హైడ్రాను ప్రభుత్వం పావుగా వాడుకుంటోందా?
అమృతా ప్రణయ్లాంటి సంచలనాత్మక కేసును డీల్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్.. ఆ తర్వాతి కాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న హైడ్రా అనే ఓ వ్యవస్థను కమిషనర్ హోదాలో ముందుకు నడిపిస్తున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా సరే.. హైడ్రా ‘రైట్ రూట్’లోనే ముందుకు వెళ్తోందని అంటున్నారాయన. అలాంటి వ్యక్తి.. నిబంధనలకు విరుద్ధంగా చెరువులో ఇల్లు కట్టుకుని ఉంటున్నారా?.. సాక్షి డిజిటల్కు ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రభుత్వం మారితే హైడ్రా పరిస్థితి?రంగనాథ్: హైడ్రాకు ఐదేళ్లు ఏమాత్రం సరిపోదు. పది.. పదిహేనేళ్లు.. ఇలా నిరంతరాయంగా పని చేసినా సరిపోవు. ఉదాహరణకు.. మన చుట్టురా వేల చెరువులు ఉన్నాయి. వాటి పునరుద్దరణకు మొదటి అడుగు వేశాం. అదసలు అలా కొనసాగుతుంది. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువైంది. వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ అనేది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి(ఆర్టికల్ 51-A(g) ప్రకారం). పొరుగున ఉన్న కర్ణాటకలో చూసుకుంటే చెరువుల సంరక్షణ 2008 నుంచే కొనసాగుతుంది. అక్కడ ఇన్నేళ్లలో ప్రభుత్వాలు మారాయి కదా. కాబట్టి.. ఆ అవకాశాలను కొట్టిపారేయలేం.ప్రభుత్వాన్ని, బ్యూరోక్రట్లు వేరుగా చూసే పరిస్థితులు ఉన్నాయా? రంగనాథ్: నా భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వం సామాన్యులను కాలుస్తోంది అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. పావుగా వాడుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వం ఛాయిస్. అలాగే ఆ అధికారులపై విమర్శలు వచ్చినప్పుడు.. సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కూడా. ఈ సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదు. వాటికి హైడ్రా అనే వ్యవస్థ దూరం కూడా.ఒత్తిళ్లతో పెద్దవాళ్లను టచ్ చేయట్లేదన్న విమర్శలపై ఏమంటారు?రంగనాథ్: 2024 జులైలో హైడ్రా ఏర్పాటైంది. ఆగస్టు నుంచి అక్రమ కట్టడాలపై కొరడా జులిపించడం మొదలుపెట్టాం. పేదవాళ్ల ఇళ్లనే కాదు.. ప్రముఖుల నిర్మాణాలనూ వదిలిపెట్టలేదు. ఎన్ కన్వెషన్ కూల్చివేత అందుకు ఉదాహరణ. సినీ, రాజకీయ, వ్యాపార.. ఇతర రంగాల ప్రముఖుల కట్టడాలను కూల్చేశాం. కొన్నిసార్లు సామాజిక కోణంలో చూశాం. అందుకే ఎన్నో బస్తీలను వదిలేశాం. కొన్ని కేసుల్లో న్యాయం కూడా అందించాం. కొన్నింటికి ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) ఇంకా డిసైడ్ కాలేదు. ఒక్కసారిగా ఫిక్స్ అయితే వాటిని వదిలిపెట్టం. సోషల్ మీడియాలో ప్రచారాన్ని పట్టుకుని హైడ్రా పని తీరును శంకించాల్సిన అవసరం లేదు. వాటిని పట్టించుకోం కూడా. పనిలో 100 పర్సంట్ స్ట్రయిక్ రేట్ కోసం ప్రయత్నిస్తున్నాం. నమ్మకం ఉంది కాబట్టే హైడ్రా ప్రజావాణికి జనం ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి కదా.ఒవైసీ కాలేజ్ను టచ్ చేయలేదన్న రాజకీయ విమర్శల నేపథ్యంలో తీసుకోబోయే యాక్షన్ ఎలా ఉందనుంది?రంగనాథ్: ఒవైసీ కాలేజీలాగే చాలా భవనాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్క ఆ కాలేజ్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలి?. అక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఉండవచ్చు, పుల్లారెడ్డి లేదంటే వెంకట్ రెడ్డి కాలేజీ ఉండొచ్చు.. ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఒక నిర్దిష్టమైన పాలసీ లేకపోవడం వల్ల వాటికి ఎలాంటి పరిష్కారం కనిపించదు. నిజంగా మనం ఒక్క లింక్పై మాత్రమే దృష్టి సారిస్తున్నాం. ఒక్క కేసును మాత్రమే ఎత్తి చూపుతున్నాం. ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ హైడ్రా సైలెంట్గా ప్రభుత్వ భూముల్ని, చెరువులను కబ్జా చేసిన వాటిని కూలగొట్టి ఎంతో మేలు చేస్తున్నాం.వేల, లక్షల కోట్ల ప్రజా ధనాన్ని కాపాడుతున్నాం. హైడ్రా అనేది దేశంలోనే వినూత్నమైన ప్రభుత్వం. జాతీయ మీడియా సంస్థలే కాదు.. ఐఎస్బీ కూడా హైడ్రాను ప్రస్తావించింది. ముంబైలోనూ హైడ్రా తరహా వ్యవస్థ కోరుకుంటున్నారు. అలాగే హైడ్రా పని తీరు కూడా మారింది. కూలగొట్టడమే కాదు.. చెరువుల పునర్మిరాణాలు చేపడుతోంది. కొందరు హైడ్రా పరిధి పెంచమని కోరుతున్నారు. దేవదాయ భూముల్ని ఎందుకు పరిరకక్షించకూడదని అనుకుంటున్నాం కూడా. కానీ, పాలసీ, ఎఫ్టీఎల్ ఫైనల్ నోటిఫికేషన్పై క్లారిటీ రావాల్సి ఉంది. కోర్టులు కూడా ఈ విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కోర్టులకు వాస్తవాలు వివరించే ప్రయత్నాలు మేం చేస్తున్నాం.హైడ్రా కార్యాచరణలో లోపాల గురించి..రంగనాథ్:చూసే వాళ్లను బట్టి ఉంటుంది. చెరువుల్లో వ్యర్థాలు చికెన్, మటన్, చేపల వేస్టేజ్లు పడేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెళ్లి సమస్య పరిష్కరించాం. నష్టంగా భావించేవాళ్లు.. వేళ్లమీద లెక్కపెట్టుకునేవాళ్లు. వాళ్లు హైడ్రా ఉద్దేశాలను తప్పుబడతారు. కానీ, వందల, వేల, లక్షల మందికి మంచి జరుగుతోంది. వాళ్లు మౌనంగా ఉంటారు. జరిగే మంచి గురించి వాళ్లు మాట్లాడుకోరు. మాట్లాడే ఆ ఒకరిద్దరి గురించే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా!. కాబట్టి ఉద్దేశం మంచిదే.. అలాగే కార్యాచరలోనూ సవ్యంగానే ఉంది.మీ ఇల్లు కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఉందంట కదా?రంగనాథ్: నేను ఉండేది మధురానగర్లో. నా ఇంటికి కిలోమీటర్ దూరంలో కృష్ణకాంత్ పార్క్ ఉంది. అది ఒకప్పుడు చెరువు. ఆ చెరువు దిగువన ప్రాంతంలో నేను ఉంటా. అది ఎఫ్టీఎల్ పరిధికి ఎంతో దూరం. ఎవరో సెన్స్ లేకుండా కాంట్రవర్సిటీ కోసం క్రియేట్ చేసింది. హైడ్రా మీద వీలైనంత మంది అన్ని విధాల దాడులు చేశారు.. ఇంకా చేస్తున్నారు. అందులో భాగమే ఈ ప్రచారం కూడా.(నవ్వుతూ..)రంగనాథ్ కూల్చివేతలకు వెళ్లడం అవసరమా?రంగనాథ్: కచ్చితంగా అలా అనేం లేదు. ఆఫీస్ నుంచి కూడా పర్యవేక్షించొచ్చు. కానీ, ఒక్కోసారి హైడ్రా కమిషనర్గా అది నా బాధ్యత. ఎన్నో ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి.. విమర్శలు వస్తుంటాయి. ఆ బాధ్యతలను ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా.. జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆపరేషన్లప్పుడు మాత్రం బాధనిపిస్తుంది. బ్యూరోక్రట్గా, సివిల్ సర్వెంట్గా, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా.. తక్కువ మందికి డ్యామేజ్ కలిగేలా ఎక్కువ మందికి లాభం కలిగేలా చూడాల్సిందే. అప్పుడే కదా.. తర్వాతి తరాలు హైడ్రా గురించి మాట్లాడుకునేది.
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?
వైట్ కాలర్ ఉద్యోగాలకు గడ్డుకాలం మొదలైందా? రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా? విజృంభిస్తున్న ‘ఏఐ(AI) మహమ్మారి’ మానవ ఉద్యోగాలను మింగేస్తోందన్న భయాలు నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలను సైతం వణికిస్తున్న ‘ఆంథ్రోపిక్’ సీఈవో డారియో అమోడేయి చేసిన తాజా హెచ్చరికలు ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తుపై భయాన్ని రేకెత్తిస్తున్నాయి.ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర పతనంఅమోడేయి వ్యాఖ్యల తర్వాత విడుదలైన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు ఆయన అంచనాలకు అనూహ్యంగా సరిపోలడం ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. తాజా లేబర్ డేటా ప్రకారం.. గత డిసెంబర్ ఆఖరు నాటికి అమెరికాలో ఉద్యోగ ఖాళీలు 65.4 లక్షలకు పడిపోయాయి. 2020 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.ఏఐ వల్ల భారీ ఉద్యోగ నష్టంజనవరి చివరలో అమోడేయి “ది అడోలెసెన్స్ ఆఫ్ టెక్నాలజీ” అనే పేరుతో సుమారు 20,000 పదాల సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇవీ..“రాబోయే 1–5 సంవత్సరాల్లో ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం వరకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు, 1–2 సంవత్సరాల్లో మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యం గల ఏఐ కూడా సాధ్యమే”2021లో ఆంథ్రోపిక్ను సహ-వ్యవస్థాపకుడిగా స్థాపించిన అమోడేయి, ఏఐ అభివృద్ధి వేగం కారణంగా లేబర్ మార్కెట్లో ‘అసాధారణ, బాధాకరమైన షాక్’ తప్పదని హెచ్చరించారు.“ఏఐ పురోగతి వేగం గతంలో వచ్చిన ఇతర సాంకేతిక విప్లవాల కన్నా వేగంగా ఉంది. ఉద్యోగం చేసే విధానం మారడమే కాదు, కొత్త ఉద్యోగాలకు మారాల్సిన అవసరం కూడా ప్రజలకు తీవ్ర సవాల్గా మారుతుంది”ఏఐ ఏదో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడం కాదు.. ‘మానవ కార్మిక శక్తికే ప్రత్యామ్నాయం’గా మారుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. న్యాయ శాఖ, ఫైనాన్స్, కన్సల్టింగ్ వంటి రంగాలు కూడా దీని ప్రభావానికి లోనవుతాయని హెచ్చరించారు.తరువాత ఎన్బీసీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ, ఉద్యోగ మార్కెట్పై ఏఐ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.నియామకాలు కనిష్టానికి.. తొగింపులు గరిష్టానికి..ఈ వారం విడుదలైన తాజా డేటా, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తోంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు మళ్లీ 65.4 లక్షలకే పరిమితమయ్యాయి. అదే రోజు విడుదలైన ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ నివేదిక ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు కేవలం 5,306 నియామక ప్రణాళికలను మాత్రమే ప్రకటించారు. 2009 నుంచి డేటా సేకరణ ప్రారంభించిన తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య.ఇదిలా ఉండగా, జనవరి 31తో ముగిసిన వారంలో 2.31 లక్షల మంది తాము నిరుద్యోగులుగా ఉన్నట్లు క్లెయిమ్ చేశారు. ఇది గత వారంతో పోలిస్తే 22,000 పెరుగుదల. అమెజాన్, యూపీఎస్ వంటి సంస్థలు ప్రకటించిన భారీ తొలగింపులు ఈ జనవరిని గ్రేట్ రిసెషన్ తర్వాత మళ్లీ అంత చెత్త నెలగా మార్చాయని ఛాలెంజర్ నివేదిక పేర్కొంది.నెలవారీ గణాంకాల ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు 1,08,435 ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇది డిసెంబర్తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ కాగా, 2025 జనవరితో పోలిస్తే రెండింతలకుపైగా ఉంది. ఈ తొలగింపుల్లో అమెజాన్, యూపీఎస్ సంస్థల వాటా 40 శాతం. రవాణా, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఆర్థిక రంగాల్లో ఈ కోతలు ఎక్కువగా నమోదయ్యాయి.ఏఐ పాత్ర ఎంతవరకు?ఏఐ కారణంగా నేరుగా 7,624 ఉద్యోగ కోతలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. అయితే, “తొలగింపులపై ఏఐ ప్రభావం ఎంతవరకు ఉందో ఖచ్చితంగా చెప్పడం కష్టం” అని ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ ఛీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఆండీ ఛాలెంజర్ చెప్పారు. అయినా, చాలా సంస్థలు ఏఐ అమలుపై దృష్టి పెడుతున్నాయని, మార్కెట్ కూడా ఏఐని ప్రస్తావించే కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నాంపల్లి: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై అనుమానాలు!
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలకమైన తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ మొదటి ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే సీజ్డ్ ప్రాపర్టీ గదిలోని కీలక కేసులకు సంబంధించిన పేపర్ ఫైల్స్, హార్డ్ డిస్క్లు అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు ధృవీకరించారు.శనివారం ఉదయం 10గం. ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన వాచ్మన్ అధికారులకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం అంతటా దట్టమైన పొగలు అలముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే.. తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగలిగారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఇక ఈ ల్యాబ్లోనే డీఎన్ఏ పరీక్షలు, ఫింగర్ప్రింట్ విశ్లేషణకు సంబంధించిన వివరాలు ఉంటాయి. కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను ఇక్కడే భద్రపరుస్తారు. వాటికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో ప్రమాదం జరిగింది. ఉదయం 10:30 గంటలకు సమాచారం అందడంతో హుటాహుటిన వచ్చాం. ఫైర్ సిబ్బంది శ్రమతో మంటలు అదుపులోకి వచ్చాయి. మొదటి అంతస్తులోని వివిధ కేసుల్లో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. పలు కేసుల్లో సీజ్ చేసిన 40-50 కంప్యూటర్లు కాలిపోయాయి. మొదటి అంతస్తులో సెన్సిటివ్గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు బూడిదయ్యాయి. కెమికల్ లాబ్ మెటీరియల్ అంత రెండవ అంతస్తులో ఉంది. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగింది’’ అని తెలిపారు. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ అత్యంత కీలకమైంది. ఓటుకు నోటు కేసులో వీడియో, ఆడియో ఫైల్స్తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. అలాగే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డాటా, హార్డ్ డిస్కులు ఇక్కడే ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేవలం సీజ్డ్ గదిలోనే ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఏం కొడుకువిరా నువ్వు..
''నా కొడుకు బారి నుంచి నన్ను కాపాడండి'' అని వన దేవతలు సమ్మక్క–సారలమ్మలను వేడుకున్నాడో భక్తుడు. తన వేదనను వంద రూపాయల నోటుపై రాసి హుండీలో వేశాడు. మరికొంత మంది భక్తుల నుంచి కూడా ఇలాంటి వేడుకోళ్లు వచ్చాయి. ముదిమి వయసులో ముసలి తల్లిదండ్రులను వేదనకు గురిచేస్తున్న విదారక ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. కడుపున పుట్టిన పిల్లలను పెంచి, ప్రయోజకులను చేసిన అమ్మనాన్నలకు చివరి రోజుల్లో చీదరింపులే ఎదురవుతున్నాయి. జీవిత చరమాంకంలో తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన పిల్లలు వదిలించుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ పట్టణంలోని బస్టాండ్లో 80 ఏళ్ల వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. దీంతో ప్రయాణికుడొకరు ఏమైందని ఆరా తీశాడు. తనను కొడుకు, కోడలు వదిలేసి వెళ్లిపోయారని పెద్దావిడ వాపోయింది. తన కుమారుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని, అతడి పేరు సురేష్ శర్మ అని తెలిపింది. తనను కొడుకు- కోడలు సరిగ్గా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది. అమ్మను వదిలేసి వెళ్లిన కొడుకుపై నెటిజనులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.నెటిజన్ల స్పందనపిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ జీవితాలను ధారపోస్తారని, అలాంటి వారిని చివరి రోజుల్లో చూసుకోవడం వారసుల బాధ్యత మాత్రమే కాదు.. గౌరవం కూడా అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. తన కొడుకు పుట్టినప్పటి నుంచి అతడికి వాళ్లమ్మ పెట్టిన డబ్బు, ఆహారం, భద్రత, ఆశ్రయం, సంరక్షణకు మూల్యం వసూలు చేయడానికి కేసు పెట్టాలని మరొకరు సూచించారు. ఓరి దేవుడా! వృద్ధురాలు అలా ఏడుస్తుండటం తాను చూడలేకపోతున్నానని, ఇది చాలా హృదయ విదారకంగా ఉందని ఇంకొకరు ఆవేదన చెందారు. మన సమాజంలో మానవత్వం ఇంత దిగజారిపోతుందని ఊహించలేకపోతున్నానని మరొకరు అన్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎక్కువ కాలం బతకం కూడా శాపంగా కింద భావించాల్సి వస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.చదవండి: 100 రూపాయల నోటుపై రాసి.. కాపాడాలని వేడుకోలువీడియోలోని వృద్ధురాలికి ఎవరైనా సహాయం చేశారా? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందనే వివరాలు తెలియరాలేదు. తల్లిని వదిలేసి వెళ్లిన కొడుకును కచ్చితంగా శిక్షించాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో కనుమరుగవుతున్న మానవీయ విలువలకు ఈ ఉదంతం అద్దం పడుతోందని ఆలోచనాపరులు నిట్టూరుస్తున్నారు. Elderly Mother aged 80 Abandoned at Bus Stand in Mandsaur by son after pressure from his wifeThe idea of family losing its meaning?Are aging parents become inconvenient liabilities in their own homes?This incident is not an isolated case. It reflects a growing moral crisis… pic.twitter.com/Cjsemah4AE— Woke Eminent (@WokePandemic) February 4, 2026
హమ్మయ్యా! మీ‘దిష్టి’ మా రాష్ట్రానికి తగులుతుందని భయపడ్డాం!
వికృత ‘కాస్టింగ్ కౌచ్’ క్రీడకు మూలం!
కూటమి కోరల్లో కాలకూటం!
కత్తిపోట్ల కలకలం.. రష్యాలో భారతీయ విద్యార్థులపై దాడి
మాస్క్ల మాయాజాలం
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
చెన్నైలో మంచు లక్ష్మికి చేదు అనుభవం
IND vs USA: యూఎస్ఏపై టీమిండియా విజయం
IND vs PAK: అదెలా?.. పాకిస్తాన్కు ఐసీసీ ప్రశ్న
చంద్రబాబు కుటుంబ సంస్థ ‘హెరిటేజ్’ బండారం బట్టబయలు
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
IND vs PAK: పాకిస్తాన్కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ
మన వాళ్లు నిఘా విభాగం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నార్సార్!
ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ధనలబ్ధి పొందుతారు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఇలా వారానికొకసారి కనిపించి వెళ్లు!
కరుగుతున్న వెండి.. బంగారం
క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
రియాన్ పరాగ్ విధ్వంసం.. పసికూనను చిత్తు చేసిన భారత్
T20 WC 2026: సిరాజ్కు గోల్డెన్ ఛాన్స్!
నా మూవీ చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్
బంగారం ధరల్లో మార్పు!.. స్వల్ప వ్యవధిలోనే..
టామ్ & జెర్రీ
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?
శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
అర్జున్ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్..
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
న్యూస్టార్ట్ ముగింపు.. తీవ్ర ఒత్తిడిలో భారత్!
హమ్మయ్యా! మీ‘దిష్టి’ మా రాష్ట్రానికి తగులుతుందని భయపడ్డాం!
వికృత ‘కాస్టింగ్ కౌచ్’ క్రీడకు మూలం!
కూటమి కోరల్లో కాలకూటం!
కత్తిపోట్ల కలకలం.. రష్యాలో భారతీయ విద్యార్థులపై దాడి
మాస్క్ల మాయాజాలం
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
చెన్నైలో మంచు లక్ష్మికి చేదు అనుభవం
IND vs USA: యూఎస్ఏపై టీమిండియా విజయం
IND vs PAK: అదెలా?.. పాకిస్తాన్కు ఐసీసీ ప్రశ్న
చంద్రబాబు కుటుంబ సంస్థ ‘హెరిటేజ్’ బండారం బట్టబయలు
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
IND vs PAK: పాకిస్తాన్కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ
మన వాళ్లు నిఘా విభాగం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నార్సార్!
ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ధనలబ్ధి పొందుతారు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఇలా వారానికొకసారి కనిపించి వెళ్లు!
కరుగుతున్న వెండి.. బంగారం
క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
రియాన్ పరాగ్ విధ్వంసం.. పసికూనను చిత్తు చేసిన భారత్
T20 WC 2026: సిరాజ్కు గోల్డెన్ ఛాన్స్!
నా మూవీ చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్
బంగారం ధరల్లో మార్పు!.. స్వల్ప వ్యవధిలోనే..
టామ్ & జెర్రీ
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?
శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
అర్జున్ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్..
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
న్యూస్టార్ట్ ముగింపు.. తీవ్ర ఒత్తిడిలో భారత్!
ఫొటోలు
వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)
సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)
ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)
కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)
మాదాపూర్ : శిల్పారామంలో ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్మేళా –2026 (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
ఐస్క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)
జగన్ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)
హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
సినిమా
నా మూవీ చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్తో కలిసి సినిమా చూశాడు చంద్రహాస్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'నాకు మాటలు రావడం లేదు. రెండు, మూడు నెలల కిందట మ్యూజిక్ లేకుండా సినిమా చూశాను. ఏడుపాగలేదుఫైనల్ కాపీ చూడలేదు. ఇప్పుడిలా థియేటర్లో సినిమా చూస్తుంటే చాలా బాగుంది. చివరి 10 నిమిషాలైతే నాకు ఏడుపొచ్చేసింది. థియేటర్లో సినిమా చూస్తున్న అందరూ చివర్లో లేచి చప్పట్లు కొట్టారు. వేరే (పాట) వివాదం వల్ల నా సినిమా చూసేందుకు జనం రారేమో అని భయపడ్డాను. నా మూవీపై ఎఫెక్ట్ పడుతుందేమోనని చాలా భయమేసింది' అంటూ చంద్రహాస్ ఏడ్చేశాడు. ఏంటా వివాదం?బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ ఓ పాట పాడాడు. అందులో బూతు పదాలు దొర్లడంతో అతడిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. హీరో అయుండి ఇలా వేదికపై అసభ్య పదాలు ఉపయోగించే పాట పాడతావా? ప్రమోషన్ కోసం ఇంత దిగజారాలా? అని విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్ వల్ల సినిమాపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని చిత్రయూనిట్ భయపడ్డారు. సినిమా విషయానికి వస్తే.. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించింది. అర్జున్ మహి విలన్గా యాక్ట్ చేశాడు. సంపత్ రుద్ర దర్శకత్వం వహించగా కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, ఏవీఆర్, గాయత్రి చిన్ని నిర్మించారు.చదవండి: ఏడేళ్లుగా మంచానికే పరిమితమైన ముమైత్ ఖాన్
ఫంకీ ట్రైలర్: పంచులే పంచులు!
గతేడాది 'లైలా' సినిమాతో బొక్కబోర్లా పడ్డాడు హీరో విశ్వక్సేన్. ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కామెడీ జానర్ ఎంచుకున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేశాడు. డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా నటించింది. శనివారం (ఫిబ్రవరి 7న) ఫంకీ ట్రైలర్ రిలీజ్ చేశారు.ట్రైలర్ నిండా పంచులేట్రైలర్ ప్రారంభం నుంచే పంచులతో, కామెడీతో అదిరిపోయింది. మీ అమ్మకు ఆపరేషన్ చేయాలంటే నాకు రాదు డాక్టర్ అన్న డైలాగ్తో వీడియో మొదలైంది. ఓనర్కు రెంట్ కట్టుడు వంటివన్నీ నాకు గలీజ్ అనిపిస్తయ్ అంటాడు హీరో. ట్రైలర్ ముగింపు వరకు పంచులకు లోటే లేకుండా కట్ చేశారు. మొత్తానికి ట్రైలర్తోనే మంచి హైప్ ఇచ్చారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదలవుతోంది.
గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
నేపాల్ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సునీల్ థాపా (68) కన్నుమూశారు. శనివారం(ఫిబ్రవరి 7) ఉదయం గుండెపోటుకి గురికావడంతో వెంటనే ఖాట్మండ్లోని థాపాతలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఉదయం 7.44 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.నేపాల్లోని డాంగ్లో జన్మించిన సునీల్ థాపా, సుమారు 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగారు. నేపాలీ, బాలీవుడ్, భోజ్పూరితో పాటు మొత్తం పలు భాషల్లో 300లకు పైగా సినిమాల్లో నటించాడు. సునీల్ థాపా మరణం పట్ల నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కార్కీతో పాటు ‘మిరాయ్’ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించింది.
రేణూదేశాయ్ మాత్రమే కాదు... రామ్ చరణ్ కూడా!
ఇటీవల శునకాలను తుదముట్టించడాన్ని నిరసిస్తూ నటి రేణూ దేశాయ్ నిర్వహించిన ప్రెస్ మీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తారల్లో అత్యధికులు శునకాభిమానులే. వీరు పెట్స్ను పెంచుకోవడం మాత్రమే కాదు వాటికి ఎంత విలువు ఇస్తారంటే తమ ఇంటిపేరు తగిలించి మరీ వాటికి నామకరణం చేసి తమ ఫ్యామిలీ మెంబర్లా కలిపేసుకుంటారు. అయితే వారి ఈ రేంజ్ శునకాభిమానానికి నోచుకునేవి స్ట్రీట్ డాగ్స్ కాదు...మంచి పేరున్న బ్రీడ్స్. ఈ నేపధ్యంలో పలు సందర్భాల్లో స్వయంగా తామే పంచుకున్న తారల పెట్ ప్రేమ గురించిన విశేషాలివి...– ఫ్రెంచ్ బుల్ డాగ్స్ తో తాను ప్రేమలో పడ్డానని తరచు చెబుతుంది సమంత. ఆమెకు హాష్ సాషా అనే రెండు పెట్స్ ఉన్నాయి. తన ప్రియమైన పెంపుడు జంతువులతో సరదాగా గడిపే క్షణాలను ఆమె తరచుగా తన అభిమానులకు అందిస్తుంది. ఇటీవల హోలీ రోజున హోలీ ఆడిన తర్వాత తన పెంపుడు జంతువులతో ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది– అలాగే టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ కు సైబీరియన్ బ్రీడ్ హస్కీ పెట్ ఫ్రెండ్. ఆయన దానికి స్ట్రోమ్ దేవరకొండ అంటూ తన ఇంటిపేరు కలిసొచ్చేలా పేరు పెట్టాడు. ఆయన ప్రియురాలు, నేషనల్ క్రష్ రష్మికకు విజయ్ దేవరకొండ తో పాటు ’ఆరా’ అనే తన పెంపుడు శునకం మీద కూడా క్రష్ ఉంది–ఇక మెగాస్టార్ వారసుడు రామ్చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఇద్దరూ పెట్ లవర్సే. మొదట్లో రామ్ చరణ్ కు బ్రాట్ అనే పిలుచుకునే బ్లాక్ల్ లాబ్రడార్ ఉండేది అయితే కొన్ని సంవత్సరాల క్రితం దానిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఉపాసన ఆయనకు ఒక పెట్ను బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం ఈ జంటకు రైమ్ అనే ముద్దుల పెట్ ఉంది. జాతి ప్రకారం ఫ్రెంచ్ బార్బెట్ లాగా ఈ రైమ్, కనిపిస్తుంది, ఈ జంట తమ పెట్స్తో గడిపే చిత్రాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది వీలున్నంత వరకూ వీరి పెట్ కూడా వీరితో కలిసి ప్రయాణాలు చేస్తుంది. తద్వారా విమానాశ్రయాల్లో ఫొటోలకు చిక్కి స్టార్స్ సరసన మీడియాలో పబ్లిసిటీ కూడా దక్కించుకుంటుంది. షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తాను చేసే మొదటి పని తన పెట్ ఎలా ఉందో చూడటమే అంటాడు రామ్ చరణ్. తన పెంపుడు జంతువును చూసినప్పుడల్లా ఓదార్పు ఓ పాజిటివ్ వైబ్ తక్షణమే లభిస్తుందని దానితో ఉన్నప్పుడు తన నిజమైన భావోద్వేగాలు బయటకొస్తాయంటున్న పెద్ది... తనపెట్తో కలిసి ఈత కొట్టడం తనకెంతో ఇష్టమంటున్నాడు. – దక్షిణాది సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ దగ్గర పలు పెట్స్ ఉన్నాయి. ఆమె తన పెట్స్తో పాటు వీధి కుక్కల పట్ల కూడా ప్రేమను పంచుతుంది. శునకాలను ప్రేమించడం మాత్రమే కాదు, వాటిని రక్షించేందుకూ అనుష్క శెట్టి పనచేస్తుంటుంది. ఆమె పెంపుడు కుక్కలతో పాటు, బ్లూ క్రాస్ పెట్ కార్నివాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. తన నిజమైన ఓదార్పు తన పెంపుడు జంతువులతో సమయం గడపడంలోనే లభిస్తుందని అనుష్క చెప్పింది. అదే విధంగా కాజల్ అగర్వాల్ ఎంతో ప్రేమించే పెట్ పేరు సీజర్. ఆమెకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఇక దానితోనే గడుపుతుంది. టాలీవుడ్ నటుడు మంచు మనోజ్కు జ్యూస్ అనే పెంపుడు శునకం ఉంది దానిని తరచుగా తనతో బయటకు తీసుకు వెళుతుంటాడు. బహిరంగంగా దానిపై తన ప్రేమను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. హైదరాబాద్లోని దుర్గం చెరువు దగ్గర మనోజ్ షికార్లు చేస్తూన్న ఫొటోను కూడా అతను ఫ్యాన్స్తో పంచుకున్నాడు. ఆయన సోదరి నటి లక్ష్మీ మంచు కూడా ’చందమామ కథలు’ అనే సినిమా ద్వారా తన పెంపుడు కుక్క జ్యూస్ ఆనంద్ మంచును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.సిద్ధార్థకు మురికివాడలో దొరికిన కొడుకు...హీరో సిద్ధార్థ్ ఇటీవల ఓ ట్వీట్ చేశాడు.. ’నాకు ఒక కొడుకు ఉన్నాడు, అతనికి నాలుగు కాళ్లు వంకర తోక ఉన్నాయి. అతని పేరు మౌగ్లీ. ప్రస్తుతం అతనికి 10 సంవత్సరాలు, నేను అతన్ని ఒక మురికివాడలో కష్టాల నుంచి ఒకసారి రక్షించాను తను తన నిస్సారమైన ప్రేమ ఆప్యాయతతో ఎప్పుడూ నన్ను రక్షిస్తున్నాడు. అతను ఒక మంచి శునకం. ప్రపంచంలోనే అత్యంత పిరికివాడు కూడా, అయితే ఆ పిరికితనాన్ని బిగ్గరగా మొరగడం ద్వారా దాస్తుంటాడు’’ అంటూ తన పెట్ గురించిన కబుర్లు పంచుకున్నాడు.
క్రీడలు
T20 WC: చెలరేగిన షెఫర్డ్.. విండీస్ బోణీ
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ బోణీ కొట్టింది. పసికూన స్కాట్లాండ్ను చిత్తు చేసి శుభారంభం అందుకుంది. కోల్కతా వేదికగా గ్రూప్-‘సి’ నుంచి విండీస్- స్కాటిష్ జట్లు శనివారం తలపడ్డాయి.ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ (35) రాణించగా.. కెప్టెన్ షాయీ హోప్ (19) ఫర్వాలేదనిపించాడు. ఇక వన్డౌన్లో వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.మొత్తంగా 36 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో హెట్మెయిర్ 64 పరుగులు సాధించాడు. రోవ్మన్ పావెల్ (14 బంతుల్లో 24), షెర్ఫానే రూథర్ఫర్డ్ (13 బంతుల్లో 26) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి విండీస్ 182 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ క్యూరీ రెండు వికెట్లు తీయగా.. సఫ్యాన్ షరీఫ్, ఒలీవర్ డేవిడ్సన్, మైకేల్ లీస్క్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ ఆది నుంచే తడబడింది. టాపార్డర్లో జార్జ్ మూన్సే (19), బ్రాండన్ మెక్ముల్లన్ (14) నిరాశపరచగా.. మైకేల్ జోన్స్ (1) విఫలమయ్యాడు.ఇలాంటి తరుణంలో రిచీ బెరింగ్టన్ కెప్టెన్ ఇన్నింగ్స్ (24 బంతుల్లో 42)తో అలరించగా.. టామ్ బ్రూస్ (28 బంతుల్లో 35) అతడికి తోడుగా నిలిచాడు. అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం అందలేదు. మాథ్యూ క్రాస్ (11), మార్క్ వాట్ (15) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. 18.5 ఓవర్లలోనే స్కాట్లాండ్ ఆలౌట్ అయింది. 147 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా.. షెఫర్డ్ హ్యాట్రిక్తో కలిపి ఐదు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షమర్ జోసెఫ్, గుడకేశ్ మోటీ తలా ఒక వికెట్ తీసి తమ వంతు సాయం అందించారు.
IND vs USA: టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత యూఎస్ఏతో భారత్ తలపడుతోంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన యూఎస్ఏ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్కు దిగింది.సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమెరికా లక్ష్య ఛేదనకు దిగింది.T20 World Cup 2026 India vs United States of America Updatesటీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపుముంబై వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో టీమిండియా.. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ 84 పరుగులతో చేశాడు. ఛేదనలో అమెరికా జట్టు.. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే తలో 37 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పాటు అందించారు.19 ఓవర్లకు స్కోరు 121-719 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 121-7 స్కోరుతో నిలిచింది. క్రీజులో శుభం 27, స్కాల్క్ 2 ఉన్నారు.18 ఓవర్లకు స్కోరు 111-718 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 111-7 స్కోరుతో ఉంది. క్రీజులో శుభం 18, స్కాల్క్ 1 ఉన్నారు.ఏడో వికెట్ కోల్పోయిన అమెరికాఅమెరికా ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ మోసిన్ 8 పరుగులు చేసి అర్ష్దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు.17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 104-617 ఓవర్లు పూర్తయ్యేసరికి అమెరికా.. 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. శుభం 17, మోసిన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.16 ఓవర్లకు స్కోరు 100-6 16 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. శుభం 15, మోసిన్ 1 క్రీజులో ఉన్నారుఆరో వికెట్ కోల్పోయిన అమెరికా15.3: అక్షర్ పటేల్ బౌలింగ్లో హర్మీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. సిరాజ్ క్యాచ్ పట్టాడు.ఐదో వికెట్ కోల్పోయిన యూఎస్ఏ15.2: అక్షర్ పటేల్ బౌలింగ్లో సంజయ్ 37 పరుగుల దగ్గర క్యాచ్ ఔట్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన అమెరికా15 ఓవర్లకు స్కోరు 98-4సంజయ్ 37, శుభం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు13 ఓవర్లలో అమెరికా స్కోరు: 78-4సంజయ్ 26, శుభం 5 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్11.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మిలింద్ కుమార్ (34) స్టంపౌట్. నాలుగో వికెట్ కోల్పోయిన అమెరికా. స్కోరు: 71-4. విజయానికి 48 బంతులో 91 పరుగులు కావాలి.పది ఓవర్లలో అమెరికా స్కోరు: 49-3పవర్ ప్లేలో అమెరికా స్కోరు: 31-3(6).మిలింద్ 16, సంజయ్ 4 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన అమెరికా3.2: సిరాజ్ బౌలింగ్లో సాయితేజ ముక్కామల (2) వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చాడు. మిలింద్ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 13-3(3.2)రెండో వికెట్ కోల్పోయిన అమెరికా2.1: అర్ష్దీప్ బౌలింగ్లో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ (0) శివం దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 11-2(2.1). సాయితేజ ముక్కామల రెండు పరుగులతో ఉండగా.. మిలింద్ కుమార్ క్రీజులోకి వచ్చాడు.వికెట్ తీసిన సిరాజ్1.4: అనూహ్యంగా వరల్డ్కప్ జట్టులోకి.. తుదిజట్టులోకి వచ్చిన సిరాజ్ టీమిండియా బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే వికెట్ పడగొట్టాడు. సిరాజ్ బౌలింగ్లో తిలక్కు క్యాచ్ ఇచ్చి అమెరికా ఓపెనర్ ఆండ్రీ గౌస్ (6) వెనుదిరిగాడు.టీమిండియా స్కోరు: 161-9(20)తొమ్మిదో వికెట్ డౌన్19.6: వరుణ్ చక్రవర్తి (0) రనౌట్.. తొమ్మిదో వికెట్ డౌన్అర్ష్దీప్ అవుట్18.6: షాల్విక్ బౌలింగ్లో... ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన అర్ష్దీప్ సింగ్ (4) సూర్యకుమార్ హాఫ్ సెంచరీ36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్ఏడో వికెట్ కోల్పోయిన భారత్16.4: హర్మీత్ బౌలింగ్లో మొహ్సిన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అక్షర్ పటేల్ (14). క్రీజులోకి అర్ష్దీప్ సింగ్. సూర్య 47 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 118-7(16.4)అక్షర్, సూర్య ధనాధన్15: నేత్రావల్కర్ బౌలింగ్లో అక్షర్ 4,4 బాదగా.. సూర్య 4, 6 బాదాడు. ఒకే ఓవరల్లో 21 పరుగులు. స్కోరు: 115-6 (16).ఆరో వికెట్ కోల్పోయిన భారత్12.4: హర్మీత్ బౌలింగ్లో ఆరో వికెట్గా వెనుదిరిగిన హార్దిక్ పాండ్యా (5). క్రీజులోకి అక్షర్ పటేల్. స్కోరు: 85-6(13.5).ఐదో వికెట్ కోల్పోయిన భారత్11.4: మొహ్సిన్ బౌలింగ్లో మిలింద్కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ అవుట్ (6). సూర్య 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 72-5(11.4) పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 63-4 శివం దూబే డకౌట్5.6: వాన్ షాల్విక్ బౌలింగ్లో నేత్రావల్కర్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయిన శివం దూబే. పవర్ప్లేలో టీమిండియా స్కోరు: 46-4(6)తిలక్ వర్మ అవుట్5.5: మూడో వికెట్గా వెనుదిరిగిన తిలక్ వర్మ (16 బంతుల్లో 25; మూడు ఫోర్లు, ఒక సిక్స్). వాన్ షాల్విక్ బౌలింగ్ మోనాంక్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన తిలక్. శివం దూబే క్రీజులోకి రాగా.. సూర్య 1 పరుగుతో ఉన్నాడు. స్కోరు: 46-3(5.5)రెండో వికెట్ డౌన్5.2: వాన్ షాల్విక్ బౌలింగ్లో మిలింద్ కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుటైన ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, రెండు సిక్స్లు). క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్. తిలక్ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45-2(5.2).నాలుగు ఓవర్లలో టీమిండియా స్కోరు: 33-1తిలక్ 13 బంతుల్లో 23, ఇషాన్ 10 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్1.2: అలీ ఖాన్ బౌలింగ్లో సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ. ISHAN-DAAR SHURUAAT! 🔥He gets the scoreboard ticking with a maximum, and the crowd erupts at the Wankhede 😍ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/zmtTfy2q4Q— Star Sports (@StarSportsIndia) February 7, 2026తొలి ఓవర్లో ఏడు పరుగులుకట్టుదిట్టంగా నేత్రావల్కర్ బౌలింగ్... ఇషాన్ 7, అభిషేక్ 0 పరుగులతో ఉన్నారు. సంజూపై వేటుఇక ఊహించినట్లుగానే తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు దక్కగా.. సంజూ శాంసన్ (Sanju Samson)పై వేటు పడింది. ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూ స్థానాన్ని ఇషాన్ (Ishan Kishan) భర్తీ చేశాడు. కాగా గత కొంతకాలంగా సంజూ ఫామ్లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే.సిరాజ్కు లక్కీ ఛాన్స్అదే విధంగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) కూడా ఈ మ్యాచ్కు అందుబాటులో లేడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక పేస్ దళ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.కాగా హర్షిత్ రాణా గాయపడటంతో సిరాజ్కు అదృష్టం కలిసి వచ్చింది. రాణా స్థానంలో ఈ హైదరాబాదీ పేసర్ను తీసుకున్నట్లు శుక్రవారం బీసీసీఐ ప్రకటించగా.. బుమ్రా అనారోగ్యం వల్ల ఏకంగా తుదిజట్టులోనూ సిరాజ్కు స్థానం దక్కడం విశేషం.మరోవైపు.. యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ.. పిచ్ బాగుందని.. ఇక్కడ భారీ స్కోరు నమోదుకు ఆస్కారం ఉందని పేర్కొన్నాడు. తమ తుదిజట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్రౌండర్లు, ముగ్గురు బౌలర్లు ఉన్నట్లు తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2026: భారత్ వర్సెస్ యూఎస్ఏ తుదిజట్లుభారత్ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తియూఎస్ఏఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), సాయితేజ ముక్కామల, మోనాంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్
బిగ్ క్రికెటర్ అని ఒప్పుకోను: వైభవ్ సూర్యవంశీ తండ్రి
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే హాట్టాపిక్. ఫార్మాట్ ఏదైనా ఈ పాలబుగ్గల పిల్లాడికి బంతిని బౌండరీకి తరలించడమే తెలుసు.. విధ్వంసకర ఇన్నింగ్స్తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పీడకలను మిగల్చడం ఈ యువ బ్యాటర్కు అలవాటుగా మారింది..ఐసీసీ అండర్-19 వరల్డ్కప్ టోర్నీ-2026లో వైభవ్ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. పద్నాలుగేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఈ ఈవెంట్లో ఏడు మ్యాచ్లలో కలిపి మూడు అర్ధ శతకాలు.. ఓ సెంచరీ సాధించాడు. ఆ శతకం కూడా ఫైనల్లో.. అదీ ఇంగ్లండ్ జట్టుపై ఏకంగా 175 పరుగులు సాధించడం విశేషం.Carnage continues as Vaibhav Sooryavanshi brings up 150 in style! 🔥🤩The English bowlers have no answers as the Boss Baby is going all guns blazing with towering sixes! 🙌🏻😮💨ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/Dkh4YCXOEC— Star Sports (@StarSportsIndia) February 6, 2026 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్వరల్డ్కప్ ఫైనల్లో 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. పలు చిరస్మరణీయ రికార్డులు నెలకొల్పాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ బిహారీ కుర్రాడు.. వరల్డ్కప్ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో పాటు.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.Team India be like: Top karne ki aadat ho gayeli hai apun ko 🏆😎The 6th trophy for Team India in the ICC Men’s #U19WorldCup 🇮🇳Watch the highlights 👉 https://t.co/nXMmxDoivS pic.twitter.com/VDeA2PH3Gh— Star Sports (@StarSportsIndia) February 6, 2026పుత్రోత్సాహంఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా సాగిన అతడి విధ్వంసం గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇక వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పుత్రోత్సాహంతో ఆయన ఉప్పొంగిపోతున్నారు.అప్పటిదాకా బిగ్ క్రికెటర్ అని ఒప్పుకోనుఈ క్రమంలో సంజీవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. తను సాధించాల్సింది ఇంకెంతో ఉంది. వైభవ్ టెస్టు మ్యాచ్ ఆడేదాకా తననొక స్టార్ క్రికెటర్గా నేను పరిగణించను’’ అని సంజీవ్ సూర్యవంశీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.అదే విధంగా.. ‘‘నువ్వెంత గొప్పగా ఆడితే అంత హుందాగా, ఒద్దికగా ఉండాలని తనకు చెబుతూ ఉంటాను. సీనియర్లు, కోచ్లతో చర్చిస్తూ లోపాలు సరిచేసుకోవాలని చెప్తాను. ‘అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేశావు.. భేష్.. అయితే, ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం.టెస్టు క్రికెట్ ఆడటమే లక్ష్యంటీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని తనకు చెప్పాను. సచిన్ టెండుల్కర్ను చూసి ఓ క్రికెటర్ ఎలా ఉండాలో నేర్చుకోవాలని తనకి బోధించాను. టన్నుల కొద్దీ పరుగులు సాధించినా.. ఆయన ఎప్పుడూ ఒక్క వివాదంలోనూ చిక్కుకోలేదు. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆయనను ఆరాధిస్తున్న తీరు గురించి తరచూ చెబుతూ ఉంటాను’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నారు. తద్వారా తన కుమారుడు కెరీర్లోనే కాదు వ్యక్తిత్వంలోనూ మిన్నగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పకనే చెప్పారు సంజీవ్.చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్ బోర్డు? యూటర్న్?
T20 WC: నేపాల్తో మ్యాచ్.. ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ మొదలైంది. పాకిస్తాన్- నెదర్లాండ్స్ మ్యాచ్తో శనివారం ఈ పొట్టి క్రికెట్ సంగ్రామానికి తెరలేచింది. తొలిరోజు ఈ మ్యాచ్తో పాటు.. వెస్టిండీస్- స్కాట్లాండ్.. టీమిండియా- యూఎస్ఏ మ్యాచ్లకు షెడ్యూల్ ఖరారైంది.ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లుఇక గ్రూప్-సిలో ఉన్న ఇంగ్లండ్ తొలత నేపాల్తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం మ్యాచ్ జరుగనుండగా.. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్ శనివారమే తమ తుదిజట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఈ జట్టులో ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు ఆదిల్ రషీద్, లియామ్ డాసన్లకు చోటు దక్కింది.హార్డ్ హిట్టర్ వచ్చేశాడు!అంతేకాదు.. పూర్తి ఫిట్నెస్తో హార్డ్ హిట్టర్ ఫిల్ సాల్ట్ కూడా తుదిజట్టులోకి వచ్చేశాడు. సాల్ట్కు తోడు మాజీ కెప్టెన్ జోస్ బట్లర్తో పాటు కెప్టెన్ బ్రూక్ బ్యాటింగ్ లైనప్ను మరింత పటిష్టం చేశారు. ఇక ఆల్రౌండర్ల కోటాలో సామ్ కర్రాన్, విల్ జాక్స్, జేకబ్ బెతెల్ ఉన్నారు. పేస్ దళంలో జోఫ్రా ఆర్చర్, ల్యూక్ వుడ్ పేర్లు ఖరారయ్యాయి. కాగా ఇంగ్లండ్- నేపాల్ మధ్య ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది.టీ20 ప్రపంచకప్-2026: నేపాల్తో మ్యాచ్కు ఇంగ్లండ్ తుదిజట్టుఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.బెంచ్: రెహాన్ అహ్మద్, జోష్ టంగ్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్.వరల్డ్కప్ టోర్నీకి నేపాల్ జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.చదవండి: T20 WC: పాక్కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..
న్యూస్ పాడ్కాస్ట్
జంగిల్రాజ్పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
‘లిఫ్ట్’ తాకట్టుపై రాయలసీమ కన్నెర్ర... ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
జీవీఎంసీలో రౌడీ రాజ్యం... గీతం కబ్జాకు పచ్చజెండా... కనీస చర్చ లేకుండానే భూముల క్రమబద్దీకరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో రీ సర్వే సూపర్. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ, మార్కెట్ సంస్కరణలు భేష్ అని పొగిడిన కేంద్ర ఆర్థిక సర్వే
YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు
బిజినెస్
‘ఐటీ వాళ్లు వేరే పని వెతుక్కోవాల్సిందే’
ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై ఆన్లైన్లో కొత్త చర్చను రేకిత్తించారు జోహో కోఫౌండర్ శ్రీధర్ వెంబు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లు కోడ్ రాయడంలో వేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా ఏఐ సహాయంతో భగవద్గీత యాప్ను అభివృద్ధి చేసిన విషయంపై ‘ఎక్స్’ (ట్విట్టర్)లో వచ్చిన ఒక పోస్ట్కు స్పందించిన వెంబు, “కోడ్ రాయడంపై ఆధారపడి బతుకుతున్నవారు ప్రత్యామ్నాయ జీవనోపాధుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. ఇది తనకు కూడా వర్తిస్తుందన్న ఆయన, ఇది భయాందోళనలతో కాకుండా ప్రశాంతంగా అంగీకరించాల్సిన వాస్తవమని పేర్కొన్నారు.“ఆ పోస్ట్లో చెప్పింది కేవలం భగవద్గీత యాప్ మాత్రమే కాదు. ఆంథ్రోరోపిక్ (Anthropic) సంస్థ వారి క్లాడ్ ఏఐ (Claude AI)తో మొత్తం సీ కంపైలర్ను నిర్మించింది. ఇదేదో చిన్న ఇంజినీరింగ్ ఫీట్ కాదు” అని వెంబు రాసుకొచ్చారు.ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఏఐ విప్లవం భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను ఎలా రూపుదిద్దుతుందన్న విషయంపై గూగుల్ జెమినీ చాట్బాట్తో తాను లోతైన చర్చ నిర్వహించానని వెంబు వెల్లడించారు. ఆ సంభాషణలో, కార్మికుల అవసరం తగ్గిన తర్వాతి ఆర్థిక వ్యవస్థ (post-labor economy)లో సమాజం ఎలా అభివృద్ధి చెందగలదో చర్చించడమే కాకుండా, ఏఐ తన సొంత సమాధానాలను కూడా విమర్శించవచ్చంటూ సవాలు చేసినట్లు చెప్పారు.ఈ సంభాషణల ఆధారంగా, భవిష్యత్తు రెండు విధాలుగా ఉండవచ్చని వెంబు అభిప్రాయపడ్డారు. ఏఐపై యాజమాన్యం ఎవరి చేతిలో ఉంటుందన్నదే కీలకమని పేర్కొంటూ టెక్నాలజీ మానవ జీవితంలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండి, మనుషులకు కుటుంబం, ప్రకృతి, కళ, సంగీతం, సంస్కృతి, క్రీడలు, పండుగలు, విశ్వాసంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఇస్తుందని ఆశావాద దృక్కోణంలో చెప్పుకొచ్చారు. ఇక నిరాశావాద దృక్కోణంలో.. ఈ టెక్నాలజీ ‘కేంద్రీకృత నియంత్రణ’కు దారి తీస్తుందని హెచ్చరించారు.శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వెంబు అంచనాలతో ఏకీభవించగా, మరికొందరు విభేదిస్తూ ఏఐ కోడింగ్ మానవ మేధస్సుకు ముగింపు కాదని వాదించారు.Examples are now pouring in about AI-assisted Code Engineering productivity. The quoted post is a Bhagwad Gita app. Anthropic has built an entire C compiler with their Claude AI. That is not an easy engineering feat at all.At this point, it is best for those of us who… https://t.co/KbgVX8G9nU— Sridhar Vembu (@svembu) February 6, 2026
పసిడి ఆశలకు బ్రేక్.. మళ్లీ రేటెక్కిన బంగారం
వరుస తగ్గుదలతో ఆనందంలో ఉన్న పసడి ప్రియుల ఆశలకు బ్రేక్ పడింది. బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్.. ఇకముందు దేశానికే ఏరోట్రోపోలిస్ హబ్గా నిలవనుంది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్ రైల్వే కారిడార్ నగరంగా శంషాబాద్ అభివృద్ధి చెందనుంది. ఇక్కడ హైస్పీడ్ టరి్మనల్ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో.. శంషాబాద్ ఇక శివారు ప్రాంతం కాదు.. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారనుంది. – సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏరోస్పేస్ హబ్గా అభివృద్ధి చెందిన శంషాబాద్.. తాజా ప్రకటనతో అటు ఏరోస్పేస్, ఇటు ట్రయిన్ నెట్వర్క్ మిశ్రమంతో ఏరోట్రోపోలిస్ హబ్గా శంషాబాద్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ నగరంలోనైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం సాధారణంగానే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.కానీ, శంషాబాద్ ప్రాంతానికి మెరుగైన రోడ్లతో పాటు విమానయానం, రైలు మార్గం.. అన్ని రకాల మెరుగైన రవాణా సదుపాయాలతో అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు శంషాబాద్కు తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో అనుసంధానమైన ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్(త్రిబుల్ ఆర్)తో కూడా అనుసంధానమవుతుంది.ఐటీ హబ్లతో అనుసంధానం.. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లలో రాజీవ్గాంధీ విమానాశ్రయం ఒకటి. ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా నగరాలు అనుసంధానమై ఉన్నాయి. ఏటా 2.7 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలే ప్రభుత్వం శంషాబాద్ వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన నగరంతో పాటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కేంద్రాలకు ప్రయాణం సులువవుతుంది.విమానాశ్రయ కారిడార్ సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడుతోంది. అలాగే దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ నగరాలను ఈ హైస్పీడ్ రైలు అనుసంధానించనుంది. ఐటీ ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరొక నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. తద్వారా విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.ఈ ప్రాంతాలకు డిమాండ్.. 2–3 ఏళ్లలో శంషాబాద్, ఔటర్ వెంట ఉన్న ప్రాంతాలలో భూముల ధరలు 15–25 శాతం మేర పెరిగాయి. విమానాశ్రయం, గిడ్డంగులు, లాజిస్టిక్ హబ్లు, ప్రతిపాదిత మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. తాజా ప్రకటనతో శంషాబాద్ నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, హైటెక్ సిటీ, కోకాపేట ప్రాంతాలలో భారీ నివాస సముదాయాలు వస్తాయి.సమగ్ర అభివృద్ధి దిశగా..ఈ ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే కేవలం హైరైజ్ అపార్ట్మెంట్లు వస్తే చాలదు. ఆస్పత్రులు, పాఠశాలలు, రిటైల్, ఇతర పౌర సౌకర్యాలు కూడా అదే స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజువారీ అవసరాల కోసం ప్రధాన నగరంపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది.ప్రస్తుతం శంషాబాద్లో అపార్ట్మెంట్ల ధరలు చ.అ.కు రూ.6–8 వేలుగా ఉండగా.. భూముల ధరలు గజానికి రూ.55–60 వేలుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన సంస్థలు శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం కోసం శంషాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల వైపు దృష్టిసారించాయి. 2027 నాటికి ఏటా 10–17 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సీ–సూట్ ట్రాన్సిట్ ఆఫీస్గా..స్థిరాస్తి రంగంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏరోట్రోపోలిస్ హబ్తో శంషాబాద్ ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఇంజిన్ను సృష్టిస్తుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గుతుండటంతో ఈ ప్రాంతం ఎగ్జిక్యూటివ్లకు, కార్పొరేట్లకు సీ–సూట్కు ట్రాన్సిట్ ఆఫీస్గా మారుతుంది. ఫైవ్స్టార్ హాస్పిటాలిటీ, కన్వెన్షన్ సెంటర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. అలాగే మెరుగైన రవాణా సదుపాయాలతో ఏవియేషన్, ఫార్మా వంటి పారిశ్రామిక కారిడార్లు, లగ్జరీ రెసిడెన్షియల్ క్లస్టర్లుగా అభివృద్ధి చెందుతాయి.
రేట్లకు బ్రేక్.. వృద్ధే టార్గెట్ రెపోరేటు యథాతథం
ముంబై: అంచనాలకు అనుగుణంగా కీలక పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులకు వెళ్లకుండా, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ యథాతథ స్థితినే కొనసాగించింది. బడ్జెట్లో మూలధన వ్యయాలు పెంచడంతో వృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉంటుందన్న అంచనాలు వ్యక్తం చేస్తూ.. అంతర్జాతీయంగా అనిశి్చతుల నేపథ్యంలో రెపో రేటు తగ్గింపు చేపట్టకుండా తటస్థ వైఖరిని కొనసాగిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలను పెంచింది. బ్యాంకు కస్టమర్లు మోసపోతే తక్షణ పరిహారం కింద రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించడం ఖాతాదారులకు ఊరటనిచ్చేది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్లు) సైతం బ్యాంక్ల నుంచి రుణ వితరణకు పచ్చజెండా ఊపింది. ఎంఎస్ఈలకు పూచీకత్తులేని రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం మరో కీలక నిర్ణయం. అలాగే, కొన్ని రకాల ఎన్బీఎఫ్సీలకు సైతం నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించింది.పాలసీలోని ముఖ్యాంశాలు..→ రెపో రేటును (ఆర్బీఐ నుంచి బ్యాంక్లు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటు) 5.25 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత డిసెంబర్ సమీక్షలో రెపో రేటును ఆర్బీఐ పావు శాతం తగ్గించడం తెలిసిందే. అంతేకాదు 2025 ఫిబ్రవరి నుంచి మొత్తం మీద రెపో రేటును 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) తగ్గించడం గమనార్హం. రివర్స్ రెపో (బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే నిధులపై చెల్లించే రేటు) రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) 5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) 5.50 శాతం రేట్లలోనూ మార్పు చేయలేదు.→ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26)లో 2.1 శాతంగా (గత అంచనా 2 శాతం) కొనసాగుతుందని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. 4 శాతానికి పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. 2025–26 క్యూ4లో 3.2 శాతం (గత అంచనా 2.9 శాతం), 2026–27 క్యూ1లో 4 శాతానికి, 2026–27 క్యూ2లో 4.2 శాతానికి పెరుగుతుందని అంచనాలకు వచి్చంది. 2026–27 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను తదుపరి ఏప్రిల్ సమీక్ష సందర్భంగా ప్రకటిస్తామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు.→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 7.3 శాతం నుంచి 7.4 శాతానికి ఆర్బీఐ ఎంపీసీ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) క్యూ1 (ఏప్రిల్–జూన్), క్యూ2 (జూలై–సెప్టెంబర్) వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. రియల్ జీడీపీ సిరీస్ను ఈ నెల చివర్లో విడుదల చేయనుండడంతో పూర్తి ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏప్రిల్లో ప్రకటిస్తామని మల్హోత్రా పేర్కొన్నారు. → సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) ఆర్థిక భరోసా కల్పిస్తూ పూచీకత్తు లేని రుణ పరిమితిని ప్రస్తుతమున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్తగా తీసుకునే రుణాలతోపాటు గత రుణాల పునరుద్ధరణలకూ ఇది వర్తిస్తుంది.→ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్లు) బ్యాంకుల రుణ వితరణను అనుమతించే ప్రతిపాదనను ఆర్బీఐ ఎంపీసీ తీసుకొచి్చంది. రియల్ ఎస్టేట్ రంగానికి మరింత రుణ వితరణను ప్రోత్సహించేందుకు వీలుగా కొన్ని రక్షణ చర్యలతో రీట్లకు బ్యాంకుల రుణాలను అనుమతించే ప్రతిపాదన చేసింది. → కార్పొరేట్ బాండ్ల మార్కెట్ను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా.. 2026–27 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా, కార్పొరేట్ బాండ్ సూచీల డెరివేటివ్స్కు నియంత్రణ పరమైన కార్యాచరణను ఆర్బీఐ విడుదల చేయనుంది. → తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరుగుతుంది. ఎన్బీఎఫ్సీలకు వెన్నుదన్నురూ.1,000 కోట్ల కంటే తక్కువ ఆస్తులున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), ప్రజల నుంచి నిధులు సమీకరించని వాటిని కొన్ని షరతుల మేరకు తప్పనిసరి రిజి్రస్టేషన్ నుంచి మినహాయింపు కల్పించాలని ఆబీఐ ఎంపీసీ ప్రతిపాదించింది. బంగారంపై రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు–ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలు (ఐసీసీలు), 1,000 శాఖలకు మించి ఉన్నవి కొత్త శాఖల విస్తరణకు ఇకపై ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక బంగారం రుణాల విషయంలో ఎంలాంటి ఆందోళనల్లేవని, సౌకర్యంగానే ఉన్నామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఆస్తుల లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ/ బంగారం ధరపై రుణ వితరణ) తాము నిర్దేశించిన పరిమితులకు దిగువనే ఉన్నట్టు చెప్పారు. బంగారంపై రుణాలు సహా ఎన్బీఎఫ్సీల రుణాల పోర్ట్ఫోలియోలను ఆర్బీఐ సమీక్షించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2026–27లో రుణ సమీకరణను రూ.17.2 లక్షల కోట్లకు పెంచడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. నికర రుణ సమీకరణను చూడాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.20,000 కోట్లే ఎక్కువన్నారు.డిజిటల్ మోసాలకు పరిహారంబ్యాంక్ కస్టమర్ ప్రమేయంతో, ఓటీపీ తెలుసుకుని లేదా కస్టమర్ ప్రమేయం లేకుండా జరిగే డిజిటల్ మోసాల్లో ఎలాంటి ప్రశ్నలు లేకుండా బ్యాంక్ రూ.25,000ను పరిహారం కింద చెల్లిస్తుంది. కాకపోతే కస్టమర్ ఉద్దేశపూర్వక పాత్ర ఉండకూడదు. కస్టమర్ తన వంతుగా 15 శాతం నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ అధిక విలువ కలిగిన మోసాల్లో పరిహారం రూ.25 వేలకు పరిమితం అవుతుంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.
ఫ్యామిలీ
50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్లాస్ వ్యాయామాలు..!
50 ఏళ్లు దాటాక ఇదివరకటిలా అధిక ప్రభావ వ్యాయామాలు చేయడం కష్టం. మోకాలి నొప్పి, గాయం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. పైగా ఒంట్లో మునుపటి ఎనర్జీ ఉండదు. అందువల్ల ప్రజలు సులభమైన తక్కువ ప్రభావ వ్యాయామాలు ఎంచుకుంటే మంచిది. అలాగే ఓ వయసు వచ్చాక బరువు తగ్గించే వ్యాయామాలకు శరీరం కూడా సహకరించదు. అలాంటప్పుడు ఇంట్లో సులభంగా చేసే ఈ కొద్దిపాటి వ్యాయామాలు చేస్తే మంచిదని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అవేంటో చూద్దామా..!.మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉపయోగకరంగా ఉండే ఈ వ్యాయామాలు 80,90 లేదా వంద కిలోలు బరువుతో ఉండే వాళ్లకు అత్యంత ఉపయుక్తమైనవి. చాలా తేలిగ్గా చేసుకునేవి.మడమ నుంచి తుంటి వరకు నిలబడటం..ఒక కాలు వంచి తుంటికి తాకే ప్రయత్నం చేయాలి. అలాగే చేతులు నిటారుగా ఉంచాలి. ఈ వ్యాయామం మోకాళ్లను సురక్షితంగా ఉంచుతూ తొడలు, పిరుదులను సక్రియం చేయడానికి హెల్ప్ అవుతుంది.తక్కువ-ప్రభావ జంపింగ్ జాక్ఇది మోకాలికి అనుకూలమైన వెర్షన్. పక్కపక్కలకు కాళ్లను కదుపుతూ చాలా తక్కువ మోతాదులో జంప్ చేయడం. ఇది హృదయ స్పందన రేటుని సున్నితంగా పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. కీళ్లపై ఒత్తిడి పడకుండా సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.ఒక వైపు నుంచి ఒక వైపుకి..నియంత్రిత పద్ధతిలో ఒక వైపు నుంచి ఒక వైపు నడక. చాలా ఈజీగా చేసే వ్యాయామం. ఇది తుంటి కండరాలను బలోపేతం చేయడానికి, స్థిరత్వాన్నిఇ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ మూడింటిని 20 సార్లు చేసి, ఐదు సెట్లు పునరావృతం చేస్తే చాలని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. స్థిరత్వంపై దృష్టి పెడుతూ..తేలికైన ఈ కదలికలు బాడీని ఫిట్గా ఉంచడంలో చాలా హెల్ప్ అవుతాయి. ఇలా ప్రతీరోజు చేయడం వల్ల బరువు తగ్గడమే గాక, మోకాళ్ల గాయాలు గానీ, సమస్యలు ఎదురవ్వవని అంటున్నారు. View this post on Instagram A post shared by Nehafun&fitness🤸♂️🧘♀️ (@nehafunandfitness) (చదవండి: తస్మాత్ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!)
పాత్రికేయులూ... మమ్మల్ని అలా పిలవద్దు... ప్లీజ్!
గౌరవనీయులైన పాత్రికేయులకు సమస్త మగపురుగులూ నమస్కరించి వ్రాయునది ఏమనగా! అయ్యా... మా జంతు ప్రపంచంలో మగపురుగులైన మేము మా సాటి ఆడజీవులకు ఎంతో గౌరవమిస్తూ ఉంటాం. అదెలాగో చెబుతాం వినండి. ఒకవేళ... మాలో తేళ్ల జాతి గనక ‘షోలే’ సినిమా తీశాయనుకోండి. అప్పుడు మా జాతిలోని ఆడ బసంతీయే... మగతేలును పట్టుకుని గావుకేక పెడుతుంది. ఏమనీ... ‘‘వీరూ... ఏ బిచ్ఛువోకే సామ్నే మత్ నాచ్ నా’’ అంటూ అరిచి గీపెడుతుంది. ఎందుకంటే... మా తేళ్లజాతిలో లేడీతేలును పడేయాలంటే తేలు మగపురుగులైన మేము మా జాతి శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించి చూపాలి. మీలో సాల్సా, హిప్హాపుల్లా మా తేలుజాతి శాస్త్రీయనృత్యం పేరేమిటో తెల్సా? దాని పేరు ‘ ప్రొమెనాడ్ ఎ డియో’’ (Promenade à deux). మా పెళ్లి తర్వాత మా ట్రెడిషనల్ డాన్స్ చూపాకే మాకు శోభనం జరుగుతుంది. మా తేళ్ల జాతిలో తరతరాలుగా యుగయుగాలుగా కొనసాగుతూ వస్తున్న పవిత్రమైన ఆచారమిది. శోభనపు గదిలో ఓ తేలుజంట ఎంటర్ కాగానే... మా ఆడలేడీస్ మమ్మల్ని చూస్తూ... మీ మానవులు ‘పాడు గజాలా పాడు’ అన్నట్టుగానే, ‘‘ఆడరా... తేలుగా ఆడు’’ అని ఆదేశిస్తాయి. అప్పుడు మేమూ... ‘తకిట తధిమి తకిట తధిమి తందానా... హృదయ లయల జతుల గతుల థిల్లానా’ అంటూ డాన్స్ చేయాల్సిందే. ‘తడబడు అడుగుల తప్పని తాళానా...’’అంటూ పొరబాటున మా అడుగులు తడబడ్డాయనుకోండి. సదరు ఆడతేలు ‘ఏయ్... చంద్రమోహన్. నువ్వు ఆడుతున్న ఆ డాన్సేమిటీ... పడుతున్న ఆ అడుగులేమిటీ?’ అంటూ అరవదు సరికదా... మా డాన్స్ సరిగా కుదరనందుకు పనిష్మెంట్గా గబుక్కున మమ్మల్ని పట్టేసి గుటుక్కుమంటూ మింగేస్తుంది. అన్నట్టు మా తేలు చిన్నారులకు నర్సరీలలో చెప్పే రైమ్ ఏమిటో తెల్సా?చిట్టి తేలమ్మా... అమ్మ చెప్పిందాపెళ్లికెళ్లావా... మొగుణ్ణి చూశావాడాన్సులాడావా... గుటుక్కున మింగావా!∙∙ ఇక ‘జంపింగ్ స్పైడర్’ అని పిలిచే మా సాలీడుజాతి మగపురుగుల గురించి సాలిడ్గా చెప్పాల్సిందెంతో ఉంది. మా జాతిలో డాన్స్ ఒకటే సరిపోదు. కాళ్లూ చేతులూ వేగంగా కదిలిస్తూ పుట్టే వైబ్రేషన్స్తో పాట కూడా పాడాలి. ఆ పాటకు మేమే బాణీ కట్టుకోవాలి. మా బాణీలు ఎంత బాగుంటాయో తెల్సా. పొరబాటున మీరుగానీ విన్నారంటే...‘ఏంట్రా బాబూ ఈ జంపింగు స్పైడర్ల బాణీల్లో ఇంత మ్యూజిక్ ఉందీ!’ అంటూ ఆశ్చర్యపోతారు. ఇలా మా పాటకు మేమే ‘కొరియోగ్రఫీ’ చేసుకుని, మా లేడీస్ ముందు జంపింగ్ చేస్తూ మరీ డాన్స్ ఆడాలి. ఇక మా జంపింగు స్పైడర్లలో ఒకజాతి తాలూకు డాన్స్ ఎంతబాగుంటుందో తెల్సా? అందుకే... మీ మనుషుల్లాగే మేము మావాటిని ‘పీకాక్ స్పైడర్స్’ అని పిలుస్తాం. ఎంతైనా... అవి మా జాతి నాట్యమయూరాలు కదా మరి! ఇదంతా చేసి మా లేడీస్ను ఇంప్రెస్ చేస్తేనే మా పెళ్లి... లేదంటే ఆ పూటకు దాని బ్రేక్ఫాస్టూ, లంచూ, డిన్నరూ, చిరుతిండీ, అంచూ, అప్పడం... అన్నీ మేమే! ఇక మాలోనే ఇంకో జాతి ఉంది. పెళ్లి తర్వాత అది మొగుణ్ణి తప్పక తినేస్తుంది కాబట్టే దాని పేరు బ్లాక్ ‘‘విడో’’ అట! ∙∙ ఇంకా చెప్పాలంటే... పురుగుల్లోనే ఒక రకమైన ‘ప్రేయింగ్ మేంటిస్’ జాతి ఖర్మ ఎలా తగలడిందంటే... శోభనం జరుగుతుండగానే అలా లిప్కిస్తో మొదలుపెట్టి... మా పెళ్లాలు మమ్మల్ని ఇలా తినేయడం మొదలుపెడతారు. మరి మగాళ్లమైన మేము శుభకార్యం మధ్యలోనే చనిపోతే ఎలా? అందుకే... మా ఆడ మేంటిసులు మమ్మల్ని తినేసినా అసలు పని ఆగకుండా ఉండటం కోసం ఓ స్పేర్ మెదడును (గ్యాంగ్లియాన్లను) కడుపులో ఉంచుకుంటాం. ఇలా మా తర్వాతి తరాలు బలంగా ఉండటం కోసం... పొదగాల్సిన లేదా పిల్లలు పెట్టాల్సిన మా ఆడలేడీస్కి శక్తి సమకూర్చడం కోసం మా దేహాన్నే త్యాగం చేసేస్తాం. మా ఆడవారి అంగీకారమైతే తప్ప... వాళ్లను బలవంతం చేయడమో, మా ప్రేమను ఒప్పుకోమంటూ ఇబ్బంది పెట్టడమో, కుదరకపోతే యాసిడ్ విసరడమో చేయం గాక చేయం.కాబట్టి... మా మృగప్రపంచపు మగపురుగుల క్యారెక్టరును దృష్టిలో పెట్టుకుని... మా మనోభావాలు గాయపడేలా... ‘మృగాళ్లూ’, ‘మగపురుగులూ’ అంటూ మీ మానవ మగాళ్లతో పోల్చి... మమ్మల్ని కించపరచవద్దని మనవి. – యాసీన్
రీల్స్ మాయలో బాల్యం బందీ
పిల్లలు రీల్స్, షార్ట్ వీడియోలకు అడిక్ట్ అవడం అనేది ప్రస్తుతం తల్లిదండ్రులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, వారి మెదడు పనితీరును కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏకాగ్రత సమయం తగ్గిపోవడంరీల్స్ వల్ల కలిగే అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ఏకాగ్రత సమయం తగ్గడం. సాధారణంగా మనిషి సగటు ఏకాగ్రత సమయం సుమారు 12 సెకన్ల వరకు ఉంటుంది. కానీ రీల్స్, షార్ట్ వీడియోలు చూసే వారిలో అది 8 సెకన్ల కంటే తక్కువకు పడిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం 15–30 సెకన్ల వీడియోలకే అలవాటు పడటం వల్ల, ఏదైనా ఒక విషయం గురించి లోతుగా ఆలోచించడం, కష్టమైన సమస్యను పరిష్కరించడం మెదడుకు భారంగా అనిపిస్తుంది.సహనం నశించడంనిజ జీవితంలో పనులు నెమ్మదిగా జరుగుతాయి. కానీ రీల్స్ ప్రపంచంలో అన్నీ వేగంగా జరిగిపోతాయి. దీనివల్ల పిల్లల్లో విపరీతమైన చిరాకు, అసహనం కలుగుతాయి. ఫోన్ నిరంతరం వేగవంతమైన సమాచారాన్ని అందించడం వల్ల మెదడు కేవలం తక్షణ వినోదం కోసం మాత్రమే ఎదురు చూసేలా మారిపోతుంది. కష్టపడి సాధించే ఫలితం కంటే, వెంటనే వచ్చే వినోదాన్ని కోరుకుంటారు.స్పీచింగ్ థెరపీ సెంటర్లకు డిమాండ్రీల్స్, వీడియోలు చూసే పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సంవత్సరాలు పెరుగుతున్నా తమ పిల్లలకు మాటలు రావడం లేదంటూ స్పీచ్ థెరపీ సెంటర్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. రీల్స్ చూసే పిల్లలు .. ఇంట్లో వారితో మాట్లాడే ప్రయత్నం కంటే స్క్రీన్ను చూడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.ఆందోళన, నిరాశఇతరుల జీవితాలను రీల్స్లో చూసి, తమ జీవితాన్ని వారితో పోల్చుకోవడం వల్ల పిల్లల్లో ఆందోళన, నిరాశ పెరిగిపోతాయి. ఫిల్లర్లతో కూడిన వీడియోలని చూసి, తమ రూపం పట్ల ఆత్మన్యూనతా భావానికి గురవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఇది పిల్లల అభివృద్ధిని కుంటుపడేలా చేస్తుంది.భావోద్వేగాలు మొద్దుబారడంరీల్స్లో హాస్యం, హింస, విషాదం అన్నీ వెంటవెంటనే వస్తాయి. దీనివల్ల మెదడుకు ఒక భావోద్వేగాన్ని సరిగ్గా ప్రాసెస్ చేసే సమయం ఉండదు, ఇది పిల్లలను భావోద్వేగపరంగా మొద్దుబార్చే అవకాశం ఉంది. ఇది నిజజీవితంలో మరింత ప్రమాదకరం.నిద్ర పట్టకపోవడంస్మార్ట్ఫోన్తో మరో ముఖ్యమైన సమస్య నిద్ర పట్టకపోవడం. రీల్స్ చూడటం, మెసేజ్లు చేయడం వల్ల మెదడు ఉద్వేగానికి గురవుతుంది. దీనివల్ల స్లీపింగ్ సైకిల్ దెబ్బతిని .. పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. దాంతో చిరాకు, కోపం, మొండిగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ప్రత్యామ్నాయమే పరిష్కారంఫోన్ వద్దు అని ఒకేసారి చెప్పడం కంటే వారికి నచ్చిన కథల పుస్తకాలు, బోర్డ్ గేమ్స్ లేదా ఏదైనా క్రీడావిశేషాలను చర్చించడం వల్ల వారి మనసు మరోవాటి మీదకి మళ్లుతుంది. బోర్గా ఉందని చెప్పగానే పిల్లలకు ఫోన్ ఇవ్వడం మానుకోవాలి. వారితో మాట్లాడాలి, ఆడుకోవాలి. అలాగే మీరు నిరంతరం ఫోన్ చూస్తూ ఉంటే, వారు కూడా మిమ్మల్ని అనుకరిస్తారు గనుక స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. స్మార్ట్ ఫోన్ను.. మనం ఎలా వాడుతాము అనేదానిపైనే అది మనకు మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా అనే అంశాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి లేదా వీటిలో భాగస్వామ్యం చేయాలి. బాల్యం నుంచే పిల్లల దృష్టి రీల్స్ నుంచి రియల్కు మళ్లించే ప్రయత్నం చేయాలి.
అరుణ యానంలో ఆమె ప్రతిభ
ఏఐ సాంకేతికతను అంగారక గ్రహంపై కూడా అద్భుతంగా ఉపయోగించవచ్చునని నిరూపించింది నాసా వారి పర్సెవరెన్స్ రోవర్. మరొక గ్రహంపై ఏఐ– ఆధారిత అన్వేషణకు బలాన్ని చేకూర్చిన విజయం ఇది. ఈ విజయంలో భారత సంతతికి చెందిన అంతరిక్ష రోబోటిక్ నిపుణురాలు వంది వర్మ కీలక పాత్ర పోషించారు.పుట్టినరోజు కానుకగా చిన్నప్పుడు వంది వర్మకు ఒక పుస్తకం వచ్చింది. సౌర వ్యవస్థపై రాసిన పుస్తకం అది. పుట్టినరోజు కానుకగా శాస్త్ర, సాంకేతికరంగ పుస్తకం అందుకున్న ఆ చిన్నారికి శాస్త్రరంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటానని, అంగారక గ్రహంపై రోవర్ను నడపడంలో కీలక పాత్ర పోషిస్తాన నీ అప్పుడు తెలియదు!అలా రోబోలపై ఆసక్తి మొదలైంది...వంది వర్మ జన్మస్థలం పంజాబ్లోని హల్వార. తండ్రి భారత వైమానిక దళం(ఐఏఎఫ్) లో పైలట్. చండీగఢ్లోని ‘పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీ’లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన వర్మ తరువాత పెన్సిల్వేనియాలోని కార్నెగి మెల్లన్ యూనివర్శిటీ (సిఎంయు)లో రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ‘సిఎంయు’లో చదువుతున్న రోజుల్లో రోబోటిక్స్పై అమితమైన ఆసక్తి పెంచుకున్నారు.‘ట్రాక్టబుల్ పార్టికల్ ఫిల్టర్స్ ఫర్ రోబోట్ ఫాల్ట్ డయాగ్నసిస్’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు. చిట్టడవిలో నాసా ప్రయోగ బెలూన్లను సేకరించడానికి ఇతర రోబోట్లతో పోటీపడే సరికొత్త రోబోట్ను రూపొందించారు. దాని పనితీరు వర్మకు నచ్చింది. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆ రోబోట్ పనిచేసిన తీరు నన్ను అబ్బురపరిచింది’ అంటారు వర్మ. అప్పటినుంచి రోబోట్లపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.ప్రయాణమే మన బలం2007లో నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ లో చేరిన వర్మ ప్రస్తుతం ‘మార్స్ మిషన్ రోబోటిక్స్ ఆపరేషన్స్’ చీఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. ‘అంతరిక్ష రహస్యాలను తెలుసుకోవడానికి రోబోటిక్ అన్వేషకుల అవసరం ఎంతో ఉంది. గ్రహాంతర వాతావరణంలో రోబోలు మాత్రమే కనుగొనగలిగే విషయాలు ఎన్నో ఉన్నాయి’ అంటారు వర్మ.‘అంగారక గ్రహంపై ఒకప్పుడు ఏదో ఒక జీవి నివసించి ఉండవచ్చు అనే సందేహం నుంచి అసలు ఆ గ్రహంలో ఏం జరుగుతుంది? అనే ఆసక్తి వరకు తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఎన్నో కొత్త ప్రదేశాలకు వెళ్లాను. కొత్త వ్యక్తులతో మాట్లాడాను. తరచు ప్రయాణిస్తూ ఉండడం వల్ల విభిన్న నేపథ్యాలు, విలువలు ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం వస్తుంది. దీంతో మనసు విశాలం అవుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటాం. అందుకే ప్రయాణం అనేది ముఖ్యం. ఇక అంగారక గ్రహం విషయానికి వస్తే...అక్కడ జీవం ఉనికిని మనం చూడలేదు. అయితే ప్రతి గ్రహానికి సంబంధించి భౌగోళిక శాస్త్రంలో కొన్ని గుర్తులు మిగిలే ఉన్నాయి. మనం చదవకుండా వదలేసిన కథలు అవి. ఇప్పుడు చదవాలి. రోబోల పాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది’ అంటారు వర్మ.సవాలు విసిరే పర్యావరణంలో...మానవులను పంపడం చాలా ప్రమాదకరమైన చోట రోబోలను పంపడమే సరిౖయెన పరిష్కారం అయినప్పటికీ, వాటిని నిర్మించడం, అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా చేయడం ఆషామాషీ విషయం కాదు. చిన్నపాటి తప్పు జరిగినా మిషన్ మొత్తానికీ ‘శుభం’ కార్డ్ పడుతుంది.‘మార్స్ పర్యావరణం గురించి లోతుగా తెలియనప్పుడు రోబోల నిర్మాణం అనేది సవాలుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలోనే సంక్లిష్టమైన పనులు చేసే, అదే సమయంలో సురక్షితంగా ఉండగలిగే రోబోను తయారు చేయాలి’ అంటారు వర్మ.భవిష్యత్ విజయానికి అద్దం పట్టేలా...నాసా వారి పర్సెవరెన్స్ రోవర్ మానవ జోక్యం లేకుండా పూర్తిగా కృత్రిమ మేధస్సు(ఏఐ) ద్వారా ΄్లాన్ చేసిన మార్గాలలో అంగారక గ్రహంపై విజయవంతంగా డ్రైవ్లను పూర్తి చేసింది. రాళ్ళు, వాలులు, ఇసుక లక్షణాలను గుర్తించడానికి జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ఆర్బిటల్ ఇమేజరీ, రోవర్ నావిగేట్ డేటాను విశ్లేషించాయి. వే పాయింట్లతో నిరంతర డ్రైవింగ్ మార్గాన్ని ఏర్పర్చాయి. మామూలుగానైతే ఈ ప్రక్రియను మానవులు నిర్వహిస్తారు.‘ఇది చెప్పుకోదగిన పురోగతి. ఏఐ సాంకేతికత ఆపరేటర్ల పనిభారాన్ని తగ్గిస్తుంది. నావిగేషన్కు సంబంధించిన ప్రధాన అంశాలను రోవర్ ఎలా క్రమబద్ధీకరించగలదో ఈ పరీక్ష నిరూపించింది. భవిష్యత్లో రోబోటిక్ మిషన్లను ఏఐ సాంకేతికతతో ఎలా నిర్వహిస్తాం అనేదానికి ఈ విజయం అద్దం పడుతుంది’ అంటారు వర్మ.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో... ఆ గ్రహంలోకి!మిషన్ లైఫ్సైకిల్లో రోబోటిక్ ఇంజినీర్లు విభిన్న పాత్రలను పోషిస్తారు. మార్స్పై రోవర్స్ శక్తిసామర్థ్యాలకు సంబంధించిన కోడ్ను రాయడంతోపాటు ఇంకా ముఖ్యమైన పనులెన్నో చేశాను. రోవర్ను ఆపరేట్ చేయడంలో పాలుపంచుకున్నాను. మార్స్పై ఆపరేషన్లను హ్యాండిల్ చేయడం అనేది నాకు ఇష్టమైన పని. ఎప్పటి నుంచో అంగారక గ్రహంపై రోబోలను డ్రైవ్ చేస్తున్నాను. అంగారక గ్రహంపై ఆపరేషన్ల ద్వారా నేను ఎప్పటికప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను. మనం అనేక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఉపయోగించడం అనేది సాధారణం. ఆ సాంకేతికతను మేము సంక్లిష్టమైన వాతావరణంలో ఉపయోగిస్తున్నాం. మార్స్పై ఏ రాయి ఆసక్తికరంగా ఉందో రోవర్ స్వయంచాలకంగా (ఆటోనమస్గా) గుర్తించడానికి మేము ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. వైడ్–యాంగిల్ ఇమేజ్లను తీసుకుంటున్నాం. ఆసక్తికరంగా ఉన్న వాటిని రోబోట్ తెలుసుకోవడంలో సహాయపడడానికి ఆఫ్లైన్ పద్ధతులను ఉపయోగిస్తున్నాం.– వంది వర్మ
అంతర్జాతీయం
ట్రంప్ సుంకాలు: భారత్కు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల విషయంలో భారత్కు భారీ ఊరట లభించింది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాలను రద్దు చేస్తూ శుక్రవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిన నేపథ్యంలో ఈ వాణిజ్య ఒప్పందం కుదిరింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సుంకాల రద్దు అమలులోకి రానుంది.ఈ ఒప్పందంలో భాగంగా భారత్ ఇకపై అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. రాబోయే పదేళ్ల కాలానికి అమెరికాతో రక్షణ సహకారాన్ని విస్తృతం చేసేలా ఒక కీలక ఫ్రేమ్వర్క్కు భారత్ అంగీకారం తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కారణంగా ఇరు దేశాల మధ్య గత కొద్ది నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజా ఒప్పందంతో ఈ సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా, ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.రాబోయే ఐదేళ్లలో అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ను భారత్ కొనుగోలు చేయనుంది. దీనికి ప్రతిగా విమానాలు, వాటి విడిభాగాలపై విధిస్తున్న సుంకాలను కూడా అమెరికా తొలగించనుంది. గత ఏడాది చివరలో భారత ఉత్పత్తులపై దాదాపు 50 శాతంగా ఉన్న సుంకాలు, ఈ కొత్త ఒప్పందంతో గణనీయంగా తగ్గి 18 శాతానికి చేరుకున్నాయి.తాజా సుంకాల తగ్గింపుతో పొరుగు దేశాల కంటే భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో స్వల్ప ప్రయోజనం చేకూరనుంది. ఇతర దేశాలపై 19 నుంచి 20 శాతం సుంకాలు ఉండగా, భారత్కు అది 18 శాతానికి తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ‘గొప్ప స్నేహితులలో ఒకరు’ అని అభివర్ణించిన ట్రంప్, ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తానని హామీ ఇచ్చిన దరిమిలా ఈ సానుకూల నిర్ణయం సాధ్యమైందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: రంజాన్ 2026: సౌదీ అరేబియా కీలక ప్రకటన
వీసా ఆంక్షలతో వెనక్కి తగ్గిన ఆఫ్రికా దేశాలు
లండన్: వీసాలను నిలిపివేస్తామంటూ యూకే హోం శాఖ చేసిన బెదిరింపులతో ఆఫ్రికాలోని మూడు దేశాలు వెనక్కి తగ్గాయి. యూకేలోకి అక్రమంగా ప్రవేశించిన, ఇతర నేరాలకు పాల్పడిన వారిని వెనక్కి తీసుకెళ్లేందుకు ఈ దేశాలు సమ్మతిని తెలిపాయి. ఈ విషయాన్ని యూకే హోం శాఖ శుక్రవారం తెలిపారు. నమీబియా, అంగోలాలు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు. పౌరులకు కోసం ఫాస్ట్ట్రాక్ వీసా ప్రాసెసింగ్ విధానాన్ని రద్దు చేయడంతోపాటు ఆ దేశం నుంచి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక వీసా సౌకర్యాలను రద్దు చేస్తామంటూ హెచ్చరించడంతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ) తాజా తమ దారికి వచ్చిందని హోం మంత్రి షబానా మహ్మూద్ చెప్పారు. విదేశీ ప్రభుత్వాలు తమ పౌరులను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిన పక్షంలో తగు పర్యావసానాలను ఎదుర్కొనక తప్పదన్నారు. అక్రమ వలసదారులు, ప్రమాదకరమైన నేరగాళ్లను పట్టుకుని, అంగోలా, నమీబియా, డీఆర్సీలకు పంపించివేస్తామన్నారు. భారత్, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, సొమాలియా, గబోన్ వంటి దేశాలు ఈ రకమైన ఒప్పందానికి వ్యతిరేకత చూపుతున్నందున, వాటిపైనా వీసా సంబంధిత ఆంక్షలు విధిస్తారంటూ వస్తున్న వార్తలపై ఆమె నేరుగా స్పందించలేదు. యూకేలో 2025 జూలైలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో 58 వేల మంది అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించి వేసింది. తాజాగా, మూడు ఆఫ్రికా దేశాలతో కుదిరిన ఒప్పందం ఫలితంగా మరో 3 వేల మందిని ఆయా దేశాలకు తిప్పిపంపే అవకాశాలున్నాయి.
న్యూస్టార్ట్ చర్చలకు అమెరికా, రష్యా ఓకే
మాస్కో: ఆయుధాల నియంత్రణకు సంబంధించిన న్యూస్టార్ట్ ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని అమెరికా, రష్యాలు అంగీకారానికి వచ్చాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య యూఏఈలోని దుబాయ్లో జరుగుతున్న శాంతి చర్చల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచి్చనట్లు శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. అదేవిధంగా, రెండు దేశాల మిలటరీ మధ్య 2021 నుంచి నిలిచిపోయిన ప్రత్యక్ష సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయని వివరించారు. బాధ్యతాయుతమైన రెండు దేశాలు స్టార్ట్ చర్చలపై ఆసక్తితో ఉన్నాయన్నారు. అమెరికా, రష్యాల మధ్య చిట్టచివరి వ్యూహాత్మక ఆయుధాల నియంత్రణ ఒప్పందం(స్టార్ట్) గడువు గురువారంతో ముగిసిపోయింది. దీంతో, అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాలకు ఇప్పుడు ఇక ఎటువంటి పరిమితులు లేవు. స్టార్ట్ ఒప్పందం విధించిన పరిమితులకు కట్టుబడి ఉండేందుకు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రకటించగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టించుకోలేదు. చైనా కూడా ఈ ఒప్పందంలో చేరాలని పిలుపునిచ్చారు. చైనా మాత్రం ససేమిరా అంటోంది.
రష్యా సైనిక నిఘా అధికారిపై కాల్పులు
మాస్కో: రష్యాలో కీలక సైనికాధికారులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇందుకు ఉక్రెయిన్ కారణమని రష్యా ఆరోపిస్తోంది. శుక్రవారం రష్యా సైనిక నిఘా సంస్థ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ అలెక్సేయెవ్(64)పై గుర్తు తెలియని దుండగుడు పలురౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో అలెక్సేయెవ్ తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ఈ కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. అలెక్సేయెవ్ ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇంట్లో ఉండగా డెలివరీ బాయ్ రూపంలో వచి్చన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన వెనుక సూత్రధారులు ఎవరన్నది అధికారులు ఇంకా గుర్తించలేదు. 2011 నుంచి రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘జీఆర్యూ’డిప్యూటీ చీఫ్గా అలెక్సేయెవ్ సేవలందిస్తున్నారు. సిరియాలో రష్యా సైనిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు ‘హీరో ఆఫ్ రష్యా’మెడల్ కూడా అందుకున్నారు. ఇదిలా ఉండగా, అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబీలో రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండు రోజులపాటు జరిగిన చర్చలు శుక్రవారమే ముగిశాయి. అదేరోజు రష్యాలో సైనికాధికారిపై కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చల్లో అలెక్సేయేవ్ పై అధికారి అయిన మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అడ్మిరల్ ఇగోర్ కోస్టియుకోవ్ రష్యా తరఫున పాల్గొన్నారు. అలెక్సేయెవ్పై కాల్పుల గురించి అధికారులు రష్యా అధినేత పుతిన్కు సమాచారం అందించారు. ఈ దాడి గురించి ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. అలెక్సేయెవ్పై కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. శాంతి చర్చలను పక్కదారి పట్టించడానికి ఉక్రెయిన్ ప్రభుత్వం ఉగ్రవాదులను పురిగొలి్ప, ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు.
జాతీయం
నడి రోడ్డుపై 15 అడుగుల లోతు గొయ్యి
న్యూఢిల్లీ: నిర్మాణ పనుల కోసం ఢిల్లీ జల్బోర్డు తవ్విన 15 అడుగుల లోతు గుంతలో ఓ మోటారు సైకిలిస్ట్ పడి, ప్రాణాలు కోల్పోయారు. గురువారం రాత్రి జనక్పురి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం ఉదయం 8 గంటలకు వెలుగు చూసింది. కైలాస్పురికి చెందిన కమల్ భయానీ(25) ఓ ప్రైవేట్ బ్యాంకు కాల్ సెంటర్ ఉద్యోగి. గురువారం అర్ధరాత్రి సమయంలో విధులు ముగించుకుని బయలుదేరిన ఆయన..ఇంటికి చేరుకోలేదు. దీంతో, కుటుంబసభ్యులు భయాందోళనకు గురై ఆ చుట్టుపక్కలున్న జనక్పురి, సాగర్పూర్, వికాస్ పురి, రోహిణి తదితర పోలీస్స్టేషన్లకు వెళ్లి, విషయం అక్కడి అధికారులకు వివరించారు. పెద్దగా ఎవరూ స్పందించలేదు. కమల్ రోజూ ప్రయాణించే రహదారిపై రాత్రంతా గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల వేళ ఓ మహిళ జనక్పురి ప్రాంత పోలీస్స్టేషన్కు ఫోన్ చేసి, అధికారులు తవ్విన గుంతలో బైకుతోపాటు ఓ వ్యక్తి చలనం లేకుండా పడిపోయి కనిపించినట్లు తెలిపింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లోపలికి దిగి కమల్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. జనవరి 16వ తేదీ రాత్రి నోయిడాలో యువరాజ్ మెహతా(27) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిర్మాణ ప్రాంతంలో నిలిచిన నీటి గుంతలో కారుతోపాటు పడి ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. అన్ని చోట్లా నిర్లక్ష్యమే: బాధిత కుటుంబం నిర్మాణ పనుల కోసం ఆ రోడ్డును కొన్ని రోజు లుగా మూసివేశారు. గురువారం భారీ గుంతను తవ్వారు. ఆ విషయం తెలియక కమల్ అటుగా వచ్చి ప్రమాదం బారిన పడి ఉంటారని భావిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కమల్ ప్రాణాలు కోల్పోయారని కుటుంబీకులు, సన్నిహితులు ఆరోపించారు. పోలీసులు వెంటనే స్పందించి వెతికి ఉంటే అతడి ప్రాణాలు దక్కించుకోగలిగేవారమన్నారు. ముగ్గురు అధికార్ల సస్పెన్షన్ ఘటన ప్రాంతాన్ని ఢిల్లీ జల శాఖ మంత్రి పర్వేశ్ వర్మ స్వయంగా పరిశీలించారు. అధికారులు గుంత చుట్టూ కొంతమేర రక్షణ చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు. అయినప్పటికీ, మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఆ మార్గంలో వాహనదారులు రాకపోకలను మాత్రం మానలేదన్నారు. అంతేకాకుండా, అక్కడ జరిగే పనుల్ని పట్టించుకోని జల్బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్లను సస్పెండ్ చేశామన్నారు.
‘చెరిపేసే’ హక్కు ఏమిటి?
న్యూఢిల్లీ: ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భాగంగా వారి గోప్యతను పరిరక్షించేందుకు ఉద్దేశించిన ‘చెరిపివేత హక్కు’(రైట్ టు బీ ఫర్గాటెన్–ఆర్టీబీఎఫ్)కు సంబంధించి ఆసక్తికరమైన కేసు ఒకటి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దీనిప్రకారం వ్యక్తులు తమపై ఆన్లైన్లో ఉన్న కంటెంట్ను తొలగించాలని కోరేందుకు హక్కు ఉంటుందా అన్న అంశాన్ని తేల్చాలంటూ ఒక పిటిషన్ దాఖలైంది. క్రిమినల్ కేసులో నిరపరాధిగా విడుదలైన ఒక వ్యక్తి తాలూకు విచారణ ప్రక్రియకు సంబంధించిన కంటెంట్ను ఆర్టీబీఎఫ్ కింద పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మీడియా సంస్థ దీన్ని దాఖలు చేసింది. ఈ పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘ఇది నూతన యుగం. కనుక గోప్యత హక్కులో భాగంగా ఆర్టికల్ 21లో పేర్కొన్న ఆర్టీఈఎఫ్, ఆర్టికల్ 19లో పేర్కొన్న మీడియా స్వేచ్ఛ హక్కులను సంతులనం చేయాల్సిన అవసరముంది’’అని ఈ సందర్భంగా పేర్కొంది. అసలు ఆర్టీబీఎఫ్ను, దాని పరిధిని నిర్దిష్టంగా నిర్వచించాలన్న పిటిషన్పై విచారణ జరిపేందుకు అంగీకరించింది. మార్చి 16లోగా స్పందించాల్సిందిగా టూ సదరు వ్యక్తికి, పిటిషన్లు దాఖలు చేసిన ఇతర మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఏమిటీ కేసు? ఒక క్రిమినల్ కేసులో నిర్దోíÙగా తేలిన ఓ, వ్యక్తి విచారణ ప్రక్రియకు సంబంధించి మీడియా సంస్థల్లో తనపై వెలువడ్డ వార్తలు తదితరాలన్నింటినీ ఆన్లైన్ డొమైన్ల నుంచి తొలగించాలంటూ దిగువ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఇండియన్ కానూన్ అనే ఆన్లైన్ పోర్టల్ దాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు కూడా కూడా సదరు వ్యక్తికే అనుకూలంగా 2025 డిసెంబర్ 18న తీర్పు వెలువరించింది. దాంతో మీడియా సంస్థ సుప్రీం గడప తొక్కింది. అనంతరం పలు ప్రఖ్యాత మీడియా సంస్థలు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యాయి. ఆన్లైన్ న్యూస్కు ఆర్టీబీఎఫ్ వర్తించదని ఇండియన్ కానూన్ పోర్టల్ తరఫున సీనియర్ న్యాయవాది అర్వింద్ దాతార్ ఈ సందర్భంగా వాదించారు. ఈ విషయంలో ఢిల్లీ తీర్పును హైకోర్టు మద్రాస్, రాజస్తాన్, పంజాబ్–హరియాణా హైకోర్టులు ప్రమాణంగా పరిగణించి అభిప్రాయాలు వెల్లడించాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో, పరువునష్టం కేసుల్లో తీర్పుల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సదరు తీర్పును ప్రమాణంగా పరిగణించడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొంది. గోప్యత హక్కులో చరిత్రను చెరిపేసే హక్కు భాగం కాదని 2017 నాటి చరిత్రాత్మక కె.ఎస్.కుప్పుస్వామి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని దాతార్ గుర్తు చేశారు. ‘‘మీడియా సంస్థలు ఒకే వార్తను పదేపదే చూపిస్తే పరిస్థితి ఏమిటి? అలాంటప్పుడు ఆర్టికల్ 19, 21లలో దేన్ని వర్తింపజేయాలి?’’అని ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. పత్రికల్లో ఒకసారి ప్రచురితమయ్యే వార్త ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని ఆయన గుర్తు చేశారు. కనుక వార్తాంశాన్ని చెరిపేయడం సాధ్యపడదని బదులిచ్చారు. ‘‘ఆ పరిస్థితిలో సదరు వార్త సజీవంగానే ఉండిపోతుంది. అలాంటప్పుడు చెరిపేసే హక్కు పరిస్థితి ఏమిటి?’’అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకు సదరు వ్యక్తికి సంబంధించి వార్తాంశాలను తాము తొలగించినట్టు దాతార్ తెలిపారు. అయితే నిర్దిష్ట కాలం గడిచాక ఏ వార్తాంశమైన ఆర్కైవ్స్లోకి వెళ్లి ఉండిపోతుందని బదులిచ్చారు. పైగా ఇలాంటి వార్తాంశాల నుంచి సదరు వ్యక్తి పేరునే పూర్తిగా తొలగిస్తే ఆ ఉదంతానికి సంబంధించిన కథనమంతా కనుమరుగైనట్టేనని ఆందోళన వెలిబుచ్చారు. పౌరులకు సమాచారం అందుకుండా చేసేందుకు ఈ రోజుల్లో గోప్యత పేరిట అడ్డుగోడలు పుట్టుకొస్తున్నాయని జస్టిస్ భూయాన్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీబీఎఫ్ను చరిత్రను చెరిపేసే పనిముట్టుగా వాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టు తీర్పు వీలు కల్పింంచిందని దాతార్ ఆరపించారు. కనుక దాని రాజ్యాంగబద్ధత, అమలు పరిధి తదితరాలను స్పష్టంగా నిర్వచించాలని ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. ‘‘విచారణ సందర్భంగా కోర్టులు చేసే వ్యాఖ్యలు మర్నాడు మీడియాలో వార్తలుగా మారుతున్నాయి. అనంతరం కోర్టులు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నంత మాత్రాన సదరు వార్తా కథనాలను కూడా తొలగించగలమా?’’అని ప్రశ్నించారు. ‘‘ఈ సోషల్ మీడియా యుగంలో కొన్ని విషయాలకు సంబంధించి తమను అంతా మర్చిపోవాలని వాంఛించే వారి సంఖ్య పెరుగుతోంది. ఏమైనా ఇది ఆసక్తికరమైన అంశమే. దీన్ని లోతుగా పరిశీలిస్తాం’’అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.గతంలోనూ ‘సుప్రీం’ఆందోళన చెరిపేసే హక్కు (ఆర్టీబీఎఫ్) అమలు తీరుతెన్నులపై గతంలో కూడా సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. దీని ప్రకారం కోర్టు తీర్పులను పబ్లిక్ డొమైన్ నుంచి తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా, దారుణంగా ఉంటాయని 2024లో ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది.
3 వారాల్లో తేల్చాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మె ల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు మరో సారి డెడ్ లైన్ విధించింది. అనర్హతలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న కాలయాపనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం వెలువడకపోతే తామే నేరుగా జోక్యం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీద్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించింది. మున్సిపల్ ఎన్నికలతో ఆలస్యం: సింఘ్వీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ‘అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. పెండింగ్లో ఉన్న మొత్తం పిటిషన్లలో ఒకదానిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. మిగిలిన రెండు పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ఉండటం వల్ల స్పీకర్ కొంత సమయం కోరాల్సి వచ్చింది. మార్చి మధ్యలోగా లేదా అంతకంటే ముందే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది..’ అని చెప్పారు. 16 నెలలుగా ఏం చేస్తున్నారు?: మోహిత్ రావ్ సింఘ్వీ వాదనలను పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది మోహిత్రావ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ’గత 16 నెలలుగా ఈ వ్యవహారాన్ని స్పీకర్ కార్యాలయం తొక్కిపెడుతోంది. స్పీకర్ స్వయంగా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని గతంలో కోర్టుకు హామీ ఇచ్చి, ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే విచారణ జరిపారు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?..’ అని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కోర్టులను రీల్స్ కోసం వాడుకోవద్దు విచారణ సందర్భంగాన్యాయవాద వృత్తిలోని నైతికతపై జస్టిస్ సంజయ్ కరోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు గదుల్లో జరిగే వాదనలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ’రీల్స్’ రూపంలో పోస్ట్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ’న్యాయస్థానాలను రీల్స్ కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పుడు ఒక కొత్త పరిశ్రమగా మారింది. బాధ్యతాయుతమైన ఆఫీసర్లుగా ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు..’ అని హితవు పలికారు.
అబూజ్మాడ్లో భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, వరంగల్/కాళేశ్వరం: మహారాష్ట్ర– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ సంభవించింది. పోలీసులు–మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మహారాష్ట్రలోని గడ్చిరోలి డివిజన్ కమిటీ ఇన్చార్జి, వెస్ట్ సబ్జోనల్ బ్యూరో ఇన్చార్జి, సీపీఐ (మావోయిస్ట్) కంపెనీ నంబర్ 10 ఇన్చార్జి ప్రభాకర్ (తెలంగాణ, కామారెడ్డి జిల్లా వాసి) కూడా ఉన్నారు. ప్రభాకర్పై తెలంగాణ, మహారాష్ట్రల్లో రూ.50 లక్షల రివార్డు ఉంది. గత మూడు రోజులుగా కొనసాగిన ఆపరేషన్లో గురువారం రాత్రి వరకు ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, శుక్రవారం ఆపరేషన్లలో మరో నలుగురు (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మావోయిస్టుల మృతదేహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.మొత్తం మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మిగిలిన మావోయిస్టుల గుర్తింపు.. నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటనాస్థలం నుంచి మూడు ఏకే–47 రైఫిళ్లు, 1 ఎస్ఎల్ఆర్, ఒక 303 పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో సీ–60 జవాన్ దీపక్ చిన్న మాడవి (38) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అహేరి తాలూకా మంద్రా గ్రామానికి చెందిన ఆయన గురువారం ఇద్దరు మావోయిస్టులను హతమార్చారు. అదే సమయంలో గుండెపోటు రావడంతో హెలికాప్టర్లో బామ్రాగడ్ సబ్డిస్ట్రిక్ట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతిచెందారు. మరో సీ–60 జవాన్ జోగా మాడవ్కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను హెలికాప్టర్లో గడ్చిరోలికి తరలించి వైద్యం చేస్తున్నారు. ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను గడ్చిరోలి పోలీసులు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.1995లో అజ్ఞాతంలోకి..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన సీనియర్ మావోయిస్టు ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ లోకేటి చందర్ రావు (60)ది కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. 1995లో అడవిబాట పట్టిన ఆయన తిరిగి ఇంటిముఖం చూడలేదు. అప్పట్లో తండ్రి చనిపోయినా, మూడేళ్ల కిందట తల్లి చనిపోయినా ఇంటికి రాలేదు. సిర్నాపల్లి దళ కమాండర్గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగానూ పనిచేశారు. పోలీసు నిర్బంధం పెరిగిన సమయంలో ఆయన్ను దండకారణ్యానికి పంపించారు.అక్కడ పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి ప్రభాకర్ నాయకత్వం వహించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా నాయకత్వంలో ఆయన పనిచేసినట్టు ఈ మధ్య లొంగిపోయిన ఓ మావోయిస్టు నేత చెప్పారు. ప్రభాకర్ వెళ్లిన కొంత కాలానికి ఆయన భార్య నవత అలియాస్ లోకేటి సులోచన కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది. ఎనిమిదేళ్ల కిందట అనారోగ్యంతో దండకారణ్యంలో చనిపోయింది. ఆయన కొడుకు రమేశ్ అలియాస్ అశోక్, కూతురు లావణ్య కూడా తల్లిదండ్రుల బాటలో నడిచారు. రెండు నెలల కిందట రమేశ్ లొంగిపోగా, లావణ్య ఛత్తీస్గఢ్లో అరెస్టయి జైల్లో ఉన్నారు.
ఎన్ఆర్ఐ
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!)
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు.
TPAD అధ్యక్షురాలిగా వరుసగా మూడోసారీ మహిళకే పట్టం
డల్లాస్, టెక్సాస్లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్, డల్లాస్లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.టీప్యాడ్ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్త కమిటీ సభ్యులు లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .నూతన ఈసీ సభ్యులు:బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.టీప్యాడ్ 2026 కార్యవర్గం:ఎగ్జిక్యూటివ్ కమిటీ:లక్ష్మి పోరెడ్డి (President), అనురాధ మేకల (Past President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల, రత్న వుప్పల, బాల గణపవరపు.బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.ఫౌండేషన్ కమిటీ:రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి
క్రైమ్
వీడిన విజయశాంతిరెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసు మిస్టరీ!
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వే స్టేషన్లో ట్రాక్పై రైలుకు ఎదురెళ్లి బిడ్డలతో సహా బలవర్మణానికి పాల్పడిన విజయశాంతి రెడ్డి కేసు దాదాపు వీడింది. ఆమె ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందో అనే తేల్చే క్రమంలో పోలీసులు దాదాపు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపారు. చివరకు తీవ్ర డిప్రెషన్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తేల్చారు. గత కొంతకాలంగా విజయశాంతిరెడ్డి డిప్రెషన్తో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు, ఇటు ఆఫీస్లోని తోటి సిబ్బంది సైతం ధృవీకరించారు. ఈ క్రమంలోనే ఆమె సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే పిల్లలు ముందు నుంచి కూడా ఆమె కంట్రోల్లోనే ఉన్నారు. దీంతో తల్లి చెప్పినట్లే చేశారు. ఆమెతో పాటే వాళ్లు కూడా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ఒక అంచనాకు వచ్చారు. అయితే డిప్రెషన్కు గల కారణం ఏంటన్నది తేలాల్సి ఉంది. బహుశా.. పిల్లలను హాస్టల్లో ఉంచాల్సి రావడం, భర్తకు దూరంగా ఉంటుండడం ఆమెకు మానసికంగా కుంగదీసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వాడిన ఫోన్ తాలుకా.. ఫోన్కాల్ డాటాను మరింత లోతుగా విశ్లేషిస్తున్నట్లు సమాచారం.జనవరి 31వ తేదీన ఉదయం చర్లపల్లి రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని విజయ (35), విశాల్ (17), చైతన్య (18)గా గుర్తించారు. పోస్ట్మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. భర్త దుబాయ్ నుంచి వచ్చాక స్వస్థలం బీబీనగర్లో అంత్యక్రియలు జరిపారు. ఘటనా స్థలంలోని విజయ కారు నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. రైల్వేట్రాక్పై బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి తీసుకున్న నిర్ణయంపై.. తెలుగు రాష్ట్రాల సామాజిక మాధ్యమాల్లో అమ్మరాసిన మరణశాసనం అంటూ చర్చ జరిగింది. బంధువులే ఏమన్నారంటే..ఉద్యోగరీత్యా.. పిల్లల భవిష్యత్తు కోసం భార్యభర్తల మధ్య దూరం ఆమెలో ఒంటరిననే భావనను పెంచిందని బంధువులు రైల్వే పోలీసుల విచారణలో చెప్పారు. సూసైడ్కు ముందు.. 15 రోజులుగా ఒంటరిదాన్ని అనే ఆలోచన ఆమెను మరింత కుంగదీసినట్లు తెలుస్తోంది. దగ్గరి బంధువులు, స్నేహితులతో ఇదే విషయాన్ని పదేపదే పంచుకుంటూ బాధపడేదంటూ విజయరెడ్డి సమీప బంధువు ఒకరు వివరించారు. ఒంటరిగా ఇంకెంతకాలం అంటూ బాధపడేదన్నారు. సంసారంలో ఇవన్నీ సహజమని భావించామని.. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయమని ఆమె స్నేహితులు చెబుతున్నారు. 2007లో సురేందర్రెడ్డి, విజయరెడ్డిలకు వివాహమైంది. సురేందర్రెడ్డికి నాలుగేళ్ల క్రితం దుబాయ్లో కొలువురావటంతో అక్కడకు వెళ్లారు. ఉప్పల్ డిపో రాఘవేంద్రనగర్లోతల్లి పుష్పలతతో కలిసి విజయరెడ్డి పిల్లలతో ఉంటున్నారు. ఆమె ఓ ఐటీ కంపెనీలో టీమ్లీడర్గా పనిచేస్తున్నారు. రాత్రి విధులు కావటంతో పిల్లలిద్దర్నీ హాస్టల్స్లో ఉంచి చదివిస్తున్నారు. ఆనాడు.. విజయరెడ్డి ఇంటి నుంచి సొంత కారులో బయటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం హాస్టల్స్లో ఉన్న బిడ్డల్ని బయటకు తీసుకొచ్చారు. కారును చర్లపల్లి రైల్వేస్టేషన్ పార్కింగ్లో నిలిపారు. మధ్యలో ఏడు గంటలపాటు వాళ్లు ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఆపై పార్కింగ్ స్లిప్ వెనుక వైపు తనకు జీవించాలని లేదని.. తాను దూరమైతే పిల్లలు ఒంటరవుతారంటూ సూసైడ్నోట్ రాసి కారులోనే వదిలేశారు. అదే సూసైడ్లెటర్ను ఆమె ఫొటో తీసి తన వాట్సప్లో స్టేటస్గా ఉంచారు. ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫోన్లు, ల్యాప్ట్యాప్లు వెతికినా.. తమ మధ్య ఎలాంటి గొడవల్లేవని. కుటుంబానికి ఆర్థిక సమస్యలు కూడా లేవని విజయశాంతిరెడ్డి భర్త సురేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విజయ తల్లి కూడా పోలీసులకు తెలిపింది. దీంతో.. కేసు మరింత క్లిష్టంగా మారింది. చివరకు.. ఆమె ఫోన్, ల్యాప్ట్యాప్లను పోలీసులు విశ్లేషించినా లాభం లేకపోయింది. అందులోనూ ప్రొఫెషనల్ చాటింగ్లే తప్పా.. ఏం దొరకలేదు. ఆమె రెండో ఫోన్ వాడిందనే ప్రచారం తెర మీదకు రాగా.. పోలీసులు దానిని కొట్టిపారేశారు.
సోఫాకు సిగరెట్ నిప్పంటుకుని..
హైదరాబాద్: మద్యం మత్తులో సిగరెట్ తాగుతుండగా.. సోఫాకు నిప్పంటుకుని విశ్రాంత సైనిక ఉద్యోగి దుర్మరణం పాలైన ఘటన బోరబండ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సెక్టార్ ఎస్ఐ కాశయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నకేశవులు (67) విశ్రాంతి సైనికోద్యోగి. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి హెచ్ఎఫ్ నగర్ ఫేజ్–1 బస్తీలో నివాసముంటున్నాడు. ఆయనకు మద్యం, పొగ తాగే అలవాటు ఉంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెన్న కేశవులు భవనం పైగదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఆయన ఉన్న గది నుంచి మంటలు రావడంతో భార్య, స్థానికులు వెళ్లి చూడగా.. సోఫాలోనే పూర్తిగా కాలిపోయి ఉన్నాడు. చెన్నకేశవులు మద్యం మత్తులో సిగరెట్ తాగుతున్న క్రమంలో సోఫాకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగి కాలిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
కౌండిన్య, మోర్థానలో.. వీరప్పన్లు!
మోర్థాన అటవీ ప్రాంతంలో నయా వీరప్పన్లు చెలరేగిపోతున్నారు. భూమిపై నివశించే క్షీరదాల్లో అతి పెద్దదైన ఏనుగులను వెంటాడి వేటాడేస్తున్నారు. నాటు తుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి నిట్టనిలువునా చంపేస్తున్నారు. వివిధ కారణాలతో మృతిచెందినా వదలకుండా.. వాటివద్ద గద్దల్లా వాలిపోతున్నారు. దంతాలను పీకి ఎంచక్కా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏనుగు దంతాల స్మగ్లర్లు అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతోపాటు ఆంధ్రలోనూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల తమిళనాడులోని గుడియాత్తంలో ఓ ముఠా పట్టుబడడంతో ఆ మూడు రాష్ట్రాల అధికారులు అలెర్ట్ అయ్యారు. పలమనేరు: దక్షిణ భారతదేశంలో గజరాజుల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఏనుగు దంతాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. కార్ణటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని మోర్థానాలో మాటు వేసి మరీ వేటాడుతున్నారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా వాటి కోరలు పీకి విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించిన మూలాలు చిత్తూరు జిల్లాలోని వారికి సంబంధం ఉందనే విష యం బయటపడింది. తాజాగా తమిళనాడులోని గుడియాత్తంలో అక్కడి ఫారెస్ట్ అధికారులకు పట్టుబడిన ముఠాతో పలమనేరు మండల వాసికి సంబంధాలున్నాయనే విషయం సంచలనమైంది. ఏనుగు మృతి చెందితే దాన్ని జూ అధికారులు పోస్టుమార్టం చేసి దాని దంతాలను తొలగించి ఆపై పాతిపెడుతుంటారు. కానీ వందల కిలోమీటర్లున్న అడవిలో మృతిచెందే ఏనుగుల పరిస్థితి ఏంటో మరి.గతంలో కర్ణాటకలో వెలుగులోకి కర్ణాటకలోని హెబ్బాళ్ల పోలీసులకు గతంలో ఏనుగుదంతాల కేసులో చిత్తూరు జిల్లా చెందిన స్మగ్లర్ల విషయం వెలుగుచూసింది. కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అడవుల్లో సంచరించే ఏనుగుల దంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మృతిచెందిన ఏనుగు దంతాల తొలగింపు సాధారణంగా మృతిచెందిన ఏనుగు నుంచి దంతాలను తీసి ఆపై పూడ్చి పెడుతుంటారు. కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటిదాకా 20 ఏనుగులు మృతిచెందాయి. వీటిని పాతిపెట్టేముందు సంబంధిత ఎఫ్ఆర్వో ఉన్నతాధికారుల నుంచి కస్టోడియల్ ఫామ్ను పొంది ఆపై జూ డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహించాలి. దంతాలను కత్తిరించాక పాతిపెట్టిన ప్రదేశాన్ని జియోరెఫరెన్స్ చేసి ఇందుకు సంబంధించిన కేస్ రిపోర్ట్లో ఉంచాలి. దంతాలను ఫారెస్ట్ కస్టోడియన్ స్టోర్ రూమ్లో భద్రపరుస్తారు. ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా? ఏనుగులు అడవిలో మృతిచెందినా, లేక వేటగాళ్లు నాటు తుపాకులతో, నల్లమందు ఉండలతో చంపినా వాటి నుంచి దంతాలను సేకరించే అవకాశాలున్నాయి. గతంలో హొగినేకళ్ అడవుల్లో వీరప్పన్ హయాంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ సాగింది. కౌండిన్య అడవిలోంచి మదపుటేనుగులు శేషాచలం అడవుల్లోకి వెళుతుంటాయి. ఏపీ, తమిళనాడు అడవుల్లో ఇలాంటి కార్యక్రమాలు సాగేందుకు అనుకూలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. మోర్థాన అడవిలో మూడు ఏనుగులు మృతి చెందిన విషయం అక్కడి అటవీశాఖకు నెల దాకా తెలియ దంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మగ ఏనుగులకు మాత్రమే దంతాలుపలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్రేంజ్ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యం దాదాపు 250 చ.కి.మీగా ఉంది. ఇందులో సుమారు వంద దాకా ఏనుగులున్నాయి. ఇక ఇదే అడవికి ఆనుకొని ఉన్న మోర్థా నా రేంజ్ 130 చ.కి.మీగా ఉండగా ఇందులో 26 దాకా, కృష్ణగిరి, మైసూరు జిల్లాలో 320 చ.కిమీ విస్తీర్ణలో 46 దాకా ఏనుగులున్నట్టు తెలుస్తోంది. వీటిలో మగ ఏనుగులు (టస్కర్స్) 27 దాకా ఉన్నట్టు సమాచారం. ఇందులో కొన్ని మదపుటేనుగులు కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీని దాటి భాకరాపేట అడవుల మీదుగా శేషాచలం అడవుల్లోనూ సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు అటు తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం ఫారెస్ట్లోని మోర్థాన ప్రాంతం, క్రిష్ణగిరి, కావేరిపట్నం, కర్ణాటకలోని హొసూర్, బన్నేర్గట్టల నుంచి తరచూ కౌండిన్యలోకి ప్రవేశించే సంచార ఏనుగులున్నాయి. జిల్లాలో మొత్తం 12 మదపుటేనుగులుండేవి. వీటిలో ఆరు మృతిచెందగా ఇప్పుడు ఆరు మగ ఏనుగులు మాత్రమే ఉన్నాయి.విదేశాల్లో భలే డిమాండ్ చైనా, జపాన్, సింగపూర్, యూఏఈ లాంటి దేశాల్లో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్ ఉంది. వీటి విలువ కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వీటితో అందమైన కళాఖండాలు, బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, ఫియోనో, చందరంగ చిహ్నాలు, విలాసాలు, హోదాలకు కోటీశ్వరులు కొంటున్నట్టు తెలిసింది.తాజాగా తమిళనాడులో... కౌండిన్య అభయారణ్యానికి ఆనుకొని ఉన్న తమిళనాడులోని మోర్థాన ఫారెస్ట్లో గత డిసెంబర్ 4న మూడు ఏనుగుల కళేబరాలు భయపడ్డాయి. వీటిలో మదపుటేనుగు దంతాలు కనిపించకపోవడంతో అక్కడి ఫారెస్ట్ అధికారులు శోధిస్తుండగా నాలుగురోజుల క్రితం గుడియాత్తంలో ఏనుగు దంతాలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారిని విచారించగా తమకు పలమనేరు మండలంలోని ఓ వ్యక్తి ద్వారా వచ్చాయనే విషయం వెలుగుచూసింది.
కడపలో మహిళా హెచ్ఎం ఆత్మహత్యాయత్నం
కడప అర్బన్: కడపలోని మున్సిపల్ హై స్కూల్ (మెయిన్)లో ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న జింకా జమీమా సుందరం (49) శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారు.పోలీసులు, బాధితురాలి బంధువులు, సహచర ఉపాధ్యాయులు అందించిన వివరాలు.. జింకా జమీమా సుందరం, ఆమె భర్త పుష్ప రాజు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. వారు ఐఐటీల్లో చదువుతున్నారు. కొన్నేళ్లుగా మున్సిపల్ హైసూ్కల్ మెయిన్లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జమీమా సుందరం ఇటీవల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఉపాధ్యాయులు, సిబ్బంది రికార్డుల వ్యవహారాలు, జీతభత్యాల నిర్వహణ వంటి బాధ్యతలతో పని ఒత్తిడి పెరిగింది. భర్త పుష్ప రాజ్ మొదట్లో రికార్డుల నిర్వహణలో సహాయం చేసినా.. ఇటీవల పట్టించుకోకపోవడంతో మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో హెచ్ఎం జమీమా సుందరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు వాయిస్ మెసేజ్ పాఠశాల గ్రూప్లో పెట్టడంతో సహచర ఉపాధ్యాయులు వెంటనే ఇంటికి వెళ్లారు. వేలాడుతున్న ఆమెను కిందికి దించి ఎర్రముక్కపల్లె రహదారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డీఈవో షంషుద్దీన్, ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. పని ఒత్తిడా.. కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యకు యతి్నంచారా అన్నది తేలాల్సి ఉంది.
వీడియోలు
రాజు ఎక్కడున్నా రాజే.. చెన్నైలో వైఎస్ జగన్ ప్రభంజనం
నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని ములాఖత్ లో కలిసిన చెవిరెడ్డి
రాంబాబు భౌతికకాయానికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు
పవన్ కల్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చారా? అంబటి మౌనిక అదిరిపోయే రిప్లై
50 మంది విద్యార్థులకు అస్వస్థత.. రంపచోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలింపు
సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు
ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తిరుమల లడ్డు ప్రసాదంపై ది వైర్ వెబ్ సైట్ సంచలన కథనం
చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారు.. కూటమిలో భయం మొదలైంది
టీడీపీ నేతలే షాక్ అయ్యేలా ఎల్లో భజన చేస్తున్న జనసేన బ్యాచ్

