పవన్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె వెన్నెల స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే. తెలంగాణ గడ్డ ఈరోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు. తెలంగాణ గడ్డ ముమ్మాటికీ మా జాగీరే. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం’’ అని వెన్నెల పేర్కొన్నారు.‘‘ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం కానీ ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్కౌంటర్ చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు’’ అని వెన్నెల అన్నారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై.. గద్దర్ కూతురు వెన్నెల .. pic.twitter.com/oSdScmlfm5— Prabhakar Venavanka (@Prabhavenavanka) June 3, 2026ఆ రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?: కేటీఆర్కాగా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరే. పవన్ కల్యాణ్ను ఎవరు అడ్డుకున్నారు?. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది?. 2023లో జనసేన పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?. జాతీయ వాదంపై ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవు: పొన్నంకాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న(మంగళవారం) పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కల్యాణ్కు లేదని, వెంటనే గద్దర్ ఆత్మకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.12 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ను పాకిస్తాన్లా చిత్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.
ప్రముఖ తెలుగు యూట్యూబర్ నందు కుటుంబంపై కేసు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వరప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్లో మోసం చేశారంటూ వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్లో ఉన్న ఫేమ్ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.కేసు నమోదు బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన, గుంటూరులో నివసించే మధుకర్ తండ్రిపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఇబ్రహీంపట్నం ఎస్ఐ బీ. రాజు తెలిపారు.నందూస్ వరల్డ్ యూట్యూబ్ ప్రయాణం నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన నందన, తన భర్త మధుకర్, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేసేవారు. ఒకానొక దశలో తినడానికి తిండిలేక పస్తులున్నామని, మగ గొంతు కారణంగా పలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ వీడియోలు చేస్తూ వచ్చారు. ఆ వీడియోలు ప్రేక్షకాదరణ పొందాయి. యూట్యూబ్ ఆదాయంతో పాటు సినీమా అవకాశాలు కూడా దక్కాయి. నందన తన తొలి సినిమా మన శంకర వర ప్రసాద్లో హీరోయిన్ నయనతార స్నేహితురాలు పాత్రలో కనిపించారు. ఒక్క సన్నివేశమే అయినా ఆమెకు గుర్తింపు వచ్చింది. తరువాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు సమాచారం.ఆరోపణల్ని ఖండించిన నందన తనపై వస్తున్న ఆరోపణలను నందన ఖండించారు. ప్రజల్లో, సోషల్ మీడియాలో తమకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేక పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వీడియో విడుదల చేశారు. యూకే నుంచి భారత్కు వచ్చిన కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. తమకు సంబంధించిన ఏ విషయమైనా తామే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పారు.
నైరుతి రుతుపవనాలపై కీలక ప్రకటన
సాక్షి, విశాఖపట్నం: రేపు(గురువారం) కేరళ తీరాన్ని నైరుతీ రుతుపవనాలు తాకుతాయని.. 5 తేదీన రాయలసీమలో ప్రవేశిస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. పదో తేదీకి దక్షిణ కోస్తా అంతటా విస్తరిస్తాయని తావరణ శాఖ అధికారి జగన్నాథ్కుమార్ తెలిపారు. జూన్ 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం రుతుపవనాలు విస్తరించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.వారం రోజులపాటు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలే ఉంటాయని మరో ఐదు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏడాది ఎండలు బాగా కాశాయి కాబట్టి వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్పలేమని.. కాసిన ఎండలు, వర్షాలకు సంబంధం ఉండదని జగన్నాథ్కుమార్ వివరించారు.ఇప్పటికే కేరళంలో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. కేరళం, తమిళనాడు మీదగా ఏపీలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. కావలిలో 42.6 డిగ్రీలు అత్యధిక ఉష్ట్రోగ్రతలు నమోదైంది. తీరం వెంబడి బలమైన గాలులు, భీమిలిలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. పిడుగుపాటు హెచ్చరికరాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 50-60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ క్రింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు ఆదేశాలతో..
సాక్షి,న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) రాయాలి. కోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలని స్పష్టంగా చెప్పింది. అంటే, ఏడాదికి కనీసం రెండు సార్లు టెట్ తప్పనిసరిగా జరుగుతుంది. అదనంగా, ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా మరో రెండు అవకాశాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఈ గడువు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఆ లోపు టెట్ పాస్ కావడం తప్పనిసరి.టెట్లో ఫెయిల్ అయితే ఉపాధ్యాయులకు తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఉద్యోగం కొనసాగించలేరు, అలాగే ప్రమోషన్లు పొందలేరు. కోర్టు స్పష్టంగా తెలిపినట్లుగా, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలి. ఫెయిల్ అయినా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్ష నిర్వహించబడుతుండటంతో, మరోసారి రాసే అవకాశం ఉంటుంది. కానీ గడువు ముగిసేలోపు పాస్ కాకపోతే, ఉద్యోగం కోల్పోయే ప్రమాదం తప్పదు.ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా వేలాది ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాయాల్సి ఉంటుంది. విద్యా ప్రమాణాలను పెంచడం, నాణ్యమైన బోధన అందించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఇకపై మరిన్ని పొడిగింపులు ఇవ్వబోమని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ నిర్వహణలో పారదర్శకత పాటించి, ఉపాధ్యాయులకు సమయానికి పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది.
పెద్ది రిలీజ్ వేళ.. శ్రీవారి సేవలో బుచ్చిబాబు ఫ్యామిలీ
ధనవంతుల రహస్యం చెప్పిన కియోసాకి
ఓటీటీకి డకాయిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
బెంగాల్ రాజకీయాల్లో భూకంపం సృష్టించిన రితబ్రత బెనర్జీ ఎవరు?
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర: ఆర్కే రోజా
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
బిగ్షాక్.. ప్రతిపక్ష హోదా కోల్పోయిన మమతా బెనర్జీ
ఆత్మకూరులో బరితెగించిన పచ్చమూకలు
అమెరికాలో కారు ప్రమాదం.. మధు యాష్కీ సతీమణికి తీవ్ర గాయాలు
పెద్ది ప్రీమియర్ షో.. ఉపాసన ఏ థియేటర్లో చూడనుందంటే?
కెప్టెన్గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ..!
మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు
కేరళలో ఉండడం మీ అదృష్టం!
.. నేను చెప్పినట్లు అసలు వినడం లేదు!!
ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
మటన్ అడిగితే బీఫ్ పెడతారు
నా కలలు చిదిమేశారు, జీర్ణించుకోలేకపోతున్నా: విఘ్నేశ్
ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు
విండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
మనమూ సాహసం చేస్తున్నాం ‘దేశం పార్టీ’తో
మరింత పడిపోయిన బంగారం.. కొనేవాళ్లకు పండుగే!
విజయ్ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది..!
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది.. ఉద్యోగులకు పదోన్నతులు
నాకు మంత్రి పదవి వద్దు
రిటైర్మెంట్ వయసులో నియామక ఉత్తర్వు
సాక్షి కార్టూన్ 01-06-2026
అవినీతికి సింహస్వప్నం.. ‘లేడీ సింగం’ చిత్రా బదిలీ
కలెక్టర్ మేడం.. దండం పెడుతున్నా..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
పెద్ది రిలీజ్ వేళ.. శ్రీవారి సేవలో బుచ్చిబాబు ఫ్యామిలీ
ధనవంతుల రహస్యం చెప్పిన కియోసాకి
ఓటీటీకి డకాయిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
బెంగాల్ రాజకీయాల్లో భూకంపం సృష్టించిన రితబ్రత బెనర్జీ ఎవరు?
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర: ఆర్కే రోజా
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
బిగ్షాక్.. ప్రతిపక్ష హోదా కోల్పోయిన మమతా బెనర్జీ
ఆత్మకూరులో బరితెగించిన పచ్చమూకలు
అమెరికాలో కారు ప్రమాదం.. మధు యాష్కీ సతీమణికి తీవ్ర గాయాలు
పెద్ది ప్రీమియర్ షో.. ఉపాసన ఏ థియేటర్లో చూడనుందంటే?
కెప్టెన్గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ..!
మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు
కేరళలో ఉండడం మీ అదృష్టం!
.. నేను చెప్పినట్లు అసలు వినడం లేదు!!
ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
మటన్ అడిగితే బీఫ్ పెడతారు
నా కలలు చిదిమేశారు, జీర్ణించుకోలేకపోతున్నా: విఘ్నేశ్
ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు
విండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
మనమూ సాహసం చేస్తున్నాం ‘దేశం పార్టీ’తో
మరింత పడిపోయిన బంగారం.. కొనేవాళ్లకు పండుగే!
విజయ్ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది..!
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది.. ఉద్యోగులకు పదోన్నతులు
నాకు మంత్రి పదవి వద్దు
రిటైర్మెంట్ వయసులో నియామక ఉత్తర్వు
సాక్షి కార్టూన్ 01-06-2026
అవినీతికి సింహస్వప్నం.. ‘లేడీ సింగం’ చిత్రా బదిలీ
కలెక్టర్ మేడం.. దండం పెడుతున్నా..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఫొటోలు
ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు)
చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు)
'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు)
'కాక్టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్...రష్మిక సందడి (ఫొటోలు)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు)
ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు
చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు)
అల్లు స్నేహా.. మే జ్ఞాపకాలు (ఫొటోలు)
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు)
సినిమా
అల్లు అర్జున్- లోకేశ్ మూవీ ఆగిపోయిందా?.. ఇందులో నిజమెంత?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బన్నీ లుక్ తోడేలును తలపించేలా ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ నెగెటివ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగానే బన్నీ మరో సినిమా ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో మూవీని(AA23) చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రంపై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఆగిపోయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ ప్రాసెస్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్కు అల్లు అర్జున్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో లోకేశ్ నిమగ్నమై ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే.
థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహం.. సోషల్ మీడియాలో ట్రోల్స్..!
పెద్ది మూవీ రిలీజ్ వేళ తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే భారీస్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్కు ఒక్క రోజు ముందే థియేటర్లలో పెద్ది పండుగ వాతావరణం నెలకొంది. దీంతో హైదరాబాద్లో నగరంలో ప్రముఖ థియేటర్ల వద్ద అభిమాన హీరో రామ్ చరణ్ కటౌట్స్తో పాటు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని కూకట్పల్లిలో ఉన్న అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అయితే రామ్ చరణ్ విగ్రహం కాస్తా ట్రోలింగ్కు గురైంది. అస్సలు రామ్ చరణ్లా లేదంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామ్ చరణ్లా లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం విమర్శించారు. విగ్రహంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏర్పాటు చేసిన అభిమాన సంఘం తమ పొరపాటుకు క్షమాపణలు చెప్పింది. మేము ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం.. రామ్ చరణ్ విగ్రహంతో మా ప్రేమ, అభిమానం, భక్తిని ప్రత్యేకమైన రీతిలో వ్యక్తపరచాలనుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు అంచనాలను అందుకోలేక విఫలమయ్యాం అని క్లారిటీ ఇచ్చారు.ఆ విగ్రహం టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు జోజు జార్జ్లా ఉందని కొందరు ట్రోల్స్ చేశారు. మరికొందరు నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సూపర్ అన్నా.. ఇంతకీ అది ఎవరి విగ్రహం? అని రాసుకొచ్చారు. రామ్ చరణ్ విగ్రహం చేయడానికి ప్రయత్నించి.. రాహుల్ రామకృష్ణ విగ్రహం తయారు చేశారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా.. శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. We sincerely apologize to everyone. Our intention with the Ram Charan statue was to express our love, admiration, and devotion towards @AlwaysRamCharan in a unique way. Unfortunately, the execution did not meet expectations and turned out to be a misfire.— KUKATPALLYRCFC (@KukatpallyRCFC) June 2, 2026
ముచ్చటగా మూడోసారి.. ప్రియురాలితో అమిర్ ఖాన్ పెళ్లి..!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆరు పదుల వయసులో తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను పెళ్లాడనున్నారు. అయితే ఈ పెళ్లిని చాలా సింపుల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.వచ్చేనెల 5న వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అమిర్ ఖాన్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట ఇటీవలే తమ బంధాన్ని అఫీషియల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వీరిద్దరు ఇప్పటికే తమ పెళ్లికి ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. వీరి పెళ్లికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరయ్యే అవకాశముందని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. ఈ జంట ఇరు కుటుంబాల మద్దతుతోనే పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.కాగా.. ఆమిర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత కిరణ్ రావుతో 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో డేటింగ్లో ఉన్న అమిర్ ఖాన్.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జూలై 5న జరిగిన రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోనున్నారు. గతేడాది ముంబయిలో జరిగిన ఒక బర్త్డే వేడుకల్లో తన ప్రియురాలు గౌరీని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గౌరీ స్ప్రాట్కు ఇప్పటికే క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.
Madhuvidhu: ఈ పెళ్ళి కుదరదు.. ఆ హనిమూన్ అవ్వదు... ఎలా?
పెళ్ళి అనేది కొన్ని కుటుంబాలతో పాటు తరాలను కలుపుతుంది. అందుకే అంటారు మన పెద్ద వాళ్ళు అటు ఏడు తరాలు ఇటు తరాలు చూసి సంబంధం కలుపుకోమని. అలా అనే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో పెళ్ళి సాంప్రదాయాలను పద్ధతిగా పాటిస్తుంటారు. పద్ధతిగానే కాదు కొంతమంది మూర్ఖంగా కూడా పాటిస్తుంటారు. ఆ అంశంతోనే రూపుదిద్దుకున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా మధవిధు.జై విష్ణు, బిబిన్ మోహన్ అందించిన కథకు విష్ణు ఆనంద్ తెర కెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పాలి. మధువిదు సినిమా మొత్తం సరదా సరదాగా సాగిపోతుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.ఆంజిల్ ముట్టిల్ కుటుంబంలో పెద్దవాడైన అమృతరాజ్ ఓ కేప్ నడుపుతూ ఉంటాడు. వయసు పైబడినా ఇంకా అమృతరాజ్ కు పెళ్ళవదు. అందుకే అమృతరాజ్ తన పెళ్ళి కోసం తెగ ఆరాటపడుతూ ఉంటాడు. అమృతరాజ్ ఇంట్లో తమ్ముడితో సహా తన తండ్రి, తాతతోపాటు బాబాయ్ ఉంటారు. అమృతరాజ్ తల్లి చిన్నపుడే చనిపోతుంది. ఒక్క ఆడ దిక్కులేని ఈ కుటుంబానికి ఊళ్ళో వాళ్ళు అనే మాటల వల్ల పెళ్ళి సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. ఆంజిల్ ముట్టిల్ కుటుంబానికి తరతరాల నుండి ఏదో ఆడశాపం ఉందని వినికిడి. దీంతో బాగా దిగాలు పడిన అమృతరాజ్ ఎట్టకేలకు స్నేహ అనే అమ్మాయిని ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి సంబంధం మాట్లాడడానికి అందరితో కలిసి స్నేహ వాళ్లింటికి వెళతారు. పేరుకు అమృతరాజ్ పెళ్ళి చూపులైనా అమృతరాజ్ తండ్రి స్నేహ అత్తను గుర్తుపట్టి, ఇష్టపడి తరువాత ఎవరికీ చెప్పకుండా లేచిపోయి పెళ్ళి చేసుకుంటాడు. ఇక అక్కడి నుండి అమృతరాజ్ వెళ్ళి కథ మళ్ళీ మొదటికొస్తుంది. దీంతో మళ్ళీ అమృతరాజ్ నానా తంటాలు పడుతూ స్నేహ వాళ్ళ నాన్నను పెళ్ళి కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో స్నేహ చెల్లెలు సోఫీ పెళ్ళి ఖాయమవుతుంది. కాని రేపు పెళ్ళి అనగా అబ్బాయి తనకు ఇష్టం లేదని సోఫీ అమృతరాజ్ కి మాత్రం తెలియచేస్తుంది. మరి సోఫీ పెళ్ళి ఆపించి తన పెళ్ళి జరిగేలా అమృతరాజ్ చేయగలడా లేదా అన్నది మాత్రం మధువిధు సినిమాలోనే చూడాలి. అవడడానికి ఇది మళయాళ సినిమా అయినా సోనీలివ్ ఓటిటి వేదికగా తెలుగులోనూ లభ్యమవుతోంది. సినిమా ఆద్యంతం నవ్వులతో సరదాగా సాగిపోతుంది. మస్ట వాచ్ ఫర్ ది వీకెండ్.– హరికృష్ణ ఇంటూరు
క్రీడలు
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్లో మెరిసిన టీమిండియా స్టార్!
టీమిండియా వెటరన్ క్రికెటర్ ఉమేశ్ యాదవ్ చాన్నాళ్ల తర్వాత తన బౌలింగ్తో దర్శనమిచ్చాడు. భారత జట్టులో ఎప్పుడో చోటు కోల్పోయిన ఉమేశ్ ప్రస్తుతం విదర్భ ప్రీమియర్ లీగ్ ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ఈ లీగ్లో నాగ్పూర్ హీరోస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమేశ్ యాదవ్ మంగళవారం ఇండియా వారియర్స్తో మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో ఉమేశ్ యాదవ్ 3 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ వీడియోనూ ఒక అభిమాని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. 'ఎన్ని రోజులకు దర్శనమిచ్చావయ్యా.. నీ బౌలింగ్ చూసి కొన్నేళ్లయింది.. థాంక్యూ ఉమేశ్' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్ టీమిండియా తరఫున 57 టెస్టుల్లో 170 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టీ20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడిన వైభవ్ మొత్తంగా 148 మ్యాచ్ల్లో 144 వికెట్లు పడగొట్టాడు. ధోని సారథ్యంలో 2013 చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియాలో ఉమేశ్ యాదవ్ సభ్యుడిగా ఉన్నాడు. 2015 వన్డే ప్రపంచకప్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉమేశ్ యాదవ్ నిలిచాడు. 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో 310 స్ట్రైక్రేట్తో 10 బంతుల్లోనే 31 పరుగులు చేయడం ఇప్పటికీ ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఉమేశ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన నాగ్పూర్ హీరోస్పై ఇండియన్ వారియర్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (19 బంతుల్లోనే 63 నాటౌట్), శుభమ్ దూబే (33 బంతుల్లో 74 నాటౌట్) మెరిశారు. అనంతరం నాగ్పూర్ హీరోస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్ధేశ్ వత్ (78) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇండియా వారియర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, దర్శన్ నల్కండే, రాహుల్ డోంగర్వార్, గుర్దీప్సింగ్లు తలా రెండు వికెట్లు తీశారు. Saw Umesh Yadav bowling after a long timeFeels NostalgicHe is playing Vidarbha premier league pic.twitter.com/Bp0TwGQez2— Sawai96 (@Aspirant_9457) June 3, 2026చదవండి: వైభవ్ సూర్యవంశీపై పరిశోధనలు!
వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. బిగ్ న్యూస్
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలోనూ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్, త్వరలో శ్రీలంకలో జరుగబోయే ముక్కోణపు టోర్నీకి (భారత-ఏ జట్టుకు) ఎంపికైన విషయం తెలిసిందే. వైభవ్ ఆడనుండటంతో ఈ టోర్నీకి ఊహించని ఆదరణ లభిస్తోంది.దీంతో నిర్వాహకులు (సోనీ నెట్వర్క్) ఈ టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ సోషల్ మీడియా పోస్టులో "The Sooryavanshi Express is coming to light up the stage in a high-octane Tri-series" అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వైభవ్ క్రేజ్కు ఓ సాధారణ టోర్నీ కూడా ప్రత్యక్ష ప్రసారానికి నోచుకుంది.వైభవ్ బ్రాండ్ను వినియోగించుకొని నిర్వహకులు తమ వ్యాపారాభివృద్దికి ప్రయత్నిస్తున్నారు. టీ20 వరల్డ్కప్ 2026 మరియు ఐపీఎల్ ప్రసార హక్కులు కోల్పోయిన సోని నెట్వర్క్, వైభవ్ క్రేజ్ను ఉపయోగించుకొని తిరిగి అభిమానులకు దగ్గర కావాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ టోర్నీపై భారీ ఫోకస్ పెట్టింది. అన్ని మ్యాచ్లు సోని స్పోర్ట్స్, సోని లివ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.ఈ టోర్నీలో భారత-ఏ జట్టుతో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ జూన్ 9 నుంచి 21 వరకు డంబుల్లా వేదికగా జరుగనుంది.ఈ టోర్నీ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రధాన ఆకర్షణ మాత్రం వైభవ్ సూర్యవంశీయే. ఐపీఎల్లో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్.. అంతర్జాతీయ వేదికపై ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల కిందటే భారత-ఏ జట్టుకు సంబంధించి ఓ కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్నరియాన్ పరాగ్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేశారు.శ్రీలంక ముక్కోణపు టోర్నీకి భారత-ఏ జట్టు..తిలక్ వర్మ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, ప్రియాంశ్ ఆర్య, ఆయుశ్ బదోని, నిషాంత్ సింధు, సూర్యాంశ్ షేడ్గే, విప్రాజ్ నిగమ్, అన్షుల్ కంబోజ్, అనుకూల్ రాయ్, అర్షాద్ ఖాన్, ప్రభ్సిమ్రన్ సింగ్, కుమార్ కుషాగ్రా, యశ్ ఠాకూర్, యుద్ద్వీర్ సింగ్ చరక్
టీ20 కొత్త కెప్టెన్గా అతడికే ఓటేసిన అగార్కర్!
టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. భారత్కు ఈ ఏడాది ప్రపంచకప్ టైటిల్ అందించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆ రెండు కారణాల వల్ల..ఒకప్పుడు ప్రపంచ నంబర్వన్ బ్యాటర్గా ఉన్న సూర్య.. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆటగాడిగా తేలిపోవడమే ఇందుకు కారణం. అంతేగాక టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో 35 ఏళ్ల సూర్య వయసు కూడా ఓ అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.పరిశీలనలో మూడు పేర్లుఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ కొత్త కెప్టెన్ విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వరల్డ్కప్ వీరుడు సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వెల్లడించాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం.. సంజూ, అక్షర్లను కాదని శ్రేయస్ అయ్యర్కే సెలక్షన్ కమిటీ ఓటేసినట్లు సమాచారం. ఇందులో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ..అతడికే ఓటేసిన అగార్కర్‘‘అజిత్ దృఢచిత్తం గల చీఫ్ సెలక్టర్. స్ట్రాంగెస్ట్ చీఫ్ సెలక్టర్లలో అతడు ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అతడు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.తన ప్యానెల్తో కలిసి కొత్త టీ20 కెప్టెన్ కోసం అగార్కర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రేయస్ అయ్యర్ను తొలుత వన్డేలకు వైస్ కెప్టెన్గా నియమించారు. టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందే శ్రేయస్ విషయంలో ఒక నిర్ణయమైతే జరిగిపోయింది’’ అని పేర్కొన్నాయి.గంభీర్ విముఖత!అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ విషయంలో అగార్కర్తో ఏకీభవించడం లేదని సమాచారం. ‘‘గంభీర్ మనసులో ఒకరు ఉండొచ్చు. సెలక్టర్లు వేరొకరి గురించి ఆలోచించవచ్చు. అయితే, అక్షర్ పటేల్ వరల్డ్కప్ టోర్నీలో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన విషయాన్ని మర్చిపోవద్దు.రేసులో ఇషాన్ కూడా!ఇక ఇషాన్ కిషన్.. అతడి వయసు చిన్నదే. ఫామ్లో ఉన్నాడు. సారథిగానూ నిరూపించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ విషయంలో మాత్రం సెలక్టర్లు సంతృప్తిగా లేరు. అతడి నిలకడలేని ఆట తీరే ఇందుకు కారణం.కాబట్టి శ్రేయస్ అయ్యర్తో పాటు ఇషాన్, అక్షర్ కూడా రేసులో ఉన్నారని చెప్పవచ్చు. కానీ సంజూకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత కొత్త టీ20 కెప్టెన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.చదవండి: వైభవ్తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే!
దేశవాలీ టోర్నీలో అభిషేక్ విధ్వంసం..
దేశవాలీ టోర్నీ విదర్భ ప్రీమియర్ లీగ్లో సంచలనం నమోదయ్యింది. మంగళవారం ఇండియా వారియర్స్, నాగ్పూర్ హీరోస్ మధ్య జరిగిన మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇటీవలే ఐపీఎల్లో పెద్దగా మెరవని శుభమ్ దూబేతో పాటు అభిషేక్ అగర్వాల్ సంచలన ఇన్నింగ్స్లతో మెరిశారు. ముఖ్యంగా అభిషేక్ అగర్వాల్ కేవలం 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు శుభమ్ దూబే కూడా (33 బంతుల్లో 74 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) తడాఖా చూపించాడు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్కు అజేయంగా 107 పరుగులు జోడించడం దేశవాలీ క్రికెట్లో ఒక రికార్డుగా మిగిలిపోనుంది. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అభిషేక్ అగర్వాల్ ఒక సిక్స్, నాలుగు ఫోర్లు కొట్టి మొత్తంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ 16 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే నాగ్పూర్ హీరోస్పై ఇండియన్ వారియర్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (19 బంతుల్లోనే 63 నాటౌట్), శుభమ్ దూబే (33 బంతుల్లో 74 నాటౌట్) మెరిశారు. అనంతరం నాగ్పూర్ హీరోస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్ధేశ్ వత్ (78) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇండియా వారియర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, దర్శన్ నల్కండే, రాహుల్ డోంగర్వార్, గుర్దీప్సింగ్లు తలా రెండు వికెట్లు తీశారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. బిగ్ న్యూస్
న్యూస్ పాడ్కాస్ట్
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా... కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పునకు సంకేతాలు.. సిద్ధరామయ్య రేపు రాజీనామా చేసే అవకాశం
మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా?... చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
బిజినెస్
నేటి నుంచి ఆర్బీఐ పాలసీ సమీక్ష
నేటి నుంచి ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. మూడు రోజులపాటు నిర్వహించనున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం(5న) పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే అత్యధిక శాతం మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులు ఈసారి యథాతథ పాలసీ అమలుకే ఎంపీసీ కట్టుబడవచ్చని అంచనా వేస్తున్నారు. వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించే వీలున్నట్లు భావిస్తున్నారు.మరోపక్క ద్రవ్యోల్బణ రిస్క్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) చివర్లో కేంద్ర బ్యాంకు(ఆర్బీఐ) కఠిన పరపతి విధానాలకు తెరతీసే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. పాలసీ సమీక్షపై పీటీఐ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో 11 మంది స్టేటస్ కోకు వీలున్నట్లు పేర్కొనగా.. నలుగురు మాత్రం 0.25% రెపో రేటు పెంపును అంచనా వేశారు.4 శాతానికి దిగువనే..ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం దిగువనే కొనసాగుతుండటంతో రేట్ల పాజ్ను చేపట్టవచ్చని ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులు పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆర్బీఐ మరికొంతకాలం వేచిచూసేందుకు అవకాశమున్నదని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎకానమిస్ట్ గౌర సేన్గుప్తా అభిప్రాయపడ్డారు. గతేడాది వృద్ధికి మద్దతుగా ఎంపీసీ రెపో రేటులో మొత్తం 1.25 శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా?
ఒక్కో ట్రిప్పుపై రూ.300-రూ.400 భారం
వరుసగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా ఉంది. ఇంధన ఖర్చులు భారంగా మారడంతో పుణె-ముంబై మార్గంలో నడిచే క్యాబ్ ఆపరేటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు చెప్పారు. ఈ సవరించిన రేట్లు నిత్యం ప్రయాణించే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.రూ.300 - రూ.400 అదనం!గత కొన్ని నెలలుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరల భారాన్ని క్యాబ్ డ్రైవర్లు, ఆపరేటర్లు భరిస్తూ వచ్చారు. అయితే, మే నెలలో ధరలు పదేపదే పెరగడంతో ఇక లాభాలు రాకపోగా చేతి డబ్బులు పోయే పరిస్థితి రావడంతో ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు డ్రైవర్లు చెప్పారు. వాహనం రకాన్ని బట్టి ఛార్జీల పెంపుదల మారుతుందని, అయితే సగటున పుణె-ముంబై వన్-వే ప్రయాణానికి ఇప్పుడు రూ.300 నుంచి రూ.400 వరకు అదనంగా ఖర్చు అవుతుందని పుణెకు చెందిన క్యాబ్ ఆపరేటర్ జ్ఞానేశ్వర్ షెల్కే తెలిపారు. టోల్ ఛార్జీలు మినహాయించి కిలోమీటరుకు వసూలు చేసే బేస్ రేటు రూ.19 నుంచి రూ.20కి పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.చేతులెత్తేసిన ఆపరేటర్లు..పుణె-ముంబై రూట్లో నిత్యం ప్రయాణించే విశాల్ జాదవ్ అనే క్యాబ్ డ్రైవర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘నా వద్దకు వచ్చే ప్రయాణికుల్లో 80 శాతం మంది అంతర్జాతీయ విమానాల కోసం ముంబై ఎయిర్పోర్ట్కు వెళ్లేవారే. మే నెలలోనే వరుసగా మూడుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఆ కార్యాచరణ ఖర్చులను మేం భరించలేకే ఈ భారాన్ని ప్రయాణికులపై వేయాల్సి వచ్చింది. పాత కస్టమర్లు పరిస్థితిని అర్థం చేసుకుంటున్నప్పటికీ కొత్త ప్రయాణికులు మాత్రం పెరిగిన రేట్లు చూసి వెనకడుగు వేస్తున్నారు’ అన్నారు.ఈ పెరిగిన ధరల వల్ల క్యాబ్ ప్రయాణం మధ్యతరగతికి భారంగా మారుతోంది. ధరల పట్ల అత్యంత సున్నితంగా ఉండే కొత్త కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. క్యాబ్ ఛార్జీలు బడ్జెట్ దాటిపోతుండటంతో చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు లగ్జరీ బస్సులు లేదా రైలు ప్రయాణాలను ఎంచుకుంటున్నారని ఆపరేటర్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా?
ఉలుకు పలుకు లేని ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
920 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 249 పాయింట్లు నష్టపోయి 23,230 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 924 పాయింట్లు దిగజారి 73,731 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.24బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.13 శాతం పెరిగింది.నాస్డాక్ 0.03 శాతం పుంజుకుంది.Today Nifty position 03-06-2026(time: 09:56 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ
నాలుగు నెలల్లో 15 కిలోలు తగ్గాలంటే..! ఈ ఐదు సింపుల్ చిట్కాలతో..
బరువు తగ్గాలంటే చక్కని డైట్లు, ఫోర్స్బుల్ వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి భారం కలిగించేలా ఇలాంటి వర్కౌట్లతో బరువు తగ్గడం ఎలా ఉన్నా.. సమస్యలే ఎక్కువ. కొందరు తగ్గకపోగా..మరింత బరువు పెరుగుతారు. అలా కాకుండా శరీరానికి హాయినిచ్చేలా సులభంగా చేసే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేయడమే గాక సులభంగా బరువు తగ్గగలుగుతారని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా.!.15 కిలోల బరువును విజయవంతంగా తగ్గించుకున్న ఆమె తన వెయిట్లాస్ జర్నీని సాధారణమైన రోజువారీ జీవనశైలి అలవాట్లతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏం చేసినా..స్కిప్ చేయకుండా నిలకడగా చేస్తే తప్పక ఫలితం పొందగలమని అంటోందామె. తాను తీవ్రమైన వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ల జోలికి పోకుండా తగ్గానని చెబుతోంది. అందుకోసం ఏం చేసిందో కూడా షేర్ చేశారామె. వాకింగ్..ఇది కార్షియో వ్యాయామంలా పనిచేస్తుంది. కుదిరినప్పుడల్లా మెట్లు ఎక్కండి, లిఫ్టులు వాడండి.నీరు తాగడం..నిద్రలేవగానే నీళ్లు తాగండి, గోరువెచ్చని నీరైనా.మరే ఏవిధంగానైన నీటిని ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండేలా చేసుకోండి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల రోజంతా మన శక్తిని స్థిరంగా ఉంచుతుంది.ఫైబర్ను మర్చిపోవద్దుప్రోటీన్ ముఖ్యమే, కానీ ఫైబర్ కూడా అంతే ముఖ్యమని గుర్తించండి. అదుకోసం భోజనంలో మంచి మొత్తంలో ఫైబర్ను చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.ఇంట్లో వండిన ఆహారంప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా ఇంట్లో తయారు చేసిన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల పదర్థాఆల పరిమాణాలు, వంట పద్ధతులపై ఒక నియంత్రణ ఉంటుంది. అలాగే అధిక సోడియం, ఉప్పుని తగ్గించే వీలు కూడా ఉంటుంది.కేలరీ లోటుతినే ఆహార పరిమాణాలను అర్థం చేసుకోండి. ద్రవరూప క్యాలరీల పట్ల జాగ్రత్త వహించండి. పండ్ల రసాల కంటే ఎల్లప్పుడూ పండ్లనే తినండి. కొవ్వును తగ్గించుకోవడానికి, కొద్దిపాటి కేలరీ లోటును పాటించాల్సి ఉంటుంది.తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, ఫిట్నెస్ లక్ష్యాలను సాధించాలని చూస్తున్న వారికి, ఈ సాధారణ అలవాట్లు చాలా బాగా హెల్ప్ అవుతాయని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. (చదవండి: 76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..)
ఐపీఎల్ ఫైనల్లోమెరిసిన అనుష్క, స్పెషల్ లగ్జరీ వాచ్, ధర ఎంతో?
ఐపిఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయం సాధించిన వేళ నటి, స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి ఆకర్షణీయంగా నిలిచారు. గుజరాత్లోని అహ్మదా బాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్లో అనుష్క శర్మ స్టాండ్స్ నుండి ఆర్సీబీని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ముఖ్యంగా ఆమె చేతి రూ. 28 లక్షల విలువైన 'కార్టియర్ పాంథర్' (Cartier Panthère) లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సింపుల్ అండ్ లగ్జరీ స్టైల్, ఫ్యాషన్ ప్రియులకు తెగ నచ్చేసింది.సెజాన్ లియోనార్డ్ వైట్ టాప్, వైడ్ లెగ్ ట్రౌజర్ల ధరించి సింపుల్ అండ్ క్లాసీ లుక్లో కనిపించింది. దీని ధర విలువ దాదాపు 25 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆమె లుక్ సింపుల్గా ఉన్నప్పటికీ, చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం హైలైట్గా నిలిచింది. అభిమానులు అది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'కార్టియర్ పాంథర్' వాచ్ అని గుర్తుపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఈ ఐకానిక్ వాచ్ ధర దాదాపు రూ. 28 లక్షల వరకు ఉంటుందని అంచనా. స్క్వేర్ డయల్, రోమన్ అంకెలు, బ్రాస్లెట్ స్టైల్తో ఉండే ఈ వాచ్ సెలబ్రిటీలలో చాలా ఫేమస్. నీతా అంబానీ లాంటి ఫ్యాషన్ ఐకాన్లతో ప్రజాదరణ పొందింది.కాగా ఆర్సీబీ ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలవడంతో కోహ్లీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత విరాట్, అనుష్క కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి అనుష్క ఎల్లప్పుడూ అండగా నిలిచే 'సపోర్ట్ సిస్టమ్' అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో విరాట్ కోహ్లీ 'One felt nice, we did twice' (ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ రెండుసార్లు గెలిచాం) అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి అనుష్కతో కలిసి డాన్స్ చేయడం విశేషం. మొత్తానికి ఆర్సీబీ విజయోత్సవాల్లో అనుష్క లగ్జరీ వాచ్ ఒక అనూహ్యమైన ఫ్యాషన్ హైలైట్గా నిలిచింది. ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే!
ఇవాల్టి నుంచే యమునా నది పుష్కరాలు ప్రారంభం
దేవగురువు బృహస్పతి జూన్ 2, మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాలు జూన్ 13, శనివారం తో ముగుస్తాయి. ఈ పన్నెండు రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తారు.యమ బాధలు తీర్చే పవిత్ర స్నానం!పురాణాల ప్రకారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి యమునా దేవి కుమార్తె. యమధర్మరాజుకి స్వయాన సోదరి. అందువల్ల యమునా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే యమ బాధలు తొలుగుతాయని విశ్వాసం. సూర్యుడి సంతానంలో యముడు, యమున, శని ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. ఈ భూమ్మీద మానవుడు చేసే పాప పుణ్యాల కర్మను శని భగవానుడు అనుభవింపజేస్తాడు. జీవుడు ప్రస్తుత జన్మలో, అనేక జన్మల ద్వారా ఏర్పడిన పాప పుణ్య కర్మల ఫలితాలను మరణం తర్వాత యమధర్మరాజు చూస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యమ బాధలు, పాపాల నుంచి విముక్తి పొందేందుకు యమునా నది స్నానం ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అందువల్లే, శ్రీకృష్ణుడు స్వయంగా యమునా నది ఒడ్డున జన్మించడంతో పాటు ఈ నదితో ముడిపడి అనేక పురాణ విషయాలు ఉండటం యమున వైభవాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.భారతీయ సనాతన ధర్మం, పురాణాలలో యమునను కాళిందీ నదిగా పేర్కొన్నారు. 'యమునా నది కృష్ణ ప్రియః' అంటే యమునా నది కృష్ణుడికి ప్రియమైనదిగా చెబుతారు. యమునా నది నీటి స్పర్శ తాకితే పాపాల తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ,తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ, ఆత్మశుద్ధి వంటివి కలుగుతాయని విశ్వాసం. మరీ ముఖ్యంగా ఇక్కడ పుణ్యస్నానంతో శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందగలరని శాస్త్రవచనం. ఇంతటి విశేషం, మహత్యం కలిగిన నదికి పుష్కరాలు రావడం, పుష్కరాల్లో భక్తి శ్రద్ధలతో స్నాన విధి ఆచరిస్తే విశేష ఫలితాలు దక్కుతాయని విశ్వాసం.జ్యోతిష శాస్త్రం ప్రకారం.. దేవగురువు అయిన బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తుంటాయి (ఉదా: బృహస్పతి మేష రాశిలో ఉంటే గంగా నదికి , వృషభంలో పరాభవ నామ సంవత్సరంలో దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల జూన్ 2 నుంచి 13 వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి.ఎక్కడ స్నానమాచరించాలి ?యమునా నది ప్రవహించే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పుణ్య ఫలాలు పొందుతారు. ముఖ్యంగా పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం.ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పుష్కర స్నానం ఆచరించవచ్చు. గంగా , యమున , సరస్వతి నదులు కలిసే ఈ పవిత్ర సంగమంలో పుష్కర స్నానమాచరించడం విశేష పుణ్యఫలం లభిస్తుంది.మథుర/బృందావనం: శ్రీకృష్ణుడు స్వయంగా జన్మించి తన బాల్యాన్ని గడిపి, లీలలను ప్రదర్శించిన ప్రాంతమిది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఘాట్లలో పుష్కర స్నానం ఎంతో విశేషం.యమునోత్రి: యమునా నది జన్మస్థలం ఇది. ఇక్కడ యమునా నదిని దర్శించుకొని పుష్కర స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం.ఇంద్రప్రస్థం (ఢిల్లీ): పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజ్యంగా చేసుకొని అనేక యజ్ఞయాగాదులు చేసిన పవిత్ర ప్రదేశమిది. ఇలా ఈ పుణ్య నది పరిసర ప్రాంతాల్లో పురాణాలకు సంబంధించిన విశేషం ఉన్న ప్రాంతాల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిదిఏయే దానాలు చేస్తే మంచిది ?పుష్కరస్నానం అనంతరం దానం (అన్నదానం గోదానం , భూదానం , సువర్ణదానం , లవణదానం, పుస్తక దానం వంటివి) చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. యజ్ఞ యాగాదులు, హోమాలు వంటివి నిర్వహించడం లేదా ఆయా పవిత్ర కార్యాల్లో పాల్గొనడం వంటివి ఆచరిస్తే పుణ్యం.పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడం వల్ల వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం. పుష్కరాల్లో పురాణ పఠనం, మంత్రోచ్ఛారణ , భగవన్నామస్మరణ , జపం , తపం వంటివి ఆచరించడం ఉత్తమం.పుష్కరాలంటే సబ్బులు , శాంపూలతో స్నానమాచరించి నదులను కలుషితం చేయడం కాదు. యత్ర స్వచ్ఛః తత్ర లక్ష్మి అన్నారు పెద్దలు. పుష్కరాల్లో స్నాన విధిని అనుసరించి పురుషులు పంచె వంటివి ధరించడం , మహిళలు తమకు సౌకర్యమైన చీరవంటివి ధరించడం, దంపతులైతే భార్య , భర్త కొంగుముడి వేసుకొని భక్తి శ్రద్ధలతో మూడు మునకలతో చేసే స్నానం పుష్కర స్నానం. ఇలా స్నానమాచరించి దేవతలకు, రుషులకు, నదికి అర్ఘ్యం సమర్పించడం, పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది నదులలో చెడు పదార్థాలను విడిచిపెట్టడం పాతకం వీటిని దృష్టిలో ఉంచుకొని పుణ్యార్చన కోసం భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలని సూచన.పుష్కర స్నాన మహత్యంనదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. మనం కూడా యమునా నది పుష్కరాలలో స్నానమాచరించి మోక్షాన్ని పొందుదాం. (చదవండి: శ్రీ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక వైభవం.)
మతి మరపు @ అతి బరువు
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తుండటం సహజం. ఇప్పడు పెరిగే వయసుతో పాటూ పెరిగే బరువు కూడా మతిమరపును ప్రేరేపిస్తోందంటూ కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇందులో అత్యంత సాధారణం అల్జీమర్స్ అనే మతిమరపు. దీనికి పెరిగే వయసుతో పాటు బరువు పెరుగుతుండట కూడా అల్జీమర్స్కూ అంతే కారణమవుతోందనేందుకు పరిశోధనల రూపంలో తార్కాణాలు లభ్యమవుతున్నాయి. ఇలా బరువు పెరుగుతుండటంతో పాటు అల్జీమర్స్కు కారణమవుతున్న ఇతర అంశాలేమిటన్నది తెలుసుకుంటూ బరువు తగ్గించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యం ఎలా మెరుగవుతుందో చూద్దాం...మతిమరపును ఇంగ్లిష్లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైనది ‘అల్జీమర్స్’. డిమెన్షియా కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు సహాయపడే (కాగ్నిటివ్) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. ఇటీవలి కాలంలో అల్జీమర్స్ బాగా పెరుగుతోంది. ఇది అకస్మాత్తుగా కాకుండా క్రమంగా... అంటే కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలోమరచిపోయే అంశాలను పెంచుతూ పోతుంటుంది. ఉదాహరణకు మొదట్లో పేర్లు, కొద్దిసేపటి కిందట జరిగిన సంఘటనలూ, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అటు తర్వాత తెలిసిన దారులనూ, అటు తర్వాత సమీప వ్యక్తులనూ, కుటుంబ సభ్యులను మరచిపోవడం జరుగుతుంది. చివరగా... భయభ్రాంతులకు లోనవ్వడం, మలమూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం వరకు జరగవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే నేర్చుకున్న అనేక అంశాలు రాతిమీది రాతల్లా ఉండిపోవాల్సినవి కాస్తా... పలక మీద రాతలా చెరిపివేతకు గురవ్వడాన్ని అల్జీమర్స్గా చెప్పవచ్చు. ఒకసారి అల్జీమర్స్ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా పూర్తిగా నార్మల్ అయ్యేలా చేయడం ఇప్పటికి సాధ్యం కాదు.చికిత్స...అల్జీమర్స్ను పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మెదడులోని అన్నిరకాల కార్యకలాపాలను నిర్వహించే ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం సరైన మోతాదుల్లో ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. గత కొద్దికాలం కిందట ‘లెకనిమ్యాబ్’, ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందుల్ని ఎఫ్డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్ను రెండోవారాలకు ఒకసారి సూది మందు రూపంలో ఇస్తారు. ఈనెలలోనే (మే, 2026లో) ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందు మనకు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ మందు అల్జీమర్స్ తొలిదశలో ఇది అత్యంత ప్రభావవంతమైనది. దీన్ని నెలకొక ఇంజెక్షన్ చొప్పున తీసుకోవాలి.పెరిగే బీఎమ్ఐతో జ్ఞాపకశక్తి తగ్గు తున్నా... అది నివారించగలిగే అంశమే... యూనివర్జిటీ ఆఫ్ జార్జియాలో నిర్వహించిన ఇటీవలి తాజా పరిశోధన ఫలితాలేమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వారి జ్ఞాపకశక్తి గతంలో వారు యువకులుగా ఉన్నంతగా ఉండకపోవచ్చు. దీనికి తోడు పెరుగుతున్న బరువు (బాడీ మాస్ ఇండెక్స్–బీఎమ్ఐ) పెరుగుతున్న కొద్దీ వారిలోనూ అభ్యాసనం ద్వారా నేర్చుకునే (కాగ్నిటివ్) నైపుణ్యాలూ, గుర్తుంచుకునే సామర్థ్యాలు (మెమరీ), భావోద్వేగాల అదుపు (మేనేజింగ్ ఎమోషన్స్), ప్లానింగ్ అలాగే నిర్వహణ సామర్థ్యాలూ, ఏకాగ్రత (కాన్సంట్రేషన్) తగ్గుతాయని తేలింది. 24 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో దాదాపు 8,200 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఇదేమీ చెడు వార్త కాదనీ... ఒకవేళ మనం మన బరువును అదుపులో పెట్టుకుంటే ఆ దుష్పరిణామాలు నివారించవచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన లీడ్ ప్రొఫెసర్ డాక్టర్ సుహాంగ్ సాంగ్ పేర్కొన్నారు.నివారణ... పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ను చాలావరకు ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి.ఆహారం... పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో వాడే పసుపుతో పాటు పాశ్చాత్య ఆహారాల్లో మెడిటేరియన్ డైట్ (ఆల్మండ్స్, వాల్నట్, డార్క్ చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్, క్రాన్బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు బాగా తోడ్పడతాయి.మెదడుకు మేత కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్ వంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం వంటి మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి.వ్యాయామం...దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. దాంతో మెదడుకు రక్తప్రసరణ బాగాజరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్ కనెక్షన్లు, వివిధ జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.నిర్ధారణ అల్జీమర్స్ నిర్ధారణ కోసం ఇప్పడు కొన్ని రకాల పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతంలోని ఎమ్మారై బ్రెయిన్తో పాటు కొన్ని రక్తపరీక్షలూ ఇప్పుడ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి టీఏయూ (టావు) అండ్ అమైలాయిడ్ శాతాన్ని నిర్ధారణ చేయడం; అమైలాయిడ్ పెట్ స్కాన్ ద్వారా అల్జీమర్స్ను నిర్ధారణ చేయవచ్చు. ఇవి చాలా తాజాగా అందుబాటులోకి వచ్చిన వైద్యపరీక్షలు.సమాజంలో నలుగురితో పాటు ఒకరిగా మెలగడం...వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. అలాంటి ఉల్లాస జీవితం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ వచ్చే ముప్పూ తగ్గుతుంది.దీర్ఘకాలిక వ్యాధుల అదుపు...డయాబెటిస్, హైబీపీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వంటి వాటిని అదుపులో పెట్టుకోవాలి.మతి మరుపు, అల్జీమర్స్ కారణమయ్యే అంశాల్లో కొన్ని...మతిమరుపునకూ, అల్జీమర్స్కూ అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లోని అతి ముఖ్యమైన ఓ అరడజను కారణాలేమిటో చూద్దాం...1. జన్యుపరమైనవి : అల్జీమర్స్తో వచ్చే మతిమరుపునకు జన్యుపరమైన అంశాలు అతి ముఖ్య కారణాలు. కొందరి కుటుంబాల్లో అల్జీమర్స్ వంశాపారంపర్యంగా కనిపిస్తుంటుంది. ఏపీఓఈ 4 ఎల్లీల్ జన్యువు వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ అల్జీమర్స్ ముప్పును పెంచుతాయి.2. వయసు : పెరుగుతున్న వయసు పై సమస్యలకు ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్). పైగా ఇది నిరోధించలేని అంశం.3. పెరుగుతుండే బరువు : అధిక బరువు / ఊబకాయం (ఒబేసిటీ) వల్ల దేహంలో కొవ్వుల మోతాదు పెరగడమనే అంశం అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పును పెంచుతుందని ఇటీవల కొన్ని తాజా అధ్యయనాల్లో తేలింది. దేహంలోనూ, అందునా మరీ ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పెరగడంతో పాటు ఫిట్నెస్ తగ్గడమనే అంశం మెదడును మందకొడిగా మార్చడంతో పాటు మతిమరపును తెచ్చిపెట్టే ప్రమాదమైన సిగ్నల్స్ కారణంగా అల్జీమర్స్ వస్తుందనేది కొన్ని పరిశోధనల్లో తేలిన అంశం.4. జీవనశైలి (లైఫ్ స్టైల్) : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినవారిలో... అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, చురుకైన జీవితానికి దూరంగా ఒకేచోట మందకొడిగా ఉండటం, వ్యాయామం లేకుండా బద్ధకంగా ఉండటం, పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంట అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవాళ్లలో అల్జీమర్స్ ముప్పు ఎక్కువ.5. దేహంలో దాగి ఉన్న ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు (కార్డియో వాస్క్యులార్ సమస్యలు)లతో పాటు దీర్ఘకాలికంగా దేహంలో ఉండే ఇన్ఫ్లమేషన్ (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతూ అల్జీమర్స్కు కారణమయ్యే అవకాశాలెక్కువ.6. వాతావరణ అంశాలు : వాతావరణంలోని కాలుష్యాలు, విషపూరిత (టాక్సిక్) పదార్థాలు కూడా అల్సైమర్స్ మతిమరపునకు కారణమవుతాయి. దీనికి విరుధ్ధంగా వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి.- డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డిసీనియర్ న్యూరో ఫిజీషియన్ నిర్వహణ యాసీన్
అంతర్జాతీయం
ఖమేనీ అంత్యక్రియలు ఫిక్స్..? కదిలిరానున్న ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీ మరణించి దాదాపు మూడు నెలలు గడుస్తోంది. యుద్ధం ప్రారంభమైన రోజే ఆయన మరణించినప్పటికీ పలు భద్రతా కారణాలతో ఆయన అంత్యక్రియలను ఇరాన్ వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ అంత్యక్రియల వివరాలను బహిర్గతం చేసింది. ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను మూడు రోజుల పాటు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్లోని పలు ప్రధాన నగరాల్లో భారీ ఊరేగింపులు జరుపుతామంది.ఇరాన్ ప్రకటనలో.. "ఊరేగింపులు రాజధాని టెహ్రాన్తో పాటు, అక్కడి పవిత్ర నగరాలైన కోమ్, మషాద్ లలో జరుగుతాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంతాప సభలు జరుగుతాయి. ఇక చివరగా ఖమేనీ పార్థివ దేహాన్ని మషాద్ నగరంలో ఖననం చేస్తాం" అని తెలిపింది.అయితే ఈ అంత్యక్రియల తేదీలను మాత్రం ఇరాన్ స్పష్టంగా ప్రకటించలేదు. జూన్ మధ్యలో (ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నెల ప్రారంభంలో) ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఖచ్చితమైన తేదీలను మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.అయితే టెహ్రాన్ నగరంలోనే ఈ వీడ్కోలు కార్యక్రమం దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా సాగనున్నట్లు. తెలుస్తోంది. అంత్యక్రియల ఉత్సవాలకు సుమారు 2 కోట్ల (20 మిలియన్ల) మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది.
నేను లేకుంటే నువ్వు జైల్లోనే.. నెతన్యాహుకు.. ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానిపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతో ఫోన్లో ఆయనను తీవ్ర పదజాలంతో "అసలు నువ్వు ఏం చేస్తున్నావ్" హెచ్చరించినట్లు ఆక్సియోస్ కథనం ప్రచురించింది. అమెరికా, ఇరాన్ల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరే దశకు వచ్చింది. అయితే, ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు పెంచడంతో.. "ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే అమెరికాతో చర్చలు నిలిపివేస్తాం" అని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ట్రంప్ నెతన్యాహూతో మాట్లాడి కాల్పులు విరమించాలని కోరారు. అయితే దీనికి తొలుత అంగీకరించిన ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్పై కాల్పులు జరపింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహూకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డట్లు సమాచారం.అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. ట్రంప్ చాలా కోపంగా నెతన్యాహును ఉద్దేశించి ఫోన్లో ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది" అసలు నువ్వు ఏం చేస్తున్నావు. నీకు పిచ్చి పట్టింది నేను గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతుంటే నువ్వు ఇలా చేస్తున్నావు.ఈ దాడుల వల్ల ప్రపంచంలో నిన్నూ, ఇజ్రాయెల్ను అందరూ అసహ్యించుకుంటున్నారు" అని నెతన్యాహుని తీవ్ర పదజాలంతో మందలించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.అనంతరం ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో.. నెతన్యాహుతో మాట్లాడి బీరూట్పై పెద్ద ఎత్తున జరపాలనుకున్న దాడిని విరమించుకునేలా చేశానని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గిందని ప్రకటించారు. ఇందుకు నెతన్యాహుకు ధన్యవాదాలు కూడా తెలిపారు.అయితే, నెతన్యాహు కార్యాలయం మాత్రం తాము పూర్తిగా వెనక్కి తగ్గినట్లు ఒప్పుకోలేదు. "హెజ్బుల్లా గనుక మా నగరాలపై దాడులు ఆపకపోతే.. మేము బీరూట్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి తీరుతాం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు" అని నెతన్యాహు స్పష్టం చేశారు.
గ్రూమింగ్ గ్యాంగ్స్.. మైనర్ బాలికపై వందల మంది అత్యాచారం..?
లండన్: బ్రిటన్లో సంచలనం సృష్టించిన గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలను అక్కడి పార్లమెంటులో ఎంపీ రూపెర్ట్ లోవ్ బహిర్గతం చేశారు. యూకే వ్యాప్తంగా కనీసం 85 ప్రాంతాలలో ఈ గ్యాంగులు యాక్టివ్గా ఉన్నాయని వారిలో అధికంగా పాకిస్థానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు.గ్రూమింగ్స్ గ్యాంగ్స్ ఆగడాలకు సంబంధించి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు మైనర్ బాలికలపై రాక్షసత్వంతో ముఠా అత్యాచారాలు చేసినట్లు నివేదిక తేల్చింది. ఈ కేసులో పలువురు బాధితురాలను స్వతంత్ర కమిటీ విచారించింది. అందులో మైనర్ బాలికలను అత్యంత క్రూరంగా బోనులో బంధించి అమానవీయంగా అత్యాచారానికి పాల్పడ్డారని ఒక బాధితురాలు చెప్పినట్లు నివేదిక పేర్కొంది.ఒక బాధిత బాలిక మాట్లాడుతూ.. 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచి తనపై దాదాపు 600 నుండి 700 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని ఆ బాధితురాలు తెలిపింది. మరో బాధితురాలు .. 15 నుండి 20 మంది అమ్మాయిలను బోనుల్లో బంధించి ఉంచడం చూశానని, వారిపై అమానవీయంగా, క్రూరంగా లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొంది. ఇవే కాక మరెన్నో మైనర్లపై మరెన్నో ఆగడాలు బ్రిటన్ వ్యాప్తంగా గ్రూమింగ్ గ్యాంగ్స్ చేశాయని ఎంపీ పేర్కొన్నారు. ఈ ముఠాలలో ప్రధానంగా పాకిస్తానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఈ దారుణాలపై ఇక మాటలు చాలు, చేతల్లో కఠిన చర్యలు కావాలి. రాబోయే రోజుల్లో విడుదల కాబోయే మా 'రేప్ గ్యాంగ్ ఇంక్వైరీ రిపోర్ట్' బ్రిటన్ భవిష్యత్తును మారుస్తుంది అని ఎంపీ రూపెర్ట్ లోవ్ స్పష్టం చేశారు.ఈ దారుణాలను అణచడంలో స్థానిక పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఘోరంగా విఫలమయ్యారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే..?'గ్రూమింగ్ గ్యాంగ్స్' అంటే... ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు టీనేజ్ అమ్మాయిలను టార్గెట్ చేసి, వారిని మభ్యపెట్టి, నమ్మించి, ఆపై క్రూరంగా లైంగికంగా వాడుకునే వ్యవస్థీకృత నేర ముఠాలు 'గ్రూమింగ్' అంటే ఒకరిని నమ్మించి, లొంగదీసుకోవడం. ఈ ముఠాలు సాధారణంగా పేదరికం, కుటుంబ సమస్యలు లేదా ఒంటరితనంతో బాధపడుతున్న 11 నుండి 16 ఏళ్ల లోపు బాలికలను (ఎక్కువగా తెల్లజాతి బాలికలను) టార్గెట్ చేస్తాయి.
ఖమేనీ విషయంలో కీలక ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశాధినేత ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన దేశ వ్యవహారాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు.ఇరాన్ సుప్రీం లీడర్ విషయంలో ఆరోగ్యం విషయంలో తీవ్ర సందిగ్ధత నడుస్తోంది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కోమాలో ఉన్నారని ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కీలక వాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు మాట్లాడుతూ మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం దేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత చురుగ్గా నిమగ్నమవుతున్నారని తెలిపారు. ఆ మేరకై ఆయనకు కొన్ని సంకేతాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అదే దాడిలో ఆయన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం, కొడుకు గాయపడటంతో ఇరాన్ నాయకత్వంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవగా, వాటన్నింటికీ తెరదించుతూ మొజ్తాబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని అమెరికా ఇప్పుడు స్పష్టం చేసింది.
జాతీయం
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగి 21 మంది దుర్మరణం పాలయ్యారు. రెస్టారెంట్లో పలువురు చిక్కుకుని ఉండడం.. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.హౌజ్రాణి ఏరియాలోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఉదయం 8గం.50ని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కస్టమర్లు, హోటల్లో బస చేసినవాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. #DELHI-साकेत प्रेस एन्क्लेव के सामने, मालवीय नगर के हौज रानी स्थित एक होटल में लगी भीषण आग ।लाल डोरा क्षेत्र में तेजी से बन रहे बहुमंजिला होटलों की अग्नि सुरक्षा, आपातकालीन पहुंच और नियामक निगरानी पर गंभीर सवाल खड़े कर दिए हैं।#DelhiFire #MalviyaNagar #Saket #FireSafety pic.twitter.com/2gtCHzJfg9— Payall Singhh (@PayallSingh13) June 3, 2026మంటలు భారీగా ఎగసి పడడంతో.. దట్టమైన పొగతో రెస్టారెంట్ అలుముకోవడంతో.. ఊపిరాడక చాలా మంది చనిపోయారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించిన పలువురి సాహసాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 30 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. రెస్టారెంట్లో మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో.. సౌతాఫ్రికా, సోమాలియా, గల్ఫ్ వాసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.दिल्ली के मालवीय नगर में एक रेस्ट्रां में लगी आग हादसे में 10 लोगों की मौत की खबरबेसमेंट में फंसे तीन नाइजीरियन नागरिकों को रेस्क्यू कर बाहर निकाला गया।#DELHIFIRE#MALVIYENAGAR#RESTRAURENTFIRE pic.twitter.com/GVD3yKxmXR— Vivek Shukla (@anchorviveks) June 3, 2026ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అధికారులు అందిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 3, 2026
కేరళలో ఉండడం మీ అదృష్టం!
కొచ్చి: కుంభమేళా సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే కేసులో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోనాలిసా, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ ముగిసింది. బుధవారం(ఇవాళ) ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న తీర్పు రిజర్వ్ చేసే సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.విచారణలో భాగంగా న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ “మీరు కేరళలో ఉన్నందుకు అదృష్టవంతులు” అని వ్యాఖ్యానించారు. దానికి మొనాలిసా తరఫు న్యాయవాది.. అందువల్లే వీళ్లు ఇంకా బతికి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై నెట్టింట దుమారం రేగింది. జడ్జి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..న్యాయ వర్గాల ప్రకారం కోర్టు ఉద్దేశం కేసుపై ప్రత్యక్ష అభిప్రాయం వ్యక్తం చేయడం కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ కేసు చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఒత్తిళ్లు, భద్రతా పరిస్థితులను పరోక్షంగా సూచించడమేనని భావిస్తున్నారు. కేరళలో న్యాయ ప్రక్రియ తక్కువ ఒత్తిడితో, మరింత నిష్పక్షపాత వాతావరణంలో సాగుతోందన్న సందేశాన్ని ఆ వ్యాఖ్య ద్వారా ఇచ్చినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఈ కేసు ఒక సాధారణ వివాహ వివాదం నుంచి ఇప్పుడు ఇంటర్ఫెయిత్ వివాహం, వయస్సు నిర్ధారణ(ఆమె మైనర్ అనే ఆరోపణలు), ఫోర్జరీ ఆరోపణలు, కిడ్నాప్ కేసులు వంటి పలు తీవ్రమైన ఆరోపణలతో కేరళ-మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్ద న్యాయ వివాదంగా మారింది. మోనాలిసా వివాహం, ఆమె వయస్సు నిర్ధారణ, మతాంతర వివాహ చట్టబద్ధతతో పాటు పలు రాష్ట్రాల్లో నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు క్లిష్ట అంశాలు ఒకేసారి విచారణ జరిగాయి.ఇక మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమపై వివిధ వర్గాల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వయస్సు తప్పుడు నమోదు, ఫోర్జరీ ఆరోపణలు సహా కేసు తీవ్రమని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా రెండు రాష్ట్రాల అంశంగా మారింది. తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.
ట్విషా శర్మ మృతి కేసు: జైలుకు రిటైర్డ్ మహిళా జడ్జి
భోపాల్: ఒకప్పుడు కోర్టులో పలు కీలక తీర్పులు చెప్పిన ఉన్నత స్థాయి న్యాయమూర్తి, నేడు అదే చట్టం ముందు నిందితురాలిగా నిలబడ్డారు. తన కోడలు ట్విషా శర్మ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గిరిబాల సింగ్ భోపాల్ సెంట్రల్ జైలు పాలయ్యారు. నిన్నటి వరకు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఆమెకు, జైలు అధికారులు ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 71’ అనే గుర్తింపును కేటాయించారు.కోడలి మరణం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన మాజీ జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్లను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో మంగళవారం భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు నిబంధనల ప్రకారం మాజీ జడ్జిని మహిళా మెడికల్ వార్డులో ఉంచి, ఖైదీ నంబర్ 71ను కేటాయించారు. అలాగే ఆమె కుమారుడు సమర్థ్ను బ్యారక్ నంబర్ 4లో ఉంచి, ఖైదీ నంబర్ 1782గా గుర్తించారు. జైలు మాన్యువల్ ప్రకారం వీరికి ఒక ప్లేట్, గిన్నె, బెడ్షీట్ వంటి ప్రాథమిక అవసరాల వస్తువులను అధికారులు అందించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు గిరిబాల సింగ్ ముందస్తు బెయిల్ను రద్దు చేసిన కొన్ని గంటల్లోనే మే 28న సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది.80 కిలోల డమ్మీతో సీన్ రీక్రియేషన్గత నెల మే 12న ట్విషా శర్మ తన అత్తవారింట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ, విచారణ పరిధిని వేగవంతం చేసింది. ట్విషా శర్మ జీవితంలో చివరి గంటల్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సోమవారం నాడు దర్యాప్తు సంస్థ ఘటనా స్థలంలో క్రైమ్ సీన్ను రీక్రియేట్ చేసింది. ఇందులో భాగంగా ట్విషా బరువుకు సమానమైన 80 కిలోల డమ్మీని ఉపయోగించారు. సీన్ను పునర్నిర్మించడానికి ముందు ఆ డమ్మీ బరువును తూకం యంత్రంపై కూడా సరిచూశారు.విచారణలో కీలక వ్యత్యాసాలుపోస్ట్మార్టం నివేదికలో పేర్కొన్న ట్విషా ఎత్తుకు, ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్లకు మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ సందిగ్ధతను తొలగించడానికి దర్యాప్తు సంస్థ వేర్వేరు ఎత్తులు ఉన్న మరో రెండు డమ్మీలను కూడా సిద్ధం చేసి పరిశీలించింది. కోడలి మరణానికి గల అసలు కారణాలను, పరిస్థితులను వెలికితీసేందుకు సీబీఐ అన్ని కోణాల్లోనూ ఆధారాలను సేకరిస్తోంది.
ఆలయానికి వచ్చిన నలుగురు నేతలు సీఎంలయ్యారు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్లో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఖచ్చితంగా బాధ్యతలు చేపడతారని ఆనాడే జోస్యం చెప్పామని గాణదాళ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం అర్చకుడు శ్యామాచారి గుర్తుచేశారు గతంలో ఈ ఆలయాన్ని సందర్శించిన నేతల్లో నలుగురు సీఎం పీఠాన్ని అధిరోహించారన్నారు. మంగళవారం రాయచూరు తాలూకా పంచముఖి గాణదాళ ఆంజనేయ ఆలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది అక్టోబరులో రాయచూరు జిల్లా పర్యటనలో భాగంగా గాణదాళ పంచముఖి ఆంజనేయ స్వామికి శివకుమార్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా.. గాణదళ పంచముఖీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. మధ్వమతాచార్యుడు గురు రాఘవేంద్రస్వామి ఇక్కడే 16 సంవత్సరాలు తపస్సు చేసి, పంచముఖీ హనుమంతుడిని ప్రసన్నం చేసుకున్నట్లు చెబుతారు. త్రేతాయుగంలో.. రామ-రావణ సంగ్రామం సమయంలో.. రామలక్ష్మణులను మైరావణుడు అపహరించి, పాతాళానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే..! వారిని కాపాడేందుకు హనుమంతుడు గాణదళ నుంచే పాతాళానికి వెళ్లినట్లు స్థానికులు చెబుతారు. మైరావణుడి ప్రాణం అయిదు భ్రమరాల్లో ఉండడంతో.. వాటిని ఏకకాలంలో చంపేందుకు హనుమంతుడు పంచముఖీ ఆంజనేయస్వామి అవతారమెత్తినట్లు చెబుతారు. ఇక్కడ హనుమంతుడి కోసం కుట్టే భారీ తోలుచెప్పులు ప్రతీ ఐదేళ్ల కోసారి అరిగిపోవడం విశేషం.
ఎన్ఆర్ఐ
ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు
సాంస్కృతిక సామరస్యానికి అంకితమైన ఒక ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ అయిన స్టిచింగ్ వసుధైవ కుటుంబకం (SVK), శ్రీ అన్నమాచార్యుల జీవితాన్ని, కాలాతీత వారసత్వాన్ని సంగీత ప్రతిభను ఘనంగా స్మరించుకుంది. మే 23న, ఆ సంగీత విద్వాంసుని 618వ జయంతి సందర్భంగా, SVK ఐండ్హోవెన్లో ఒక మహత్తరమైన శ్రీ అన్నమాచార్య ఆరాధనను నిర్వహించింది. ఈ సాంస్కృతిక మైలురాయి, పశ్చిమ ఐరోపా నలుమూలల నుంచి ఎన్నో ప్రఖ్యాత సంగీత, నృత్య పాఠశాలలను ఒకచోట చేర్చి, శ్రీ అన్నమాచార్యులువారికి కళ, సంగీతం, ప్రగాఢ భక్తితో కూడిన సామూహిక నివాళిని అర్పించింది. ఈ కార్యక్రమంలో 170 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అంతేగాదు 75 ఏళ్ల వయసు ఉన్న అనుభవజ్ఞులైన కళాకారులతో పాటు, చిన్న పిల్లలు కూడా అన్నమాచార్యుల వారి క్లిష్టమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలను, సంకీర్తనలను అలవోకగా పఠించడం, ప్రదర్శించడం చూడటం ప్రాచీన సంప్రదాయ పరిరక్షణకు ఒక నిదర్శనంగా నిలిచింది. తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహకరమైన మద్దతుతో మంత్రముగ్ధులైన ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తూ, గొప్ప వారసత్వాన్ని తర్వాతి తరానికి ఎలా విజయవంతంగా అందించవచ్చో కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఐండ్హోవెన్ నగర కౌన్సిలర్లు మిరియం ఫ్రోసీ, చైతాలి సేన్గుప్తాతో పాటు సంస్కృతి అండ్ సంస్కార్ సంస్థ అధిపతి వల్లభ్ పాండే, హెచ్ఎస్ఎస్ ఐండ్హోవెన్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి వారిలో ఉన్నారు.అతిథులందరూ యువ కళాకారులను ఆశీర్వదించి.. వారి అసాధారణ క్రమశిక్షణను ప్రశంసించారు. శాస్త్రీయ కళల పట్ల వారి అంకితభావాన్ని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. అన్నమాచార్యుల చారిత్రక పాత్రకు తగిన నివాళిగా.. సుందరంగా అలంకరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహాల పవిత్ర వాతావరణంలో ఈ కళా ప్రదర్శనలు జరిగాయి.(చదవండి: సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్)
సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్
డాలస్లోని తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD)’.. స్ప్రింగ్ ఫెస్ట్ను వైభవంగా నిర్వహించింది. డాలస్ మెట్రోప్లెక్స్ మధ్యలో ఉన్న ‘ది కాలనీ’ నగరంలోని గ్రాండ్స్కేప్లో జరిగిన ఈ వేడుక రెండు వేలకుపైగా జనంతో సందడిగా సాగింది. వెండర్ బూత్లు, ఉచిత 360 స్టూడియో, ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలతో పిల్లలు, యువత థ్రిల్ ఫీలయ్యారు. కళాశాల విద్యార్థుల డ్యాన్స్ షోకు చప్పట్లు మారుమోగాయి. లైవ్ బ్యాండ్ మ్యూజిక్, రకరకాల ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఈ స్ప్రింగ్ ఫెస్ట్ ను ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారు.గ్రాండ్ స్కేప్ లో ఫుడ్ స్టాల్స్, ఐస్క్రీమ్ షాపులు ప్రత్యేకంగా కనిపించాయి. పలు ఆటలు, టాయ్ షాపుల వద్ద పిల్లలు ఉత్సాహంగా కనిపించారు. టీపాడ్ స్పెషల్ అయిన రాఫెల్ డ్రా బహుమతులతో జోష్ నింపింది.జాతీయ గీతాలతో ప్రారంభంఅమెరికా, భారత జాతీయ గీతాలతో ఆరంభమైన ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), రవికాంత్ మామిడి (BOT చైర్మన్), రఘువీర్ బండారు (ఫౌండేషన్ చైర్మన్), లింగారెడ్డి అల్వా (కోఆర్డినేటర్) స్వాగతం పలికారు. యాంకర్ వీణ యలమంచిలి కార్యక్రమాన్ని షోను రన్ చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు, మీడియా సంస్థలకు టీపాడ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. స్ప్రింగ్ ఫెస్ట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా)
తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి పనిచేసిన తెలంగాణవాదులను గుర్తించి గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నాయకుడు, ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న ఆయన న్యూయార్క్ లో తెలంగాణవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లాంగ్ ఐలాండ్ లో ప్రముఖ ఎన్ఆర్ఐ లక్ష్మణ్ ఏనుగు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డిని హరీష్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. అమెరికాలో స్థిరపడి తెలుగు వారికి ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఆయన అందిస్తున్న సహకారం గొప్పగా ఉందని అన్నారు.ఉద్యమకాలం నుంచి, ఆ తర్వాత కూడా తెలంగాణే లక్ష్యంగా చాలా మంది ఎన్ఆర్ఐలు పనిచేశారని హరీష్ రావు గుర్తుచేసుకున్నారు. తమకు అనేక పరిమితులు ఉన్నా లక్మణ్ ఏనుగు లాంటి సోదరులు అనేకమంది తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని, తమ సమయంతో పాటు ఆర్థిక వనరులను కూడా వెచ్చించారని అన్నారు.పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ ముందు నుంచీ తాము పార్టీకి అండగా ఉన్నామని, తెలంగాణ భావజాలవ్యాప్తికి అన్నిరకాలుగా కృషి చేశామని తెలిపారు. ఉద్యమవాదుల్లో కొందరికి అన్యాయం జరిగిందని, మరికొందరిలో అసంతృప్తి గూడు కట్టుకొన్న విషయాన్ని హరీష్ రావుకు దృష్టికి తీసుకువచ్చారు. మరోసారి తెలంగాణవాదుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలవాలని అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.తెలంగాణ సాధనలో భూమి పుత్రుడైన లక్ష్మణ్ ఏనుగు రాజీలేని పోరాటం చేశారని, పదహారు ఏళ్ల కిందటే ధూమ్ ధామ్ లు నిర్వహించటంతో పాటు, అనేక మంది ప్రముఖ నాయకులు, తెలంగాణ కవులు కళాకారులను అమెరికాకు పరిచయం చేసిన ఘనత లక్ష్మణ్ కు దక్కిందని హరీష్ రావు ప్రశంసించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎన్ఆర్ఐలు డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, శ్రీనివాస్ గూడూరు, సతీష్ కల్వ, సహోధర్ రెడ్డి, రవీందర్ కోడెల, హరిచరణ్ బొబ్బిలి, మల్లిక్ రెడ్డి, రమా వనమా, వాణి ఏనుగు, ఉషా మన్నెం, రంజీత్ క్యాతం, అమర్ లింగాల, సునీల్ మన్నెం, తన్నీరు మహేష్, నరసింహారావు, చందు తళ్ల, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ జక్కిడి, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా TAL ప్రీమియర్ లీగ్ ఆరంభం)
రష్యాలో డ్రోన్ దాడి.. ఏపీ వాసి మృతి
శ్రీకాకుళం జిల్లా: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామానికి చెందిన ఓ తెలుగు కుటుంబంలో విషాదం నింపింది. ఇచ్ఛాపురం మండలం ఒడిశా సరిహద్దు గ్రామమైన మాదుబందకు చెందిన ఎ.రామయ్య (26) పొట్టకూటి కోసం రష్యాకు వలస వెళ్లాడు. రష్యన్ కంపెనీలో రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా.. సోమవారం వేకువజామున 4.40 నిమిషాల సమయంలో అకస్మాత్తుగా జరిగిన డ్రోన్ దాడిలో రామయ్యతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటికే రామయ్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి తల్లిదండ్రులు గౌరమ్మ, నిమ్మయ్యతో పాటు అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. తమ కుమారుని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గంజాం జిల్లా మేజిస్ట్రేట్ వి.కీర్తి బాసన్ మంగళవారం కుటుంబ సభ్యులను ఓదార్చి ఢిల్లీలోని అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
క్రైమ్
కేరళలో ఉండడం మీ అదృష్టం!
కొచ్చి: కుంభమేళా సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే కేసులో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోనాలిసా, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ ముగిసింది. బుధవారం(ఇవాళ) ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న తీర్పు రిజర్వ్ చేసే సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.విచారణలో భాగంగా న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ “మీరు కేరళలో ఉన్నందుకు అదృష్టవంతులు” అని వ్యాఖ్యానించారు. దానికి మొనాలిసా తరఫు న్యాయవాది.. అందువల్లే వీళ్లు ఇంకా బతికి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై నెట్టింట దుమారం రేగింది. జడ్జి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..న్యాయ వర్గాల ప్రకారం కోర్టు ఉద్దేశం కేసుపై ప్రత్యక్ష అభిప్రాయం వ్యక్తం చేయడం కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ కేసు చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఒత్తిళ్లు, భద్రతా పరిస్థితులను పరోక్షంగా సూచించడమేనని భావిస్తున్నారు. కేరళలో న్యాయ ప్రక్రియ తక్కువ ఒత్తిడితో, మరింత నిష్పక్షపాత వాతావరణంలో సాగుతోందన్న సందేశాన్ని ఆ వ్యాఖ్య ద్వారా ఇచ్చినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఈ కేసు ఒక సాధారణ వివాహ వివాదం నుంచి ఇప్పుడు ఇంటర్ఫెయిత్ వివాహం, వయస్సు నిర్ధారణ(ఆమె మైనర్ అనే ఆరోపణలు), ఫోర్జరీ ఆరోపణలు, కిడ్నాప్ కేసులు వంటి పలు తీవ్రమైన ఆరోపణలతో కేరళ-మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్ద న్యాయ వివాదంగా మారింది. మోనాలిసా వివాహం, ఆమె వయస్సు నిర్ధారణ, మతాంతర వివాహ చట్టబద్ధతతో పాటు పలు రాష్ట్రాల్లో నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు క్లిష్ట అంశాలు ఒకేసారి విచారణ జరిగాయి.ఇక మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమపై వివిధ వర్గాల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వయస్సు తప్పుడు నమోదు, ఫోర్జరీ ఆరోపణలు సహా కేసు తీవ్రమని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా రెండు రాష్ట్రాల అంశంగా మారింది. తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.
‘నా ఆత్మహత్యకు డీఎస్పీ, ఎస్ఐలే కారకులు’
కర్ణాటక: ఓ వ్యక్తి డీఎస్పీ, ఎస్ఐల పేర్లు డెత్నోట్లో రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా బెండిగేరి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రవీంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వలేదని మనోవేదనకు గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్చిన అప్పులను తిరిగి ఇవ్వమన్నందుకు ప్రాణాలు తీస్తామని బెదిరించారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు రవీంద్ర డెత్ నోట్లో పేర్కొన్నాడు. అంతేగాక పోలీసులు కూడా తన పట్ల అన్యాయంగా నడుచుకున్నారని ఆయన పేర్కొనడంతో కేసు కలకలం సృష్టిస్తోంది. లక్ష్మణ చందరిగి, భరమప్ప పూజారిలకు రూ.8 లక్షలు అప్పు ఇచ్చాను. అయితే ఆ డబ్బును లక్ష్మణ్, భరమప్ప తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమని అడిగితే చంపుతామని బెదిరించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఎస్ఐ ఆనంద్, డీఎస్పీకి విజ్ఞప్తి చేసినా కూడా వారు స్పందించలేదని, వారు కూడా వారిలానే తనను చంపుతామని బెదిరించారని రవీంద్ర ఆత్మహత్యకు ముందు రాసిన డెత్నోట్లో వివరించారు. ఘటనా స్థలాన్ని మూడలిగి పోలీసులు పరిశీలించారు. రవీంద్ర భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కాగితాలు ఏరుకునే వ్యక్తి పేరిట.. బీమా మోసం!
సుల్తాన్బజార్: చనిపోయిన వ్యక్తి పేరు మీద రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని బీమా డబ్బులు కాజేయాలని చూసిన ఓ ముఠా గుట్టును సుల్తాన్బజార్ పోలీసులు రట్టు చేశారు. చాదర్ఘాట్ వద్ద కాగితాలు ఏరుకుంటూ బతికే తలారి వెంకటయ్య అనే వ్యక్తి 2023 జనవరి 9న విద్యుదాఘాతంతో చనిపోయాడు.ఈ మరణాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న బోడ శ్రీకృష్ణ అనే వ్యక్తి స్టార్ హెల్త్ ఏజెంట్ మల్దే మహేష్, సేల్స్ మేనేజర్ మడసిరావార వంశీకృష్ణలతో కుమ్మకై పక్కా స్కెచ్ వేశాడు. 2024 డిసెంబర్లో వెంకటయ్య పేరు మీద స్టార్ హెల్త్ యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకున్నారు. మృతుడి బావమరిదినంటూ శ్రీకృష్ణ నామినీగా నమోదు చేసుకున్నాడు. 2025 ఏప్రిల్ 28న ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల పాత ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం, ఇన్వెస్ట్ రిపోర్టులను ఫోర్జరీ చేశారు.క్లైమ్ కోసం దరఖాస్తు చేయగా స్టార్ హెల్త్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మహ్మద్ అబ్దుల్ బారీ చేసిన అంతర్గత విచారణలో బండారం బయటపడింది. పాలసీ తీసుకోవడాని కంటే ముందే వెంకటయ్య చనిపోయాడని తేలడంతో 2026 మే 14న సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడికి తరలించారు. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మత్తయ్య పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్ఐ వేణు ఈ కేసును ఛేదించారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
సిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందగా, కారులో ఉన్న కొడుకు, కోడలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొలిపాక రవిచంద్రకాంత్ (49) కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం సిద్దిపేటకు బతుకుదెరువుకు వచ్చాడు. గోల్డెన్ ఫ్రేమ్స్ పేరిట ఫ్లెక్సీ ప్రింటింగ్, ఫొటో ఫ్రేమ్స్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సునీత (45), కుమారుడు అజయ్, కూతురు ఉన్నారు. అజయ్కు ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. వేసవి కావడంతో స్వగ్రామం మణుగూరుకు నాలుగు రోజుల క్రితం వెళ్లారు. మంగళవారం ఉదయం 4.30 గంటలకు కారులో సిద్దిపేటకు బయల్దేరారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మిట్టపల్లి శివారులోకి రాగానే వేబ్రిడ్జి పక్కన నిలిపిన ఇసుక లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో కారు సగ భాగం చొచ్చుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న రవిచంద్రకాంత్, అతని భార్య సునీత అక్కడికక్కడే మృతి చెందారు. వెనక సీట్లో కూర్చున్న కొడుకు అజయ్, కోడలు అర్చన తలకు తీవ్ర గాయాలు కాగా కుడి కాలు కూడా విరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. అర్చన తండ్రి అంకం ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వీడియోలు
అన్నా నువ్వే మాకు దిక్కు... బాధపడకు అమ్మా.. ఎలా న్యాయం జరగదో నేనూ చూస్తా..!
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు సంచలన కామెంట్స్
Viral Video: మేం ఏ తప్పు చెయ్యలేదు.. కావాలనే ఆ ముగ్గురు చేస్తున్నారు
నువ్వేంటో, నీ స్థాయేంటో తెలుసుకో..! పవన్ పై అడ్వకేట్స్ కేసు
జగన్ ముందే జీవోలన్నీ గుక్కతిప్పుకోకుండా చెప్పిన.. డీఎస్సీ అభ్యర్థి!
సుగాలి ప్రీతీ చావును వాడుకొని, రోజా స్టాంగ్ రియాక్షన్
వీసా మోసం..యూట్యూబర్ నందూస్ ఫ్యామిలీపై కేసు
కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు.. 5 రోజులు ఉరుములు.. మెరుపులు
ఉరికించి ఉరికించి తంతం..! నువ్వు తెలంగాణ వచ్చి ఏం పీకుతావ్...
డీకే శివకుమార్ అనే నేను.. కర్ణాటక నూతన సీఎంగా ...!

