ఆదివాసీల జీవితాల్లో మార్పు మొదలైందా?
ప్రశాంత జీవనం వాళ్లకు సహజ సిద్ధం. ప్రకృతి సంపద వాళ్లకు వారసత్వ ఫలం. ఖనిజ సంపద వాళ్ల జన్మహక్కు..! ఐనా శతాబ్దాలుగా వెంటాడుతున్న వెనుకబాటు తనం... పేదరికం... మావోయిస్ట్ ఉద్యమానికి కేంద్ర స్థావరంగా మారిన తరువాత వాళ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య నలిగి సమిధలుగా మారిన దుస్థితి..! అయినా తమదైన జీవన విధానాన్ని, సంస్కృతిని ఆస్వాదించడం దండకారణ్యం ఆదివాసీల ప్రత్యేకం.తుపాకీ తుటాల మోతతో.. ఖాకీ బూట్ల సవ్వడులతో అడవిలో అలజడి చెలరేగి.. వారి బతుకులు అగమ్యగోచరంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో నక్సలిజం తగ్గిపోవడం.. మావోయిస్టు బడా నాయకులు నేలకొరగడమో.. లొంగిపోవడమో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దండకారణ్యంలో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటున్నాయా? గిరిజనులు అభివృద్ధి దిశలో అడుగులు వేస్తున్నారా?దండకారణ్యం ప్రకృతి ఇచ్చిన ఓ సంపద. కొండలు, లోయలు, సెలయేళ్లు ఎటు చూసినా పచ్చదనం మైదానాలు.. ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు.. ఇవన్నీ ఆదివాసీ తెగలకు పుటిల్లు. గోండులు, మారియా, బగత, కోయ, గొత్తికోయ, ముఖ, హల్బా లాంటి తెగలతో పాటు అతి పురాతన ఆదివాసీ తెగ మురియాలకు దండకారణ్యంలోని అబుజ్మఢ్ జన్మస్థానం..! గడిచిన రెండుమూడు దశాబ్దాలుగా ఈ తెగలన్నీ అటు మావోయిస్టులు.. ఇటు పోలీసుల మధ్య నలిగిపోయి.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.సల్వాజులుం కనుమరుగుదండకారణ్యంలో ఇన్ని తెగలున్నా.. అడవుల్లో జీవించే గొత్తికోయలు మావోయిస్టులకు.. మైదాన ప్రాంతాల్లో ఉండే కోయలు పోలీసులకు మద్దతిస్తారనే అపవాదులు ఉండేవి. దీంతో.. కేంద్ర ప్రభుత్వం 2005 నుంచే గొత్తికోయల్లో మార్పు తేవాలని ప్రయత్నాలను మొదలు పెట్టింది. అప్పట్లోనే ‘ఆపరేషన్ గ్రీన్హంట్’ మొదలైంది. పోలీసు యాక్షన్ కంటే.. ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని అప్పట్లో ప్రభుత్వాలను ఆచరణలో పెట్టాయి. దాంతో.. సల్వాజులుం పేరుతో శాంతి సేన ఏర్పాటైంది. ఈ చర్య అప్పట్లో కోయల మధ్య విభేదాలను సృష్టించిందనే వాదనలున్నాయి. మైదానాల్లో ఉండే కోయలు అడవుల్లో ఉండే గొత్తికోయలను టార్గెట్గా చేసుకున్నారనే అపవాదులున్నాయి. అయినా.. ఎప్పుడు.. ఏ క్షణంలో.. ఎక్కడి నుంచి తుపాకీ మోత మోగుతుందో తెలియక.. బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితులుండేవి. ఆహ్లాదకర వాతావరణంలో తమ పండుగలను జరుపుకునే పరిస్థితులు ఉండేవి కాదు. వస్తుమార్పిడి విధానంలో సరుకులు కొనుగోలు చేసే సంతల్లోనూ తుపాకీమోత మోగుతుందేమోననే భయం ఉండేది. బుల్లెట్ల కారణంగా ఆదివాసీల ఉనికి ప్రమాదంలో పడుతోందని అప్పట్లో హక్కుల సంఘాలు ఆరోపించేవి. పోలీసులు, నక్సల్స్కు మధ్య ఆదివాసీలు సమిధలుగా మారుతున్నారనే ఆందోళనలు కొనసాగేవి. మహేంద్ర కర్మ హత్యతో సల్వాజులుం క్రమంగా కనుమరుగైంది. తర్వాత క్రమంగా మావోయిస్టులు మళ్లీ దండకారణ్యంపై పట్టుసాధించారు.ఆపరేషన్ కగార్తో ఉక్కుపాదంకేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరాక.. మావోయిస్టు ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్ర బలగాలను మోహరించింది. బస్తర్ పరిధిలోని అన్ని జిల్లాల్లో ఐదారు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీసు క్యాంపులు ఏర్పాటయ్యాయి. ఫలితంగా ఆదివాసీల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు తరచూ ఆదివాసీలను టార్గెట్గా చేసుకునేవారు. ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, పూజారి కాంకేర్ వంటి ప్రాంతాల్లో ప్రజాకోర్టులను నిర్వహించి, స్థానిక సర్పంచ్లను హతమార్చేవారు. ఆదివాసీల కిడ్నాప్లు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో.. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్ పేరుతో.. డీఆర్జీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లొంగిపోయిన మావోయిస్టులను రిక్రూట్ చేసుకుని, కూంబింగ్ నిర్వహించడం మొదలు పెట్టింది. సీఆర్పీఎఫ్ కోబ్రా దళాలకు దీటుగా డీఆర్జీ తయారైంది. అబూజ్మఢ్ ఎన్కౌంటర్ అయినా.. బీజాపూర్ అయినా.. మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలిన ప్రతీచోట.. డీఆర్జీ ఆధిపత్యం కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లే.. 2026 మార్చి చివరికల్లా.. మావోయిజాన్ని ఖతం చేయడంలో దాదాపుగా సఫలమైంది. మావోయిస్టు పెద్దదిక్కుగా ఉన్న తిప్పిరి తిరుపతి కూడా లొంగిపోవడంతో.. ఇప్పుడప్పుడే ఉద్యమం తిరిగి కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు.ఆదివాసీల జీవితాల్లో వెలుగురేఖలు!దండకారణ్యంలో ఇప్పుడు అన్నల అలజడి లేదు..! తుపాకీ మోతలు లేవు..! మరి ఇప్పుడు ఆదివాసీల జీవితాల్లో మార్పు మొదలైందా? ఈ ప్రశ్నకు దాదాపుగా ఔననే సమాధానం వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నిన్నమొన్నటి వరకు కరెంట్ అనేది ఎరగని గ్రామాల్లోనూ ఇప్పుడు విద్యుత్తు దీపాలు వెలుగుతున్నాయి. ఈ కోవలో ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, గుండం, తిమ్మిరాల, కోమటిపల్లి, భీమారంపాడు, చిన్న ఉట్లపల్లి, పూజారి కాంకేర్ వంటి గ్రామాలు ఈ ఘనతకు వేదికయ్యాయి. అంతేకాదు.. ప్రయాణం అంటే కేవలం కిలోమీటర్ల కొద్దీ కాలినడకే మార్గంగా ఉండేది. అత్యవసర సమయాల్లో ఎవరినైనా ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే.. వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటేలోగా ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సందర్భాలుండేవి. చిన్నపిల్లలకు చదువు ఆమడ దూరంలో ఉండేవి. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మార్పు మొదలైంది. రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. కరెంటుతోపాటు.. కమ్యూనికేషన్ వ్యవస్థలను ఇక్కడి ప్రజలు వాడుతున్నారు. గడిచిన 75 ఏళ్లుగా బస్సు ముఖం ఎరగని గూడేలకు ఇప్పుడు బస్సులు తిరుగుతున్నాయి. మావోయిస్టులు జనతన సర్కారు పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించిన ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజాపాలన మొదలైంది. పిల్లలు బడికి వెళ్తున్నారు. పోషకాహారం వారికి అందుతోంది. ఈ ప్రాంతాల్లో మరింత అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణను ప్రారంభించాయి.
ఇన్ని అబద్ధాలా? ఇంత విషమా?
అబద్ధాలు చెప్పడం చంద్రబాబు గారి జన్మహక్కు. దాన్ని మనం కాదన్నా ఆయన ఒప్పుకోరు. అందుకే అసెంబ్లీ లోనూ, బయటా, దేవుడి ముందూ, దేవుడి మీదా కూడా అబద్ధాలు చెప్ప గలరు. కోట్లాది మంది భక్తితో మోకరిల్లే తిరుమల శ్రీవారికే పంగనామం పెట్టగల సమర్థత బాబు గారి సొత్తు. మంగళవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమల గురించి గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు తిరుమలను రెండు కొండలుగా ప్రకటించారని ఘోరమైన అసత్యం ప్రకటించారు. దాదాపు 20 ఏళ్లుగా ఈ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒక అబద్ధాన్ని కోట గోడలా కట్టి, నమ్మించడం చంద్రబాబు స్పెషా లిటీ. గోడలు బద్ధలు కొట్టకపోతే దేవుడు మమ్మల్ని క్షమించడు. బ్రిటిష్ వారి మాన్యువల్ లెక్కఏడుకొండలపై వెలసిన తిరుమల క్షేత్రం సువిశాలమైంది. శేషాచలం కొండలు సమస్తం శ్రీవారి నిలయమే. దైవానికీ, భక్తికీ పరిధి లేదు. అయితే బ్రిటిష్ వారి నార్త్ ఆర్కాట్ మాన్యుయల్లో తిరుమల పరిధి 27 చదరపు కిలోమీటర్లు అని లిఖితమై ఉంది. టీటీడీ నిర్మాణాలకు అవసరమైన అనుమతులన్నీ కేంద్ర అటవీ శాఖ నుంచి లభించేవి కాబట్టి ఎప్పుడూ ఏ సమస్యా రాలేదు. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాతా పాలకులూ, ముఖ్యమంత్రులూ వచ్చారు. టీడీపీ ఎన్టీఆర్ హయాంలోనూ, తొమ్మిదేళ్లచంద్రబాబు హయాంలోనూ కూడా బ్రిటిష్ వారి లెక్కల ప్రకారమే తిరుమల ఉండింది. ఎవరికీ ఏ సందేహం లేదు, రాలేదు. ఇది దైవ కార్యం కాబట్టి! వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్ర బాబు దిగజారి తిరుమలను రాజకీయం చేయడం మొదలు పెట్టారు. కొండపై పంచాయతీ ఎన్నికల విషయమై జయచంద్ర నాయుడు అనే తెలుగుదేశం నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించారు. ఈ సందర్భంగా అప్పటి పంచాయతీ రాజ్ సెక్రటరీ శామ్యూల్ జీవో నంబర్ 338 విడుదల చేశారు. శతాబ్దాలుగా ఉన్న బ్రిటిష్ వారి ఉత్తర్వుల్లోని 27 చ.కి.మీ. పరిధినే జీవోలో తెలిపారు. ఇదే అదనుగా చంద్రబాబు గగ్గోలు పెట్టి బురద చల్లడం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలను రెండు కొండ లుగా మార్చాడని అబద్ధం ప్రచారంలోకి తెచ్చారు. అయితే ఆ రెండు కొండలు ఏమిటి? మినహాయించిన ఐదు కొండల పేర్లను చంద్ర బాబు జన్మలో చెప్పలేరు. ఎందుకంటే, అటువంటి ఆలోచనే జరగ లేదు కాబట్టి! వైఎస్తో బాబుకు పోలికా!అయితే చంద్రబాబు కుటిలత్వాన్నీ, దేవుణ్ణి రాజకీయానికి వాడుకునే దుర్మార్గాన్నీ అప్పటి టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న నేను గుర్తించాను. అప్పటి ఈవో కేవీ రమణాచారి, ఎండోమెంట్ సెక్రటరీ ఐవీ సుబ్బారావు గార్లతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్తో స్వయంగా చర్చించాం. చంద్రబాబు దురుద్దేశాన్ని వివరించాం. వెంటనే ఆయన తిరుమల పరిధిని 352 చదరపు కిలోమీటర్లుగా నిర్దేశిస్తూ జీవో 746, తిరుమలలో అన్య మత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో నంబర్ 747ను విడుదల చేశారు. తిరుమల శ్రీవారికి భక్తితో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారు. ఏడుకొండల చట్టం తెచ్చింది ఆయనే. అన్యమత ప్రచారాన్ని నిషే ధించింది ఆయనే. వైఎస్ హయాంలోనే, నేను టీటీడీ చైర్మన్గా ఉన్నపుడు, టీటీడీలో హిందువులు తప్ప మిగతా మతస్థులతోఉద్యోగాల నియామకాలు చేపట్టకూడదని చట్టం తెచ్చాం. ఎన్టీఆర్ హయాంలో గొల్లపల్లి, పైడిపల్లి, తిరుపతమ్మ, పెద్దింటి కుటుంబాల వంశ పారంపర్య మిరాశీ హక్కును రద్దు చేశారు. 2007లో దేవుణ్ణి నమ్ముకున్న ఆ కుటుంబాల ఆనువంశిక హక్కును వైఎస్ రాజశేఖర రెడ్డి పునరుద్ధరించారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సాధు పుంగవుల సమ్మేళనం నిర్వహించింది వైఎస్సార్ హయాంలోనే!తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడ్డానికీ, ధర్మాన్ని, విశ్వాసాల్ని పరిరక్షించడానికీ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం పాటుపడ్డారు. ఆయన పాదాల చెంత ఉన్న నారావారిపల్లెలో పుట్టి, తెల్లారి లేస్తే స్మరించుకుంటానని అబద్ధాలు చెప్పే చంద్రబాబు తిరుమలకు పంగనామం పెట్టడం తప్ప, చేసిందేమీ లేదు. దేవుడి పేరుతో ఇంత రాజకీయమా?అలిపిరి సంఘటనలో వేంకటేశ్వరస్వామి చంద్రబాబును కాపాడిన మాట నిజమే. అయితే దేవుణ్ణి రాజకీయాలకు వాడే ఆయన స్వభావానికి అది శ్రీవారు చేసిన హెచ్చరిక కూడా! ఆ తర్వాత కూడా తిరుమల శ్రీనివాసుడిని రాజకీయాలకు వాడారు, ఇంకా వాడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి వస్త్రాలు భక్తితో తీసుకెళ్లిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఇద్దరూ తిరు మలను రాజకీయాలకు వాడలేదు. ఇపుడు కూడా చంద్రబాబునిందలకు సమాధానం మాత్రమే చెబుతున్నాం. ఎందుకంటే అబ ద్ధాన్ని నిజమని నమ్మించడంలో భారత రాజకీయాల్లోనే ఆయన్ని మించినవారు లేరు, ఇప్పట్లో రారు. 2009లో జరిగిన రాజకీయ సభలో జీవోలు 746, 747 రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబే,అసెంబ్లీలో జంకు లేకుండా మాట్లాడుతున్నారు. ఇదంతా సిగ్గుగా అనిపించదా? పీవీ నరసింహారావు గారితో సహా ఎందరో మహనీయుడిగా భావించే పెజావర్ స్వామి ఈ జీవోల మీద వైఎస్ను ప్రశంసించారు. హైందవ ప్రచారానికి వైఎస్ చేసిన కృషిని పత్రికా సమావేశంలో కొనియాడారు. చంద్రబాబుకు బురద రాజకీయమే తెలుసు. మాకు గౌరవ రాజకీయాలు మాత్రమే తెలుసు. అందుకే ఆయన కుమారుడు లోకేశ్ పెళ్లికి, ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కోరిక మేరకు శేషాద్రి స్వామిని, తిరుమల అర్చకుల్ని స్వయంగా నేనే ఏర్పాటు చేశాను. బాలకృష్ణ కూడా సౌకర్యాలకు ధన్యవాదాలు తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం దర్శన ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయని చెప్పారు. ఇదే విషయం బాలకృష్ణతో చెబితే, ‘రాజకీ యాలతో నాకు సంబంధం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా, మీ ఏర్పాట్లు బాగున్నాయి’ అన్నారు. ధైర్యం ఉంటే జగన్ తో రాజకీయంగా తలపడండి. మతాన్నీ, దేవుడినీ అడ్డు పెట్టుకుని అబద్ధాల్ని చెప్పకండి చంద్రబాబూ!ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దేవుడు ఇంకా బాగా గమనిస్తు న్నాడు. తిరుమల క్షేత్రం చాలా శక్తిమంతమైనది. ఆ దైవం ప్రతిసారీ మిమ్మల్ని క్షమించక పోవచ్చు! -వ్యాసకర్త టీటీడీ పూర్వ అధ్యక్షులు-భూమన కరుణాకరరెడ్డి
ఇవి పాలకుల పా‘పాలు’
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడే ఉండే తిరుమ లేశుని లడ్డూ ప్రసాదంపై ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తప్పుడు ఆరోపణలకు దిగారో గానీ... అప్పటి నుంచి రాష్ట్రంలో జరగని అనర్థాలంటూ లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, అరెస్టులు వగైరాలతో ముఖ్యమంత్రి మొదలుకొని అందరి కందరూ బిజీగా ఉంటే రాజమండ్రి సమీపంలోని లాలాచెరువు చుట్టుపట్ల కల్తీ పాల బారినపడి ఆరుగురు మరణించారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గత ఆదివారం దీని తీవ్రత వెల్లడైనా, అంతక్రితం వారం నుంచి అనేకమంది ఆసుపత్రుల్లో చేరుతూనే ఉన్నారు. కాస్త ఆలస్యంగా స్థానిక అధికారులైనా మేల్కొన్నారేమోగానీ... అమరావతిలో కొలువుదీరిన యంత్రాంగం నిద్ర లేవడానికి మరికొన్ని రోజులు పట్టింది. తీరిగ్గా ఇప్పుడు రాష్ట్రవ్యాప్త తనిఖీలు మొదలయ్యాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో శాసనసభలో పచ్చి అబద్ధాలు వల్లెవేయటానికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకుని, ఎవరు ఏ అసత్యాలతో రక్తి కట్టించాలో తేల్చుకుని, స్క్రిప్టులు బట్టీ పట్టడంలో కూటమి నేతలు తంటాలు పడుతుంటే, అడిగిందల్లా అందించటంలో యంత్రాంగమంతా తరించింది. ఇక కల్తీ పాలపై, కలుషిత నీటిపై పట్టించుకొనే నాథుడేడి? చివరకు కుప్పంకేంద్రంగా సాగే కల్తీ పాల దందాను కూడా కర్ణాటక పోలీసులు వచ్చి బట్టబయలు చేయాల్సి వచ్చింది.పాలకుల పాపాలు, వారి అసమర్థత ప్రజలకు శాపాలెలా అవుతాయో తెలియాలంటే 2024 సెప్టెంబర్లో లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణ మొదలుకొని సాగుతున్న వరస పరిణామాలు గమనించాలి. నిరుడు జనవరిలో తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్లు జారీ సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. అటుతర్వాత ఏప్రిల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చందనోత్సవం కోసం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణంపాలయ్యారు. నిరుడు నవంబర్లో కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించారు. ఈ ఉదంతాలకు సాటిరాగలది 2015 పుష్కరాల్లో రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన. అందులో 25 మంది మహిళలు సహా 29 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన సమ యంలో బాబు కుటుంబసమేతంగా అక్కడ ఉండటమే కాదు... తన షూటింగ్ కోసం భక్తుల్ని గంటల తరబడి ఆపటం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.ఎంతో ఆరోగ్యంతో నిక్షేపంలా ఉండే సామాన్య పౌరులు ఒక్కసారిగా అస్వస్థులు కావటం, వారికి రోజుకు రెండుసార్లు డయాలసిస్ చేసే పరిస్థితి తలెత్తటం ఎంత విషాద కరం! అన్నిటికన్నా ఘోరమేమంటే... రాజమండ్రికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఆరు రోజుల్లో ఏకంగా 63 సార్లు డయాలసిస్ అవసరమైంది. ఆ లేత ప్రాణం దీన్నితట్టుకోలేక కన్నుమూసింది. డయాలసిస్ సాగుతున్న పిల్లల్లో మూడేళ్లలోపు వారు కూడా ఉన్నారంటే ఉదంతం తీవ్రతేమిటో తెలుస్తుంది. పాలలో కలిపిన ఇథిలీన్ గ్లైకాల్ అనే పదార్థం వల్లే బాధితుల రక్తంలో ప్రమాదకర స్థాయిలో యూరియా, క్రియాటిన్లు ఉన్నాయని చెబు తున్నారు. రక్తంలో గరిష్ఠంగా 24 మిల్లీగ్రాములు ఉండాల్సిన యూరియా దాదాపు 140 మిల్లీ గ్రాములు... గరిష్ఠంగా 1.3 మిల్లీగ్రాములు ఉండాల్సిన సీరమ్ క్రియాటిన్ ఏకంగా 9 మిల్లీ గ్రాములు ఉందంటే యంత్రాంగం కళ్లు ఎంతగా మూసుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇదింకా సద్దుమణగక ముందే గత అయిదు రోజులుగా శ్రీకాకుళం నగరంలో కలుషిత నీరు తాగి భారీ సంఖ్యలో ప్రజలు డయేరియా వాతబడ్డారు. నగరంలోని సగం ప్రాంతానికి కలుషిత నీరు సరఫరా కావటమే ఇందుకు కారణమంటున్నారు. 2024 జూలైలోనే అక్కడి బీసీ హాస్టల్లో ఇలాంటి కారణంతోనే పలువురు విద్యార్థులకు డయేరియా సోకింది. అప్పుడు కాస్తయినా శ్రద్ధపెట్టి ఉంటే ఇప్పుడు ఇది పునరావృత మయ్యేది కాదు. కల్తీ మాటలతో అధికారంలోకొచ్చి, ఆ బాణీనే కొనసాగిస్తున్న పాలకుల అసమర్థత అన్నిటినీ కల్తీమయం చేస్తోంది. ఇప్పటికైనా పాలించటం మొదలెడతారో లేదో బాబు అండ్ కో తేల్చుకోవాలి.
భారీ విజయం కావాలి
టి20 ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్లో పరాజయం భారత్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవలి ఫామ్ను బట్టి చూస్తే దర్జాగా సెమీఫైనల్ చేరాల్సిన టీమ్ ఇప్పుడు ఒత్తిడిని అధిగమించి తప్పనిసరిగా వరుస రెండు మ్యాచ్లు గెలవడంతో పాటు రన్రేట్పై కూడా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఒకవైపు మన బ్యాటింగ్లో తడబాటు కనిపిస్తుండగా, మరోవైపు లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకలను ఓడించిన జింబాబ్వేను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే వెస్టిండీస్తో జరిగే తర్వాతి పోరులో వ్యూహాల గురించి చర్చించేందుకు భారత్కు ఇంకా అవకాశం మిగిలి ఉంటుంది! చెన్నై: వరల్డ్ కప్ ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా తమ రెండో మ్యాచ్లో బరిలోకి దిగేందుకు టీమిండియా సన్నద్ధమైంది. నేడు జరిగే ‘గ్రూప్–1’ పోరులో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. ఇరు జట్లూ తమ తొలి మ్యాచ్ల్లో చిత్తుగా ఓడి రన్రేట్లో బాగా వెనుకబడిపోయాయి. ఓడిన జట్టు సెమీస్ ఆశలు ఇక్కడే ముగిసిపోతాయి. బలాబలాలపరంగా జింబాబ్వేకంటే భారత్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. అయితే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో టీమిండియా అజేయమేమీ కాదని తేలగా... పోరాడితే పోయేదేం లేదన్నట్లుగా ఆడే జింబాబ్వే మరో సంచలన ప్రదర్శనపై గురి పెట్టింది. సామ్సన్కు చాన్స్! గత మ్యాచ్ ఆడిన తుది జట్టు నుంచి కనీసం రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. టోర్నీలో ఆడిన ఒకే ఒక మ్యాచ్లో విఫలమైన సంజు సామ్సన్ను ఇప్పుడు టీమ్ వ్యూహంలో భాగంగా మళ్లీ ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. భారత్ టాప్–3 ఎడంచేతి వాటం బ్యాటర్లే కావడం, ప్రత్యర్థి జట్లు ఆరంభంలోనే ఆఫ్ స్పిన్నర్తో బౌలింగ్ చేయించి కట్టడి చేస్తుండటం జట్టును ఇబ్బంది పెట్టింది. మూడు డకౌట్ల తర్వాత గత మ్యాచ్లో అభిషేక్ శర్మ కొన్ని పరుగులు చేసినా అతని బ్యాటింగ్లో తడబాటు కనిపించింది. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా ఆఫ్స్పిన్నర్కే అవుటయ్యాడు. దాంతో కుడిచేతి వాటం సామ్సన్ను టాపార్డర్లో ఆడించేందుకు టీమిండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సామ్సన్ను ఆడించేందుకు తిలక్ వర్మ లేదా రింకూ సింగ్లలో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. దక్షిణాఫ్రికాతో అక్షర్ పటేల్ను కాకుండా వాషింగ్టన్ సుందర్ను ఆడించి తీవ్ర విమర్శలపాలైన మేనేజ్మెంట్ ఇప్పుడు మళ్లీ అక్షర్ను టీమ్లోకి తీసుకోవచ్చు. జింబాబ్వే బ్యాటర్లలో ఎక్కువ మంది కుడిచేతి వాటంవారే కావడం అక్షర్ రాకకు మార్గం సుగమం చేసింది. మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు అభిషేక్కు ఇది సరైన సమయం కాగా... సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా ఎంత దూకుడుగా ఆడతారన్నది చూడాలి. బౌలింగ్ విషయంలో భారత్కు ఎలాంటి ఆందోళన లేదు. బుమ్రా, అర్‡్షదీప్లతో పాండ్యా పేస్ భారం మోస్తుండగా... ప్రధానాస్త్రం వరుణ్ జింబాబ్వేను బాగా ఇబ్బంది పెట్టగలడు. సొంతగడ్డపై ఇప్పుడు వరుణ్ వరల్డ్ నంబర్వన్ బౌలర్గా బరిలోకి దిగనున్నాడు. రజాపై భారం... జింబాబ్వే జట్టుపై ఈ మ్యాచ్కు సంబంధించి ఎలాంటి ఒత్తిడీ లేదు. లీగ్ దశలో ఆ్రస్టేలియాను, సొంతగడ్డపై శ్రీలంకను ఓడించిన సంతృప్తితో ఆ జట్టు స్వదేశానికి వెళ్లవచ్చు. అందువల్ల కూడా ఇప్పుడు జింబాబ్వే మరింత ప్రమాదకరం. పోరాడితే భారత్పై కూడా పైచేయి సాధించవచ్చనే ధైర్యం ఆ జట్టులో కనిపిస్తోంది. ప్రధాన పేసర్లయిన ఎన్గరవా, ముజరబాని పవర్ప్లేలో వికెట్లు తీసి శుభారంభం అందించగలరు. లెగ్ స్పిన్నర్ క్రీమర్ కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సమర్థుడు. టోర్నీలో జట్టు తరఫున టాప్ స్కోరర్గా ఉన్న బెన్నెట్తో పాటు ర్యాన్ బర్ల్ కీలకం కానున్నారు. జట్టులో ఇద్దరు ఆల్రౌండర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బ్రాడ్ ఇవాన్స్ తన మీడియం పేస్తో టోర్నీలో ప్రభావం చూపించగా, ప్రధాన గెలుపు భారం కెపె్టన్ సికందర్ రజాపైనే ఉంది. బ్యాటింగ్లో ముందుండి నడిపిస్తున్న రజా, తన ఆఫ్స్పిన్తో నిలకడగా రాణించాడు. విండీస్తో గత పోరులో భారీ తేడాతో ఓడినా... జింబాబ్వే పట్టుదలగా ఆడితే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలదు.పిచ్, వాతావరణం చిదంబరం స్టేడియంలోని పిచ్లు ఈ టోర్నీ మొత్తంలో బ్యాటింగ్కు బాగా అనుకూలించాయి. బౌలర్లకు ఏమాత్రం సహకరించలేదు. కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు.1 టి20 వరల్డ్ కప్లో భారత్, జింబాబ్వే మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది. 2022లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 71 పరుగులతో గెలిచింది.1 భారత్లో భారత్తో టి20ల్లో జింబాబ్వే తలపడటం ఇదే తొలిసారి. గతంలో భారత గడ్డపై జింబాబ్వే 5 టెస్టులు, 19 వన్డేల్లో టీమిండియాను ఎదుర్కొంది.భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, దూబే, పాండ్యా, రింకూ/ తిలక్, అక్షర్, అర్ష్ దీప్, వరుణ్, బుమ్రా. జింబాబ్వే: రజా (కెప్టెన్), మరుమని, బెన్నెట్, మైర్స్, బర్ల్, మున్యోంగా, ముసెకివా, ఇవాన్స్, క్రీమర్, ముజరబాని, ఎన్గరవ
ఎఫ్ఐఆర్ నమోదు చేయరేం!
దేశ యువత, ప్రజలకు దేశ యువత, ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
న్యాయవ్యవస్థను మసకబార్చే ప్రయత్నం సహించం: సుప్రీం
పసిగుడ్డు ఏం పాపం చేసింది?
చివర్లోనూ చిక్కులు!
ఉగ్రవాదం పెనుముప్పు!
భారీ విజయం కావాలి
శ్రీలంక ఖేల్ ఖతం
ఈ మ్యాచ్పై మన కన్ను... నేడు దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ సమరం
తగ్గేదేలే!
సార్! కొన్నాళ్లు ఆ విక్టరీ సింబల్ చూపించడం మానేయండి..విమానాలు గుర్తొస్తున్నాయ్!
T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్
T20 WC 2026: చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాళ్లు
మన రెడ్బుక్కే సార్! బిహార్లో రంగు మారిపోయింది!!
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. సంఘంలో గౌరవం
పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్
ఆయ్.. ఇది సినిమా ఇల్లండి..
తీవ్రమైన మోకాలి నొప్పిని వ్యాయామాలతో జయించింది..!
ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్
డుమ్మాకే డుమ్మా కొట్టింది!
T20 WC 2026: పాక్ జట్టులో కలకలం
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. శుభవార్తలు వింటారు
రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?
పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..
ఒక్క చిట్కాతో సిజేరియన్ తరువాత 15 కిలోలు తగ్గిన డాక్టర్
టాలీవుడ్లో నటి లయపై నిర్మాత వ్యాఖ్యల దుమారం
కోకిలాబెన్ అంబానీ 92వ పుట్టినరోజు వేడుకలు..! ఆమె మార్క్ ఉండేలా..
T20 WC: కివీస్, లంకకు భారీ షాక్!.. పాక్కు గుడ్న్యూస్?
ర్యాపిడో ప్రయాణం చివరి ప్రయాణం అయ్యింది..!
మాజీ భార్య అన్నట్లుగా చెబుతున్న మాటలపై స్పందించిన శిఖర్ ధవన్
ఎఫ్ఐఆర్ నమోదు చేయరేం!
దేశ యువత, ప్రజలకు దేశ యువత, ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
న్యాయవ్యవస్థను మసకబార్చే ప్రయత్నం సహించం: సుప్రీం
పసిగుడ్డు ఏం పాపం చేసింది?
చివర్లోనూ చిక్కులు!
ఉగ్రవాదం పెనుముప్పు!
భారీ విజయం కావాలి
శ్రీలంక ఖేల్ ఖతం
ఈ మ్యాచ్పై మన కన్ను... నేడు దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ సమరం
తగ్గేదేలే!
సార్! కొన్నాళ్లు ఆ విక్టరీ సింబల్ చూపించడం మానేయండి..విమానాలు గుర్తొస్తున్నాయ్!
T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్
T20 WC 2026: చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాళ్లు
మన రెడ్బుక్కే సార్! బిహార్లో రంగు మారిపోయింది!!
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. సంఘంలో గౌరవం
పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్
ఆయ్.. ఇది సినిమా ఇల్లండి..
తీవ్రమైన మోకాలి నొప్పిని వ్యాయామాలతో జయించింది..!
ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్
డుమ్మాకే డుమ్మా కొట్టింది!
T20 WC 2026: పాక్ జట్టులో కలకలం
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. శుభవార్తలు వింటారు
రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?
పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..
ఒక్క చిట్కాతో సిజేరియన్ తరువాత 15 కిలోలు తగ్గిన డాక్టర్
టాలీవుడ్లో నటి లయపై నిర్మాత వ్యాఖ్యల దుమారం
కోకిలాబెన్ అంబానీ 92వ పుట్టినరోజు వేడుకలు..! ఆమె మార్క్ ఉండేలా..
T20 WC: కివీస్, లంకకు భారీ షాక్!.. పాక్కు గుడ్న్యూస్?
ర్యాపిడో ప్రయాణం చివరి ప్రయాణం అయ్యింది..!
మాజీ భార్య అన్నట్లుగా చెబుతున్న మాటలపై స్పందించిన శిఖర్ ధవన్
ఫొటోలు
ప్రియురాలితో బిగ్బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)
కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్ జగన్ (ఫొటోలు)
బ్లాక్ అండ్ బ్లాక్లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)
నందిపల్లిలో వైఎస్ జగన్ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)
Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)
శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫోటోలు)
బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)
సినిమా
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్పూర్లో ఫుల్గా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ లైఫ్లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.ముహుర్తం ఫిక్స్..ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.
విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఉదయ్పూర్లో ఫుల్గా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. కొన్నేళ్లుగా ఎక్కడా బయటపడుకుండా రిలేషన్లోన్న విజయ్- రష్మిక ఈనెల 26న పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.అయితే సెలబ్రిటీల పెళ్లి సందడి మామూలుగా ఉండదు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతారు. గతంలో విరాట్- అనుష్క, దీపిక-రణ్వీర్ సింగ్ సైతం తమ పెళ్లికి అత్యంత సీక్రెట్గా జరుపుకున్నారు. దీనికోసం నో మొబైల్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేశారు. ఇప్పుడదే బాటలో రష్మిక- విజయ్ జంట కూడా పెళ్లి వేడుకను జరుపుకుంటోంది. స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ పద్ధతి ఓ అందమైన పేరు కూడా ఉంది. ఈ నో మొబైల్ పాలసీ సంప్రదాయాన్ని అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తారు.అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే..?అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే పెళ్లికి వచ్చిన అతిథులందరూ కూడా తమ మొబైల్స్ స్విచ్ఛాఫ్ చేసి అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. ఎవరు కూడా ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టడానికి వీలుండదు. అంతే కాకుండా ముందువరుసలో కూర్చొని ఫోన్లలో పెళ్లి ఫోటోలు తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. పెళ్లికి సంబంధిచిన ఫోటోలు, వీడియోలు ఆ జంట షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో కనిపించవు. ఈ పద్ధతినే అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నారు. లైఫ్లో చాలా ముఖ్యమైన ఈ క్షణాలను అత్యంత ప్రైవసీగా నిర్వహించాలనేది సెలబ్రిటీ వధూవరుల కోరిక. వారు మాత్రమే ఫస్ట్ ఈ వేడుక పిక్స్ పంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక ట్రెండ్గా మారిపోయింది.ఈ వెడ్డింగ్ ప్రైవసీ అన్ప్లగ్డ్ ట్రెండ్ అనుష్క-విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో మొదటిసారి వైరలైంది. ఆ తర్వాత 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణ్వీర్ సింగ్ కూడా నో ఫోన్ పాలసీని అమలు చేశారు. అంతేకాకుడా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినాకైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్బీర్ కపూర్ సైతం ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. తాజాగా విరోష్ పెళ్లిలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
ప్రేయసి ముఖం పచ్చబొట్టు! నటుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ నటుడు కరణ్ కుంద్రా గుండె నిండా తేజస్వి ప్రకాశ్ నిండి ఉంది. ఆమె అంటే కరణ్కు పంచప్రాణాలు. అందుకే తాజాగా అతడి ఛాతీపై తేజస్వి ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ప్రియురాలిపై అతడు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు.టాటూ నిజమైనదా?ఈ క్రమంలో కరణ్ ఇది శాశ్వత పచ్చబొట్టు కాదని వెల్లడించాడు. తేజస్వి నటించిన సైకో సయ్యా.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఈ తాత్కాలిక టాటూ వేయించుకున్నానని వివరణ ఇచ్చాడు. తనకు సపోర్ట్గా నిలబడేందుకు ఇలా టాటూతో కనిపించానన్నాడు.బిగ్బాస్ షోలో మొదలైన లవ్హిందీ బిగ్బాస్ 15వ సీజన్లో కరణ్- తేజస్వి ప్రకాశ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన ఏడాదికే అంటే 2022లోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటినుంచి పెళ్లిని దాటవేస్తూనే ఉన్నారు. మధ్యలో ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చినా అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా.. మాది ఫెవికాల్ బంధమని కరణ్-తేజస్వి ఎన్నోసార్లు రుజువు చేశారు.చదవండి: ప్రేయసితో బిగ్బాస్ షణ్ను ఎంగేజ్మెంట్
పెళ్లిలో అల్లు అర్జున్ సతీమణి సందడి.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బంధువుల పెళ్లికి ఆమె హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా స్నేహారెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. కాగా.. బన్నీని స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో పెళ్లికి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి pic.twitter.com/fKmHCFaLYs— Telangana365 (@Telangana365) February 25, 2026
క్రీడలు
‘షూటౌట్’లో గెలిచాం
స్వదేశంలో గెలుపు ఖాతా తెరవడంలో విఫలమైన భారత పురుషుల హాకీ జట్టు విదేశీ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రెండో అంచె చివరి లీగ్ మ్యాచ్లో నిర్ణీత సమయంలో నేరుగా కాకపోయినా ‘షూటౌట్’లో విజయాన్ని అందుకుంది. ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆ్రస్టేలియాను వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించిన భారత జట్టు మూడో అంచె మ్యాచ్లను జూన్లో నెదర్లాండ్స్లో ఆడనుంది. హోబర్ట్: మొదటి ఐదు మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో పరాజయం... ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లో ‘షూటౌట్’లో ఓటమి... ఎలాగైతేనేం వరుసగా ఏడు పరాజయాలు... కానీ ఎనిమిదో ప్రయత్నంలో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు రుచి చూడటంలో సఫలమైంది. ఆ్రస్టేలియాలాంటి పటిష్ట జట్టును వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించి రెండో అంచె లీగ్ను భారత జట్టు ముగించింది. బుధవారం జరిగిన ప్రొ లీగ్ ఎనిమిదో మ్యాచ్లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–1 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియాపై జట్టుపై గెలిచింది. భారత్కు రెండు పాయింట్లు, ఆ్రస్టేలియాకు ఒక పాయింట్ లభించాయి. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా... భారత్ తరఫున గోల్కీపర్ శశికుమార్ మోహిత్ హొన్నేణహళ్లి హీరోగా అవతరించాడు. ముగ్గురు ఆ్రస్టేలియా ఆటగాళ్ల షాట్లను మోహిత్ అడ్డుకొని భారత్ను గెలిపించాడు. భారత్ తరఫున ‘షూటౌట్’లో శిలానంద్ లాక్రా, మణీందర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్ సఫలంకాగా... అభిషేక్ విఫలమయ్యాడు. ఆ్రస్టేలియా తరఫున మొదటి మూడు షాట్లు తీసుకున్న టిమ్ బ్రాండ్, లియామ్ హెండర్సన్, కూపర్ బర్న్స్ విఫలమవ్వగా... నాలుగో షాట్లో జెరెమీ హేవార్డ్ సఫలమయ్యాడు. అంతకుముందు రెగ్యులర్ సమయంలోని మూడు క్వార్టర్స్లో రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. చివరి క్వార్టర్లోని 49వ నిమిషంలో జెరెమీ హేవార్డ్ పెనాల్టీ కార్నర్ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం రెండు నిమిషాల్లో ఆవిరైంది. 51వ నిమిషంలో భారత ఫార్వర్డ్ శిలానంద్ లాక్రా గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చివరి తొమ్మిది నిమిషాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు మరో గోల్ చేయడానికి ప్రయత్నించి సఫలం కాలేకపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టు తమకు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్లను వృథా చేసింది. ఆ్రస్టేలియా తమకు దక్కిన ఏడు పెనాల్టీ కార్నర్లలో ఒక దానిని సద్వినియోగం చేసుంది. జూన్ 14 నుంచి 21 వరకు రోటర్డామ్లో మూడో అంచె మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 14న నెదర్లాండ్స్తో... 17న జర్మనీతో... 18న మళ్లీ జర్మనీతో... 21న మళ్లీ నెదర్లాండ్స్తో ఆడుతుంది. అనంతరం 23 నుంచి 28 వరకు లండన్లో నాలుగో అంచె మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 23న పాకిస్తాన్తో... 25న ఇంగ్లండ్తో... 26న మళ్లీ పాకిస్తాన్తో... 28న మళ్లీ ఇంగ్లండ్తో తలపడుతుంది.
సౌతాఫ్రికా, విండీస్ ముందున్నాయి.. భారత్ సెమీస్ చేరాలంటే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లను ఓడించి టాపర్గా సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, కీలక సమయంలో సమిష్టి వైఫల్యంతో సూర్యకుమార్ సేన చేతులెత్తేసింది.అతిపెద్ద పరాజయంసూపర్-8 గ్రూప్-1లో భాగంగా సౌతాఫ్రికా (IND vs SA)తో మ్యాచ్లో మరీ దారుణంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. తద్వారా తమ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.అందనంత ఎత్తులో విండీస్మరోవైపు.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా టీమిండియాను 76, వెస్టిండీస్ జింబాబ్వే (WI vs ZIM)ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాలు సాధించాయి. చెరో విజయంతో రెండేసి పాయింట్లు సంపాదించాయి. అయితే, సఫారీల (+3.800)తో పోలిస్తే విండీస్ (+5.350)నెట్రన్రేటు పరంగా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచి టాపర్గా ఉంది.మరోవైపు భారత్ (-3.800) ఘోర పరాజయంతో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం నాటి మ్యాచ్లో.. అదే విధంగా ఆదివారం విండీస్తో మ్యాచ్లో తప్పక భారీ తేడాతో గెలవాలి. లేదంటే సెమీస్ చేరకుండానే నిష్క్రమించాల్సి వస్తుంది.గెలుపు ముఖ్యం.. ఆ తర్వాతే ఏదైనాఅయితే, జింబాబ్వేతో మ్యాచ్లో నెట్రన్రేటు కంటే కూడా గెలుపే ముఖ్యంగా ఆడాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ‘‘జింబాబ్వేతో మ్యాచ్లో మొదట విజయం గురించి మాత్రమే ఆలోచించాలి. గెలిస్తేనే కదా నెట్రన్రేటు లెక్కలోకి వచ్చేది. ఇప్పుడు మనకు గెలుపు పాయింట్లు అత్యంత ముఖ్యం.ఏదేమైనా ఇప్పుడు నెట్రన్రేటు పరంగా వెస్టిండీస్ను మనం ఓడించడం అసాధ్యం. టీ20 క్రికెట్లో జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై 100 పరుగుల తేడాతో విజయాలు సాధించడం కష్టం. కాబట్టి తదుపరి రెండు మ్యాచ్లలో గెలుపు ఒక్కటే మనకు ముఖ్యం. ఆ తర్వాతే నెట్రన్రేటు గురించి ఆలోచించాలి.ఇంత చెత్తగా ఆడతారా?సౌతాఫ్రికాతో మ్యాచ్లో మూడు విభాగాల్లో భారత్ విఫలమైంది. కనీసం ఒక్క బ్యాటర్ కూడా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. అందువల్లే భారీ తేడాతో ఓడి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్నాం. ఏదేమైనా ప్రస్తుతం వెస్టిండీస్, సౌతాఫ్రికా నెట్రన్రేటు పరంగా మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మనం మూడు విభాగాల్లో రాణిస్తేనే ముందడుగు వేయగలం’’ అని ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు.చదవండి: IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు!
షాకులిచ్చిన శ్రీలంక.. సాంట్నర్ ధనాధన్ దంచికొట్టగా..
శ్రీలంకతో మ్యాచ్లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. మిడిలార్డర్ కకావికలమైనా లోయర్ ఆర్డర్ రాణించడంతో గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సూపర్-8 మ్యాచ్లో భాగంగా కొలంబో వేదికగా.. టాస్ గెలిచిన శ్రీలంక.. కివీస్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఈ క్రమంలో కివీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (8)ను దుష్మంత చమీర త్వరగానే పెవిలియన్కు పంపాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23)ను మహీశ్ తీక్షణ వెనక్కి పంపగా.. రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32) తీక్షణ బౌలింగ్లో హేమంతకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.పెవిలియన్కు క్యూఅయితే, టాపార్డర్ ఓ మాదిరిగా ఆడగా.. మిడిలార్డర్ బ్యాటర్లు మాత్రం పెవిలియన్కు క్యూ కట్టారు. గ్లెన్ ఫిలిఫ్స్ (18), డారిల్ మిచెల్ (3) ఇలా వచ్చి అలా వెళ్లగా.. మార్క్ చాప్మన్ డకౌట్ అయ్యాడు.సాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిచెల్ సాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్.. 47 పరుగులు సాధించాడు. Captain to the rescue! 💪Mitchell Santner's power-hitting pushes New Zealand's fightback. ICC Men’s #T20WorldCup | SUPER 8, #SLvNZ ➡️ LIVE NOW 👉 https://t.co/g4wqt4U8vL pic.twitter.com/p0KW8AcuLA— Star Sports (@StarSportsIndia) February 25, 2026రాణించిన మెకాంచీఇక జేమ్స్ నీషమ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన మరో బౌలింగ్ ఆల్రౌండర్ కోల్ మెకాంచీ సాంట్నర్కు తోడుగా రాణించాడు. మెకాంచీ 23 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 168 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో మూడు వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలగే ఒక వికెట్ దక్కించుకున్నాడు. తుదిజట్లుశ్రీలంకపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంకన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్
IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. అతడిపై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక మ్యాచ్కు టీమిండియా సన్నద్ధమైంది. సూపర్-8 దశలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఇషాన్ హిట్.. అభిషేక్ ఫ్లాప్కాగా ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మలకు అవకాశాలు వస్తుండగా.. సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అయితే వరల్డ్కప్ టోర్నీలో ఇషాన్ మెరుగ్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో తొలి మూడు మ్యాచ్లలోనూ డకౌట్ అయ్యాడు.ఇక సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో టీమిండియా తలపడగా.. ఈసారి ఇషాన్ డకౌట్ కాగా.. అభిషేక్ 15 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. సంజూ లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్లో బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.తిలక్ వర్మపై విమర్శలుఇదిలా ఉంటే.. మూడో స్థానంలో ఆడుతున్న తిలక్ వర్మ ఇప్పటి వరకు పెద్దగా బ్యాట్ ఝులిపించనేలేదు. అతడి స్ట్రైక్రేటుపై విమర్శలు వస్తున్నాయి. ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్లు ఇషాన్- అభిషేక్.. వన్డౌన్లో వచ్చే తిలక్.. ఈ ముగ్గురూ లెఫ్టాండ్ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు, కెప్టెన్కు పని సులువు అయిపోతోంది. వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేకుండానే వాళ్లు అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నారు.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసంఇలాంటి తరుణంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా టాపార్డర్లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జింబాబ్వేతో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో సంజూ శాంసన్ను చేర్చే విషయమై చర్చ నడుస్తోంది.సంజూ వస్తాడని సంకేతంజింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా మార్పులు ఉండవచ్చు. మా ఓపెనర్లతో పాటు వన్డౌన్లో వచ్చే ఆటగాడు కూడా లెఫ్టాండర్ బ్యాటరే కావడం ఇందుకు కారణం. అందుకే ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నాం. అయితే, మ్యాచ్ సమయంలోనే మేము తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కొటక్ తెలిపాడు.ఎవరిపై వేటు?ఒకవేళ సంజూ గనుక తుదిజట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రింకూ సింగ్ స్థానంలో సంజూను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజూను వన్డౌన్లో ఆడించి.. తిలక్ను డిమోట్ చేయడం ఓ ఆప్షన్. అయితే, ఇప్పటికే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినా రింకూ జట్టుతో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కొటక్ తెలిపాడు.రింకూ, తిలక్, అభిషేక్!అంటే రింకూ జింబాబ్వేతో మ్యాచ్ ఆడటం ఖాయమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో రీసెట్ అయ్యేందుకు.. లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ కోసం అతడిని పక్కనపెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. అభిషేక్- ఇషాన్ జోడిని కొనసాగిస్తే.. తిలక్ వర్మపై వేటు వేసి.. సంజూను మూడోస్థానంలోనే ఆడిస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. సితాన్షు కొటక్ చెప్పినట్లు మ్యాచ్ ఆరంభానికి ముందు వరకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం ఈసారి కాస్త కష్టమే అనిపిస్తోంది. కాగా చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడిన భారత తుదిజట్టులో ఏకంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్లో సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చదవండి: T20 WC 2026: రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్
న్యూస్ పాడ్కాస్ట్
మహాపచారం మీదే చంద్రబాబూ..! కల్తీనెయ్యి వివాదంలో చంద్రబాబు పాత నిర్ణయాలు వెలుగులోకి
ఏపీలో మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ కుంభకోణం.. అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ
తాత్కాలిక సుంకాలు 10 శాతం నుంచి 15 శాతానికి పెంపు... వెంటనే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు చెల్లవ్... పన్ను విధింపు కాంగ్రెస్ అధికారం మాత్రమే... అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
చంద్రబాబుదే కల్తీ పాపం.. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, వినియోగించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సర్కారు దగా... ఉప ప్రణాళిక నిధుల్లో 27 వేల కోట్ల రూపాయలు కోత
హెరిటేజ్తో ఇందాపూర్ డెయిరీ బంధంపై అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి
నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచల తీర్పు.. లొంగిపోవాల్సిందే..!
ఏపీలో వ్యవసాయం.. బాబు సర్కారులో అపాయం
బిజినెస్
2026లో పెరగనున్న వేతనాలు!
భారతీయ కార్పొరేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రానున్న ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు అందనుంది. 2025లో నమోదైన 8.9 శాతం వేతన పెంపు 2026లో 9.1 శాతానికి చేరుకోనుందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏయాన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. తాజాగా విడుదలైన ‘32వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2025-26’ ప్రకారం.. దేశంలోని 45 పరిశ్రమలకు చెందిన సుమారు 1,400 సంస్థల గణాంకాలను విశ్లేషించి ఈ అంచనాలను రూపొందించారు.రంగాల వారీగా వేతనాల జోరుఈ ఏడాది వేతన పెంపులో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థలు) రంగాలు అగ్రస్థానంలో నిలవనున్నాయి. సాంకేతికత, ఇంజినీరింగ్, కస్టమర్ ఫేసింగ్ విభాగాల్లో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం సంస్థలు పోటీ పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో చెప్పారు.ప్రధాన రంగాల అంచనాలుపరిశ్రమ2025 వాస్తవ పెంపు (%)2026 అంచనా (%)ఎన్బీఎఫ్సీ9.710.1రియల్టీ / ఇన్ఫ్రా10.510.2ఆటోమోటివ్9.89.9రిటైల్9.09.5టెక్నాలజీ7.06.6 తగ్గిన వలసలుగడిచిన మూడేళ్లుగా ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్-ఉద్యోగ మార్పు) క్రమంగా తగ్గుముఖం పట్టడం విశేషం.2023: 18.7%2024: 17.7%2025: 16.2%ప్రస్తుతం ఈ రేటు కొవిడ్ పూర్వపు స్థాయికి చేరుకుంది. కంపెనీలు అనుసరిస్తున్న మెరుగైన నియామక ప్రక్రియలు, ఉద్యోగుల నిలుపుదల కోసం చేపడుతున్న కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు ఈ సానుకూల మార్పుకు కారణమని నివేదిక పేర్కొంది.ఈ సందర్భంగా ఏయాన్ ఇండియా పార్టనర్ రూపాంక్ చౌదరి మాట్లాడుతూ..‘భారతదేశం ప్రస్తుతం బలమైన స్థూల ఆర్థిక పునాదులతో వృద్ధి పథంలో ఉంది. దేశీయ గిరాకీ పెరగడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల కంపెనీలు ప్రతిభావంతులపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు. దేశంలో కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తుండటంతో కంపెనీలు తమ వేతన నిర్మాణాలను మారుస్తున్నాయని ఏయాన్ అసోసియేట్ పార్టనర్ అమిత్ కుమార్ ఓత్వానీ తెలిపారు.ఇదీ చదవండి: రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?
రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?
నేటి డిజిటల్ యుగంలో ఓ పూట ఫుడ్ లేకపోయినా ఉండగలరేమో కానీ, ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఇళ్లలో వై-ఫై రౌటర్లు ఇప్పుడు నిత్యావసర వస్తువులైపోయాయి. అయితే రాత్రి నిద్రపోయే సమయంలో కూడా మీ రౌటర్ ఆన్ చేసే ఉంటుందా? అలా అయితే అది మీ ఆరోగ్యంపై, ముఖ్యంగా మీ నిద్రపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కలిగే లాభనష్టాలపై విశ్లేషణ మీకోసం..నిద్రలేమికి రౌటర్ కారణమా?చాలామంది ఉదయాన్నే నిద్రలేవగానే నీరసంగా, అలసటగా ఉన్నట్లు ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి గదిలో ఉండే వై-ఫై రౌటర్ నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలు ఒక కారణం కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.ఆర్ఎంఐటీ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) రిపోర్ట్: 2024లో వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం వై-ఫై రౌటర్ సమీపంలో నిద్రించే వారిలో 27 శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. 2.4 గిగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ గల వై-ఫై సిగ్నల్స్ మానవుల గాఢ నిద్రను తగ్గిస్తాయని ఒక పరిశోధనలో తేలింది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్-అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ వంటి సంస్థలు.. వై-ఫై రేడియేషన్ చాలా స్వల్పమని, ఇది మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపదని అంటున్నాయి.రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలురేడియేషన్ ప్రభావం పక్కన పెడితే రౌటర్ ఆఫ్ చేయడం వల్ల డిజిటల్ ప్రపంచం నుంచి మన మెదడుకు విరామం దొరుకుతుంది. ఇది మానసిక ప్రశాంతతో గాఢ నిద్రకు ఉపకరిస్తుంది.రౌటర్ నిరంతరం ఆన్ చేసి ఉంచడం వల్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. రాత్రిపూట ఆఫ్ చేయడం ద్వారా ఏడాదికి కొంత మేర విద్యుత్ ఆదా చేయవచ్చు.రాత్రిపూట ఇంటర్నెట్ వాడనప్పుడు వై-ఫై ఆఫ్ చేయడం వల్ల హ్యాకింగ్ ముప్పు తగ్గుతుంది. అలాగే అనవసరమైన బ్యాక్గ్రౌండ్ అప్డేట్స్ ఆగిపోయి డేటా మిగులుతుంది.నిరంతరం ఆన్లో ఉంటే వేడి వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల సామర్థ్యం తగ్గుతుంది. రాత్రి పూట పవర్ ఆఫ్ చేయడం వల్ల రౌటర్ జీవితకాలం పెరుగుతుంది.ఎప్పుడు ఆఫ్ చేయకూడదు?మీరు స్మార్ట్ హోమ్ టెక్నాలజీని వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని పరిస్థితుల్లో వై-ఫై ఆఫ్ చేయకపోవడమే మంచిది. అందులో..మీ ఇంట్లో సీసీ కెమెరాలు వై-ఫై ద్వారా పని చేస్తున్నప్పుడు.స్మార్ట్ డోర్ లాక్స్, వాయిస్ అసిస్టెంట్లు వాడుతున్నప్పుడు.సెక్యూరిటీ అలారమ్స్ యాక్టివ్గా ఉండాల్సినప్పుడు.ఒకవేళ మీరు వై-ఫై ఆఫ్ చేయలేని పరిస్థితులుంటే రౌటర్ను మీ బెడ్రూమ్లో కాకుండా హాలులో లేదా బెడ్కు కనీసం 10-15 అడుగుల దూరంలో అమర్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్
వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్
వినియోగంలో లేని (ఇనాపరేటివ్) దాదాపు ఏడు లక్షల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాల్లోని సుమారు రూ.30.52 కోట్ల మొత్తాన్ని రిఫండ్ చేయడంపై ఈపీఎఫ్వో దృష్టి పెడుతోంది. సదరు ఖాతాదారులు లేదా వారి లీగల్ వారసులకు త్వరలో బదిలీ చేయనున్నట్లు కార్మిక శాఖ వర్గాలు తెలిపాయి. రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న 7.11 లక్షల ఖాతాలను సెటిల్ చేయాలని కార్మిక, ఉపాధి శాఖ ఒక సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి.ఉద్యోగి లేదా కంపెనీ నుంచి 36 నెలలకు పైగా ఎలాంటి జమ లేని పీఎఫ్ ఖాతాలను ఇనాపరేటివ్గా పరిగణిస్తారు. సంబంధిత వర్గాల ప్రకారం 31.86 లక్షల ఇనాపరేటివ్ ఖాతాల్లో మొత్తం రూ. 10,903 కోట్లు ఉన్నాయి. వాటిలో రూ. 1,000 లేదా అంతకన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లు ఏడు లక్షలు ఉన్నాయి. ఆధార్తో అనుసంధానమైన ఈపీఎఫ్ ఖాతాలున్న వారి బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాలను తక్షణం బదిలీ చేయనున్నారు. ఇదీ చదవండి: పీఎఫ్పై లోన్ తీసుకోవచ్చా?ఖాతాదారు చనిపోతే..ఒకవేళ ఖాతాదారు మరణించిన పక్షంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులకు చెల్లిస్తారు. అటు, సభ్యులు, సంస్థలకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఈపీఎఫ్వో 3.0 ప్రాజెక్టుపై కేంద్రం కసరత్తు చేస్తోంది. (EPFO 3.0: పీఎఫ్ విత్డ్రా మరింత సులభం!)ఇదీ చదవండి: ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా?
స్వల్పంగా పెరిగిన బంగార ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ
పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్
పిల్లలను పెంచడం అనేది ఓ కళ, అది అతిపెద్ద బాధ్యత కూడా. అదొక్కటి కరెక్ట్గా ఉంటే..వాళ్ల భవిష్యత్తు కోసం బెంగ పడాల్సిన పని ఉండదు. కానీ ఇక్కడే ప్రతి పేరెంట్ తప్పటడుగులు వేస్తుంటారు. తమ పిల్లలనే అతిప్రేమ వల్లనో..అతిగారభం వల్లనో కొన్ని బాధ్యతలను నేర్పించడంలో విఫలమవుతుంటాం. తర్వాత బాధపడేది కూడా మనమే. కానీ ఇక్కడో తండ్రి..కోపం, మందలింపు చర్యలతో పనిలేకుండా చాలా సున్నితంగా..వ్యర్థాలను పడేయకూడదని చెప్పిన తీరు అందరీ మనసులను దోచుకుంది. ఇలా కదా పిల్లల్ని పెంచాలి అని అంతా మెచ్చుకునేలా ఉంది అతడి పేరెంటింగ్ స్టైల్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ట్రావెల్ వ్లాగర్ దీపక్ సమల్ తన కొడుకుతో కలిసి రైలులో ప్రయాణిస్తున్న వీడియోని షేర్చేశాడు. తన కొడుకు రైలులో చిప్ప్ తింటూ కింద చెల్లాచెదురుగా పడేస్తాడు. ఆ తర్వాత నాన్న వాటిని ఎవరు తీస్తారు అని అమాకంగా అడుగుతాడు కొడుకు. దాంతో ఇదేమి మన ఇల్లు కాదు. ఈ క్షణం మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి అది మనది. ఆ తర్వాత మరొకరిది. మనం పాడు చేస్తే..మనమే క్లీన్ చేయాలి. ఈ రైలు అందరిది. అని చెబుతాడు. వెంటనే ఆ చిన్నారి కాసేపు నిస్సహాయంగా ఉండిపోతాడు. ఆ తర్వాత నెమ్మదిగా వంగి ఒక్కో చిప్ని తీస్తూ శుభ్రం చేస్తాడు. అక్కడ ఆ తండ్రి ఓరేయ్ మొత్తం చెత్త వేశావ్, పాడు చేశావ్..అని అరవడం గానీ, తిట్టడం గానీ చేయలేదు. జస్ట్ తను చేసిన తప్పుని వివరించాడు. అది ఇతరులకు ఎలా ఇబ్బందిగా మారతుంది..మన బాధ్యత ఏంటో ఆ చిన్ని మనసుకి అద్దమయ్యేలా చెప్పిన తీరు చాలా బాగా ఆకట్టుకుంటుంది. పైగా మన చెత్త మన బాధ్యత అని తన కొడుకుకి సివిక్ సెన్స్ని చాలా సున్నితంగా నేర్పించాడు ఆ తండ్రి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం గుడ్ పేరెంటింగ్ స్టైల్ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అయినా రైళ్లను శుభ్రంగా ఉంచడం అనేది కేవలం సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు మనందరి ఉమ్మడి బాధ్యత. అందురూ తప్పక తెలుసుకోవాల్సింది , నేర్చుకోవాల్సింది కూడా అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Deepak Samal (@travelwithsamalvlogs) (చదవండి: కుక్క మొరగడంతోనే.. పెళ్లి ఆగిపోయింది..! ట్విస్ట్ ఏంటంటే..)
ఆయ్.. ఇది సినిమా ఇల్లండి..
బంజారాహిల్స్: ఫిలింనగర్లోని ఈ ఇల్లు సినిమా షూటింగ్లకు ప్రత్యేక గమ్యస్థానం. మూడు దశాబ్దాలుగా నిత్యం షూటింగ్ల కళకళతో వెలిగిపోతోంది. ఫిలింనగర్లో 1985లోనే విశాలమైన ప్లాట్లో ఏపీలో గోదావరి జిల్లాలు, గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాల నిర్మాణ శైలికి అనుగుణంగా చక్కని ఇంటిని నిర్మించారు. ఇటీవల సీరియల్స్ షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు, చిరంజీవి నుంచి మహేష్బాబు, అల్లు అర్జున్ల సినిమాల వరకు ఈ ఇంట్లో ఏదో ఒక దృశ్యం చిత్రీకరించడం విశేషం. ఆకట్టుకునే నిర్మాణం, విశాల ప్రాంగణం, సహజ వెలుతురు, పచ్చని లాన్తో కూడిన ఈ ఇల్లు నిజంగా ‘సినిమా వాళ్ల ఇళ్లు’ అనేలా ఉంది. దర్శక, నిర్మాతలు దీనిని షూటింగ్ లొకేషన్గా ఎంచుకోవడంతో రోజూ ఇక్కడ సినిమా సందడి కనిపిస్తుంటుంది. ఇంట్లోని ఆర్కిటెక్చర్, బాల్కనీలు, గార్డెన్ ఏరియా, ఇంటీరియర్ సెటప్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజీతో ఉండడంతో సినిమా సన్నివేశాలకు సహజ వేదికగా మారింది. ఒకేచోట ఇంటి సన్నివేశాలు, బయటి సన్నివేశాలు చిత్రించే వీలుండడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ ఇల్లు.. కెమెరాలు, క్లాప్లు, లైట్లు, టెక్నిషియన్ల సందడితో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సెట్లాగా మారిపోతుంది. నిజ జీవితంలో నివాసంగా ఉంటూనే తెరపై వేర్వేరు కథలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటివరకు 5 వేలకు పైగా సినిమా షూటింగ్లు ఇందులో జరిగాయి. చాలాసార్లు హీరో–హీరోయిన్ల నివాసాలుగా దీనినే చూపించారు. ఇటీవల టీవీ సీరియల్స్ షూటింగ్లు కూడా జోరుగా సాగుతున్నాయి.
వేడుకల్లో డెస్టినేషన్.. ఇప్పుడు ఓ క్రేజీ పేషన్
కరోనా సందర్భంగా ఊపందుకున్న డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ సంపన్న కుటుంబాల్లో ఇప్పుడు ఒక సంప్రదాయంగా స్థిరపడింది. సినిమా సెలబ్రిటీల ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) ఆలోచనల నుంచి పుట్టిన ఈ కొత్త పోకడ... తర్వాత సంపన్న కుటుంబాలకు విస్తరించింది. ఇప్పుడు ఎగువ మధ్య తరగతి కూడా ఇదే బాట పట్టేందుకు దారితీసింది. ఒకప్పుడు వేర్వేరు ప్రాంతాలలో కేవలం పెళ్లిళ్లకు మాత్రమే డెస్టినేషన్ అన్వేషించేవారు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్స్కు కూడా వ్యాపించింది. ఊళ్లను చుట్టేస్తున్న వివాహ వేడుకల ప్రక్రియగతంలో పెద్దింటి నుంచి పెళ్లి ఆహ్వానం వస్తే ఏ హోటల్లో?, ఏ ఆడిటోరియంలో? అని అడిగేవారు. ఇప్పుడు ఏ ఊర్లో..? ఏ టూరిస్ట్ ప్లేస్లో? అంటూ ఆసక్తి చూపే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో మరోసారి డెస్టినేషన్ వెడ్డింగ్స్ సందడి చేస్తున్నాయి. ఈ తరహా పెళ్లిళ్లు ఆన్లైన్లో తరచూ వైరల్ అవుతుండడం దీనికి మరింత క్రేజ్ పెంచుతోంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్తో మొదలు వివాహ సందర్భంగా ఊర్లు, టూర్లు వెళ్లడం అనేది ప్రీ వెడ్డింగ్ షూట్స్తో మొదలై పెళ్లితో ముగుస్తోంది. దంపతులు కాబోతున్న జంటతో పాటు కొందరు సన్నిహితులు, ఫొటో/వీడియోగ్రాఫర్లు కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అక్కడ కొన్ని రోజులు గడిపి అచ్చంగా సినిమా తరహాలోనే షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఈ తరహా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం గోవా, ఊటీ, కూర్గ్, మున్నార్... వంటి సుందరమైన ప్రకృతి అందాలకు నిలయమైన ప్రాంతాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.హల్దీ టు సంగీత్పెళ్లికి హాజరయ్యే అతిథులు పర్యాటక ప్రాంతాల అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. దంపతులు, ఇరు కుటుంబాలతో పాటు హాజరయ్యే బంధుమిత్రులు సైతం పూర్తిగా పెళ్లి వేడుకల్లో ఇతరత్రా అడ్డంకులు లేకుండా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అదే నివసించే ప్రాంతంలోనే అయితే వ్యక్తిగత పనులు, రోజువారీ కార్యకలాపాల్లో పెళ్లికి హాజరవడం ఒక భాగంగా మాత్రమే పరిమితం అవుతుంది. సంగీత్, హల్దీ... వంటి భిన్న రకాల కార్యక్రమాలతో పాటు మొత్తం వేడుకల్లో హాజరైనవారిలో అత్యధికులు భాగం పంచుకునే వీలుంటుంది.సెలబ్రిటీ..నీవు నేరి్పన విద్యే టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మికా, విజయ్ దేవరకొండల పెళ్లి ఫలానా నెలలో జరుగుతుంది అని తెలియగానే అది డెస్టినేషన్ వెడ్డింగే అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అంతగా సెలబ్రిటీ సర్కిల్లో మమేకమైపోయిన ఈ ట్రెండ్ ఇప్పుడు సంపన్నులనూ ఆకర్షిస్తోంది. గత ఏడాది చివరిలో నగరవాసి, అమెరికాలో స్థిరపడిన పారిశ్రామికవేత్త రామరాజు మంతెన కుమార్తె నేత్రా మంతెన–వంశీ గాదిరాజు వివాహ వేడుకను ఉదయ్పూర్ ప్యాలెస్లో నిర్వహించారు. దీనికి ఏకంగా హాలీవుడ్ నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ సైతం హాజరవగా, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ నృత్య కార్యక్రమం హైలైట్గా నిలిచింది. డెస్టినేషన్ను పేషన్గా మారుస్తున్నవి ఇవే.. పెళ్లిని ఒక గొప్ప జ్ఞాపకంగా మార్చుకోవాలనే ఆలోచన, ఈ వేడుకలను అత్యంత సన్నిహితులు, బంధువులకు మాత్రమే పరిమితం చేయాలని భావించే ధోరణి పెరుగుతోంది. ఇదే డెస్టినేషన్ వెడ్డింగ్కు ఆదరణ పెంచుతోంది. స్థానికంగా నివసించే చోట పెళ్లి నిర్వహిస్తే రకరకాల సమస్యలు ముఖ్యంగా మీడియా నుంచి ప్రైవసీ ఉండదని తొలుత సెలబ్రిటీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటే అనంతరం రిచ్/పోష్ సర్కిల్ కూడా అదే బాట పట్టింది. పేరొందిన డెస్టినేషన్ వెడ్డింగ్స్.. ఇవే! రాజస్థాన్లోని ఉదయ్పూర్ (సిటీ ఆఫ్ లేక్స్), జోథ్పూర్ (బ్లూసిటీ), జైపూర్ (పింక్ సిటీ), జై సల్మేర్ గోవాలోని పలు రిసార్ట్స్, క్లబ్స్, బీచ్లు హిమాచల్ప్రదేశ్, సిమ్లా, మనాలి, రిషికేష్ ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ విభిన్న రకాల ప్యాకేజీలుడెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహించేందుకు పలు ఆన్లైన్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి వివిధ ధరల్లో ప్యాకేజ్ కూడా అందిస్తున్నాయి. కనీసం 50 నుంచి 100 మందితో కూడిన బృందానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల్లో కూడా ప్యాకేజ్ అందుబాటులో ఉంది. ఎంచుకున్న ప్లేస్, పాల్గొనేవారి సంఖ్యను బట్టి ఇది రూ.70 లక్షల వరకు పెరుగుతుంది. పలు రకాల ఈవెంట్లను కూడా వీటికి మేళవిస్తే ఆ ప్యాకేజీ రూ.కోటిపై మాటే. అయితే, రూ.కోట్లు వెచ్చించే సంపన్నులకు కొదవలేదు కాబట్టి ఈవెంట్ నిర్వాహకులకు మ్యారేజ్ సీజన్లో తగినంత డిమాండ్ ఉంటోంది.
పిప్పీ.. డుం డుం..
నగరంలో పెళ్లిసందడి మొదలైంది.. వరుస ముహూర్తాలతో పెళ్లిబాజాలు మోగుతున్నాయి. దీంతో వేలాది కొత్త జంటలు ఒక్కటి కానున్నాయి. మూడు నెలలుగా ఉన్న మూఢాలు తొలగిపోయి.. తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి.. దీంతో ఎంతో కాలంగా ఒక్కటవ్వాలని భావిస్తున్న వధూవరులకు మళ్లీ మంచి రోజులతోపాటు పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది.. వేలాది జంటలతో.. వరుస ముహూర్తాలతో వివాహ వేదికలు, కళ్యాణ మండపాలు సందడిగా మారాయి. ఈనెల 17తో శుక్రమౌఢ్యమి అమావాస్య ముగిసింది. మూడు నెలల తర్వాత ముహూర్త బలం పెరిగింది. నగరంలోని ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాళ్లకు ముందస్తు బుకింగ్లతో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వేద మంత్రాలు ఉచ్చరించే పంతుళ్లు, బాజాభజంత్రీలు, స్టేజ్ డెకరేషన్ వర్కర్లు, వంట మనుషులు, సర్వీసు బాయ్స్, కేటరర్స్, ఈవెంట్ మేనేజర్లకు చేతినిండా పని దొరికింది. డిసెంబర్ నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభ కార్యాలు నిలిచిపోయాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను వాయిదా వేసుకోవాల్సి వచి్చంది. దీంతో నిన్న మొన్నటి వరకు ఖాళీగా కనిపించిన వాళ్లంతా ప్రస్తుత శుభ ముహూర్తాలతో బిజీగా మారారు. మార్చిలో పండుగలు మార్చి 2న కామదహనం, 3న హోలీ, 19న ఉగాది, 27న శ్రీరామ నవమి పండుగలు ఉన్నాయి. మార్చి 27 నుంచి మే 14 వరకు మంచి లఘ్నాల ఉన్నాయి. మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ట మాసం ఉన్నందున శుభ కార్యాలు చేయొద్దని పండితులు చెబుతున్నారు. తిరిగి జూన్ 17 నుంచి జూలై 9వ తేదీ వరకు నిజ జ్యేష్ట మాసంలో మంచి రోజులు ఉన్నందున శుభకార్యాలు చేసుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయం
అమెరికా పేరు చెబితేనే వణుకుతున్నారు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా రెండో విడత బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రంప్ తొలిసారి కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం ప్రస్తుతం ఒక అద్భుతమైన మార్పునకు సాక్ష్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. తన పరిపాలనలో గడిచిన ఏడాది కాలం అమెరికా చరిత్రలోనే ఒక గొప్ప మలుపుగా అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పుంజుకుంటోందని పేర్కొన్నారు. స్వర్ణయుగం దిశగా అమెరికా పయనిస్తున్నదని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చే నాటికి దేశం తీవ్ర సంక్షోభంలో ఉందని, కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, అదుపులేని సరిహద్దు సమస్యలు, పెరుగుతున్న నేరాలతో సతమతమవుతున్న అమెరికాను కేవలం ఏడాది కాలంలోనే ప్రపంచం గర్వించే స్థాయికి చేర్చానని ట్రంప్ పేర్కొన్నారు. సభలో ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆయన మద్దతుదారులు ‘యూఎస్ఏ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. US President Donald Trump joked about having a third term during his 2026 State of the Union address pic.twitter.com/wx89Zq7Sqe— NDTV (@ndtv) February 25, 2026దేశ భద్రత, సరిహద్దు రక్షణపై ట్రంప్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా చెప్పారు. అమెరికా సరిహద్దులు ప్రస్తుతం అత్యంత సురక్షితంగా ఉన్నాయని, శత్రు దేశాలవారు అమెరికా పేరు చెబితేనే వణుకుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సైనిక, పోలీసు బలగాలను మునుపటి కంటే మరింత శక్తివంతం చేశామని, దీనివల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకుందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న తరుణంలో కూడా అమెరికా తన బలాన్ని నిరూపించుకున్నదని, రానున్న రోజుల్లో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ట్రంప్ తన విజయాలను చాటుకుంటున్న సమయంలోనే, ఆయన విదేశాంగ విధానాలు, సుంకాల విధింపుపై ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. గతంలో ప్రభుత్వం విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేయగా, తాజాగా 15 శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.అటు ఇరాన్తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, దాడుల భయాల మధ్య ఈ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు దేశీయంగా పెరుగుతున్న జీవన వ్యయం, వలసల నియంత్రణ వంటి అంశాల్లో ట్రంప్ తీరుపై ప్రజల్లో కొంతమేరకు అసంతృప్తి వ్యక్తమవుతోందని ఇటీవలి ప్రజాభిప్రాయ సేకరణలు వెల్లడిస్తున్నాయి. ఈ సవాళ్ల మధ్యే, తన ప్రభుత్వం సాధించిన మార్పు సామాన్యమైనది కాదని, ఇది రాబోయే తరాలకు దిక్సూచిగా నిలుస్తుందని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.డొనాల్డ్ ట్రంప్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలోని ప్రధాన అంశాలుఅమెరికాలో సరికొత్త స్వర్ణయుగం ప్రారంభం.దేశ పునర్నిర్మాణానికి నాందిగా గత ఏడాది కాలం.అమెరికా ఆత్మగౌరవం పునరుద్ధరణ మరియు ఆర్థిక వ్యవస్థ వేగవంతం.ప్రపంచ దేశాల ముందు పెరిగిన అమెరికా గౌరవం.గత తొమ్మిది నెలల్లో అక్రమ వలసలు శూన్యం.చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన సరిహద్దు భద్రత.కేవలం 12 నెలల్లోనే ద్రవ్యోల్బణం అదుపులోకి..2025 చివరి త్రైమాసికంలో 1.7 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం..అనేక రాష్ట్రాల్లో గాలన్ పెట్రోల్ ధర 2.30 డాలర్ల కంటే తక్కువకు తగ్గింపు.కొన్ని చోట్ల 1.99 డాలర్లకే లభిస్తున్న పెట్రోల్..పెట్టుబడులు, పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాల వెల్లువ..చమురు అవసరాల కోసం వెనిజులాతో సరికొత్త భాగస్వామ్యం..వెనిజులా నుంచి ఇప్పటికే 80 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి.వెనిజులా ఇంధన రంగంలో అమెరికా సంస్థల 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక.ఇరు దేశాల మధ్య చమురు లాభాల పంపకం.'డ్రిల్, బేబీ, డ్రిల్' నినాదంతో ఇంధన స్వయంసమృద్ధి.టారిఫ్లపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల తీవ్ర అసహనం.విదేశీ కంపెనీలు ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా కఠిన చర్యలు.ఎన్నికల సంస్కరణల కోసం కాంగ్రెస్కు పిలుపు.ఓటర్లకు గుర్తింపు కార్డు, పౌరసత్వ ధృవీకరణ తప్పనిసరి30 మంది డెమొక్రాట్ ప్రతినిధుల ప్రసంగ బహిష్కరణడెమొక్రాట్ల ఆధ్వర్యంలో 'పీపుల్స్ స్టేట్ ఆఫ్ ది యూనియన్' కార్యక్రమం.సభలో రిపబ్లికన్ల 'USA' నినాదాల హోరునిరసన తెలిపిన కాంగ్రెస్ సభ్యుడు అల్ గ్రీన్ సభ నుంచి బహిష్కరణవాషింగ్టన్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో నేరాల అదుపునకు హామీ.అమెరికా ప్రజల భద్రతే ప్రధమ ప్రాధాన్యతసైనిక, పోలీసు బలగాల పటిష్ఠతశత్రువుల గుండెల్లో భయం, సరిహద్దుల రక్షణదేశ ఆర్థిక, రక్షణ రంగాల్లో చారిత్రాత్మక పురోగతి.
ఉక్రెయిన్కు అణ్వాయుధాలు.. ఆ రెండు దేశాలపై రష్యా ఆరోపణలు
మాస్కో: ఉక్రెయిన్కు గుట్టుచప్పుడు కాకుండా అణ్వాయుధాలను బదలాయించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మంగళవారంతో ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశీ నిఘా విభాగం (ఎస్వీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. ఇది చాలా ప్రమాదకర పరిణామమంటూ క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ ఆందోళన వెలిబుచ్చారు. యుద్ధానికి తెర దించేందుకు జరుగుతున్న చర్చల్లో తాము విధించిన ప్రధాన షరతుల్లో ఉక్రెయిన్ అణ్వస్త్రరహిత దేశంగా ఉండటం అతి ముఖ్యమైనదని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి నాలుగేళ్లు నిండాయి. ఇరువైపులా లక్షలాది మంది సైనికులు సమరంలో సమిధలుగా నేలకూలినా రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ దాహం తీరడం లేదంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహిస్తున్నాయి. కానీ ఈ పోరును ఆపలేక చేష్టలుడిగి చూస్తున్నాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి విఫలమై చోద్యం చూస్తోంది. ఉక్రెయిన్ రణక్షేత్రంలో రక్తధారాలు ఆగి శాంతి కపోతం ఎగురుతుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి ఎవరూ బదులు చెప్పలేని పరిస్థితి!ఉక్రెయిన్పై తక్షణం యుద్ధం ఆపకపోతే రష్యాపై మరిన్ని అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. అందుకు జూన్ దాకా గడువు విధించారు. ఆలోపు పుతిన్ వైఖరి మారేనా? యుద్ధానికి తెర దించేందుకు అంగీకరిస్తారా? బదులుగా ఉక్రెయిన్లోని కీలక డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుకునేందుకు అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తారా? ఇవి ప్రస్తుతానికి ట్రిలియన్ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలాయి.2022 ఫిబ్రవరి 24న మొదలు... 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకున్నాక కూడా రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ఏకపక్షంగా దండెత్తింది. నాటి నుంచీ పోరాడుతున్నా ఉక్రెయిన్ నుంచి 20 శాతం భూభాగాన్ని మాత్రం ఆక్రమించుకోగలిగింది. ఈ క్రమంలో ఇరువైపులా ఏకంగా 20 లక్షల మంది సైనికులు చనిపోయారని వార్తలొచ్చాయి! అయితే 3,25,000 మంది రష్యా సైనికులు చనిపోయారని, మొత్తంగా 12 లక్షల మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ ప్రకటించింది.ఉక్రెయిన్ వైపు 140,000 మంది సైనికులు చనిపోయారని, 6 లక్షల మంది గాయపడ్డారని తెలిపింది. రష్యా ఆక్రమణ వేగం నత్త కన్నా మెల్లగా ఉందని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే ఎద్దేవా చేశారు. ఐరోపా దేశాల ఆయుధ, ఆర్థికబలంతో రష్యాపై ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతోంది. అందుకే నాలుగేళ్లలో డోనెట్స్క్ ప్రాంతంలో రష్యా కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే ముందుకు రాగలిగిందని అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇటీవల తాము ఆక్రమించిన నాలుగు ప్రాంతాలపై ఉక్రెయిన్ హక్కులు వదలుకోవాలని, ముఖ్యంగా కీలక డోన్బాస్ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అందుకు జెలెన్స్కీ ససేమిరా అంటున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఐరాసలో భారత్ తటస్థం
న్యూయార్క్: ఐదేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంక్షోభంలో శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (UNGA)లో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. రష్యా దళాలు తక్షణమే ఉక్రెయిన్ నుంచి తప్పుకోవాలని, తద్వారా శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాలంటూ ఉక్రెయిన్ ప్రతిపాదించిన ‘సపోర్టింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ ఇన్ ఉక్రెయిన్’ తీర్మానంపై మంగళవారం జరిగిన ఓటింగ్లో భారత్ తటస్థ వైఖరిని అవలంబించింది.మొత్తం 107 దేశాలు ఈ తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా, 12 దేశాలు దీనిని వ్యతిరేకించాయి. భారత్తో పాటు చైనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యూఏఈ, అమెరికా తదితర 50 దేశాలు ఓటింగ్లో పాల్గొనకుండా దూరంగా ఉండటం గమనార్హం. కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈ ఏడాది ఫిబ్రవరితో ఐదో ఏట అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ తీర్మానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్.. ఈ పోరాటాన్ని సామూహిక మనస్సాక్షిపై ఒక మచ్చగా అభివర్ణించారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి, ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ శాంతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.2025లో పౌర మరణాలు గరిష్ట స్థాయికి చేరడంపై గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని పట్టుబట్టారు. మరోవైపు ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్మానం ఆమోదం పొందడం శాశ్వత శాంతికి అవసరమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురైనప్పటికీ, లొంగిపోయే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. జూన్ నాటికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అమెరికా గడువు విధించిన నేపథ్యంలో, తదుపరి దశ చర్చలు మయామిలో జరిగే అవకాశం ఉందని సమాచారం. తాజాగా మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయడం, ఫలితంగా రష్యాలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేయడం లాంటి పరిణామాలు ఉద్రిక్తతలను మరింతగా పెంచుతున్నాయి.ఇది కూడా చదవండి: సీబీఎస్ఈ వార్నింగ్: విశ్లేషకులపై కఠిన చర్యలు
యుద్ధనౌకలో టాయిలెట్ కష్టాలు
వాషింగ్టన్: యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన యుద్ధవిమాన వాహననౌక. అమెరికా అమ్ములపొదిలోని శక్తివంతమైన సముద్ర ఆయుధంగా దీనికి పేరుంది. గత 8 నెలలుగా సముద్రజలాల్లో విధుల్లో పాల్గొంటూ వెనెజువెలాలో మదురోపై మెరుపుదాడి చేసిన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ బాధ్యతలను నిర్వర్తించిన ఘనత జెరాల్డ్ యుద్ధనౌకదే. వెనెజువెలా మొదలు ఇరాన్ దాకా పలు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ నౌక ఇప్పుడు సొంత సిబ్బందికీ సమస్యలు తెచి్చపెడుతోంది. 8 నెలలుగా సముద్రంలో ఎలాంటి పూర్తిస్థాయి మెయింటెన్స్లేకపోవడంతో ఇందులోని టాయిలెట్, మురుగునీటి పారుదల వ్యవస్థలు దాదాపు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో నౌకలోని 650 టాయిలెట్లు పనిచేయకుండా పోయాయి.ఫ్లష్ విధానంలో పనిచేసే అధునాతన టాయిలెట్లు తరచూ మొరాయిస్తుండటంతో నిర్వహణ సిబ్బంది రోజుకు దాదాపు 19 గంటలు వీటిని మరమత్తుచేయడంలో మునిగిపోతున్నారు. దీంతో నౌకలోని దాదాపు 5,000 మంది సిబ్బంది కాలకృత్యాల కోసం క్యూ వరసల్లో నిలబడి అవస్థలు పడుతున్నారు. యుద్ధరంగంలో శత్రువుకు ఎదురు నిలబడాల్సిన సెయిలర్లు ఇలా టాయిలెట్ల వద్ద నిలబడి తమ వంతు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇందులో విధులు నిర్వర్తించలేక తిరుగుపయనమైన కొందరు నావికులను ఇంటర్వ్యూచేసి ప్రఖ్యాత వాల్స్ట్రీట్ జర్నల్ సంస్థ ఒక సమగ్ర కథనాన్ని వెలువర్చింది. అణువిద్యుత్తో పనిచేసే ఈ యుద్ధనౌక అమెరికా విదేశాల్లో సముద్రజలాల వేదికగా జరిపే దాడులకు గుండెకాయగా ఉంటోంది. బ్లాకేజీలు.. లీకేజీలు.. గత షెడ్యూల్కు మించి ఏకంగా ఎనిమిది నెలలుగా నౌకాశ్రయానికి రాకుండా అంతర్జాతీయ సముద్రజలాల్లోనే ఉండిపోవడంతో మెయింటెన్స్ అనేది లేకుండా పోయింది. దీంతో నౌకలోని మురుగునీటి పారుదల వ్యవస్థ దాదాపు విఫలమైంది. నౌకలోని అత్యధిక స్థలాన్ని యుద్ధ ఆయుధాలు, అనుబంధ వ్యవస్థల కోసం కేటాయించి టాయిలెట్లను ఇరుకైన ప్రాంతాల్లో చిన్నగా నిర్మించారు. ఇది కూడా సీవేజ్ వ్యవస్థ వైఫల్యానికి మరో కారణమని చెబుతున్నారు. ఇది నావికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని, పలువురు ఉద్యోగాలకు రాజీనామా చేసి అమెరికాకు తిరిగొచ్చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొండిగా మరి కొన్ని నెలలపాటు నౌకను సముద్రంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధం ఇంకా మొదలుకాలేదు. యుద్ధం ఆరంభమైతే ఈ నౌక నుంచే ఎఫ్–18 యుద్ధవిమానాలు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.కీలకమైన మిషన్ కావడంతో నౌకను ఇప్పట్లో వెనక్కి తీసుకొచ్చే ఆలోచన లేదని తెలుస్తోంది. దీంతో ఇంకెంతకాలం నౌకలో ఉండిపోవాలనే బాధ నావికుల్లో గూడుకట్టుకుపోయిందని వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. పశ్చిమాసియాలో పాగా వేసిన యుద్దనౌకలోని టాయిలెట్ వ్యవస్థను సరిచేసేందుకు సాంకేతిక నిపుణులు రోజుకు 19 గంటలు నిరాటంకంగా పనిచేయాల్సివస్తోంది. కొన్ని చోట్ల బ్లాకేజీలు ఉంటే మరికొన్ని చోట్ల లీకేజీలు ఇబ్బంది పెడుతున్నాయి. టీ–షర్ట్లు మొదలు నాలుగు అడుగుల తాడుసహా ప్రతిదానితో లీకేజీలను అడ్డుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. గతంలోనూ ఇదే తీరునౌకలో టాయిలెట్ సమస్య గతంలోనూ వెలుగుచూసింది. గత ఏడాది మార్చిలో నాలుగు రోజుల వ్యవధిలోనే 205 టాయిలెట్లు పనిచేయకుండా చేతులెత్తేశాయి. వాక్యుమ్ ఆధారిత వ్యవస్థపై ఈ టాయిలెట్లు పనిచేస్తున్నాయి. అంటే ఒక వాల్్వలో ఏదైనా సమస్య వస్తే దానితో అనుసంధానమైన టాయిలెట్లు అన్నీ పనిచేయకుండా పోతాయి. దీంతో సమస్య శృంఖల చర్యల పెరుగుతూపోయి మరింత పెద్దదవుతుంది. వాల్్వలోపల కాల్షియం పేరుకుపోవడంతో ఈ సమస్య దాపురించిందని టెక్నీíÙయన్లు చెప్పారు. సన్నటి పైపులు ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. సమస్యకు చెక్పెట్టేందుకు ప్రతిసారి యాసిడ్ ద్రావకాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఖర్చు తడిసిమోపెడవుతోంది.ప్రతిసారీ యాసిడ్ కోసం ఏకంగా రూ.3.63 కోట్లు ఖర్చుచేస్తున్నారు. సెయిలర్లలో అత్యధికులు 20 ఏళ్లలోపు వాళ్లే. శాంతికాలంలో ఇలాంటి యుద్దనౌకలో గరిష్టంగా ఐదారు నెలలకుమించి సముద్రజలాల్లో ఉండవు. కానీ ఇప్పుడు ఎలాంటి యుద్ధం లేకపోయినా ఎనిమిది నెలలుగా పశి్చమాసియా సముద్రజలాల్లో కుటుంబసభ్యులకు దూరంగా ఉండటంతో నావికుల మనోధైర్యం దెబ్బతింటోంది. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, చివరకు బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లలేకపోతున్నామని పలువురు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం తనదైన శైలిలో స్పందించినట్లు తెలుస్తోంది. ‘‘ఇంతకంటే పెద్ద సమస్యలు దేశానికి ఉన్నాయి. వాటి సంగతి చూడాలి’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నౌకను ఏకంగా రూ.1.18 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ నౌకతోపాటు మరో యుద్ధవిమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్నూ అమెరికా రంగంలోకి దింపింది. వీటితోపాటు తొమ్మిది డి్రస్టాయర్ నౌకలు, మూడు లిట్లోరల్ యుద్ధనౌకలు పశి్చమాసియాలో మొహరించాయి. ఇన్నేసి నౌకలను అమెరికా పశి్చమాసియాలో మొహరించడం అత్యంత అరుదైన విషయమని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు.
జాతీయం
కేరళ ‘కేరళం’.. బెంగాల్ ‘బంగో’ అయ్యేదెన్నడు?
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మారుస్తూ పంపిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా దశాబ్దాల కాలంగా మలయాళీలు కోరుకుంటున్న తమ రాష్ట్ర అసలు పేరు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళ పేరు మార్పునకు సానుకూలంగా స్పందించిన కేంద్రం, పశ్చిమ బెంగాల్ విషయంలో కొన్ని దశాబ్దాలుగా విముఖత వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది.పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగో’ లేదా 'బంగ్లా'గా మార్చాలని నాటి జ్యోతి బసు నుండి నేటి మమతా బెనర్జీ వరకు కనీసం నాలుగు సార్లు అసెంబ్లీ తీర్మానాలు చేసినా కేంద్రం వాటిని తిరస్కరించింది. ముఖ్యంగా అక్షర క్రమం ప్రకారం అధికారిక సమావేశాల్లో తమ రాష్ట్రం(వెస్ట్ బెంగాల్) పేరు చివరన రావడం వల్ల, తమకు మాట్లాడే అవకాశం అందరికంటే చివర్లో వస్తోందని, తద్వారా రాష్ట్ర సమస్యలను వివరించే సమయానికి ఏకాగ్రత తగ్గుతోందని మమతా బెనర్జీ గతంలో వాదించారు.2016లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు పేర్లు (ఆంగ్లంలో బెంగాల్, బెంగాలీలో బంగ్లా, హిందీలో బంగాల్) విధానాన్ని కేంద్రం తిరస్కరించింది. రాష్ట్రం మొత్తానికి ఒకే పేరు ఉండాలని కేంద్రం స్పష్టం చేయడంతో, 2018లో ‘బంగ్లా’ అనే పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించినా, ఆ పేరు పొరుగు దేశమైన 'బంగ్లాదేశ్'ను పోలి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.కేరళ ప్రతిపాదన ఆమోదం పొందడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కేరళలో బీజేపీ, సీపీఎం మధ్య ఉన్న రహస్య ఒప్పందం వల్లే ఈ నిర్ణయం వేగంగా జరిగిందని ఆమె ఆరోపించారు. బెంగాల్పై కేంద్రం వివక్ష చూపుతోందని, అయినా తాము ‘బంగ్లా’ పేరు కోసం పోరాడుతూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాల పేర్ల మార్పులో పార్లమెంటుదే తుది నిర్ణయం అయినందున ఈ విషయంలో బెంగాల్ పేరు మార్పునకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది కూడా చదవండి: చావబోయే పాక్ ప్రధానిని కాపాడా: ట్రంప్
టీనేజ్ డ్రైవర్ : విషాదాంతమైన గోవా టూర్, వీడియో వైరల్
గోవాలోని అందమైన ప్రదేశాలను చూసి తరించాలని ఆశపడిన టూరిస్టు కుటుంబంలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. గోవాలోని అస్సాగావ్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయిభోపాల్కు చెందిన 65 ఏళ్ల పర్యాటకుడు భగత్రామ్ శర్మ (65) కుటుంబంతో కలిసి హ్యుందాయ్ i20 కారులో గోవాకు బయలుదేరారు.ఉత్తర గోవాలోని 'హ్యాపీ బార్' జంక్షన్ వద్ద అతివేగంతో వచ్చిన ఒక అద్దె మహీంద్రా థార్ (Thar) కారు, పర్యాటకులు వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రతకు భగత్రామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న ఐదు నెలల చిన్నారి ఎటువంటి గాయాలు లేకుండా బయటపడింది.సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల ప్రకారం, థార్లోని ఒక యువకుడు ఫోన్లో మాట్లాడుతూ "నాన్న, నేను ఇంటర్సెక్షన్ దగ్గర ఉన్నాను..." అని చెప్పడం వినిపించింది. కారు వెనుక సీట్లో ముగ్గురు యువతులు ఉన్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే థార్ కారులోని వ్యక్తులు సీట్లు మారడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. అసలు డ్రైవర్ను (నిందితురాలిని) కాపాడేందుకు వారు ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. 19 ఏళ్ల టీనేజరే ఈ విషాదానికి కారణమని అనుమానిస్తున్నారు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అద్దె వాహనాన్ని సీజ్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ , నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైనట్లు కేసు నమోదు చేశారు. అలాగే నిజంగా డ్రైవర్ను మార్చారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జంక్షన్ వద్ద ఉన్న CCTV ఫుటేజీని, ఫోరెన్సిక్ సాక్ష్యాలను ,ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను సేకరిస్తున్నారు.Not all Thar, but Always a Thar!Thar Accident in Goa!pic.twitter.com/bmebwnUEBt— My Vadodara (@MyVadodara) February 24, 2026 t>
ఆంటీ ఫోన్ నంబర్ ఇవ్వకపోతే అంకుల్ని చంపేస్తా..!
మైసూరు(కర్ణాటక): ఫోన్ నంబర్ ఇవ్వకపోతే చంపేస్తాను అని గృహిణిని వేధించిన రోమియోపై విజయ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. విజయ నగర్లోని యోగ నరసింహ ఆలయం సమీపంలో ఓ గృహిణి నివసిస్తోంది. ఆమె ఇంటి పక్కలో నివసిస్తున్న హింకల్ నివాసి దేవరాజు.. తరచుగా గృహిణితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఇటీవల రోడ్డుపై వెళ్తున్న గృహిణిని అడ్డగించిన దేవరాజు.. మొబైల్ ఇవ్వాలని బెదిరించాడు. నంబర్ ఇవ్వకపోతే నీ భర్తను చంపేస్తాను అని వేధించాడు. దీంతో విసిగిపోయిన ఆమె విజయ నగర పోలీస్ స్టేషన్లో దేవరాజుపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నవ దంపతులకు అవమానం.. వీడియో వైరల్
యూత్ కాంగ్రెస్ చీఫ్ అరెస్టు
న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సు వేదిక వద్ద అర్ధ నగ్న నిరసన ప్రదర్శన కేసులో భారత యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది. చిబ్ను ఉదయం 4:30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని ఉదయం 10 గంటలకు పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనపై నేరపూరిత కుట్ర, ప్రభుత్వోద్యోగికి హాని కలిగించడం, విధి నిర్వహణను అడ్డుకోవడం, ఉద్దేశపూర్వక అవిధేయత వంటి పలు అభియోగాలు నమోదు చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిరసన ప్రదర్శనకు ప్రధాన సూత్రధారి, కుట్రదారు ఆయనేనని పోలీసులు పేర్కొన్నారు. ‘‘ఇది నేపాల్లో జెన్–జీ నిరసనల నుంచి ప్రేరణ పొందిన పెద్ద కుట్ర. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అందులో పాల్గొన్నారు. ఈ దర్యాప్తు చాలా ముఖ్యమైనది’’అని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే చిబ్ నిరసన స్థలంలో లేరని, నిరసనకు సంబంధించి ఎలాంటి సూచనలూ చేయలేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అంతర్జాతీయ కార్యక్రమాల సందర్భంగా నిరసనలు పరిపాటేనని వాదించారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని అంతా అభినందిస్తుంటే నిరసనలకు నిరాకరించడం ఏమిటని ప్రశ్నించారు. వాదనల అనంతరం చిబ్కు జడ్జి నాలుగు రోజుల పోలీసు రిమాండ్ విధించారు.గత శుక్రవారం ఢిల్లీలో ఏఐ సదస్సు వేదికైన భారత మండపం ముందు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు టీ షర్టులు విప్పి అర్ధనగ్న నిరసనలకు దిగడం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన నరసింహ యాదవ్ కూడా ఉన్నారు. వేదిక వద్దకు ప్రవేశం కోసం వారంతా ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయని వెల్లడించారు. ఏఐ సదస్సు నిరసన కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. తదుపరి దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ తాలూకు ఇంటర్ స్టేట్ సెల్ (ఐఎస్సీ) నిర్వహిస్తుంది. నియంతృత్వం: రాహుల్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. చిబ్, ఇతర యువజన కాంగ్రెస్ నేతల అరెస్టులను ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది మోదీ సర్కారు నియంతృత్వ ధోరణులకు, పిరికితనానికి నిదర్శనమంటూ దుయ్యబట్టారు. దేశ ప్రయో జనాల కోసం నిర్భయంగా గొంతెత్తిన యువజన కాంగ్రెస్ సభ్యులను చూస్తే గర్వంగా ఉందన్నారు.భయపడేది లేదు: ఖర్గే అరెస్టులకు కాంగ్రెస్ భయపడబోదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ‘‘మమ్మల్ని భయపెట్టాలని మోదీ ప్రయతి్నస్తున్నారు. అదెన్నటికీ జరగదు. ఆయన సర్కారు ట్రంప్కు లొంగిపోయింది. ఆయన షరతులన్నింటికీ తలూపింది. ఉపాధి లేక దేశ యువత తీవ్ర నిరాశలో కూరుకుపోతోంది. మోదీ సర్కారుపై వారిలో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి’’అని ఆయన పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు.
ఎవరీ వంది వర్మ...? మార్స్ రోవర్స్ తొలి ప్లాన్ డ్రైవ్..
అంగారక గ్రహంపై నాసా తొలి ఏఐ ప్లాన్ డ్రైవ్ వెనుక ఉన్న ప్రధాన శాస్త్రవేత్తగా భారత సంతతి మహిళ వంది వర్మ చరిత్ర సృష్టించారు. భారత్కి చెందిన ఈ రోబోటిక్స్ ఇంజనీర్ వంది వర్మ విమానాయనానికి సంబంధించిన కుటుంబంలోనే పెరగడంతో సాంకేతికను అన్వేషించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. నాసా ప్రకారం..వర్మ జేపీఎల్ ప్రిన్సిపాల్ ఇంజనీర్గా, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో మొబిలిటీ అండ్ రోబోటిక్స్ విభాగానికి డిప్యూటీ సెక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థకు ముందు, అధికారికంగా ధృవీకరించిన ప్లాన్ అములు చేసే భాష PLEXIL, రోవర్లు, మానవ అంతరిక్ష ప్రయాణ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతికతను డెవలప్చేయడానికి రూపొందించిన బృందానికి ఆమె నాయకత్వం వహించినట్లు నాసా పేర్కొంది. ఆ కారణంతోనే రోబోటిక్ ఇంజనీరింగ్నే కెరీర్గా ఎంచుకుంది..వర్మ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. విమానాలు,ఇంజనీరింగ్ వాతావరణాలతో ఆమెకు తొలి దశలో పరిచయం ఉండటం వల్ల ఆమెకు టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి, తర్వాత కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్స్లో మాస్టర్స్ అండ్ పిహెచ్డి పొందారామె. ఇక వర్మ డిసెంబర్ 8 నుంచి 10 తేదీల్లో ఏఐ ప్లాన్ పెర్సెవరెన్స్ మార్స్ రోవర్ మొదటి డ్రైవ్లను పూర్తి చేసినట్లు నాసా ధృవీకరించింది. ఈ ప్రదర్శనం మన సామర్త్యాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో చెబుతుండటమే గాక, ఇతర ప్రపంచాలను ఎలా అన్వేషించాలో తెలుపుతుందని నాసా అడ్మినిస్ట్రేర్ జారెడ్ ఐజాక్మాన్ చెబుతున్నారు. (చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!)
పావురాలకు దాణా వేస్తే 2.2 లక్షల జరిమానా
సింగపూర్: భారత్లో పలు నగరాల్లో విపరీతంగా కన్పించే పావురాలను అమితంగా ఇష్టపడుతూ వాటికి జొన్నల వంటి తిండి గింజలను దాణాగా వేస్తూ పిల్లలుపెద్దలు ఎంతో ఆనందపడతారు. అచ్చం అదే పని చేసి సింగపూర్లో ఓ భారతీయ వృద్ధురాలు లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. పావురాల రెట్ట, వ్యర్థాల్లో పలు రకాల శ్వాసకోశ వ్యాధికారక క్రిములు ఉంటాయి.గాలిలో ఇవి కలిశాక మనుషులు పీలిస్తే ఇబ్బందుల్లో పడతాము. దీంతో పావురాల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవద్దనే ఉద్దేశంతో వీటికి దాణా వేసి ప్రక్రియపై సింగపూర్లో నిషేధం విధించారు. ఈ విషయం తెలీక 71 ఏల్ల షణ్ముగనాథన్ శ్యామల అనే పెద్దావిడ గత ఆరు నెలల్లో తొమ్మిదిసార్లు పావురాలకు దాణా వేశారు. విషయం తెల్సి అధికారులు ఈమెపై కేసు నమోదుచేశారు. విచారించిన కోర్టు ఈమెకు 2,518 డాలర్ల(దాదాపు రూ.2,27,753) జరిమానా విధించింది.
ఎన్నారైలకు గుడ్న్యూస్.. అంత బంగారంపై నోట్యాక్స్
భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఎన్నారైలకు బంగారంపై కలిపించిన వెసులుబాటు పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నార్లైలకు విధించిన బంగారం పరిమితి నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది.ఇదివరకూ ప్రవాస భారతీయులు భారత్ వచ్చే సమయంలో వారి వెంట ఉన్న బంగారు ఆభరణాలకు విలువ ఆధారంగా సుంకం ఉండేది. మహిళలకు రూ. లక్షలోపు, పురుషులకు రూ. 50 వేల లోపు విలువ ఉన్న పసిడికి ఎటువంటి సుంకం ఉండేది కాదు. ఆ పైన విలువ ఉన్న వాటికి మత్రమే సుంకం చెల్లించే విధంగా నియమాలు ఉండేవి.అయితే ప్రస్తుత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం పరిమితిపై వెసులుబాటును మార్చుతున్నట్లు ప్రకటించింది. ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చే సమయంలో మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారాన్ని ఎటువంటి సుంకం లేకుండా తీసుకరావచ్చని పేర్కొంది. ఆ పైన ఉన్న వాటికి మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదివరకూ ఉన్న ద్రవ్య విలువ ఆధారంగా రూ. లక్షకు కేవలం ఆరు గ్రాములు, రూ. 50 వేలకు మూడు గ్రాముల పరిమితే ఉంటుంది. ప్రస్తుతం అది 20 నుంచి 40 గ్రాములకు చేరుకుంది. భారత ప్రభుత్వం ఆ పరిమితిని గణనీయంగా పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర త్రిబుల్ ఐటీ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాలికల వసతి గృహంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ సిబ్బంది, విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని హుటాహుటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రక్రియను అధికారులు గోప్యంగా నిర్వహించడం గమనార్హం. వసంత ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందా ? లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు తరచూ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
‘ప్రేమకు సహకరించాడని కాళ్లు విరగ్గొట్టారు’
కర్ణాటక: పాండవపుర తాలూకా డింకా గ్రామంలో యువతి అదృశ్యం అయ్యేందుకు వ్యక్తి కారణమని ఆరోపిస్తూ దుండగులు దాడి చేశారు. వివరాలు.. కె.ఆర్.పేట తాలూకాలోని బొమ్మలాపూర్ గ్రామానికి చెందిన నింగన్న కుమార్తె ఒక యువకుడిని ప్రేమించి అదృశ్యమైంది. అదే గ్రామానికి చెందిన ప్రకాష్ ఆమెకు సహాయం చేశాడని ఆరోపణలు వచ్చాయి. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కె.ఆర్.పేట గ్రామీణ పోలీసులు ప్రకాష్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై అమ్మాయి సోదరుడు సంజయ్ అడగడంతో నవీన్ వర్గం సంజయ్పై దాడి చేసిందని చెబుతున్నారు. ఈ విషయంపై రెండు వర్గాల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. గిరీష్, సంజు, మంజు, జీవన్, శశికుమార్, మదన్, ముద్దప్ప, పవన్, మాదప్ప, నింగన్న, రవి, శివన్న అనే నిందితులు మైసూరుకు చెందిన నవీన్ అతడి బావమరిది ప్రకాష్పై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రకాష్ రెండు కాళ్లు విరిగిపోయియి. ప్రకాష్ ను వెంటనే పాండవపుర ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం మైసూర్లోని కె.ఆర్.ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు నిందితుడు గిరీష్ ను అదుపులోకి తీసుకుని, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
రూ. 30 వేల లంచం, కట్ చేస్తే విజిలెన్స్ అధికారులే షాక్
భువనేశ్వర్: ఒడిశాలో వెలుగు చూసిన భారీ అవినీతి తిమింగలం వ్యవహారం కలకలం రేపింది. కటక్ సర్కిల్లోని గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతికి సంబంధించిన అనేక ప్రదేశాలలో సోదాల సందర్భంగా ఒడిశా విజిలెన్స్ విభాగం రూ.4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఏజెన్సీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని భావిస్తున్నారు.పాటియాలోని శ్రీ విహార్లోని నేచర్ క్రెస్ట్ అపార్ట్మెంట్లోని మొహంతి నివాసంలో బుధవారం విజిలెన్స్ దాడులు జరిగాయి. భువనేశ్వర్ ఫ్లాట్, భద్రక్లోని తల్లిదండ్రుల ఇల్లు, కటక్లోని ఆఫీస్ ఛాంబర్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించాయి. దీంతోపాటు, ఆయన ఆఫీస్ డ్రాయర్ నుండి మరో రూ.1.20లక్షలను స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లోని రెండంతస్తుల భవనం, సుమారు 130 గ్రాముల బంగారం, ఇతర ఆస్తులను కనుగొన్నారు. సోదాలు కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతంబొగ్గు డిపోను నడపడానికి మరియు బొగ్గు రవాణాకు అనుమతి ఇవ్వడానికి బదులుగా లైసెన్స్ పొందిన బొగ్గు విక్రేత నుండి రూ. 30,000 లంచండిమాండ్ చేశాడన్న ఫిర్యాదుదారు ఆరోపణలపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు నిందితుడైన ప్రభుత్వ అధికారిని అరెస్టు చేశారు. ఈ విచారణలో భాగంగా తాజా సోదాలు జరిగాయి. దాడి సమయంలో, లంచంసొమ్మను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ విజిలెన్స్ పోలీస్ స్టేషన్లో మొహంతిపై అవినీతి నిరోధక (సవరణ) చట్టం, 2018లోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. PHOTO | Odisha Vigilance apprehended Debabrata Mohanty, Deputy Director of Mines, Cuttack Circle, for allegedly taking a Rs 30,000 bribe. During searches at his Bhubaneswar flat and other locations, over Rs 4 crore in cash — the highest ever seizure in the agency’s history — was… pic.twitter.com/A5zopN2pur— Press Trust of India (@PTI_News) February 25, 2026 ఇదీ చదవండి: పింక్ ప్యారడైజ్గా బెంగళూరు, వైరల్ వీడియోలు : హీరో ఈయనేమరోవైపు 2024 జనవరి నుంచి 2025 డిసెంబర్ 31, మధ్య లంచం తీసుకోవడం, ప్రభుత్వ నిధులలో ఆర్థిక అవకతవకలు, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై విజిలెన్స్ విభాగం మొత్తం 416 కేసులు నమోదు చేసిందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం రాష్ట్ర అసెంబ్లీకి తెలిపారు.
కట్టుకున్నవాడే యముడయ్యాడు..
విశాఖపట్నం: ఆరిలోవ ప్రాంతంలో మరో దారుణం జరిగింది. దుర్గానగర్లో 14 రోజుల కిందట ఓ మహిళ దారుణ హత్యకు గురైన విషయం మరువక ముందే.. తాజాగా బాలాజీనగర్లో మరో హత్య చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 11వ వార్డు పరిధిలోని బాలాజీనగర్ సాయిబాబా ఆలయం సమీపంలో బి.దేవుడు, దుర్గ (33) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ సిరిపురంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న దేవుడు.. తరచూ ఇంట్లో ఆమెతో గొడవ పడేవాడు.ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇంట్లోనే దుర్గను చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె మెడకు ఉరితాడు బిగించి, ఇంటికి లోపలి నుంచి గడియ పెట్టి దాక్కున్నాడు. ఉదయం డ్యూటీకి వెళ్లాల్సిన దుర్గ.. తొమ్మిది గంటలైనా బయటకు రాకపోవడం, తలుపులు తెరవకపోవడంతో పెదగదిలికి చెందిన ఆమె స్నేహితురాలు పలుమార్లు ఫోన్ చేసింది. ఆమె స్పందించకపోవడంతో వెంటనే దుర్గ తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆయన అక్కడికి చేరుకుని చూడగా తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నాయి. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి.. ఆమె మెడకు తాడు బిగించి, కింద పడి ఉంది. దుర్గ ఉరి వేసుకుందని భావించిన తండ్రి.. స్థానికుల సాయంతో ఆమెను విమ్స్ ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్ఐలు కృష్ణ, వరహాలు నాయుడు సాయంత్రం తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి బయట బైక్, లోపల సెల్ఫోన్ ఉండి, ఆ సమయంలో భర్త కనిపించకుండా పోవడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. ఇంట్లో క్షుణ్ణంగా గాలించగా.. ఫ్రిజ్ వెనుక నక్కిన దేవుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, భార్యపై అనుమానంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
వీడియోలు
బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..!
నందమూరి బాలయ్య కోసం నారా బావయ్య నిర్వాకం
ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI
ఇజ్రాయెల్కు చేరుకున్న ప్రధాని మోదీ
నయా ట్రెండ్.. పెళ్లికి ముందు అంతా చేసేసి బ్లాక్ మెయిల్
భారత్ సెమీస్ చేరాలంటే..? 11 ఓవర్లలో ఎంత ఛేజ్ చేయాలంటే..!
సుబ్బారెడ్డి భార్యను మేం తీసుకొస్తాం చంద్రబాబు, లోకేష్, బిఆర్ నాయుడు.. మీ భార్యలను తీసుకురండి
కూటమి సర్కార్ కు షాకిచ్చిన సోము వీర్రాజు
యూట్యూబర్ అన్వేష్పై లుకౌట్ నోటీసులు
Amalapuram: రెస్టారెంట్లో అమలాపురం కుళ్ళిన చికెన్తో బిర్యానీ

