చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. కోహ్లి వరల్డ్ రికార్డు బ్రేక్
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా పల్లెకలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఫర్హాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.కేవలం 60 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఫర్హాన్ 9 ఫోర్లు, 5 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. ఈ అద్బుత ఇన్నింగ్స్తో పర్హాన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఫర్హాన్ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 వరల్డ్కప్ ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2014 టీ20 ప్రపంచకప్లో విరాట్ 319 పరుగులు చేశాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్లో ఫర్హాన్ 383 పరుగులు చేశాడు. దీంతో కోహ్లి ఆల్టైమ్ రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేశాడు.👉టీ20 వరల్డ్కప్ ఒక ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్మైర్(17)ను ఫర్హాన్(18) అధిగమించాడు.👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి బ్యాటర్గా సాహిబ్జాదా ఫర్హాన్ నిలిచాడు. ఇంతకుముందు ఏ ఆటగాడు కూడా ఒకే టోర్నీలో రెండు శతకాలు బాదలేదు.👉అదేవిధంగా టీ20 ప్రపంచకప్లో ఓవరాల్గా రెండు సెంచరీలు చేసిన ప్లేయర్గా క్రిస్ గేల్ రికార్డును ఫర్హాన్ సమం చేశాడు.
మదురోగా ఖమేనీ?.. ఏ క్షణమైనా..
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్లో నాయకత్వ మార్పుదిశగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఖమేనీ పరిస్థితిపై స్పష్టత లేదు. ఆయన రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ రైట్ హ్యాండ్ జనరల్ అలీ ఖంబాని హతం కాగా, ఇరాన్కు చెందిన పలువురు సినియర్ కమాండర్లు మృతిచెందినట్లు సమాచారం.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు, దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతొల్లా ఆలీ ఖమేని చనిపోయాడంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తుండగా.. తమ సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని ఇరాన్ ఆర్థిక మంత్రి అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు ఇజ్రాయెల్తో కలిసి అమెరికా జల్లెడ పడుతోంది. 1979లో రిపబ్లిక్గా మారినప్పటి నుంచి ఇరాన్లో ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం.. దాన్ని అణచివేసేందుకు ఖమేనీ నేతృత్వంలోని ఐఆర్జీసీ బలగాల దమనకాండ.. వేల మంది మరణాల నేపథ్యంలో.. ట్రంప్ టెహ్రాన్పై దాడికి దిగారు. ప్రస్తుత పరిణామాలు, జియోపాలిటిక్స్ ఈక్వేషన్లు అంచనా వేసినట్లుగానే జరుగుతున్నాయి.మదురోను అరెస్టు చేసిన సమయంలో అమెరికా తన నౌకదళాన్ని ఎక్కువగా వాడుకుంది. అదే సమయంలో సైబర్ ఎటాక్లు చేసింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ జలాల సమీపంలోకి రావడంతో.. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది.ఇరాన్ పౌరులు కూడా ఖమేనీ శకాన్ని ఖతం చేయాలంటూ భీష్మించుకోవడం.. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు కలిసివచ్చింది. నిజానికి 2012లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తాము యురేనియం కడ్డీని తయారు చేశామని ప్రకటించినప్పటి నుంచే అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పుడు టెహ్రాన్లో ప్రజాందోళనలు అమెరికాకు కలిసివచ్చాయి. ఇదే అదనుగా ఇజ్రాయెల్తో కలిసి అమెరికా యుద్ధం ప్రారంభించిందనే వాదనలు ఉన్నాయి.వాస్తవానికి ఇరాన్-అమెరికా వివాదాలు, దాడులు-ప్రతిదాడులు గత ఏడాది నుంచి మొదలయ్యాయి. గత ఏడాది జూన్ 21 అర్ధరాత్రి దాటాక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఆ మర్నాడే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ దాడి గురించి ఇరాన్ తమకు ముందుగానే సమాచారం అందించిందని అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా చెప్పారు. ఫలితంగా తాము ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. 2020లో ట్రంప్ ఇదే తరహా దాడులు చేయించారు.ఆ ఏడాది జనవరి 3న ఇరాక్లోని బగ్దాద్ విమానాశ్రయం సమీపంలో.. కుద్స్ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ లక్ష్యంగా దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇరాక్లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అల్-అసద్ వైమానిక స్థావరంపై విరుచుకుపడింది. అప్పట్లో కూడా ఇరాన్ ముందస్తుగా సమాచారం ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఈ దాడులతో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగకున్నా.. అప్పట్లో అక్కడ పనిచేసిన సైనికులు ఇప్పుడు అదే ట్రామాలో కొనసాగుతూ మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారనే నివేదికలు వచ్చాయి.గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పుడు దాడులు-ప్రతిదాడుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టమవుతోంది. అమెరికా సైనిక శక్తి విషయంలో బలంగా ఉంది. ఇరాన్ ఆ విషయంలో చాలా వెనుకబాటులో ఉంది. అయితే.. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో ఇరాన్ గడిచిన మూడేళ్లలో చాలా పురోగతి సాధించింది. అయితే.. సొంత ప్రజలే వ్యతిరేకంగా ఉండడంతో.. ఇరాన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ఇటీవల నివేదికలు వచ్చాయి. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు నేపథ్యంలో ఖమేనీ ఇప్పటికీ టెహ్రాన్లోనే ఉన్నాడా? లేక వేరే దేశంలో తలదాచుకుంటున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.
వేట్లపాలెం అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై ఆవేదన వ్య క్తం చేశారు వైఎస్ జగన్.‘వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలి’ అని వైఎస్ జగన్ సూచించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 28, 2026 కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
విజయ్కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు
టీవీకే పార్టీ అధ్యక్షుడు, అగ్రహీరో దళపతి విజయ్కు మరో బ్యాడ్ న్యూస్ తప్పదా. భార్య సంగీతసోర్నలింగంతో విడాకుల వార్తల మధ్య, మరో ఎదురు దెబ్బ తగలనుందా? తమిళనాట సీఎం కావాలని కలలు కంటున్న విజయ్ రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్కుడి సంచలన అంచనాలు వైరల్గా మారాయి. ఏమిటా అంచనాలు? ఈ కథనంలో తెలుసుకుందాం. తమిళనాడు ప్రస్తుతం కీలకమైన ఎన్నికల సీజన్ కు సిద్ధమవుతున్న వేళ, అందులోనూ విజయ్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న సమయంలో విజయ్ చుట్టూ ఉన్న వివాదాల తుఫాను విజయ్ ఇమేజ్కు కళంకంగా మారింది.ఇదీ చదవండి : ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్కు విడాకుల నోటీసులు27 నంబరు గండంనటన నుంచి రాజకీయ అరంగేట్రం చేసింది మొదలు వరుస కష్టాలు తప్పడం లేదు. మరీ ఆయన జీవితంలో27 నంబరు కలిసి రావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగాతమిళనాడులోని కరూర్ జిల్లాలో విజయ్ పార్టీ (TVK) సభ సందర్బంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగింది.భార్య సంగీత తమిళనాడు చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల పిటిషన్ను దాఖలు చేసిన ఫిబ్రవరి 27న వెలుగులోకి వచ్చింది. దీంతో 27 ఏళ్ల వైవాహిక బందం సంక్షోభంలో పడింది.ఇటీవలి చిత్రం జన నాయగన్ ఆలస్యం , కోర్టు పోరాటం తర్వాత, విజయ్ భార్య విడాకుల కోసం దాఖలు చేయడంతో, విజయ్ కష్టాలు అంతులేనివిగా కనిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు దళపతి విజయ్ భవిష్యత్తుపై జ్యోతిష్కుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సూపర్ స్టార్ కు మరో ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేశారు. ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం జ్యోతిష్కుడు ప్రశాంత్ కిని విజయ్ రాజకీయ గమనం గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్గా మారింది. “2030 తర్వాత దళపతి విజయ్ రాజకీయాల్లో గొప్ప విజయం సాధిస్తాడు. కానీ ఈసారి మాత్రం తమిళ రాజకీయాల్లో ఆయన ఉనికి చాటుకుంటాడు అంతే….!! ఆయన ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఈసారి కాదు….!! (sic).”మరొక పోస్ట్లో, “దళపతి విజయ్ ఈసారి తమిళనాడు ముఖ్యమంత్రి కాలేరు….!! అని పేర్కొన్నాడు. ఎం. జి.రామచంద్రన్, జయలలిత మాదిరిగానే చరిత్ర పునరావృతం కావచ్చని వ్యాఖ్యానించడం వైరల్గా మారింది.
మోహన్లాల్ (అగ్ర నటుడు) రాయని డైరీ
అవినీతి ఊబిలో ఏపీ పాలన!
మీ ప్రభుత్వం మీ చేతుల్లోనే..
భగ్గుమన్న పశ్చిమాసియా
మంచు విష్ణుకు దుబాయ్లో మిస్సైల్ పేలుడు అనుభవం
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
లంకపై గెలిచినా.. వరల్డ్కప్ నుచి పాకిస్తాన్ ఔట్
చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. కోహ్లి వరల్డ్ రికార్డు బ్రేక్
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
విశాల్ మెగా మార్ట్లో వాటా విక్రయం
అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే?
పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ.. ఫుల్ మాస్ ఐటమ్ సాంగ్ రిలీజ్
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
అదేం బౌలింగ్?.. అతడు అవసరమా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
బాబోయ్ బంగారం.. ఊహించని రేటుకు గోల్డ్!
T20 WC 2026: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ రోజు వర్షం పడితే..?
కార్మికులకే జీతాలివ్వలేని వారు రాజధాని ఎలా కడతారని అనుకుంటున్నార్సార్!
పెళ్లి వేళ.. రష్మిక, విజయ్ విద్యార్హతలు వైరల్.. ఎవరెంత చదువుకున్నారు?
ఎట్టకేలకు సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తో ఒప్పందానికి బాబుసై
Telangana: పెన్షన్ రూ 4 వేలకు పెంపు!
ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ఆస్తిలాభం పొందుతారు
హోలీ బోనంజా: మూడు రోజులు సెలవు.. ముందుగానే జీతం!
‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’
IND vs WI: విండీస్ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?
మీనా, వినీత్ నటించిన థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ వచ్చేసింది
చిలుకూరు ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూత
ఆప్ఘన్, పాక్ యుద్ధం.. భారత్పై ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్కు విడాకుల నోటీసులు
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు
రూ.210 కోట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఐపీ
మోహన్లాల్ (అగ్ర నటుడు) రాయని డైరీ
అవినీతి ఊబిలో ఏపీ పాలన!
మీ ప్రభుత్వం మీ చేతుల్లోనే..
భగ్గుమన్న పశ్చిమాసియా
మంచు విష్ణుకు దుబాయ్లో మిస్సైల్ పేలుడు అనుభవం
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
లంకపై గెలిచినా.. వరల్డ్కప్ నుచి పాకిస్తాన్ ఔట్
చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. కోహ్లి వరల్డ్ రికార్డు బ్రేక్
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
విశాల్ మెగా మార్ట్లో వాటా విక్రయం
అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే?
పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ.. ఫుల్ మాస్ ఐటమ్ సాంగ్ రిలీజ్
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
అదేం బౌలింగ్?.. అతడు అవసరమా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
బాబోయ్ బంగారం.. ఊహించని రేటుకు గోల్డ్!
T20 WC 2026: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ రోజు వర్షం పడితే..?
కార్మికులకే జీతాలివ్వలేని వారు రాజధాని ఎలా కడతారని అనుకుంటున్నార్సార్!
పెళ్లి వేళ.. రష్మిక, విజయ్ విద్యార్హతలు వైరల్.. ఎవరెంత చదువుకున్నారు?
ఎట్టకేలకు సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తో ఒప్పందానికి బాబుసై
Telangana: పెన్షన్ రూ 4 వేలకు పెంపు!
ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ఆస్తిలాభం పొందుతారు
హోలీ బోనంజా: మూడు రోజులు సెలవు.. ముందుగానే జీతం!
‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’
IND vs WI: విండీస్ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?
మీనా, వినీత్ నటించిన థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ వచ్చేసింది
చిలుకూరు ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూత
ఆప్ఘన్, పాక్ యుద్ధం.. భారత్పై ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్కు విడాకుల నోటీసులు
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు
రూ.210 కోట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఐపీ
ఫొటోలు
వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
లాంచనంగా మొదలైన శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా (ఫొటోలు)
లుక్ మార్చేసిన శ్రీముఖి.. అందంతో మెరిసిపోతుందిగా! (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మృణాల్ (ఫొటోలు)
విజయ్ పెళ్లిలో ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ అట్రాక్షన్ (ఫోటోలు)
ట్రెండింగ్ లో హీరోయిన్ త్రిష.. ఎందుకో తెలియదు (ఫొటోలు)
ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో సందడి చేసిన 'విరోష్' జోడీ (ఫొటోలు)
వరంగల్ : నిట్లో ఉత్సాహంగా స్ప్రింగ్స్ప్రీ–2026 (ఫొటోలు)
తిరుపతి ఐఐటీలో ఉత్సాహంగా తిరుత్సవ్–2026 (ఫొటోలు)
హోలీ : రంగులు చల్లుకుని ఉత్సాహంగా డ్యాన్స్ (ఫొటోలు)
సినిమా
పాత ఫోన్కు కొత్త కవర్..మంచి మాట చెప్పిన మంచు మనోజ్
మంచు మనోజ్ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా హుషారుగా ఉంటాడు. చాలా ఓపెన్గా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతాడు. తన చేష్టలు, మాటలతో చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తుంటాడు. కానీ తాజాగా అయన అందరికీ ఓ మంచి సందేశం ఇచ్చాడు. మెప్పు కోసం అప్పులు చేయొద్దదంటూ యువతకు విలువైన సలహా ఇచ్చాడు. తాజాగా ఆయన ఓ యూనవివర్సీటీలో జరిగిన ఈవెంట్కు అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గౌరవం అనేది మనం చేసే పనుల వల్ల వస్తుందని.. వాడే వస్తువుల వల్ల రాదని చెప్పారు. పాతఫోన్కు కొత్త కవర్ఈ సందర్భంగా మంచు మనోజ్ ఓ ఆసక్తికర విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నాడు. అదేంటంటే.. మనోజ్ ఇప్పటికీ పాత ఐఫోన్నే వాడుతున్నాడు.కానీ దానికి iPhone 17 Pro Max కవర్ వేసి మ్యానేజ్ చేస్తున్నాడు. ఆ ఫోన్ను చూపిస్తూ.. ఇతరుల మెప్పు కోసం అప్పులు చేసి విలాసాలకు వెళ్లవద్దని యువతకు సూచించారు. డబ్బు వృథా చేయకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. మనోజ్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో మనోజ్ బ్రిటిష్ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరా డిన యోధుడు డేవిడ్ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీని నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు.హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. మారియా ర్యబోషప్క హీరోయిన్గా నటిస్తున్నారు.Actor Manchu Manoj advised youth not to take loans just to impress others. Speaking at an event, he said he uses his old iPhone with an iPhone 17 Pro Max cover, urging students to avoid unnecessary luxury spending and be content with what they have.#ManchuManoj pic.twitter.com/wNOz2NF4yE— Telangana Ahead (@telanganaahead) February 28, 2026
'విష్ణు విన్యాసం' తొలిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
సామజవరగమన, సింగిల్ లాంటి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న హీరో శ్రీ విష్ణు నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'విష్ణు విన్యాసం'. పెద్దగా బజ్ లేకుండానే శుక్రవారం(ఫిబ్రవరి 27) థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచి దీనికి గొప్ప టాక్ అయితే రాలేదు. చూసినవాళ్లు కూడా పెదవి విరుస్తున్నారు. అయితేనేం తొలిరోజు కళ్లుచెదిరే కలెక్షన్స్ వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. మొదటిరోజు వసూళ్ల పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్బాస్' భామ డ్యాన్సులు)శ్రీ విష్ణు, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని కామెడీ కథతో తీశారు గానీ పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు. కానీ తొలిరోజు రూ.3.95 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ వదిలారు. వీకెండ్ అయ్యేసరికి ఈ మూవీ టాక్తో పాటు కలెక్షన్పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికైతే థియేటర్లలో వేరే మూవీస్ ఏం లేకపోవడం దీనికి కలిసి రావొచ్చు.'విష్ణు విన్యాసం' విషయానికొస్తే.. విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్ లెక్చరర్. జాతకాల పిచ్చి ఎక్కువే. వాస్తు బాలేదని పక్కింటి ఇంట్లోని వాష్రూమ్ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటేసినా పెళ్లి చేసుకోడు. ఇతడిని చూసిన తొలిచూపులోనే మరో లెక్చరర్ మనీషా(నయన్ సారిక) ప్రేమలో పడుతుంది. ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యే ముందు మనీషా.. ఓ నిజం చెబుతుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషా పెళ్లి చేసుకున్నారా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)
అప్పటివరకు నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి నటించిన తాజా చిత్రం "బోర్డర్ 2". అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఇంతటి ఘన విజయం అందుకున్న ఈ సినిమాను ఇంతవరకు చూడలేదంటున్నాడు సునీల్ శెట్టి.మాట మీదే ఉన్నా..రూ.500 కోట్ల క్లబ్లో చేరిన తర్వాతే బోర్డర్ 2 చూస్తానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ఇది దేశభక్తి సినిమా.. కచ్చితంగా ఇది రూ.500 కోట్లు దాటాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. రూ.500 కోట్ల క్లబ్లో చేరేవరకు నేను వేచి చూస్తానని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇప్పుడీ సినిమా రూ.489 కోట్ల కలెక్షన్స్ వరకు చేరుకుంది. మరో రూ.11 కోట్లు వస్తే నేను అనుకున్న నెంబర్ దాటేస్తుంది. సినిమాఅప్పుడే ఈ మూవీ చూస్తాను. చాలాసార్లు సినిమా చూడాలనుకున్నాను, థియేటర్ వరకు వెళ్లాను. అహాన్ ఇంట్లో ప్రాక్టీస్ చేసిన డైలాగులను థియేటర్లో చెవులారా వినాలనుకున్నాను. కానీ నన్ను నేను తమాయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే 1997లో వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్గా బోర్డర్ 2 తెరకెక్కింది. ఇందులో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, మోనా సింగ్, సోనమ్ బజ్వా, అన్య సింగ్, ప్రణవ్ వశిష్ట్, మేధ రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు.చదవండి: ప్రేయసికి బ్రేకప్ చెప్పలేదని హీరోని మార్చేశారా?
తిరుమల గుడి ముందే 'బిగ్బాస్' భామ డ్యాన్సులు
తిరుమల కొండపై కొందరు యూట్యూబర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి డ్యాన్సులు వేస్తూ ఓవరాక్షన్ చేస్తున్నారు. టీటీడీ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ వీళ్ల పద్ధతి మాత్రం అస్సలు మారడం లేదు. తాజాగా 'బిగ్బాస్' ఫేమ్ గీతూ రాయల్ అయితే గుడి ముందే సినిమా పాటలకు స్టెప్పులేసింది. వాటిని రీల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం కాస్త ఇప్పుడు వివాదాస్పదమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)రీసెంట్గా తన నలుగురు స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లిన యూట్యూబర్ గీతూ.. ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్స్ దగ్గర డ్యాన్సులు చేసింది. వాటిని వీడియోగా చేసి ఇన్ స్టాలో రీల్ అప్లోడ్ చేసింది. దీంతో ఈమెపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే సదరు రీల్ని డిలీట్ చేసింది. తాజాగా ఈమెపై టీటీడీ చర్యలకు కూడా సిద్ధమైంది. అదే విషయాన్ని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈమె.. ఏకంగా గుడి ముందే డ్యాన్సులు చేస్తుంటే టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.'అందరికీ ఒక గుడ్ న్యూస్. నా మీద చర్యలు తీసుకుంటారట. ఇక హ్యాపీగా ఉండండి. చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను. పోగొట్టుకోవడానికి ఇంకా ఏం మిగలలేదు. ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా మీరు తీసేసి సంతోషంగా ఉండండి' అని గీతూ తన లేటెస్ట్ వీడియోలో చెప్పుకొచ్చింది.తిరుమల కొండపై రూల్స్ పాటించాలని టీటీడీ పదేపదే చెబుతోంది. శ్రీవారి ఆలయం దగ్గర కూడా మైక్లో ప్రచారం చేస్తున్నారు. అయినా సరే కొందరు పట్టించుకోవట్లేదు. టీటీడీ నిబంధనల ప్రకారం.. కొండపై రాజకీయ ప్రసంగాలతో పాటు రీల్స్ చేయడం, ఫొటోషూట్స్ చేయడం లాంటివి నిషిద్ధం. అయినా సరే గీతూ రాయల్ లాంటి యూట్యూబర్లు.. సరదా కోసమో వ్యూస్ కోసమో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తీరా చర్యలకు సిద్ధమైతే గానీ తాము రూల్స్ అతిక్రమించామనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. మరి ఈమెపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: తిరుమల దర్శన వివాదం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ శివానీ నాగరం) View this post on Instagram A post shared by Sakshi TV (@sakshitvdigital)
క్రీడలు
శ్రీలంకతో చావో రేవో.. జట్టులో మూడు మార్పులు చేసిన పాక్
టీ20 వరల్డ్ కప్-2026 సూపర్-8 లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించగా.. పాక్కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం.పాక్ తొలుత బ్యాటింగ్ చేయనున్నందున 65 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించాలి. అప్పుడే న్యూజిలాండ్ను వెనక్కినెట్టి పాక్ సెమీస్కు అర్హత సాధిస్తోంది. ఈ కీలక మ్యాచ్లో పాకిస్తాన్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఖవాజా నఫే, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లుపాకిస్తాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక
అతడు అద్బుతాలు చేస్తాడు.. టీమిండియాకు ఎంపిక చేయండి: గంగూలీ
ఫిబ్రవరి 28, 2026.. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జమ్మూ అండ్ కాశ్మీర్ తమ 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించుతూ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది. హుబ్లీ వేదికగా జరిగిన జరిగిన రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో కర్ణాటకను ఓడించి జమ్మూ కశ్మీర్ ఛాంపియన్గా అవతరించింది. ఈ చారిత్రత్మక విజయంలో ఆ జట్టు పేసర్ ఆకిబ్ నబీ ధార్ది కీలక పాత్ర. ఈ సీజన్ అసాంతం ఆకిబ్ నబీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఈ సీజన్లో మొత్తం 60 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక పేసర్ 60 వికెట్ల మార్కును అందుకోవడం ఇది కేవలం మూడవసారి మాత్రమే. ఫైనల్ మ్యాచ్లో కూడా ఆకిబ్ దుమ్ములేపాడు. 29 ఏళ్ల నబీ తన స్వింగ్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.మొత్తంగా 5 వికెట్లు పడగొట్టి కర్ణాటక ఓటమిని శాసించాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి స్టార్ బ్యాటర్లను సైతం నబీ బోల్తా కొట్టించాడు. నబీ తన సంచలన ప్రదర్శనలతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని సైతం ఆకర్షించాడు.రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ఆకిబ్ నబీని ఎంపిక చేయాలని గంగూలీ సెలెక్టర్లకు సూచించాడు. ఇంగ్లండ్ పిచ్లపై ఆకిబ్ స్వింగ్ బౌలింగ్ భారత్కు ఉపయోగపడుతుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు."ప్రయత్నం, దృడ సంకల్పం ఉంటే ఏం చేయగలరో జమ్మూ కశ్మీర్ ప్రపంచానికి చాటి చెప్పింది. జమ్మూ కశ్మీర్ చారిత్రత్మక విజయంతో ఆ ప్రాంతం మొత్తం గర్వించేలా చేశారు. కఠిన పరిస్థితులే ఛాంపియన్లను తాయారు చేస్తాయి. ఆకిబ్ నబీ నిజంగా ఒక అద్భుతం.నబీ ఇప్పుడు టీమిండియా జెర్సీ ధరించేందుకు సమయం అసన్నమైంది. ఈ ఏడాది వేసవిలో ఇంగ్లండ్తో జరిగే వైట్బాల్ సిరీస్కు నబీని ఎంపిక చేస్తే బాగుంటుంది" అని ఎక్స్లో దాదా రాసుకొచ్చాడు. కాగా బారముల్లాకు చెందిన నబీ.. ఐపీఎల్లో కూడా సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. గత డిసెంబర్లో జరిగిన వేలంలో రూ. 8.4 కోట్ల భారీ ధరకు ఆకిబ్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
వాళ్లతో బౌలింగ్ చేయిస్తావా?: సాంట్నర్పై సౌతాఫ్రికా లెజెండ్ ఫైర్
ఇంగ్లండ్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. వ్యూహాలను అమలు చేసే క్రమంలో తడబడి ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సెమీస్ చేరేందుకు మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితి తెచ్చుకుంది. 159 పరుగులుకొలంబో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టిమ్ సీఫర్ట్ (35), ఫిన్ అలెన్ (29) ఫర్వాలేదనిపించగా.. గ్లెన్ ఫిలిప్స్ (39) రాణించాడు. మిగతా వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కివీస్ 159 పరుగులు చేయగలిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బలుఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు తీయగా.. లియామ్ డాసన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ను కివీస్ బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (2), జోస్ బట్లర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (26)ను ఫిలిప్స్ తొందరగానే పెవిలియన్కు పంపాడు.ఆఖర్లో అంతా తలకిందులుఇక జేకబ్ బెతెల్ (21), సామ్ కర్రాన్ (24) నిరాశపరచగా.. టామ్ బాంటన్ (33) రాణించాడు. ఇలాంటి తరుణంలో కివీస్కు గెలుపు అవకాశాలు మెరుగు కాగా.. విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ముఖ్యంగా 18వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో 22 పరుగులు పిండుకున్నారు. ఇక 19వ ఓవర్లో సాంట్నర్ బౌలింగ్లో 16 పరుగులు రాబట్టారు. ఇక ఆఖరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. హెన్రీ బౌలింగ్లో రెండు సింగిల్, ఫోర్ బాది పని పూర్తి చేశారు.మొత్తంగా జాక్స్ 18 బంతుల్లో 32, రెహాన్ అహ్మద్ 7 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచి.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ను గెలిపించారు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర మూడు, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో ఫలితం తారుమారు కావడంతో కివీస్కు చేదు అనుభవం తప్పలేదు. శ్రీలంకతో శనివారం నాటి మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోతేనే న్యూజిలాండ్ సెమీస్ చేరగలదు.వాళ్లతో బౌలింగ్ చేయిస్తావా?ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆఖరి రెండు ఓవర్లలో కివీస్ అనుసరించిన వ్యూహాన్ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఘాటుగా విమర్శించాడు. ‘‘18వ ఓవర్లో.. గెలుపు దోబూచులాడుతున్న వేళ.. ఇద్దరు కుడిచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్న సమయంలో.. ఆఫ్ స్పిన్నర్లను ప్రయోగిస్తారా? ఇంతకంటే జోక్ ఉంటుందా?’’ అంటూ కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్కు గ్రేమ్ స్మిత్ చురకలు అంటించాడు.చదవండి: T20 WC: పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు!
భారత్పై సెంచరీల మోత.. మిచెల్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. జనవరి 2026 నెలకు గాను 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా మిచెల్ ఎంపికయ్యాడు. గత నెలలో భారత్తో జరిగిన వన్డే సిరీస్లో మిచెల్ దుమ్ములేపాడు.కివీస్ జట్టు 2-1తో సిరీస్ గెలవడంలో డారిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు వన్డేల సిరీస్లో అతడు ఏకంగా 352 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండడం గమనార్హం. ఈ అద్భుత ప్రదర్శన ఫలితంగానే అతడికి ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ఈ అవార్డును మిచెల్ సొంతం చేసుకున్నాడు. ఇక బంగ్లాదేశ్కు చెందిన శోభన మోస్తరీ మహిళల విభాగంలో ఈ అవార్డును దక్కించుకుంది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో శోభన అసాధరణ ప్రదర్శన కనబరిచింది. టీ20 వరల్డ్కప్-2026కు బంగ్లా క్వాలిఫై కావడంలో ఆమెది కీలక పాత్ర.
న్యూస్ పాడ్కాస్ట్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు క్లీన్చిట్... కవిత, సిసోడియా సహా 23 మందీ నిర్దోషులే... ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
తిరుమల లడ్డూ ప్రసాదం, రాయలసీమ లిఫ్ట్పై ఏపీ శాసన మండలిలో చర్చించకుండా పలాయనం చిత్తగంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం... చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల హెచ్చరిక
మహాపచారం మీదే చంద్రబాబూ..! కల్తీనెయ్యి వివాదంలో చంద్రబాబు పాత నిర్ణయాలు వెలుగులోకి
ఏపీలో మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ కుంభకోణం.. అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ
తాత్కాలిక సుంకాలు 10 శాతం నుంచి 15 శాతానికి పెంపు... వెంటనే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు చెల్లవ్... పన్ను విధింపు కాంగ్రెస్ అధికారం మాత్రమే... అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
చంద్రబాబుదే కల్తీ పాపం.. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, వినియోగించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సర్కారు దగా... ఉప ప్రణాళిక నిధుల్లో 27 వేల కోట్ల రూపాయలు కోత
బిజినెస్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గొడవేంటి?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా తెరచాటున సాగుతున్న షాడో వార్ ఇప్పుడు బాహాటంగా రణక్షేత్రంలోకి మారింది. ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ నేడు బద్ధశత్రువులుగా మారాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య సమస్య ఎక్కడ మొదలైంది? అగ్రరాజ్యం అమెరికా ఈ గొడవలోకి ఎందుకు దిగాల్సి వచ్చిందో చూద్దాం.శత్రుత్వానికి పునాదులురెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు ఉండేవి. కానీ, ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమీకరణాలను మార్చేసింది. ఇరాన్లో రాజు మహమ్మద్ రెజా షా పహ్లవీ అమెరికా మద్దతుతో దేశాధినేత పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు. ఇది సంప్రదాయ ముస్లిం మత పెద్దలకు నచ్చలేదు. షా తన రహస్య పోలీసు దళంతో తనపై వ్యతిరేక స్వరాలను అణచివేసేవారు. దీంతో స్థానికంగా అసంతృప్తి పెరిగింది. దేశంలో చమురు సంపద పెరిగినప్పటికీ, అది సామాన్య ప్రజలకు చేరడం లేదని, కేవలం సంపన్నులకే లాభం చేకూరుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మొసాద్దెగ్ను అమెరికా తొలగించి షాను గద్దెనెక్కించడంపై ఇరానియన్లలో తీవ్ర వ్యతిరేకత ఉండేది.అప్పటి విప్లవం ఎలా జరిగింది?ఈ విప్లవంలో ప్రధాన నాయకుడు అయాతొల్లా రుహొల్లా ఖొమేనీ.. షా విధానాలను విమర్శించినందుకు ఆయనను 1964లో దేశం నుంచి బహిష్కరించారు. తాను ఫ్రాన్స్ నుంచి ఆడియో క్యాసెట్ల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగాలు పంపేవారు. 1978లో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, సమ్మెలు మొదలయ్యాయి. సైన్యం ప్రజలపై కాల్పులు జరిపినా ఉద్యమం ఆగలేదు. పరిస్థితి చేజారిపోవడంతో 1979 జనవరిలో షా పహ్లవీ దేశం విడిచి పారిపోయారు. 1979 ఫిబ్రవరిలో ఖొమేనీ ఇరాన్ చేరుకున్నారు. ఏప్రిల్లో జరిగిన రెఫరెండం ద్వారా ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది.విప్లవం తర్వాత ఏం జరిగింది?దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ (మత పెద్ద) చేతిలోనే తుది నిర్ణయ అధికారం ఉండేలా రాజ్యాంగం మారింది. 1979 నవంబర్లో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడి చేసి 52 మంది దౌత్యవేత్తలను చాలా రోజుల పాటు బందీలుగా ఉంచుకున్నారు. అప్పటి నుంచి అమెరికా-ఇరాన్ సంబంధాలు తెగిపోయాయి. ముస్లిం పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదు ఉన్న జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించిందని, దాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఖొమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒక అక్రమ దేశం అన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న హమాస్ (గాజా), హిజ్బుల్లా (లెబనాన్), హూతీలు (యెమెన్) వంటి సంస్థలకు ఆయుధాలు, ఆర్థిక సాయం చేస్తోందనే వాదనలున్నాయి. ఇది ఇజ్రాయెల్ భద్రతకు పెను సవాలుగా మారింది.అణు బాంబు భయంఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఇరాన్ చేతిలో అణు బాంబులు ఉంటే తమ మనుగడకే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.అమెరికా ఎందుకు మధ్యలోకి వచ్చింది?పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి. అయితే, అమెరికా జోక్యానికి కేవలం స్నేహం మాత్రమే కారణం కాదు, దీని వెనుక బలమైన భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి.చమురు సంక్షోభంఇరాన్ తన క్షిపణులతో ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక మార్గాలను మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీన్ని అడ్డుకోవడం అమెరికాకు కీలకం.ప్రాంతీయ ఆధిపత్యంఇరాన్ విస్తరణ వాదాన్ని అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ మిత్రదేశాల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇది రష్యా, చైనాల ప్రభావం ఆ ప్రాంతంలో పెరగడానికి దారితీస్తుంది.అణ్వాయుధ నియంత్రణఇరాన్ అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో అణ్వాయుధాల పోటీ మొదలవుతుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై కఠిన ఆంక్షలు విధిస్తోంది.తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్లోని క్షిపణి కేంద్రాలపై భారీ దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కార్యక్రమం వేగవంతం కావడంతో ఘర్షణ తారాస్థాయికి చేరింది. అమెరికా తన నావికా దళాలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించి ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య భూభాగం కోసం జరుగుతున్నది కాదు. ఇది సిద్ధాంతాలకు, ప్రాంతీయ ఆధిపత్యానికి, భవిష్యత్ అణు భద్రతకు మధ్య జరుగుతున్న పోరాటమని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు
యుద్ధం మొదలైంది.. ఇక బంగారం పెరిగిపోతుందా?
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా మళ్లీ భగ్గుమన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా శనివారం ఇరాన్ పై దాడి చేపట్టినట్లు సమాచారం వెలువడిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా విలువైన లోహాల మార్కెట్లు ఉత్కంఠకు గురయ్యాయి. సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండి వంటి లోహాలపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.టెహ్రాన్పై పగటి వేళ జరిగిన అరుదైన దాడి నేపథ్యంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఉద్రిక్తతలు పెరుగుతాయనే ఆందోళనతో పెట్టుబడిదారులు రక్షణాత్మక ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు.ఎంసీఎక్స్లో రికార్డు స్థాయిలుమల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు గణనీయంగా ఎగశాయి. ఏప్రిల్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు సుమారు రూ.1,60,399 వద్ద ట్రేడ్ అయ్యాయి. మార్చి డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు సుమారు రూ.2,67,600కు చేరాయి.దేశీయ స్పాట్ మార్కెట్లో కూడా బంగారం రూ.1.60 లక్షల మార్క్కు, వెండి రూ.2.68 లక్షల మార్క్కు చేరువ కావడం మార్కెట్ ఒత్తిడిని ప్రతిబింబిస్తోంది.ధరల పెరుగుదల వెనుక కారణాలువిశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ర్యాలీకి పలు కారణాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు పెట్టుబడిదారులను సురక్షిత స్వర్గధామ ఆస్తుల వైపు నెట్టాయి. యుఎస్ డాలర్ బలహీనత ఇతర కరెన్సీల హోల్డర్లకు బులియన్ను చౌకగా చేస్తూ డిమాండ్ పెంచుతుంది. ద్రవ్యోల్బణం, అస్థిరతకు రక్షణగా ప్రపంచ కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు మద్దతిస్తోంది.వెండి విషయానికి వస్తే, ఇది సురక్షిత ఆస్తిగా మాత్రమే కాకుండా పారిశ్రామిక లోహంగా కూడా ఉపయోగపడుతోంది. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వినియోగం పెరగడం వెండికి నిర్మాణాత్మక మద్దతు ఇస్తోంది.ఇకపై ఏం జరగనుంది?మార్కెట్ వ్యూహకర్తల దృష్టి ఇప్పుడు రెండు అంశాలపై నిలిచింది. అవి ఒకటి ఉద్రిక్తతలు మరింత విస్తరించి ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతాయా? రెండోది దౌత్య ప్రయత్నాలు ఉద్రిక్తతలను చల్లార్చుతాయా?యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రతిసారీ బంగారం ధరలు పెరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే ఉద్రిక్తతలు తగ్గినా లేదా డాలర్ బలపడినా బులియన్ ధరల్లో తాత్కాలిక వెనకడుగు సంభవించే అవకాశముంది. అస్థిర పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలా ఆలోచిస్తేనే ‘రిచ్’ అవుతారు.. కియోసాకీ హెచ్చరిక!
అమెరికా ఫిన్టెక్ దిగ్గజం .. స్క్వేర్, క్యాష్ యాప్లకు చెందిన బ్లాక్ (Block Inc.) కంపెనీ ఊహించని నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని సుమారు 10 వేల మంది ఉద్యోగుల్లో 40 శాతం.. అంటే 4,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని స్వయంగా కంపెనీ సీఈఓ జాక్ డార్సీ (ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు) ఇటీవల ప్రకటన చేశారు. ఇది ఆర్థిక సంక్షోభం వల్ల కాదు, కంపెనీ లాభాలు బాగున్నాయి.. షేర్లు 20-25 శాతం పెరిగాయి. కారణం ఒక్కటే.. కృత్రిమ మేధస్సు (AI)!"ఇంటెలిజెన్స్ టూల్స్ (AI) వాడితే చిన్న టీమ్తోనే ఎక్కువ పని, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇది కంపెనీల నడిపించే విధానాన్నే మార్చేసింది" అని డార్సీ స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రతి ఉద్యోగి కంపెనీకి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినా, ఇప్పుడు వాళ్ల పనిని ఏఐ చేస్తోందని అంగీకరించారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 6 వేల దాటకుండా తగ్గించాలని నిర్ణయించారు.ఈ పరిణామంపై ప్రసిద్ధ ఆర్థిక గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకీ (Robert Kiyosak) ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ శక్తివంతమైన పోస్ట్ చేశారు. "ఏఐ ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తోంది" అంటూ ఆయన హెచ్చరించారు. "ఉద్యోగిలా ఆలోచిస్తే ఏఐ మిమ్మల్ని భర్తీ చేస్తుంది. అదే వ్యాపారవేత్తలా ఆలోచిస్తే, డార్సీలా ఏఐని 'హైర్' చేసుకుని మీరు ధనికులవుతారు" అని స్పష్టంగా చెప్పారు.AI MAKES the RICH RICHER:Jack Dorsey just fired 4400 hundred employees. Not because the company needed the money.Dorsey admitted each employee made his company millions of dollars.Dorsey fired 4400 employee because AI could do their jobs.RICH DAD LESSON:Think like an…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 27, 2026
సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు
భారతీయ వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులకు సమయం ఆసన్నమైందని, సంప్రదాయ కనీస మద్దతు ధర విధానం నుంచి మార్కెట్ ఆధారిత ధరల వైపు మళ్లడం ద్వారానే రైతులకు శాశ్వత ఆర్థిక భరోసా లభిస్తుందని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజీ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘అగ్రి, కమోడిటీ సమ్మిట్ 2026’లో ఆయన ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా, సామాజికంగా, వాతావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను వివరించారు.ఖజానాపై భారం తగ్గేలా.. రైతుకు లాభం కలిగేలా..ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోందని షాజీ విశ్లేషించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ‘మార్కెట్ డిటర్మైన్డ్ ప్రైసెస్’ (మార్కెట్ నిర్ణయించిన ధరలు) విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. ‘ఎంఎస్పీ నుంచి మార్కెట్ ఆధారిత మద్దతు ధరలకు మళ్లాలి. ఇందులో కమోడిటీ డెరివేటివ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇందుకోసం మేము ఎన్సీడీఈఎక్స్తో కలిసి పని చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.రైతులకు ధరల రక్షణ కవచంరైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్పీఓ) ద్వారా రైతులకు ‘పుట్ ఆప్షన్స్’ అనే సరికొత్త ఆర్థిక సాధనాన్ని పరిచయం చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. రైతులు స్వల్ప రుసుము చెల్లించి తమ పంట ధరకు ముందే లాక్ చేసుకోవచ్చు. మార్కెట్లో ధరలు పెరిగితే ఆ పెరిగిన ధరల ప్రయోజనాన్ని రైతులు పొందవచ్చు. ఒకవేళ మార్కెట్ పడిపోతే రైతుకు కేవలం తాను చెల్లించిన రుసుము మాత్రమే నష్టం తప్ప, పంటపై కనీస ధర గ్యారెంటీగా ఉంటుంది.ఇది ఎలా పనిచేస్తుంది?ఉదాహరణకు ఒక రైతు క్వింటాల్ మిర్చిని రూ.10,000కు అమ్ముకోవాలని అనుకున్నాడనుకుందాం. రైతు కొంత రుసుము (ఉదాహరణకు రూ.200) చెల్లించి రూ.10,000 వద్ద ఎన్సీడీఈఎక్స్లో పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తారు. అంటే తన ధరను రూ.10,000 వద్ద లాక్ చేశారు.ధరలు పడిపోతే.. పంట చేతికి వచ్చేసరికి మార్కెట్లో ధర రూ.8,000 కి పడిపోయింది. అప్పుడు రైతు ఆందోళన చెందక్కర్లేదు. అతను ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం తన పంటను రూ.10,000కే అమ్ముకోవచ్చు. ఇక్కడ రైతుకు రూ.2,000 నష్టం తప్పుతుంది.ధరలు పెరిగితే.. ఒకవేళ మార్కెట్లో ధర రూ.12,000కి పెరిగింది. అప్పుడు రైతు తన ‘ఆప్షన్’ను వదులుకుని నేరుగా మార్కెట్లోనే రూ.12,000కి అమ్ముకోవచ్చు. ఇక్కడ రైతుకు పెరిగిన ధర ప్రయోజనం లభిస్తుంది. అతను నష్టపోయేది కేవలం తను కట్టిన రూ.200 రుసుము మాత్రమే. మార్కెట్ కుప్పకూలినా రైతుకు కనీస గ్యారెంటీ ధర లభిస్తుంది. ఇది ఎంఎస్పీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఎంఎస్పీలో ధర స్థిరంగా ఉంటుంది. కానీ పుట్ ఆప్షన్లో మార్కెట్ ధరలు పెరిగితే ఆ అదనపు లాభం రైతుకే చెందుతుంది.నాబార్డ్, ఎన్సీడీఈఎక్స్ సహకారంఈ విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి నాబార్డ్, ఎన్సీడీఈఎక్స్తో కలిసి పైలట్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. గిడ్డంగులను ఈ మార్కెట్ ప్లాట్ఫారమ్లతో అనుసంధానించడం ద్వారా రైతులు తమ పంటను వేర్హౌజ్లో పెట్టి అక్కడి నుంచే ఈ ఆప్షన్ల ద్వారా ధరను లాక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. వ్యక్తిగతంగా రైతులు మార్కెట్ ట్రేడింగ్ చేయడం కష్టం కాబట్టి, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓ) రైతుల తరపున ఈ లావాదేవీలు నిర్వహిస్తాయి. దీనివల్ల రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో పనిలేకుండా భరోసా లభిస్తుంది.ఇదీ చదవండి: షాపింగ్ బిల్లుకు నో ఫోన్నెంబర్!
ఫ్యామిలీ
ఇదిగో... బ్లింకిబాండ్
‘గుర్రాలు సినిమాలలో మాత్రమే కనిపిస్తాయి’ అనుకునే వరకు వచ్చింది పరిస్థితి. అయితే నిత్యజీవితంలో ఎక్కడో ఒకచోట అవి మనుషులకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. తాజా విషయానికి వస్తే... రాజస్థాన్లోని ఒక హైవేపై బ్లింకిట్ డెలివరీ బ్యాగ్ను గుర్రంపై మోసుకెళ్తున్న వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంటెంట్ క్రియేటర్ కపిల్ బిష్ణోయ్ ఈ వీడియో క్లిప్ను ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.‘ఇది రాజస్థాన్! యువకులకు గుర్రాన్ని స్వారీ చేసే అవకాశం ఇవ్వకుండా వృద్ధులు ఆన్లైన్ డెలివరీ చేస్తున్నారు’ అని సరదాగా తన క్యాప్షన్లో రాశాడు కపిల్.‘ఆధునిక రహదారిపై గుర్రపు డెక్కల లయబద్ధమైన సంగీతం మాత్రమే వినిపిస్తుంది. ఎలాంటి గందరగోళం, హడావిడీ కనిపించదు’ అనుకునేలా చేసిన ఈ తొమ్మిది సెకన్ల వీడియోను చూసి నెటిజనులు ‘వావ్’ అనడమే కాదు... ‘కార్లు, బైక్ల వల్ల ట్రాఫిక్ జామ్ సమస్యతోపాటు పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో గుర్రాలు పర్యావరణానికి హాని కలిగించని అద్భుతమైన రవాణా సాధనాలు’ అంటున్నారు కొందరు. ‘బ్లింకిట్’ను ‘జేమ్స్బాండ్’ ను కలిపి ‘బ్లింకిబాండ్’ అని నామకరణం చేశారు.
ఆర్టిస్ట్ మీరే... క్యారికేచర్ మీదే!
సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్... క్యారికేచర్ ట్రెండ్. పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీలో క్యారికేచర్లలోకి మార్చడమే ఈ ట్రెండ్ సారాంశం. వ్యక్తిత్వం నుంచి అభిరుచుల వరకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా క్యారికేచర్లను రూపొందిస్తున్నారు. ఈ కార్టూన్–స్టైల్ ఇమేజ్లు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్లో భాగం కావడానికి డ్రాయింగ్ స్కిల్స్, డిజైన్ సాఫ్ట్వేర్, ఎడిటింగ్ ఎక్స్పీరియెన్స్లాంటివేమీ అవసరం లేదు. జస్ట్... ఆసక్తి ఉంటే చాలు!మీరు కూడా ఈ ట్రెండ్లో భాగం కావాలనుకుంటే... ఇలా చేయండి:→ చాట్జీపీటీ ఒపెన్ చేసి లేటెస్ట్ వెర్షన్ (జీపీటి–4వో) ఎంపిక చేసుకోవాలి.→ స్పష్టమైన, ఫ్రంట్–పేసింగ్ సెల్ఫీ లేదా ఫొటోను అప్లోడ్ చేయాలి.→ ‘క్రియేట్ ఏ క్యారికేచర్ ఆఫ్ మై మీ’... ఇలా ఇన్పుట్ ఇవ్వాలి.→ మీ వృత్తి, అభిరుచులకు సంబంధించిన వివరాలను యాడ్ చేయాలి.→ ఇమేజ్ జనరేట్ అయిన తరువాత డౌన్లోడ్ చేసుకోవాలి.
గాసిప్ మా బలం
స్త్రీలు గాసిప్ మాట్లాడుకుంటూ ఉంటారనే ఒక ప్రచారం ఉంటుంది. ఆడవాళ్ల కబుర్ల కింద వీటిని కొట్టేస్తూ ఉంటారు. కాని ‘గాసిప్’ స్త్రీల స్నేహానికి ఒక వారధి అని, స్త్రీలు ఒకరితో మరొకరు చెప్పుకునే ఈ కబుర్లే పురుషుడి పెత్తనం నుంచి బయట పడేసే ఓదార్పు అని అంటున్నారు అంజలీ కృష్ణదాస్. కేరళకు చెందిన ఈ రంగస్థల నటి మరో ఇద్దరు నటీమణులతో కలిసి ప్రచారం చేస్తున్న ‘గాసిప్’ నాటకం స్త్రీల స్నేహాలపై కొత్త దృష్టిని కలిగిస్తోంది.అర్థవంతమైన మాటలు, దేశాన్ని ఉద్దరించే మాటలు మగవాళ్లు మాట్లాడుకుంటారట... ఆడవాళ్లు ఉత్త పోచికోలు కబుర్లు చెప్పుకుంటారట. అలా అని ఎవరన్నారు? మగాళ్లే. ఆడవాళ్ల మాటలకు అర్థాలు ఉంటాయని, ఆడవాళ్ల మాటల్లో ఆలోచనలు ఉంటాయని వారికి తెలుసునా?‘తెలియ చేయాలి’ అంటారు అంజలి కృష్ణదాస్. ఈమె ‘కొచ్చి’కి చెందిన క్లాసికల్ డాన్సర్. మరో క్లాసికల్ డాన్సర్ పొన్ను సజీవ్తో కలిసి అక్కడ ‘తుడిప్పు డాన్స్ ఫౌండేషన్’ అనే సంస్థను నడుపుతున్నారు. తన సంస్థ ద్వారా అందరూ స్త్రీలే భాగస్వామ్యం వహించేలా ఒక నాటకం వేయాలని అనుకున్నప్పుడు ఆమె దృష్టికి వచ్చిన వస్తువు ‘గాసిప్’. దీనికి సరైన తెలుగు మాట లేదు. గుసగుసలు, కబుర్లు, చాడీలు, పుకార్లు... అన్నీ కలిపితే గాసిప్. ఆడవాళ్లు ‘గాసిప్’ ఎందుకు మాట్లాడతారు? వాళ్లు మాట్లాడేదంతా గాసిప్పేనా? ఆ సంగతి చర్చించడానికే 45 నిమిషాల ‘గాసిప్’ అనే డాన్స్ డ్రామా సృష్టించారు అంజలి కృష్ణదాస్, పొన్ను సజీవ్.గాసిప్కు మూలం ఏమిటి?‘గాసిప్’ ఇంగ్లిష్ మాటకు మూలం గాడ్సిబ్. పూర్వం నెలలు నిండిన స్త్రీలు ఇంటి బయటకు వచ్చేవారు కాదు. ప్రసవం అయ్యాక కూడా కొన్నాళ్లు వాళ్లు బయటకు రావడానికి వీలుండదు. మరి ఇంట్లో అలాగే మగ్గితే విసుగెత్తి పోతారు. అందుకే ఆ సమయంలో నమ్మకంగా ఇంటికొచ్చి ఇరుగూ పొరుగున ఏం జరుగుతుందో చెప్పే స్నేహితురాళ్లను గాడ్సిబ్ అనేవారు. నెమ్మదిగా ఆ మాట నుంచి గాసిప్ పుట్టింది. ‘గాసిప్ను కాలక్రమంలో చెడ్డ మాటను చేశారు. కాని అది స్త్రీల మధ్య స్నేహానికి సంబంధించిన పదం. ఆ పూర్వపు మర్యాద ఆ పదానికి తీసుకురావడమే మా ప్రయత్నం’ అన్నారు అంజలీ కృష్ణదాస్.బూట్లూ– హైహీల్సూ‘గాసిప్’ నాటకంలో చాలాచోట్ల మగవాళ్ల బూట్లు ప్రదర్శిస్తారు నటీమణులు. ‘హీరో బూట్ల మీదే షాట్ ఓపెన్ చేస్తారు ఎందుకు? బూట్లు అధికారానికి, పురుష స్వామ్యానికి, పీడనకి గుర్తు. ఈ సినిమాలో బూట్ల బరువును ఆడవాళ్లు తోటి ఆడవాళ్ల సాయం, మాట సాయం వల్లే మోస్తారు. ఆఖరున వారు బూట్ల రాసి మధ్యన తమ హైహీల్స్ బయటకు తీయడంతో నాటకం ముగుస్తుంది’ అంటారు అంజలి.‘గాసిప్’ నాటకానికి విశేష ఆదరణ లభిస్తున్నదంటే విచిత్రం ఏముంది. స్త్రీలు చేసే కొత్త ఆలోచనలకు ఎప్పుడూ ప్రశంసలే కదా. అపాయంలో ఉపాయంస్త్రీలు గాసిప్ మాట్లాడని చోటు ఉండదు. వంటిగది, బ్యూటీ సెలూన్, రేషన్ షాప్, వీధి మలుపు, ఇంటి పిట్టగోడ... ఈ పిట్టగోడ మీద అనేక కార్టూన్లు కూడా ఉన్నాయి. ‘కాని స్త్రీల కబుర్లన్నీ వారు తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే వొత్తిడిని, పురుషుల పెత్తనాన్ని దూరం చేసేవే. వారు సాటి స్త్రీలతో మాట్లాడి సలహాలు తీసుకుంటారు, సూచనలు అందుకుంటారు, అపాయాల్లో ఉంటే ఉపాయాలు తెలుసుకుంటారు... పురుషుణ్ణి ఎదుర్కొనడమే వీటన్నింటి లక్ష్యం. తరతరాలుగా గాసిప్ మాట్లాడుతూ స్త్రీలు తమ నిత్య జీవితంలోని ఘర్షణలను దాటుతున్నారు’ అంటారు ‘గాసిప్’ రూపకర్తలు.
తొలి మహిళా ఐఏఎస్ అధికారి..! ఆఖరికి పెళ్లి కూడా..
పితృస్వామ్య విధానం బలంగా ఉన్న రోజుల్లో..ఉద్యోగం చేయడం అంటేనే అతి కష్టమైన, అనితరసాధ్యమైన ఆశయం. అలాంటిది ఈ మహిళ ఏకంగా ఐఏఎస్ అవ్వాలనుకుంది. అస్సలు ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఏకైక మహిళ కూడా ఆమెనే కావొచ్చు. పోనీ కష్టపడి ప్రతిష్టాత్మకమైన సివిల్స్ సర్వీస్లో ఉత్తీర్ణురాలైనా..కూడా ఎన్ని అవరోధాలంటే..ముఖ్యమంత్రి దగ్గర నుంచి, గవర్నర్ వరకు అందరు ఒక మహిళ ప్రజావసేవలోనా..! అని కనుబిమ్మలు, పెదవులు విరిచారు. పైగా ఆమెకు మరో హోదాని ఎంచుకోమని సూచించేవారు. కానీ ఆమె అచంచలమైన ధైర్యంతో వాళ్లందర్నీ ఒప్పించి మరి..భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి అయ్యింది. పురుషులతో సమానంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తూ..అందరిచేత మన్ననలను అందుకోవడమే గాక..ఇలాంటి అత్యుతన్నపదవిలో పురుషుల కంటే మహిళలే మేటీ అని రుజువు చేసిందామె.ఆ మహిళే..అన్నా రాజమ్ మల్హోత్రా. కేరళలోని కోజికోడ్లో జన్మించిన అన్నా మలబార్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ (అప్పటి మద్రాస్)లో బి.ఏ. ఆనర్స్ పూర్తి చేసింది. ఆ సమయంలో మహిళలకు కొన్ని వృత్తిపరమైన అవకాశాలు అందుబాటులో ఉండటంతో, అన్నా చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉన్నత డివిజన్ క్లర్క్గా జీవితాన్ని ప్రారంభించింది. 1950లో తన ఇంజనీర్ బంధువు సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం దరఖాస్తు ఫారమ్ను ఇంటికి తీసుకువచ్చే వరకు ఆమెకు సివిల్ సర్వీస్లో చేరాలనే ప్లాన్స్ ఏమి లేవు. చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు అంత పెద్ద ఆశయాలు మొదట్లో ఏమిలేవు. పైగా ఆ బంధువు పంపించిన ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ దరఖాస్తు రుసుము రూ. 140లు. అది ఆ సమయంలో ఆమెకు పెద్ద మొత్తమే. అయితే ఆ ఫీజు కట్టేందుకు తన స్నేహితుడి తల్లి ముందుకు వచ్చింది. సరిగ్గా 1952లో ఇంటర్వ్యూ రౌండ్లో, అన్నా IAS అధికారిణి కావాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పుడు, ఇంటర్వ్యూ కమిటీ ఆమెకు విదేశీ సేవ కోసం ప్రయత్నించమని సూచించింది. ఎందుకంటే అది మహిళలకు మరింత అనుకూలంగా ఉంటుంది. అంతేగాదు ఆఖరికి ఆమె ఏ పోస్ట్ ఇవ్వాలన్నిది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది నాయకులకు, అధికారులకు. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి..ఎందుకంటే..భారతదేశ మాజీ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి (అప్పటి మద్రాస్) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆమెను ఇంటర్వ్యూ చేశారు. మహిళలు ప్రజాసేవలో కొనసాగడం ఇష్టం లేదని నిర్మోహమాటం లేకుండా ఆమె ముఖం మీదే చెప్పేశారు. ‘మీరు నాకు అవకాశం ఇవ్వాలి’ అంటూ ఆయన్ను ఒప్పించి మరి ఐఏఎస్ అధికారి అయ్యింది అన్నా. అయితే బాధ్యతలు తీసుకునే ముందు సైనిక శిక్షణతో సహా గుర్రపు స్వారి, రివాల్సర్ ఉపయోగించటం తదితరాలన్ని పురుషులతో సమానంగా శిక్షణ తీసుకున్నారామె. ఆమె మొదటి పోస్టింగ్లో తిరుపత్తూరు (తమిళనాడు) సబ్-కలెక్టర్గా ఉంది. అన్నా రాజంకు మద్రాస్ కేడర్ కేటాయించారు. తరుచుగా అన్నా పురుష అధికారులతో నిండిన గదిలో ఉండాల్సి వచ్చేది. ఆ టైంలో ఒక స్తీకి ఉండాల్సిన కనీస వసతులు ఏమి లేవు అన్నాకి. ఆమె ధైర్యం ఏ రేంజ్లో ఉండేదంటే..తమిళనాడులోని డెంకనికొట్టై అడవి నుంచి ఏనుగులు గుంపు దారితప్పి బహిరంగ వ్యవసాయ భూమిలోకి తిరుగుతూ..గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తుండేది. దాదాపు 18 మైళ్ళు నడిచిన తర్వాత, జంతువులు హోసూర్ చేరుకున్నాయి. ఆందోళన చెందుతున్న నివాసితులు సహాయం కోసం అన్నా చక్కటి పరిష్కార మార్గం చూపారు. ఏనుగులు శబ్దానికి భయపడతాయి కాబట్టి..పెద్ద శబ్దం వచ్చే వాటితో ఆ ఏనుగుల మందవైపు సాగి తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆమె ప్లాన్ ఫలించి..ఆ వార్త పేపర్లో కూడా వచ్చింది. అయితే ఓ మహిళ అధికారి కావడంతో ఆమె చేసిన ఘనకార్యాన్ని అభినందించకపోగా..తీవ్రమైన అల్లర్లు చెలరేగితే ఆమె అణిచివేయగలదా? కాల్చమని ఆదేశాలు ఇవ్వగలదా?, మత పిచ్చివాళ్ళ దాడిని ఎదుర్కొనగలదా..?. అయినా అస్సలు మహిళకు ఎలా అంతటి అత్యున్నత పదవి ఇచ్చారంటూ విమర్శలు కురిపించారు. వాటిన్నంటిని అన్నా లెక్కచేయలేదు. ఇలాంటి ఎన్నో సవాళ్లను తన కెరీర్లో అధిగమించి ఉన్నతాధికారుల మన్ననలను అందుకున్నారామె. విద్యుత్ సరఫరా దగ్గర నుంచి ముంబైలోని నవా శేవా ఓడరేవు నిర్మాణం వరకు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారామె. అందుకుగానూ 1989లో అన్నాకు పద్మభూషణ్ లభించింది. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యభరితమైన హోదాలను అలకరించారామె. అయినా ఎప్పుడూ కూడా ఆమె తాను ఒక మహిళగా కొన్ని విషయాల్లో మినహాయింపు ఇవ్వమని ఏ సమయంలోనూ అగడలేదామె. అంతేగాదు నియామక సమయంలో కూడా వివాహం జరిగితే మీ సేవ రద్దు చేయబడుతుందనే నిబంధన ఉండేది. దాన్ని కూడా ఆమె అంగీకరించింది. ఎందుకంటే ఆ టైంలో అవివాహిత మహిళలు లేదా వితంతువులు మాత్రమే సేవ రంగంలో ఉండాల్సి వచ్చేది. పెళ్లి, కుటుంబం..అన్నా తన ఐఏఎస్ బ్యాచ్మేట్ రామ్ నారాయణ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్నారు. తన వివాహం సామాజిక ప్రతీకారానికి దారితీస్తుందని పూర్తిగా తెలిసినా (వారి మతాలు వేర్వేరు) వెనకడుగు వేయలేదు. వారిద్దరూ 1975లో వాషింగ్టన్, డిసిలో వివాహం చేసుకున్నారు. రామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ స్థాయికి ఎదిగి 1997లో మరణించారు. ఇక అన్నా 2018లో మరణించారు. ఆమె ఆనాడు ధైర్యంగా వేసిన ఒక్క అడుగు ఇవాళ ఎంతోమంది మహిళామణులు ఐఏఎస్లు అయ్యేందుకు మార్గం సుగమం చేసింది. ఆమె మొదట ఈ అత్యున్నత పదవిలోకి వచ్చేటప్పుడూ..మొత్తం దారి చాలా కఠినంగా ఇరుకుగా ఉంది.. ఇప్పుడది..పువ్వులతో పరిచి అందరికీ స్వాగతం పలుకుతున్నట్లుగా మారింది. (చదవండి: ఆ కమెడియన్కి వెయిట్లాస్ మందులు అస్సలు పనిచేయలేదు..! కారణం అదేనా..)
అంతర్జాతీయం
బీటీఎస్ స్టార్ ప్రాణహాని వ్యాఖ్యలు.. అభిమానుల ఆందోళన
సియోల్: దక్షిణ కొరియా పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ (BTS) సభ్యుడు జంగ్కుక్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగేళ్ల విరామం తర్వాత తమ కొత్త ఆల్బమ్ ‘అరిరంగ్’ (Arirang) విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, జంగ్కుక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీవర్స్ (Weverse) ప్లాట్ఫారమ్లో ప్రారంభమైన ఈ ప్రత్యక్ష ప్రసారం దాదాపు 88 నిమిషాల పాటు సాగింది.ఆ సమయంలో జంగ్కుక్ మద్యం సేవిస్తూ, తన స్నేహితులతో కలిసి పాటలు పాడుతూ కనిపించారు. అయితే, ఆ వీడియోలో ఆయన ప్రదర్శించిన భావోద్వేగ స్థితి, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ లైవ్ సెషన్లో జంగ్కుక్ మాట్లాడుతూ.. ‘నన్ను ఇష్టపడని వారు, నా ఎదుగుదలను అడ్డుకోవాలని చూసే వారు ఉండొచ్చు.. కొందరైతే నన్ను చంపాలని కూడా అనుకుంటున్నారు. కానీ అందులో తప్పేముంది? నేను వాటి గురించి పట్టించుకోను’ అని ఆయన వ్యాఖ్యానించారు. లైవ్ వీడియోల విషయంలో తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోదలుచుకోలేదని, తన మనసుకు నచ్చినట్టు, స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. this korean man translated what jungkook said here and I’m shocked.. “people who want to k*** me”, he’s getting death threats??? oh my god this is so fucked up I’m speechless pic.twitter.com/fzb3JqwvQ5— jungkook ♥︎ (@ianadmirer) February 26, 2026ఈ క్రమంలో తన మేనేజ్మెంట్ సంస్థ (BigHit) గురించి కూడా ప్రస్తావిస్తూ, ఇకపై కంపెనీ నిబంధనల గురించి తనకు చింత లేదని, తన ఇష్టప్రకారం బతుకుతానని జంగ్కుక్ చెప్పారు. తన ధూమపాన అలవాటుపై కూడా జంగ్కుక్ మాట్లాడారు. ప్రస్తుతం తాను ధూమపానం చేయడం లేదని, ఎంతో కష్టపడి ఆ అలవాటును మానుకున్నానని వెల్లడించారు. 30 ఏళ్ల వయసులో ఉన్న తాను ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటంలో తప్పేమీ లేదని భావిస్తున్నప్పటికీ, తాను ఏ విషయం మాట్లాడినా కంపెనీ వారు పెద్ద రభస చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వీడియో వీవర్స్ ప్లాట్ఫారమ్ నుండి తొలగించబడినప్పటికీ, దానికి సంబంధించిన క్లిప్పింగ్లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రాణహాని గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కొరియన్ మీడియా కంటే అంతర్జాతీయ అభిమానులే ఎక్కువగా స్పందిస్తున్నారు. స్థానిక మీడియా ఆయన అలవాట్లను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తోందని, కానీ ఆయన మానసిక ఆరోగ్యం, భద్రతను విస్మరిస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ, బీటీఎస్ గ్రూప్ మార్చి 20న వారి కొత్త స్టూడియో ఆల్బమ్ ‘అరిరంగ్’ను విడుదల చేయనుంది. సైనిక సేవ పూర్తి చేసుకున్న తర్వాత సభ్యులందరూ కలిసి పాల్గొనే మొట్టమొదటి గ్లోబల్ కాన్సర్ట్ ‘బీటీఎస్ ది కమ్ బ్యాక్ లైవ్ అరిరంగ్’ మార్చి 21న నెట్ఫ్లిక్స్లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్త ఆర్మీ (BTS Fans) వేచి చూస్తున్న తరుణంలో, జంగ్కుక్ వ్యాఖ్యలు ఈ వేడుకలపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఆమెకే?
దక్షిణ లెబనాన్పై.. ఇజ్రాయెల్ దాడులు
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఇటీవల చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచుగా హిజ్బుల్లా తీవ్రవాదులు తరుచుగా ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. దక్షిణ లెబనాన్ లోని టెర్రరిస్టుల మౌలిక సదుపాయాల ధ్యంసమే టార్గెట్గా ఈ అటాక్స్ జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.అయితే ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అనుకూల వర్గాలైన హిజ్బుల్లా, హౌతీలు ఇరాన్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యెమెన్లోని ప్రభుత్వ మద్ధతు గల బలగాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై దాడులకు హౌతీలు సిద్ధమవుతున్నారు.దీనిలో భాగంగా హోదైదా, మారిబ్ ప్రాంతాల్లో తమ బలగాలను మోహరించారు. వారి నియంత్రణలో ఉన్న సనా వంటి నగరాల్లో అత్యవసర కేంద్రాలు, ఆశ్రయాలుగా ఉపయోగించే ప్రభుత్వ భవనాలు సిద్ధం చేస్తున్నారు. ఇరాన్పై అమెరికా దాడి చేసిన పక్షంలో హౌతీలు ఇతర ఇరాన్ మిత్ర బలగాలతో (హిజ్బుల్లా వంటి) కలిసి ‘యూనిటీ ఆఫ్ ఫ్రంట్స్’ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, కొత్త దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, అధునాతన డ్రోన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.మెుత్తంగా పశ్చిమాసియాలో పరిస్థితులు గంభీరంగా మారాయి. ఇటు వైపేమో ఇరాన్ అనుకూల వర్గాలు అమెరికా, ఇజ్రాయెల్ పై దాడులకు సిద్ధమవుతుండగా మరో వైపేమే అమెరికా తన యుద్ధ నౌకలను ఇరాన్కు దగ్గరగా తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.
ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఆమెకే?
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిని ఖరారు చేశారా? గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ చర్చకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన కుమార్తె కిమ్ జు ఆయేను దేశ తదుపరి అత్యున్నత నేతగా తీర్చిదిద్దే క్రమంలో కిమ్ కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవల జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో జు ఆయే స్వయంగా స్నిపర్ రైఫిల్ను ధరించి, లక్ష్యాన్ని ఛేదిస్తున్న చిత్రాలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కేసీఎన్ఏ (KCNA) విడుదల చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సైనిక అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల కొత్త తరం స్నిపర్ రైఫిళ్లను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్ తన కుమార్తెకు కూడా ఒక రైఫిల్ను బహుకరించడం విశేషం. ఈ ఆయుధాలను అద్భుతమైన ఆయుధాలుగా వర్ణించిన కిమ్, ఇవి తన నమ్మకానికి ప్రతీకలని పేర్కొన్నారు.ఉత్తర కొరియా అధికార పార్టీ అయిన వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (డబ్ల్యూపీకే) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అకాడమీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ తయారు చేసిన అత్యాధునిక రైఫిళ్లను కిమ్ పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే కిమ్ కుమార్తె జు ఆయే(13) తన తండ్రి తరహాలోనే లెదర్ జాకెట్ ధరించి షూటింగ్ రేంజ్లో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు కిమ్ ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయి. గతంలో ఆమెను కేవలం కుమార్తెగా పిలిచిన ప్రభుత్వ మీడియా ఇప్పుడు ‘గౌరవనీయ కుమార్తె’గా సంబోధిస్తుండటం గమనార్హం.జు ఆయే ఇప్పటికే తన వారసత్వ శిక్షణను పూర్తి చేసుకుని, అధికారిక హోదాను ఖరారు చేసే దశకు చేరుకుందని దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్ఐఎస్) చెబుతోంది. ఆమె ఇప్పటికే విధానపరమైన అంశాల్లో తనదైన ముద్ర వేస్తోందని, దేశంలో అప్రకటిత రెండో అత్యున్నత నేతగా చలామణి అవుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైఫిల్ను స్వీకరించారు. అయితే, మొదటిసారిగా కేసీఎన్ఏ ఆమెను పార్టీ కేంద్ర కమిటీలోని ‘జనరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్’గా గుర్తించి, ఆమె అధికార పరిధిని స్పష్టం చేసింది.ఒకప్పుడు కిమ్ వారసురాలిగా యో జోంగ్ పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు జు ఆయే తెరపైకి రావడం కొరియా రాజకీయాల్లో కొత్త మలుపుగా పరిగణిస్తున్నారు. కిమ్ ఇల్ సంగ్ స్థాపించిన ఈ సామ్రాజ్యంలో జు ఆయే బాధ్యతలు చేపడితే, కిమ్ కుటుంబం నుంచి నాలుగో తరం నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించనుంది. కిమ్ జోంగ్ ఉన్ అడుగుజాడల్లో నడుస్తూ, సైనిక కవాతులు, క్షిపణి ప్రయోగాల్లో చురుగ్గా కనిపిస్తున్న జు ఆయే, రాబోయే రోజుల్లో ఆ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’
"నేను మంచి తండ్రిని కాలేకపోయా"
ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఇతరులు యుద్ధాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. అయితే నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావోద్వేగ ప్రకటన చేశారు. తను ఒక మంచి తండ్రిగా ఉండలేక పోయానన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మెుదలయ్యి నాలుగేళ్లు గడిచింది. ఈ సంగ్రామంలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ‘సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్ఐఎస్)’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ యుద్ధం ముగింపుకోసం ఎన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సహా పలు దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావోద్వేగ ప్రకటన చేశారు.ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ " ఈ యుద్ధ సమయంలో నేను మంచి తండ్రిగా ఉండలేకపోయా, ఎందుకంటే నాపిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోయా, ఎందుకంటే నేను ఉక్రెయిన్ అధ్యక్షున్ని, నామెుదటి ఎంపిక ఎప్పుడూ దేశమే" అని జెలెన్స్కీ ఉద్వేగభరితంగా మాట్లాడారు. మా ప్రజలు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.అయితే రష్యా దాడులతో దేశంలో ఎలక్ట్రిసిటీ లేక దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని జెలెన్స్కీ తెలిపారు. పగలు రాత్రి తేడా లేకుండా వాతావరణం మైనస్ 30 డిగ్రీలకు చేరుకుందని దీంతో ప్రజలంతా అవస్థలు పడుతున్నారన్నారు. అయితే యుద్ధం వల్ల పాడైపోయిన విద్యుత్ వ్యవస్థ తిరిగి పునరుద్దరిద్దామంటే రష్యా దాడులతో అది సాధ్యపడడం లేదన్నారు.ట్రంప్కు థ్యాంక్స్కొద్దిరోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడానని శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ధన్యవాదాలని తెలిపారు. అయితే తమ దేశానికి చెందిన భూభాగాలని రష్యా తమదని ప్రచారం చేసుకోవడంతో విభేదాలు సాగుతున్నాయని తెలిపారు. అయితే రష్యా అధ్యక్షుడితో ముఖాముఖీ సమావేశం ఏర్పాటు చేయాలని జెలెన్స్కీ కోరుతున్నారు. అయితే రష్యా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దాని బదులు జెలెన్స్కీని మాస్కోకు రావాలని ఆహ్వానించగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోలేదు.
జాతీయం
వీధి కుక్కల దాడి.. బాలుడు మృతి
ముంబై: దేశవ్యాప్తంగా వీధి కుక్కల బీభత్సం నానాటికీ పెరుగుతుంది. సుప్రీంకోర్టు స్థానిక ప్రభుత్వాలు వీటిని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు కనబడడం లేదు. తాజాగా మహారాష్ట్రలో రోడ్డుపై ఆడుకుంటున్న 7 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.థానే జిల్లాలోనే కళ్యాణ్ ప్రాంతంలో కుశిల్ శంకర్ వాఘే అనే 7సంవత్సరాల బాలుడు ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. అయితే ఇంతలోనే అక్కడే ఉన్న వీధికుక్కలు అతనిపై దాడి చేశాయి. ఇది గమనించిన అతని మిత్రుడు నిలేశ్ బాగ్లే పరిగెత్తుతూ వచ్చి అతనిని కాపాడే యత్నం చేశాడు. అయితే ఆ కుక్కలు ఆ బాలుడిపై కూడా దాడి చేశాయి.దీంతో ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన వారి తల్లిదండ్రులు వెంటనే వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు అధికంగా కావడంతో కుశిల్ అనే బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రస్తుతం నిలేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డాక్టర్లు తెలిపారు.అయితే ఈ ఘటనపై ఆ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో వీధికుక్కల బెడద విపరీతంగా ఉందన్నారు. అక్కడి ప్రజలపై తరచుగా దాడులకు తెగబడుతన్నాయన్నారు. స్థానిక ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
10th పేపర్ లీక్.. 80 గ్రాముల బంగారం టోకరా
బెంగళూరు: కర్ణాటకలో ఓ టీచర్ పరీక్ష పేపర్ లీక్ చేస్తానని విద్యార్థికి ఆశ చూపి 80 గ్రాముల బంగారం కాజేసింది. ఈ వివరాలు సదరు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ స్టూడెంట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ధార్వాడ్లోని విద్యారణ్య పాఠశాలలో SSLV ( 10 వతరగతి) పరీక్ష పత్రాన్ని లీక్ చేస్తానని ఆ విద్యార్థికి, టీచర్ ఆశచూపింది. దీనికి గాను మెుదటగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే విద్యార్థి దగ్గర డబ్బు లేవని చెప్పడంతో ఇంట్లో ఉన్న బంగారం తేవాలని చెప్పింది. దానికి విద్యార్థి తొలుత భయపడ్డాడు. అయితే తను ఆ నగలు తిరిగి ఇచ్చేస్తానని భయపడాల్సిన అవసరం ఏమి లేదని విద్యార్థికి నచ్చజెప్పింది.దీంతో ఆ విద్యార్థి పరీక్షల్లో ఉత్తీర్ణున్ని అయితాననే ఆశతో ఇంట్లో ఉన్న 80 గ్రాముల బంగారం దాదాపు రూ. 12 లక్షలు విలువ తీసుకొచ్చి ఆ టీచర్కు ఇచ్చాడు. కొద్దిరోజులకు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆ టీచర్ అతనిని తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించింది. అయితే ఇంతలోనే బంగారం పోయిన సంగతి ఆ ఇంట్లో వారు గమనించారు. దీంతో ఆ పిల్లాడిని నిలదీయగా అతన అసలు విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఈ ఘటన వివరాలు పోలీసులకు తెలియడంతో ఆ విద్యార్థి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. అయితే విషయం తెలుసుకున్నపోలీసులు ఆ టీచర్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా మరేవరైనా విద్యార్థుల వద్ద నగదు కాజేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇండో–నేపాల్ సరిహద్దు మూసివేత
బహ్రైచ్(యూపీ): నేపాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మార్చి 2 అర్ధరాత్రి నుంచి 5 అర్ధరాత్రి వరకు భారత–నేపాల్ సరిహద్దు మూసివేయనున్నారు. ఈ మేరకు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ గురువారం అధికారిక ప్రకటన జారీ చేసింది. భారత్కు ఆనుకుని ఉన్న బాంకే జిల్లా అంతటా సరిహద్దు అవుట్ పోస్టులు మార్చి 2 నుంచి 5వరకు మూసివేయనున్నట్లు తెలిపింది.ఈ కాలంలో వస్తువుల దిగుమతులు, ఎగుమతులు కూడా నిలపివేస్తారు. అత్యవసరమైన మందులు, కీలక వస్తువుల రవాణా మాత్రం కొనసాగనుందని సశస్త్ర సీమా బల్ 42వ బెటాలియన్ కమాండెంట్ గంగా సింగ్ ఉదావత్ తెలిపారు. తప్పనిసరి అయితే తప్ప నిషేధిత కాలంలో సరిహద్దు దాటకుండా ఉండాలని రెండు దేశాల పౌరులకు సూచించారు. ఉపాధి, వ్యాపార ప్రయోజనాల కోసం భారత్లో ఉన్న నేపాలీ ఓటర్లు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు, అవసరమైన వస్తువులను మాత్రం భద్రతా దళాల పర్యవేక్షణలో సరిహద్దు దాటి అనుమతించనున్నట్లు తెలిపారు.
డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీ ఎంకే బహి ష్కృత నేత ఓ.పన్నీర్ సెల్వం (ఓపీఎస్) డీఎంకేలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఆయన డీఎంకే కండువాను కప్పుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకేలో చేరడం తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. సీఎం స్టాలిన్ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, అన్నాదురై, కరుణానిధి చూపిన దారిలో ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోతూ పార్టీని, ప్రభుత్వాన్ని ఆదర్శంగా నడిపిస్తున్నారని కొనియాడారు. ‘దేశం మొత్తం స్టాలిన్ నాయకత్వాన్ని నిశితంగా గమనిస్తోంది. రాజకీయ పార్టీని ఎలా నడపాలో ఆయన కొత్త వ్యాకరణం నిర్దేశించారు. తమిళనాడు ప్రజలకు సమర్థవంతమైన, గొప్ప ప్రశంసనీయమైన పరి పాలనను అందిస్తున్నారు’అని కొనియాడారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
అమెరికాలోని జార్జియాలో ఉండే భారతీయ అమెరికన్కి చేదు అనుభవం ఎదురైంది. చేయని నేరానికి ఆరు వారాల జైలు శిక్ష అనుభవించారు. కానీ విచారణలో కోర్టు ఈ కేసు కొట్టి వేసింది. దీంతో ఆయన న్యాయాపోరాటానికి సిద్ధపడ్డారు. జార్జియాలోని వాల్మార్ట్ స్టోర్లో ఒక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణతో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించిన భారతీయ అమెరికన్ 57 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.జార్జియాలోని అక్వర్త్లోని వాల్మార్ట్లోతన కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించా డని రెండేళ్ల బాలుడి తల్లి కరోలిన్ మిల్లర్ ఆరోపించింది. ఈ సంఘటనను వాల్మార్ట్ ఉద్యోగికి, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల మహేంద్ర పటేల్ను 2025, మార్చి 24న అరెస్టు చేశారు. ఈ విషయంలో తనకి, పటేల్కి మధ్య బాబు కోసం "టగ్ ఆఫ్ వార్" జరిగిందని కూడా పేర్కొంది. అయితే తాను నిరపరాధి నని మొదటినుంచి గట్టిగా వాదించారు మహేంద్ర పటేల్. 2025 మార్చి 18న, తాను వాల్మార్ట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు, టైలెనాల్ (టాబ్లెట్స్) ఎక్కడ ఉన్నాయోమిల్లర్ను దిశానిర్దేశం చేయమని అడిగానని పటేల్ చెప్పాడు. అప్పుడు ఆమె కొడుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడని గమనించి, అతను పడిపోకుండా ఉండటానికి చేయి చాచానని చెప్పుకొచ్చాడు.SHOCKING & SAD !! Mahendra Patel has filed a federal civil rights lawsuit after being jailed for 47 days over a Walmart incident.He was arrested after a shopper accused him of trying to kidnap her child. Police video later showed no force, no injury, and no kidnapping… pic.twitter.com/cRlPZfwvEH— M9 USA🇺🇸 (@M9USA_) February 11, 2026 తప్పుడు ఆరోపణల వల్ల పటేల్ 46 రోజుల పాటు కాబ్ కౌంటీ జైలులో గడపాల్సి వచ్చింది. ఆరు వారాల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. చివరికి ఆగస్టు 2025లో జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసును కొట్టివేసింది. రెండు పార్టీలు ఒక పరిష్కారానికి వచ్చాయని కోబ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ చెప్పింది.నిజం నిరూపించిన సీసీటీవీ ఫుటేజ్అతను బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపితమైంది.పటేల్ చాలా ప్రశాంతంగా ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లడం, ఆమె అతనికి 'థంబ్స్ అప్' చూపించడం స్పష్టంగా కనిపించింది. అలాగే మిల్లర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి పెనుగులాట జరగలేదు. ఇదీ చదవండి: రైల్లో శాండ్విచ్...నెటిజన్ల రియాక్షన్స్ వైరల్ వీడియో మానసిక వేదన, వ్యాపార నష్టం ఈ అనుభవాన్ని "పీడకల"గా అభివర్ణించారు. ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగ దీసిందనీ, ఆర్థికంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "టైలెనాల్ కోసం వెళ్తే, నా జీవితంలోనే అతిపెద్ద తలనొప్పి ఎదురైంది" అని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబం కూడా నరకం చూసిందన్నారు. ఒకవేళ వాల్మార్ట్ వీడియో లేకపోయి ఉంటే. ఆమె మాట వర్సెస్ నా మాటగా మారింది. నేనిక జైల్లో మగ్గిపోవాల్సి వచ్చేదన్నారు. ఆ ఫుటేజ్అక్షరాలా తన ప్రాణాన్ని కాపాడిందన్నారు.సుమారు రూ. 210 కోట్లుతాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆయన దావా వేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆక్వర్త్ నగరంపై, తప్పుడు ఫిర్యాదు చేసిన మిల్లర్పై , పోలీసులపై 25 మిలియన్ల డాలర్లు ( సుమారు (రూ.210 కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతంసీసీటీవీ ఫుటేజ్లో ఎలాంటి తప్పు కనిపించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగమేనని పటేల్ తరపు న్యాయవాది మార్క్ గ్రాస్మన్ అన్నారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు.
క్రైమ్
నిలదీసిన భర్తను నరమేధం చేసిన ప్రియుడు..!
తూర్పు గోదావరి జిల్లా: పెళ్లి బంధం ఎగతాళి అయ్యింది.. భార్య అక్రమ సంబంధానికి మూడుముళ్లు వేసిన భర్తే బలైపోవాల్సి వచ్చింది.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో నిలదీసిన భర్తను, ప్రియుడు దారుణంగా హత్యచేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంటకు చెందిన బక్కా నాగేంద్ర (32) భార్య వీరలక్ష్మితో రంగంపేట మండలం నల్లమిల్లికి చెందిన తోరాటి శివ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై నాగేంద్ర, వీరలక్ష్మి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన భార్య వీరలక్ష్మితో కలసి శివ ఉండటాన్ని నాగేంద్ర చూశాడు. ఆగ్రహానికి గురైన నాగేంద్ర.. శివను నిలదీయడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి గొడవ పడుతూ పక్కనే ఉన్న పంట బోదె వరకూ వచ్చేశారు. ఈ నేపథ్యంలో శివ బలమైన ఆయుధంతో నాగేంద్రపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం కొద్దిపాటి గాయాలైన శివ కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నాగేంద్ర మరణం వెనుక భార్య వీరలక్ష్మి, అత్త హస్తం కూడా ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అనపర్తి సీఐ సుమంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి భార్య పాత్రపై వస్తున్న ఆరోపణలను కూడా విచారిస్తున్నామని సీఐ తెలిపారు. నిందితులకు తగిన శిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.ఎన్నడూ లేని విధంగా హత్యలు, దాడులు : మాజీ ఎమ్మెల్యేపెద్ద దొడ్డిగుంట గ్రామంలో హత్య జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సందర్శించి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచిన క్షణం నుంచే హత్యలు, దాడులు, మానభంగాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఇటీవల పందలపాక, రంగాపురంలలో మహిళల హత్య, అదే గ్రామంలో బాలికపై అత్యాచారయత్నం, ఇప్పుడు దొడ్డిగుంటలో హత్య.. ఇవన్నీ కూటమి పాలన వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనాలు అని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండ ఉందన్న ధైర్యం పెరిగిందని, నేరస్తులకు స్టేషన్ బెయిల్లు, బాధితులకు శిక్షలు పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. నిందితుడు తోరాటి శివను, అతని బైకును రంగంపేట పోలీస్ స్టేషన్కు హత్యకు గురైన బక్క నాగేంద్ర అప్పగించినప్పటికీ, ఎస్సై కేసు నమోదు చేయకుండా అతనిని విడిచిపెట్టారని, అదే నిర్లక్ష్యం ఈ రోజు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని అని సూర్యనారాయణరెడ్డి అన్నారు. బిక్కవోలు, రంగంపేట మండలాల ఎస్సైలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏరికోరి తెచ్చుకున్నారని అన్నారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట ఎస్సై శివప్రసాద్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనపర్తి నియోజకవర్గంలో నేరస్తులకు రాజకీయ అండ, పోలీసుల నిర్లక్ష్యం పెరిగి, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని అన్నారు.ఎస్సైపై చర్యలకు డిమాండ్వివాహేతర సంబంధంపై ఈ నెల 6న రంగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మృతుడి నాగేంద్ర తండ్రి బక్కా వెంకటేశులు, తల్లి లక్ష్మి, చిన్నాన్న బక్కా వీర్రాజు, చిన్నమ్మ మంగ, సోదరుడు వీరబాబు తెలిపారు. ఫిర్యాదు చేయడంతో పాటు అక్రమ సంబంధం నడుపుతున్న తోరాటి శివకు సంబంధించిన బైక్ను కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించి న్యాయం చేయమని ఎస్సై శివప్రసాద్ను వేడుకున్నామన్నారు. అయినా ఎస్సై పట్టించుకోలేదని, నిందితుడు శివ వద్ద లంచం తీసుకుని తాము అప్పగించిన బైక్ను కూడా ఇచ్చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మరింత రెచ్చిపోయిన శివ విచ్చలవిడిగా వీరలక్ష్మి వద్దకు వచ్చేవాడని, తాము ఫిర్యాదు చేసినప్పుడే శివపై చర్యలు తీసుకుని ఉంటే తమ బిడ్డ బతికి ఉండేవాడని వాపోయారు. సంఘటనా స్థలం వద్దకు వచ్చిన సీఐ సుమంత్, డీఎస్పీ విద్య వద్ద కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసి ఎస్సై శివప్రసాద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని వారికి సీఐ, డీఎస్పీ హామీ ఇచ్చారు.
ఆర్టీసీ బస్సు–లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట జాతీయ రహదారి 65పై బైపాస్ రోడ్డులోని మూలమలుపు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్లలో సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జనసేన ప్రధాన కార్యాలయంలో యువకుడి హల్చల్
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్ : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి శుక్రవారం ఓ యువకుడు ప్రవేశించి కారు అద్దాలను పగలగొట్టడం సంచలనం కలిగించింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతను కార్యాలయంలో చొరబడ్డాడు. సాధారణంగా పార్టీ కార్యక్రమాలు ఉంటేనో.. లేదంటే పార్టీ కార్యాలయ సిబ్బంది ముందస్తు అనుమతి తీసుకుంటే తప్ప మీడియా ప్రతినిధులను సైతం భద్రతా సిబ్బంది జనసేన పార్టీ కార్యాలయంలోకి అనుమతించరు. అయితే ఆ వ్యక్తి ఎలా లోపలకు ప్రవేశించాడన్న దానిపై పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ ఘటనపై గుంటూరు ఐజీ, ఎస్పీ ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం అడిషనల్ డీజీ మహేశ్ చంద్ర లడ్డా భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఘటనకు పాల్పడిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల నారం నీలాద్రిగా సమాచారం. అతనికి మతిస్థిమితం లేదని.. పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఆ వ్యక్తి నిర్మాణ పనులకొచి్చన కారి్మకుడిగా భద్రతా సిబ్బంది భావించడం వల్లే లోపలకు రాగలిగాడని చెబుతున్నారు. గత ఏడాది మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఓ జనసేన నేత ‘జనసేన పార్టీని మంగళగిరి నియోజకవర్గంలో ఎదగనీయకుండా ఉండేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, దానికి జనసేన పార్టీలో కొందరు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు చేయడం గమనార్హం.
బాలికపై అనుచిత ప్రవర్తన కేసు కొట్టేయండి
బెంగళూరు: బాలికపై అసభ్యంగా నడుచుకున్న ఆరోపణలతో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ మల్లికార్జున ముత్యా కలబుర్గి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటనలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఫిర్యాదు మేరకు గోగి పోలీస్ స్టేషన్లో ముత్యాపై పోక్సో కేసు నమోదు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు మార్చి 2న విచారణ చేపట్టనుంది. ముత్యా అనతికాలంలోనే స్వామీజీగా ప్రజల నమ్మకం చూరగొన్నాడు. అయితే ఒక బాలిక పట్ల ఆయన ప్రవర్తించిన దృశ్యాలు వైరలై వివాదంగా మారడంతో పాటు పోక్సో కేసు మెడకు చుట్టుకుంది.
వీడియోలు
పెన్షన్ ఎవరిచ్చారు... జగన్ బాబు.. మంత్రి ముందే చంద్రబాబు పరువు తీసిన అవ్వ
ఇరాన్ కు అంత బలముందా.. ప్రపంచంపై యుద్ధం ప్రభావం ఏంటి?
ఈ యుద్ధం ఎక్కడ ఎందుకు మొదలైంది..
యుద్ధం ఆపేది లేదు.. ఇరాన్ డిమాండ్స్
దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం
మా వరకు ఎందుకు మీ ఎమ్మెల్యేలు చాలు సోషల్ మీడియాని కంపు చేయడానికి
వద్దురా అంటే వినలేదు.. వద్దురా అంటే వినలేదు.. కాకినాడ ప్రమాదం బాధితుల కన్నీటి పర్యంతం
కాకినాడ ప్రమాదంలో 22 మంది సజీవ దహనం
ఆకాశంలో అద్భుతం...మార్చి 3న రక్తంతో ఉండబోయే చంద్రుడు!
కల్తీ పాలు తాగి మనుషులు చనిపోతుంటే మీకు క్రికెట్ ఆటలు కావాలా..?

