విదేశీ పెట్టుబడులకు సంస్కరణల కార్పెట్!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితులను సమర్థవంతంగా గట్టెక్కడం, విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు కేంద్రం తన సంస్కరణల అజెండాను మరింత వేగంగా ముందుకు తీసుకుపోనుంది. గత ఏడాదిన్నరగా మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిపోతుండడం చూస్తున్నాం. హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్ సరఫరాల్లో సమస్యలు ఏర్పడి వాటి ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో దిగుమతుల బిల్లు పెరిగిపోయి రూపాయి విలువ క్షీణిస్తోంది. ఇది విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరిచే అంశం. ఈ తరుణంలో తిరిగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అదనపు చర్యలను పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షల ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశాయి. దేశీ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని.. బలమైన వినియోగానికి తోడు మెరుగైన జీఎస్టీ వసూళ్లు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు మెరుగుపడుతున్న పరిస్థితులను అవి గుర్తు చేస్తున్నాయి. చమురు, ఎరువుల దిగుమతుల బిల్లు పెరిగిపోయిన తరుణంలో దేశీ వృద్ధి పథాన్ని కాపాడుకోవడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను, ఆస్తుల విక్రయాన్ని మరింత వేగిరపరచాలని సర్కారు యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్థికరంగ సంస్కరణలు.. ఆర్థిక రంగంలో సంస్కరణలను కొనసాగించడం ద్వారా దీర్ఘకాల విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా క్యాపిటల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయాలనుకుంటోందని తెలిపాయి. అవసరమైన చర్యలను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చేపడుతుందని, తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించనున్నట్టు చెప్పాయి. గత వారం ప్రభుత్వ సెక్యూరిటీల్లో (జీ–సెక్లు) విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను (ఎఫ్పీఐ) పెంచడం కోసం చర్యలు తీసుకోవడం తెలిసిందే. వడ్డీ ఆదాయం, దీర్ఘకాల, స్వల్పకాల మూలధన లాభాలపై పన్నుల నుంచి విదేశీ పెట్టుబడిదారులకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇది రూపాయి బలోపేతానికి కొంతమేర సాయపడినట్టు పేర్కొన్నాయి. బంగారం, వెండి దిగుమతులపైనా సుంకాలను 6% నుంచి 15 శాతానికి పెంచడం ఫలితాన్నిస్తున్నట్టు చెప్పాయి. బీమాలో 100% ఎఫ్డీఐను అనుమతించడం గమనార్హం.కట్టడిలోనే ద్రవ్యలోటు.. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో మాదిరే వృద్ధి కార్యకలాపాలు ప్రస్తుత త్రైమాసికంలోనూ (2026–27 ఏప్రిల్–జూన్) కొనసాగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లు కూడా స్థిరంగానే ఉన్నట్టు చెప్పాయి. దిగుమతుల వ్యయాలు పెరిగిపోయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును బడ్జెట్లో పేర్కొన్న విధంగా జీడీపీలో 4.3 శాతానికి కట్టడి చేయడం ఇప్పటికీ సాధ్యమేనని పేర్కొన్నాయి.
కాపురాలు కూలిపోతున్నాయి
తాడేపల్లి రూరల్: ‘మాకున్న కొద్దిపాటి భూముల్లో ఆడపిల్లలకు కట్నం కింద కొంత రాసిచ్చాం. ఆ భూముల్ని రాజధాని కోసం బలవంతంగా తీసేసుకుంటున్నారు. దీనివల్ల మా బిడ్డల కాపురాలు కూలిపోతున్నాయి’ అని కొందరు రైతులు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీకేంటండీ నెలనెలా జీతాలొస్తాయి. మాకు ఈ భూములే ఆధారం. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే మా భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మా పిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేసుకోవాలి’ అని మహిళా రైతులు నిలదీశారు. అమరావతి ముఖద్వారమైన ఉండవల్లిలో సీఆర్డీఏ అధికారులు భూసేకరణ కోసం మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఉండవల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన గ్రామసభకు రైతులు ర్యాలీగా వెళ్లారు. తమ వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్, భూసేకరణ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ‘మా భూమి.. మా హక్కు’ అని నినదిస్తూ సభా ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత 29 గ్రామాల నుంచి ఉండవల్లి గ్రామాన్ని మినహాయించాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. 1990 ముందు నుంచే ఉండవల్లిలో పండే పంటలను, ఎగుమతులను, భూముల విలువను సీఆర్డీఏ అధికారులకు వివరించారు. కట్నం కింద రాసిచ్చాం పలువురు రైతులు మాట్లాడుతూ తమకున్న భూముల్లో కొంత ఆడపిల్లలకు కట్నం కింద రాసిచ్చామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో కౌలు రూ.20 వేలకు మించి ఎక్కడా లేదని, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో మాత్రం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు కౌలు వస్తుందని వివరించారు. ‘నాలుగు పంటలు పండే ఈ భూములను ఎలా తీసుకుంటారు? ఒకవేళ తీసుకుంటే అదే తరహాలో పంటలు పండే భూములను రైతులకు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నాయి’ అని అధికారులకు వివరించారు. మహిళా రైతులు మాట్లాడుతూ ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే మా భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మా పిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేయాలని నిలదీశారు. ‘రాజధాని ప్రకటించినప్పుడే ఉండవల్లి పంచాయతీ పాలకమండలి, తాడేపల్లి మండల పరిషత్ పాలకమండలి రాజధానికి భూములు ఇచ్చేదిలేదని నిర్ధారించాయి. రాజధాని 29 గ్రామాల్లో ఇక్కడున్న రైతులకు చాలామందికి పొలాలు ఉన్నాయి. ఆ పొలాలను మొదటి విడతలో పూలింగ్కు ఇచ్చాం. ఈ భూమి ఇవ్వలేదంటే అధికారులు అర్థం చేసుకోవాలి’ అని రైతులు కోరారు. పన్నెండేళ్లుగా ఏం అభివృద్ధి చేశారు ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన రైతులు మాట్లాడుతూ.. ‘మా భూములు ల్యాండ్ పూలింగ్కు ఇచ్చాం. మా గ్రామం అభివృద్ధి చెందలేదు. 12 సంవత్సరాలుగా గ్రామ పరిస్థితి దారుణంగా ఉంది. వెంటనే అభివృద్ధి చేయాలి. ఉండవల్లిలో ఎత్తిపోతల పథకంతో పాటు ఎందుకూ ఉపయోగపడని ప్రాజెక్టులు పెడుతున్నారు. మా గ్రామంలో టూరిజం ప్రాజెక్ట్ లేదా ఐటీ సంస్థలను ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు. రాజధాని అభివృద్ధి పేరుతో 12 ఏళ్ల క్రితం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కింద ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదంటూ స్థానిక ప్రజలు అధికారులను నిలదీశారు. ‘కొంతమందికి ఉండవల్లిలో గజాల కింద పొలాలు ఉన్నాయి. ఆ పొలంలో గజాల కింద 10–15 మంది ఉన్నాం. మాకు గజాల కిందే ప్లాట్లు ఇస్తామని చెప్పి అధికారులు మోసం చేశారు’ అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. సహకరించినా.. పంట నాశనం చేశారు గ్రామ సభ జరుగుతుండగా ఉండవల్లి గ్రామానికి చెందిన శిగిరిశెట్టి అనంతశివరావు కన్నీరు పెట్టుకుంటూ వచ్చి ‘సీడ్ యాక్సెస్ రోడ్డుకు సహకరిస్తానని చెప్పి 9.3 పత్రాన్ని అందజేశాను. దాన్ని ఆసరాగా తీసుకుని పొలంలో పంట ఉండగా దౌర్జన్యంగా కాంట్రాక్టర్లు కరెంటు స్తంభాలు తీసివేసి పైపులైన్లు పీకివేశారు’ అంటూ కాంట్రాక్టర్ల దౌర్జన్యాన్ని వీడియోలో చూపించారు. తన పొలంలో పైపుల్ని దౌర్జన్యంగా తొలగించి.. తనను పూర్తిగా నాశనమయ్యేలా చేశారని శిగిరిశెట్టి అనంత శివరావు కన్నీటిపర్యంతమయ్యారు. ఉండవల్లిలోని సీఆర్డీఏ కార్యాలయానికి రైతులు ఏ సమస్య మీద వెళ్లినా అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్ చులకన భావనతో మాట్లాడుతున్నారని, తమ భూములు తీసుకుంటూ మమ్మల్ని ఏసీలు వేసి కూర్చోబెట్టాలా అంటూ వెటకారంగా మాట్లాడి బయటకు వెళ్లాలంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెల్లి కాపురం చెడిపోయేలా ఉంది మా తల్లిదండ్రులకు మేం ముగ్గురం. ఇద్దరు అన్నదమ్ములం, ఒక చెల్లి. మా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో ఒక ఎకరం మా చెల్లికి కట్నంగా ఇచ్చాం. అది రిజిస్ట్రేషన్ కావడం లేదు. వారి కాపురం చెడిపోయేలా ఉంది. రాజధానికి భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్లు ఆపి, బెదిరించి పొలాలు తీసుకుంటారా? మాకు వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చేసి మా ఆడపిల్లల కాపురాలు నిలబెట్టండి. – జొన్న సాంబశివరావు, రైతుఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్థం కావడం లేదు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత మా ఆడపిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. మీతో మాట్లాడుతుంటే ఏడుపు వస్తోంది. ఆ భూమిని నమ్ముకుని ఇప్పటిదాకా జీవించాం. మా ఆడపిల్లలకు మీరు ఇచ్చే అరకొర భూమితో ఎలా పెళ్లిళ్లు చేయాలి. మీరు దయవుంచి మా భూములు వదిలివేయాలి. మీరు ఇచ్చే భూముల్లో వ్యవసాయం ఎలా చేయగలం? – శింగంశెట్టి అనుపమ, రైతుదేవదాయ రైతుల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి మా తాతలు, తండ్రుల కాలం నుంచి దేవదాయ భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. ఉన్నట్టుండి ఆ భూములను సీఆర్డీఏ అధికారులు దున్నేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని భూముల్ని ఇప్పటికే దున్నేశారు. దానివల్ల కౌలు రైతులం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. మాకూ రాజధానిలో బతికేందుకు అవకాశం కల్పించాలి. ఆ భూములను లాక్కుంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలి? – దాసరి నాగరాజు, కౌలు రైతు ఉండవల్లిని విలన్గా చూపిస్తున్నారు ఉండవల్లిలో భార్యాభర్తలిద్దరూ ఒక ఎకరంలో వ్యవసాయం చేస్తే నెలకు రూ.60 వేలు సంపాదిస్తారు. కౌలు రైతు కూరగాయలు, పూలు, ఇతర పంటలు పండించి నెలకు రూ.45 వేలు సంపాదిస్తున్నాడు. ఏదో విజయవాడకు దగ్గరగా ఉందని పూలింగ్కు ఇవ్వనని అనడం లేదు. ఇక్కడ ఉన్న అర ఎకరం, ఎకరం భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. సమాజంలో ఉండవల్లిని రాజధానికి విలన్గా చిత్రీకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. రాజధాని నుంచి ఉండవల్లిని మినహాయించాలి. – జంగాల సాంబశివరావు, రైతుముందొక మాట.. తరువాత ఒక మాట రాజధాని వల్ల మా ఇంటిని కోల్పోయాం. మాకు సీడ్ యాక్సెస్ రోడ్లో 26 సెంట్లు ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్కు అవసరం అంటే మాకు గజాల్లో స్థలం ఇస్తామంటే మా భూమి ఇస్తామని చెప్పాం. ముందు ఇస్తామని చెప్పి ఇప్పుడు నాలుగు సెంట్లు ఇస్తామంటున్నారు. ఇప్పటికే వయసు పైబడి చేతులు వణుకుతున్నాయి. మా అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్లం దానిపైనే ఆధారపడుతున్నాం. మాకు గజాల్లో స్థలం ఇప్పించండి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం. – శ్రీనివాసరావు, రైతు
లక్ష డాలర్ల హెచ్1బీ ఫీజు రద్దు!
వాషింగ్టన్: అమెరికా కలల్ని పండించే హెచ్1–బీ వీసా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ సర్కారు విధించిన లక్ష డాలర్ల ఫీజును ఫెడరల్ కోర్టు కొట్టి వేసింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఇంత భారీ మొత్తం వీసా ఫీజు వసూలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని మసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి లియో సోరోకిన్ తీర్పు వెలువరించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. ‘‘అమెరికా కాంగ్రెస్ అనుమతిలేకుండా ప్రభుత్వం ఇలా భారీ స్థాయిలో పన్నులను మోపేందుకు అధికారంలేదు. ఇమ్మిగ్రేషన్ విధానాలు, పన్నులపై నిర్ణయాలు తీసుకునే అధికారం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉంది. ఫీజు, పేమెంట్ అని చెబుతున్నప్పటికీ వీసా పిటిషన్దారులపై ట్రంప్ పన్ను భారం మోపారు’’ అని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సంతతి సంఘాలు ఈ తీర్పును స్వాగతించాయి. ఉద్యోగ ఆధారిత వీసాల విషయంలో ఇది మెరుగైన నిర్ణయమని కొనియాడాయి. అమెరికన్ కంపెనీలు నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు హెచ్1–బీ వీసా అవసరం. భారతీయ ఐటీ ఉద్యోగులతోపాటు వివిధ దేశాల నుంచి పరిశోధకులు, అత్యాధునిక టెక్నాలజీ రంగాల్లో పని చేసేవారు హెచ్1–బీ వీసా కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వీసా జారీ ప్రక్రియలో పలు మార్పులు చేయడమే కాకుండా ఒక్కో హెచ్1–బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై 20 రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేస్తూ బోస్టన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా జడ్జి దీనిపై విచారణ జరిపి భారీ ఫీజు సరికాదని తేల్చి చెప్పారు. ఇకపై మరిన్ని ఇబ్బందులు! ‘‘హెచ్1–బీ వీసాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపశమనం ఇచ్చిన తీర్పిది. అయితే ఈ విషయం ఇక్కడితో సమసిపోతుందా? అన్నది ప్రశ్నార్థకం’’ అని ఇండియాస్పోరా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషీపుర వ్యాఖ్యానించారు. నిబంధనల పేరుతో అమెరికన్ ప్రభుత్వం హెచ్1–బీ వీసాదారులను ఇకపై కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. అమెరికా టెక్నాలజీ, ఆరోగ్య, తయారీ రంగాల పురోభివృద్ధికి అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ చీఫ్ ఆఫ్ పాలసీ అండ్ స్ట్రాటజీ ఖండేరావ్ కాండ్ చెప్పారు. ఆర్థికపరమైన వాస్తవిక పరిస్థితులతోపాటు చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే కీలకమైన విధానపర అంశాల్లో మార్పులు చేయాలన్న ప్రాథమిక విషయాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని వివరించారు. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తాంలక్ష డాలర్ల హెచ్1–బీ వీసా ఫీజును రద్దు చేస్తూ మసాచుసెట్స్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అప్పీల్స్ కోర్టులో సవాలు చేయనున్నట్లు వైట్హౌస్ అధికార ప్రతినిధి ఒకరు సూచనప్రాయంగా తెలిపారు. హెచ్1–బీ వీసా పథకాన్ని దశాబ్దాలుగా దురి్వనియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికే అధ్యక్షుడు ట్రంప్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. కొంతమంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు కూడా లక్ష డాలర్ల వీసా ఫీజును న్యాయస్థానం కొట్టివేయడాన్ని స్వాగతిస్తుండడం గమనార్హం. భారీ వీసా ఫీజు కారణంగా వైద్య సిబ్బందితోపాటు ఉపాధ్యాయులను అమెరికాకు రప్పించడం చాలా కష్టమైపోయిందని, ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన టీచర్లు లేకుండా పోతున్నారని అలాస్కా రిపబ్లికన్ సెనేటర్ లీజా ముర్కోస్కీ చెప్పారు. అమెరికా ఆరోగ్య రంగంలో ఇప్పటికే సిబ్బంది కొరత ఉండగా.. లక్ష డాలర్ల వీసా ఫీజు అదనపు భారం మోపిందని, కోర్టు తీర్పుతో భారీ ఊరట లభించినట్లేనని నార్త్ వర్జీనియా డెమోక్రాట్ ప్రతినిధి డాన్ బేయర్ హర్షం వ్యక్తంచేశారు. రిపబ్లికన్ ప్రతినిధి మైక్ లాలర్, జార్జియా డెమోక్రాట్ ప్రతినిధి సాన్ఫర్డ్ డి.బిషప్, కాలిఫోర్నీయా, న్యూజెర్సీ అటార్నీ జనరళ్లు రాబ్ బోంటా, జెన్నిఫర్ డావెన్పోర్టు తదితరులు కోర్టు తీర్పును స్వాగతించారు. దేశానికి తీవ్ర హాని హెచ్–1బీ వీసా ఫీజు విషయంలో మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు ఉత్తర్వును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. అలాంటి చర్యలు దేశానికి తీవ్ర హాని కలిగిస్తాయని మంగళవారం ఆక్షేపించారు. ‘‘ఈ న్యాయమూర్తులు నిజంగా మాకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇది చాలా విపరీతమైన పరిస్థితి. వారు మా దేశానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నారు’’అంటూ ట్రంప్ విమర్శించారు.
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: బ.దశమి రా.7.47 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం: రేవతి తె.4.06 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి అశ్విని, వర్జ్యం: సా.4.25 నుండి 5.58 వరకు, దుర్ముహూర్తం: ప.11.32 నుండి 12.24 వరకు, అమృత ఘడియలు: రా.1.45 నుండి 3.20 వరకు.సూర్యోదయం : 5.28సూర్యాస్తమయం : 6.29రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం: దూరప్రయాణాలు. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో అవాంతరాలు. నిరుద్యోగుల యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.మిథునం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు ఊరట. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.కర్కాటకం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి. దైవచింతన.సింహం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.కన్య: దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు.తుల: ముఖ్య వ్యవహారాలలో పురోగతి. నూతన విద్యావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాల వైపు సాగుతారు.వృశ్చికం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ మరింత పెరుగుతుంది. పనులు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు.మకరం: ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొన్ని వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.కుంభం: వ్యవహారాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.మీనం: సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. బంధువులతో సఖ్యత. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
హామీలు తప్ప అమలేదీ?
రేవంత్వి బెదిరింపు రాజకీయాలు
రూ. 200 కోట్లు
ఎబోలా విలయ తాండవం
మమత నివాసంలో సీఐడీ సోదా
ఎన్టీటీపీఎస్లో క్వార్టర్ల రగడ
750 డాలర్లతో 10 రోజుల్లో ‘వీసా’ అపాయింట్మెంట్
రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం
సకల శాఖలు లోకేశ్ చూస్తారు తన శాఖ తప్ప! సీఎం ఏ శాఖా చూడరు
ఒకరికి ఉద్వాసన.. ముగ్గురికి చాన్స్?
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
పెద్ది.. ఎంతపని చేశావ్ బుచ్చిబాబు?
రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు
‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్కు రాహుల్ రామకృష్ణ చురకలు!
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
సాక్షి కార్టూన్ 09-06-2026
‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
ఈజీగా ‘EPF 100% విత్డ్రా’.. కొత్తగా మారిందిదే..
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
క్యాబ్ డ్రైవర్పై సినీ నటుడు దాడి
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
వరలక్ష్మి హారర్ థ్రిల్లర్.. సూపర్స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
మమతా బెనర్జీ పార్టీని వీడుతున్న సీనియర్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వాహనయోగం
6 ఫీట్లు పొడవు.. 40 కిలోల బరువు.. కాటేస్తే ఖతమే!
పాత వాహనాలు కొంటున్నారా..? కీలక సూచనలు
హామీలు తప్ప అమలేదీ?
రేవంత్వి బెదిరింపు రాజకీయాలు
రూ. 200 కోట్లు
ఎబోలా విలయ తాండవం
మమత నివాసంలో సీఐడీ సోదా
ఎన్టీటీపీఎస్లో క్వార్టర్ల రగడ
750 డాలర్లతో 10 రోజుల్లో ‘వీసా’ అపాయింట్మెంట్
రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం
సకల శాఖలు లోకేశ్ చూస్తారు తన శాఖ తప్ప! సీఎం ఏ శాఖా చూడరు
ఒకరికి ఉద్వాసన.. ముగ్గురికి చాన్స్?
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
పెద్ది.. ఎంతపని చేశావ్ బుచ్చిబాబు?
రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు
‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్కు రాహుల్ రామకృష్ణ చురకలు!
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
సాక్షి కార్టూన్ 09-06-2026
‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
ఈజీగా ‘EPF 100% విత్డ్రా’.. కొత్తగా మారిందిదే..
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
క్యాబ్ డ్రైవర్పై సినీ నటుడు దాడి
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
వరలక్ష్మి హారర్ థ్రిల్లర్.. సూపర్స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
మమతా బెనర్జీ పార్టీని వీడుతున్న సీనియర్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వాహనయోగం
6 ఫీట్లు పొడవు.. 40 కిలోల బరువు.. కాటేస్తే ఖతమే!
పాత వాహనాలు కొంటున్నారా..? కీలక సూచనలు
ఫొటోలు
హైదరాబాద్లో కుండపోత వర్షం (ఫొటోలు)
కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్’ఫుల్ ఫోటోస్
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. గుండెలు పిండేసే దృశ్యాలు
చేప మందు కోసం వేలాదిగా తరలివచ్చిన ప్రజలు (ఫోటోలు)
బాలీవుడ్ బ్యూటీ నేహ కక్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తన ముద్దుల గారాలపట్టితో బిగ్బాస్ శివజ్యోతి బొబ్బట్ల పండుగ (ఫొటోలు)
శారీలో అనసూయ గ్లామర్ చూశారా? (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ స్టిల్స్
మృగశిర ఎఫెక్ట్.. కిక్కిరిసిన మార్కెట్ (ఫొటోలు)
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం (ఫొటోలు)
సినిమా
టాక్సిక్ వంద రోజుల రీ షూట్.. నిర్మాణ సంస్థ క్లారిటీ
కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో నటించిన యాక్షన్ మూవీ టాక్సిక్..ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమాకు గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. జూన్ 4న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో అదే తేదీన రామ్ చరణ్ పెద్ది థియేటర్లలోకి వచ్చేసింది.అయితే తాజాగా ఈ మూవీపై కొన్ని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్పై హీరో యశ్ తీవ్ర అసంతప్తిగా ఉన్నారని టాక్. అందుకే దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద రోజుల షూటింగ్ను రీ షూట్ చేయాలని అడిగారని ఓ వార్త వైరలవుతోంది. రిలీజ్ తేదీ వాయిదా పడడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పందించింది. రీ షూట్ అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ చిత్రానికి ఎలాంటి రీషూట్లు షెడ్యూల్ చేయలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా.. మొదట 'టాక్సిక్' మూవీని మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కుదరలేదు.. ఆ తర్వాత జూన్ 4వ తేదీని అనౌన్స్ చేసినప్పటికీ మళ్లీ వాయిదా వేశారు. ఇప్పటి వరకు చిత్ర నిర్మాతలు ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు.'కేజీఎఫ్-2' తర్వాత యశ్ నటిస్తోన్న చిత్రం ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.
రామ్ చరణ్ పెద్ది వసూళ్లు.. ఐదు రోజుల్లోనే క్రేజీ మార్క్
రామ్ చరణ్ పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రీమయర్స్తో మొదలైన పెద్ది ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఓవరాల్గా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు.రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance 🔥🔥#Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/e5fZ2thleb— PEDDI (@PeddiMovieOffl) June 9, 2026
'వీడి అనుమానంలో మనం విడిపోయేలా ఉన్నాం'.. ఫుల్ కామెడీగా టీజర్
యంగ్ హీరో రాగ్ మయూర్ నటించిన లేటేస్ట్ సైకాలాజికల్ కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజీవ్ చిలకా, రాజేశ్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తిగా హీరో రాగ్ మయూర్ కనిపించారు. ప్రతిదాన్ని అనుమానించే హీరో పెళ్లి విషయంలో ఏం చేశారనే నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, అనన్య, చరిత్, బ్రహ్మజీ, రాశి, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది.
మొన్ననే బ్రేకప్.. అప్పుడే కలిసిపోయారా?
గతేడాది నుంచి విడాకుల వివాదంతో వార్తల్లో నిలుస్తోన్న హీరో జయం రవి. తన భార్య వేధింపులతో విసిగిపోయానని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు మంజురయ్యే వరకు సినిమాల్లో నటించని కూడా అన్నారు. పెళ్లి తర్వాత నరకం చూశానని అన్నాడు. పెళ్లయిన మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్ చేశారని.. కనీస గౌరవం కూడా ఇచ్చవాళ్లు కాదన్నారు. ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వివాదం తర్వాత జయం రవి ప్రముఖ సింగర్ కెనీషాతో రిలేషన్ కొనసాగించారు. కానీ ఇటీవలే సింగర్ కెనీషా కూడా షాకిచ్చింది. రవితో తనకున్న రిలేషన్కి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు.అయితే తాజాగా కెనీషా మరో షాకిచ్చింది. సడన్గా జయం రవితో కలిసి తిరుమలలో కనిపించింది. వీరిద్దరు కలిసి దర్శనానికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోయారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరోవైవు జయం రవి ఇటీవలే లోకేశ్ కనగరాజ్ మూవీలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Ravi Mohan and Kenisha reunite after separation! pic.twitter.com/xjT0mYi6ip— Princy (@Mrking1618) June 9, 2026
క్రీడలు
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం
ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 9) జరిగిన తొలి మ్యాచ్లో 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది.ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన తాజా మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. తౌహిద్ హృదోయ్ (31), తస్కిన్ అహ్మద్ (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ (10-1-38-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రెన్షా తలో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు. బార్ట్లెట్కు ఓ వికెట్ దక్కింది.లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (5.2-0-24-2), తస్కిన్ (5-0-28-1) కూడా రాణించారు.
గైక్వాడ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపు
శ్రీలంకలో జరుగుతున్న ఏ-జట్ల ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఇవాళ (జూన్ 9) జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (101) సూపర్ సెంచరీతో, కెప్టెన్ తిలక్ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో ఆయుశ్ బదోని (24), సూర్యాంశ్ షేడ్గే (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్మ 32, ప్రభ్సిమ్రన్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 1 (నాటౌట్) పరుగు చేయగా.. ఐపీఎల్ 2026 తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్, వనుజ సహాన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో) కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్ రాయ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టింది. జూన్ 11న జరిగే తదుపరి మ్యాచ్లో భారత్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ తలపడనున్నాయి.
వైభవ్ నిర్దయగా సిక్సర్లు బాదాడు!.. ఇదే కొనసాగితే కష్టం!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని.. ఇదే కొనసాగితే పొట్టి ఫార్మాట్ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డాడు.గతేడాది కాలంగా రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. పద్నాలుగేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ (35)తో కదంతొక్కిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఏడాది ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.ఆరెంజ్ క్యాప్ విజేతఐపీఎల్-2026లో మొత్తంగా పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్తో పాటు మరెన్నో బహుమతులు గెలుచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబడ వంటి స్టార్ బౌలర్ల బౌలింగ్లో సైతం వైభవ్ చితక్కొట్టడం విశేషం.ఇక ఈ సీజన్లో ఏకంగా 72 సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల ఆల్టైమ్ రికార్డును బద్దలుకొట్టాడు కూడా!.. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ, వివాదాస్పద కోచ్ గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్లో.. ‘‘పదిహేనేళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ టోర్నీనే శాసించే స్థితికి వెళ్లాడు. 237కు పైగా స్ట్రైక్రేటుతో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ భూమి మీద ఉన్న అత్యుత్తమ బౌలర్లను కూడా తన బ్యాటింగ్తో ఉతికి ఆరేశాడు.సీజన్లో 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డునే బద్దలుకొట్టాడు. సంప్రదాయ క్రికెట్కు పూర్తి విరుద్ధంగా సరికొత్త బెంచ్మార్కు సృష్టించాడు. తనింకా పిల్లాడే. పూర్తి స్థాయిలో సీనియర్ ఆటగాడిగా మారిన తర్వాత అతడిని ఎవరూ ఆపలేరు.ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతంఅంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ బౌలర్లుగా గుర్తింపు పొందిన వారిని సైతం వేటాడేయగలడు. మారుతున్న క్రీడా విధానానికి ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతం. ఆధునిక టీ20 ఫార్మాట్ పారామీటర్లు కూడా మారిపోతున్నాయి.ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనల వల్ల సమతూకం దెబ్బతింటోంది. బ్యాటింగ్ చేసే జట్టుకు అదనపు పవర్హిట్టర్ను ఆడించే వీలు దొరుకుతోంది. వైభవ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా తన ప్రభావం చూపాడు’’ అని గ్రెగ్ చాపెల్ పేర్కొన్నాడు.ఇలా అయితేనే టీ20 క్రికెట్ను కాపాడుకుందాంఅదే విధంగా.. టీ20 క్రికెట్ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ గ్రెగ్ చాపెల్ ఈ సందర్భంగా మూడు ప్రధాన సూచనలు చేశాడు. ‘‘బ్యాటింగ్ చేసే జట్టుకు చేతిలో పది వికెట్లు కూడా ఆరు వికెట్లే ఉండాలి. అప్పుడు బ్యాటర్లు బాదడమే పనిగా పెట్టుకోకుండా మంచి టెక్నిక్తో ఆడే ప్రయత్నం చేశారు.పిచ్ల మీద కనీసం 3 మి.మీ. మేర పచ్చిక ఉండేలా చూసుకోవాలి. తద్వారా కాస్త సీమ్ జనరేట్ అవుతుంది. ఒక్కోసారి పచ్చికతో కూడినవి.. మరోసారి పూర్తిగా పొడి పిచ్లను తయారు చేయాలి. తద్వారా వైవిధ్యం చేకూరుతుంది. లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో కూడా మార్పులు చేయాలి’’ అని గ్రెగ్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. చదవండి: అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్తో సిరీస్ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్కు బదులు యశస్వి జైస్వాల్కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్తో వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్ను వన్డౌన్లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్తో పాటు గుర్నూర్ బ్రార్ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా.. 16 మ్యాచ్లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్రైజర్స్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ
న్యూస్ పాడ్కాస్ట్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి... ఆరుగురికి తీవ్ర గాయాలు
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
బిజినెస్
లీటర్పై రూ.20 డిస్కౌంట్!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త ప్రత్యామ్నాయాన్ని మార్కెట్లోకి తెచ్చింది. లీటరుపై ఏకంగా రూ.20 రూపాయల వరకు తగ్గింపు ఇస్తూ ఢిల్లీలో సరికొత్త ‘ఈ-85 ఫ్యూయల్ స్టేషన్’ను ఇటీవల ప్రారంభించింది. అయితే, ఊహించని విధంగా ఈ చౌక ఇంధనాన్ని కొనడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. బంకులు తెరిచినా కొనుగోలుదారులు రాకపోవడానికి గల అసలు కారణాలను పరిశీలిద్దాం.అసలు ఏమిటీ ఈ-85 ఇంధనం?ఈ-85 అనేది సాధారణ పెట్రోల్ కాదు. ఇది 85 శాతం ఇథనాల్, 15 శాతం సంప్రదాయ పెట్రోల్ కలయికతో తయారైన ఒక మిశ్రమ బయో-ఇంధనం. ముడి చమురు దిగుమతులపై విదేశీ భారాన్ని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. పెట్రోలియం కంపెనీల తయారీ వ్యయం తగ్గడం వల్ల సాధారణ పెట్రోల్ కంటే ఇది లీటరుకు దాదాపు రూ.20 రూపాయల తక్కువ ధరకు లభిస్తుంది.ఇంత చౌకగా ఉన్నా ఎందుకు కొనడం లేదు?ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో కొన్ని సాంకేతిక, అవగాహనా లోపాలు అమ్మకాలను దెబ్బతీస్తున్నాయి.ఇంజిన్ల అననుకూలత: సాధారణ పెట్రోల్తో నడిచే బైక్లు లేదా కార్లలో నేరుగా ఈ-85 ఇంధనాన్ని వాడటం అసలు సాధ్యం కాదు. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లు కలిగిన వాహనాలు మాత్రమే అవసరం. ప్రస్తుతానికి భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇలాంటి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనాన్ని పోస్తే ఇంజిన్లు పాడైపోయే ప్రమాదం ఉంది.అవగాహన రాహిత్యంకొత్తగా వచ్చిన ఈ-85 ఇంధనం గురించి సాధారణ వాహనదారులకు కనీస అవగాహన లేదు.ఈ ఇంధనం ఏ వాహనాలకు సరిపోతుంది?దీనివల్ల మైలేజీ ఎంత వస్తుంది?పాత వాహనాలను ఫ్లెక్స్ ఇంజిన్లుగా మార్చవచ్చా లేదా?అనే విషయాలపై ప్రభుత్వం, చమురు సంస్థల నుంచి విస్తృత ప్రచారం కరువైంది. దీంతో వినియోగదారులు దీని జోలికి వెళ్లడం లేదు.భవిష్యత్తు మార్కెట్ ఎలా ఉండబోతోంది?ప్రస్తుతానికి ఈ-85 స్టేషన్లు కేవలం ప్రారంభ దశలోనే ఉన్నాయి. మార్కెట్లోకి పూర్తిస్థాయి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు, బైకులు అందుబాటులోకి వస్తేగానీ ఈ చౌక ఇంధనానికి డిమాండ్ పెరగదనే అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వం కేవలం బంకులను ఏర్పాటు చేయడమే కాకుండా, వాహన తయారీ సంస్థలను ప్రోత్సహించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
పేటీఎంలో నియామకాల జోరు
భారతీయ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం సరికొత్త పునర్నిర్మాణ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, మర్చంట్ నెట్వర్క్ విస్తరణే లక్ష్యంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సుమారు 10 శాతం మేర పెంచుకోవాలని నిర్ణయించింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే తొమ్మిది నెలల్లో (మార్చి 2027 నాటికి) కొత్తగా సుమారు 4,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది.అయితే, ఒకవైపు భారీ నియామకాలు చేపడుతూనే.. మరోవైపు అంతర్గత పునర్నిర్మాణంలో భాగంగా దాదాపు 400 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 1 శాతం) తొలగించేందుకు సంస్థ సిద్ధమవడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.కీలక అంశాలు..భారీ నియామకాలు: రాబోయే 9 నెలల్లో 4,000 మంది కొత్త సిబ్బంది రిక్రూట్మెంట్. ఇప్పటికే గత రెండు నెలల్లో 800 మందికి పైగా నియామకం పూర్తి.ఉద్యోగాల కోత: వార్షిక పనితీరు మదింపు ఆధారంగా ఎంపిక చేసిన విభాగాల్లో 400 మంది తొలగింపు.ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య: ప్రస్తుతం కంపెనీలో 40,000 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతన నియామకాలతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.ప్రధాన దృష్టి: సీనియర్ లీడర్షిప్ పాత్రలతో పాటు.. ప్రొడక్ట్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల బలోపేతం.సరికొత్త ప్లాన్2010లో విజయ్ శేఖర్ శర్మ స్థాపించిన పేటీఎం మొబైల్ రీఛార్జ్లతో ప్రారంభమై 2016 నోట్ల రద్దు తర్వాత దేశీయ ఫిన్టెక్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండేళ్ల క్రితం పేటీఎం బ్యాంకింగ్ విభాగంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన నిబంధనలు విధించడం, ఆపై లైసెన్స్ రద్దు చేయడంతో కంపెనీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో దాదాపు 4,500 మందికి పైగా సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చింది.ఆ నియంత్రణ సవాళ్ల నుంచి కోలుకున్న పేటీఎం వరుసగా నాలుగు త్రైమాసికాల్లో లాభాలను నమోదు చేస్తూ మళ్లీ ట్రాక్లోకి వచ్చింది. ఇప్పుడు కంపెనీకి ఉన్న రిజిస్టర్డ్ వినియోగదారులను కేవలం చెల్లింపులకే పరిమితం చేయకుండా.. రుణాలు, పెట్టుబడి ఉత్పత్తులు, ఇతర ఆర్థిక సేవలను విస్తృతంగా అందించడంపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
మానవీయ విలువలే ప్రగతికి మూలాధారం
సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగం అంటేనే టార్గెట్లు, డెడ్లైన్లు. ఒక రోజు లీవ్ కావాలన్నా వంద సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి. అలాంటిది, పది రోజుల సుదీర్ఘ సెలవు ముగించుకుని తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతానని మెసేజ్ చేసిన ఉద్యోగికి.. ‘కంగారేం లేదు, పరిస్థితులు సర్దుకోవడానికి మరో రోజు సెలవు తీసుకో’ అంటూ ఓ బాస్ ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగుల మానసిక పరిస్థితికి పెద్దపీట వేసే ఇలాంటి మేనేజర్లు కూడా ఉంటారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఒక సంస్థలో పని వాతావరణం, ఉద్యోగుల ప్రవర్తన, యాజమాన్యం తీరు ఎలా ఉండాలో ఈ కింది విధంగా విశ్లేషించవచ్చు.యాజమాన్యం, మేనేజర్ల పాత్రఈ సంఘటనలో మేనేజర్ చూపిన చొరవ కేవలం ఒక అదనపు సెలవు ఇవ్వడం మాత్రమే కాదు; అది ఉద్యోగి మానసిక ఆరోగ్యానికి ఇచ్చిన విలువ. యాజమాన్యం, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు కింది విషయాలను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మానవత్వంతో కూడిన నాయకత్వం: నియమ నిబంధనలను పక్కన పెట్టి ఉద్యోగి పరిస్థితిని అర్థం చేసుకోవడమే నిజమైన నాయకత్వం.మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత: ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు ఇవ్వగలరు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వచ్చే అలసటను గుర్తించి స్థిరపడటానికి సమయం ఇవ్వడం ద్వారా మేనేజర్ ఉద్యోగిపై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించగలిగారు.నమ్మకాన్ని నిర్మించడం: నిరంతరం పర్యవేక్షించడం కంటే ఉద్యోగులపై నమ్మకం ఉంచడం వల్ల వారు సంస్థ పట్ల మరింత నిబద్ధతతో పనిచేస్తారు.ఆరోగ్యకరమైన పని వాతావరణం అనేది సంస్థ విజయానికి పునాది. కంపెనీల పని వాతావరణం ఇలా మారాలో కూడా నిపుణులు చెబుతున్నారు.వర్క్-లైఫ్ బ్యాలెన్స్: వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే ఉద్యోగి ఎక్కువ కాలం ఆ సంస్థలో కొనసాగుతాడు.సహకార సంస్కృతి: ఒకరినొకరు వేధించుకునే వాతావరణం కాకుండా ఒకరికొకరు మద్దతుగా నిలిచే వాతావరణం ఉండాలి. నియమాలు ఉద్యోగులను నియంత్రించడానికి మాత్రమే కాదు, వారి పనిని సులభతరం చేయడానికి ఉపయోగపడాలి.గౌరవప్రదమైన గుర్తింపు: కేవలం కంపెనీ రికార్డుల్లో ఐడీ నంబర్గా కాకుండా ప్రతి ఉద్యోగికి ఒక ప్రత్యేక గుర్తింపు, విలువ ఉన్నాయనే భావన కల్పించాలి.ఉద్యోగుల బాధ్యత ఇదే..యాజమాన్యం లేదా మేనేజర్లు ఉదారంగా ఉన్నప్పుడు ఉద్యోగులపై కూడా అంతే బాధ్యత పెరుగుతుంది. మేనేజర్ చూపిన చొరవను ఆసరాగా తీసుకుని బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించకూడదు. లభించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి. ‘ఇలాంటి మేనేజర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పనిచేయాలి’ అని ఒక నెటిజన్లు చెబుతున్నారు. యాజమాన్యం పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడు సంస్థ వృద్ధి కోసం ఉద్యోగి తన శాయశక్తులా కృషి చేయాలి. తాము ఎప్పుడు వస్తున్నదీ, పని ఏ స్థితిలో ఉన్నదీ మేనేజర్కు ముందుగానే తెలియజేయడం ద్వారా ఉద్యోగులు కూడా తమ వృత్తిపరమైన బాధ్యతను చాటుకోవాలి.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
గోల్డ్ లోన్.. కష్టాలు!
సాధారణ, మధ్య తరగతి కుటుంబీకులకు బంగారమంటే కేవలం అలంకరణే కాదు.. ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత, వ్యాపార, తదితర స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాల్లో తక్షణమే పొందగలిగేది పసిడి రుణం మాత్రమే. మొన్నటి వరకు బ్యాంకుల్లో చాలా సులభంగా పొందే గోల్డ్ లోన్ ప్రస్తుతం కఠినతరంగా మారింది. ఆర్బీఐ తాజాగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా బ్యాంకుల్లో బంగారు రుణాలు తీసుకున్న వారు కొత్త నిబంధనలతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ‘ప్రైవేటు’ను ఆశ్రయిస్తూ..రుణాలను అసలు, వడ్డీ చెల్లిస్తేనే రెన్యూవల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతుండడంతో కొందరు రుణ గ్రహీతలు రెన్యూవల్ కోసం నానా అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్ కోసం రూ.లక్షలు అప్పులు పుట్టక.. చివరకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరు రెండు, మూడు రోజుల్లోనే రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తేనే ఇస్తామని చెబుతున్నా.. చేసేదిలేక రుణగ్రస్తులు వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి తీవ్రంగా నష్టపోతున్నారు.నూతన నిబంధనలు ఇలా..బంగారం రుణాలను అగ్రి లోన్స్, నాన్ అగ్రి లోన్స్ అంటూ రెండు భాగాలుగా విభజించారు. రూ.2.25 లక్షల రుణం తీసుకునే వారికి నిబంధనలు కాస్త సరళతరంగా ఉండగా.. అంతకు మించి అయితే రుణం పొందలేని పరిస్థితి ఉంది. వ్యవసాయదారుడు రుణం తీసుకోవాలంటే పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు తహసీల్దార్ ధ్రువీకరించిన ఆదాయ సర్టిఫికెట్, భూమికి చెందిన 1బీ, పశువుల వివరాలు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించిన రశీదులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నాన్ అగ్రి రుణం తీసుకునే వారికి ఐటీఆర్, సిబిల్, ఆదాయ ధ్రువీకరణ చేసుకున్నాకే రుణం మంజూరు చేస్తారు. గతంలో డిఫాల్టర్గా ఉండి సెటిల్మెంట్ చేసుకున్న వారికి బంగారంపై రుణాలు ఇవ్వబడవు. ఆదాయాన్ని బట్టి ఒక్కరు మూడు నుంచి ఐదు రుణాలను మాత్రమే తీసుకోవడానికి అర్హులు. ఆదాయ వనరులు, ఆదాయం లేని వారు రుణం పొందడానికి అనర్హులు. రెన్యూవల్లో మాత్రం నిబంధనలను సడలించింది. ఏడాదిలోపు రుణాన్ని రెన్యూవల్ చేసుకునే వారికి వడ్డీ మాత్రమే చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు కేవలం మూడు పర్యాయాలు మాత్రమే వర్తించనుంది. అలాగే బంగారం రుణాల మంజూరు ప్రక్రియలో రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయనున్నారనే విషయంపై ఆరా తీయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచార. అంతేకాక రుణగ్రహీతల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని, తాకట్టు పెట్టిన బంగారం వాస్తవ హక్కుదారు ఎవరనేదీ తెలుసుకోవాలని నిర్దేశించినట్లు తెలిసింది. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్ పెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడటమే ఆర్బీఐ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది.భారీగా రుణాల చార్జీలు..వివిధ బ్యాంకులు బంగారం రుణాల్లో భారీగా చార్జీలు పెంచింది. గతంలో రూ.3 లక్షల వరకు ఉచితంగా ఉండగా.. రూ.3 లక్షలు పైన నామినల్ చార్జీలు తీసుకునే వారు. అయితే ఇటీవల బంగారం రుణాలు తీసుకునే వారిపై చార్జీల మోత మోగిస్తోంది. ప్రతి రూ.లక్ష రుణానికి అప్రైజర్ చార్జితో పాటు సర్వీస్ చార్జి అంటూ సుమారు రూ.900 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా రూ.5 లక్షల వరకు రుణానికి అయితే గోల్డ్ అప్రైజర్కు రూ. 590, ప్రాసెసింగ్ చార్జిలు రూ. 295లు వసూలు చేస్తుండగా.. రూ.5 లక్షల పైన రుణానికి అయితే గోల్డ్ అప్రైజర్కు రూ. 708, ప్రాసెసింగ్ చార్జిలు రూ. 590 లు వసూలు చేస్తున్నారు. కాగా, బ్యాంకుల వారీగా చార్జీలు ఉన్నాయి. ఇకనైనా బ్యాంకర్లు వడ్డీ మాత్రమే కట్టించుకుని రుణాలు రెన్యూవల్ చేయాలని రైతులు కోరుతున్నారు.
ఫ్యామిలీ
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
బరువు తగ్గడం అంటే కేలరీల లోటు, జిమ్లో ఎక్కువ గంటలు గడపడం వంటివి మాత్రమే అనుకుంటాం. కానీ దాంతోపాటు ఇతర మార్పులు కూడా తప్పనిసరి. ముఖ్యంగా జీవనశైలిలోని ఆహారపు అలవాట్లే అత్యంత ప్రధానం. తీసుకునే ఆహారం పోషకవంతమైనది, బరువు అదుపులో ఉంచేది తీసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అని అంటోంది ఈ ముంబై ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఒకప్పుడు ఏకంగా 145 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఇప్పుడు ఏకంగా 55 కేజీల బరువు తగ్గి నాజుగ్గా మారానని, అందుకోసం ఆ ఏడు ఆహారాలను తీసుకుంటున్నానంటూ తన వెయిట్లాస్ సీక్రెట్ని వెల్లడించారామె. మరి ఆ ఆహారాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ముంబై ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ డాలీ సుమారు 145 నుంచి 90 కేజీ బరువు తగ్గేందుకు చేసిన ఆ ఏడు ఆహార మార్పుల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ పోస్ట్లో తాను చేసిన ఈ ఆహారపు మార్పులు అదనపు కేలరీలను తగ్గించి..వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడిందని నమ్మకంగా చెబుతోందామె. మరి అవేంటంటే..చక్కెర పానీయాలుడాలీ చక్కెర పానీయాలను పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరి, బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దానికి బదులుగా, తాను నిమ్మరసం, కొబ్బరి నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకున్నట్లు డాలీ వెల్లడించింది. తెల్ల రొట్టె(మైదాతో చేసేవి)శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, అతిగా తినడానికి దారితీస్తుంది. కాబట్లి ఆమె తెల్ల రొట్టెను పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ గోధుమ రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఓట్స్ను తీసుకోవడం ప్రారంభించింది.చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్వాటిలో ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల ఆమె చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం మానేసినట్లు పేర్కొంది. దానికి బదులుగా ఆమె మితంగా వేయించిన మఖానా, వేయించిన శనగలు, నట్స్ను ఎంచుకుంది.ఫాస్ట్ ఫుడ్ఫాస్ట్ ఫుడ్లో కొవ్వు, ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల దానిని పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా డాలీ పనీర్ శాండ్విచ్లు, గోధుమ కూరగాయల ర్యాప్లు లేదా ఇంట్లో తయారుచేసిన భోజనం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుందామె.ఐస్ క్రీమ్ఐస్ క్రీమ్లో తరచుగా చక్కెర,కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని తన ఆహారం నుంచి తొలగించింది. గ్రీక్ యోగర్ట్, పండ్లు, ఫ్రోజెన్ బనానా స్మూతీలు లేదా చిన్న మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఆమె తన కోరికలను నియంత్రించుకుంది.మద్యంమద్యపానం డీహైడ్రేషన్కు, ముఖం ఉబ్బడానికి కారణమవుతుందని అందుకే తాను దానిని పూర్తిగా మానేసినట్లు తెలిపింది డాలీ. నిమ్మరసం కలిపిన సోడా నీరు, చక్కెర కలపని తాజా పండ్ల రసం, డిటాక్స్ వాటర్ ఆమె ఇష్టపడే ప్రత్యామ్నాయాలుగా మారాయి.ప్రాసెస్ చేసిన ఆహారాలుప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా సోడియం సంకలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని మానేశారు. దానికి బదులుగా, ఆమె గుడ్లు, టోఫు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్ వంటి సహజమైన ఆహార వనరులపై దృష్టి సారించింది.పైన చెప్పిన ఈ ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించి.. ఎక్కువ నీరు తీసుకుంటూ.. బాగా నిద్రపోండి. అలాగే మీరు నిర్దేశించుకున్న డైట్ క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోమని సూచిస్తోంది. ఇలా చేస్తే కచ్చితంగా శరీరం వేగంగా నాజూకుగా మారుతుందంటూ తన పోస్ట్ని ముగించింది డాలీ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఒక్క ఏడాదిలో 35 కిలోలు..!ఆ ఆరుబోరింగ్ అలవాట్లు..)
పప్పు కూర
చెన్నైకి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ప్రతి శనివారం తిరుమలకి వచ్చి వెళ్ళడం అలవాటు. ఉదయమే చెన్నై నుంచి కారులో బయలుదేరి కొండకు చేరేవాడు. కొండ దిగేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగేవాడు కాడు. కుదిరితే స్వామివారి దర్శనం చేసుకునే వాడు. కుదరకపోతే ప్రశాంతంగా గుడి ముందర కూర్చునేవాడు. పుష్కరిణి దగ్గరకు వెళ్ళి తలమీద నీళ్ళు చల్లుకునే వాడు. వరాహస్వామి దర్శనం చేసుకునే వాడు. ఆపైన బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిలబడి ఆలయ గోపురానికి నమస్కరించే వాడు. కర్పూర హారతి ఇచ్చి కొండ దిగేసే వాడు. తిరుపతిలో అతడికి పిల్లనిచ్చిన అత్తగారు ఉన్నారు. కొండ దిగిన ప్రతిసారీ అత్తగారి ఇంటికి వెళ్లి ఆమె బాగోగులు తెలుసుకునేవాడు. అల్లుడు వచ్చిన ప్రతిసారీ ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టులోని కొన ఆకు కోసి తను చేసిన వేడి వేడి వంటలు వడ్డించేది. పచ్చటి అరిటాకులో పప్పుకూర వడ్డించేది. ఘుమఘుమలాడే నెయ్యి కూడా వేసేది. వెళ్ళిన ప్రతిసారీ ఆమె పప్పుకూరే చేసేది. ఎందుకంటే ఆమె పప్పు కూర మాత్రమే బాగా చేయగలదు. ఎంతో రుచిగా ఉన్నప్పటికీ వారం వారం పప్పుకూర తినలేక అల్లుడికి విసుగు వచ్చింది. ఒకరోజు ఏడుపు ముఖం పెట్టి ‘‘అత్తా, ఎప్పుడూ పప్పు కూరేనా? తినాలంటే మొహం మొత్తుతోంది’’ అన్నాడు. ఆమె నవ్వింది.‘‘అల్లుడూ... పప్పుకూర సరే, పదేళ్ళుగా తిరుమల వచ్చి వెళ్తున్నావు. గుడిలోని స్వామి అప్పుడూ, ఇప్పుడూ ఒక్కరే కదా... ఏ మాత్రం మార్పు లేదు కదా, నీకెప్పుడూ స్వామిని ‘చూసింది చాల్లే’ అనిపించలేదా?’’ అని అడిగింది.అతడు నవ్వాడు.‘‘స్వామిని చూడటం ‘చాలు’ అనిపించదత్తా. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. కొండకి వచ్చిన ప్రతిసారీ దర్శనం చేసుకుని బంగారు వాకిలి దాటి వచ్చేలోగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏమిటో ఈ మాయ’’ అంటూ చేయి కడిగాడు. అత్త తాను చేసిన పప్పు కూర కొద్దిగా గిన్నెలో పెట్టి కూతురికిమ్మనిచెప్పింది. అలాగేనని తల ఊపి ‘రాకుండా ఉండలేను నీ కొండకు... చూడకుండా ఉండలేను ఏ నాటికీ’ అని పాడుకుంటూ చెన్నైకి బయలుదేరాడు. ఆ రోజునుంచి అత్త ముందు పప్పు కూర మాట ఎత్తలేదు అల్లుడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
అమాయకత్వంలో ఆధ్యాత్మికత
పసిప్రాయం ఒక తెల్ల కాగితం లాంటిది. వారు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ, అనుకరిస్తూ ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. వారి చిన్ని చిన్ని ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అయితే పిల్లల నుంచి పెద్దలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పసిపిల్లలకు ‘నేను, నాది’ అనే అహంకారం ఉండదు. వారు తమను తాము ప్రత్యేకంగా చూసుకోరు. ప్రకృతిలో, అందరిలో కలిసిపోతారు. ఈ నిర్మలత్వమే వారిని దైవస్వరూపులుగా చేస్తుంది.గత జ్ఞాపకాల్లో లేదా భవిష్యత్తు ఆందోళనల్లో కాకుండా, ప్రస్తుత క్షణంలో ఉండటం పసిపిల్లల లక్షణం. వారు గడిచిన నిమిషం గురించి బాధపడరు, రేపటి గురించి భయం చెందరు. ఈ ‘స్థితప్రజ్ఞత’ వారికి దైవికమైన ఆనందాన్ని ఇస్తుంది. కోపాన్ని మనసులో పెట్టుకోకుండా ఉండటం. రేపటి చింత లేకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించడం. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం పిల్లల మనస్తత్వం. ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మలక్షణం ’సత్–చిత్–ఆనందం’. పిల్లల ప్రతి చర్యలోనూ ఒక చైతన్యం, ఒక సహజ సిద్ధమైన ఆనందం కనిపిస్తుంది. వారిని చూసినప్పుడు మనసు ప్రశాంతంగా మారడానికి కారణం వారిలో ప్రతిబింబించే ఆ పరమాత్మ తత్వమే. పిల్లల ప్రేమలో ఎటువంటి ఆశలు, నిబంధనలు ఉండవు. వారు కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు. భగవంతుడు కూడా అటువంటి నిష్కల్మషమైన ప్రేమకే లొంగుతాడని మన పురాణాలు చెబుతున్నాయి. మనం మనలోని బాల్యాన్ని మర్చిపోవడం వల్లే ఒత్తిడికి, అసూయకు లోనవుతున్నాం. ఆధ్యాత్మిక సాధన అంటే కొత్తగా ఏదో సంపాదించడం కాదు, మళ్ళీ పసిపిల్లవాడిలా నిర్మలమైన మనసును పొందడమేనని పెద్దలు చెబుతుంటారు. మనలోని ఆ ‘బాల్యాన్ని’ మేల్కొల్పడమే నిజమైన ఆత్మసాక్షాత్కారం. అందుకే ఆధ్యాత్మికవేత్తలు‘ మళ్ళీ ఒక బిడ్డలా మారిపొమ్మని చెబుతుంటారు.మనిషి ఎదుగుతున్న కొద్దీ అనుభవాలు, పంతాలు, పట్టింపులు, సమాజం నేర్పిన ముసుగులు ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి. ఆత్మసాక్షాత్కారం అంటే ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడం కాదు, మనపై పేరుకున్న ఈ కృత్రిమ పొరలను తొలగించుకుని, మన లోపల అంతర్లీనంగా ఉన్న ఆ పసిబిడ్డ వంటి స్వచ్ఛతను తిరిగి దర్శించడమే.పిల్లలు దేవుడిచ్చిన వరాలు. పిల్లల కళ్ళలో కనిపించే మెరుపు కోటి వెలుగులతో సమానం. వారికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. ఒక చిన్న రంగుల బంతి లేదా వాన చినుకు వారిని పరవశానికి గురిచేస్తుంది. వారి ప్రపంచంలో ప్రతి వస్తువు ఒక వింతే, ప్రతిరోజూ ఒక పండుగే. ఒక ఖాళీ అట్టపెట్టె వారికి విమానం కావచ్చు, ఒక చిన్న కర్ర గుర్రం కావచ్చు. పిల్లలు తమ ఊహలతో ఒక మాయా లోకాన్ని సృష్టించుకుంటారు. అక్కడ బొమ్మలు మాట్లాడతాయి, చెట్లు కథలు చెబుతాయి. పిల్లలకు కులమతాలు, పేద– ధనిక భేదాలు తెలియవు. తోటిచిన్నారి నవ్వితే వీరు నవ్వుతారు, ఏడిస్తే పలకరిస్తారు. క్షణంలో గొడవపడినా, మరుక్షణమే మర్చిపోయి మళ్ళీ ఆడుకునే గుణం కేవలం వారి పసిడి మనసులకే సొంతం. వారి పసిడి ప్రపంచాన్ని ప్రేమతో, భద్రతతో కాపాడుకోవడం మన అందరి బాధ్యత. వారి చిరునవ్వు ఇంట్లో ఉంటే, ఆ ఇల్లే ఒక నందనవనం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి
చెడు స్నేహానికి ప్రతీక శకుని
మహాభారతయుద్ధంలో శకుని పాత్ర గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దుష్టచతుష్టయంలో ఒకరుగా పేరుగాంచి, కౌరవులకు మేనమామగా, వారిలో యువరాజైన దుర్యోధనునికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించి అన్నీ తప్పుడు సలహాలు, సూచనలిచ్చి కౌరవులకు కీడు తలపెట్టడంతో, పాండవులకు మేలు జరిగేది. శకుని ఉద్దేశ్యం కూడా ఇదే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాంధహార్ ఆనాటి గాంధార దేశం. గాంధారదేశపు రాజు సుబలుడు, రాణి సుధర్మల కుమారుడే శకుని. సుబలునికి వందమంది కుమారులు, గాంధారి అనే కుమార్తె ఉన్నారు. అందరిలో ఆఖరివాడే శకుని. ఇతని అసలు పేరు సుబలోత్తముడు. అపారమైన తెలివితేటలు కల్గిన, శకుని ‘చౌసర్’ అనే మాయా జూదపు ఆటలో మంచి నేర్పరి. శకుని ప్రాణప్రదంగా అభిమానించే తన సోదరి గాంధారిని, కౌరవ సామ్రాజ్యాధీశుడు, పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడికి పట్టమహిషిగా చేయాలని భీష్ముడు భావించాడు. అయితే జాతకం ప్రకారం గాంధారికి వైధవ్య యోగం ఉందని తెలిసిన శకుని తన సోదరి అంటే ఉన్న వల్లమాలిన అభిమానంతో, ఈ విపత్తు నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంతో, జ్యోతిష్యుల సూచనలు, సలహాల మేరకు గాంధారికి మొదటగా ఓ మేకతో వివాహం జరిపించి, అనంతరం ఆ మేకను బలిచ్చి ఆపై ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తే ఆ దోష పరిహారం అవుతుందని ఆ విధంగా చేశాడు. వివాహానంతరం ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఆగ్రహం చెంది సుబలుని కుటుంబాన్ని చెరశాలలో బంధించి, మరణించే వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశించాడు. చెరసాలలో ఉన్న సుబలుని కుటుంబానికి ఇచ్చే ఆహారం ఒక్కరికి మాత్రమే సరిపోయేది. మిగిలిన సోదరులు ఆహారాన్ని తమలో తెలివైన, ఆఖరి సోదరుడైన శకునికే పెట్టి ఎలాగైనా కౌరవులపై పగ తీర్చుకోవాలని ప్రమాణం చేయించుకున్నారు. అనంతరం క్షుద్బాధతో తండ్రి, ఒక్కొక్క సోదరుడు మృతి చెందారు. తన తండ్రి మరణానంతరం అతని తొడ ఎముకతో తయారైన పాచికలను వినియోగిస్తూ, తాను అనుకున్న సంఖ్య పడేలా శకుని వరం పొందాడు. ఆ పాచికలతో శకుని మాయాజూదం ఆడి మోసపూరితంగా పాండవులను ఓడించి, కౌరవులచే మరిన్ని అన్యాయాలు, అక్రమాలు చేయిస్తూ మహాభారత యుద్ధం జరిగేలా పథకం రచించి కౌరవవంశాన్ని నాశనం చేసాడు. అయితే మహాభారత యుద్ధంలో ఆఖరిరోజున (18వ రోజు)సహదేవుని చేతిలో శకుని మరణించాడు. ఇదిలావుండగా శకునికి కూడా గుడి ఉంది. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం వద్ద శకునికి ఆలయం నిర్మించారు అక్కడి కురువర్ తెగ ప్రజలు. అయితే అక్కడ ఏ విధమైన శకుని విగ్రహం ఉండదు.– సి.ఎన్. మూర్తిసీనియర్ పాత్రికేయులు
అంతర్జాతీయం
భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ ఒక్కసారిగా భగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్ మరోసారి పరస్పర దాడులకు దిగాయి. రెండు నెలల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఇదే మొదటిసారి. ఇరాన్ సోమవారం ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్ వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. మధ్య, పశ్చిమ ఇరాన్పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి దిగింది. రాజధాని టెహ్రాన్తోపాటు చుట్టుపక్కల నగరాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ అధికారిక టీవీ చానల్ వెల్లడించింది. రాజధానిలో ఇమామ్ ఖమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో ఎయిర్స్పేస్ను ఇరాన్ మూసివేసింది. మాషహర్ సిటీలోని ఇరాన్ పెట్రోకెమికల్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ నిర్ధారించింది. బాలిస్టిక్ మిస్సైళ్ల పరికరాలు తయారుచేస్తున్న ఈ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మిస్సైల్ లాంచర్లను కూడా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగానే తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. ఉద్రిక్తతలకు అమెరికాయే కారణం: ఇరాన్ తొలుత లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేయగా, ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రతీకారం తప్పదని ఆదివారం హెచ్చరించింది. అనుకున్నట్లుగానే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ప్రధానంగా సెంట్రల్ ఇజ్రాయెల్లో దాడులు జరిగాయి. రెండు సైనిక స్థావరాలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ ఐఆర్జీసీ వెల్లడించింది. ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజా ఉద్రిక్తతలకు ముమ్మాటికీ అమెరికా కారణమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘే ఆరోపించారు. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ రెచ్చిపోతోందని మండిపడ్డారు. ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉన్నందున దాడులు నిలిపివేస్తున్నట్లు కొన్ని గంటల తర్వాత ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడులను నిలిపివేస్తే ఇజ్రాయెల్ సైతం వెనక్కి తగ్గుతుందని ఇరాన్కు అమెరికా సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ అండదండలున్న నౌకలపై దాడులు చేస్తామని యెమెన్ హౌతీ మిలిటెంట్లు హెచ్చరించారు. హౌతీలకు ఇరాన్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్లోని భారతీయులను భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సోమవారం సూచించింది. స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది. అలాగే ఆ రెండు దేశాలకు వెళ్లే ప్రణాళిక ఉంటే వాయిదా వేసుకోవాలని పేర్కొంది.
రావలకోట్లో రగడ.. 150 మంది మృతి?
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని రావలకోట్ (Rawalakot) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) కార్యకర్తలు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో జేఏఏసీకు చెందిన కొందరు వ్యక్తులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో నలుగురు భద్రతా సిబ్బంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.అయితే.. నిరసనకారులు మాత్రం భద్రతా బలగాలే తమపై బలప్రయోగం చేశాయని ఆరోపిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల్లో ఏడుగురు పౌరులు మరణించినట్లు పేర్కొన్నారు.BIG NEWS - Reports claim that around 150 people were killed and hundreds injured in Rawalakot, PoK, after Pakistani forces allegedly opened fire.Pok residents want Independence from Pakistan.pic.twitter.com/ZvPo7zDA4o— News Algebra (@NewsAlgebraIND) June 8, 2026రావలకోట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం స్థానిక ప్రజలు, పాకిస్థాన్ పరిపాలన మధ్య పెరుగుతున్న అసంతృప్తి. ముఖ్యంగా విద్యుత్ చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, అభివృద్ధి లోపం, రాజకీయ హక్కులపై అసంతృప్తి వంటి అంశాలు ప్రజల్లో ఆగ్రహానికి దారితీసినట్లు సమాచారం.ఇంటర్నెట్ సేవలు కూడా పరిమితయ్యాయని, ఈ కారణంగానే సమాచార ప్రసారం కూడా పరిమితమైందనే వాదనలు వెలువడుతున్నాయి. అందుకే ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు అనే విషయాలు అధికారికంగా వెలువడలేదు. కానీ ఈ ఉద్రిక్తతల్లో ఏకంగా 150 మంది మరణించినట్లు, చాలామంది గాయపడ్డారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డాక్టర్ గయానాలో పేషెంట్ ఇండోర్లో..
న్యూఢిల్లీ: భారతీయ వైద్యుడొకరు వైద్యరంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. సుమారు 20 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి రోబో సాయంతో గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత దూరంలో జరిగిన రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రముఖ రోబోటిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ గయానాలోని జార్జ్టౌన్ పబ్లిక్ హాస్పిటల్ కార్పొరేషన్ నుంచి ఆపరేషన్ చేయగా రోగి మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని ఓ ఆస్పత్రిలో ఉన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఎస్ఎస్ఐ మంత్ర’ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఈ ఆపరేషన్ చేశారు. శ్రీవాస్తవ గయానాలో కూర్చుని కన్సోల్ ద్వారా రోబోను నియంత్రిస్తుండగా, ఇండోర్లో ఉన్న రోబోటిక్ చేతులు ఆయన చేతుల కదలికలను కచ్చితత్వంతో అనుకరిస్తూ ఆపరేషన్ చేశాయి. భారత్లో ఈ ఆపరేషన్కు జైపూర్లోని మణిపాల్ హాస్పిటల్స్కు చెందిన డాక్టర్ లలిత్ మాలిక్, భండారీ హాస్పిటల్కి చెందిన డాక్టర్ రామ్ శుక్లా, ఇండోర్లోని ఇర్కాడ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోహిత్ భండారీలు సహకరించారు. రికార్డు నమోదవడంపై గయానాæ అధ్యక్షుడుæ మహ్మద్ ఇర్ఫాన్ హర్షం వ్యక్తం చేశారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి గుండెకు శస్త్రచికిత్సతో ప్రపంచ రికార్డ్
డేటా సెంటర్లు..నీటి జలగలు!
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఏఐ డేటా సెంటర్లు ఎడాపెడా వెలుస్తున్నాయి. రకరకాల పనులు చాలా సులువుగా, వేగంగా చేసి పెట్టే టెక్నాలజీ మరింత పెరిగితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ.. నాణేనికి మరోవైపున దాగి ఉన్న నిజం మాత్రం చాలా భయంకరం. ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ (ఐఎన్యూ–ఐఎన్డబ్ల్యూఈహెచ్) మేధో సంస్థ తాజా లెక్కల ప్రకారం 2030 నాటికల్లా భూమి మీద డేటా సెంటర్లు మొత్తం కలిపి ఎకాఎకిన 328 టీఎంసీల నీరు వాడేసుకుంటాయి. దీనర్థం ఎక్కడ డేటా సెంటర్ పుట్టుకొచి్చనా.. పెద్ద ఎత్తున నీళ్లు అవసరమవుతాయి. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుని వాడుకుంటే గొడవే లేదు కానీ.. నదులు, చెరువుల్లోంచి తోడుకుంటే మాత్రం ఏరికోరి కరువుకు బొట్టుపెట్టి పిలిచినట్లే. ఐఎన్యూ–ఐఎన్డబ్ల్యూఈహెచ్ భూమ్మీది నీటి వనరుల పరిస్థితి, సమర్థ నిర్వహణలపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతూ ఉంటుంది. ఇటీవలే ఏఐ డేటా సెంటర్ల నీటి వాడకంపై కొన్ని లెక్కలు ప్రచురించింది. దాని ప్రకారం ఇంకో నాలుగేళ్లలో డేటా సెంటర్ల అవసరాలు తీర్చేందుకు సుమారు 9.3 లక్షల కోట్ల లీటర్ల నీళ్లు అవసరం. సుమారు 945 టెరావాట్ గంటల విద్యుత్తు ఖర్చు కానుంది. వెయ్యి గిగావాట్లు ఒక టెరావాట్కు సమానం. ఇంకోలా చెప్పాలంటే గిగావాట్ సామర్థ్యమున్న అణు విద్యుత్తు కేంద్రాలు 108 వరకూ కేవలం ఏఐ డేటా సెంటర్ల నీటి అవసరాలు తీర్చేందుకే సరిపోతాయి. ప్రపంచ విద్యుదుత్పత్తిలో మూడో శాతం అన్నమాట. డేటా సెంటర్ల ఏర్పాటుకు సుమారు 14,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నేల అవసరమవుతోంది. వీటి ద్వారా పుట్టే ఎల్రక్టానిక్ వ్యర్థాలు 25 లక్షల టన్నుల వరకూ ఉంటాయని ఐఎన్యూ–ఐఎన్డబ్ల్యూఈహెచ్ తాజా అధ్యయనంలో స్పష్టమైంది. అంతటి అపార జలరాశితో పనేంటి? మీ కంప్యూటర్ను కొన్ని గంటలపాటు వాడితేనే వేడెక్కి పోతుంది కదా.. అలాంటిది దీనికి కొన్ని లక్షల పీసీలు ఒక దగ్గర పనిచేస్తూంటే ఎంత వేడి పుడుతుందో ఊహించుకోండి. డేటా సెంటర్ల పరిస్థితి ఇదే. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన డేటా సెంటర్గా అమెరికాలోని స్విచ్ సిటడెల్కు పేరుంది. పర్సనల్ కంప్యూటర్(పీసీల)ల లెక్కన ఈ డేటా సెంటర్ను గణిస్తే ఇందులో సుమారు 32 లక్షల యాభై వేల పీసీ ఒకేసారి పని చేస్తున్నట్లు లెక్క. అందుకే ఇక్కడ పుట్టే అత్యధిక వేడిని తగ్గించేందుకు డేటా సెంటర్లను నిత్యం నీటితో చల్లబరుస్తూ ఉండాలి. లేదంటే ఉష్ణోగ్రత పెరిగిపోయి డేటా సెంటర్ పనిచేయకుండా పోతుంది. వీటిపై ఆధారపడిన అనేకానేక అప్లికేషన్లు, వ్యవస్థలు కుప్పకూలుతాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల డేటా సెంటర్లు ఉండగా వీటిల్లో సగం అమెరికాలోనే ఉన్నాయి. ఒక్కొక్కటీ 100 నుంచి 600 మెగావాట్ల విద్యుత్తును వినియోగించుకుంటున్నాయి. మెట్రో నగరాలకు కావాల్సినంత విద్యుత్తు ఇది. ఫలితంగా డేటా సెంటర్ల పరిసరాల్లోని నీటి వనరులు శరవేగంగా ఖాళీ అవడం ఖాయం. కింకర్తవ్యం? ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. చైనా వంటి దేశాలు సముద్రం అడుగున డేటా సెంటర్లను ఏర్పాటు చేసి ఆ నీటితోనే చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నాయి. గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నాయి. మరింత పర్యావరణ అనుకూల మార్గాల ద్వారా డేటా సెంటర్లను చల్లబరిచే ప్రయత్నం జరగాలని నిపుణులు ఆకాంక్షిస్తున్నారు. ఏఐ డేటా సెంటర్లు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని మదింపు చేసి తగు నియంత్రణ చర్యలు తీసుకోవడం అవసరమవుతుంది. లేదంటే డేటా సెంటర్లు మానవ జీవనాధారమైన కీలక జలరాశిని పీల్చేసే ప్రమాదం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం
దీదీ అంతలా మారిపోతారనుకోలేదు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. టీఎంసీలో భారీ చీలిక, తన గత ప్రభుత్వ అవినీతి ఆరోపణలపై సువేందు సర్కార్ దర్యాప్తు, మరోవైపు మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ విచారణతో ఆమె రాజకీయంగా ఒత్తిడిలో ఉన్నారు. దీనికి తోడు ఇన్నాళ్లు వెన్నంటే ఉన్న సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా దూరమవుతున్న పరిస్థితి కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే దీదీతో రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న శతాబ్ది రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని మరింత కుదిపేస్తున్నాయి. ఎన్నికల తర్వాత బెంగాల్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దారుణ ఓటమి తర్వాత.. మమతా బెనర్జీ పార్టీ చీలిక సంకేతాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరిందని.. పార్టీ నుంచి వేరుపడిన ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. “దీదీ ఇంతకు ముందులా లేనేలేరు’’ అంటూ టీఎంసీ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శతాబ్ది రాయ్.. 2009 నుంచి మమతా బెనర్జీతో అనుబంధం ఉంది. అయితే టీఎంసీలో మునుపటి పరిస్థితులు లేవని అంటున్నారామె. “దీదీ మారిపోయారు. ఎంతలా అంటే.. మేమెవరం ఆమె తీరును జీర్ణించుకోలేనంతలా. గత కొన్నేళ్లలో పార్టీ నిర్ణయాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎంపీలైనప్పటికీ మా పరిస్థితి దారుణంగా ఉండేది. పార్టీ లోపల మా గొంతుక వినిపించే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు సమస్యలను చెప్పినా.. నాయకత్వం స్పందించేది కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించాలని ప్రస్తావించిన వినిపించుకోలేదు. పైగా నిర్ణయాల్లోనూ కొందరికే ప్రాధాన్యం ఉండేది. ఆ విషయంలో మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేవారు.. .. దీదీతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. కానీ, ఆమె ఇప్పుడు పాత దీదీ కాదు. కానీ ప్రజల కోసం పని చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం(తిరుగుబాటు) తీసుకున్నాను” అని శతాబ్ధిరాయ్ తెలిపారు. అలాగే.. పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అవినీతి పేరుకుపోయింది. అది చూసి నేనెంతో నిరాశకు లోనయ్యా. వ్యక్తిగతంగా నాకు స్వచ్ఛమైన ఇమేజ్ ఉంది. అందుకే బయటకు వచ్చేశా.. అని అన్నారామె.శతాబ్ది రాయ్(56) ప్రముఖ బెంగాలీ సినీ నటి. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ ఆమె గుర్తింపు పొందారు. 2009లొ టీఎంసీ తరఫున లోక్సభ ఎన్నికల్లో బీర్బూమ్ నుంచి పోటీ చేసిన నెగ్గారు. అప్పటి నుంచి వరుసగా ఆమెనే ఎన్నికవుతూ వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు లోక్సభలో డిప్యూటీ నేతగా ఆమె ఉన్నారు. మమతా బెనర్జీతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న నేతగా ఆమెను పరిగణిస్తారు. అందుకే ఆమె చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.తృణమూల్ కాంగ్రెస్లోని అటు చీలిక ఎమ్మెల్యేల వర్గం తిరుగుబాటుకు కారణమైంది. ఆ వెంటనే ఇటు పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు ఇటీవల పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు రావడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఈ పరిణామాల మధ్య దాదాపు డజను మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశమై ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రెబల్ వర్గం సంఖ్య 20కి చేరిందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
రిటైర్డ్ జడ్జి ఫ్యామిలీకి కిల్లర్ గ్యాంగ్ బెదిరింపులు
ముంబై: దావూదీ బోహ్రా వారసత్వ వివాదంలో సంచలన తీర్పునిచ్చిన బొంబాయి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ ఎస్. పటేల్ కుటుంబాన్ని ప్రాణభయం వెంటాడుతోంది. ఆ తీర్పు వెలువడినప్పటి నుంచి అంటే గత 10 నెలలుగా భారత్, బ్రిటన్ దేశాలలో ఉంటున్న ఈ కుటుంబానికి వరుస బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే లండన్లో ఉంటున్న జడ్జి కుమార్తెపై ముసుగు ధరించిన దుండగుడు భౌతిక దాడికి తెగబడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి.ముసుగు ధరించిన దుండగుడి దాడిరిటైర్డ్ జడ్జి జస్టిస్ గౌతమ్ పటేల్ కుమార్తె అదితి పటేల్ లక్ష్యంగా లండన్లో గత ఏప్రిల్లో ఒక ఘాతుకం చోటుచేసుకుంది. ముసుగు ధరించిన ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అదితి పటేల్ ముక్కు ఎముక విరిగింది. ప్రస్తుతం బ్రిటిష్ పోలీసులు, కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారులు ఈ దాడి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కుటుంబానికి వస్తున్న అంతర్జాతీయ బెదిరింపులతో ఈ దాడికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.బెదిరింపు లేఖ.. రహస్య ఎస్డీ కార్డ్ఈ దాడి ఘటన మరువక ముందే, జూన్ 5న అదితి పటేల్కు మరో అనామక బెదిరింపు లేఖ అందింది. మీ కుటుంబాన్ని అంతమొందించడానికి కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ఆ లేఖలో హెచ్చరించడం సంచలనంగా మారింది. ఆ లేఖతో పాటు ఒక ఎస్డీ కార్డ్ను కూడా దుండగులు పంపారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఎస్డీ కార్డ్లో ఏముందో చూడకుండానే, న్యాయమూర్తి కుటుంబ సభ్యులు దానిని నేరుగా పోలీసులకు అప్పగించారు. గత ఏడాది సెప్టెంబర్ (2025)లో ముంబైలో జస్టిస్ పటేల్కు కూడా ఇలాంటి బెదిరింపు లేఖే వచ్చింది.దావూదీ బోహ్రా వారసత్వ వివాదం ఏమిటి?ఈ వివాదమంతా ఏప్రిల్ 23, 2024న జస్టిస్ గౌతమ్ పటేల్ ఇచ్చిన తీర్పు చుట్టూ తిరుగుతోంది. దావూదీ బోహ్రా ముస్లిం సమాజానికి చెందిన 53వ ఆధ్యాత్మిక గురువు (దాయ్ అల్-ముత్లక్) వారసత్వ పోరుపై ఆయన తుది తీర్పు ఇచ్చారు. ఈ వివాదంలో ముఫద్దల్ సైఫుద్దీన్ను చట్టబద్ధమైన ఆధ్యాత్మిక అధిపతిగా కోర్టు గుర్తించింది. ఆయన స్థానాన్ని సవాలు చేస్తూ తాహెర్ ఫకృద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం ఈ సింగిల్ జడ్జి తీర్పును బొంబాయి హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాలు చేయగా, విచారణ పెండింగ్లో ఉంది.
ఎయిరిండియాకు షాక్ : రెట్టింపు ఫైన్
విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.‘మహారాజా స్కాలర్ స్కీమ్’ వివాదంలో విద్యార్థినికి అనుకూలంగా వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. ‘మహారాజా స్కాలర్ స్కీమ్’ (Maharaja Scholar Scheme) నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు రూ. 74,131 జరిమానా విధిస్తూ రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్ (State Consumer Redressal Commission) తీర్పునిచ్చింది.2021లో అదనపు లగేజీ (Excess Baggage) కింద ఒక విద్యార్థిని నుండి రూ. 34,131లను ఎయిర్ ఇండియా అక్రమంగా వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె ఈ పథకానికి అర్హురాలేనని సంస్థ అంగీకరించినప్పటికీ, రీఫండ్ (డబ్బులు తిరిగి ఇవ్వడం) ఇవ్వడంలో ఏళ్ల తరబడి జాప్యం చేసింది. దీంతో ఆ విద్యార్థిని కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సదరు విద్యార్థినికి అనుకూలంగా తీర్పునిచ్చింది.జిల్లా వినియోగదారుల కమిషన్ 2024 ఫిబ్రవరి నాటి ఆదేశాల ప్రకారం తనకు చెల్లింపులు చేయకుండా, ఆలస్యం చేయడంతోపాటు, తనను మానసిక క్షోభ గురి చేశారని జైపూర్ నివాసి లావణ్య మాగన్ ఆరోపించింది. దీనికి అదనంగా మరింత పరిహారం అందించాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జుడీషియల్ మెంబర్ ముఖేష్, మెంబర్ దినేష్ కుమార్లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.ఫిర్యాదుదారైన విద్యార్థినిని అనవసరమైన మానసిక వేధింపులకు గురైందని, కోర్టు చుట్టూ తిరగడం వల్ల ఆమె విలువైన సమయం వృధా అయిందని కోర్టు విశ్వసించింది. కాబట్టి ఆమె పడిన మానసిక ఆవేదన పూర్తిగా సమంజసమైనదేనని మే 29న కమిషన్ వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల మధ్య పలుమార్లు ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత, మాగన్ సదరు స్టూడెంట్ స్కీమ్కు అర్హురాలేనని స్వయంగా సంస్థే అంగీకరించిందని వినియోగదారుల కమిషన్ తన తీర్పులో పేర్కొంది.అసలు వివాదం ఏంటి? ఎయిరిండియా ప్రవేశపెట్టిన “మహారాజా స్కాలర్ స్కీమ్” ద్వారా అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విద్యార్థులకు ప్రత్యేక లగేజీ అలవెన్స్ లభిస్తుంది. ఈ స్కీం కిందే యూకేలో చదువుకుంటున్న విద్యార్థిని లావణ్య మాగన్, లండన్నుంచి ఇండియాకు వచ్చేందుకు జూలై 21, 2021న ఎయిరిండియా టికెట్ బుక్ చేసుకుంది. ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ చేసే సమయంలో ఆమెకు ఈ స్టూడెంట్ లగేజీ స్కీమ్ వర్తించదంటూ అదనపు లగేజీ ఛార్జీల కింద 350 బ్రిటిష్ పౌండ్లు (రూ. 34,131) వసూలుచేయడంతో వివాదం మొదలైంది.అకడమిక్ ప్రోగ్రామ్ (చదువు) కాలపరిమితి ముగిసినందువల్ల ఆమె ఈ పథకానికి అర్హురాలు కాదని మొదట ఎయిరిండియా వాదించి, క్లెయిమ్ను తిరస్కరించింది. అయినా మాగన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. తాను నాలుగేళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తి చేశానని, తన ప్రయాణం చదువు పూర్తి కావడానికి సంబంధించిందేనని వాదించింది. చివరికి ఎయిరిండియా డబ్బులు చెల్లించేందుకు అంగీకరించింది. కానీ దాన్ని చెల్లించడంలో విఫలం కావడంతో మరోసారి వినియోగరుదారుల కమిషన్ను ఆశ్రయించి విజయం సాధించింది.
పూరీ జగన్నాథ రథయాత్రకు ముహూర్తం ఖరారు
పూరి: ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ మహా ఘట్టం ఈ ఏడాది జూలై 16న జరగనుంది. జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి శ్రీమందిరం నుండి గుండిచా ఆలయానికి చేసే ఈ దివ్య యాత్రను కళ్లారా వీక్షించేందుకు, ఆ రథాల తాళ్లను తాకేందుకు దేశవిదేశాల నుండి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి వచ్చేందుకు తహతహలాడుతున్నారు.భక్తి పారవశ్యంలో పూరీ క్షేత్రంప్రస్తుతం పూరీ జగన్నాథుడి చెంత ఆధ్యాత్మిక వాతావరణం తొణికిసలాడుతోంది. ఆలయ రథఖలా (రథాల తయారీ స్థలం) వద్ద సంప్రదాయ హస్తకళాకారులు, శిల్పులు అహోరాత్రులు శ్రమిస్తూ భారీ రథాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ పర్వదినం నుంచే ఈ పవిత్ర రథాల నిర్మాణ పనులు ప్రారంభం కావడం ఇక్కడి శతాబ్దాల నాటి సంప్రదాయం. ఈ అద్భుత రథాల రూపకల్పనలో 100 మందికి పైగా సంప్రదాయ కళాకారులు, ఆలయ సేవకులు భక్తిశ్రద్ధలతో నిమగ్నమై ఉన్నారు.ముగ్గురు దేవుళ్లు.. మూడు దివ్య రథాలుఈ రథయాత్రలో ముగ్గురు దేవతామూర్తులకు ప్రత్యేకంగా మూడు భారీ రథాలను తీర్చిదిద్దుతారు. భగవాన్ జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అని పిలుస్తారు, దీని ఎత్తు సుమారు 45 అడుగులు కాగా, దీనికి 16 భారీ చక్రాలను అమరుస్తారు. బలభద్రుడి రథమైన ‘తాళధ్వజం’ సుమారు 44 అడుగుల ఎత్తుతో, 14 చక్రాలను కలిగి ఉంటుంది. ఇక దేవి సుభద్ర ప్రయాణించే ‘దర్పదలన’ రథం దాదాపు 43 అడుగుల ఎత్తు, 12 చక్రాలతో రూపుదిద్దుకుంటుంది. ఈ మూడు రథాల నిర్మాణానికి ప్రతి ఏటా సరికొత్త కలపను మాత్రమే ఉపయోగించడం విశేషం.జూలై 16న మహా రథయాత్రఈ ఏడాది జూలై 16వ తేదీన పవిత్ర రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ మహా యాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలు తమ ముఖ్య ఆలయం (శ్రీమందిరం) నుండి బయలుదేరి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఈ మూడు కిలోమీటర్ల మార్గంలో స్వామివారి రథాలను లాగడానికి, ఆ పుణ్యాన్ని దక్కించుకోవడానికి భక్తజనం తరలివస్తారు.ఒడిశా సాంస్కృతిక వారసత్వ ప్రతీకపూరీ జగన్నాథ రథయాత్ర అనేది కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు. అది ఒడిశా రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి, అక్కడి అద్భుత శిల్పకళా నైపుణ్యానికి ఒక సజీవ ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఈ కళా నైపుణ్యం రథాల తయారీలో స్పష్టంగా కనిపిస్తుంది. భక్తి, సంప్రదాయం, అద్భుత హస్తకళల కలయికగా ఈ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుఈ మహాత్సవానికి దేశ, విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యం, భద్రత కోసం ఒడిశా రాష్ట్ర యంత్రాంగం, ఆలయ యాజమాన్యం, వివిధ భద్రతా సంస్థలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. రథయాత్ర సాఫీగా సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత!
ఎన్ఆర్ఐ
భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!
భారత సంతతి విద్యార్థి అవని అహుజాకి ప్రతిష్టాత్మక హెన్నీ ఫోర్డ్II స్కాలర్ అవార్డుని గెలుచుకుంది. ఎంఐటీలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డుని సాధించిన ఎన్నారైగా ఘనత సృష్టించింది. అసాధారణమైన విద్యా ప్రతిభ, ఇంజనీరింగ్లలో బలమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్లకు ఈ పురస్కారన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో ప్రతిష్టాత్మక ఎంఐటీ విద్యార్థుల ప్రత్యేక బృందంలో చేరారు. ఈ పురస్కారం ఇటీవల కోడే రీసెర్చ్ గ్రూప్లో ఆమె చేసి వర్క్ కెపాసిటివ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ పరిశోధనకు గానూ లభించింది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైర్లెస్గా ఛార్జ్ చేయడానికి, శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ మేరకు అవని మాట్లాడుతూ.."ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా డీన్ హామండ్ను కలవడం ఒక గొప్ప గౌరవం." అని అన్నారామె. నిజానికి హెల్త్కేర్ టెక్నాలజీలు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లలో పనిచేయగల సామర్థ్యమే, ఆమెను ఎంఐటీ అత్యంత ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే అవనికి అత్యంత ఆసక్తి ఉన్న రంగాలలో మహిళల ఆరోగ్య పరిశోధన ఒకటి. అంతేగాదు ఆమె రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్ను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన, ధరించగలిగే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్కు సంబంధించిన పరిశోధనలలో కూడా కీలకపాత్ర పోషించారామె. తాను పీహెచ్డీ పూర్తి అయిన వెంటనే మహిళల ఆరోగ్య పరిశోధన రంగంలో పవర్ ఎలక్ట్రానిక్స్ను అన్వయించాలని చూస్తున్నట్లు తెలిపారు.(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు.
ఆటా సభలకు వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి,తాడేపల్లి: అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు.. 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్కు వివరించారు.
కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై అమెరికా దాడులు చేసింది.
క్రైమ్
అతనితో శారీరక సంబంధం పెట్టుకో.. బాలికకు వీఆర్వో ఒత్తిడి..!
అనకాపల్లి జిల్లా: మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికను ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసిన మహిళా వీఆర్వోపై కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం. ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హాస్టల్ ఉండి చదువుకుంటోంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన ఆ బాలికకు సమీపంలో ఉన్న మహిళా వీఆర్వో బొల్లం పార్వతి ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని చెప్పింది. అందుకు బాలిక నిరాకరించడంతో మహిళా వీఆర్వో, ఆమె అక్క సింగారపు అప్పలనర్సలు చెడు ప్రచారం చేయసాగారు. బాలికకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉన్నట్టు వదంతులు సృష్టించి ప్రచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది తెలిసిన బాలిక మనస్థాపం చెందడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఈ నెల 6వ తేదీన యలమంచిలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో వీఆర్వోపై కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుస్టేషన్కు సూది పంచాయితీ!
శ్రీసత్యసాయి జిల్లా: వెనుక నుంచి సూది గుచ్చిందంటూ ఓ మహిళ మరో మహిళతో గొడవకు దిగింది. చివరికి ఈ పంచాయితీ పోలీసుస్టేషన్కు చేరింది. వివరాలు.. కదిరి పట్టణానికి చెందిన పక్కీరమ్మ సోమవారం ఆరోగ్యం బాగాలేకపోవడంతో బత్తలపల్లి ఆసుపత్రికి వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు వచ్చింది. వెనక వైపు నుంచి సూదితో గుచ్చినట్లు అనిపించగా.. వెనకే ఉన్న మహిళ గుచ్చిందంటూ ఆమెతో వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాబ్జాన్ వెంటనే అక్కడకు చేరుకుని ఇద్దరినీ పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం పక్కీరమ్మను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఆమె శరీరంపై ఎటువంటి ఇంజెక్షన్ ఆనవాళ్లు లేవని తేలడం గమనార్హ
60 ఏళ్ల వయసులో జల్సాలు..! స్నేహితుడిని నమ్మించి..
బంజారాహిల్స్: 60 ఏళ్ళ వయసులో జల్సాలకు అలవాటుపడ్డాడు..పేకాటకు బానిసై అప్పులు చేశాడు.. వాటిని చెల్లించేందుకు నమ్మిన స్నేహితుడినే నట్టేట ముంచి బంగారు నగలతో ఉడాయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్నయ్య అలియాస్ రాములు(60) పేకాటకు బానిసై జల్సాలకు అలవాటు పడి అందరి వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చడానికి మోసాలకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలోనే అమీర్పేట్లోని ఓ హాస్టల్లో ఉంటూ బస్టాప్లలో అపరిచితులను పరిచయం చేసుకొని స్నేహం నటించి వారితో రాకపోకలు సాగిస్తూ వారి కదలికలు గమనిస్తుండేవాడు. గచ్చిబౌలికి చెందిన ఆర్అండ్ బీ రిటైర్డ్ ఉద్యోగి రాజామ్ రాజయ్య ప్రకాశ్ను ఇలాగే పరిచయం చేసుకొని 62 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 57.66 గ్రాముల బంగారంతోపాటు ఒక మొబైల్ ఫోన్ను రికవరీ చేసి రిమాండ్కు తరలించారు.
అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమారుడు మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో సోమవారం తండ్రి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మిర్లోనిగూడెం గ్రామానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి(45) విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కవిత, ఇద్దరు కుమారులు ప్రశాంత్రెడ్డి, ప్రణీత్రెడ్డి(14) ఉన్నారు. లింగారెడ్డి కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసముంటున్నారు. లింగారెడ్డి పెద్ద కుమారుడు ప్రశాంత్రెడ్డి ఇటీవల పదో తరగతి పూర్తిచేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటరీ్మడియట్లో చేరాడు. సోమవారం ఉదయం ప్రశాంత్రెడ్డిని హాస్టల్లో వదిలిరావడానికి లింగారెడ్డి భార్య కవిత హైదరాబాద్కు వెళ్లింది. అదే సమయంలో లింగారెడ్డి తండ్రి సత్తిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామమైన మిర్లోనిగూడెం వెళ్లగా.. ఇంట్లో లింగారెడ్డి, అతడి చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డి మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డికి ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడగగా.. తిన్నానని సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకునేసరికి గేటుకు లోపలి నుంచి బేడం వేసి ఉంది. ఎంత పిలిచినా భర్త, కుమారుడు స్పందించకపోవడంతో పక్కింటి బాలుడి సహాయంతో గేటు తెరిపించి లోపలికి వెళ్లి చూడగా భర్త, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత్రెడ్డి తలపై తీవ్ర గాయాలు ఉండగా, ఇంట్లో టీవీ స్టాండ్పై సుత్తి కనిపించింది. మరోవైపు లింగారెడ్డి నోటి నుంచి నురగలు రావడంతో పాటు పక్కనే పురుగుల మందు డబ్బా లభించింది. అయితే కొడుకును సుత్తితో కొట్టి హత్య చేసిన అనంతరం లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సుత్తిపై ఉన్న వేలిముద్రలతో పాటు మృతుల వేలిముద్రలను కూడా సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వీడియోలు
కొంచమైనా సిగ్గు లేదా..లోకేష్ కు ఇచ్చిపడేసిన అమర్నాథ్
దంచికొడుతున్న వర్షం.. చెరువులైన రోడ్లు
ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై కారుమూరి సంచలన నిజాలు
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి..! ఇద్దరికి ఇచ్చి పడేసిన అడ్వకేట్ రజిని
ఫిలిపైన్స్ లో సునామీ అలర్ట్..చూస్తుండగానే పేకమేడల్లా కూలిన భవనాలు
ఇంటి వద్ద హై టెన్షన్.. అడ్డుకున్న పోలీసులు ఇచ్చిపడేసిన మార్గాని భరత్
లోకేష్ వ్యాఖ్యలపై స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహం
మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్, తిరిగి వచ్చిన కుక్క కుక్క ప్రవర్తనలో మార్పు
పత్తిపాటి పుల్లారావు అసలు నీకు బుద్ధి ఉందా..?
బై రెడ్డిపై TG భారత్ కేసు.. నన్నే భయపెట్టాలని చూస్తున్నావ్, బై రెడ్డి స్వీట్ వార్నింగ్

