ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.పాడ్యమి ప.3.35 వరకు, తదుపరి విదియ,నక్షత్రం: అశ్విని ఉ.10.57 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ఉ.7.08 నుండి 8.39 వరకు, తదుపరి రా.8.00 నుండి 9.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.46 నుండి 7.25 వరకు,అమృత ఘడియలు: తె.5.02 నుండి 6.31 వరకు.సూర్యోదయం : 5.47సూర్యాస్తమయం : 6.11రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకుమేషం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృషభం: బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు.మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.కర్కాటకం: నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.సింహం: మిత్రులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొమ్ము అందక ఇబ్బందులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యం.కన్య: ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.తుల: మిత్రుల సహకారం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆర్థిక ప్రగతి. రుణఒత్తిడులు తొలగుతాయి. వస్తులాభాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ధనుస్సు: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రుణయత్నాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. విద్యార్థులకు ఒత్తిడులు.మకరం: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు.కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.మీనం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్జెండర్కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి.
డిజిటల్ యాడ్స్ డబుల్
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ వచ్చే ఐదేళ్లలో దాదాపు రెట్టింపు కానుంది. 2030 నాటికి 19–22 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2025లో ఇది 11 బిలియన్ డాలర్లుగా ఉండగా రాబోయే రోజుల్లో ఏటా 10–15 శాతం మేర వృద్ధి చెందనుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ కన్సల్టింగ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా కూడా డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. గతేడాది ప్రకటనలపై చేసిన మొత్తం వ్యయాల్లో 70–75 శాతం వాటాను ఆక్రమించింది. నివేదికలో ఇతర ముఖ్యాంశాలు.. → భౌగోళికంగా చూస్తే గ్లోబల్ డిజిటల్ యాడ్లపై చేసే వ్యయాల్లో 46 శాతం మార్కెట్ వాటాతో అమెరికా అగ్రస్థానంలో, 24% వాటాతో చైనా రెండో స్థానంలో ఉన్నాయి. భారత్ వాటా ప్రస్తుతం 1 శాతంగా ఉంది. → 2030 నాటికి అంతర్జాతీయంగా డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. → డిజిటల్ ప్రకటనల్లో మొబైల్ యాడ్స్ వాటా అత్యధికంగా 65–70 శాతంగా ఉంటోంది. అమెరికాలో ఇన్–యాప్ అడ్వర్టైజింగ్ వాటా 80–85 శాతంగా ఉంది. → అల్గోరిథమ్ ఆధారిత డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యయాల్లో 70–80 శాతం వాటాతో కొన్ని సంస్థల ఆధిపత్యమే ఉంటోంది. తమకంటూ సొంత వ్యవస్థలు ఉన్న అల్ఫాబెట్, మెటా, అమెజాన్, యాపిల్, బైట్డ్యాన్స్ తదితర దిగ్గజాలు వీటిలో ఉన్నాయి. → ఇక ఓపెన్ వ్యవస్థలోని సంస్థల వాటా మిగతా 20–30 శాతంగా ఉంది. ఇన్మొబి, యూనిటీ యాడ్స్, ఓపెన్ఎక్స్ మొదలైన బ్రాండ్లు వీటిలో ఉన్నాయి. → వేగంగా అందిపుచ్చుకునే వారు, వెనుకబడిన వారి మధ్య అంతరం పెరిగిపోతున్న నేపథ్యంలో... తదుపరి దశ అడ్వర్టైజింగ్ అంతా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారితమైనదిగా ఉండనుంది. భవిష్యత్తులో ఏఐని విస్తృతంగా వినియోగించుకునే సంస్థలు విజేతలుగా నిలుస్తాయి.
మౌన్ జారో పెళ్లికూతురు
పెళ్లి పీటలెక్కే ముందు నాజూగ్గా కనిపించాలన్న ఆకాంక్ష కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ ఆకాంక్ష ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’. ‘మౌన్ జారో’ అనే టైప్ 2 డయాబెటిస్ ఇంజెక్షన్లను ఇస్తూ ఢిల్లీలోని వెల్నెస్ క్లినిక్లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.క్షేమకరం కాని ఈ ట్రెండ్ పై కథనం.అదేమిటో... పెళ్లంటే అమ్మాయే అందంగా కనిపించాలని సామాజిక చట్టం. అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు. అమ్మాయి రూపానికి సంబంధించి ఎన్నో పట్టింపులు, ఆరాలు, నఖశిఖ పర్యంత పరీక్షలు. కాబట్టే పెళ్లంటే ఈ కాలంలో కూడా అమ్మాయిలు టెన్స్ అయ్యే పరిస్థితి ఉంది. వీరి కోసమని ‘మేకోవర్’లూ, ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్యాకేజీ’లు మార్కెట్లో బయలుదేరాయి. ఈ పరిస్థితి ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’.‘మౌన్ జారో’ అనేది టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు వాడే ఔషధం. దీనిలోని ‘టిర్జెపటైడ్’ అనే పదార్థం ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ ఔషధం పేరుతోనే ఇప్పుడు ఢిల్లీలోని వెల్నెస్ క్లినిక్లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.ఎందుకు ఈ ట్రెండ్?పెళ్లికి మూడు నుంచి ఆరునెలల ముందు 10నుంచి 15 కిలోలు తగ్గాలని చాలామంది యువతులు కోరుకుంటున్నారు. జిమ్, డైట్తో సాధ్యం కాని ఫలితాలు త్వరగా కావాలనుకునే వారు ఈ ప్యాకేజీల వైపు మొగ్గుతున్నారు. పెళ్లికి అవసరమైన లెహంగా ఫిట్టింగ్, ఫొటో షూట్, సోషల్ మీడియా ఒత్తిడి కూడా దీనికి కారణమవుతున్నాయి.ప్యాకేజీల్లో ఏముంది?ఢిల్లీలోని క్లినిక్లు ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్’, ‘వెడ్డింగ్ రెడీ’ పేర్లతో ప్యాకేజీలు ఇస్తున్నాయి. వీటిలో వైద్యుల పర్యవేక్షణలో మౌన్ జారో ఇంజెక్షన్లు, డైట్ కౌన్సెలింగ్, బాడీ కాంటూరింగ్ (నిర్దిష్ట శరీర భాగం సన్నబరచడం) సెషన్లు కలిపి అందిస్తున్నారు. వీటి ధర 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉంటోంది. పెళ్లి డేట్ చెప్పగానే ఆ డేట్కు టార్గెట్ బరువు సెట్ చేసి ప్లాన్ ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.వైద్యుల హెచ్చరికఅనన్య లాంటి కేసులపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌన్ జారో అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడని ఔషధం. వికారం, వాంతులు, ప్యాంక్రియాటైటిస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కేవలం కాస్మెటిక్ కారణాలతో, వైద్య అవసరం లేకుండా దీన్ని వాడడం ప్రమాదకరమని ఎండోక్రై నాలజిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గిన తర్వాత జీవనశైలి మార్చుకోకపోతే తిరిగి బరువు పెరిగే అవకాశం 80 శాతం వరకు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.నా రూపమే నా సౌందర్యంఇలాంటి ట్రెండ్ సమాజంపై ఒత్తిడిని పెంచుతోందనీ సాదాసీదా అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తోందని సామాజికవేత్తలు అంటున్నారు. పెళ్లంటే సన్నగా ఉండాలనే భావన బలపడేలా చేస్తున్న సౌందర్య సాధనాల సంస్థల ప్రచారాన్ని నిరోధించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ‘మౌన్ జారో పెళ్లికూతురు’ ట్రెండ్ యథాతథ రూపంలోని ఒరిజినాలిటీని సవాలు చేస్తోంది. ‘నా రూపమే నా సౌందర్యం’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెళ్లగిస్తోంది. ‘ఆరోగ్యంగా ఉండటమూ అందంగా ఉండటమే’ అనే సంగతిని ఆడపిల్లలు మర్చిపోతున్నారు. పెళ్లిరోజున అందంగా కనిపించాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరిని మర్చిపోవద్దు. అలాగే నకిలీ వెల్నెస్ క్లినిక్ల బారిన పడొద్దు. పెళ్లిలో బాగా కనిపించాలని..ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల అనన్య శర్మ (పేరు మార్చబడింది) అనుభవం ఈ ట్రెండ్కు అద్దం పడుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన అనన్యకు 2026 ఆగస్టులో వివాహం నిశ్చయమైంది. ఆమె బరువు 78 కిలోలు. డిజైనర్ లెహంగా సెట్ అవ్వాలంటే కనీసం 65 కిలోలకు రావాలని బోటిక్ వారు సూచించారు. జిమ్లో చేరినా ఉద్యోగ ఒత్తిడి వల్ల క్రమం తప్పకుండా వెళ్లలేకపోయింది. దీంతో స్నేహితురాలి సలహాతో సౌత్ ఢిల్లీలోని ఒక ప్రముఖ స్లిమ్మింగ్ క్లినిక్లో ‘బ్రైడల్ మౌన్ జారో ప్యాకేజీ’ తీసుకుంది. నాలుగు నెలల ప్యాకేజీ ఖరీదు 1.4 లక్షలు. వారానికి ఒకసారి టిర్జెపటైడ్ ఇంజెక్షన్, నెలకు రెండుసార్లు డైటీషియన్ కన్సల్టేషన్, 8 సెషన్ల బాడీ కాంటూరింగ్ ఇందులో భాగం. ‘మొదటి నెలలోనే ఆకలి బాగా తగ్గింది. 4 కిలోలు తగ్గాను’ అని అనన్య చెప్పింది. నాలుగు నెలలు పూర్తయ్యేసరికి ఆమె 12 కిలోలు తగ్గి 66కిలోలకు చేరింది. అయితే ఈ క్రమంలో తరచూ వికారం, నీరసం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపింది. ‘పెళ్లి అయ్యాక మందు ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతానేమో అనే భయం ఉంది. కానీ పెళ్లి రోజు ఫోటోల్లో బాగా కనిపించడం నాకు ముఖ్యం’ అని ఆమె అంది.
అంకె మార్చినందుకు అరదండాలు!
విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు
బిగ్ బాస్ చీకటి నిజం.. ఫోటోలు షేర్ చేసి రూ. 2కోట్లు డిమాండ్
ఇరాన్కు ట్రంప్ బంపరాఫర్
మాకు కావాలో రైలు
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
మాజీ ఎమ్మెల్యే తనయుడు లొంగుబాటు
మూడు నెలల్లో 73 వేల ఉద్యోగాలు ఉఫ్!
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
అర్ధరాత్రి నగ్నంగా అపార్ట్మెంట్లో హల్చల్
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
రుతుపవనాల దగా?
ఇదేం పెద్ద విశేషం! ఇప్పటికే వర్కింగ్ సీఎం కదా!!
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
గేమ్ చేంజర్ X నేమ్ చేంజర్
ఆరు పదుల వయసులో అదే జోష్.. చిరంజీవి హీరోయిన్ డ్యాన్స్ చూశారా?
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
‘తస్సాదియ్యా’.. సమంత డ్యాన్స్ అదిరిందయ్యా!
ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
అంకె మార్చినందుకు అరదండాలు!
విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు
బిగ్ బాస్ చీకటి నిజం.. ఫోటోలు షేర్ చేసి రూ. 2కోట్లు డిమాండ్
ఇరాన్కు ట్రంప్ బంపరాఫర్
మాకు కావాలో రైలు
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
మాజీ ఎమ్మెల్యే తనయుడు లొంగుబాటు
మూడు నెలల్లో 73 వేల ఉద్యోగాలు ఉఫ్!
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
అర్ధరాత్రి నగ్నంగా అపార్ట్మెంట్లో హల్చల్
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
రుతుపవనాల దగా?
ఇదేం పెద్ద విశేషం! ఇప్పటికే వర్కింగ్ సీఎం కదా!!
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
గేమ్ చేంజర్ X నేమ్ చేంజర్
ఆరు పదుల వయసులో అదే జోష్.. చిరంజీవి హీరోయిన్ డ్యాన్స్ చూశారా?
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
‘తస్సాదియ్యా’.. సమంత డ్యాన్స్ అదిరిందయ్యా!
ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
ఫొటోలు
'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)
ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)
భూత్ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్ (ఫోటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సినిమా
ఆట పూర్తి
‘ఐ యామ్ గేమ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది.ఈ చిత్రంలో కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథన్, ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు – దర్శకుడు మిస్కిన్, కదిర్, పార్థ్ తివారీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘‘ఈ ఏడాది ఓనమ్ పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టులో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.
‘పోచమ్మ’ వెబ్ సిరీస్ రివ్యూ
సిల్వర్స్క్రీన్ మీదే కాదు వెబ్ స్క్రీన్ మీద కూడా మైథలాజికల్ కంటెంట్కి కూడా రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి కథను చిన్న పిల్లల నుంచి మొదలు పెద్ద పిల్లల వరకు అందరూ ఆసక్తికరంగా చూస్తారు. అందుకే మన దర్శకనిర్మాతలు మైథలాజికల్ టచ్తో డిఫరెంట్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వెబ్ సిరీసే పోచమ్మ. అచ్యుత్ కుమార్, స్నేహల్ కామత్, అర్జున్ అంబటి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నేటి(ఏప్రిల్ 17) నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వ్యాపారవేత్త ఫెడ్రిక్(రమేశ్ ఇందిరా) అరకులో కొత్తగా ఓ కాఫీ ఎస్టేట్ కొనుగోలు చేస్తాడు. ఒకప్పటి ఆ ఎస్టేట్ ఓనర్ రఘుపతి(అచ్యుత్ కుమార్).. ఆర్థిక సమస్యలతో దాన్ని ఫెడ్రిక్కి అమ్మి, అందులోనే మేనేజర్గా పని చేస్తాడు. ఫెడ్రిక్ ఆ బంగ్లాలోకి రాగానే.. ఎదురుగా ఉన్న పోచమ్మ విగ్రహాన్ని తీసేయిస్తాడు. ఆ తర్వాత వారింట్లో సమస్యలు మొదలవుతాయి. ఫెడ్రిక్ చిన్న కూతురు జెస్సీ(స్నేహల్ కామత్) అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. ఆమె చావుకు రఘుపతి కొడుకు సురేశ్ కారణమని ఫెడ్రిక్ పెద్ద కూతురు ఇవా(ప్రియా) పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు మాత్రం ఈ హత్య వెనుక ఇవా భర్త డేవిడ్(అర్జున్ అంబటి) కూడా ఉన్నట్లు అనుమానిస్తారు. ఊరువాళ్లు మాత్రం పోచమ్మ విగ్రహం తొలగించినందుకే.. అమ్మ ఆగ్రహించి జెస్సీని చంపేసిందని నమ్ముతారు. అసలు జెస్సీ ఎలా చనిపోయింది? ఆమె చావుకు అసలు కారకులు ఎవరు? దేని కోసం చేశారు? పోచమ్మ విగ్రహం తొలగించిన తర్వాత ఫెడ్రిక్ ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? చివరకు ఫెడ్రిక్కి తెలిసిన నిజం ఏంటి? అనేది తెలియాలంటే ఆహాలో ‘పోచమ్మ’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇదొక మర్డర్ మిస్టరీ. దానికి మైథాలజీ ఎలిమెంట్ను యాడ్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సిరీస్ని తీర్చిదిద్డాదు దర్శకుడు రమేష్ ఇందిరా. తక్కువ నిడివితో మొత్తం ఐదు ఎపిసోడ్స్గా ఈ సిరీస్ని తెరకెక్కించారు. జెస్సీ చనిపోయే సన్నివేశంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ మరణం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు.. పోలీసులు ఇన్వెస్టిగేషన్..కథపై ఆసక్తిని పెంచుతుంది. జెస్సీ చావుకు కారణం ఏంటనేది చివరి వరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. రెండో ఎపిసోడ్లో కాస్త సాగదీత సన్నివేశాలు ఉన్నా.. పోచమ్మ విగ్రహాన్ని తొలగించే సీన్ మాత్రం కాస్త ఎమోషనల్గా ఉంటుంది. ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొత్త కొత్త విషయాలు బయటకు రావడం.. మరోవైపు పోచమ్మకు సంబంధించిన సీన్లతో ఐదు ఎపిసోడ్లను ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. అయితే థ్రిల్లర్ సిరీస్లు చూసే ఆడియెన్స్ మాత్రం విలన్ ఎవరు అనేది ఈజీగానే కనిపెట్టగలరు. రూపాలు వేరైనా దేవుళ్లు అందరూ ఒక్కటే అంటూ సిరీస్ని ముగించిన తీరు బాగుంది. తెలుగువారికి పెద్దగా పరిచయం లేని నటీనటులు ఉండడం.. కథనం కొంతమేర ఊహకందేలా సాగడం ఈ సిరీస్కి మైనస్. అలాగే పోచమ్మకు సంబధించిన సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం ఈ సిరీస్కి ప్లస్ పాయింట్. థ్రిల్లర్స్ని ఇష్టపడేవారికి ‘పోచమ్మ’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సిరీస్కి రమేశ్ ఇందిరా దర్శకత్వం వహించడమే కాకుండా.. కీలకమైన ఫెడ్రిక్ పాత్రను కూడా పోషించాడు. కాఫీ ఎస్టెట్ ఓనర్గా ఆయన లుక్, బాడీ లాంగ్వేజీ చక్కగా కుదిరింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న డేవిడ్ పాత్రలో అర్జున్ అంబటి ఒదిగిపోయాడు. నిడివి తక్కువే అయినా.. ఆయన పాత్ర గుర్తిండిపోతుంది. ఇక జెన్సీగా స్నేహిల్ గ్లామర్గా కనిపిస్తూనే..తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సిరీస్ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇవా పాత్రకి ప్రియా న్యాయం చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అచ్యుత్ కుమార్ రోల్ గురించి. రఘుపతి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. చివరిలో ఆయన పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. సాంకేతికంగా సిరీస్ బాగుంది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
అజయ్ తెలుసు.. కానీ అజయ్ ఘోష్ అనుకోలేదు: రాశి ఆసక్తికర కామెంట్స్
తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'. 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన హీరో.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయన హీరోగా నటించిన పాపం ప్రతాప్ ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన రాశి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ స్టోరీ చెప్పినప్పుడు నా పక్కన మొదట అజయ్ అనుకున్నానని రాశి తెలిపింది. టాలీవుడ్లో నాకు హైట్ ఎక్కువగా ఉండే అజయ్ మాత్రమే తెలుసని వెల్లడించింది. కానీ సెట్లో బయటికి వచ్చి అజయ్ కోసం వెతుకుతున్నా.. కానీ అక్కడే అజయ్ ఘోష్ చైర్లో కూర్చుని కనిపించారు. అజయ్ ఘోష్ని చూసి.. నాకు మావయ్య క్యారెక్టర్ ఏమోనని అనుకున్నానని రాశి చెప్పింది. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యానని అన్నారు. కానీ అజయ్ ఘోష్ అద్భుతంగా చేస్తారని రాశి కొనియాడింది. ఫస్ట్ టైమ్ ఆయనతో పని చేశానని తెలిపింది. సింగిల్ టేక్లో సీన్ చేయడం ఆయనకే సాధ్యమన్నారు రాశి. స్టోరీ చెప్పినప్పుడు నాకు పక్కన అజయ్ అనుకున్నా. సెట్ లో అజయ్ ఘోష్ ని చూసి అతను నాకు మావయ్య క్యారక్టర్ ఏమో అనుకున్నా. ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యా.- Actress Raasi#PapamPrathap Thank You Meet pic.twitter.com/9769n5f7TT— idlebrain.com (@idlebraindotcom) April 17, 2026
‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే..నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా తన సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమాను నిర్మించాడు.ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 17) రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్(సాయి తేజ్).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్ని రెంట్కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్)కు సతీష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు. ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్ తీవ్రంగా కొట్టుకుంటారు. ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు. సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్ సవాల్ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్ ఏం చేశాడు? సతీష్-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్ కీలపట్టు) వల్ల సతీష్కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 90లలో టీవీ అనేది ఒక ఎమోషన్. గ్రామాలల్లో ఒకరిద్దిరి ఇంట్లోనే టీవీలు ఉండేవి. సినిమాలు, సీరియళ్లు చూసేందుకు ఊరంతా వారింటి ముందు క్యూకట్టేది. వాళ్లు చీదరించుకున్నా..తిట్టినా పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉండిపోయేవాళ్లు. ఇప్పటితరానికి ఇవేవి తెలియదు కానీ.. 80-90 తరానికి చెందినవాళ్లకు మాత్రం టీవీతో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చిన్నదే అయినా దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఒక చిన్న లైన్ని తీసుకొని.. దానికి పల్లెటూరి అనుబంధాలను, చక్కని ప్రేమ కథను జత చేసి.. ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. చిత్తూరు గ్రామీణ వాతావరణం, అక్కడ ప్రజల అలవాట్లను పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఊర్లో జాతరకు టీవీ తీసుకురావడం.. టీవీ చూసేందుకు ఊరంతా ఒక చోటికి రావడం.. చిన్న చిన్న తగాదాలు, లవ్ ట్రాక్తో ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అయితే పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకోవడంతో.. కొంతవరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. టీవీని దొంగిలించారనే విషయం తెలిసినప్పటి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. అదే సమయంలో సతీష్-శారదల లవ్స్టోరీ రాజప్పకు తెలియడం.. హీరో సవాల్ చేయడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. టీవీ దొంగతనం చేసినవాడిని హీరో ఎలా కనిపెట్టాడు అనేదే ద్వితియార్థం కథ. ఆ దొంగ ఎవరనేది ప్రేక్షకుడు కూడా చివరివరకు కనిపెట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఓవరాల్గా తిమ్మరాజుపల్లి టీవీ.. 80-90 తరాలకు పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది.ఎవరెలా చేశారంటే.. ఇందులో నటించినవారంతా కొత్తవాళ్లే అయినా కూడా చక్కగా నటించారు. హీరోగా సాయి తేజ్, హీరోయిన్గా వేద జలంధర్ తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు. వీరిద్దరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అందరూ చిత్తూరు యాసలో అద్భుతంగా మాట్లాడారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. వంశీకాంత్ రేఖన సంగీతం ఈ సినిమాకు మరో అదనపు బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. అక్షయ్ రామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాతగానూ కిరణ్ అబ్బవరం తన మార్క్ చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
క్రీడలు
ఉబెర్ కప్నుంచి తప్పుకున్న గాయత్రి – ట్రెసా జోడి
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ ఉబెర్ కప్లో భారత అవకాశాలకు దెబ్బ పడింది. భారత డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి – ట్రెసా జాలీ ఈ టోర్నీనుంచి తప్పుకుంది. ట్రెసా మడమకు గాయం కావడంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసియా చాంపియన్షిప్కు బయల్దేరే ముందు ప్రాక్టీస్లో తన సహచర ప్లేయర్ పాదంపై ట్రెసా కాలు పడటంతో ఆమెకు గాయమైందని భారత డబుల్స్ కోచ్ బి. సుమీత్ రెడ్డి వెల్లడించాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ట్రెసా రీహాబిలిటేషన్ తర్వాత కోలుకునే అవకాశం ఉంది. గాయత్రి – ట్రెసా స్థానంలో ఉబెర్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు శ్రుతి మిశ్రా – ప్రియ కొంజెన్బమ్లను ఎంపిక చేశారు. 2023లో జాతీయ చాంపియన్గా నిలిచిన ఈ జోడి 2024లో ఆసియా చాంపియన్షిప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. డెన్మార్క్లోని హార్సెన్స్ వేదికగా ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు థామస్, ఉబెర్ కప్ టోర్నీలు జరుగుతాయి. మరో వైపు ఈ టోర్నీలో సాధన కోసం భారత పురుషుల డబుల్స్ జోడి సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి డెన్మార్క్ బయల్దేరుతున్నారు.
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్ గిల్ (86) సూపర్ ఇన్నింగ్స్తో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బట్లర్ (25), సాయి సుదర్శన్ (22) పర్వాలేద నిపించారు. గిల్ ఔటయ్యాక కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (17), రాహుల్ తెవాటియా (7 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (79) టాప్ స్కోరర్గా నిలిచాడు. గ్రీన్ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్ల పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా, కేకేఆర్ వరుసగా ఐదో పరాజయంతో అట్టడుగు స్థానంలో నిలిచింది.2⃣ points in the bag ✅Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠 Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026
బంగ్లా 221 ఆలౌట్.. న్యూజిలాండ్దే తొలి వన్డే
బంగ్లాదేశ్ టూర్ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ (68) టాప్ స్కోరర్గా నిలవగా, డియాన్ ఫాక్స్ క్రాఫ్ట్ (59) అర్థసెంచరీ సాధించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసెన్, షోరిపుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (57), తౌహిద్ హృదోయ్ (55) అర్థసెంచరీలు సాధించారు. లిటన్ దాస్ (46) పర్వాలేదనిపించాడు. అయితే వీరు ఔటైన తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4 వికెట్లతో చెలరేగగా, నాథన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో అర్థసెంచరీ, బౌలింగ్లో ఒక వికెట్ తీసి ఆల్రౌండ్ ప్రదర్శన కనరబరిచిన డియాన్ ఫాక్స్క్రాఫ్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే సోమవారం జరగనుంది.
హమ్మయ్య.. ఇన్నాళ్లకు న్యాయం చేశాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు కామెరున్ గ్రీన్ ఎట్టకేలకు మెరిశాడు. సీజన్లో కామెరున్ గ్రీన్ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అర్థసెంచరీ సాధించిన గ్రీన్ మొత్తంగా 55 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. గ్రీన్ దంచికొడుతున్న సమయంలో కేకేఆర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఇన్నింగ్స్ ఆఖరి వరకు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ చివరి రెండు ఓవర్లలో తనకే స్ట్రైక్ వచ్చినప్పటికీ పరుగులు చేయడంలో విఫల మయ్యాడు.ఇక గతేడాది జరిగిన వేలంలో గ్రీన్ను కేకేఆర్ రూ. 25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అధిక ధరకు అమ్ముడైన గ్రీన్ ఈ సీజన్లో మాత్రం ఒక్క మ్యాచ్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. 23 కోట్లు దండగంటూ అభిమానులు సోషల్ మీడియాలో గ్రీన్ను ఏకిపారేశారు. అభిమానుల మాటలు గ్రీన్ మనుసుకు తగిలాయేమో కానీ గుజరాత్తో మ్యాచ్లో చివరిదాకా నిలబడి కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో గ్రీన్ ఐదు మ్యాచ్ల్లో వరుసగా 18, 2, 4, 32, 0 పరుగులు సాధించాడు. Making a strong statement 💪Cameron Green getting a move on for #KKR 💜 Updates ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR | @KKRiders pic.twitter.com/utzOHFRbGx— IndianPremierLeague (@IPL) April 17, 2026
న్యూస్ పాడ్కాస్ట్
లోక్సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
చట్టసభల్లో చారిత్రక మలుపు... లోక్సభ స్థానాలు 850కి పెంపు... రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం... డిమాండ్లపై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్... అణ్వాయుధాలు, హార్మూజ్పైనే పీటముడి
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు షురూ. మరో దఫా చర్చించే అవకాశం
భారీగా పడిపోతున్న బంగారం ధరలు
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
ఆంధ్రప్రదేశ్లో ‘సీఎంఆర్ఎఫ్’ నిధులు స్వాహా... టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి సీఎంవో వరకూ వసూళ్ల పర్వం
బిజినెస్
AI పోటీలో చైనా.. హువాంగ్ హెచ్చరిక!
చైనాకు ఏఐ చిప్లను అమ్మడం అంటే.. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలను అమ్మడం లాంటిదని ఆంత్రోపిక్ అధిపతి డారియో అమోడె వ్యాఖ్యానించారు. దీనిని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారీ పోటీ కొనసాగుతోంది. ఈ పోటీలో అమెరికా, చైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యూఎస్ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, చైనాకు AI చిప్లను విక్రయించడంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.The Jensen Huang episode.0:00:00 – Is Nvidia’s biggest moat its grip on scarce supply chains?0:16:25 – Will TPUs break Nvidia’s hold on AI compute?0:41:06 – Why doesn’t Nvidia become a hyperscaler?0:57:36 – Should we be selling AI chips to China?1:35:06 – Why doesn’t Nvidia… pic.twitter.com/ezDkUmoFWM— Dwarkesh Patel (@dwarkesh_sp) April 15, 2026హువాంగ్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చైనాకు ఇప్పటికే పెద్ద ఎత్తున కంప్యూటింగ్ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఉందని. అంటే, చైనా ఇప్పటికే AI రంగంలో ముందంజలో ఉంది. కాబట్టి, చిప్లను అమ్మకుండా నిరోధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన భావిస్తున్నారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!చర్చలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చైనా చిప్లను ఉపయోగించి అత్యాధునిక AI మోడళ్లను అభివృద్ధి చేస్తే ఏమవుతుందన్న ప్రశ్నకు, ఇప్పటికే చైనాలో అలాంటి సామర్థ్యం ఉందని ఆయన స్పష్టం చేశాడు. అంటే, ఈ టెక్నాలజీని పూర్తిగా ఆపడం అసాధ్యమని ఆయన అభిప్రాయం.
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
ఆసియా అత్యంత సంపన్నుడుగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నిలిచారు. ఇప్పటి వరకూ ఆసియా కుబేరుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ఆయన స్థానాన్ని అదానీ ఆక్రమించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం.. గౌతమ్ అదానీ నికర సంపద 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన అత్యంత సంపన్నుల్లో ఆసియాలో అగ్ర స్థానానికి, ప్రపంచంలో 19 ప్లేస్కు చేరుకున్నారు.చాలా కాలం ఆసియా అత్యంత సంపన్నుడుగా కొనసాగిన ముఖేష్ అంబానీ 90.8 బిలయన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండో స్థానానికి, ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానానికి పరిమితమయ్యారు. వీరి సంపద మధ్య అంతరం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ మార్పు ప్రపంచ సంపద కదలికల అస్థిర స్వభావాన్ని తెలియజేస్తోంది.అంబానీ vs అదానీ: లాభాలు.. నష్టాలుఈ సంవత్సరం తన గ్రూప్ స్టాక్ పనితీరులో స్థిరమైన లాభాలు అదానీ సంపద పెరుగుదలకు కలిసొచ్చాయి. సంపదకు 8.1 బిలియన్ డాలర్లు జత కలిశాయి. దీనికి విరుద్ధంగా, అంబానీ అదే కాలంలో తన నికర సంపదలో 16.9 బిలియన్ డాలర్లను కోల్పోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ఫ్లాట్ మార్కెట్ పనితీరును కనబరిచింది. దీంతో అంబానీ సంపద 76.7 మిలియన్ డాలర్ల స్వల్ప పెరుగుదలను చూసింది. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లాభాలను నమోదు చేశాయి. దీంతో కేవలం ఒక రోజులో అదానీ సంపదకు 3.56 బిలియన్ డాలర్లు జత కలిశాయి.ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే..ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, లారీ పేజ్ 286 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. టాప్ 10 లో జెఫ్ బెజోస్, సెర్గీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, లారీ ఎల్లిసన్, మైఖేల్ డెల్, జెన్సన్ హువాంగ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జిమ్ వాల్టన్ ఉన్నారు.
‘హెచ్చరిక: 'రిచ్ డాడ్' అంచనాలు నిజమవుతున్నాయ్’
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' (Rich Dad’s Prophecy) పుస్తకంలోని అంచనాలు 2026 నాటికి నిజమవుతున్నాయని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో హెచ్చరించారు.బుడగ పేలిపోనుంది!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక భారీ బుడగ లాంటివని, అది త్వరలోనే పగిలిపోనుందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు."దుబాయ్ నుండి వేగాస్ వరకు, టోక్యో నుండి న్యూయార్క్ వరకు ఆర్థిక పతనాలను గమనించండి. దురదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య పెరగబోతోంది" అని ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు.బాధితులుగా మిగిలిపోకండి..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ, అప్రమత్తంగా ఉండేవారు విజేతలుగా నిలవవచ్చని కియోసాకి సూచించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు."ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా.. మీరు మాత్రం ఆర్థికంగా విజేతలుగా నిలవవచ్చు. అందుకు కావాల్సిన పోరాటం మీరు చేయాలి" అని కియోసాకి తన ఫాలోవర్లకు హితవు పలికారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!I WARNED EVERYONEIn 2002 I released Rich Dad’s Prophecy. In 2026 the predictions in Prophecy are coming true. You don’t have to be a victim to the “Everything Bubble” as the bubbles burst and leads to the greatest depression in world history. You can still be a winner…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 17, 2026
కారును మించిన ‘రేంజ్’లో కొత్త స్కూటర్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) భారత మార్కెట్లోకి సంచలన మోడల్ను ప్రవేశపెట్టింది. తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'సింపుల్ అల్ట్రా' (Simple Dot One/Ultra)ను రూ. 2.35 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 'జెన్ 2' లైనప్తో పాటు ఆవిష్కరించిన ఈ స్కూటర్, ఇప్పుడు బుకింగ్స్కు సిద్ధంగా ఉంది.ఒక్క ఛార్జ్తో 400 కిలోమీటర్లు!ఈ స్కూటర్ ప్రధాన ఆకర్షణ దాని రేంజ్. సింగిల్ ఛార్జ్పై ఏకంగా 400 కిలోమీటర్ల (IDC) మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ద్విచక్ర వాహన రంగంలో ఇదే అత్యధికం. ఈ స్థాయి రేంజ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లకు కూడా లేదు.ఉదాహరణకు, భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా టియాగో ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ (ధర సుమారు రూ. 7.99 లక్షలు) ఒక్క ఛార్జ్పై 293 కిమీ మాత్రమే ఇస్తుంది. ఈ లెక్కన చూస్తే, కారు కంటే సగం ధరలోనే అంతకంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్గా 'సింపుల్ అల్ట్రా' రికార్డు సృష్టించింది.పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ఈ స్కూటర్ 6.5 kWh భారీ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో రైడర్ భద్రత కోసం ఫోర్-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే, రైడింగ్ డేటా, కనెక్టివిటీ ఫీచర్ల కోసం 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు.విలువ పరంగా చూస్తే.. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ. 2.35 లక్షలు ఖర్చు చేయడం ఎక్కువ అనిపించినా, అది ఇచ్చే 400 కిమీ రేంజ్ వాహనదారులకు భారీ లాభాన్ని చేకూరుస్తుంది. ఈ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కేటీఎం 250 డ్యూక్ (రూ. 2.17 లక్షలు) వంటి స్పోర్ట్స్ బైక్ల ధరకు ఇంచుమించు సమానంగా ఉంది.
ఫ్యామిలీ
వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్లో టాపర్గా..!
మురికివాడల్లో పెరిగే నిరుపేద బాలబాలికల్లో అపారమైనే తెలివితేటలు ఉంటాయనేందుకు మరో నిదర్శనం ఇది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో బతుకుతూ..ఊహకే అందని విధంగా బోర్డు ఎగ్జామ్లో టాపర్గా నిలవడం మామాలు విషయం కాదు కదా. బహుశా ఈ అమ్మాయి భవిష్యత్తులో మరో స్లమ్డాగ్ మిలియనీర్గా అవతరిస్తుందేమో..!. ఇంతకీ ఎవరా ఆ అమ్మాయ్ అంటే..బోఫాల్లోని భీమ్ నగర్ అనే ఒక మురికవాడకు చెందిన అమ్మాయి 18 ఏళ్ల చాందిని విశ్వకర్మ. మధ్యప్రదేశ్ బోర్డు ఎగ్జామ్2026లో కామర్స్ విభాగంలో ఆమెకు వచ్చిన మార్కులు తెలిస్తే విస్తుపోతారు. ఆ అమ్మాయి మురికివాడలకు చెందిందేనా అనే అనుమానం వస్తుంది. కటిక దారిద్య్రం మధ్య కష్టపడి చదివి విజయం సాధించిన ఆమె కథ ప్రతిఒక్కరికి స్ఫూర్తి. చాందిని తండ్రి రోజువారీ కూలీ. వడ్రంగి పనిచేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సంపాదన అరకొరగానే సరిపోతుంది ఇంటికి. చెప్పాలంటే కొద్దిపాటి అవసరాలకు కూడా అక్కరకు రాదు అతడి సంపాదన. ఇంట్లో ఇంతటి ఆర్థిక బాధలు ఉన్నా.. చదువుపైనే అచంచలంగా దృష్టి సారించింది. ఇంటర్లో విద్యార్థులంతా వివిధ కోచింగ్ సెంటర్లు, ఇతర వనరులపై ఆధారపడగా, ఆమె మాత్రం నిరుపేద పిల్లల కోసం ఉద్దేశించిన ఉచిత పాఠశాల అయిన గురుదేవగుప్త శిక్షా కేంద్రం చదువుకుంది. ఆమె అధ్వాన్నమైన జీవన పరిస్థితులు కారణంగా మిణుకుమిణుకుమనే వీధి దీపాలు, దోమల బెడద మధ్య అహర్నిశలు కష్టపడి చదివింది. ఆ కష్టమే ఆమెను మధ్యప్రదేశ్ ఇంటర్ బోర్డు ఎగ్జామ్లో 98.8% మార్కులతో టాపర్గా నిలిచేలా చేసింది. ఆమె కామర్స్ విభాగంలో 500 మార్కులకు 494 మార్కులతో (98.8%) అసాధారణమైన స్కోరు సాధించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె గెలుపు అసాధారణమైనది. పెద్దపెద్ద కాలేజీల్లో చదువుకునే విద్యార్థులందర్ని వెనక్కి నెట్టి మూరిక వాడల నేపథ్యం నుంచి వచ్చిన నిరుపేద అమ్మాయి అగ్రస్థానంలో నిలవడం మాటలకందని విజయం కదూ..!.(చదవండి: ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్గా..!)
చిన్నారులకు ఆ చిరుతిండ్లు వద్దు..!
ఇటీవల చిన్నపిల్లల వైద్యుల వద్ద కేసులు పెరుగుతున్నాయి. కడుపు నొప్పి, వాంతులు ఇతర అనారోగ్య కారణాలతో చిన్నారులను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్తున్నారు. దీనికి చిన్నారులకు ఇస్తున్న ఆహారంలో మార్పులే కారణంగా చెప్పవచ్చు. ఒకప్పుడు చిన్న పిల్లలు మారాం చేస్తే.. ఇంట్లో ఉండే బెల్లం లేదా తయారు చేసుకునే సాంప్రదాయ చిరుతిళ్లను ఇచ్చేవారు. వీటి వలన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. అయితే కాల క్రమేణ ప్రస్తుతం మార్కెట్లోకి జంక్ ఫుడ్ విస్తరించింది. చిన్నారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ప్యాకింగ్లతో పాటు వారి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలతో ఈ జంక్ ఫుడ్ ప్రభావం మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు పాకింది. వీటి వలన చిన్నారుల ఆరోగ్య, మానసిక వికాసం పూర్తిగా నాశనమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్కలి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదుగుదలకు హానికరం చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్ ఫుడ్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి చిన్నారులకు జంక్ ఫుడ్ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి.అవగాహన కల్పిస్తున్నాం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి జంక్ఫుడ్తో అనారోగ్య సమస్యలు జంక్ ఫుడ్ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్ఫుడ్ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – బీఆర్కే మహారాజ్, చిన్న పిల్లల వైద్యు నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రిసంప్రదాయ ఆహారంతో మేలుచిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. (చదవండి: మామ్ వెయిట్లాస్ జర్నీ..! నో క్రాష్ డైట్, నో స్ట్రిక్ట్ రూల్స్..ఏకంగా 22 కేజీలు..)
అక్షయ తృతీయ దానాలు అంతులేనంతటి ఫలాలు
వైశాఖ మాస శుక్ల పక్ష తదియని అక్షయ తృతీయ (Akshaya Tritiya 2026) అంటారు.. ఇది హైందవ పండుగ లలో విశిష్టమైనది.. విశేషమైనది... ఈ రోజు ఏ పుణ్యకార్యం చేపట్టిన దానధర్మాలు చేసినా, దాని వలన ఫలితం క్షయం కాకుండా ఉంటుంది, అందుకే ఈ పర్వం అక్షయ తృతీయగా ప్రసిద్ధికెక్కింది... 19, ఆదివారం అక్షయ తదియ సందర్భంగా ఆ విశేషాలు... ఒడిస్సాలో పూరి రధా యాత్ర నిర్మాణం ఈ రోజు మొదలు పెడుతారు. సింహచ లం అప్పన్న స్వామి నిజరూప దర్శనం మరియ చందనోత్సవం ఈ రోజే. భక్తులు తండోపతండాలుగా దర్శనంచేసే ఛార్ ధామ్ యాత్రలో కేదారేశ్వరుడు, బద్రీనాధ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరిచిన రోజు. భారతంలో పాండవులు అరణ్యవాసంలో వున్నపుడు, సూర్యదేవుడు ఇచ్చిన అక్షయపాత్ర మహిమలు విన్నాం. క్రోధపూరితం అయిన నరసింహస్వామిని శాంతింప చేయడానికి చందన పూత పూస్తారు. ఈ రోజు సింహాచలంలో చందనోత్సవం జరుగు తుంది.దానధర్మాల మహిమఈ రోజు ఏ వ్రతం అయినా జపం అయినా హోమం అయినా, దానధర్మాలు చేసినా, మరేమైనా పుణ్యకార్యం చేపట్టినా, ఫలితాలు క్షయం లేకుండా అంతం లేకుండా వుంటాయని విశ్వాసం. దానధర్మాలు చేస్తే చేసిన వారికీ నిరంతర సంపద కలుగుతుందని నమ్మకం. వైశాఖ మాసంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వస్త్రాలు, గొడుగు, చెప్పులు, మంచి నీరు, ఆహారం, పళ్ళు ఇవ్వాలని అంటారు. అలా ఇచ్చినందుకు మన ఇంట్లో వాటి కొరత ఉండదని, అక్షయమవుతాయని పెద్దల మాట. వీలైతే గోవు, భూమి, బంగారం వంటివి దానం చేస్తే ఎంతో ఫలం ఉంటుంది.చివరగా....ఈ రోజు ఏం చేసినా అక్షయంగా ఉంటుందనడానికి నిదర్శనాలు జీవనది గంగ. పంచమవేదంగా పరిగణించ బడి ప్రజలలో శాశ్వతంగా పదిలంగా వున్న మహా భారతం. ధనవంతులని కుబేర నామంతో వ్యవహరిస్తారు. అన్నపూర్ణ అవతరణతో అన్నం కొదవలేకుండా ఉండడం, మన తెలుగు రాష్ట్రాలని అన్నపూర్ణ అని అంటారు. ఈ రోజు పాపం చేస్తే ఆ పాపం కూడా అక్షయంగా అంటుకుంటుంది. అందుచేత ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పనులు చేయరాదు. పర్వాలకే పర్వం కృతయుగం వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తదియ నాడే ప్రారంభం అయినట్లు పురాణాలలో ప్రస్తావన... భగీరథుడు గంగకోసం తపస్సు చేసి మెప్పించి తరువాత ఆకాశం నుండి గంగ ఉగ్రరూపంతో ఉరికిన రోజు ఇదే. పరశురాముడు పుట్టినరోజు. వీరశైవ మత వ్యవస్థాపకుడు బసవేశ్వరుడు జన్మించిన రోజు. వేదవ్యాసుడు వినాయకుని చేత మహాభారతం వ్రాయడానికి పూనుకున్న రోజు.కుబేరుని శివుడు ధనాధిపతిగా నియమించిన రోజు. మహాలక్ష్మి విష్ణుమూర్తుల వివాహం జరిగిన రోజు. కుచేలుడిని కృష్ణుడు అను గ్రహించిన రోజు. బ్రహ్మ పుత్రుడు అక్షయడు జన్మించినరోజు. పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్ర అందించిన రోజు. అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు. శంకరాచార్యులు కనక ధారా స్తోత్రం ద్వారా అమ్మవారిని మెప్పించి కటిక దరిద్రురాలైన భక్తురాలి ఇంట్లో కనకవర్షాన్ని కురిపించిన రోజు. – కె. అన్నపూర్ణ
డోంట్ వర్రీ..ప్రశాంతంగా కూర్చోండి..!
ప్రజా రవాణాలలో ఆటో, క్యాబ్లనగానే కాస్త భయం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లేటప్పుడు చాలా భయం ఉంటుంది. నలుగురైదుగురు కలిసి వెళ్తుంటే ఎలాంటి భయం ఆందోళన ఉండదు. కానీ ఈ ఆటో అంకుల్ అలాంటి భయలేం వద్దు అంటూ చక్కగా తన సీటు వెనుక రాసిన సందేశం ఎంతలా ఉందంటే..బ్రో నువ్వు గ్రేట్ అని మెచ్చుకోకుండా ఉండలేరు.అసలేం జరిగిందంటే..ఉన్నతి దేవాలియా అనే మహిళ తన ముంబైలో ఒక ఆటో రైడ్ బుక్ చేసుకున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారామె. ఆ డ్రైవర్ వెనుక సీటుపై ఉన్న సందేశం చూడగానే ప్రజా రవాణాపై ఉన్న అభిప్రాయం మారిపోతుందని పేర్కొంది పోస్ట్లో. ఒక చిన్న సానుభూతి చర్య ఎంతగా ప్రభావితం చేస్తుందో అని చెప్పే ఘటన ఇది అని అంటోందామె. ఇంతకీ ఆ డ్రైవర్ సీటు వెనుకు ఏం ఉందంటే.."నేను కూడా ఒకరి తండ్రిని , సోదరుడిని. మీ భద్రతే నాకు ముఖ్యం. ఎలాంటి ఆందోళన లేకుండా కూర్చోండి. అలాగే ప్రతి వ్యక్తి ప్రమాదకారి కాదు. కొందరు మీకు సురక్షితమైన ఆశ్రయం ఇస్తారని గుర్తించండి." అని రాసి ఉంది. నిజంగా ఆ చిన్న పని ఆ డ్రైవర్ మంచి మనుసుని, ఉదారతను తెలియజేస్తుంది. అందరు అతడిలా ఉంటే బావుండేది కదూ..ఈ రోజు రైడ్లో వెళ్లడం నా రోజుని ఆనందమయంగా మారించి అంటూ తన పోస్ట్ని ముగించింది ఉన్నతి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం ఆడ్రైవర్ని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు.(చదవండి: 'నాన్న'గా గర్వించే క్షణం..! పిల్లల నుంచి ఆశించేది ఇదేకదా..)
అంతర్జాతీయం
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచానికి శుభవార్త అందిస్తూ హర్మూజ్ జలసంధిని ఎట్టకేలకు తెరిచింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్-లెబనాన్ల సీజ్ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఆ దేశాల మధ్య సీజ్ఫైర్ కొనసాగేంతవరకూ హర్మూజ్ తెరిచే ఉంటుందని పేర్కొంది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటనతో నౌకల రాకపోకలు యధావిధిగా కొనసాగనున్నాయి. అదే సమయంలో హర్మూజ్ను తెరిచామన్న ఇరాన్ ప్రకటన అనంతరం చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇక హర్మూజ్ను తెరిచినందుకు ఇరాన్కు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్నిగురువారం రాత్రి(భారత కాలమాన ప్రకారం) ట్రంప్ తెలిపారు. తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయని, ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఇరు దేశాల్లో వినిపించిన బాంబుల మోతలకు ముగింపు పలకనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానంగా లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆఊన్తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఫోన్ చేసి చర్చలు జరిపారు. అయితే ఇది సత్పలితాన్ని ఇచ్చింది. శత్రుదేశమైన ఇజ్రాయెల్ ముందస్తు హామీ ఇస్తే తాము కాల్పుల విరమణకు కట్టుబడతామని స్పష్టం చేశారు. దాంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ఒప్పించారు ట్రంప్. నెతన్యాహూ కూడా ఓకే అనండంతో 10 రోజుల యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు. మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు జరగ్గా, తాజాగా వారి మధ్య చర్చలు జరగడం అవి సత్ఫలితాల్ని ఇవ్వడం గమనార్హం.
USAలో ఇమ్మిగ్రేషన్ ఆగడాలు.. భారత మహిళ అరెస్ట్
ప్రపంచాన్ని ఓ వైపు యుద్ధం కుదిపేస్తుంటే అమెరికాలో మాత్రం ఇమ్మిగ్రేషన్ నిబంధనల పేరుతో అధికారులు ఆగడాలు ఏంతమాత్రం ఆగడం లేదు. అమెరికాలో 35 ఏళ్లుగా నివాసముంటున్న భారత్కు చెందిన ఒక మహిళను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.మీనూ బాత్రా అనే 53 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ వేరే ప్రాంతానికి ప్రయాణం కోసం మార్చి 17 న హర్గింగన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తన విమానం కోసం ఎయిర్పోర్టు వద్ద ఎదురుచూస్తుండగా హఠాత్తుగా ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు వచ్చి తన చేతికి సంకెళ్లు వేసి తనను అరెస్టు చేశారు. అనంతరం రేమండ్ విల్లాలోని డిటెన్షన్ సెంటర్కు తరలించారు. తనకు చట్టపరమైన పరిమితి ఉందని ఎంత వాదించినా వారు పట్టించుకొనే యత్నం చేయలేదు.అయితే దీనిపై మీనూ బాట్రా స్పందించారు. " నన్ను ఒక ఖైదీలా చూశారు. ఆ సమయంలో నాకు ఏం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విచారణ సమయంలో 24 గంటలపాటు ఎటువంటి ఆహారం ఇవ్వలేదు. కనీసం మంచినీరు కూడా అందించలేదు. అరెస్టు తర్వాత తనను చేతులు వెనక్కి పెట్టి బేడీలు వేసినట్లు కనిపించేలా ఫోటోలు తీయించుకోవాలని అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో నేను చాలా అవమానానికి గురయ్యాను, నన్ను ఒక నేరస్థురాలిలా ట్రీట్ చేశారు" అని ఆమె మీడియా ఎదుట వాపోయారు.దీంతో బాత్రా అనే మహిళ తన అరెస్టును సవాలు చేస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు మొదటి 24 గంటల పాటు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా నిర్బంధించారని, కనీసం తన మందులను కూడా ఇవ్వడానికి నిరాకరించారని పిటిషన్లో పేర్కొన్నారు.కాగా బాత్రా 35 ఏళ్లకు పైగా అమెరికాలో నివసిస్తున్నారు. టెక్సాస్లో పంజాబీ, హిందీ మరియు ఉర్దూ భాషలకు గుర్తింపు పొందిన ఏకైక కోర్టు ఇంటర్ప్రెటర్గా (అనువాదకురాలిగా) ఇమ్మిగ్రేషన్ కోర్టులో కొన్నేళ్లుగా వందలాది మందికి సహాయం చేశారు. ఇలాంటి గుర్తింపు ఉన్న వ్యక్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడ అరెస్టు చేస్తే సాదారణ వ్యక్తుల పరిస్థితి ఏంటని అక్కడి భారతీయులు ఆందోళన చెందుతున్నారు.
నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆరోగ్య రంగంలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఊబకాయం (Obesity) తగ్గించుకోవడానికి ఇంజెక్షన్లతో పనిలేకుండా, రోజూ ఒక మాత్ర వేసుకుంటే సరిపోయే 'ఫౌండాయో' (Foundayo - orforglipron) అనే ఔషధానికి యూఏఈ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ప్రముఖ ఫార్మా కంపెనీ 'ఎలీ లిల్లీ' (Eli Lilly) దీనిని అభివృద్ధి చేసింది. ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో, ఇంజెక్షన్ల ద్వారా బరువు తగ్గించే చికిత్సలకు సూది అవసరం లేని ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టిన ప్రపంచంలోని మొదటి దేశాలలో యూఏఈ ఒకటిగా నిలిచింది.ఫౌండాయో ప్రత్యేకతలుటైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లతో సహా తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఊబకాయం ముడిపడి ఉన్న తరుణంలో ఈ ఆమోదం లభించింది.ఇప్పటివరకు బరువును తగ్గించుకునే చికిత్సలో ఇంజెక్షన్లను తీసుకోవాల్సి వచ్చేది. ఇపుడిక సూదితో పనిలేకుండానే బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి వాడే 'GLP-1' మందులు ఇంజెక్షన్ల రూపంలో ఉండేది. కానీ ఫౌండాయో అనేది నోటి ద్వారా తీసుకునే మాత్ర. సులభమైన పద్ధతి కూడా. ఈ మాత్రను భోజనంతో సంబంధం లేకుండా రోజుకు ఒకసారి వేసుకోవచ్చు. ఇది రోగులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఈ మాత్రకు USFDA ఆమోధం లభించింది. ప్రయోగాల్లో ఇది 15శాతం వరకు బరువు తగ్గినట్టు తేలింది. ఎలా పని చేస్తుంది?ఇది శరీరంలోని ఆకలిని నియంత్రించే హార్మోన్లలా పనిచేస్తుంది. దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, ఆకలి తగ్గుతుంది, తద్వారా తక్కువ కేలరీలు తీసుకుంటారు. ఈ మాత్ర అందరికీ అందుబాటులో ఉండదు. ఇది సాధారణ లేదా సౌందర్య ఉపయోగం కోసం ఉద్దేశించినది కాదు. కేవలం వైద్యుని సిఫార్సుతో, కఠినమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే లభిస్తుంది. యూఏఈ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఈ మందును సిఫార్సు చేసే ముందు స్పష్టమైన అర్హత మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.యూఏఈలోని ఫార్మసీలలో మే 2026 నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరు వాడకూడదు. చికిత్స ప్రారంభించే ముందు రక్త పరీక్షలు మరియు మెటబాలిక్ స్క్రీనింగ్ తప్పనిసరి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 పైన ఉన్నవారు లేదా BMI 27 ఉండి రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు దీనికి అర్హులు.ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్యఫలితాలు, సైడ్ ఎఫెక్ట్స్ క్లినికల్ ట్రయల్స్ ప్రకారం, ఈ మాత్ర వాడిన వారు 72 వారాల కాలంలో సగటున 12.4% బరువు (సుమారు 12 కిలోలు) తగ్గినట్లు తేలింది. బరువుతో పాటు కొలెస్ట్రాల్ , రక్తపోటు కూడా తగ్గుతాయి. ప్రారంభ దశలో వికారం, జీర్ణక్రియ సమస్యలు ఉండవచ్చు. అందుకే వైద్యుల పర్యవేక్షణ అవసరం.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిధర ఎంత? యూఏఈలో దీని అధికారిక ధర ఇంకా ఖరారు కాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని కవర్ చేస్తాయనే దానిపై ధరను నియంత్రించవచ్చు. మరో బరువు తగ్గే ఔషం Novo Nordiskతో పోటీగా దీని ధర నెలకు సుమారు 149 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్నోట్ : బరువు తగ్గడం అనే ప్రక్రియ షార్ట్కట్లతో కాదు. కచ్చితమైన వ్యాయామం, ఆహార నియమాలు అవసరం. అలాగే వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు,కొన్ని రకాల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఇలాంటి మందులను వాడకూడదని గమనించాలి.
హార్ముజ్ దిగ్బంధం వేళ.. యూఎస్ సంచలన వీడియో విడుదల
ఇరాన్ నౌకాశ్రయాలు, తీరప్రాంతాలు లక్ష్యంగా తాము చేపట్టిన దిగ్బంధం (Blockade) కార్యకలాపాలలో భాగంగా ఓ వాణిజ్య నౌకను అమెరికా నావికాదళ హెలికాప్టర్ పక్కకు మళ్లించిన దృశ్యాలను అమెరికా సైన్యం విడుదల చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ షేర్ చేసిన ఈ వీడియోలో యూఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ (DDG 112) నౌకలోని ఒక నావికుడి ఆడియో సందేశం ఉంది. ఒమన్ గల్ఫ్ మీదుగా ఆ డిస్ట్రాయర్ నౌకకు చెందిన హెలికాప్టర్ ఎగురుతున్నట్లు ఈ ఫుటేజీలో కనిపిస్తోంది.ఇరాన్ నౌకాశ్రయాల్లోకి రాకపోకలు సాగించే నౌకలపై ఆంక్షలను అమలు చేస్తున్న క్రమంలో అమెరికా దళాలు ఓ వాణిజ్య నౌకను నియంత్రిస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. కాగా, 10 వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హార్ముజ్ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’ అని అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ప్రకటించారు.Audio🔊of a Sailor aboard USS Michael Murphy (DDG 112), with video from the guided-missile destroyer’s embarked helicopter flying over the Gulf of Oman, as the U.S. Navy diverts a merchant vessel while enforcing the blockade on ships entering or departing Iranian ports. U.S.… pic.twitter.com/10QxlEoGkk— U.S. Central Command (@CENTCOM) April 16, 2026హార్మూజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు.
జాతీయం
దక్షిణాది ప్రాతినిధ్యానికి కోత దేశద్రోహమే: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేవలం అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ నిజానికి దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్ర. ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’’అంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగ (131వ) సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ సుదీర్ఘంగా మాట్లాడారు. సవరణ బిల్లును ‘చాలా ప్రమాదకరమైనది’గా అభివర్ణించారు. ‘‘మోదీ సర్కారు పూనుకున్న ఈ దేశ వ్యతిరేక చర్యకు విపక్షాలు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. సవరణ బిల్లును ఓడించి తీరతాయి’’అని పేర్కొన్నారు. అది ఆమోదం పొందదని బీజేపీకి కూడా తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ తీరును ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఎండగట్టారు. దళితులు, ఓబీసీలకు అన్యాయం కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని రాహుల్ కొట్టిపారేశారు. ‘‘నిజమైన మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని పదేళ్ల తర్వాత అమలు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇది కేవలం మహిళల మాటున దాక్కుని దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు చేసిన సిగ్గుమాలిన చర్య! జమ్మూకశ్మీర్లో, అస్సాంలో బీజేపీ ఇదే పని చేసింది. దాన్నిప్పుడు దేశమంతటా అమలు చేసే పనిలో పడింది. వారికి దమ్ముంటే పాత బిల్లును ఇప్పుడే తేవాలి. దాన్ని ఈ క్షణం నుంచే అమలు చేసేలా విపక్షాలన్నీ మద్దతిస్తాయి’’అని సవాలు చేశారు. ఓబీసీలు, దళితులకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా వారిని అధికారానికి దూరం చేయడమే బీజేపీ ఉద్దేశమని రాహుల్ ఆరోపించారు. అందుకే కులగణనకు ముందే హడావుడిగా బిల్లు తెచ్చిందని ఆక్షేపించారు. ‘‘బీజేపీ నేతలు ఓబీసీలను, దళితులను హిందువులని పిలుస్తారు. కానీ దేశ అధికార నిర్మాణంలో వారికి కనీస స్థానమివ్వరు! కార్పొరేట్ రంగంలో, న్యాయవ్యవస్థలో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మీడియాలో దళితులు, ఓబీసీలు ఎక్కడున్నారు?’’అంటూ నిలదీశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ’మనువాదాన్ని’తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది, ఈశాన్య ప్రజలకు అండగా కాంగ్రెస్ దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని రాహుల్ అన్నారు. ‘‘అక్కడి సోదరసోదరీమణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత సమాఖ్యలో మీరంతా సమాన భాగస్వాములే. లోక్సభలో మీ ప్రాతినిధ్యాన్ని తాకే సాహసం చేయడానికి బీజేపీని అనుమతించబోం’’అని చెప్పారు. ‘‘గతంలో ఇందిరాగాం«దీ, వాజ్పేయి వంటి ప్రధానులు కూడా డీలిమిటేషన్ సవాలును ఎదుర్కొన్నారు. కానీ దానివల్ల దేశానికి జరిగే ప్రమాదాన్ని గుర్తించి వెనక్కి తగ్గారు’’అని ఆయన గుర్తు చేశారు. ‘16’లోనే అంతా దాగుంది! ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఒక పజిల్ ఇచ్చారు. ‘‘నిన్న లోక్సభలో ప్రధాని ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించా. ఆయనలో ఉత్సాహమే లేదు. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కాదని ఆయనకు తెలుసు. అంతలో తేదీ చూసి ఆశ్చర్యపోయా! అది ఏప్రిల్ ‘16’. అసలు మర్మమంతా అందులోనే దాగుంది! మీ సమస్యలన్నింటికీ సమాధానం ‘16’లోనే దొరుకుతుంది. అదేమిటో ఎవరికైనా అర్థమైతే ఎక్స్లో నాకు మెసేజ్ చేయండి’’అంటూ సభికుల్లో ఆసక్తి రేకెత్తించారు. మోదీ ఓ మాంత్రికుడు! ప్రధాని మోదీపై లోక్సభలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనను బాలకోట్, సిందూర్, పెద్ద నోట్ల రద్దు మాంత్రికునిగా అభివర్ణించి సభలో కలకలం రేపారు. ‘‘ఒక బడా వ్యాపారవేత్తతో మోదీ కుమ్మక్కయ్యారు. ఈ మాంత్రికుని చరిత్ర, ప్రధాని అయ్యేదాకా జరిగిన ప్రతి విషయమూ ఆ బడా వ్యాపారవేత్తకు పూర్తిగా తెలుసు. ఆ రహస్యాల సాయంతోనే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కూడా ప్రధానిగా మోదీ రాజీ పడటం వల్లే జరిగాయి’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. అభ్యంతరకర పదాలు వాడినందుకు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రులు రాజ్నాథ్సింగ్, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. బాలాకోట్, సిందూర్ ప్రస్తావనతో సాయుధ దళాలను రాహుల్ అవమానించారని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మోదీకి, నాకు భార్య బాదరబందీ లేదు లోక్సభలో నవ్వులు పూయించిన రాహుల్ మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీని, తనను ఉద్దేశించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరికీ భార్య తాలూకు బాదరబందీ లేదంటూ సభలో నవ్వులు పూయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన సరదా వ్యాఖ్యలు ఇందుకు నేపథ్యమయ్యాయి. ‘‘కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ ఆయన భార్యపై అందమైన కవిత అల్లారు. దాంతో నా భార్య తనకోసం నేనలా కవిత చెప్పలేదని నాపై అలిగింది’’అని రిజిజు చెప్పుకొచ్చారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ‘‘జాతి నిర్మాణంలో మహిళలే ప్రధాన చోదక శక్తి. మగవాళ్లను వాళ్లెంతగానో ప్రభావితం చేస్తారు. తల్లి, సోదరి, భార్య నుంచి ఎంతో నేర్చుకుంటాం. అయితే ప్రధానికి, నాకు భార్య బాదరబందీ లేదనుకోండీ! కాకపోతే తల్లి, సోదరి ఉన్నారు’’అనడంతో సభికులంతా గొల్లున నవ్వారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైనా ఈ సందర్భంగా రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘గురువారం సభలో నా సోదరి ప్రియాంక గొప్పగా ప్రసంగించింది. ఆ క్రమంలో 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేని దాన్ని తను కేవలం ఐదే నిమిషాల్లో చేసి చూపించింది. అదేమిటో తెలుసా? అమిత్ షాను నవ్వించడం!’’అనడంతో సభంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయింది. ఏమిటా ‘16 పజిల్’? లోక్సభలో ప్రసంగం సందర్భంగా రాహుల్ పేర్కొన్న ‘16 పజిల్’ఏమై ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు మర్మమంతా 16 సంఖ్యలోనే దాగుందని, అదేమిటో ఎవరికైనా అర్థమైతే చెప్పాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు తెర తీశాయి. బహుశా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 16 మంది టీడీపీ లోక్సభ సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారన్నది ఆయన ఉద్దేశం కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. 16 సంఖ్య ‘ఎప్స్టీన్’లా ధ్వనిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేసింది. తద్వారా, ఆ సెక్స్ కుంభకోణానికి సంబంధించి విడుదలైన 16 నిమిషాల వీడియో టేప్ను ఉద్దేశించి రాహుల్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని సంకేతమిచ్చింది.
మతాచారాలపైనా న్యాయ సమీక్ష
న్యూఢిల్లీ: మతాచారాలపై కూడా న్యాయ స్థానాలు సమీక్ష చేపట్టవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు తమ వ్యక్తిగత నమ్మకాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు అంతరాత్మ సాక్షిగా, విస్తృత రాజ్యాంగ చట్రాన్ని మాత్రమే మార్గదర్శకంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంతోపాటు వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్, ప్రస్తుత అంశం కేవలం హిందూ ఆచారాలకు లేదా శబరిమలకు సంబంధించింది కాదన్నారు. అన్ని మతాలు, విశ్వాసాలు, మనస్సాక్షికి సంబంధించిన అంశాలను నియంత్రించే రాజ్యాంగ చట్రానికి సంబంధించిందని ధావన్ అన్నారు. సమాజంలో విభేదాలు ఉన్నప్పుడు వాటి మధ్య సామరస్యం సాధించడమే న్యాయస్థానం లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా ఒక మతాన్ని ప్రశ్నించవచ్చు కానీ, అది గౌరవప్రదమైనది, నిజాయతీతో కూడినదై ఉండాలన్నారు. మతాచారాలను సమీక్షకు గురిచేయడం చాలా అయోమయానికి తావిచ్చే అంశమని ధావన్ అభిప్రాయపడ్డారు. శబరిమల ఆచార సంరక్షణ సమితి తరఫున సీనియర్ లాయర్ వి.గిరి వాదనలు వినిపిస్తూ..శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మహిళలను మినహాయించాలన్న ఉమ్మడి వివేకం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రతి ఆలయానికి కొన్ని విశిష్ట ఆచారాలుంటాయని ఆరాధనలో అవి కూడా భాగంగా కొనసాగుతుంటాయని గిరి తెలిపారు. ఇటువంటి వాటన్నిటినీ ఒకే గాటనకట్టి ఆర్టికల్ 25(1) హక్కును ఇవి ఉల్లంఘిస్తున్నాయా, బలపరుస్తున్నాయనా అని చూడటం సరికాదని తెలిపారు. ‘ఆర్టికల్ 25(1) ప్రకారం, నేను అనుసరించే మతాన్ని, అంటే విగ్రహారాధనతో సహా హిందూ మతాన్ని ఆచరించడమే నా ప్రాథమిక హక్కు అని’ పేర్కొన్నారు. అంతకుమునుపు, ఆత్మన్ ట్రస్ట్ తరఫున లాయర్ ఎంఆర్ వెంకటేశన్..‘రుతుస్రావం సమయంలో మహిళలు స్వచ్ఛందంగా దేవాలయాల్లోకి, పూజా మందిరాల్లోకి ప్రవేశించరు. అది క్రమశిక్షణ, విశ్వాసంతో పెనవేసుకుపోయిన ఆచారం. ఇందులో వివక్షకు తావులేదు. దీనికి శాస్త్రీయ వివరణ ఇవ్వలేను. శాస్త్రం ముగిసినప్పుడు నమ్మకం మొదలవుతుంది’అని తెలిపారు. కాగా, ఈ అంశంపై ఐదు రోజులపాటు జరిగిన విచారణ వచ్చే వారం కూడా కొనసాగనుంది.
నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నా యని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. మహిళల హక్కులకు ఎవరు అ డ్డుపడుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళలే వారికి బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల హేతుబద్దీకరణకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అన్ని స్థానాల్లో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండేలా చేయడం డీలిమిటేషన్తో సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన హక్కును ప్రజలకు దక్కకుండా చేసిందని, ఇప్పటికీ అదే పని చేస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తుండగా, విపక్ష ‘ఇండియా’కూటమి మాత్రం వ్యతిరేకిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. కాలానుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగం వీలు కల్పిస్తోందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా వారికి సీట్లను పెంచే నిబంధనలు కూడా ఉన్నాయని తెలిపారు. డీలిమిటేషన్ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ, ఎస్టీల సీట్ల పెంపును కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అమిత్ షా ఇంకా ఏం మాట్లాడారంటే.. పారదర్శకంగా పునర్విభజన ‘‘ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు గల కారణాలపై సభలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. 2026 తర్వాత నిర్వహించే జనగణన అనంతరం జరిగే పునర్విభజనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ‘నారీశక్తి వందన అధినియం’లో పేర్కొన్నాం. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీలిమిటేషన్ను నిలిపివేశారు. నిలిపివేసిన సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా మాత్రమే ‘నారీశక్తి వందన అధినియం’ను అమలు చేయగలం. అందుకే ఈ బిల్లు తీసుకొచ్చాం. 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న లోక్సభ స్థానాలు 127 వరకు ఉన్నాయి. ఇది ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ’అనే సూత్రానికి విరుద్ధం. కొన్నిచోట్ల 45 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉండగా, మరికొన్ని చోట్ల 6 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటు విలువ సమానంగా లేదు. తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఏకంగా 48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క ఎంపీ ఇంత భారీ జనాభా ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరు? ఈ అసమానతలను తొలగించి మహిళా రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలంటే పునర్విభజన అనివార్యం. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లిఖితపూర్వకంగా హామీ ఇస్తాం కుల గణనను ఆలస్యం చేయడానికి ప్రభు త్వం కుట్ర పన్నిందని, అందుకే హడావుడిగా మూడు బిల్లులు తీసుకొచ్చిందన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సభను గంటసేపు వాయిదా వేస్తే ఇప్పుడే ఆ సవరణ చేస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు తావులేదుమతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. ‘ఇండియా’కూటమి బుజ్జగింపు రాజకీయాల కోసమే ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్ను తెరపైకి తెస్తోంది. దేశంలో ఓబీసీలకు అతిపెద్ద వ్యతిరేక పార్టీ కాంగ్రెస్సే. మండల్ కమిషన్ను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. జాతీయ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించిన ఘనత మాదే. మహిళా సాధికారతకు బీజేపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోంది. గ తంలో సుష్మా స్వరాజ్, ఆనందిబెన్ పటేల్ లాంటి వారికి సీఎంలుగా అవకాశం ఇచ్చాం. పీవీని కాంగ్రెస్ సొంత మనిషిగా చూడలేదు దేశంలో మహిళలకు రిజర్వేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రారంభించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదే. 1992లో 72, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి పీవీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. పీవీ కాంగ్రెస్ నేత అయినప్పటికీ, ఆ పార్టీ ఆయనను ఏనాడూ సొంత మనిషిగా అంగీకరించలేదు. ఆయన మరణానంతరం భౌతికకాయానికి అవమానం జరిగింది. కాంగ్రెస్ పీవీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు పీవీ పేరును గర్వంగా చెప్పండి. కాంగ్రెస్ ఆయనను విస్మరించడం శోచనీయం’’అని అమిత్ షా ఆక్షేపించారు.
నారీ.. సారీ
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయింది. ముందునుంచీ ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. శుక్రవారం సాయంత్రం లోక్సభలో చేపట్టిన కీలక ఓటింగ్లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు.బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దానితో పాటుగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టే. సవరణ బిల్లువీగిపోయినంత మాత్రాన నిరాశ చెందబోమని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ, డీఎంకే తదితర పక్షాలు ఎంతటి మహిళా వ్యతిరేకులో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దుయ్యబట్టారు. మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్సభ నియోజకవర్గాలను పెంచుకోవాలన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడిందని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్పుకొచ్చాయి. 2029 లోక్సభ ఎన్నికల్లోనే గాక దేశవ్యాప్తంగా ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ విపక్షాలు మహిళల ఆగ్రహ జ్వాలలను చవిచూడక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. సవరణ బిల్లును విపక్షాలు ఓడించడాన్ని బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం సాయంత్రం లోక్సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ‘మహిళలకు జరిగిన అవమానాన్ని భారత్ సహించబోదు’ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడ్సే, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. విపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల నినాదాలు పార్లమెంటు ప్రత్యేక భేటీ మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టానికి మోదీ సర్కారు కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. రాజ్యాంగ (131వ సవరణ), డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లులను గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, అందుకోసం లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచాలని, అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. మూడు బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును సభ ఓటింగ్కు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు విపక్ష నేత రాహుల్గాంధీ కూడా సభలో ఉన్నారు. బిల్లు వీగిన అనంతరం రిజిజు మాట్లాడుతూ ఇది పూర్తిగా విపక్షాల పాపమేనన్నారు. దేశ మహిళలను గొప్పగా గౌరవించుకునే సువర్ణావకాశాన్ని అవి కోల్పోయాయంటూ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి. దేశ మహిళలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు’’ అంటూ దుయ్యబట్టారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేదాకా తమ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి చెప్పారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లును ఓడించి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు సంబరాలు చేసుకోవడం దారుణమని అమిత్ షా ఆక్షేపించారు. మహిళల పట్ల వారి వివక్షకు ఇది అద్దం పట్టిందన్నారు. రాజ్యాంగంపై మోదీ సర్కారు తలపెట్టిన దాడిని మాత్రమే తాము ఓడించామని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. ఎన్డీఏకు ‘ఐదు’ అదనం ‘ఇండియా’కు 3 తక్కువ మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీల్లో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి.
ఎన్ఆర్ఐ
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు)
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.
క్రైమ్
తీర్థయాత్ర విషాదాంతం ఆరుగురు సజీవ దహనం
రాయచూరు రూరల్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీర్థయాత్ర విషాదాంతమైంది. ఆరుగురు సజీవదహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో జాతీయ రహదారి– 150పై శాంతాపుర వద్ద బెంగళూరు నుంచి కలబుర్గికి వెళుతున్న ప్రైవేట్ బస్సు, కలబుర్గి నుంచి లింగసుగూరు వైపు వస్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులందరూ కిందకు దిగారు. ప్రమాద తీవ్రతకు కారు డోర్లు తెరచుకోకపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణికులు బయటికి రాలేక సజీవ దహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా రాయచూరు జిల్లా సిరవారకు చెందిన పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణానాయక్ కుటుంబ సభ్యులు.తిరుగు ప్రయాణంలో దుర్ఘటనఅమావాస్య కావడంతో శుక్రవారం సురపురలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఉదయాన్నే 6.30 గంటలకు రాయచూరు జిల్లా సిరవార నుంచి పట్టణ పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణా నాయక్ కుటుంబం కారులో బయలుదేరింది. స్వామిని దర్శించుకుని 10.45 గంటలకు తిరుగు ప్రయాణమైన కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో కృష్ణా నాయక్(52), ఆయన భార్య అనంతకళ(45), కుటుంబ సభ్యులు శరణప్ప (36), నిసర్గ (30), సిద్ధార్థ(3), శశికళ(30) మరణించారు. కారుడోర్లు తెరుచుకోకపోవడంతో సజీవదహనమయ్యారు. వెనకవైపు కూర్చున్న పిల్లలు అద్విక, శ్రీనిధిని అటుగా వెళ్లేవారు అద్దాలు పగలగొట్టి బయటకు లాగారు. అయినా అప్పటికే పిల్లలిద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం యాదగిరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్ తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది సురక్షితంగా బయట పడగా, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మంటల్లో కారు, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని సురపుర ఎమ్మెల్యే వేణుగోపాల నాయక్ పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. కృష్ణా నాయక్తో పాటు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందడంపై రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, బసనగౌడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
టీసీఎస్ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యం
సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ బ్రాంచ్లో వెలుగుచూసిన మత మార్పిడి కేసులో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితుల మొబైల్ ఫోన్ల నుండి లభించిన రెండేళ్ల నాటి ఒక ఫోటో ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. బాధితులను ఒక క్రమపద్ధతిలో మతమార్పిడికి ఎలా ప్రలోభ పెట్టారో, ఆకర్షించారో ఈ చిత్రం ఒక అరుదైన సాక్ష్యమని, కొనసాగుతున్న దర్యాప్తులో కీలకమైన కొత్త కోణాన్ని తెరిచిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.సాక్ష్యంగా ఫోటోతనిఖీల్లో భాగంగా పోలీసులకు లభించిన ఒక ఫోటోలో, ఈ కేసులో ప్రధాన నిందితుడైన తౌసిఫ్ అత్తార్ పక్కన తెల్లటి టోపీ ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. మొదట్లో అతను మరో నిందితుడని పోలీసులు భావించారు. కానీ అత్తార్ను మరింత విచారించగా, అప్పటికే మత మార్పిడికి గురైన, టీసీఎస్కు చెందిన సహోద్యోగి గోపాల్ (పేరు మార్పు) అని తేలింది. మత మార్పిడి తర్వాత అతను తన పేరును 'గుల్షన్'గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలో బాధితుడు దుస్తులు మార్చుకుని, మతపరమైన ఆచారాలలో పాల్గొంటున్నట్లు కనిపిస్తోందని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.బాధితుడు చెప్పిన సంచలన విషయాలుపోలీసులు సదరు బాధితుడిని విచారించగా, అతన్ని ఎలా ప్రలోభపెట్టారో వివరిస్తూ సంచలన విషయాలు వెల్లడించాడు. 2023 మార్చిలో బాధితుడి తండ్రికి పక్షవాతం రావడంతో అతను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండవాడు. తోటి ఉద్యోగులు అతని పరిస్థితిని ఆసరాగా చేసుకుని మతం గురించి ప్రబోధించడం మొదలు పెట్టారు. బాధితుడి సొంత మతం సరైనది కాదని, వారి మత పద్ధతులను పాటిస్తేనే సమస్యలు తీరుతాయని నమ్మబలికారు. ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్ఇందుకు సంబంధించి అనేక వీడియోలను కూడా అతనికి పంపారు. మత గ్రంథాలను పఠించడంతో సహా కొత్త ఆచారాలను పాటించేలా వారిని క్రమంగా ప్రేరేపించారు. మతం మారమని, పేరు మార్చుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. బాధితుడు వ్యతిరేకించినా, బలవంతంగా కొన్ని మతపరమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ఆచారాలు చేయించారని సమాచారం. బాధితుడి మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అతని కుటుంబ సభ్యుల భద్రతపై కూడా భయాందోళనలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిఈ ఫోటో బాధితుడి వాంగ్మూలం ద్వారా, వర్క్ప్లేస్లో ఉద్యోగులను ఎలా టార్గెట్ చేస్తున్నారు, క్రమ పద్ధతిలో మత మార్పిడికి పాల్పడుతున్నారో అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. నిందితుల ఫోన్ల నుండి సేకరించిన డిజిటల్ సాక్ష్యాలు, వీడియోలు సందేశాలను పోలీసులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం
సోషల్ మీడియా పరిచయం.. మహిళపై ఎస్ఐ లైంగిక దాడి
సాక్షి, హనుమకొండ: సమాజంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ ఎస్ఐ.. మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో, సదరు ఎస్ఐపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఐ శ్రీకాంత్ కరీంనగర్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్కు 2025 సంవత్సరంలో ఫేస్బుక్ ద్వారా వరంగల్కు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో, వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో సదరు మహిళ వ్యక్తిగత విషయాలను తెలుసుకున్న ఎస్ఐ.. ఆమె ఒంటరిగా నివసిస్తున్న విషయాన్ని గ్రహించాడు. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకొని.. ఎలాగైనా లొంగ తీసుకోవాలని ఎస్ఐ ప్లాన్ చేశాడు.ఇటీవల శ్రీకాంత్ వరంగల్కు వచ్చి.. బాధితురాలికి ఫోన్ చేశాడు. ఈ క్రమంలో ఆమె లొకేషన్ అడిగి తెలుసుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమె ఇంటికి వెళ్లిన శ్రీకాంత్.. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించినా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అధికారంతో పాటు బలాన్ని ఉపయోగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం, బాధితురాలు ధైర్యం చేసి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు.. ఎస్ఐ శ్రీకాంత్పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఒక పోలీస్ అధికారిపైనే లైంగిక దాడి కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఎస్ఐ శ్రీకాంత్పై అంతకుముందు కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇసుక వివాదంలో శ్రీకాంత్ సస్పెండ్ అయ్యారు. ఈనెల రెండో తేదీనే శ్రీకాంత్ జమ్మికుంట ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఇలా బాధ్యతలు చేపట్టిన 16 రోజులకే శ్రీకాంత్పై లైంగిక దాడి కేసు నమోదు కావడం గమనార్హం.
ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య
వాషింగ్టన్ : వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్ఫాక్స్ (Justin Fairfax) (47)హత్య, ఆత్మహత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు, మితిమీరిన మద్యం, ఆర్థిక సమస్యలు, మరోవైపు భార్యతో మనస్పర్థలు, విడాకుల కేసుతో నిరాశకు లోనైన ఫాక్స్ గురువారం తెల్లవారు జామున భార్యను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వాషింగ్టన్ శివారులోని అన్నేన్డేల్లో ఉన్న వారి నివాసంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. డెమొక్రటిక్ పార్టీలో ఒకప్పుడు స్టార్గా వెలిగిన జస్టిన్ ఫెయిర్ఫ్యాక్స్ ఈ దారుణానికి పాల్పడ్డారు. తన భార్య, డెంటల్ డాక్టర్ సెరినా ఫెయిర్ఫ్యాక్స్ను (49) కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.పోలీసులు అందించిన వివరాల ప్రకారం, హత్య-ఆత్మహత్య జరిగిన సమయంలో ఆ దంపతుల ఇద్దరు టీనేజ్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నేలపై రక్తసిక్తమైన మృతదేహం పడి ఉండటాన్ని చూసిన వారి 16 ఏళ్ల కుమారుడు, కాల్పుల గురించి తెలియజేయడానికి 911కి ఫోన్ చేశాడు. దీనికి సంబంధించి హృదయవిదారక ఆడియో వైరల్గా మారింది. ఇంట్లోని బేస్మెంట్లో తన భార్యను కాల్చి చంపి, అనంతరం పై అంతస్తులోని బెడ్రూమ్లోకి వెళ్లి తన ప్రాణాలు తీసుకున్నారు.జస్టిన్ సెరినా గతేడాది విడాకులకు దరఖాస్తు చేశారు. వచ్చే వారం కోర్టు విచారణలో జైలు శిక్ష, కుటుంబ ఇంటి నుండి బహిష్కరణను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా బాధ్యతారహితమైన ప్రవర్తన ఫలితంగా, ఏప్రిల్ 30 లోగా ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని జస్టిన్ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ అవమానభారంతోనే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి జస్టిన్ ఫెయిర్ఫ్యాక్స్ పతనం2019లో జస్టిన్ ఫెయిర్ఫ్యాక్స్పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక ఆరోపణలు చేయడంతో ఉన్నతమైన అతని జీవితం క్రమంగా పతనంలోకి జారీ పోయింది. లెఫ్టినెంట్ గవర్నర్గా ఉంటూ, గవర్నర్ పదవికి పోటీ చేయాలని చూస్తున్న అతని రాజకీయభవిష్యత్తును ప్రభావితం చేసింది. మానసిక ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత, 2022లో ఆయన పదవినుండి వైదొలగడంతో కుటుంబానికి మరింత దూరమయ్యారు. దీంతో తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి జారుకోవడంతోపాటు, మద్యానికి బానిసయ్యారు. ఎంతలా అంటే తనను తాను హోమ్ ఆఫీస్లో బంధించుకునేవాడు. అక్కడ ఖాళీ వైన్ సీసాలు, చెత్త, మురికి బట్టల కుప్పల మధ్య దయనీయమైన స్థితిలో నివసించేవాడు. కేవలం ఆహారం, సిగరెట్ల కోసం మాత్రమే బయటకు వచ్చేవాడట.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా ఆయన వృత్తి జీవితం చిన్నాభిన్నం చేశాయి. 2022లో తన పిల్లల గుర్రపు స్వారీ పాఠాల కోసం ఉద్దేశించిన డబ్బును దొంగిలించి ఒక హ్యాండ్గన్ కొన్నాడని, సంచలనాత్మక విడాకుల పత్రాల ద్వారా తెలుస్తోంది.
వీడియోలు
మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR
అంబటి రాంబాబు నిరాహార దీక్ష
ఇరాన్ గుడ్ న్యూస్.. తెరుచుకున్న హార్ముజ్
దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై YS జగన్ సంచలన పోస్ట్
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. వరుదు కళ్యాణి రియాక్షన్
మోదీకి బిగ్ షాక్.. పార్లమెంట్ లో ఎదురుదెబ్బ..
జనగణన పూర్తి కాకుండానే డీలిమిటేషన్ బిల్లు.. దక్షిణాదికి జరిగే నష్టం ఇదే!
కూకట్ పల్లిలో ఘోర బస్సు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు
గెలవదని తెలిసే బిల్లు విషయంలో ముందుకెళ్లారా?
బట్టతల రాదు నాది గ్యారెంటీ వైరల్ డాక్టర్ చిట్కాలు



