300 సినిమాలు చేశా.. నాలో ఉన్న లోపం ఏంటి?.. : సుమన్ శెట్టి ఎమోషనల్
ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సుమన్ శెట్టి. తొలి సినిమా ‘జయం’తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందులో ‘అధ్యక్షా..’ అంటూ సుమన్ చేసే కామెడీకి తెలుగు ఆడియన్స్ పలగబడి నవ్వారు. జయం తర్వాత సుమన్కి వరుస అవకాశాలు వచ్చాయి. ఒకనొక దశలో ఆయన డేట్స్ కూడా దొరకనంత బిజీ కమెడియన్ అయిపోయాడు. దాదాపు 300పైగా సినిమాల్లో నటించిన సుమన్.. సడెన్గా వెండితెరకు దూరం అయ్యాడు. కొన్నాళ్ల పాటు ఆయన పేరు ఇండస్ట్రీ మరిచిపోయింది. బిగ్బాస్ షోతో మళ్లీ సుమన్ శెట్టి ఫామ్లోకి వచ్చాడు. బిగ్బాస్ 9వ సీజన్లో పాల్గొన్న ఆయన..తనదైన ఆటతీరుతో దాదాపు 14 వారాల పాటు హౌస్లో ఆకట్టుకున్నాడు. ఫినాలేకు ఒక్కవారం ముందు ఎలిమేట్ అయ్యాడు. బిగ్బాస్ తర్వాత ఆయన కెరీర్ పరంగా బిజీ అయిపోతారనుకుంటే.. అదీ జరగలేదు. పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. 300పైగా సినిమాలతో పాటు నంది అవార్డు కూడా దక్కించుకున్న తనకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అర్ధం కావట్లేదని సుమన్ శెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకప్పుడు నేను 30 రోజులూ షూటింగ్లోనే ఉండేవాడిని.300పైగా సినిమాలు చేశా. నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసేవాడిని. అయినా కూడా ఇప్పుడు నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదో అర్థం కావడం లేదు. ప్రాణం పెట్టి పని చేస్తా. నాలో ఉన్న లోపం ఏంటి? నటన విషయంలో ఎక్కడైనా తాను తగ్గిపోయానా? అనే సందేహాలు కూడా తనను వెంటాడుతున్నాయి’అని సుమన్ ఎమోషనల్ అయ్యాడు.
అమెరికాకు.. మోజ్తాబా వార్నింగ్
హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. శత్రువులను ఓడించడానికి తమ దేశ నౌకలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ హర్ముజ్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీం లీడర్ మెజ్తాబా ఖమేనీ పేరిట ఈ రోజు (శనివారం) ఒక ప్రకటన విడుదలైంది.మోజ్తాబా ఖమేనీ ప్రకటనలో " అమెరికా దళాలను ఓడించేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉంది. శత్రువులకు కొత్త రకమైన ఓటమిని రుచి చూపిస్తాం". అని హెచ్చరించారు. కాగా యుద్దం ప్రారంభమైన నాటి నుంచి మోజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. కేవలం ఆయన పేరు మీద ప్రకటనలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో గాయపడ్డారని, ఆయన ముఖం వికారంగా మారిందని ప్రచారం జరిగింది.ఇరాన్- అమెరికా మధ్య సయోధ్య కుదురుతుందనే నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్.. ఒక రోజు గడవకముందే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లో సోమవారం జరగనున్న చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్ నెలకొంది.
సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.150 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగుల చేసిన మాథ్యూ షార్ట్ ఇషాన్ మలింగ బౌలింగ్లో అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లలో సీఎస్కే 135/514 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 32, శివమ్ దూబే 10 పరుగులతో ఆడు తున్నారు.బ్రెవిస్ డకౌట్113 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ను శివాంగ్ డకౌట్గా పెవిలియన్ చేర్చాడు.ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో సీఎస్కే 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇషాన్ మలింగ బౌలింగ్లో వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 66 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాన్ మలింగ బౌలింగ్లో కెప్టెన్ రుతురాజ్ (19) వెనుదిరిగాడు. అంతకముందు ధాటిగా ఆడుతున్న ఆయుశ్ మాత్రే నితీశ్రెడ్డి బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.దంచికొడుతున్న సీఎస్కేఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో సీఎస్కే దంచికొడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (30), రుతురాజ్ (14) క్రీజులో ఉన్నారు.195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన శాంసన్ నితీశ్కుమార్ రెడ్డి బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 195 పరుగులుసీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్థసెంచరీలతో రాణించారు. వీరిద్దరు రాణించినప్పటికీ మిగతావారు విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో జేమి ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్సీఎస్కేతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సాహిల్ అరోరా గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్లో డెవాల్డ్ బ్రెవిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఎస్ఆర్హెచ్ 177 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్లో క్లాసెన్ (59) కంబోజ్ బౌలింగ్లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ 150 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లో నితీష్కుమార్ (12) ఓవర్టన్ బౌలింగ్లో ఔటయ్యాడు.12 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్లాసెన్ 30, నితీశ్రెడ్డి 4 పరుగులతో ఆడు తున్నారు.సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ జేమీ ఓవర్టన్ బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముకేశ్ చౌదరీ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన ఇషాన్ రుతురాజ్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.అభిషేక్ హాఫ్ సెంచరీ..సీఎస్కేతో మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 75 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన హెడ్ ముకేశ్చౌదరీ బౌలింగ్లో రుతురాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 26, హెడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా 27వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ తలపడు తున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ముఖాముఖి పోరులో ఇరుజట్లు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 15 విజయాలలు, ఎస్ఆర్హెచ్ 7 విజయాలు సాధించాయి. చివరి ఐదు మ్యాచ్ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్ 3, సీఎస్కే రెండింట నెగ్గాయి.సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగచెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (వికెట కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్
రూ.10 లక్షలకే వీకెండ్ విల్లా! + మంత్లీ రెంట్ గ్యారెంటీ
ఈరోజుల్లో నగర జీవితంలో ఉన్న రద్దీ, ఒత్తిడి నుంచి కొంత దూరంగా ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి మీ కలను నిజం చేసే ప్రాజెక్ట్ టీమ్లైన్ ఎకో రిసార్ట్స్(Teamline Eco Resorts). ప్రకృతి మధ్యలో, పచ్చని వాతావరణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీకు రిసార్ట్ లాంటి జీవనశైలిని అందించే ప్రత్యేకమైన అవకాశం కల్పిస్తుంది.Teamline Eco Resorts లో ప్రతి విల్లా ప్రకృతి అందాలతో ముడిపడి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం.. ఇవన్నీ కలిసి మీకు ఒక నిజమైన రిసార్ట్ అనుభూతిని కలిగిస్తాయి. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపడానికి, వీకెండ్ హాలిడే హోమ్గా ఉపయోగించడానికి లేదా భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా ఇది అద్భుతమైన అవకాశం.ఇక్కడి విల్లాలు కేవలం లగ్జరీ మాత్రమే కాదు, ప్రకృతికి దగ్గరగా జీవించే ఒక కొత్త జీవనశైలిని అందిస్తాయి. ప్రతి రోజు ఉదయం పచ్చని చెట్ల మధ్య సూర్యోదయాన్ని చూస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇక్కడి విల్లాల ప్రీమియం వివరాలు కింది విధంగా ఉన్నాయి.👉 39 లక్షలు ( 500 sqft విల్లా & 165 sqYards Land) + 10 వేలు నెలసరి అద్దె ఆదాయం👉 45 లక్షలు ( 750 sqft విల్లా & 165 sqYards Land) + 20 వేలు నెలసరి అద్దె ఆదాయం👉 65 లక్షలు ( 1250 sqft విల్లా & 165 sqYards Land) + 30 వేలు నెలసరి అద్దె ఆదాయంమీకు ఈ రిసార్ట్స్ వెంచర్స్ లో ఓపెన్ ప్లాట్ కొనాలి అనుకున్న Rs. 16,000/- పర్ స్క్వేర్ యార్డ్ విత్ 100% బ్యాంక్ లోన్ సౌకర్యంతో సదుపాయం కలదు.ప్రకృతి, ప్రశాంతత, లగ్జరీ జీవితం.. ఈ మూడింటి సమ్మేళనం Teamline Eco Resorts. మీ కలల విల్లాను ఇప్పుడే బుక్ చేసుకోండి. ప్రకృతి మధ్యలో ఒక కొత్త జీవనాన్ని ప్రారంభించండి.అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి(యాదాద్రి) ఆలయానికి సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి భవిష్యత్తులో భారీ అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి.వరంగల్ హైవే కనెక్టివిటీ – హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్లే ప్రధాన మార్గానికి సమీపంలో ఉండటం వల్ల ప్రయాణం సులభంగా ఉంటుంది.ఆలేర్ టౌన్ దగ్గరలో – రైల్వే స్టేషన్, మార్కెట్, విద్యాసంస్థలు, రోజువారీ అవసరాల కోసం ఆలేర్ టౌన్ సులభంగా చేరుకునే దూరంలో ఉంది.వీకెండ్ రిసార్ట్కు పర్ఫెక్ట్ లొకేషన్ – నగర రద్దీకి దూరంగా, ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ప్రదేశం వీకెండ్ రిలాక్సేషన్కు అత్యంత అనుకూలంగా ఉంటుంది.Teamline Eco Resorts లో మీరు కొనుగోలు చేసే విల్లా కేవలం ఒక ప్రాపర్టీ కాదు, భవిష్యత్తులో విలువ పెరిగే ఒక మంచి పెట్టుబడి కూడా. యాదాద్రి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మంచి రాబడిని ఇవ్వగలదు.అదిరిపోయే ఆఫర్ఈ రిసార్ట్స్లో విల్లా గెలుచుకునేందుకు Teamline Eco Resorts ప్రత్యేకంగా మెగా లక్కీడ్రాను ఆఫర్ చేస్తోంది. కేవలం రూ.1,000 టోకెన్ కొనుగోలుతో ఏకంగా రూ.39 లక్షల లగ్జరీ విల్లాను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులోని విజేతను ఆగస్టు 15, 2026న ప్రకటిస్తామని నిర్వహకులు ప్రకటనలో తెలిపారు.👉 పరిమిత సంఖ్యలో విల్లాలు ఉండడంతో ఈ ఆఫర్ కొంత కాలమే ఉంటుంది. వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు త్వరపడండి!👉 టీమ్లైన్ ఎకో రిసార్ట్స్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెంటనే 9000 30 3636 నంబర్కు సంప్రదించండి.Teamline Eco ResortsKotte Shyam RaoMarketing DirectorContact No: 9000 30 3636
లివర్ షివర్
డ్రైవింగ్ లైసెన్స్ కోసం... 139 విఫలయత్నాలు
ఈ కోర్టే నకిలీది!
ఎస్ఆర్హెచ్ను గెలిపించిన బౌలర్లు
తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్!
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెత్త రికార్డు
'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రైలు టికెట్ రహస్యం తెలుసా?
అమెరికాకు.. మోజ్తాబా వార్నింగ్
అమ్మాయిల జోలికి వచ్చారో.. ఇదే జరుగుద్ది
ఎల్లుండే గ్రహకూటమి.. ఈ 5 రాశుల వారికి తిరుగులేదు
రుతుపవనాల దగా?
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
అమ్మలా మోసి.. నాన్నలా కాచి
గేమ్ చేంజర్ X నేమ్ చేంజర్
మీరు నెత్తిన పెట్టుకున్న ఈశ్వరన్ జైలుకెళ్లాడు.. సింగపూర్ ఎవరి దెబ్బకు భయపడిందో అందరికీ తెలుసు!!
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
సంచలనం.. వైభవ్ సూర్యవంశీకి రూ.150 కోట్లు!?
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
అతడి కోసం ఢిల్లీ విరాట్ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
కళ్లు చెమర్చే దృశ్యం.. హృదయాన్ని తాకిన చిన్నారి వీడియో
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
లివర్ షివర్
డ్రైవింగ్ లైసెన్స్ కోసం... 139 విఫలయత్నాలు
ఈ కోర్టే నకిలీది!
ఎస్ఆర్హెచ్ను గెలిపించిన బౌలర్లు
తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్!
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెత్త రికార్డు
'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రైలు టికెట్ రహస్యం తెలుసా?
అమెరికాకు.. మోజ్తాబా వార్నింగ్
అమ్మాయిల జోలికి వచ్చారో.. ఇదే జరుగుద్ది
ఎల్లుండే గ్రహకూటమి.. ఈ 5 రాశుల వారికి తిరుగులేదు
రుతుపవనాల దగా?
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
అమ్మలా మోసి.. నాన్నలా కాచి
గేమ్ చేంజర్ X నేమ్ చేంజర్
మీరు నెత్తిన పెట్టుకున్న ఈశ్వరన్ జైలుకెళ్లాడు.. సింగపూర్ ఎవరి దెబ్బకు భయపడిందో అందరికీ తెలుసు!!
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
సంచలనం.. వైభవ్ సూర్యవంశీకి రూ.150 కోట్లు!?
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
అతడి కోసం ఢిల్లీ విరాట్ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
కళ్లు చెమర్చే దృశ్యం.. హృదయాన్ని తాకిన చిన్నారి వీడియో
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఫొటోలు
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)
ముంబైలో INCA అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)
సిద్ధార్థ్ బర్త్డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)
'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)
ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)
భూత్ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్ (ఫోటోలు)
సినిమా
రుక్మిణి స్మైల్ ప్లీజ్.. పద్ధతిగా నిధి అగర్వాల్
నవ్వుతూ కేక పుట్టిస్తున్న రుక్మిణి వసంత్బాలి ట్రిప్ లో మాళవిక మోహనన్ ఎంజాయ్చీరలో పద్ధతిగా కనిపిస్తున్న నిధి అగర్వాల్రెడ్ డ్రస్లో మెరిసిపోతున్న కల్యాణిబీచ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న జైన్ మేరీ ఖాన్జిమ్లో కష్టపడిపోతున్న బిగ్బాస్ దివి View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real)
తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్
'వరూధిని పరిణయం' సీరియల్ హీరోయిన్ చందన శెట్టి తల్లికాబోతున్న విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు మరో సీరియల్ హీరోయిన్గా కూడా ఇలాంటి శుభవార్త చెప్పింది. కాకపోతే ఆ విషయాన్ని కూడా సినిమాటిక్ వీడియోగా తీసి వెల్లడించింది.(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్లో రామరాజు చిన్నకోడలు ప్రేమ పాత్రని లావణ్య భరద్వాజ్ చేస్తోంది. తనదైన చలాకీ నటనతో ఆకట్టుకుంటోంది. స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమెనే ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. భర్త శశి హెగ్డేతో కలిసి ఓ వీడియోని పోస్ట్ చేసింది. 'చిన్నారితో మా ప్రేమకథ కొనసాగుతూనే ఉంటుంది' అని చెప్పుకొచ్చింది.లావణ్య ఈ విషయాన్ని బయటపెట్టగానే తోటి హీరోయిన్ అన్షు రెడ్డితో పాటు మిగతా వాళ్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ నేపథ్యంలో లావణ్య.. ఈ సీరియల్కి గుడ్ బై చెప్పనుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఈమె స్థానంలో 'నిన్ను కోరి' సీరియల్ ఫేమ్ అక్షిత దేశ్ పాండేని తీసుకుంటారనే ప్రచారం కూడా నడుస్తోంది.(ఇదీ చదవండి: ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు) View this post on Instagram A post shared by Bharadhwaj✌️ (@lavanya.laav_official)
300 సినిమాలు చేశా.. నాలో ఉన్న లోపం ఏంటి?.. : సుమన్ శెట్టి ఎమోషనల్
ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సుమన్ శెట్టి. తొలి సినిమా ‘జయం’తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందులో ‘అధ్యక్షా..’ అంటూ సుమన్ చేసే కామెడీకి తెలుగు ఆడియన్స్ పలగబడి నవ్వారు. జయం తర్వాత సుమన్కి వరుస అవకాశాలు వచ్చాయి. ఒకనొక దశలో ఆయన డేట్స్ కూడా దొరకనంత బిజీ కమెడియన్ అయిపోయాడు. దాదాపు 300పైగా సినిమాల్లో నటించిన సుమన్.. సడెన్గా వెండితెరకు దూరం అయ్యాడు. కొన్నాళ్ల పాటు ఆయన పేరు ఇండస్ట్రీ మరిచిపోయింది. బిగ్బాస్ షోతో మళ్లీ సుమన్ శెట్టి ఫామ్లోకి వచ్చాడు. బిగ్బాస్ 9వ సీజన్లో పాల్గొన్న ఆయన..తనదైన ఆటతీరుతో దాదాపు 14 వారాల పాటు హౌస్లో ఆకట్టుకున్నాడు. ఫినాలేకు ఒక్కవారం ముందు ఎలిమేట్ అయ్యాడు. బిగ్బాస్ తర్వాత ఆయన కెరీర్ పరంగా బిజీ అయిపోతారనుకుంటే.. అదీ జరగలేదు. పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. 300పైగా సినిమాలతో పాటు నంది అవార్డు కూడా దక్కించుకున్న తనకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అర్ధం కావట్లేదని సుమన్ శెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకప్పుడు నేను 30 రోజులూ షూటింగ్లోనే ఉండేవాడిని.300పైగా సినిమాలు చేశా. నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసేవాడిని. అయినా కూడా ఇప్పుడు నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదో అర్థం కావడం లేదు. ప్రాణం పెట్టి పని చేస్తా. నాలో ఉన్న లోపం ఏంటి? నటన విషయంలో ఎక్కడైనా తాను తగ్గిపోయానా? అనే సందేహాలు కూడా తనను వెంటాడుతున్నాయి’అని సుమన్ ఎమోషనల్ అయ్యాడు.
ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు
గతంలో నటుడిగా మాత్రమే చేస్తూ ఆకట్టుకున్న రవిబాబు.. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు తీస్తూ వస్తున్నాడు. కుదిరినప్పుడు వాటిలో తనే లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇకపోతే రవిబాబు తీసిన గత రెండు చిత్రాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ కాగా.. దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లోకి వచ్చే మూవీని సిద్ధం చేశాడు. అదే 'రేజర్'. వచ్చే నెల 8న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.(ఇదీ చదవండి: 'పెద్ది' నటుడి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్)ట్రైలర్ బట్టి చూస్తే ఓ పాపని రక్షించే బాధ్యత రవిబాబు పాత్రది. ఈ క్రమంలోనే పాపని చంపేందుకు వచ్చిన రౌడీలని చంపుకొంటూ వెళ్తుంటాడు. అయితే చంపే క్రమంలో ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లు రక్తపాతాన్ని బాగానే చూపించాడు. ఇతడి గత చిత్రాల మాదిరిగానే కలర్ టోన్ మెంటైన్ చేశాడు. ట్రైలర్ అయితే రొటీన్గానే అనిపించింది.కొన్నాళ్ల ముందు వరకు అవును, అవును 2 పేరుతో హారర్ సినిమాలు తీసిన రవిబాబు.. తర్వాత క్రైమ్ థ్రిల్లర్స్ తీశాడు. ఇప్పుడు యాక్షన్, రక్తపాతాన్ని నమ్ముకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర 'రేజర్' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)Ravi Babu’s #Razor trailer is a relentless, edge-of-your-seat ride packed with brutal, nonstop action. A complete bloodbath 🔥 #RazorTheMovie Trailer out now:#RazorOnMay8th#Razor - A Ravi Babu Film.A Flying Frogs ProductionComing to scorch theatres this summer on May 8th.… pic.twitter.com/wEJ3208kQm— BA Raju's Team (@baraju_SuperHit) April 18, 2026
క్రీడలు
ఉత్కంఠ పోరు.. ఢిల్లీని గెలిపించిన డేవిడ్ మిల్లర్
ఐపీఎల్-2026 వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఫిల్ సాల్ట్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ పడగొట్టాడు.మిల్లర్.. కిల్లర్అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే భారీ షాకిచ్చాడు. భువీ ధాటికి ఢిల్లీ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్(57), ట్రిస్టన్ స్టబ్స్(60 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే రాహుల్ ఔటయ్యాక ఆర్సీబీ తిరిగి గేమ్లోకి వచ్చింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(26 రిటైర్డ్ హార్ట్) భారీ షాట్ల ఆడడంలో విఫలమయ్యాడు.అతడితో పాటు స్టబ్స్ కూడా కాస్త నెమ్మదించాడు. దీంతో ఢిల్లీ కావాల్సిన రన్రేట్ పెరుగుతూ వచ్చింది. అయితే అక్షర్ పటేల్ తొడ కండరాలు పట్టేయంతో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన మిల్లర్ కూడా బంతిని స్ట్రైక్ చేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. రషీక్ ధార్ సలాం వేసిన 19 ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులగా మారింది.ఆర్సీబీ కెప్టెన్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను రొమోరియా షెఫర్డ్కు అప్పగించాడు. తొలి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి నాలుగు బంతుల్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. వరుసగా మూడు, నాలుగు బంతులను భారీ సిక్సర్లగా మిల్లర్ మలిచాడు. ఐదో బంతిని బౌండరీ బాది మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. మిల్లర్ 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సీఎస్కే కొత్త కెప్టెన్ సంజూ శాంసన్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆరంభంలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడినప్పటికీ వరుసగా రెండు విజయాలు సాధించి సీఎస్కే గాడిన పడింది. కానీ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సీఎస్కే కెప్టెన్సీ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్ సీఎస్కేకు కొత్త కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. అది ఈ సీజన్ మధ్యలోనే జరిగే అవకాశముందని కూడా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఈ సీజన్లో కాకపోయినా భవిష్యత్తులో మాత్రం శాంసన్ సీఎస్కేను శాసిస్తాడని జోస్యం చెప్పాడు. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్న సీఎస్కేకు కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాడు అవసరమని, ఈ విషయంలో సీఎస్కేకు మొదటి చాయిస్ సంజూనే అని తెలిపాడు. ఇప్పటికే సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు ఫైనల్ చేర్చినట్లు గుర్తుచేశాడు. దీంతో సీఎస్కే యాజమాన్యం ఈ సీజన్ మధ్యలోనే రుతురాజ్ను తప్పించి శాంసన్కు బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్చపోనవసరం లేదని తెలిపాడు. ఫామ్లేమితో సతమతమవుతున్న రుతురాజ్ ఈ సీజన్లోనే కెప్టెన్సీ వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయని జోస్యం చెప్పడం గమనార్హం.ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఎంఎస్ ధోని సారధ్యంలో చెన్నై సూపర్కింగ్స్ ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక సీఎస్కే ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ధోని తర్వాత కెప్టెన్లు ఎందరు మారినా సీఎస్కే మరో టైటిల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యింది. 2022 సీజన్లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను కెప్టెన్గా నియమించింది. కానీ కెప్టెన్గా ఒత్తిడిని తట్టుకోలేక జడేజా దానిని మధ్యలోనే వదిలేశాడు. దీంతో గత్యంతరం లేక మళ్లీ ధోనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అలా 2023 సీజన్లోనూ సీఎస్కేను నడిపించిన ధోని ఐదోసారి చాంపియన్గా నిలిపాడు. ఆ తర్వాత 2024 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా నియమించింది. కానీ ఆ సీజన్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఇక 2025 సీజన్లో రుతురాజ్ సారథ్యంలోని సీఎస్కే దారుణ ఆటతీరుతో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్ క్రికెటర్!
ఐపీఎల్ తరహాలో తెలంగాణ టీ20 లీగ్.. జట్ల కోసం టెండర్లు ఆహ్వానం
మొట్ట మొదటి తెలంగాణ టీ20 లీగ్ ఎడిషన్ను నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్నద్దమైంది. జూన్లో జరగనున్న ఈ టోర్నమెంట్లో జట్ల యాజమాన్యం కోసం టెండర్ ప్రక్రియను హెచ్సీఏ ప్రారంభించింది. జట్టు యాజమాన్య హక్కులు మొదటి 5 ఏళ్ల కాలానికి ఇవ్వబడతాయి.ఆ తర్వాత ప్రతి 3 ఏళ్లకు ఒకసారి రెన్యూవల్ చేస్తారు. ఒక్కో జట్టుకు కనీస బిడ్ ధర రూ. 3 కోట్లుగా నిర్ణయించారు. ఆటగాళ్ల జీతాలు, సిబ్బంది ఖర్చులు, వసతి, జెర్సీల ఖర్చులను ఫ్రాంచైజీ యజమానులే భరించాలి. కొత్త జట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు ఏప్రిల్ 28లోపు టెండర్ పత్రాలు సమర్పించాలి. ఏప్రిల్ 30న షార్ట్లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలను ప్రకటించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పాల్గోనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ ,మహబూబ్నగర్ ప్రాంతాలను ప్రాతిపాదించారు. ఆఖరికి బిడ్డింగ్ ద్వారా 8 జట్లను ఖరారు చేస్తారు. ఈ టోర్నీ 21 రోజులు పాటు ఉప్పల్ మైదానం వేదికగా జరగనుంది. మొత్తంగా 32 మ్యాచ్లు జరుగుతాయి.
సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.150 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగుల చేసిన మాథ్యూ షార్ట్ ఇషాన్ మలింగ బౌలింగ్లో అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లలో సీఎస్కే 135/514 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 32, శివమ్ దూబే 10 పరుగులతో ఆడు తున్నారు.బ్రెవిస్ డకౌట్113 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ను శివాంగ్ డకౌట్గా పెవిలియన్ చేర్చాడు.ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో సీఎస్కే 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇషాన్ మలింగ బౌలింగ్లో వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 66 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాన్ మలింగ బౌలింగ్లో కెప్టెన్ రుతురాజ్ (19) వెనుదిరిగాడు. అంతకముందు ధాటిగా ఆడుతున్న ఆయుశ్ మాత్రే నితీశ్రెడ్డి బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.దంచికొడుతున్న సీఎస్కేఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో సీఎస్కే దంచికొడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (30), రుతురాజ్ (14) క్రీజులో ఉన్నారు.195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన శాంసన్ నితీశ్కుమార్ రెడ్డి బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 195 పరుగులుసీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్థసెంచరీలతో రాణించారు. వీరిద్దరు రాణించినప్పటికీ మిగతావారు విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో జేమి ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్సీఎస్కేతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సాహిల్ అరోరా గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్లో డెవాల్డ్ బ్రెవిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఎస్ఆర్హెచ్ 177 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్లో క్లాసెన్ (59) కంబోజ్ బౌలింగ్లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ 150 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లో నితీష్కుమార్ (12) ఓవర్టన్ బౌలింగ్లో ఔటయ్యాడు.12 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్లాసెన్ 30, నితీశ్రెడ్డి 4 పరుగులతో ఆడు తున్నారు.సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ జేమీ ఓవర్టన్ బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముకేశ్ చౌదరీ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన ఇషాన్ రుతురాజ్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.అభిషేక్ హాఫ్ సెంచరీ..సీఎస్కేతో మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 75 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన హెడ్ ముకేశ్చౌదరీ బౌలింగ్లో రుతురాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 26, హెడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా 27వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ తలపడు తున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ముఖాముఖి పోరులో ఇరుజట్లు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 15 విజయాలలు, ఎస్ఆర్హెచ్ 7 విజయాలు సాధించాయి. చివరి ఐదు మ్యాచ్ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్ 3, సీఎస్కే రెండింట నెగ్గాయి.సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగచెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (వికెట కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్
న్యూస్ పాడ్కాస్ట్
లోక్సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
బిజినెస్
స్మార్ట్ఫోన్ల్లో ‘ఆధార్’ ప్రీ-ఇన్స్టాలేషన్పై అప్డేట్
స్మార్ట్ఫోన్ వినియోగదారుల ప్రయోజనాలు, టెక్ కంపెనీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విక్రయించే యాపిల్, శామ్సంగ్ వంటి ప్రముఖ కంపెనీల ఫోన్లలో ఆధార్ యాప్ను ముందస్తుగా ఇన్స్టాల్ (ప్రీ-ఇన్స్టాలేషన్) చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. గత కొద్ది కాలంగా ఈ అంశంపై పరిశ్రమ వర్గాల్లో జరుగుతున్న చర్చకు ఈ నిర్ణయంతో తెరపడినట్లయింది.పరిశ్రమ వర్గాల వ్యతిరేకతే కారణమా?రాయిటర్స్ నివేదిక ప్రకారం, స్మార్ట్ఫోన్ల్లో ఆధార్ యాప్ను తప్పనిసరిగా చేర్చాలన్న ప్రతిపాదనపై యాపిల్, శామ్సంగ్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ(మైటీ) పరిశ్రమకు చెందిన వివిధ వాటాదారులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. ఈ చర్చల అనంతరం స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్ను ముందస్తుగా ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం సరైన నిర్ణయం కాదని కేంద్రం భావించినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ధ్రువీకరించింది.ఏమిటీ ‘ప్రీ-ఇన్స్టాలేషన్’ వివాదం?సాధారణంగా ఫోన్ కొన్నప్పుడు అందులో ఉండే క్యాలెండర్, కాలిక్యులేటర్ లేదా గడియారం వంటి యాప్ల మాదిరిగానే ఆధార్ యాప్ను కూడా ఫోన్ తయారీ దశలోనే ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. 134 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) ఆధారిత సేవలను సులభతరం చేయడం దీని లక్ష్యం. ఈ ప్రక్రియ ద్వారా బ్యాంకింగ్, టెలికాం, ఇతర ప్రభుత్వ సేవలకు డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావించారు. అయితే, వినియోగదారుల గోప్యత, ఫోన్ సాఫ్ట్వేర్ పనితీరుపై ఇది ప్రభావం చూపుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి.సంచార్ సాథీ అనుభవంతో వెనక్కి..గతంలో సంచార్ సాథీ (మోసాలను నివేదించే యాప్)ను 90 రోజుల్లోగా అన్ని మొబైళ్లలో ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పుడు కూడా మొబైల్ కంపెనీల నుంచి ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. భద్రతా పరమైన అంశాలు, వినియోగదారుల ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదన బలంగా వినిపించడంతో ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యం మంచిదే అయినప్పటికీ స్మార్ట్ఫోన్ తయారీదారుల గ్లోబల్ పాలసీలు, వినియోగదారుల డేటా సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగినది.ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ!
ఇరాన్ అణు నిల్వలపై చైనా వైఖరి ఇదేనా?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అంతర్జాతీయ దౌత్య రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హార్మూజ్ జలసంధి పునరుద్ధరణ, ఇరాన్ అణు నిల్వలపై చైనా వైఖరి కీలకంగా మారనుంది.హార్మూజ్ జలసంధి పునరుద్ధరణప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సంతోషంగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. ‘హార్మూజ్ జలసంధి తెరిచినందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎంతో సానుకూలంగా ఉన్నారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చైనా ఇంధన అవసరాలకు భారీ ఊరట లభించనుంది. బీజింగ్ నుంచి వస్తున్న ఈ సానుకూల సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఆశాభావాన్ని నింపుతున్నాయి.ఇరాన్ అణు నిల్వలు - చైనా వ్యూహాత్మక పాత్రఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్ యురేనియం. తాజా దౌత్య చర్చల ప్రకారం.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించడంలో లేదా వాటిని తన ఆధీనంలోకి తీసుకోవడంలో చైనా మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే అటు వాషింగ్టన్, ఇటు టెహ్రాన్ మధ్య నేరుగా ఘర్షణ పడకుండా సమస్యను పరిష్కరించే మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల గ్లోబల్ పాలిటిక్స్లో చైనా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ట్రంప్ చైనా పర్యటనత్వరలోనే తాను చైనాలో పర్యటించనున్నట్లు వెల్లడించిన ట్రంప్, ఈ పర్యటన ప్రత్యేకమైనదని, చారిత్రాత్మకమైనదన్నారు. ‘షీ జిన్పింగ్తో భేటీ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సమావేశం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించబోతున్నాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇరాన్ అణు ఒప్పందంపై ప్రతిష్టంభనను తొలగించడానికి చైనాను ఒక బఫర్గా వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. ఒకవేళ ఇరాన్ తన యురేనియం నిల్వలను చైనాకు తరలించడానికి అంగీకరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ!
గోల్డ్ ధర.. గుండె దడ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోడీ మరోసారి వార్తల్లో నిలిచారు. విలాసవంతమైన జీవనశైలికి పెట్టింది పేరుగా నిలిచే మోడీ, తన కుమారుడికి ఇచ్చే ఖరీదైన బహుమతుల గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ఇటీవల మాజీ క్రికెటర్ మైఖేల్ వాఘన్తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, తన కుమారుడి వద్ద ఉన్న అరుదైన కార్ల సేకరణ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ!తన చిన్నతనంలో తండ్రి తనకు కారు కొనివ్వలేదన్న వెలితిని గుర్తు చేసుకుంటూ తన కుమారుడికి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోడీ తెలిపారు. ‘నేను ఎదుగుతున్న క్రమంలో మా నాన్న నాకు ఫెరారీ కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. అది చాలా వేగంగా వెళ్తుందని, ప్రమాదకరమని ఆయన భావించేవారు. కానీ నాకు ఫెరారీ అంటే ప్రాణం. నా 40వ పుట్టినరోజున మా బంధువు నాకు మొదటి కారును బహుమతిగా ఇచ్చారు. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కుమారుడికి 21 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ కారును బహుమతిగా ఇస్తున్నాను’ అన్నారు.ప్రస్తుతం మోడీ కుమారుడి వయస్సు 32 ఏళ్లు. అంటే, గత 11 ఏళ్లుగా వరుసగా ఆయనకు ఫెరారీ కార్లు అందుతూనే ఉన్నాయి. ఫలితంగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ, ఎక్కువ ఫెరారీ కార్ల సేకరణ కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.లండన్లో తలదాచుకుంటున్న మోడీఒకవైపు కొడుకు కోసం కోట్లు కుమ్మరిస్తూ వార్తల్లో నిలుస్తున్న లలిత్ మోడీ, మరోవైపు భారత చట్టాల నుంచి తప్పించుకుని లండన్లో తలదాచుకుంటున్నారు. వివిధ అంచనాల ప్రకారం మోడీ నికర ఆస్తి విలువ 500 మిలియన్ డాలర్ల నుంచి 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,000 - రూ.5,000 కోట్లు) వరకు ఉంటుందని సమాచారం. అయితే విదేశాల్లో ఉన్న పెట్టుబడుల కారణంగా దీనిపై కచ్చితమైన అధికారిక లెక్కలు లేవు.ఐపీఎల్ ఛైర్మన్గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో 2013లో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. 2010 నుంచి లండన్లో నివసిస్తున్న మోడీ తనపై ఉన్న ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేస్తున్నారు. మనీలాండరింగ్ కేసుల్లో ఆయనను భారత్ రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేశారనే ఆరోపణలు ఒకవైపు, విదేశీ గడ్డపై విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్ల వేలంపాటలు మరోవైపు.. లలిత్ మోడీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత చట్టాలకు చిక్కకుండా ఆయన సాగిస్తున్న ఈ రాయల్ జీవితంపై సామాన్యుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!
ఫ్యామిలీ
సైకిల్పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంప్ను (17,560 అడుగుల ఎత్తులో ఉన్న) సైకిల్పై చేరుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది దివ్యసింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సాహసాన్ని చేసిన రెండో మహిళగా దివ్య చరిత్ర సృష్టించింది. అంతేగాదు ఆ సమయంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద ఉష్ణోగ్రత -12 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మార్చి 16న కాఠ్మండు నుంచి ప్రారంభమైన ఆమె సైకిల్ యాత్ర సుమారు 14 రోజుల పాటు సాగింది. ఈ ప్రయాణంలో ఆమె కాఠ్మండు, సల్లేరి, సుర్ఖే, ఫక్డింగ్, సాగర్మాత నేషనల్ పార్క్, నామ్చే బజార్, డెబోచే, ఫెరిచే, లోబుచే, గోరక్ షేప్ గుండా వెళ్లింది. చివరగా ఆమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకుంది.దీని వెనుక ఉన్న ప్రేరణ..సుమారు ఏడాదిన్నర క్రితం తాను మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు.. ఏ భారతీయ మహిళా ఇంతవరకు సైకిల్పై అక్కడికి చేరుకోలేదని తెలియడం వల్ల ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలిపింది. అదీగాక ఈ మౌంట్ ఎవరెస్ట్ గురించి తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడూ దాన్ని చూస్తానా అని వేయికళ్లతో ఎదురుచూశానని ఆనందంగా చెబుతోందామె. యాత్రలో ఎదురైన సవాళ్లుఅధిక ఎత్తులో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రయాణం అత్యంత సవాలుతో కూడుకున్నదని చెబుతోంది దివ్య. ఈ జర్నీలో ట్రావెల్ హెల్త్ సిక్నెస్, వేగంగా గుండె చప్పుడు వంటి శారీరక ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించింది. అలాగే తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు అలవాటు పడాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక దివ్య గురువు కుమార్ సింగ్ మాట్లాడుతూ..ఇంతరకు ఏ భారతీయ మహిళ సైకిల్పై ఇలాంటి సాహస యాత్ర చేయలేదని అన్నారు. అందువల్ల దివ్య ఈ సవాలు స్వీకరించిందని చెప్పారు. వ్యక్తిగతంగా ఏర్పర్చుకున్న ఈ లక్ష్యం కోసం దివ్య తన శరీరాన్ని సన్నద్ధం చేసుకునేలా తీవ్రమైన శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. చివరికి అనుకున్నట్లుగా విజయాన్ని సాధించిందన్నారు. ఇక దివ్య గోరఖ్పూర్ జిల్లాలోని బనౌడా గ్రామానికి చెందింది. ఆమె తండ్రి సంత్రాజ్ సింగ్ రైతు కాగా, తల్లి ఊర్మిళ సింగ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. కాగా, దివ్య కూడా తల్లిలానే టీచర్ వృత్తిలో కొనసాగడం విశేషం. (చదవండి: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..)
వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..
ఇటీవల బరువు తగ్గడం ఆధునిక ట్రెండ్గా మారింది. అందరూ చక్కటి శరీరాకృతిలో యంగలుక్లో కనిపించడం కోసం రకరకాల డైటింగ్లు, వర్కౌట్లతో పాట్లుపడుతున్నారు. కానీ కొందరు సింపుల్ చిట్కాలతో అద్భుతంగా బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తున్నారు. బరువు తగ్గిన చాలామంది ఎంతో కొంత వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేశామని చెప్పగా ఈ పిల్లల తల్లి మాత్రం అవేమి చేయకుండానే బరువు తగ్గానంటోంది. పైగా ఆరోగ్యకరమైన రీతీలోనే తగ్గానని చెబుతుండటం విశేషం. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ముంబైకి చెందిన పిల్లల తల్లి, కంటెంట్ క్రియేటర్ సురభి పిసల్ తన వెయిట్లాస్ జర్నీని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ప్రసవానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోయానని చెప్పుకొచ్చింది. మళ్లీ తనలా మార్పు కోసం నెమ్మదిగా బరువతగ్గే యత్నం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తాను వ్యాయామాలు చేయలేదని చెబుతోంది. తన జీవనశైలికి సరిపోయే విధంగా చిన్న, చిన్న స్థిరమైన మార్పులు మాత్రమే చేశానని అంటోంది. అయితే డెలివరీ తర్వాత పరిస్థితులు కాస్త కష్టంగా ఉన్నాయని, ఏ డైట్చేసినా కడుపు ఉబ్బరం, బరువు పెరడం వంటి సమస్యలతో ఇబ్బందిపడ్డట్లు వివరించారామె. అప్పుడే తాను ఆపిల్ సైడ్ వెనిగర్ని ఉపయోగించటం ప్రారంభించానని అన్నారు. ఇది తన జీవక్రియను మెరుగుపరిచి, ఆకలి కోరికలను నియంత్రించడానికి సహాయపడిందని అంటోంది. అది క్రమంగా తన బరువులో మార్పులకు దారితీసింది. ఇంతకుమునుపు సరిపోని బట్టలు సరిపోవడంతో మానసికంగా కాస్తం స్థైర్యం రావడం మొదలైందని తెలిపింది. కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా మొత్తం ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెట్టానన్నారు. అందుకోసం ఏ చాశారో కూడా చెప్పారు.నల్ల జీలకర్ర నూనె (ఖాళీ కడుపుతో): జీవక్రియను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానిక హెల్ప్ అవుతుందట.బుల్లెట్ప్రూఫ్ కాఫీ (బ్లాక్ కాఫీ + కొబ్బరి నూనె): ఇది తక్షణ శక్తిని అందిస్తుందట. పైగా కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్ని కరిగిస్తుందట.ఎల్డర్బెర్రీ పొడి: దీన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే దీనిలోని యాంటీఆక్సిడెంట్లను మెరుగైన రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తుందని చెప్పుకొచ్చారామె.తాను తన ఆరోగ్యంపై దృష్టిపెట్టడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోయానని అంటోంది. నిజం చెప్పాలంటే వెయిట్లాస్ దానంతట అది జరిపోయిందని చెబుతోంది ఈ న్యూ మామ్. View this post on Instagram A post shared by Surabhi Pisal (@surabhi_littlereviews) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..)
"రాయల్ చాయ్"..! ఆ ఐడియాకు మాటల్లేవ్ అంతే..
కార్యాలయాల్లో లేదా ఏదైనా ప్రదేశానికి వెళ్లినా..కాసింతా వేడివేడి చాయ్ తాగితే దెబ్బకు రిలీఫ్గా ఉంటుంది. మళ్లీ నూతనోత్సాహంతో మన పనిలో పడిపోతాం. అందుకే చాయ్ప్రియులకు ఇదంటే అంత మక్కువ. అలాంటి చాయ్ని అత్యంత లగ్జరీయస్ అందించే ప్రయత్నం చేశాడు. ఆ ఆలోచనే కనీవినీ ఎరుగని అద్భుతం. మరి ఆ వెరైటీ సర్వింగ్ స్టైల్ ప్రజలకు నచ్చిందా అంటే..ఎన్నో టీ స్టాల్స్ చూశారు గానీ ఇలాంటి వినూత్న చాయ్ స్టాల్ని మాత్రం చూసే ఛాన్సేలేదు. తన టీ స్టాల్ కోసం లక్ష రూపాయల రోల్స్రాయ్స్ను అద్దెకు తీసుకున్నాడు. చిన్నిచాయ్ స్టాల్కి అంత లగ్జరీ కారు దేనికి అనుకోకండి మనోడు ఆలోచన ఏ రేంజ్లో చూద్దాం రండి. అతడు తాను విలావంతమైన కారులో టీ సర్వీస్ని అందివ్వాలనుకున్నాడట. అందుకు రోల్స్రాయ్స్ కారుని అద్దెకు తీసుకున్నారు. ఈ ఆలోచను టీ స్టాల్ యజమానితో పంచుకోగా వాళ్లు కూడా అంగీకరించారు. అందుకోసం వాళ్లు బోర్డును ప్రింట్ చేసి కస్టమర్ల కోసం రెడ్కార్పెట్ పరిచాడు. 'టీ' తోపాటు కుకీలు, బిస్కెట్లు ఏర్పాటు చేసి..అమ్మకాలు ప్రారంభించాడు. ఇది చూసిన అక్కడున్న జనాలకు భలే ఆసక్తిగా అనిపించింది. ఒక్కసారి ఆ అనుభవం పొందాలనే ఉద్దేశ్యంతో అందరు ఆ లగ్జరీ కారులో జర్నీ చేస్తూ టీ తాగే అనుభవాన్ని పొందారు. ఈ లగ్జరీ చాయ్ స్టాల్కి అయిన ఖర్చు రూ. 1,08,000 అయితే అతను సంపాదించింది రూ. 88,400. పాపం అతనికి నష్టమే అయినా..చాలామంది జీవితంలో ఇలాంటి కారు కొనగలమో లేదో తెలియకపోయినా..తమ కుటుంబాలతో టీ తాగుతూ ఆనందించారు అదే చాలు అని అంటున్నాడు. ఏ వ్యాపారమైన మొదట్లోనే లాభాలు వచ్చేయవు కదా..రాను రాను ఊపందుకోవచ్చు కూడా. ఏదీఏమైనా ఈ ఐడియా అదుర్స్ కదూ..!. అతడి ఆలోచన అలా ఇలా లేదు బ్రో..ఇలా మరెవ్వరకీ సాధ్యం కాదేమో అని ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by deluxe (@deluxebhaiyaji) (చదవండి: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..)
లిటిల్ డాక్టర్
పిల్లలు రోజులో ఎన్ని నీళ్లు తాగాలి, వ్యాయామం ఎందుకు అవసరం, కూల్ డ్రింక్స్ ఎందుకు తాగకూడదు, రోజులో విశ్రాంతి ఎంత అవసరం, సన్స్ట్రోక్ తగిలితే ఏం చేయాలి, చిన్న చిన్న గాయాలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి... ఇలా ఈ వేసవిలో ఆరోగ్య అవగాహన వల్ల పిల్లల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. ఫన్గా, ఉపయుక్తంగా హెల్దీ కిట్ను అందిద్దాం..ఎండ వేడికి ఒంట్లోని నీరు ఆవిరైపోతుంటుంది. శరీరం అలసటగా మారిపోతుంటుంది. స్కూల్ లేదని రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా లేవడం సాధారణమే. పెద్దలు కూడా సెలవులే కదా... అని వదిలేస్తుంటారు. అలాగే ఆహారం, శారీరక శ్రమ గురించి అంతగా శ్రద్ధ చూపరు. ఆ నిర్లక్ష్యం మిగతా వాటిపైనా ప్రభావం చూపుతుంది. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ , స్కిన్ ర్యాషెస్, కడుపునొప్పి, తలనొప్పి.. వంటి సమస్యలూ తలెత్తవచ్చు. అవగాహన పాఠాన్ని ఆచరణలో చూపిస్తే మేలైన ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు.→ సూపర్ హీరో ఛాలెంజ్→ నీళ్లు తాగడం బోర్ అని పిల్లలు అనకుండా ఉండాలంటే రోజుకు 6–8 గ్లాసుల ‘వాటర్ ఛాలెంజ్’ ఇవ్వచ్చు. ‘నీళ్లు తాగకుంటే శరీరం వేడెక్కుతుంది’ అని చెప్పి, ప్రతి గ్లాస్కు ఒక స్టార్, వారం రోజులు పూర్తయితే చిన్న రివార్డ్ ఇచ్చి ప్రోత్సహించవచ్చు. కూల్ డ్రింక్స్ కాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, బటర్మిల్క్... వంటి సహజ పానీయాల గురించి చెప్పి వాటిని తయారు చేయించవచ్చు. → ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలలోపు బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణగా టోపీ, సన్ గ్లాసెస్, సన్స్క్రీన్, కాటన్ దుస్తులు, బ్యాగ్, వాటర్ బాటిల్.. ఇలా ఏయే వస్తువులు ఉపయోగించాలో ఒక పజిల్ టాస్క్గా ఇవ్వచ్చు. → ఐస్క్యూబ్స్ వేసిన పానీయాలు గొంతునొప్పి, జలుబు .. వంటి సమస్యలకు ఎలా కారణం అవుతాయో డిజిటల్ మీడియాలో వచ్చిన వీడియోలను చూపి తెలియజేయవచ్చు. → పొట్ట తేలికగా ఉండేలా పండ్లు, కూరగాయలు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పి, జంక్ ఫుడ్, వేయించిన పదార్థాలకు ఎందుకు దూరంగా ఉండాలో వివరించవచ్చు. ∙చెమట వల్ల వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణకు రోజూ స్నానం చేయడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని అలవాటు చేయాలి. → ఎండ తీవ్రత తక్కువ ఉన్నప్పుడు ఆరు బయట ఆటలను ప్రోత్సహించాలి.→ తలనొప్పి, తిమ్మిరి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే పెద్దలకు తెలియజేయడం వల్ల సమస్యకు సత్వర పరిష్కారం ఉంటుందని చెప్పాలి.→ ఆటగా డాక్టర్ గేమ్...పిల్లలకు ఫస్ట్ ఎయిడ్ నేర్పడం అంటే కేవలం గాయాలకు ఎలా చికిత్స చేయాలో చెప్పడం మాత్రమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా, తెలివిగా స్పందించేలా తయారు చేయడం కూడా. → ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉండాల్సిన వస్తువుల గురించి అవగాహన కల్పిస్తూనే, గాయాలకు ప్రథమ చికిత్స ఎలా చేసుకోవాలో నేర్పించాలి. → ముక్కు నుండి రక్తస్రావం అయితే ఏం చేయాలి, ఏదైనా కారణం చేత పెద్ద గాయం అయినా, వాపు సంభవించినా పెద్దలను లేదా డాక్టర్ను సంప్రదించడం గురించి చెప్పాలి.→ అత్యవసర నంబర్లను పిల్లలకు నేర్పాలి. డాక్టర్–పేషంట్ గేమ్ను ఆడించవచ్చు. → హెల్త్ అవేర్నెస్ క్యాంపులకు తీసుకెళ్లవచ్చు. చొరవ తీసుకొని తమ కమ్యూనిటీలలో హెల్త్ అవేర్నెస్ వర్క్షాప్స్ నిర్వహించవచ్చు. → మార్కెట్లో లభించే డాక్టర్ కిట్ టాయ్, ఆర్గాన్ టాయ్స్తోనూ అవగాహన కలిగించవచ్చు.→ ప్లేటు నిండుగా ఆరోగ్యం..హెల్త్ టాపిక్ను ఒక క్లాస్లా చెబితే... దూరంగా వెళ్లిపోతారు. అలా కాకుండా ప్లేట్ మీద చూపించవచ్చు. పుచ్చకాయ ‘ఇది నీళ్లు ఎక్కువగా ఇస్తుంది. కీరా.. ఇది శరీరాన్ని కూల్ చేస్తుంది’ ఇలాంటి ఉదాహరణలు పరిచయం చేయవచ్చు. జంక్ ఫుడ్ ఎక్కువైతే బాడీ ఏ విధంగా అలసిపోతుందో చెప్పవచ్చు. వాస్తవానికి దగ్గరగా! వేసవిలో నిద్ర, ఆహారం విషయంలో క్రమశిక్షణ ఉండదు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపైనా చెడు ప్రభావం చూపుతుంది. టీవీ, మొబైల్స్ను ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు, మానసిక సమస్యలు ఎలా ఉత్పన్నం అవుతాయో చూపాలి. స్కూల్ టైమ్ పాఠాల మాదిరి ఆరోగ్య సందేశాలను ఇవ్వకూడదు. ప్రతీది ప్రాక్టికల్గా చూపుతూ, పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ ఆరోగ్య అవగాహన కలిగించాలి. – డా.పి.జ్యోతిరాజ, లైఫ్ స్కిల్ ట్రైనర్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
అంతర్జాతీయం
ఇరాన్.. హర్ముజ్.. ట్రంప్.. అంతా గందరగోళమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలను ముగించేందుకు రెండో దఫా చర్చలకు అమెరికా-ఇరాన్లు సిద్ధపడుతున్నాయి. తేదీ ఇంకా ఖరారు కాకపోయినా మళ్లీ పాకిస్తాన్ వేదికగానే చర్చలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలు.. ఇటు ఇరాన్ వాటిని ఖండించుకుంటూ పోతుండడం ఈ సంక్షోభంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఓ మెట్టు కిందకు దిగింది. లెబనాన్ కాల్పుల విరమణ కుదరడంతో హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. ‘హర్ముజ్ను పూర్తిగా తెరిచాం. చమువురు నౌకల రాకపోకలను అడ్డుకోం. కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకలకు సురక్షితంగా మార్గం ఉంటుంది’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ఈ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయి. పది శాతం దాకా రేట్లు తగ్గాయి. అయితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన గందరగోళానికి దారి తీసింది. ఇరాన్తో జరుగుతున్న చర్చల వ్యవహారం పూర్తయ్యే వరకు హర్ముజ్లో తమ బ్లాకేడ్(దిగ్బంధంనం).. అదీ ఫుల్ ఫోర్స్తో కొనసాగుతుందని ప్రకటించారు. అయితే.. చర్చల ప్రక్రియ త్వరగానే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు అంశాలపై చర్చలు జరిగాయని, వీలైనంత త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇరాన్ అన్నింటికీ అంగీకరించిందని.. కానీ యురేనియంపై డీల్ కుదిరేవరకు ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ అన్నారు. ‘‘అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్ డస్ట్” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి అని వ్యాఖ్యానించారు.అయితే.. ఇరాన్ మాత్రం ట్రంప్ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారని అంటోంది. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ స్టేట్ మీడియా టీవీ చానెల్లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. ఈ లెక్కన హర్ముజ్తో పాటు యురేనియం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గబోదని స్పష్టమవుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో.. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా.. ఇరాన్లో 3,000 మంది, లెబనాన్లో 2,100 మంది, ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ దేశాల్లో డజను మందికి పైగా మరణించారు. అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.హర్ముజ్ జలసంధి.. శుద్ధి చేసిన యురేనియం, ఫ్రీజ్ చేసిన నిధులు.. ఈ విషయాల్లో రెండు దేశాల మధ్య చర్చల్లో ఎటూ తేలడం లేదు. ఈ నెల 11వ తేదీన పాక్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చల్లో అయినా ఈ అంశాలు ఓ కొలిక్కి వస్తేనే యుద్ధం ఆగేది. లేకుంటే.. మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కాస్ట్లీ దెబ్బ
బొగ్గు దిగుమతుల్లో అక్రమాల ఆరోపణలు
కొలంబో: విద్యుదుత్పత్తిలో వాడే బొగ్గు దిగుమతుల్లో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలున్న శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కుమార జయకోడి పదవికి రాజీనామా చేశారు. ఆ శాఖ కార్యదర్శి ఉదయాంగ హేమపాల కూడా బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రభుత్వ రంగ సంస్థ చేపట్టిన బొగ్గు దిగుమతుల్లో ఆరోపణలపై శ్రీలంక అధ్యక్ష కార్యాలయం స్పందించింది. అయితే, అవకతవకల కారణంగా ప్రభుత్వ ఖజానాకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. దీనిపై ఆరునెలల్లో ప్రత్యేక కమిటీతో దర్యాప్తు పూర్తి చేసి, వాస్తవాలను వెల్లడిస్తామని తెలిపింది. అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమార జయకోడి గతవారం పార్లమెంట్లో ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కారు. శ్రీలంక తన ఇంధన అవసరాలకు కావాల్సిన బొగ్గును ఏడాదికి 25 లక్షల టన్నుల చొప్పున ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియాలతోపాటు స్వల్ప పరిమాణంలో భారత్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటోంది.
అమెరికా - ఇరాన్ చర్చలపై.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
అమెరికా - ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్య చర్చలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. వారాంతం వరకు చర్చలు కొనసాగనున్నాయని తెలిపారు. ఫీనిక్స్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరు దేశాల మధ్య మంచి పురోగతి జరుగుతోందని పేర్కొన్నారు. అయితే ఇంకా పూర్తి ఒప్పందం కుదరలేదని, కానీ సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పారు.ఈ చర్చల్లో ముఖ్యంగా అణు కార్యక్రమం, సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ట్రంప్ ప్రకారం, ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్పై అమలు చేస్తున్న నావికాదళ ఆంక్షలను ఎత్తివేస్తామని తెలిపారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, కాల్పుల విరమణ నేపథ్యంలో కొంతమేర వాణిజ్య నౌకలకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం.ఇరాన్ ఇప్పటికే అనేక విషయాలకు అంగీకరించిందని, ముఖ్యంగా యురేనియంను సంయుక్తంగా తొలగించి అమెరికాకు తరలించే అంశంపై కూడా అంగీకారం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే దీనిని ఇరాన్ ఖండించింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఈస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, యురేనియం తమకు ఎంతో విలువైనదని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు తరలించబోమని స్పష్టం చేశారు.
హార్మూజ్ తెరుచుకుంది
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ ప్రపంచదేశాలకు శుక్రవారం శుభవార్త విన్పించింది. పర్షియన్ గల్ఫ్ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే బెదిరింపులకు స్వస్తిపలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు హార్మూజ్ జలసంధిని బార్లా తెరుస్తున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఈ వార్త వినగానే ప్రపంచదేశాలు చమురుసంక్షోభం బారి నుంచి బయటపడ్డామని ఊపిరిపీల్చుకున్నాయి. స్టాక్మార్కెట్లకు సైతం కొత్త ఊపొచ్చింది. అమెరికా స్టాక్మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అనూహ్య డిమాండ్తో ముందస్తు కొనుగోళ్లతో ముడిచమురు ధర కొండెక్కగా తాజా వార్తతో ధర నేలచూపులు చూసింది.మార్చి నెలలో గరిష్టంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 119 డాలర్లకు పెరగ్గా శుక్రవారం శుభవార్త తర్వాత ఒక్కసారిగా 90 డాలర్ల దిగువకు దిగొచ్చింది. ధర శుక్రవారం ఉదయం 98 డాలర్లు ఉండగా హార్మూజ్ వార్త వెలువడగానే 10 శాతం పడిపోయి 88 డాలర్లకు చేరుకుంది. హార్మూజ్ గుండా నౌకల రాకపోకలు మొదలుకానున్నాయని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ‘‘జలసంధిని తెరుస్తున్నామని ఇప్పుడే ఇరాన్ ప్రకటించింది. హార్మూజ్ గుండా రాకపోకలు ఊపందుకోనున్నాయి. థాంక్యూ. అయితే హార్మూజ్పై అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది. హార్మూజ్ గుండా ఇరాన్, దాని మిత్రదేశాల నౌకల రాకపోకలను అడ్డుకుంటాం.ఇరాన్తో శాంతి ఒప్పందం 100 శాతం పూర్తయి, అమల్లోకి వచ్చేదాకా, యుద్ధం ముగిసేదాకా ఇరాన్కు చెందిన నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయి. ఇరాన్తో చర్చల్లో ఇప్పటికే చాలా అంశాల్లో ఏకాభిప్రాయం సాధించాం. లెబనాన్ ప్రస్తావన, దానితో సంబంధం లేకుండానే ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాం. అమెరికా సాయంతో ఇరాన్ జలసంధిలోని పాత సముద్ర మందుపాతరలను తొలగిస్తోంది. మరోసారి హార్మూజ్ను మూసేయబోమని ఇరాన్ మాకు హామీ ఇచ్చింది. ప్రపంచానికి వ్యతిరేకంగా హార్మూజ్ను ఆయుధంగా ఇరాన్ ఉపయోగించడం సాధ్యపడదు’’అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకిరావడంతో హార్మూజ్ను తెరుస్తున్నాం.తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉండే ఈ పది రోజులపాటే హార్మూజ్ తెరచి ఉంటుంది’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. హార్మూజ్ను తెరవాలంటే తొలుత లెబనాన్పై కాల్పులు ఆపేయాలన్న డిమాండ్కు ఇజ్రాయెల్, అమెరికా తలొగ్గడంతోనే హార్మూజ్ను తెరుస్తున్నట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. పాకిస్తాన్ సాయుధబలగాల సారధి, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ టెహ్రాన్లో ఇరాన్ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపిన మరుసటిరోజే హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన వెలువర్చడం గమనార్హం. క్షేమంగా రవాణాపై సమావేశం మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే నౌకలకు పూర్తి రక్షణ కల్పించే లక్ష్యంతో ఉమ్మడిగా పనిచేయాలని డజన్లకొద్దీ దేశాలు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం పారిస్లోని దేశాధ్యక్షభవనంలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీసహా 30 దేశాల అధినేతలు, 20 అంతర్జాతీయ కూటముల అధ్యక్షులు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి జర్మనీ చాన్స్లర్ ఫెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతదితరులు స్వయంగా, ఇతరులు వర్చువల్గా హాజరయ్యారు. నాటోపై ట్రంప్ ఆగ్రహం ‘‘ఇప్పుడు హార్మూజ్ జలసంధి వివాదం ముగిసిపోయింది. అంతా అయిపోయాక ఇప్పుడు తీరిగ్గా నాటో కూటమి నుంచి నాకు ఫోన్కాల్ వచ్చింది. మీకేమైనా సాయం కావాలంటే చేసిపెడతామని అడిగారు. మీ సాయం నాకు అస్సలు అక్కర్లేదని ముఖంమీదే చెప్పేశా. అవసరమైనప్పుడు సాయపడకుండా ముఖంచాటేశారు. నాటో కేవలం కాగితం పులి’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చించి ఇరాన్ను పాక్ ఒప్పించిందని ట్రంప్ ఆ దేశాన్ని పొగిడారు. ‘‘పాకిస్తాన్కు, పాక్ గొప్ప ప్రధానికి, ఫీల్డ్ మార్షల్కు కృతజ్ఞతలు. ఇద్దరూ గొప్ప వ్యక్తులు’’అని ట్రంప్ ఒక పోస్ట్చేశారు.
జాతీయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డియర్ అలవెన్స్ను 2 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో DA పెంపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా చెప్పొచ్చు. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం 60 శాతానికి చేరింది. ఈ ఏడాది జనవరి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. ఒకవైపు ఉద్యోగ సంఘాలు 8వ వేతన కమిషన్ కింద వేతన నిర్మాణంలో పెద్ద మార్పులు కోరుతూ.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83గా పెంచాలని, కనీస బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.69,000కి పెంచాలని ప్రతిపాదించాయి. అలాగే, వేతన లెక్కల్లో ఆధారపడిన తల్లిదండ్రులను కూడా ‘కుటుంబం’ నిర్వచనంలో చేర్చాలని.. వేతన వ్యత్యాసానికి పరిమితి పెట్టాలని, ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా అలవెన్సులు ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు, కేంద్రం సముద్ర రవాణా రంగానికి కూడా పెద్ద ఊరట ఇచ్చింది. సావరిన్ మారిటైం ఫండ్ పేరుతో రూ.13,000 కోట్ల నిధిని కేబినెట్ మీటింగ్లో ఆమోదించింది. దీని ద్వారా భారత్ నుంచి బయలుదేరే నౌకలకు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్ అందించనుంది. ఇది సముద్ర రవాణా రంగానికి భద్రతా పరంగా కీలకంగా మారనుంది.గ్రామీణ రహదారి అభివృద్ధి కోసం కూడా కేంద్ర మంత్రి మండలి మరో నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY)ను 2028 వరకు పొడిగించింది. అదనంగా రూ.3,000 కోట్ల కేటాయింపును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటానికి ఇది తోడ్పడనుంది.
మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు
ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రభుత్వ కార్యాలయ మీటింగ్లో జరిగిన అనూహ్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగుతున్న ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో ఒక అనుకోని అతిథి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అధికారులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తరువాత విషయం తెలిసి అంతా సరదాగా నవ్వుకున్నారు. ఈ సంఘటన బాఘ్పత్లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందీ అంటే..బాఘ్పత్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో, జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూరజ్ కుమార్ రాయ్ రైతుల సమస్యలను వింటున్నారు. ఈ సమయంలో కోతి ఆడిటోరియంలోకి ప్రవేశించి, నేరుగా డీఎం టేబుల్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి, అక్కడున్న పత్రాలను లాగడం చూసి అధికారులు భయాందోళనకు గురయ్యారు. కోతి ఆకస్మిక చర్యలతో అవాక్కైన కొంతమంది ఆఫీసర్లు సీట్లు వదిలి పారిపోయారు. View this post on Instagram A post shared by NDTV India (@ndtvindia)ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్ ఇంతకీ ఈ కోతి ఎవరో తెలుసా? జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ పెంపుడు కోతి. దీని పేరు 'మాత్రు'. మాతృను చూడగానే జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ తన కుర్చీలోంచి లేచారు. అధికారులు, రైతుల ముందు ప్రశాంతంగా ,అస్మితా లాల్ చిరునవ్వు నవ్వి, మాతృను తన కుర్చీలో కూర్చోమని ఆహ్వానించారు. అది పోయి అక్కడ పొందికగా కూర్చంది. ఆ తర్వాత అధికారులు మాతృని మెల్లగా కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో వాతావరణం సద్దు మణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
టీచర్ ఇంట దొంగలు పడ్డారు
చెన్నై: వల్లియూర్లో ఎన్నికల శిక్షణకు వెళ్లిన ఒక ఉపాధ్యాయురాలి ఇంట దొంగలు పడ్డారు. 21 సవర్ల విలువైన నగలు చోరీ చేశారు. వివరాలు.. నెల్లై జిల్లా, వల్లియూర్, రామలక్ష్మి నగర్కు చెందిన రోసారియో భార్య సహాయుజిన్ శాంతి (58) ఏర్వాడి ప్రభుత్వ బాలికల పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, పోలింగ్ కేంద్రాల అధికారులుగా పనిచేసే ఉపాధ్యాయులకు గురువారం వల్లియూర్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సహాయుజిన్ శాంతి వెళ్లారు. అలాగే తన పోస్టల్ బ్యాలెట్కు కూడా అక్కడ నమోదు చేసుకున్నారు. తిరిగి సాయంత్రం ఇంటికి ఆమె వచ్చా రు. ఇంట్లోని బెడ్రూమ్లో బీరువా తెరచి ఉండటం, అందులో ఉన్న వాటిని చెల్లాచెదురుగా చేసి పడేసి ఉండటంతో ఆందోళన చెందారు. బీరువాను పరిశీలించి చూడగా అందులో ఉన్న 50 సవర్ల నగల్లో దాదాపు 21 సవర్ల బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 21 లక్షలు. దీనిపై తన భర్తకు ఆమె సమాచారం ఇవ్వడంతో అతను ఇంట్లో పనిచేస్తున్న వారిని ప్రశ్నించాడు. తామేమీ చోరీ చేయలేదని వారు పేర్కొనడంతో చివరకు వల్లియూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ఇంటిలోని నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలించారు.ఆ ఇంట్లో పనిచేస్తున్న కొంతమంది మహిళల బంధువులు ఇద్దరు వచ్చి వెళ్లినట్లు తేలింది. దీని ఆధారంగా పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసు కుని విచారణ చేస్తున్నారు.
గుజరాత్ ఘటన.. 22 ఏళ్ల తర్వాత ఇదీ కథ
చరిత్ర కొన్నిసార్లు గాయాలను మిగిలిస్తుంది.. కానీ కాలం ఆ గాయాలను మాయం చేసే మందును కూడా ఇస్తుంది. 2002 గుజరాత్ అల్లర్లు అంటే మనకు గుర్తొచ్చేది ఇద్దరు వ్యక్తులు. ఒకరు హిందూ ఆవేశానికి గుర్తుగా.. మరొకరు ముస్లిం ఆర్తనాదానికి చిహ్నంగా మిగిలిపోయారు. కానీ 22 ఏళ్ల తర్వాత నేడు వారు ఎక్కడ ఉన్నారు? వారి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆనాటి పగ నేడు ప్రేమగా ఎలా మారింది? ఈ అద్భుతమైన మార్పు గురించి తెలుసుకుందాం.ఆ ఫోటో చూడగానే..2002, ఫిబ్రవరి 28.. అహ్మదాబాద్ వీధులు రక్తం మరిగిపోతున్నాయి. ఆ సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ కెమెరాలో రెండు దృశ్యాలు బందీ అయ్యాయి. మొదటిది అశోక్ మోచి. తలకు కాషాయ రుమాలు, కళ్లలో రౌద్రం, గాలిలో ఇనుప రాడ్డు. ఆ ఫోటో చూడగానే అల్లర్ల వెనుక ఉన్న భీకరమైన ఆవేశం కనిపిస్తుంది. రెండవది కుతుబుద్దీన్ అన్సారీ. రెండు చేతులు జోడించి, కళ్ల నిండా భయం, బుగ్గలపై కన్నీటి చారలతో "నన్ను చంపకండి" అని ప్రాధేయపడుతున్న దృశ్యం. ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా మైనారిటీల ఆవేదనకు ప్రతిరూపంగా మారింది.చిత్రమేమిటంటే..అప్పుడు వీరిద్దరికీ ఒకరి ముఖం ఒకరికి తెలియదు. కానీ కాలం వీరిని ఒకచోట చేర్చింది. ఆ ఫోటో వల్ల అశోక్ మోచి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి అశోక్ ఒక సాధారణ చెప్పులు కుట్టే వ్యక్తి. ఆ అల్లర్ల తర్వాత అతన్ని ఒక ఉగ్రవాదిగా, హంతకుడిగా ముద్ర వేశారు. కానీ చిత్రమేమిటంటే, అతనిపై ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదు. ఆ ఫోటో తీసిన సమయంలో అతను కేవలం నిరసన తెలుపుతున్నాడని తేలింది. అయితే, సమాజం అతన్ని వెలివేసింది. పెళ్లి కాలేదు, సరైన ఇల్లు లేదు. చెప్పులు కుట్టుకుంటూ రోడ్డు పక్కనే బతుకుతున్న అశోక్ మనసులో ఒక బలమైన మార్పు వచ్చింది. "మతం పేరుతో మనం ఎందుకు కొట్టుకోవాలి? పేదవాడికి ఆకలి తప్ప మరే మతం ఉంటుంది?" అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ క్షణమే తన పాత రూపాన్ని వదిలేసి, శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు.మొదలైంది.. ఓ కొత్త ఆలోచనమరో వైపు, అన్సారీ జీవితం నరకప్రాయమైంది. అతని ఫోటో పాపులర్ అవ్వడంతో, అల్లరి మూకలు అతన్ని వెంటాడాయి. ప్రాణ భయంతో అతను పశ్చిమ బెంగాల్కు పారిపోయాడు. అక్కడ కూడా ప్రశాంతత లేదు. చివరకు మళ్ళీ అహ్మదాబాద్కే తిరిగి వచ్చాడు. ఒక టైలర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న అన్సారీకి, హిందువులంటేనే భయం కలిగేది. కానీ ఒకానొక సందర్భంలో అశోక్ మోచి గురించి విన్నప్పుడు, అతనిలో కూడా ఒక కొత్త ఆలోచన మొదలైంది.ఆ దృశ్యం చూస్తే..అది 2014వ సంవత్సరం. అల్లర్లు జరిగి 12 ఏళ్లు గడిచాయి. కేరళలో జరిగిన ఒక సెమినార్ వీరిద్దరినీ ఒకే వేదికపైకి తెచ్చింది. ఒకప్పుడు పరస్పరం శత్రువులుగా చూసుకున్న వర్గాలకు ప్రతినిధులుగా ఉన్న వీరు, వేదికపై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అశోక్ మోచి, అన్సారీ చేతులు పట్టుకుని తన పాత ప్రవర్తనకు క్షమాపణలు కోరాడు. అన్సారీ కూడా పెద్ద మనసుతో అతన్ని క్షమించాడు. ఆ దృశ్యం చూసిన వారందరి కళ్లు చెమర్చాయి. "మేము బాధితులమే, రాజకీయ నాయకుల స్వార్థానికి బలి పశువులమైన పేదవాళ్ళం" అని వారు చాటి చెప్పారు.ద్వేషం ఎవరికీ మేలు చేయదు...నేడు అహ్మదాబాద్లో వీరిద్దరూ పక్క పక్కనే నివసిస్తున్నారు. అశోక్ మోచి ఇప్పటికీ ఒక చిన్న క్యాబిన్లో చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను దళితుల, మైనారిటీల హక్కుల కోసం పోరాడుతున్నాడు. అన్సారీ తన టైలరింగ్ షాపు నడుపుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం అల్లర్ల వార్షికోత్సవం వచ్చినప్పుడు మీడియా వారిని పలకరిస్తుంది. వారు చెప్పే మాట ఒక్కటే.. "ద్వేషం ఎవరికీ మేలు చేయదు. మేము ఆనాడు శత్రువులము కాదు, ఈనాడు మిత్రులము మాత్రమే. మా మధ్య ఉన్నది మనుషుల అనుబంధం." అశోక్ మోచి, అన్సారీ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. గతాన్ని మార్చలేము కానీ, భవిష్యత్తును ప్రేమతో నిర్మించుకోవచ్చు. మతం అనేది విడదీయడానికి కాదు, అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే మార్గం కావాలి. ఈ ఇద్దరు వ్యక్తులు చూపిన మార్గం సమాజానికి ఎంతో అవసరం.
ఎన్ఆర్ఐ
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
క్రైమ్
20 నిమిషాలు.. 10 కేజీల గోల్డ్.. రూ.35 లక్షలు
సింగ్రౌలీ: మధ్యప్రదేశ్లోని బ్యాంకు దోపిడీ కలకలం రేపింది. తుపాకులతో లోపలికి చొరబడిన దుండగులు.. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని రూ. 15 కోట్ల విలువైన బంగారం(10 కేజీలు), రూ.35 లక్షల నగదుతో పరారయ్యారు. సింగ్రౌలీలో శుక్రవారం మధ్యాహ్నం(ఏప్రిల్ 17) సమయంలో ఐదుగురు దుండగులు కస్టమర్ల ముసుగులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ బ్యాంకులో ప్రవేశించారు. కేవలం 20 నిమిషాల్లో బంగారం, వెండి, రూ.35 లక్షల నగదుతో ఉడాయించారు.మొదట ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించారు. లోపలికి రాగానే తుపాకులు తీసి సిబ్బందిని బెదిరించడం ప్రారంభించారు. వెంటనే మరో ముగ్గురు సహచరులు కూడా లోపలికి రావడంతో బ్యాంకు మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. దోపిడీ దొంగలు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడంతో కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. లాకర్లు, నగదు నిల్వలకు సంబంధించిన తాళాలు ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్ను బెదిరించారు. మేనేజర్ నిరాకరించడంతో అతని తలపై తుపాకీతో బలంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత బలవంతంగా తాళాలు తీసుకున్నారు.ఆ సమయంలో బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడం దొంగలకు కలిసి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని ఎవరూ అడ్డుకోలేకపోయారని.. క్షణాల్లో అంతా జరిగిపోయిందని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. నగరం వెలుపలికి వెళ్లే అన్ని దారులన్నీ మూసివేశారు. నిందితులను గుర్తించడానికి బ్యాంకు, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది, కస్టమర్ల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు.
నోట్ల కట్టల వెనుక మిస్టరీ.. గోదావరి జిల్లాల్లో సంచలనం
నరసాపురం: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఓ పాస్టర్ ఇంట్లో రూ.2,27,94,000 పోలీసులు స్వాధీనం చేసుకోవడం గోదావరి జిల్లాల్లో సంచలనంగా మారింది. కొద్దినెలల క్రితం వరకూ సాధారణ జీవితం గడిపిన పాస్టర్ గంటా జాన్ బాబూరావు ఒక్కసారిగా విలాసవంతమైన జీవితంలోకి మారడమే కాకుండా, పెద్ద సంఖ్యలో ఆస్తుల కొనుగోలు చేయడం, ఈ క్రమంలో ఆయన ఇంట్లో కోట్లలో నోట్ల కట్టలు లభ్యం కావడం హాట్టాపిక్గా మారింది. ఇంట్లో లభ్యమైన నగదుకు ఆధారాలు చూపని కారణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరసాపురం డీఎస్పీ సుధాకర్ నేతృత్వంలో రూరల్ సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రెండు బృందాలు విస్తృతంగా దర్యాప్తు చేపట్టాయి. శుక్రవారం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. జాన్ బాబూరావు నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పలు దస్తావేజులు, ఆస్తి పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల బాబూరావు తనతో పాటు అతని అల్లుడు, కుమార్తె పేరుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఐటీ అధికారులు ప్రాథ«మికంగా గుర్తించారు. తమ వద్ద ఉన్న నగదుకు అన్ని ఆధారాలు ఉన్నట్టు పాస్టర్ కుమార్తె ఫోన్ ద్వారా ఐటీ అధికారులకు తెలిపినట్టు సమాచారం. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన జాన్బాబూరావు గ్రామంలో చిన్న చర్చి నడిపేవారు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్కు చెందిన వ్యక్తితో తన కుమార్తె వివాహం చేశారు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.
నీలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాను.. సారీ..!
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్లోని ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడుకు చెందిన నవిత(34) కు 11ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన గుప్త సాయిబాబుతో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్లు, ఏడు నెలల కుమారులు ఉన్నారు. గతంలో ఓ ఎమ్మెల్యేకు చెందిన డెవలపర్లో ఉద్యోగం చేసిన నవిత సొంతంగా పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయింది. కుటుంబ సభ్యుల సహకారంతో అప్పుల ఊబి నుంచి బయటపడిన ఆమె ఉద్యోగం మానేశారు. ఇటీవల మరోసారి అప్పులు చేసి నష్టాల్లో కూరుకుపోయింది. ఈమేరకు అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో ఈనెల 16న ఇద్దరు పిల్లలను కోటపాడులో వదిలి జనగామ జిల్లా కేంద్రానికి వచ్చింది.పురుగుల మందు తాగి...జనగామ బాలాజీనగర్లో ఓ భవనానికి ‘టు లెట్’ బోర్డ్ ఉండడంతో నవిత పైఅంతస్తుకు వెళ్లి రూములు ఉన్నాయా.. అని అడిగింది. అక్కడ అద్దెకు ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఉందని చెప్పగా, సూపర్వైజర్ వచ్చి వివరాలు ఆరా తీశాడు. అయితే, వెంట ఎవరూ రాలేదని అడిగితే తన సోదరుడు వస్తున్నాడని చెప్పి ఆయనను బయటకు పంపించింది. అనంతరం సమీపంలోని షాప్నకు వెళ్లిన ఆమె పెన్ను, పేపర్ తీసుకుని లేఖ రాసింది. ఆతర్వాత ఎరువుల షాప్నకు వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసి తిరిగి అద్దె అడిగిన భవనంలోకి వచ్చి తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చాలాసేపు గడిచినా సవిత బయటకు రాకపోవడం, గదిలో నుంచి వాసన వస్తుండడంతో పక్కన అద్దెకు ఉంటున్న వారు చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి అప్పటికే సవిత మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఇంటి నుంచి బయలుదేరే సమయంలో నవిత తన భర్తకు ‘నీలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాను.. సారీ..’ అని మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసులు ఆమె మృతదేహం వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నా, దానిపై పురుగుల మందు పడడంతో చదవడం సాధ్యం కాలేదు. అయితే, లేఖపై ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా ఇచ్చిన సమాచారంతో ఆమె సోదరుడు, కుటుంబీకులు చేరుకుని ఫిర్యాదు చేశాడు.
ప్రియుడిపై మోజు సుపారీ ఇచ్చి భర్తను లేపేసిన భర్య!
వరంగల్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, నిత్యం తాగి ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే నెపంతో రూ.5లక్షలు సుఫారీఇచ్చి భర్తను హత్య చేయించింది ఓభార్య. ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 8న పరకాలకు చెందిన మడికొండ సాంబయ్య తన కుమారుడు మడికొండ సుమన్ భరత్ (38) కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మడికొండ సుమన్ భరత్కు 2012 సంవత్సరంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాములపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం లావణ్యకు పరకాల పట్టణంలోని ఇమ్మడి నరేశ్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ విషయంలో మడికొండ సుమన్ భరత్ రోజు తాగి వచ్చి లావణ్యను హింసించేవాడు. దీంతో లావణ్య తన తమ్ముడు పెండల రాజు, ప్రియుడు ఇమ్మడి నరేశ్తో కలిసి సుమన్ భరత్ను హత్య చేయడానికి ప్లాన్ వేసింది. దీంతో ప్రియుడు ఇమ్మడి నరేష్కు పరిచయం ఉన్న గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లతో హత్యకు బేరం కుదుర్చుకున్నారు.బంగారం కుదువపెట్టి సుపారీ ఇచ్చి..లావణ్య తన బంగారం కుదువ పెట్టి రూ.1,59,000, ఇమ్మడి నరేశ్, పెండల రాజు కలిసి రూ.3లక్షలు పోగు చేసి మొత్తం రూ.4,59,000 చిరంశెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చి సుమన్భరత్ను హత్య చేయించారు. వెంకటేశ్వర్లు మరో వ్యక్తి భూక్య రాకేశ్తో కలిసి సుమన్ భరత్కు మద్యం, డబ్బులు ఆశ చూపి ఈనెల 3న రాత్రి 8 గంటలకు ములుగుకి పిలిపించారు. అక్కడినుంచి చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి సుమన్ భరత్కి మద్యం తాగించారు. అతను మత్తులో లేవలేని స్థితిలో ఉండగా చిరంశెట్టి వెంకటేశ్వర్లు బీర్ బాటిల్తో భరత్ తల వెనక భాగంలో కొట్టగా సుమన్ భరత్ పడిపోయాడు. అనంతరం వారు ముందే తెచ్చి పెట్టుకున్న పెట్రోల్ భరత్ ఒంటిపై పోసి నిప్పంటించారు. భరత్ మృతదేహం కాలుతుండగా.. భూక్యా రాకేశ్, చిరంశెట్టి వెంకటేశ్వర్లు ఫోన్లో ఫోటోలు, వీడియో తీసి, మరుసటి రోజు ములుగుకు వచ్చిన లావణ్య, పెండల రాజుకు చూపించారు. దీంతో సుఫారీలో మిగిలిన డబ్బులను వారు అప్పగించారు. అనంరతం లావణ్య తన అత్తగారి ఇల్లు అయిన పరకాలకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉంది. ఈనెల 5న చిరంశెట్టి వెంకటేశ్వర్లు రాత్రి 10 గంటలకు పొలం వద్దకు వెళ్లి భరత్ కాలిపోగా మిగిలిన ఎముకలను పక్కనే ఉన్న వాగులో పడేశాడు. దర్యాప్తులో భాగంగా పరకాల పోలీసులు చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య రాకేశ్ను గోవిందరావుపేట శివారులోని చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి కాల్వలోని భరత్ ఎముకలు, బూడిద, కాలిచ్చి పడేసిన సిగరెట్ పికలు, బీర్ బాటిల్ ముక్కలు, మందు బాటిళ్ల మూతలు, ప్లాస్టిక్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. హత్య కేసును చేధించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పరకాల ఏసీపీ సతీష్బాబు, ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్నాయక్ను డీసీపీ అంకిత్ కుమార్ అభినందించారు.
వీడియోలు
అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్
మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి
అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు
విజయ్ కి అంత సీన్ లేదు...ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్
ముగ్గువేసి మనసులు గెలిచిన విజయ్
నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..
మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం
నా రైట్స్ నాకే..! హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ



