరు పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదనుగా ఇద్దరు దుండగులూ తమ ట్రాలీలతో సహా కిందకు దిగి ట్రాఫిక్కు రాంగ్ సైడ్లో నడుచుకుంటూ వెళ్లారు. పోలీస్స్టేషన్ ఎదురుగా ఆటో ఎక్కి... అదే మినీ బస్సులో ఉన్న ఇద్దరు బీదర్ పోలీసు కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి ఎంజే మార్కెట్ మీదుగా ఉడాయించారు. ఠాణా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి రాత్రి 7.09 గంటలకు దుండగులు ఆటో ఎక్కారు. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు వచ్చి, వారికి విషయం చెప్పి, పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7.30 గంటలైంది. సికింద్రాబాద్ మీదుగా పరారీ... దుండగులు ప్రయాణించిన ఆటో ఎంజే మార్కెట్, అబిడ్స్, ట్యాంక్బండ్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నంబర్, దాని ద్వారా డ్రైవర్ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను ఇద్దరినీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ వరకు తీసుకెళ్లానని చెప్పాడు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలులో ఛత్తీస్గఢ్ లేదా బిహార్కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు.
అమెరికా వెళ్లాక గర్ల్ఫ్రెండ్ హ్యాండిచ్చిందని..
ప్రేమ పేరుతో వంచించి తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకున్న ఓ యువతి తిరస్కరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రకాశం జిల్లాలో (Prakasam District) బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన కందుల ప్రవీణ్ (27) ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒంగోలుకు (Ongole) చెందిన వాకా హరిణి లక్ష్మి అనే యువతి ప్రవీణ్కు ఐదేళ్ల కిందట పరిచయం కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ కలిసి హైదరాబాదులో (Hyderabad) కొద్దికాలం పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు.ఈ క్రమంలో యువతి ఈ చిన్న ఉద్యోగాలు తాను చేయలేనని, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సహకరించాలని కోరడంతో ప్రవీణ్ తనకున్న పరిచయాలతో అందినకాడికి డబ్బులు తెచ్చి హరిణి లక్ష్మిని ఏడాదిన్నర క్రితం అమెరికా పంపించాడు. ఆమె అమెరికా వెళ్లిన తరువాత అక్కడ ఆమె మరో స్నేహితురాలు యామిని చౌదరితో కలిసి ప్రవీణ్కు ఫోన్ చేసి ‘నీవంటే నాకిష్టం లేదని.. తనను మరచిపో’ అంటూ చెప్పింది. ఈ క్రమంలో తమ కుమార్తెను ప్రవీణ్ వేధిస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రులు రెండు నెలల కిందట ఒంగోలు ఒన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రవీణ్తో పాటు అతని తండ్రి కందుల డానియేలును పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.అనంతరం ఎవరి తీరున వారు ఉన్న క్రమంలో ఇటీవల నుంచి మళ్లీ హరిణి లక్ష్మి, ఆమె స్నేహితురాలు యామిని చౌదరి తిరిగి ప్రవీణ్కు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని లేకపోతే వేధింపులు ఆపడం లేదని మళ్లీ ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగడంతో ప్రవీణ్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. ఆ విషయాన్ని యువతి హరిణిలక్ష్మికి చెప్పి మరీ బుధవారం సాయంత్రం ఉప్పుగుండూరు గ్రామంలోని తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం మధ్యాహ్నం మృతుడి బంధువులు పోలీస్స్టేషన్కు చేరుకుని ఆందోళన చేశారు. కాగా, మృతుడి తండ్రి కందుల డానియేలు ఫిర్యాదు మేరకు యువతి వాకా హరిణి లక్ష్మి, ఆమె తండ్రి తిరుమలరావు, స్నేహితురాలు యామిని చౌదరిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ అజయ్బాబు తెలిపారు.భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని.. ఉలవపాడు: సంక్రాంతి సంబరాల్లో భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో (Nellore District) బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉలవపాడు (Ulavapadu) మండల పరిధిలోని కరేడు పంచాయతీలోని ఇందిరా నగర్ గిరిజన కాలనీలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందరూ డాన్స్లు వేస్తున్న సమయంలో ఇండ్లా బాలసుబ్రహ్మణ్యం (25) తన భార్యను కూడా తనతో డాన్స్ చేయడానికి రమ్మన్నాడు. పిల్లలను పట్టుకుని ఉన్నాను.. తరువాత వచ్చి వేస్తానులే అని చెప్పింది. చదవండి: సంక్రాంతి అల్లుడు మిస్సింగ్దీంతో అతను మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికే కదా వెళ్లింది అని కార్యక్రమం అయిన తరువాత వెళ్లి చూస్తే ఇంటిలోని వంట గదిలో ఫ్యాన్కు వేసిన కొక్కేనికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్థానికులు అతడిని ఉలవపాడు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
వీడియోలు
5 ఏళ్ల బాలుడి కిడ్నాప్
సందు దొరికితే చాలు వైఎస్ జగన్ పై బురద చల్లాలనే ప్రయత్నమే
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
వైఎస్ జగన్ చర్యల వల్లే ప్రైవేటీకరణ ఆగింది: అమర్నాథ్
అతిపెద్ద ఆటో షోకు వేదికగా ఢిల్లీ
Jana Tantram: అప్పారావు చిటికెల పందిరి
కూటమి సర్కార్ లో డిప్యూటీ CM పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టేందుకు పావులు
12 ఏళ్ళకు విశాల్ సంచలనం దెబ్బకు సంక్రాంతి రికార్డు బద్దలు
Sankranti Special: సంక్రాంతి పిండి వంటలకు ఫిదా
శ్రీకాకుళం జిల్లా గూడూరులో మురుగు నీటిలోకి దిగిన గ్రామస్తులు