‘కొత్త EPF స్కీమ్’ అమల్లోకి.. ఏమి మారిందంటే..
‘సామాజిక భద్రత కోడ్-2020’ అమలులో భాగంగా ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్-2026’ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసింది. జూన్ 29న గెజిట్లో ప్రచురితమైన ఈ కొత్త నిబంధనలు అదే తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దాదాపు ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘ఈపీఎఫ్ స్కీమ్-1952’ స్థానంలో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు, కంట్రిబ్యూషన్ రేట్లు, యూఏఎన్ వంటి కీలక అంశాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, పరిపాలనను మరింత డిజిటల్, పారదర్శకంగా మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.కంట్రిబ్యూషన్లో మార్పు లేదుకొత్త ఈపీఎఫ్ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఉద్యోగి, యజమాని(కంపెనీ) చెల్లించే తప్పనిసరి పీఎఫ్ చందా యథాతథంగానే ఉంటుంది. ఉద్యోగి వేతనంలో 12 శాతం, యజమాని నుంచి మరో 12 శాతం చొప్పున పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసిన కొన్ని సంస్థలకు ప్రస్తుతం అమల్లో ఉన్న 10 శాతం కంట్రిబ్యూషన్ విధానమే కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15,000 వేతన పరిమితి (వేజ్ సీలింగ్)లో కూడా ఎలాంటి మార్పు చేయలేదు.వాలంటరీ పీఎఫ్కు కొనసాగింపుచట్టబద్ధంగా నిర్దేశించిన పీఎఫ్ చందాకు అదనంగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ‘వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్’ (VPF)లో మరింత మొత్తం జమ చేసే అవకాశం కొనసాగుతుంది. దీంతో ఎక్కువ పొదుపు చేయాలనుకునే ఉద్యోగులకు కొత్త స్కీమ్ కూడా అదే వెసులుబాటు కల్పించింది.పాక్షిక ఉపసంహరణలపై స్పష్టతవైద్య చికిత్స, ఉన్నత విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర అత్యవసర అవసరాల కోసం పీఎఫ్ నుంచి పాక్షికంగా డబ్బు ఉపసంహరించుకునే నిబంధనలను కొత్త స్కీమ్ మరింత స్పష్టంగా పేర్కొంది. అయితే కనీస బ్యాలెన్స్, సభ్యత్వ కాలం వంటి నిర్దిష్ట అర్హతలను పాటించాల్సి ఉంటుంది.డిజిటల్ సేవలకు పెద్దపీటఈపీఎఫ్ నిర్వహణలో డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కొత్త స్కీమ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇకపై ఎలక్ట్రానిక్ ఫైలింగ్స్, ఆన్లైన్ క్లెయిమ్స్, ఈ-పాస్బుక్, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారిత సేవలకు ప్రాధాన్యం పెరుగుతుంది. దీంతో క్లెయిమ్ల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు పారదర్శకత కూడా మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.కేంద్రానికి ప్రత్యేక అధికారంమహమ్మారులు, అంటువ్యాధులు లేదా జాతీయ విపత్తుల వంటి అసాధారణ పరిస్థితుల్లో ఈపీఎఫ్ చందా రేటును తాత్కాలికంగా తగ్గించడం లేదా వాయిదా వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కొత్త స్కీమ్ ప్రత్యేక అధికారం కల్పించింది. అవసరమైన సందర్భాల్లో ఉద్యోగులు, సంస్థలకు ఉపశమనం కల్పించడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.పీఎఫ్ ట్రస్టులకు కఠిన నిబంధనలుసొంతంగా ‘ఎగ్జెంప్టెడ్ పీఎఫ్ ట్రస్టులు’ నిర్వహించే కంపెనీలపై కొత్త స్కీమ్ మరింత కఠినమైన పాలనా నిబంధనలను అమలు చేసింది. ట్రస్టీల అర్హతలు, ఎలక్ట్రానిక్ అకౌంటింగ్, వార్షిక ఆడిట్లు, ఆన్లైన్ డిస్క్లోజర్లు వంటి అంశాలను తప్పనిసరి చేసింది. దీంతో సభ్యుల నిధుల నిర్వహణలో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుత సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేదుఇప్పటికే ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్నవారంతా ఆటోమేటిక్గా ‘ఈపీఎఫ్ స్కీమ్-2026’ పరిధిలోకి వస్తారు. వారి పీఎఫ్ బ్యాలెన్స్, ఇప్పటికే కూడబెట్టుకున్న నిధులు, సభ్యత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు. కొత్తగా అర్హత పొందే ఉద్యోగులు కూడా ఇదే స్కీమ్ కింద నమోదు అవుతారు.యూఏఎన్ యథాతథంప్రతి సభ్యుడికి కేటాయించే ‘యూనివర్సల్ అకౌంట్ నంబర్’ (UAN)లో ఎలాంటి మార్పు లేదు. ఉద్యోగులు సంస్థలు మారినా అదే యూఏఎన్ కొనసాగుతుంది. దీంతో పీఎఫ్ ఖాతా బదిలీలు, సేవా నిరంతరత సులభంగా కొనసాగుతాయి.ఇదీ చదవండి: SBI యోనో యాప్లో కొత్తగా ఏఐ ఫీచర్లుకొత్త ఈపీఎఫ్ స్కీమ్ వల్ల ఉద్యోగుల నెలవారీ పీఎఫ్ కట్, వడ్డీ రేటు లేదా ఇప్పటికే కూడబెట్టుకున్న పీఎఫ్ నిధులపై తక్షణ ప్రభావం ఉండదు. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ‘సామాజిక భద్రత కోడ్-2020’కు అనుగుణంగా ఈపీఎఫ్ వ్యవస్థను ఆధునికీకరించడం, డిజిటల్ సేవలను విస్తరించడం, పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడం మాత్రమే.ఇది చదివారా? ఆధార్, క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు
మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరెకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ తేదీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ సినిమా రిలీజ్ తేదీని లాక్ చేశారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ ఫాంటసీ సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 16న విశ్వంభర థియేటర్లలో సందడి చేయనుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించారు.
క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్ జగన్ భరోసా (ఫొటోలు)
ఒక అమాయకుడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: ఒక అమాయకుడ్ని అకారణంగా పోలీసులు హింసించారని, అది తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే కనీసం పట్టించుకునే స్థితిలో చంద్రబాబు లేరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసులనే రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారాయన. గురువారం విజయవాడలోని పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు.క్రాంతి కుమార్పై ఏ కేసులు లేవు. కార్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయినా పోలీసులు అతన్ని ఎందుకు పోలీస్ స్టేషన్కు పిలిచారు? ఎందుకు హింసించారు?. సీఐ నాగరాజు తనను వేధిస్తున్నాడంటూ.. అది తట్టుకోలేక పోతున్నానంటూ వీడియో తీసుకుని మరీ క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని పోలీసులే చిన్నాభిన్నం చేశారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.మూడు నెలలుగా పోలీసులు వేధిస్తున్నారని క్రాంతి తన వీడియోలో చెప్పాడు. ఆ మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు పెట్టాలని.. కానీ ఎందుకు అలా చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. కనీసం క్రాంతి కుటుంబం ఫిర్యాదు చేస్తే కేసు పెట్టలేదు. క్రాంతి కుటుంబానికి న్యాయపరంగా సహాయం చేస్తాం. ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటాం అని వైఎస్ జగన్ ప్రకటించారు.నెల వ్యవధిలోనే..విజయవాడ నడిబొడ్డులోనే రెండు దారుణ ఘటనలు జరిగాయి. నెల వ్యవధిలో ఓ లాకప్డెత్(గాదె సాయికృష్ణ కేసు), పోలీసుల వేధింపులు తట్టుకోలేక మరొకరు మరణించారు(క్రాంతి కేసును ఉద్దేశించి..). సాయికృష్ణ కేసులో అతని తల్లి అర్జీని కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ఏకంగా సీసీటీవీ ఫుటేజీనే మాయం చేశారు. సీసీ టీవీ ఫుటేజీ మాయమైపోతే బ్యాకప్ ఉండదా?. పద్ధతి ప్రకారమే స్టేషన్లో అరాచకాలు చేస్తున్నారు. సీఐని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం రక్షిస్తున్నారని అని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
కొత్త అవతారంలో నరేగా!
కమర్షియల్ ఎంటర్టైనర్
ఇంగ్లండ్తో సెమీఫైనల్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
వందకోట్ల బడ్జెట్ అవుతుందనుకోలేదు: అభిషేక్ నామా
‘స్పెషల్ క్లాస్’ వద్దు ‘సేఫ్ క్లాస్’ చాలు
ప్రశ్నించడమూ విద్యలో భాగమే!
తల్లిగానే కాదు... సీఈవోగానూ గెలిచింది!
భూకంప విలయం.. వెనెజువెలాలో ఆకలి కేకలు
'సర్' ప్రక్రియలో లోపాలపై ఎన్నికల CEOకి వైఎస్సార్సీపీ లేఖ
సిరియా రాజధాని డమాస్కస్లో పేలుడు.. ఆరుగురు మృత్యువాత
ఎన్నికల ముందు మరొకసారి చేశారంటే ముచ్చటగా మూడు సార్లు భూమి పూజ చేసినట్లు అవుతుంది సార్!!
అలాగే ‘సర్’!
కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్
మిమ్మల్ని గెలిపించుకున్నందుకు చెప్పుతో కొట్టుకోవాలి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభ సూచనలు
సాక్షి కార్టూన్ : నేను చెప్పిన మందులు డౌన్లోడ్ చేసుకోండి!
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. రిలీజైన 8 నెలలకు..!
రిషబ్ పంత్ కీలక నిర్ణయం
పెను సంచలనం.. సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.35 కోట్ల కుట్ర..
నాకు సూర్య అవన్నీ చెప్పాడు: శ్రేయస్ అయ్యర్
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ
అభిషేక్, దూబే మెరుపులు
‘ఇసకపట్నం’ వెబ్సిరీస్ రివ్యూ
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా
మహా రాజకీయాల్లో బాంబు పేల్చిన జూనియర్ థాక్రే
జేఈఈ ఫెయిల్యూర్..ఇవాళ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
సీన్ రివర్స్.. ఇంధన దిగ్గజానికి భారత్ దన్ను!
మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
కొత్త అవతారంలో నరేగా!
కమర్షియల్ ఎంటర్టైనర్
ఇంగ్లండ్తో సెమీఫైనల్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
వందకోట్ల బడ్జెట్ అవుతుందనుకోలేదు: అభిషేక్ నామా
‘స్పెషల్ క్లాస్’ వద్దు ‘సేఫ్ క్లాస్’ చాలు
ప్రశ్నించడమూ విద్యలో భాగమే!
తల్లిగానే కాదు... సీఈవోగానూ గెలిచింది!
భూకంప విలయం.. వెనెజువెలాలో ఆకలి కేకలు
'సర్' ప్రక్రియలో లోపాలపై ఎన్నికల CEOకి వైఎస్సార్సీపీ లేఖ
సిరియా రాజధాని డమాస్కస్లో పేలుడు.. ఆరుగురు మృత్యువాత
ఎన్నికల ముందు మరొకసారి చేశారంటే ముచ్చటగా మూడు సార్లు భూమి పూజ చేసినట్లు అవుతుంది సార్!!
అలాగే ‘సర్’!
కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్
మిమ్మల్ని గెలిపించుకున్నందుకు చెప్పుతో కొట్టుకోవాలి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభ సూచనలు
సాక్షి కార్టూన్ : నేను చెప్పిన మందులు డౌన్లోడ్ చేసుకోండి!
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. రిలీజైన 8 నెలలకు..!
రిషబ్ పంత్ కీలక నిర్ణయం
పెను సంచలనం.. సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.35 కోట్ల కుట్ర..
నాకు సూర్య అవన్నీ చెప్పాడు: శ్రేయస్ అయ్యర్
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ
అభిషేక్, దూబే మెరుపులు
‘ఇసకపట్నం’ వెబ్సిరీస్ రివ్యూ
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా
మహా రాజకీయాల్లో బాంబు పేల్చిన జూనియర్ థాక్రే
జేఈఈ ఫెయిల్యూర్..ఇవాళ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
సీన్ రివర్స్.. ఇంధన దిగ్గజానికి భారత్ దన్ను!
మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఫొటోలు
సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)
మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
బీచ్లో బిగ్బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫొటోలు)
పింక్ శారీలో టాలీవుడ్ నటి అనసూయ గ్లామర్ (ఫొటోలు)
క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్ జగన్ భరోసా (ఫొటోలు)
నాగబంధం ప్రమోషన్స్లో హీరోయిన్ నభా నటేష్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు రాజేంద్ర ప్రసాద్,సాయి కుమార్ (ఫొటోలు)
డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి రిసెప్షన్.. టాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు)
సినిమా
జైలర్-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. విశ్వంభరకు పోటీ తప్పదా?
తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ జైలర్-2. గతంలో సూపర్ హిట్గా నిలిచిన జైలర్ మూవీ సీక్వెల్గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్ పిక్చర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించింది. దీంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మోహన్లాల్, శివ రాజ్కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.విశ్వంభరతో పోటీ?అయితే మెగాస్టార్ విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సమ్మర్లో రిలీజవుతుందని ఆశించినప్పటికీ అలా ఏం జరగలేదు. ఈ దసరాకే విశ్వంభర రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించకపోయినా.. దసరాకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న మెగాస్టార్ మూవీని విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారని టాలీవుడ్ టాక్. తాజాగా అక్టోబర్ 15న జైలర్-2 తేదీని ఫిక్స్ చేయడంతో విశ్వంభర రిలీజ్కు సాహసం చేస్తారా? మరోసారి వాయిదా వేయకతప్పదా? రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. జైలర్-2తో మెగాస్టార్ పోటీకి దిగుతాడా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. Alappara Kelappurom! #Jailer2 storms into theatres worldwide on October 15 🔥 #Jailer2FromOct15 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @kabilanchelliah @RIAZtheboss pic.twitter.com/mY50qNOSQh— Sun Pictures (@sunpictures) July 2, 2026
ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. కాస్తా లేట్ అంతే..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. జూన్ నుంచే ముహుర్తాలు షురూ కావడంతో పెళ్లిళ్ల సందడి మొదలైంది. తాజాగా మరో నటుడు పెళ్లీపీటలెక్కారు. తమిళ, మలయాళ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరవింద్ ఆకాశ్ ఓ ఇంటివాడయ్యారు. ఈయన దాదాపు 50 ఏళ్ల వయసులో తన ప్రియురాలు సారాను పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి వేడుక మలేసియాలోని కౌలాలంపూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో దర్శకుడు వెంకట్ ప్రభు, నటుడు వైభవ్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అరవింద్.. పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కాగా. అరవింద్ ఆకాశ్ కోలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చెన్నై 600028, గోవా, సరోజ, మంకథ, బిర్యానీ, మాస్ ఎంగిర మసిలమణి, చెన్నై 600028 II, మానాడు, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాల్లో కనిపించారు. అరవింద్ ఎక్కువగా వెంకట్ ప్రభు డైరెక్ట్ మూవీస్లో నటించడం విశేషం. తమిళంతో పాటు మలయాళ చిత్రసీమలోనూ అరవింద్ ఆకాశ్ మెప్పంచారు. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'నందనం' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రకు బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మలయాళంలో కూట్టు, వాంటెడ్, వజ్రం, పొన్ముడిపుళయోరతు, మమ్మీ అండ్ మీ, ప్రజాపతి లాంటి సినిమాలు చేశారు. ఇటీవలే పృథ్వీరాజ్-బాసిల్ జోసెఫ్ నటించిన 'గురువాయూరంబాల నడయిల్' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. కాగా.. అరవింద్ చివరిసారిగా 2024లో విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో నటించారు. Love wins at 50! 💍❤️Popular South actor #AravindAkash tied the knot with his partner Sarah in an intimate ceremony in Malaysia. The Chennai 600028 and Mankatha squad flew down to Kuala Lumpur to celebrate the mini-reunion! Slide to see Venkat Prabhu, Vaibhav, and Premgi… pic.twitter.com/2ustvzuvfi— Abhay Mani Diwakar (@theabhayd) July 2, 2026
'ఎన్నాళ్లకు గుర్తొచ్చానే వానా'.. తమన్నా ఆనందం చూశారా?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ఖుష్బు సుందర్ కుమార్తె వేడుకలో మెరిసిన ముద్దుగుమ్మ.. తాజాగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ముంబయిలో భారీ వర్షం కురవడంతో ప్రకృతిని ఆస్వాదించింది. తాను ఉండే ఇంటి బాల్కనీలో వర్షం పడుతున్న వేళ ఫుల్గా చిల్ అవుతూ ఎంజాయ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది తమన్నా. నాకు ఇంకా చల్లగానే ఉందని క్యాప్షన్ రాసుకొచ్చింది.వర్షంలో తడుస్తూ చిన్న పిల్లలా ఎంజాయ్ చేసిన తమన్నాను చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడం గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది బాలీవుడ్ బ్యూటీ రషా తడాని.. నేను లేకుండా ఎలా చేశావ్? అంటూ సరదాగా కామెంట్ చేసింది. మరోవైపు తమన్నా ప్రస్తుతం కేవలం బాలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్ తర్వాత దక్షిణాది సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)
రాజమౌళికి అరుదైన గౌరవం.. దర్శకధీరుడు ఎమోషనల్
దర్శకధీరుడు రాజమౌళి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఫ్రాన్స్ లియాన్లోని ప్రతిష్టాత్మక లూమియర్ మ్యూజియంలోని దిగ్గజాల సరసన నిలిచారు. ఫ్రాన్స్ సినీ దిగ్గజాలతో పాటు మన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరును శాశ్వతంగా మ్యూజియంలో ముద్రించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. తన జీవితాంతం గుర్తుండిపోయే ఈ జ్ఞాపకాన్ని అందించినందుకు ధన్వవాదాలు తెలిపారు.కాగా.. ఫ్రాన్స్లోని లియాన్లో ఉన్న లూమియర్ మ్యూజియంలో గతంలో 'ఈగ', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ చేసిన రూమ్ను రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా లూమియర్ ఇన్స్టిట్యూట్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమాక్స్ రాజమౌళికి సర్ప్రైజ్ ఇస్తూ ఆయన పేరు ముద్రించిన శిలాఫలకాన్ని అందించారు. ఈ ప్రకటనతో తాను భావోద్వేగానికి లోనయ్యానని రాజమౌళి రాసుకొచ్చారు. అక్కడ ఫలకాలతో నిండిన ఒక గోడకు మార్టిన్ స్కోర్సెస్, క్లింట్ ఈస్ట్వుడ్, క్వెంటిన్ టరాంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి దిగ్గజాల పేర్లు... వాటిని ఎర్రటి వస్త్రంతో కప్పబడిన ఒక ప్లేట్ను గమనించానని దర్శకధీరుడు ట్వీట్ చేశారు. అక్కడ నా పేరు చూసి మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయిందని రాజమౌళి పోస్ట్ చేశారు.Visited the Lumière Museum and the screening room where Eega and RRR was screened to a full house in Lyon, France.Thierry Frémaux, the director of the Institut Lumière and the Cannes Film Festival, was gracious enough to introduce me. Then he said he had planned a surprise and… pic.twitter.com/2ZA8UT7Zxf— rajamouli ss (@ssrajamouli) July 2, 2026
క్రీడలు
రంగారెడ్డి రైజర్స్ను చిత్తు చేసిన కరీంనగర్
తెలంగాణ ప్రీమియర్ లీగ్-2026లో కరీంనగర్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ను 58 పరుగుల తేడాతో కరీంనగర్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మరోసారి వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ రాదేష్(37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 72) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు హెచ్కే సింహా(60), చందన్ సహనీ(7 బంతుల్లో 17) రాణించారు. రంగారెడ్డి బౌలర్లలో తన్మయ్ జడ్డూ రెండు, త్యాగరాజన్, నితిన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. రైజర్స్ ఇన్నింగ్స్లో ఆధిత్య జవ్వాజీ(48), కరియప్ప(30) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కరీంనగర్ స్పిన్నర్ నారయణ తేజ మూడు వికెట్లు పడగొట్టగా.. శుభమ్ శర్మ, దినేష్ తలా రెండు వికెట్లు సాధించారు.
నా సేవల్ని సరిగ్గా వాడుకోలేదు.. అందుకే: టీమిండియా స్టార్
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో యాజమాన్యం తన సేవలను సరిగ్గా వాడుకోలేదని ఆరోపించాడు. కాగా గతేడాది టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే.ఈ సిరీస్తోనే భారత జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. గౌతం గంభీర్ మార్గదర్శనంలో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది. ఇక ఈ సిరీస్లో భాగంగా ముంబైకర్ శార్దూల్ ఠాకూర్ రెండు టెస్టులు ఆడాడు. మొత్తంగా 27 ఓవర్లు బౌలింగ్ చేసి 144 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ఆరు ఓవర్లు వేసిన శార్దూల్.. 38 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.అదే విధంగా మాంచెస్టర్లో నాలుగో టెస్టులో పదకొండు ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్ 55 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. ఈ మ్యాచ్ డ్రా అయింది. అయితే, ఈ మూడు ఇన్నింగ్స్లోనూ శార్దూల్ కంటే మిగతా బౌలర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశారు.ఈ విషయాన్ని శార్దూల్ ఠాకూర్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ 2026-27 సీజన్ లాంచ్లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘2024-25 సీజన్లో నేను అద్భుతంగా ఆడాను (తొమ్మిది మ్యాచ్లలో కలిపి 35 వికెట్లు). కానీ తగినన్ని మ్యాచ్లు ఆడే అవకాశాలు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నపుడు నా సేవల్ని యాజమాన్యం సరిగ్గా ఉపయోగించుకోలేదు.ఇందులో నా తప్పు కూడా ఉంది. లీడ్స్ టెస్టులో నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఒక్క పరుగుకే అవుటయ్యాను. మాంచెస్టర్లో మాత్రం నేను అద్భుతంగా బ్యాటింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్లో 41 పరుగులు చేశాను. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులు చేయగలిగింది. అందులో నా పాత్ర కూడా ఉంది. అయితే, నేను రెండో ఇన్నింగ్స్లో సరిగ్గా ఆడలేదు. ఒకవేళ బాగా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.
రాహుల్ ద్రవిడ్ తనయుడి వీర విహారం.. వీడియో వైరల్
మహారాజా ట్రోఫీ కెఎస్సీఏ టీ20 టోర్నీలో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తన అద్భుత బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో 'కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్' జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సమిత్.. బుధవారం హుబ్లీ టైగర్స్తో జరిగిన మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 20 ఏళ్ల సమిత్ బ్యాక్-ఫుట్ కట్స్, లాఫ్టెడ్ డ్రైవ్స్, అద్భుతమైన పుల్ షాట్లతో తన తండ్రిని తలపించాడు. కేవలం 23 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులు సాధించాడు. అతడి బ్యాటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రోహన్ పాటిల్ (38 బంతుల్లో 64) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రవీణ్ దూబే (28 బంతుల్లో 51), సమిత్(32), శివరాజ్ (7 బంతుల్లోనే 23 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. హుబ్లీ బౌలర్లలో వైభవ్ శర్మ 3, అభిషేక్ అహ్లావత్ 2 వికెట్లు పడగొట్టారు.204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హుబ్లీ టైగర్స్ చివరి బంతి వరకు పోరాడింది. మన్వంత్ కుమార్ కేవలం 22 బంతుల్లోనే 60 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. శివకుమార్ రక్షిత్ (41), అనీశ్వర్ గౌతమ్ (34), అభినవ్ మనోహర్ (21) కీలక సహకారం అందించారు. ఆఖరి బంతికి హుబ్లీ గెలుపునకు 5 పరుగులు అవసరం కాగా.. బెంగళూరు పేసర్ నిశ్చిత్ రావు కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బెంగళూరు బౌలర్లలో నిశ్చిత్ రావు మూడు, విద్వత్ కావేరప్ప రెండు వికెట్లు పడగొట్టారు.Samit Dravid had the whole field covered 🤩Catch all the action from the Maharaja Trophy KSCA T20 2026 LIVE on FanCode 📲#MaharajaTrophy pic.twitter.com/gurjHdavpE— FanCode (@FanCode) July 1, 2026
శ్రీలంక పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ విడుదల
ఇంగ్లండ్తో టీ20, వన్డేల సిరీస్ అనంతరం భారత పురుషల క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ సిరీస్లోని మొదటి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుండి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అదేవిధంగా రెండో టెస్టు మ్యాచ్( ఆగస్టు 23 నుండి 27)కు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు మ్యాచ్ల సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది.లంకతో సిరీస్ భారత్కు చాలా కీలకం. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. టీమిండియా ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడగా, కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో(48.15 పీసీటీ) ఐదవ స్ధానంలో నిలిచింది.డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను గిల్ సేన సజీవంగా ఉంచుకోవాలంటే శ్రీలంక గడ్డపై ఖచ్చితంగా గెలవాల్సిందే. అయితే లంకేయులను వారి స్వదేశంలో ఓడించడం అంత ఈజీ కాదు. శ్రీలంక జట్టు గత కొంత కాలంగా సొంత గడ్డపై అద్భుత విజయాలతో దూసుకుపోతోంది.ఈ దశాబ్దంలో ఆడిన 21 టెస్ట్ మ్యాచ్లలో 11 విజయాలను శ్రీలంక నమోదు చేసింది. కాగా 2017 తర్వాత భారత్ టెస్టుల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అప్పట్లో విరాట్ సారథ్యంలో భారత్ 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది.
న్యూస్ పాడ్కాస్ట్
చంద్రబాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
రగిలిన రైతన్నలు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు దగాపై దద్ధరిల్లిన విజయవాడ ధర్నాచౌక్
తెలంగాణలో వానల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతన్నలు. పలు జిల్లాల్లో లోటు వర్షపాతం
విత్తనం నుంచి బీమా వరకు అన్నింటా సమస్యలే... ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
ఏపీ రాజధానిలో గూండారాజ్... రైతుల ఆహ్వానం మేరకు భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో తెలుగుదేశం మూకల దాడి
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ ‘అప్పుల క్యాలెండర్’ విడుదల... నెలకు 7 వేల 266 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేయబోతున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు. యాప్లో ఓటీపీలు రాక.. వేలిముద్రలు మ్యాచ్ కాక తిప్పలు
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన.. ఇవాళ మహిమాన్విత ఆలయానికి కలశస్థాపన చేయనున్న YSRCP అధినేత..
చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
బిజినెస్
SBI యోనో యాప్లో కొత్తగా ఏఐ ఫీచర్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రిటైల్, బిజినెస్ కస్టమర్ల కోసం పలు ఏఐ ఆధారిత డిజిటల్ ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది. యోనో ప్లాట్ఫాంలో సేవలను మరింతగా విస్తరించింది. కొత్త కస్టమర్లు ఇప్పుడు 3–ఇన్–1 డిజిటల్ ఆన్బోర్డింగ్ ప్రక్రియ ద్వారా పొదుపు ఖాతాతో పాటు ఎస్బీఐక్యాప్ సెక్యూరిటీస్లో డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా కూడా తెరవచ్చు.అర్హత కలిగిన కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంటును కార్పొరేట్ శాలరీ అకౌంటుగా మార్చుకోవచ్చు. అలాగే వ్యాపార వర్గాల కోసం ట్రేడ్ ఫైనాన్స్ సాధనాలన్నింటిని యోనో బిజినెస్లో అనుసంధించడం ద్వారా ఈ–ట్రేడ్ సేవలను విస్తరించినట్లు బ్యాంకు తెలిపింది. యోనో బిజినెస్ వెబ్, మొబైల్ ప్లాట్ఫాంలలో ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉండేలా ఏజెంటిక్ ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ’యోనో జీ’ని బ్యాంకు ప్రవేశపెట్టింది.కృత్రిమ మేథ, డిజిటల్ ఆవిష్కరణలు, డేటా ఆధారిత విశ్లేషణలతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించాలన్న తమ లక్ష్యానికి ఇవి నిదర్శనమని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎస్బీఐకి 53 కోట్ల పైగా కస్టమర్లు ఉండగా, వారిలో 10 కోట్ల మంది యోనో యూజర్లు ఉన్నారు.
బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!
ఈ రోజుల్లో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే, ఎంతటి ఖరీదైన స్మార్ట్ఫోన్ తీసుకున్నా కొన్నాళ్లకే బ్యాటరీ త్వరగా అయిపోతోందనే ఫిర్యాదు సాధారణం. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా హెవీ యూసేజ్ వల్ల ఫోన్లు వేడెక్కడం, చార్జింగ్ నిమిషాల్లో కరిగిపోవడం చాలామందిని వేధించే సమస్య.స్మార్ట్ఫోన్ల్లో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలకు ఒక నిర్దిష్టమైన లైఫ్ సైకిల్ ఉంటుంది. అయితే, మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ ఆయుష్షు మరింత వేగంగా తగ్గిపోతుంది. మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం రావాలంటే టెక్ నిపుణులు, మొబైల్ తయారీ సంస్థలు సూచిస్తున్న కొన్ని చిట్కాలు కింద చూద్దాం.‘100% చార్జింగ్’ రూల్కు స్వస్తి చెప్పండి!చాలామంది ఫోన్ చార్జింగ్ 0% కి పడిపోయే వరకు వాడి, ఆపై 100% అయ్యే వరకు అలాగే వదిలేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. బ్యాటరీని ఎప్పుడూ పూర్తిగా ఖాళీ చేయడం, అలాగే పూర్తిగా నింపడం వల్ల దానిపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది.గోల్డెన్ రూల్: మీ మొబైల్ బ్యాటరీ శాతాన్ని ఎప్పుడూ 20% నుంచి 80% మధ్య ఉంచడానికి ప్రయత్నించండి. చార్జింగ్ 20%కి రాగానే ప్లగ్ ఇన్ చేయడం, 80% - 85% కాగానే తీసేయడం వల్ల బ్యాటరీ లైఫ్ స్థిరంగా ఉంటుంది.రాత్రంతా చార్జింగ్ పెడుతున్నారా?రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ చార్జింగ్ పెట్టి ఉదయం తీయడం అలవాటా? ఆధునిక స్మార్ట్ఫోన్లలో చార్జింగ్ 100% కాగానే ఆటోమేటిక్గా పవర్ కట్ అయ్యే ‘స్మార్ట్ కట్’ ఫీచర్ ఉన్నప్పటికీ రాత్రంతా ప్లగ్లోనే ఉంచడం వల్ల బ్యాటరీ ‘ట్రికిల్ చార్జింగ్’ మోడ్లోకి వెళ్తుంది. దీనివల్ల బ్యాటరీ నిరంతరం రసాయన ఒత్తిడికి లోనై కాలక్రమేణా ఉబ్బిపోయే ప్రమాదం ఉంది.ఒరిజినల్ చార్జర్ మాత్రమే వాడండిమార్కెట్లో తక్కువ ధరకు దొరికే లోకల్ చార్జర్లు, కేబుల్స్ వాడటం బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. మీ ఫోన్ బాక్స్తో పాటు వచ్చిన లేదా సదరు కంపెనీకి చెందిన అధికారిక చార్జర్లను మాత్రమే వాడాలి. లోకల్ చార్జర్లు స్థిరమైన వోల్టేజ్ను అందించలేవు.హీటింగ్ సమస్యమొబైల్ బ్యాటరీల ఆయుష్షును తగ్గించే అతిపెద్ద అంశం ఉష్ణోగ్రత. ఫోన్ చార్జింగ్ అవుతున్నప్పుడు సహజంగానే కొంత వేడెక్కుతుంది. ఆ సమయంలో హెవీ గేమింగ్ ఆడటం లేదా యూట్యూబ్ వీడియోలు చూడటం అస్సలు చేయకూడదు. అలాగే, కారు డాష్బోర్డ్లపై, ఎండ తగిలే చోట్ల ఫోన్ను ఉంచకూడదు. వీలైతే, చార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ పౌచ్ తీసేయడం మంచిది.ఈ సెట్టింగ్స్ మార్చుకోండిస్క్రీన్ బ్రైట్నెస్ను ఎప్పుడూ ఫుల్గా ఉంచకుండా ఆటో బ్రైట్నెస్ మోడ్లో పెట్టండి.మీ ఫోన్లో ఆమోలెడ్ లేదా ఓలెడ్ స్క్రీన్ ఉంటే డార్క్ మోడ్ ఆన్ చేయడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై అవసరం లేనప్పుడు ఆఫ్ చేయండి.సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫోన్ ఎక్కువ పవర్ వాడుకుంటుంది. కాబట్టి అవసరమైతే కాసేపు ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి.స్మార్ట్ఫోన్ అనేది మన నిత్యజీవితంలో భాగం. దాన్ని సరైన పద్ధతిలో చార్జ్ చేయడం, అధిక వేడికి గురికాకుండా చూసుకోవడం ద్వారా బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేకుండానే ఫోన్ను కనీసం 3 నుంచి 4 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. కాబట్టి వెంటనే మీ ఫోన్ చార్జింగ్ అలవాట్లను మార్చుకోండి!ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్!
టాటా సన్స్ లిస్టింగ్పై తేలని ఉత్కంఠ
టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ ‘టాటా సన్స్’ ఐపీఓ మార్కెట్లోకి రావాలా వద్దా అనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తుది నిర్ణయం తీసుకోనుంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (CoR) సరెండర్ దరఖాస్తులపై కేంద్ర బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. కేవలం పత్రాలు సమర్పించినంత మాత్రాన ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్వయంచాలకంగా రద్దు కాదని, ఆ రద్దు దరఖాస్తును ఆమోదించే లేదా తిరస్కరించే పూర్తి హక్కు తమకు ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో, టాటా సన్స్ దాఖలు చేసిన ‘కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’ (సీఐసీ) లైసెన్స్ సరెండర్ దరఖాస్తుపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆర్బీఐ ఈ దరఖాస్తును ఆమోదించే వరకు టాటా సన్స్పై స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవ్వాలనే నిబంధనలు యథాతథంగా అమలులో ఉంటాయి.‘పరోక్ష నిధుల స్వీకరణ’పై కొత్త సర్క్యులర్ప్రభుత్వ నిధులను పరోక్షంగా స్వీకరించడంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ఆర్బీఐ మరో కీలక సర్క్యులర్ను జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రభుత్వ నిధులకు ప్రత్యక్షంగా యాక్సెస్ లేకుండా ప్రభుత్వ నిధులు పొందే అసోసియేట్లు లేదా గ్రూప్ సంస్థల ద్వారా నిధులు అందుకుంటే దాన్ని 'పరోక్ష నిధుల స్వీకరణ'గా పరిగణిస్తారు.సెంట్రల్ బ్యాంక్ మొదట ఏప్రిల్ 29 నాటి సర్క్యులర్లో ఈ నిబంధనను చేర్చింది. అయితే జూన్ 24న ఎన్బీఎఫ్సీల కోసం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ‘నిధులకు పరోక్ష అవకాశం’ను స్పష్టంగా నిర్వచించలేదు. కాబట్టి, ఏప్రిల్ 29 నాటి నిర్వచనాన్ని పునరుద్ఘాటించేందుకే ఆర్బీఐ జూన్ 30న తాజా నోటిఫికేషన్ను జారీ చేసినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.టాటా సన్స్కే ఎందుకీ సమస్య?టాటా సన్స్ 2024లోనే తనకున్న అన్ని అప్పులను పూర్తిగా తిరిగి చెల్లించింది. టాటా మోటార్స్, టాటా స్టీల్ వంటి కొన్ని ప్రముఖ లిస్టెడ్ సంస్థలకు టాటా సన్స్లో వాటాలు ఉన్నాయి. ఈ గ్రూప్ సంస్థల ద్వారా టాటా సన్స్కు నిధులకు పరోక్ష అవకాశం ఉన్నందున, కేంద్ర బ్యాంక్ దీనిని ‘కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’గానే పరిగణిస్తోంది.లిస్టింగ్ వివాదం నేపథ్యంఆర్బీఐ 2022లో ‘అప్పర్ లేయర్’ ఎన్బీఎఫ్సీల జాబితాను విడుదల చేస్తూ వారు మూడేళ్ల వ్యవధిలో (సెప్టెంబర్ 2025 నాటికి) స్టాక్ మార్కెట్లో తప్పనిసరిగా లిస్ట్ కావాలని గడువు విధించింది. ఈ లిస్టింగ్ నిబంధనల నుంచి మినహాయింపు పొందడానికి టాటా సన్స్ 2024లో తన సీఓఆర్ను సరెండర్ చేయడానికి దరఖాస్తు చేసుకుంది. గత వారం ఆర్బీఐ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రూ.1 లక్ష కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం ఉన్న ఏ ఎన్బీఎఫ్సీ అయినా అప్పర్ లేయర్ విభాగంలోకే వస్తుందని పునరుద్ఘాటించింది.టాటా సన్స్ ఆస్తి పరిమాణం నిర్దేశిత పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉండటం, పైగా పరోక్ష నిధుల స్వీకరణ నిర్వచనం పరిధిలోకి వస్తుండటంతో.. ఆర్బీఐ ఆ సంస్థ లైసెన్స్ సరెండర్ దరఖాస్తును ఆమోదిస్తుందా లేదా తిరస్కరించి లిస్టింగ్కు ఆదేశిస్తుందా అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆర్బీఐ దరఖాస్తును తిరస్కరిస్తే టాటా సన్స్ దేశీయ స్టాక్ మార్కెట్లలో మెగా ఐపీఓగా రావాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్!
ఏఐ రంగంలో భారత్ దూకుడు ఖాయం
ప్రపంచ సాంకేతిక రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. అయితే, ఈ రంగం కేవలం కొన్ని పాశ్చాత్య టెక్ దిగ్గజాల గుత్తాధిపత్యంలోనే ఉండిపోతుందా? లేక భారత్ వంటి దేశాలు స్వయంసమృద్ధి సాధించగలవా? అనే చర్చకు జోహో అధినేత శ్రీధర్ వెంబు సరికొత్త దిశను చూపించారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై నిరంతరం చర్చించే వెంబు.. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఏఐ కంపెనీల పోటీని ప్రశంసించడంతో పాటు భారత్లో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని చెప్పారు.మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంపై..టెక్ మార్కెట్లో అమెరికన్ కంపెనీల గుత్తాధిపత్య ధోరణిని ఎండగట్టడానికి శ్రీధర్ వెంబు ఇటీవల ఒక ఆసక్తికరమైన ఉదాహరణను పంచుకున్నారు. ఒక భారతీయ కస్టమర్ తన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో ఎదురైన అనుభవాన్ని ఆయన ఉదహరించారు.‘సదరు కస్టమర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి స్వదేశీ సాఫ్ట్వేర్ అయిన జోహో ఆఫీస్ సూట్కు మారిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పగానే.. మైక్రోసాఫ్ట్ ఒక్కసారిగా దిగొచ్చింది. తన కస్టమర్ను కోల్పోకూడదనే భయంతో ఏకంగా 90% తగ్గింపును ఆఫర్ చేసింది’ అన్నారు. పోటీ లేకపోతే ఈ దిగ్గజాలు కస్టమర్లను ఎలా దోపిడీ చేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని వెంబు పేర్కొన్నారు. మార్కెట్లో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడే వినియోగదారుడికి నిజమైన లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.‘యాంటీట్రస్ట్’ కేసు గుర్తుచేసిన జోహో బాస్మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులను విమర్శిస్తూ.. గతంలో ఆ సంస్థ ఎదుర్కొన్న చట్టపరమైన సవాళ్లను వెంబు గుర్తుచేశారు.యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ మైక్రోసాఫ్ట్ కార్ప్ (1998): మైక్రోసాఫ్ట్ చట్టవిరుద్ధంగా తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్తో పాటు 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టుకెక్కారు.పోటీని అణచివేసే కుట్ర: విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ‘ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్’ బ్రౌజర్ను ఉచితంగా ఇన్-బిల్ట్గా ఇవ్వడం ద్వారా.. అప్పట్లో పాపులర్ అయిన ‘నెట్స్కేప్ నావిగేటర్’ వంటి ప్రత్యర్థి బ్రౌజర్ల మనుగడను మైక్రోసాఫ్ట్ దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చాయి.కంపెనీ విభజన తీర్పు: ఏప్రిల్ 2000లో యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి థామస్ పెన్ఫీల్డ్ జాక్సన్.. మైక్రోసాఫ్ట్ యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందని తీర్పునిస్తూ కంపెనీని రెండుగా విభజించాలని (ఒకటి విండోస్ ఓఎస్ కోసం, మరొకటి సాఫ్ట్వేర్ ఉత్పత్తుల కోసం) ఆదేశించారు. అయితే, ఆ తర్వాత అప్పీల్లో ఈ ఉత్తర్వు రద్దయినప్పటికీ మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్య ధోరణి ప్రపంచానికి స్పష్టమైంది.చైనా ఏఐ పోటీ.. ప్రపంచానికి మేలు!ప్రస్తుతం ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గట్టి పోటీ ఇస్తోంది. చైనా ఏఐ కంపెనీల వేగవంతమైన వృద్ధిని శ్రీధర్ వెంబు సానుకూల దృక్పథంతో స్వాగతించారు. ఈ అంతర్జాతీయ పోటీ వల్ల ఏఐ మోడళ్ల శిక్షణ ఖర్చులు విపరీతంగా తగ్గుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ ధరల తగ్గుదల గ్లోబల్ ఏఐ పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడానికి, ఓపెన్ మార్కెట్ను ప్రోత్సహించడానికి కీలకమని చెప్పారు.Anthropic's latest models available worldwide. In other words, Chinese open source models posed a serious enough threat to market share.In a different context, an Indian customer of some of our products told me recently "A big Microsoft Office license renewal came up and they… https://t.co/xp8e6vVMvs— Sridhar Vembu (@svembu) July 1, 2026‘భారత్ జెన్’ ప్రాజెక్ట్: స్వదేశీ ఏఐ కల సాకారంఏఐ శిక్షణ ఖర్చులు తగ్గడం వల్ల భారతదేశానికి భారీ అవకాశాలు లభిస్తాయని వెంబు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారతదేశంలో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని నేను ఇప్పుడు బలంగా విశ్వసిస్తున్నాను. మనం నిరాశ చెందకూడదు’ అని పిలుపునిచ్చారు. భారత్లో విద్యాసంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో బహుళ ఏఐ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనికి ప్రధాన ఉదాహరణగా ఐఐటీ బొంబాయి నేతృత్వంలో సాగుతున్న ‘భారత్ జెన్’ ప్రాజెక్ట్ సాధిస్తున్న పురోగతిని వెంబు సాక్ష్యంగా చూపారు. పాశ్చాత్య దేశాల ఏఐ సాంకేతికతకు, భారతీయ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ స్వదేశీ ప్రాజెక్టులు వేగంగా భర్తీ చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
ఫ్యామిలీ
అడగగానే ఇవ్వొద్దు.. ఆలోచించనిద్దాం!
పుణేలో కోట అంచున నిలబడ్డ ప్రేమ ఒక్కతోపుతో హత్యగా మారింది. బెంగళూరులో నట్టనడి ఇంట్లో నిలుచున్న ప్రేమ నెత్తురు పారించింది. ఈ రెండు ఘటనలూ ‘ఇప్పుడే కావాలి’ అనే ఆవేశానివే. ‘ఇవ్వాళ ఆలోచించి రేపు మాట్లాడాలి’ అనే సంస్కారం పోయి ‘ఇప్పుడే తేల్చేయాలి’ అనే తెంపరితనం ఇది. దీని పేరు – ఇన్ స్టంట్ గ్రాటిఫికేషన్. అంటే ‘తక్షణ సంతృప్తి’ అనే మానసిక జ్వరం. బిర్యానీ నుంచి బంధాల వరకు, ప్రోటీన్ షేక్ నుంచి ప్రతీకారం వరకు– అంతా ‘క్విక్ డెలివరీ’ కావాల్సిందే. వేచి చూడలేని మనసు వేటు వేయడానికి వెనుకాడడం లేదు. ఓపిక నేర్పని ఫోన్ లు... ఓదార్పు మరచిన జెన్ జెడ్. మెదడులో ‘పాజ్’ బటన్ చెడిపోతే జీవితం ‘ఫాస్ట్ఫార్వర్డ్’లో నేరం వైపు పరుగెడుతుంది. ఇది ట్రెండ్ కాదు, టైం బాంబ్. ఆపకపోతే ప్రతి ఇల్లు ఒక క్రైమ్ సీన్ అవుతుంది. ‘ఇప్పుడే వద్దు, కాస్త ఆగి ఆలోచించండి’... ఈ ఒక్క మాటే ఇవాళ మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సిన ఆస్తి.‘ఈరోజే... ఇప్పుడే’ ‘ధనా ధన్ ఫటా ఫట్’ ధోరణి అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఆనంద సూత్రం(ప్లెజర్ ప్రిన్సిపుల్). ఇదిప్రాథమిక అవసరాలను తక్షణమే తీర్చుకోవడానికి, బాధను తప్పించుకోవడానికి ప్రేరేపించే ఒక సహజ ప్రవృత్తి... ప్లెజర్ ప్రిన్సిపుల్. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఈ సూత్రం మానవ మనస్తత్వంలోప్రాథమిక నియంత్రణ శక్తిగా పనిచేస్తుంది.దీర్ఘకాలిక మానసిక సమస్య‘ఇప్పటి ఈ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వల్ల దీర్ఘకాలికంగా కొన్ని మానసిక సమస్యలకు రావచ్చు. తాము కోరుకున్నది తక్షణమే నెరవేరాలని ఆశించేలా చేస్తుంది... ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. దీనివల్ల వేచి ఉండడం, ఓపికగా ఉండే గుణం తగ్గిపోతుంది. నిరంతర తృప్తి తొందరపాటును సృష్టిస్తుంది. తట్టుకునే శక్తిని తగ్గిస్తుంది. ఎదురుదెబ్బలు తట్టుకోలేమనే భావన కలిగిస్తుంది’ అని హెచ్చరిస్తున్నారు కోల్కతాలోని సీఎంఆర్ఐ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డా.అంబరీష్ ఘోష్.ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కారణంగా జెన్ జెడ్ వినియోగ విధానాలలో, వ్యక్తిత్వంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏకాగ్రత తగ్గిపోవడంతో... టీ 20 మ్యాచ్లకుప్రాధాన్యత పెరిగింది, థియేటర్లకు వెళ్లడం కంటే ఓటీటీప్రాచుర్యం పొందింది.తొందరపాటు వద్దుమార్కెట్కు వెళ్లి బేరసారాలు చేసి, ఆ తర్వాత వంట చేయడాన్ని చాలామంది శ్రమగా భావిస్తున్నారు. దీంతో త్వరిత డెలివరీ యాప్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలా ఆధారపడడం అనేది తొందరపాటు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి దారి తీయవచ్చు. ఆటిస్టిక్ లక్షణాలతో అనేక సవాళ్లకు దారితీయవచ్చు’ అని హెచ్చరిస్తున్న ఘోష్...ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి... సహనం పెరిగేలా చేయడం, ఆలస్యంగా లభించే ప్రతిఫలాలను ప్రోత్సహించడం, సామాజిక విలువలను పెంపొందించడం తప్పనిసరి’ అని సలహా ఇస్తున్నారు.క్విక్–ఫిక్స్ థింకింగ్‘మనం చేసే పనులు, మనం శ్రద్ధ పెట్టే విషయాలకు స్పందనగా మన మెదళ్లు నిరంతరం మారుతుంటాయి. ఉదాహరణకు... మనం తొందరపడి అనారోగ్యకరమైన చిరుతిండి తిన్నా, ఆన్లైన్లో ఏదైనా కొన్నా, ఆ చర్యలకు సంబంధించి మన మెదడు మార్గాలు బలపడతాయి. ఇదే తరువాత బలమైన అలవాటుగా మారుతుంది. ఆ అలవాటుకు దూరం కావడం కష్టమవుతుంది.తక్షణ సంతృప్తి(ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్) వైపు దారి తీసే పనులు అనారోగ్యకరమైన, అనాలోచిత ప్రవర్తనకు దారి తీసేలా చేస్తాయి. కాలక్రమేణా...శరీరంపై తీవ్రమైన భారం మోపేలా చేస్తాయి. ఆసక్తిని రేకెత్తించే ఏ ఆన్లైన్ వస్తువైనా వెంటనే కొనెయ్యాలనుకోవడం క్రెడిట్ కార్డ్పై అదనపు భారాన్ని మోపుతుందనేది ఒక విషయం అయితే, మరొకటి... కుటుంబసభ్యులతో గడుపుతున్నప్పుడు కూడా సోషల్ మీడియా చూడాలనిపిస్తుంది. దీంతో కుటుంబసభ్యులతో పొడి పొడిగా మాట్లాడడం, యాంత్రికంగా సంభాషించే ధోరణి పెరుగుతుంది. తక్షణ సంతృప్తినిచ్చే వాటి కోసం అన్వేషణ సాగిస్తున్న కొద్దీ, ఆ ఫలితాన్ని అందుకోవడానికి చాలాకాలం ముందే మన మెదళ్లలో డోపమైన్ ఉప్పొగుతుంది’ అని చెబుతున్నాడు మానసిక విశ్లేషకుడు ఆస్టిన్ పెర్ల్మటర్. తక్షణ సంతృప్తి (ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్)లోని ప్రతికూల కోణాలపై ‘ది రియల్ ఇష్యూ విత్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్: హౌ క్విక్–ఫిక్స్ థింకింగ్ క్రియేట్స్ప్రాబ్లమ్స్’ పేరుతో విశ్లేషణాత్మక వ్యాసం రాశాడు ఆస్టిన్.దూరంగా ఉన్నవారే... విజయానికి దగ్గరయ్యారు...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ చేసిన ఒక అధ్యయనం...‘తక్షణ తృప్తికి దూరంగా ఉండే పిల్లలు ఎన్నో విజయాలు సాధించారు’ అని చెబుతోంది.ఈ అధ్యయనంలో భాగంగా... ఒక పిల్లవాడికి తక్షణం అందే ఒక చిన్న బహుమతి, కొంత సమయం వేచి ఉంటే రెండు చిన్న బహుమతులు... అని రెండు ఆప్షన్లు ఇచ్చారు.రెండో ఆప్షన్ వైపు మొగ్గు చూపిన పిల్లలు ఆ తరువాత కాలంలో చదువులలో మంచి విజయం సాధించారు. పెద్దయ్యాక ఎక్కువ ఆదాయం సంపాదించారు.స్టాన్ఫోర్డ్ స్టడీ ఇలా చెప్పింది...∙ఆకస్మిక కోరిక లేదా బలమైన కోరిక స్వీయ–నియంత్రణతో దగ్గరి సంబంధం ఉంటుంది ∙వేచి ఉండడానికి ఇష్టపడే వారిలో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ కాస్త గట్టిగా ఉంటుంది ∙ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది మెదడులోని ఫ్రంటల్ లోబ్ ముందు భాగం. ఇది కార్యనిర్వహణ విధులకు మెదడుకు సంబంధించి నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది ∙చాలామంది తక్షణ సంతృప్తి కోసం ఎందుకు ఆరాటపడతారో చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది... ఆలస్యాన్ని భరించలేకపోవడం. ‘ఇప్పుడే దొరుకుతుంది. ఎందుకు వేచి చూడాలి’ అని అనుకోవడం. తక్షణ సంతృప్తిని కోరుకునే వారు మాదకద్రవ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. ఊబకాయంతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. మానసిక లోపాలతో బాధపడతారు ∙తక్షణ సంతృప్తి అనేది ఒక వ్యాధా? బహుశా కావచ్చు. మన జీవితాలను క్రమబద్దీకరించుకోవాలి. మన కోరికలను నియంత్రించుకోవాలి. ‘ఇప్పుడే కావాలి’ అనే వ్యాధిని నిర్మూలించాలి.డిలేడ్ గ్రాటిఫికేషన్... చాలా కష్టమా?∙ఆధునిక సంస్కృతి తక్షణ ఫలితాలు, సౌకర్యాలను గతంలో కంటే చాలా సులభంగా అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ‘వేచి ఉండడం’ అనేది తగ్గిపోతుంది. వేచి ఉండడం కష్టం అనిపిస్తుంది. ∙భవిష్యత్పై దృష్టి, ప్రణాళిక లేని వారికి డిలేడ్ గ్రాటిఫికేషన్ (నిదానంగా సంతృప్తి పడడం) కష్టంగా అనిపిస్తుంది ∙ఒత్తిడి, విసుగు, ఆందోళనలాంటివి డిలేడ్ గ్రాటిఫికేషన్ దూరమయ్యేలా చేస్తాయి.డిలేడ్ గ్రాటిఫికేషన్కు దగ్గరవ్వాలంటే...∙దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఎప్పటికప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి ∙మీ లక్ష్యాలను రాసుకోండి. ప్రతిరోజూ మీరు చూసే చోట అవి కనిపించాలి ∙లక్ష్యాలను చిన్న చిన్న పార్ట్స్గా విభజించుకోండి ∙ఫైనల్ రిజల్ట్ కంటే ఎప్పటికప్పుడు మీరు సాధిస్తున్న ఫలితాలపై దృష్టి పెట్టండి ∙లక్ష్యంలో ఒక చిన్న భాగానికి చేరువైనప్పుడు మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోవాలి. ఉదాహరణకు... మీకు ఇష్టమైన స్వీటు ఆరోజు హాయిగా తినవచ్చు ∙ఎప్పుడైనా ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వైపు మనసు లాగితే, దారి మళ్లించడానికి బయటకు వెళ్లి నడవడమో, ఫ్రెండ్కు ఫోన్ చేయడమో, ఇష్టమైన సినిమా చూడడమో... ఇలాంటి పనులు చేయాలి.ఇన్స్టంట్ వర్సెస్ డిలేడ్ గ్రాటిఫికేషన్..డబ్బుఇన్స్టంట్: పెద్దగా అవసరం లేకపోయినా సరే, కొత్త స్మార్ట్ ఫోన్ కొనడం.డిలేడ్: ఫోన్ కొనాలనుకున్న డబ్బును పొదుపు చేసి అవసరమైనప్పుడే కొనడం.ఎంటర్టైన్మెంట్ఇన్స్టంట్: రాత్రంతా ఫోన్లో షోలను అక్కడొక సీన్ ఇక్కడొక సీన్ అన్నట్లుగా చూడడం.డిలేడ్: ఈ రోజు కొన్ని భాగాలే చూస్తాను. రేపు మరికొన్ని... అని విభజించుకోవడం.షాపింగ్ఇన్స్టంట్: ఆన్లైన్లోనో, సూపర్ మార్కెట్లోనో కొత్త వస్తువును చూసినప్పుడు ‘అరే ఇది ఈరోజే కొనెయ్యాలి’ అనిపిస్తుంది.డిలేడ్: ఒక వారం ఓపిక పట్టాలి. ‘ఆ వస్తువు నాకు నిజంగా అవసరమా?’ అని విశ్లేషించుకోవాలి.కెరీర్ఇన్స్టంట్: భవిష్యత్లో పురోగతి లేకపోయినా ఎక్కువ జీతానికి ఆశపడి ఉద్యోగంలో చేరడం.డిలేడ్: తక్కువ జీతమైనా సరే, మంచి భవిష్యత్ ఉన్న ఉద్యోగాన్ని ఎంచుకోవడం.రిలేషన్షిప్స్..ఇన్స్టంట్: మీ సన్నిహితులతో ఎప్పుడో ఒకసారి వాగ్వాదం జరగవచ్చు. అలాంటి సందర్భంలో ఏదో ఒకటి ఎదుటి వ్యక్తిని కసిగా అనాలనిపిస్తుంది.డిలేడ్: వాదనలో ప్రతి మాటను జాగ్రత్తగా, ఆచితూచి ఉపయోగించాలి. దీనివల్ల ఎంత పెద్ద వివాదమైనా సంబంధాలు తెగిపోవు.
సహజ యోగంతోనే సహజ సౌందర్యం..
సంప్రదాయ కళలు, సంప్రదాయ ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు – ఇవి మన దేశంలో వేల కొద్దీ సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. మనం వాటిని ఉపయోగించాలి. కానీ మనం పాశ్చాత్య దేశాలచే ఎంతగా ప్రభావితులమయ్యామంటే, మన సంస్కృతిని మర్చిపోయి, బయటి విషయాలను అనుసరిస్తున్నాము. దీని కారణంగా మనలో మనం ఆత్మ’ అని పిలిచే అతి ముఖ్యమైన విషయం అజ్ఞానంతో కప్పబడుతుంది. మన దేశంలో ఆత్మను అలంకరించే వేలకొద్దీ విషయాలు ఉన్నాయి, అవి ఆత్మను అణచివేయవు.మన కళ్ళు చాలా త్వరగా బాహ్యమైన విషయాలపై పడతాయి. కారణం మనం మనుషులం కాబట్టి, మన ధ్యాస బయట ఉంటుంది. కానీ మనల్ని మనం చూడటానికి ప్రయత్నించినప్పుడు, మనం నవ్వుతూ మన లోపల ఎంత అందంగా ఉందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అని ఆలోచిస్తాము! దానిని వదిలి మన ధ్యాస బయట ఎందుకు తిరుగుతుంది? ఎందుకంటే ఇప్పటివరకు మనం ఆ స్థితిని సాధించలేదు, మనకు అది ఇంకా తెలియదు, అందుకే మనం అలా చేస్తున్నాము. అందుకే మనల్ని మనం ప్రేమించుకోలేక పోతున్నాము, మన ఆత్మను పాడుచేసే వాటిని మనం ఇష్టపడతాము, ఆ విషయం మనం గ్రహించలేము. మన జీవితంలో అలాంటివి చాలా ఉన్నాయి.సహజ యోగ ధ్యాన సాధన ద్వారా మానవుల లోపల కుండలినీ శక్తి జాగృతి చెందినప్పుడు, వారు భగవంతుని ఆశీస్సుల వలన ఆత్మ స్వరూపులుగా మారుతారు. ఆత్మికమైన శుభ లక్షణాలను పొందుతారు. ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఆత్మకు ఉండే సహజ శుభ లక్షణాలైన అమాయకత్వం, పవిత్రత, మాతృ ప్రేమ, సంతృప్తి, సృజనాత్మకత, ధైర్యం, అందరితో కలిసిపోయే స్వభావం, క్షమా గుణం వంటివి మన నిత్య జీవితంలో ఆచరించడం వలన మనం ఆత్మ సౌందర్యాన్ని పొందగలం.మీ లోపల ఉన్న ’ఆత్మ’ అనే వజ్రాన్ని బయటకు తీయండి. మీరే ఆ వజ్రం అని తెలుసుకోండి. ఆ వజ్రం మెరుపు మీరే. మీ లోపల ఉన్న ఆ వజ్రం పైకి వచ్చినప్పుడు, ప్రజలు కూడా చూసి ఆశ్చర్యపోతారు, ఆ ఆత్మ సౌందర్యాన్ని పొందడానికి ప్రయత్నించండి. స్త్రీలకు శాశ్వతమైన విలువను కలిగి ఉండే ఏదో ఒకటి ఉంది, దానిని వారు అభివృద్ధి చేసుకోవాలి. గొప్ప విషయం ఏమిటంటే స్త్రీ అందరినీ ప్రేమించగలదు, కానీ ఆమె స్వార్థపూరితంగా మారినప్పుడు, ఆమె ప్రేమలో అందం ఉండదు.పురుషులలో ఆజ్ఞాపించే స్ఫూర్తి వారి మాటల ద్వారా, వారి చైతన్యం ద్వారా, వారి వ్యక్తిగత విజయాల ద్వారా వస్తుంది; అయితే స్త్రీలకు ఈ లక్షణాలు వారి ప్రేమపూర్వక శక్తి ద్వారా, వారి సహనం ద్వారా, వారి దయగల ప్రవర్తన, క్షమ, కరుణ ద్వారా వస్తాయని గ్రహించి, వాటిని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించాలి.విత్తనాలు స్వయంగా దేనినీ సృష్టించలేవు. పువ్వులు, పండ్లు, ఇతర వరాలను అందించేది భూమాత. అదేవిధంగా, బిడ్డను సృష్టించేది స్త్రీ, శిశువును పోషించేది, చివరికి రేపటి ΄ûరుడిని పెంచుతుంది. కాబట్టి మహిళలు మొత్తం మానవాళి నివసించే భవనంగా భూమి తల్లిని పరిగణించాలి. – డా.ప్రతాని రాకేశ్, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా)
స్నేహమాధుర్యం..
స్నేహం గూర్చి ఎంతో గొప్పగా చెప్తారు.. సృష్టిలో తియ్యనిదని కొందరంటే, కొందరు మధురమైనదని అన్నారు. స్నేహబంధం విడదీయరాని బంధం అన్నారు...పురాణాల్లో రామ సుగ్రీవుల మైత్రి, కృష్ణుడు కుచేలుల మైత్రి, కృష్ణార్జునల మైత్రి చెప్పుకోదగ్గవి... స్వభావరీత్యా దుష్టులైన దుర్యోధనుడు, కర్ణుల మైత్రి అయినా మంచి ఉదాహరణ కాదు. ఇలాంటి వారి విషయంలో శతకనీతి మనకు ఎంతో మంచి మార్గం చూపిస్తుంది...సజ్జన సాంగత్యం గొప్పదంటాడు భర్తృహరి... ఏనుగు లక్ష్మణ కవి తాను చేసిన అనువాదంలో... ‘సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్పుగౌరవమొసంగు, జనులకు గలుష మడచుగీర్తి బ్రకటించు, చిత్తస్ఫూర్తిజేయుసాధుసంగంబు సకలార్థ సాధనంబు’సజ్జన సహవాసం వలన ఉపయోగాలు చెప్తున్నాడు కవి. సమస్త ప్రయోజనాలు సాధించబడతాయి. అంటే కాదు సకలార్ధ సాధకం అని సెలవిచ్చాడు. ఇదే బాణీని అందరూ కొనసాగించారని అనిపిస్తుంది.. వేమన ‘నీచగుణములెల్ల నిర్మూలమై పోవు, కొదువ లేదు సుజన గోష్టి వలన’ అని సుజన గోష్టి వలన నీచ గుణాలు తొలగిపోతాయంటాడు.‘కాని వానితోడగలసి మెలంగినహాని వచ్చు నెంతవానికైనకాకి గూడి హంస గష్టంబు పొందదా’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు, వేమన. దుష్టుని స్నేహం గూర్చి వివరిస్తాడు, సుమతీ శతకంలో.‘ఉపమింప మొదట తియ్యనకపటం బెడనెడను జెఱకుకైవడినే పోనెపములు వెదకును గడపటగపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ‘ చెడు స్నేహానికి మంచి ఉదాహరణ చె΄్పారు ఇక్కడ.. చెడ్డవారితో స్నేహం మొదట్లో చెఱకు గడ తీపిలా ఉంటుంది. మధ్యలో రుచి తగ్గుతుంది, చివరికి పూర్తిగా చప్పగా ఉండి, ఏమి లేదనిపిస్తుంది. అటువంటి వాడికి తప్పులే కనిపిస్తాయి.‘ఎప్పుడు తప్పులు వెదకెడునప్పురుషుని గొల్వగూడడది’ అని అంటాడు సుమతీ శతకంలో.‘కాదు సుమీ దుస్సంగతి’ అని హెచ్చరిక చేస్తాడు ఇదే శతకంలో.మరో పద్యంలో ‘కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు’ అని అన్నారు..‘కొంచెపునరు సంగతిచేనంచితముగ గీడు వచ్చునది’ అంటూ ఒక ఉపమానం చెప్తాడు.. నల్లి కుడితే మంచానికి దెబ్బలు తగులుతాయి..‘పాలను గలసిన జలమునుపాలవిధంబునె యుండు బరికింపంగాబాల చవి జెఱచు గావునబాలసుడగువాని పొందు వలదుర సుమతీ‘ పాలు కలిసిన నీళ్లు పాల లాగే ఉంటాయి, అలాగే దుర్జనుడు సజ్జనుడు ఉంటే సజ్జనుడు లాగా ఉంటాడు... అందుకు సజ్జనుడే జాగ్రత్త వహించాలి..‘లేమి కలిమి రెండు సమముగ జూచేడి పురుషుడే మిత్రుడెన్ని పొగడారయా’ అని వేమన అంటే ‘మంచి గుణము లేని వానితో మైత్రి చేసి తుది సుఖము బడయుదురా భాస్కరా’ అంటారు భాస్కర శతకంలో.చివరగా భర్తృహరి భాషలో ‘త్యజేత్ ధనం రక్షణార్థం, ధనం త్యజేత్ ఆపది ఆత్మర్థం పృథివీం త్యజేత్, మిత్రార్థే త్యజేత్ ఆత్మనఃకాపాడుకోవడానికి సంపద, ధనం, రాజ్యం అని వదులుకోవచ్చు,కాని మిత్రుడి కోసం నువ్వు నిన్నే వదులుకోవాలి.. అంత గొప్పది స్నేహం. – డా. కందాళ సత్య నారాయణ మూర్తి
కోరికల తరంగాలు..
నదిలో ఇసుకలాంటివి కోరికలు. ఎంత తవ్వినా నదిలో ఇసుక తరిగిపోదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొత్తగా ఇసుక మేటలు వేస్తూనే ఉంటుంది. అలాగే మనసులో కోరికలు తీరేవి తీరుతూంటే కొత్తవి పొటమరిస్తూంటాయి. అందుకనే మనసు కోరికల పుట్ట అని అన్నారు.ఈ కోరికలన్నీ తీరిన తర్వాత పరమార్థం విషయంలో ఆలోచిస్తాననే వాళ్ళున్నారు. అది జరిగే పనేనా? ‘తరంగ ప్రశమా దూర్ధ్వం స్నాస్యామీతి విమూఢతా’ సముద్రంలో తరంగాలన్నీ తగ్గి పోయిన తర్వాత స్నానం చేస్తాను అని అనటం మూఢత్వం కాక మరేమిటి?ఒక గురువుగారు తన శిష్యుణ్ణి సంసార తాపత్రయం నుంచి బయటపడేద్దామనే సత్సంకల్పంతో ఉపదేశం చేద్దామని పిలిచాడు. సంసారి అయిన ఆయన శిష్యుడు, గురువుకు దయకలిగి తనను ఉద్ధరించాలనుకొని ఉపదేశం చేస్తానన్నాడని సంతోషించటానికి బదులుగా ఈ బరువు ఇప్పటి నుంచీ ఎందుకు అను కున్నాడు. ‘అయ్యా! వచ్చే సంవత్సరం మా అమ్మాయి పెళ్ళి చేస్తాను. ఇప్పటినుంచి ఆ పెళ్ళి పనుల్లో సతమతమవు తున్నాను. మీరు ఉపదేశం చేసే మంత్రం అనుష్ఠానం చేసేందుకు సమయం దొరకదు కనుక పెళ్ళయిన తర్వాత ఉపదేశం తీసుకుంటాను. దయ జూపండి’ అన్నాడు. ‘సరే!’ అన్నారు గురువుగారు. ఇలాగే అప్పుడు ఇప్పడు అంటూ ఎన్నో సాకులు చెబుతూ చాలా సంవత్సరాలు గడిపాడు. ఎనభై సంవత్సరాల వయస్సు మీద పడింది.ఒకసారి గురువు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆయనతోపాటు ఈ 80 ఏళ్ళ శిష్యుడు కూడా బయలు దేరాడు. ఆ రోజు కార్తీక పూర్ణిమ. ఇద్దరూ సముద్రానికి వెళ్ళారు. ముందు ఈ సంసారి శిష్యుడు సముద్ర స్నానం చేశాడు. గురువుగారు మాత్రం గట్టునే ఉన్నారు. ‘అయ్యా! ఎందుకు ఆలస్యం. మీరు కూడా స్నానం చేయండి వెళదాం’ అన్నాడు. ‘అలాగేనోయ్! ఈ తరంగాలు తగ్గిపోయిన తర్వాత చేయవచ్చులే అని ఆగాను’ అన్నారు గురువు.‘అయ్యా! మీరన్నది ఎప్పటికైనా జరిగేపనేనా? సముద్రంతో పాటే తరంగాలు పుట్టాయి గదా! అవెప్పుడు తగ్గుతాయి?’ అన్నాడు. ‘ఏమోయీ! నీ సంసార తాపత్రయాలు కూడా తరంగాల్లాగానే ఒకదాని వెనుక మరొకటి వస్తూన్నాయి. మరి నీవు నా ఉపదేశం ఎప్పుడు తీసుకుంటావు నాయనా?’ అని సూటిగా అడిగేసరికి తన తప్పు తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడు ఆ సంసారి శిష్యుడు. - శ్రీ గణపతి సచ్చిదానందస్వామి
అంతర్జాతీయం
దౌత్యం విఫలమైతే యుద్ధమే
టెహ్రాన్: దౌత్యపరమైన పరిష్కారానికే తమ మొదటి ప్రాధాన్యతని, చర్చలు విఫలమైతే మాత్రం యుద్ధానికి తాము సిద్ధమని ఇరాన్ స్పష్టం చేసింది. యురేనియం శుద్ధి సహా తమ అణు హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపింది. ఒప్పందంలోని కీలక అంశాలన్నీ పూర్తిగా అమలు కానంత వరకు తదుపరి దశకు వెళ్లబోమని పేర్కొంది. ఖతార్లో జరగనున్న ప్రత్యేక చర్చల కోసం ఇరు దేశాల అధికారులు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ ఈ హెచ్చరిక చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రధాన ప్రతినిధి అయిన మొహమ్మద్ బాఘర్ ఘలిబాఫ్ ప్రభుత్వ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అమెరికాతో చర్చలను కొనసాగిస్తామని, అయితే తమకు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే సైనిక ఘర్షణకు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అణు కార్యక్రమంపై ఇరాన్ వైఖరిని పునరుద్ఘాటించిన ఘలిబాఫ్, దేశ అణు హక్కులు, ‘రెడ్ లైన్స్’ (అతిక్రమించకూడని పరిమితులు) విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం పరిధిలోనే ఇరాన్ అణు కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు. ‘అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంలో ఇరాన్ సభ్యదేశంగా ఉంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో పనిచేస్తోంది. యురేనియం శుద్ధిని తన హక్కుగా భావిస్తోంది. ఇరాన్ అణు హక్కులు, రెడ్ లైన్స్ విషయంలో రాజీ ఉండదు, వీటిని ఇస్లామిక్ రిపబ్లిక్ శక్తికి చిహ్నలుగా, అమెరికా దుశ్చర్యలకు వ్యతిరేకంగా రక్షణ కవచాలుగా పరిగణిస్తామని ఆయన అన్నారు. 2015 నాటి ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆప్ యాక్షన్’ (జేసీపీఓఏ) ఒప్పందం విషయంలో తమకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ హామీల విశ్వసనీయతను ఘలిబాఫ్ ప్రశ్నించారు. చర్చలు కొనసాగుతున్నాయని, ‘లెబనాన్ సమస్య’, చమురు ఎగుమతులు, హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం వంటి ఐదు అంశాలపై స్పష్టత వచి్చ, అవి పూర్తిగా ఖరారయ్యే వరకు ఒప్పంద అమలులో తదుపరి దశకు వెళ్లబోమని స్పష్టం చేశారు. ‘ఒప్పందంలోని ఆర్టీకల్ 1 ప్రకారం, లెబనాన్లో యుద్ధం ముగుస్తుందని, ఎలాంటి సైనిక చర్యలు ఉండవని, ప్రజల తమ నేలకు తిరిగి వస్తారని, ఆ నేలపై లెబనాన్ జాతీయ సార్వబౌమాధికారంమే కొనసాగుతుందని అమెరికా హామీ ఇస్తోంది. ఇది చాలా పెద్ద విజయం.దీని అమలుకోసమే మేం కృషి చేస్తున్నాం’ అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్తో లెబనాన్ సంబంధాలను సాధారణీకరించడానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రయత్నిస్తున్నారని గాలిబాఫ్ ఆరోపించారు. అటువంటి ప్రయత్నాలు అవగాహన ఒప్పందానికి విరుద్ధమన్నారు. ఇరాన్ ఒప్పందం లక్ష్యం లెబనాన్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించడం కూడానని స్పష్టం చేశారు. దేశ చమురు ఎగుమతుల్లో పునరుద్ధరణను కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికా దిగ్బంధనం సమయంలో ఇరాన్ చమురును ఎగుమతి చేయలేకపోయిందని, అయితే ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత 40 మిలియన్ బ్యారెళ్లకు పైగా రవాణా చేసిందని తెలిపారు. మధ్యవర్తిగా ఖతార్ పాత్రను పునరుద్ఘాటించారు.
క్రిప్టోతో ట్రంప్ ఆదాయం 1.2 బిలియన్ డాలర్లు
న్యూయార్క్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సంపదను విపరీతంగా పెంచుకున్నారు. గత ఏడాది క్రిప్టో వ్యాపారాల ద్వారా ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు (రూ.11,413 కోట్లు) సంపాదించారు. ఈ విషయాన్ని మంగళవారం విడుదలైన ఒక ఫెడరల్ నివేదిక వెల్లడించింది. ట్రంప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారు నష్టపోయారని, ఆయన మాత్రం లాభపడ్డారని పేర్కొంది. ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేవలం స్టార్టప్లుగా ఉన్న ఈ కొత్త వ్యాపారాలు భారీగా ఆదాయం గడించాయి.ట్రంప్ తన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ వ్యాపారం ద్వారా గవర్నెన్స్ టోకెన్లు సహా కొత్త క్రిప్టో ఉత్పత్తులను విక్రయించి 500 మిలియన్ డాలర్లకు పైగా పొందారు. ట్రంప్ ముఖాన్ని ముద్రించిన స్మారక మీమ్ నాణేల అమ్మకాల ద్వారా మరో క్రిప్టో వ్యాపార సంస్థ అయిన సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ 600 మిలియన్ డాలర్లకు పైగా ఆర్జించింది.అయితే, అమ్మకాల తర్వాత టోకెన్లు నాణేల విలువ భారీగా పడిపోయింది. ట్రంప్ గత సంవత్సరం తన బ్రాండెడ్ బైబిళ్లు, స్నీకర్లు, ఇతర చిన్న వస్తువులను అమ్మడం ద్వారా మిలియన్ల డాలర్లు ఆర్జించారు. కేవలం బ్రాండెడ్ వాచీల అమ్మకం ద్వారానే ఆయనకు 4.7 మిలియన్ డాలర్లు సమకూరాయి. ట్రంప్ నికర ఆస్తి విలువ 2024లో 2.3 బిలియన్ డాలర్లు ఉండగా, నేడు 6 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది.
అవసరమైతే మళ్లీ దాడులు
జెరూసలేం: అవసరమైతే ఇరాన్పై మళ్లీ దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలపై దృష్టి కేంద్రీకరించకుండా ఆపడానికి ఇజ్రాయెల్ స్వతంత్రంగా ప్రయతి్నస్తుందని, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ మరో సైనిక చర్య జరిగే అవకాశం ఉందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ భద్రతపై స్పష్టతరాని పక్షంలో, ఇరాన్ అణు బాంబు నుంచి తమను తాము కాపాడుకోవడానికి అవసరమైతే మూడోసారీ దాడి చేస్తామన్నారు. భద్రతపై ఇజ్రాయెల్ ఆందోళన దశలవారీగా ఉద్రిక్తతలను తగ్గించే ప్రక్రియను అనుసరించడానికి అమెరికా, ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించాయి. సైనిక చర్యను నిలిపివేయడం, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల ఉపశమనంపై చర్చలు జరపడం, ఇరాన్ అణు కార్యకలాపాలను పరిష్కరించేందుకు యంత్రాంగాలను ఏర్పాటు చేయడం వంటి హామీలు ఈ ముసాయిదా ఒప్పంద పత్రంలో ఉన్నాయి. తాము అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ కూడా పునరుద్ఘాటించింది. అయితే, తమ దృష్టిలో ఇరాన్ సైనిక లేదా అణు సామర్థ్యాలను యథాతథంగా ఉంచే ఏ ఒప్పందానికైనా తాము కట్టుబడి ఉండబోమని ఇజ్రాయెల్ పదేపదే సంకేతాలు ఇస్తోంది.సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. దాడులు ఇజ్రాయెల్ను దౌత్యపరంగా ఏకాకిని చేస్తాయని, కొనసాగుతున్న చర్చలను దెబ్బతీస్తాయని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, నెతన్యాహు మంగళవారం దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను సందర్శించారు. భద్రతా ఒప్పందాలు కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ బలగాలు అక్కడే ఉంటాయని చెప్పారు. హెజ్బొల్లా బెదిరిస్తున్నంత కాలం, ముప్పు తొలగిపోయే వరకు తాము దక్షిణ లెబనాన్ను విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.
బెల్జియం అపార్ట్మెంట్లో మంటలు
ఆంట్వెర్ప్: బెల్జియంలోని ఆంట్వెర్ప్ నగర శివారులోని ఒక అపార్ట్మెంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. షెల్డర్ నది సమీపంలోని లింకెరోవర్ జిల్లా పరిధిలోని ఈ పది అంతస్తుల భవంతి గ్రౌండ్ ఫ్లోర్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా బుధవారం ఉదయం 10 గంటలకు ఎనిమిదో అంతస్తులో అనూహ్యంగా హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ భవంతిలోని 80 ఫ్లాట్లలో 200 మందికిపైగా నివసిస్తున్నారు.ఎగసిపడుతున్న అగ్నికీలలు, దట్టంగా అలుముకున్న పొగతో భవనంలో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భవంతిలోని పై అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ముఖ్యంగా పదో అంతస్తు దారుణంగా కాలిపోయింది. విషయం తెల్సి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని అగ్నికీలలను ఆర్పే ప్రయత్నంచేశారు.అత్యంత ఎత్తులో మంటలు చెలరేగుతుండటంతో అగ్నికీలలను ఆర్పడం ఫైర్ విభాగ సిబ్బందికి సమస్యగా మారింది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎనిమిదో అంతస్తులో దట్టంగా కమ్ముకున్న పొగ మధ్యలోంచి ఒకతను బయటకు వేలాడుతూ రక్షించండి అని అరుస్తున్న వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది. సమయస్ఫూర్తితో ఆయన నెమ్మదిగా పక్కకు జరిగి వేరే కిటికీ ద్వారా బయటపడ్డారు.
జాతీయం
ప్చ్.. మూడు నెలలైనా గడవకముందే!
న్యూఢిల్లీ: ఐదేళ్ల పాటు శ్రమించి నిర్మించారు. రూ.12 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎక్స్ప్రెస్వేను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. అయితే ప్రారంభమై మూడు నెలలు కూడా పూర్తికాకముందే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.212 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ–డెహ్రాడూన్ ఆరు లేన్ల ఎక్స్ప్రెస్వేను ప్రధాని మోదీ ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి కేవలం రెండు గంటలకు తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఐదేళ్ల పాటు నిర్మాణం సాగిన ఈ ప్రాజెక్టు ప్రారంభమైన కేవలం 79 రోజుల్లోనే రోడ్డుపై భారీ గుంతలు కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.👋Hello @narendramodi Ji,This is the Delhi–Dehradun Expressway, inaugurated by you just a couple of months ago.It took around 5 years to build, yet it hasn't even seen its first monsoon. Look at the pathetic condition. People are forced to stand in the middle of the… pic.twitter.com/4GZF84Hgia— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) July 2, 2026వైరల్ వీడియోలో ఎక్స్ప్రెస్వేపై రెండు పెద్ద గుంతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి కారణంగా తన కళ్ల ముందే నాలుగైదు వాహనాలు అదుపు తప్పాయని, కనీసం రెండు కార్ల అల్లాయ్ వీల్స్ దెబ్బతిన్నాయని వీడియో తీసిన వాహనదారుడు పేర్కొన్నాడు. అనంతరం దెబ్బతిన్న చక్రాలను కూడా వీడియోలో చూపించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటు.. ప్రతిపక్ష కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.This is the video..😰 pic.twitter.com/rbTwggZLbC— bindasspahadi (@bindasspahadi) July 2, 2026ఐదేళ్లపాటు నిర్మించి, తొలి వర్షాకాలం కూడా పూర్తికాకముందే రోడ్డు పరిస్థితి ఇలా మారడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టోల్ రూపంలో రూ.650 వసూలు చేస్తూ, ప్రయాణికుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయంగా ఎత్తుకుంది. ఇంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో మూడు నెలల్లోనే గుంతలు పడటం నిర్మాణ నాణ్యతలో లోపాలకు, నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!
గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. మత స్వేచ్ఛ, చట్టబద్ధ హక్కులు, న్యాయవ్యవస్థ అధికార పరిధి అంశాలపై రాజకీయ దుమారం చెలరేగింది.మద్రాస్ హైకోర్టు మే 27న ఇచ్చిన తీర్పు తమిళనాడు జంతు సంరక్షణ చట్టం–1958కు విరుద్ధంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును తాజాగా ఆశ్రయించింది. పదేళ్లు దాటిన, వ్యవసాయ పనులకు లేదంటే సంతానోత్పత్తికి.. పనికిరాని ఆవులను నిర్దిష్ట నిబంధనల ప్రకారం వధించేందుకు చట్టం అనుమతిస్తోందని, అయితే హైకోర్టు ఎలాంటి మినహాయింపులూ లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించడం చట్ట పరిధిని మించిన నిర్ణయమని పేర్కొంది.అంతేకాదు, కోయంబత్తూరులో బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో జంతువుల వధను నిరోధించాలని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, ఆ అంశానికే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది చట్టసభ అధికారాలను న్యాయస్థానం భర్తీ చేసినట్లేనని తన పిటిషన్లో పేర్కొంది.ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఆలస్యంగా తీసుకున్న చర్యగా విమర్శిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. ఈ విషయంలో టీవీకే ప్రభుత్వం దాదాపు నెల రోజుల తర్వాత స్పందించిందని ఆరోపించింది. బక్రీద్ సందర్భంగా మాత్రమే దాఖలైన పిటిషన్పై హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించడంతో ముస్లింలతో పాటు కొన్ని హిందూ దేవాలయాల్లో జరిగే సంప్రదాయ బలిపూజలపైనా ప్రభావం పడిందని పేర్కొంది. ఇలాంటి కీలక అంశంలో ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిందని, ఆలస్యంగా స్పందించడం వల్ల ప్రజల్లో అయోమయం నెలకొందని విమర్శించింది.మరోవైపు, మణితనేయ మక్కల్ కచ్చి (MMK) అధ్యక్షుడు ఎం.హెచ్. జవహిరుల్లా ఈ తీర్పు రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ హక్కును దెబ్బతీస్తోందని ఆరోపించారు. లైసెన్స్ పొందిన స్లాటర్ హౌస్లలో మాత్రమే బలులు నిర్వహించాలనడం ఆచరణ సాధ్యం కాదని, సంప్రదాయ మతాచారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలు జంతువుల వధను నియంత్రిస్తున్నాయని, వాటిని పూర్తిగా పక్కనబెట్టి హైకోర్టు సంపూర్ణ నిషేధం విధించడం న్యాయపరంగా సమంజసం కాదని స్పష్టం చేసింది. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాతే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో అధికార–ప్రతిపక్షాల మధ్య కొత్త రాజకీయ పోరుకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మణిపూర్లో మళ్లీ హింస: సరిహద్దు గ్రామాలకు నిప్పు
కామ్జోంగ్: మణిపూర్లోని కామ్జోంగ్ జిల్లా పరిధిలో గల భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో మళ్లీ హింస చెలరేగింది. కుకీ, నాగా సామాజిక వర్గాలకు చెందిన పలు సరిహద్దు గ్రామాలు అగ్నికి ఆహుతవడంతో ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ తాజా ఘర్షణల్లో కుకీ వర్గానికి చెందిన ఫైమోల్ గ్రామంతో పాటు, తంగ్ఖుల్ నాగా వర్గానికి చెందిన కొంగ్కాన్ థానా, షాంగ్కలోక్ గ్రామాలలోని పలు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.కుకీ ఇన్పి మణిపూర్ (కేఐఎం) సంస్థ ఆరోపణల ప్రకారం.. మయన్మార్కు చెందిన షాన్ని నేషనాలిటీస్ ఆర్మీ (ఎస్ఎన్ఏ) సభ్యులతో కలిసి ఎన్ఎస్సీఎన్-ఐఎం క్యాడర్లు బుధవారం తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చి ఫైమోల్ గ్రామంపై దాడి చేసి నిప్పు పెట్టారు. అసోం రైఫిల్స్ సిబ్బంది ఈ ప్రాంతం నుండి ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ దాడి జరగడంపై వారు భద్రతా లోపాలను లేవనెత్తారు. మరోవైపు, నాగా గ్రామ అధికారులు ఈ వాదనను తోసిపుచ్చారు. కుకీ నేషనల్ ఆర్మీ-బి క్యాడర్లతో కూడిన సాయుధ ముఠాలే కొంగ్కాన్ థానా, షాంగ్కలోక్ గ్రామాల్లోని ఇళ్లను తగులబెట్టాయని వారు ఆరోపించారు.ఈ దాడులు దాదాపు ఒకే సమయంలో జరిగాయని, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచేందుకే కుకీ ఉగ్రవాద గ్రూపులు ఈ చర్యకు పాల్పడ్డాయని నాగా సంస్థలు ఆరోపించాయి. పౌర గ్రామాలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తగినంత మంది భద్రతా సిబ్బందిని మోహరించి శాంతిభద్రతలను పునరుద్ధరించాలని నాగా గ్రామ అధికారులు కోరారు. మరింత హింస చెలరేగకుండా నిరోధించడానికి సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరుల భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలని కుకీ, నాగా గ్రూపులు రెండూ కేంద్ర, మణిపూర్ ప్రభుత్వాలను, భద్రతా సంస్థలను అభ్యర్థించాయి.
ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. డ్రోన్స్, విదేశీ గన్స్..
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి భారీగా గన్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.వివరాల మేరకు.. ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు చేధించారు. నిందితుల విచారణలో ఈ కుట్రకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) హ్యాండ్లర్ షెహ్జాద్ భట్టి ఆదేశాలు మేరకు కుట్ర జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టైన వారిలో ముగ్గురు పంజాబ్కు చెందినవారు కాగా, ఒకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి అని అధికారులు తెలిపారు.కాగా, నిందితులు డ్రోన్ల ద్వారా ఆయుధాలు మరియు మాదకద్రవ్యాలు అందుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. కాల్పుల ఘటనకు గగన్ప్రీత్ను బాధ్యుడిగా నియమించినట్లు కూడా సమాచారం బయటపడింది. ఈ కేసులో భారత శిక్షా స్మృతి (BNS), ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం, నిందితుల వద్ద నుంచి రెండు విదేశీ పిస్టల్స్, 9 తూటాలు, అలాగే ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొబైల్ ఫోన్లలో విదేశీ నంబర్లతో నిరంతర సంప్రదింపులు జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది. కాగా, ఉగ్ర నెట్వర్క్పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఎన్ఆర్ఐ
వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
సోషల్ మీడియా పుణ్యమా అని తమకెదురైన ప్రతి సమస్యను షేర్ చేసుకుంటూ సలహాలు సూచనలు పొందడం ఓ ట్రెండ్గా మారింది. ఒకరకంగా దీనివల్ల ఇతరుల ఎంత పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నారో తెలియడమేగాక, వ్యక్తిగతంగా ఒక సమస్యకు ఎలా సంయమనంగా ఓపిగ్గా ఉండాల్లో తెలుసుకునే వీలు లభించడం విశేషం. అలానే ఈసారి నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఎన్నారై రెడిట్ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు ఆలోచింప చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..ఆ ఎన్నారై రెడిట్ పోస్ట్లో ఇలా ఉంది. తన వయసు 39 ఏళ్లు అని, తాను దాదాపు 15 ఏళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చాడు. తాను ప్రేమించి పెళ్లి చూసుకున్నానని, తామిద్దరం ఉద్యోగాల్లో మంచి ఉన్నతిని సాధించామని, సుమారు 46 కోట్లు ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఇటీవల తన భార్య కేన్సర్ బారిన పడిందని, ప్రస్తుతం ఆ వ్యాధి మరింతగా ముదిరిందని రాసుకొచ్చారు. తమకు పిల్లలు కూడా లేరని అన్నారు.దాదాపు ఐదేళ్లుగా తర భార్య కేన్సర్తో పోరాడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఒకవేళ ఆమె ఆరోగ్యం క్షీణించి.. దాంతో మానసికంగా అలిసిపోయి ఇక పనిచేయకూడదు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే.. భారత్లో జీవించడానికి తన వద్ద ఉన్న ఆ రూ. 46 కోట్ల ఆస్తి సరిపోతుందా అని ప్రశ్నించాడు. అందుకు నెటిజన్ల నుంచి ఆచరణాత్మక ఆర్థిక సలహాలతో పాటు వ్యక్తిగత ధైర్యాన్ని నింపే సలహాలు సూచనలు కూడా అందించారు.వినడానికి బాధగా ఉన్నా.. తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆమె చెంతే ఉండండి. మంచి వైద్యం అందించేలా ప్రముఖ వైద్యులను కలిసి సలహాలు సూచనలు తీసుకోండి. భారత్లో మెట్రో నగరాల్లో జీవించాలనుకున్నా అంత మొత్తం సరిపోతుందని అన్నారు. అంతేగాదు మీ భార్య కోసం చేయగలిగిందంతా ఇప్పుడే చేయండి. ఇది ఆర్థిక భద్రతకు సంబంధించింది కాదు.. అంతకుమించిన బంధానికి, భావోద్వేగానికి సంబంధించిందంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..
న్యూయార్క్ టూర్ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుర్రపు బగ్గీ నుండి కింద పడి పోయిన తల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్రం అదుపు తప్పి ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.'ది న్యూయార్క్ టైమ్స్' ప్రకారం కుటుంబంతో కలిసి న్యూయార్క్కు మొదటిసారి విహారయాత్రకు వచ్చిన 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్కు బుధవారం జీవితంలోని మర్చిపోలేని శోకాన్ని మిగిల్చింది. కుటుంబ ఫోటో తీసుకోవడానికి డ్రైవర్ బండిని ఆపిన వెంటనే, గుర్రం ఒక్కసారిగా అదుపు తప్పి పరిగెత్తడం మొదలుపెట్టింది. అది వేగంగా దూసుకెళ్లి ఫుట్పాత్ ఎక్కి, గడ్డి ఉన్న ప్రదేశంలోకి దూసుకెళ్లింది. ‘‘రక్షించండి, రక్షించండి’’ అని అరుస్తూనే ఉన్నామని రోమాంచ్ తండ్రి దీపక్ మహాజన్ వాపోయారు. అందరమూ ఒకర్నొకరు గట్టిగా పట్టుకున్నప్పటికీ తన భార్య ప్రియ బగ్గీ నుండి కింద పడి పోవడంతో, ఆమెను రక్షించడానికి రోమాంచ్ కిందకు దూకి చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యాడు.కిందకు దూకిన రోమాంచ్ తల నేలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. బుధవారం రాత్రి న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ వీల్ కార్నెల్ మెడికల్ సెంటర్లో చికిత్సపొందుతూ చని పోయాడు. రోమాంచ్ తండ్రి తల్లి , తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టావెర్న్ ఆన్ ది గ్రీన్ అనే హోటల్లో పనిచేసే టాటియానా బ్రెస్లర్ న్యూయార్క్ పోస్ట్తో మాట్లాడుతూ, గుర్రం భయంతో చాలా వేగంగా పరుగెత్తిందని, వెంటనే తాము 911కి ఫోన్ చేశారు. బగ్గీ బోల్తా పడకముందే ఒక ప్రత్యక్ష సాక్షి ఆ గుర్రాన్ని కట్టడి చేశాడని బ్రెస్లర్ తెలిపారు.ఇదీ చదవండి : 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీగుర్రపు బగ్గీలతో జరుగుతున్న వరుస ప్రమాదాల్లో ఇది తాజాది. ఈ ప్రమాదంతో పార్కులో గుర్రపు బగ్గీలను నిషేధించాలనే డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. బగ్గీ డ్రైవర్ల యూనియన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. గత ఏడాది మే నుండి పార్క్ లేదా దాని పరిసరాల్లో గుర్రాలకు సంబంధించిన ప్రమాదాలు ఎనిమిది జరిగాయని, గత నెలలో కూడా ఒక గుర్రం మరో బగ్గీని ఢీకొట్టడంతో అది బోల్తా పడిందని పార్క్ కన్సర్వెన్సీ తెలిపింది. సదరు డ్రైవర్ను యజమాని నిరవధికంగా సస్పెండ్ చేశారు.ఇదీ చదవండి: మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ : తీవ్ర ఉద్రిక్తత
ఫిన్లాండ్లో విద్యార్థి మణిదీప్ రెడ్డి మిస్సింగ్
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. 🚨 MISSING IN FINLAND 🇫🇮Manideep Reddy Gujja has been missing in Finland.Family and friends are urgently seeking any information regarding his whereabouts.📍 Last Contacted: May 5, 2026🎓 University: LUT University📍 City: Lahti, FinlandContact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026
మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అమెరికాలోని మిస్సోరి (Missouri) రాష్ట్రంలో స్కైడైవింగ్ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి కార్తీక్ వర్మ దాట్ల కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన మొత్తం 12 మందిలో ఆయన ఒక్కరే భారతీయుడు.ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి' నుండి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కాన్సాస్ సిటీలో హెల్త్కేర్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో కాప్జెమినీ (Capgemini) లో పనిచేసిన ఆయన, ప్రస్తుతం అడ్వెంట్హెల్త్ (AdventHealth) సంస్థలో క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్కాన్సాస్ సిటీకి దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుండి ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయ్యింది. పైలట్తో పాటు 11 మంది స్కైడైవర్లతో ప్రయాణిస్తున్న 'పసిఫిక్ ఏరోస్పేస్ 750XL' విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానం భూమికి దాదాపు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎడమవైపునకు తిరిగి, పొలాల్లో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. విమానంలో ఇంజన్ పవర్ తగ్గిపోవడం వల్లే పైలట్ హైవేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని ఎయిర్పోర్ట్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. దీంతో విమానంలోవారందరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అమెరికా పారాచూట్ అసోసియేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జెన్ షార్ప్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి 20 లక్షలు : ఎలా?సాధారణ కమర్షియల్ విమానాల్లో ఉండేలాంటి 'బ్లాక్ బాక్స్' (డేటా రికార్డర్) ఈ చిన్న విమానంలో లభ్యం కాలేదు. దీంతో ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఇతర డిజిటల్ పరికరాలు, సాక్షుల ప్రకటనలు, వీడియోలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన పసిఫిక్ ఏరోస్పేస్ 750XL అనేది సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం. ఇది స్కైడైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ విమానం ప్రమాదానికి ముందు కూడా తొమ్మిదిసార్లు విజయవంతంగా ప్రయాణించిందని విమాన ట్రాకింగ్ సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!
క్రైమ్
నాకు చిన్న పిల్లలున్నారయ్యా... ఎవరైనా కాపాడండి...
గుంటూరు జిల్లా: ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. పెను ప్రమాదానికి దారి తీసింది. ఏకంగా మూడు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. నుజ్జునుజ్జయిన లారీ క్యాబిన్లలో ఇరుక్కుపోయి బయటకు రాలేక వారు పెట్టిన హాహాకారాలు, మీదకొస్తున్న అగ్ని కీలల నుంచి కాపాడమని చేసిన ఆర్తనాదాలు చూపరులను కలచివేశాయి. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ముగ్గురిని అక్కడికక్కడే సజీవ దహనం చేసింది. ఏ మృతదేహం ఎవరిదో కూడా గుర్తుపట్టలేని స్థితిలో పూర్తిగా కాలిపోయిన విషాద ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెం హైవేపై చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు... నంద్యాల జిల్లా బేతంచర్ల నుంచి నాపరాయి లోడుతో మచిలీపట్నం వైపు ఓ లారీ వెళుతోంది. మరోవైపు బుధవారం వేకువజామున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెం 16వ నంబరు జాతీయ రహదారిపై డీజిల్ అయిపోయి మధ్య లైనులో కోళ్ల దాణా లోడు లారీ అడ్డంగా నిలిచిపోయింది. దీనిని తప్పించబోయి.. అదుపు తప్పిన మొదటి లారీ అక్కడి డివైడర్ను ఢీకొట్టి, అవతల రోడ్డులోకి దూసుకెళ్లింది.అదే సమయంలో భద్రాచలం నుంచి బెంగళూరుకు పేపర్ బండిల్స్ లోడుతో వెళ్తున్న లారీని నాపరాయి లోడు లారీ ఎదురు నుంచి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నాపరాయి లోడు లారీ నడుపుతున్న నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామానికి చెందిన మేకల రవికుమార్ (36), అదే గ్రామానికి చెందిన డ్రైవరు రమేశ్ (35)తోపాటు పేపర్ లోడ్లారీ నడుపుతున్న కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శెట్టిగన్పల్లి గ్రామానికి చెందిన ధర్మపతి (26) మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఏ మృతదేహం ఎవరిదో కూడా కనుక్కోలేని విధంగా పూర్తిగా ఆహుతయ్యాయి. చిన్న పిల్లలున్నారయ్యా.. ప్రమాదంలో నాపరాయి లోడు లారీ నడుతుపుతున్న డ్రైవర్ మేకల రవికుమార్ పెట్టిన ఆర్తనాదాలు గుండెలను పిండేశాయి. ‘నాకు ఇంటి దగ్గర చిన్న పిల్లలున్నారయ్యా, ఎవరైనా కాపాడండి’ అంటూ పెద్దగా కేకలు వేశాడు. గమనించిన స్థానికులు కొందరు క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఆయన్ను డోర్లు తీసి బయటకు లాగేందుకు తీవ్రప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ లోతుగా ఇరుక్కుపోవడంతో సాధ్యపడలేదు. ఇంతలో మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే రవికుమార్ అగ్నికి ఆహుతయ్యాడు. ఆయన ఆఖరి మాటలు అందరి హృదయాలను కలిచివేశాయి. రవికుమార్కు భార్య, ఒకటో తరగతి చదువుతున్న అని్వక, ఐదో తరగతి చదువుతున్న మనోజ్లు ఉన్నారు. శాశ్వత నిద్రలోనికి.. ఇదే లారీలో డ్రైవరుగా ఉన్న రమేశ్ ప్రమాదం జరిగిన సమయంలో క్యాబిన్లో ఉన్న బెడ్పై గాఢ నిద్రలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎదురుగా లారీని బలంగా ఢీకొట్టడంతో నిద్రిస్తున్న రమేశ్ బెడ్పై నుంచి ముందుకొచ్చి లారీ లోపల ముందు భాగంలో బోర్లా పడి ఇరుక్కుపోయాడు. మంటల్లో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటూ తుదిశ్వాస విడిచాడు. పేపర్ లోడు లారీ నడుపుతున్న ధర్మపతి నుజ్జునుజ్జుయిన క్యాబిన్లో చిక్కుకుపోయాడు. మంటలు క్షణాల వ్యవధిలోనే వ్యాపించడంతో బయట పడలేకపోయాడు. మృతదేహం అగ్ని కీలల్లో చిక్కుకుని 70 శాతం వరకు కాలిపోయింది. మిగిలిన ఇద్దరి మృతదేహాల ఆనవాళ్లు బయటకు కనిపిస్తున్నప్పటికీ ధర్మపతి మృతదేహం ఎక్కడుందో కూడా గుర్తుపట్టడం కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రమాదం గుంటూరు–పల్నాడు జిల్లాల సరిహద్దులో జరగడంతో పరిధి ఎవరిదనే అంశంపై కొంత సేపు మీమాంస చోటుచేసుకుంది. అనంతరం రెవెన్యూ అధికారులు సరిహద్దు నిర్ధారించడంతో ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీబీల సాయంతో సుమారు ఎనిమిది గంటలు శ్రమించి లారీ శకలాలను పక్కకు తీయించారు. సాయంత్రం మూడు గంటల సమయానికి ఒకవైపు హైవే ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
ఏవండీ.. నన్ను కిడ్నాప్ చేశారు.. లొకేషన్ షేర్ చేశా!
బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహిత యువతిని ముగ్గురు వ్యక్తులు అపహరించి రామనగరలోని ఓ ఇంటిలో అక్రమంగా నిర్బంధించారు. ఫిర్యాదు మేరకు రామనగర పోలీసులు కార్యాచరణ జరిపి బాధితురాలిని కాపాడి, ముగ్గురు కిడ్నాపర్లను అరెస్టు చేశారు. వివరాలు... మైసూరుకు చెందిన ఆలనహళ్లి శివకుమార్ భార్య భవ్య (19). ఎలక్ట్రిషియన్గా పని చేసే శివకుమార్ ఏడాది క్రితం హాసన్ జిల్లా సకలేశపురకు చెందిన భవ్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆలనహళ్లిలో నివాసం ఉంటున్నారు. జూన్ 25న శివకుమార్ పని మీద బోగాదికి వెళ్లారు. భార్యకు ఫోన్ చేయగా, స్విచాఫ్ వచ్చింది. రాత్రయినా భార్య ఇంటికి రాకపోవడంతో ఆందోళనలో ఉన్న శివకుమార్కు మరునాడు ఫోన్ వచ్చింది. అతని భార్య మాట్లాడుతూ తనను ముగ్గురు వ్యక్తులు అపహరించి రామనగరకు పిలుచుకొచ్చి ఇక్కడ ఒక ఇంటిలో నిర్బంధించారు, కాపాడమని కోరి లొకేషన్ షేర్ చేసింది. వెంటనే అప్రమత్తమైన శివకుమార్ 112కు ఫోన్ చేసి రామనగర పోలీసులకు పూర్తి వివరాలు అందించారు. పోలీసులు కార్యాచరణ జరిపి భవ్యను కాపాడారు. కిడ్నాప్కు పాల్పడిన రామనగరవాసులు సుమ, కిరణ్, మరొక మహిళను బంధించి కటకటాల వెనక్కు నెట్టారు.
పుణే కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్!.. తెరపైకి లై డిటెక్టర్ టెస్ట్
పుణే: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసిన కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలు సియాపై లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు పోలీసులు గురువారం పుణే కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీయడానికి ఈ పరీక్ష అవసరమని వారు వాదించినట్లు సమాచారం.కేతన్ను లోహన్గఢ్ కోట వద్ద ఎవరు లోయలోకి తోసి చంపారనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదని పోలీసులు కోర్టుకు నివేదించారు. తొలుత సియా ప్రియుడు చేతన్ తోశాడని.. తర్వాత సియానే తోసిందని.. ఆపై చేతన్ స్నేహితుడి ప్రమేయం ఉందని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఎవరు తోశారో కచ్చితంగా చెప్పగలిగే ఆధారం మాత్రం లభించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో నిందితులు మౌనం వహిస్తున్నారని వివరించారు. ఈ తరుణంలో లై డిటెక్టర్ పరీక్ష ఒక్కటే మార్గమని కోర్టును అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే, సియా తరఫు న్యాయవాది విపుల్ దుషింగ్ మాత్రం లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలంటే కోర్టు అనుమతి మాత్రమే సరిపోదని, నిందితురాలి సమ్మతి కూడా తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు, పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలను కోర్టు ప్రత్యక్ష సాక్ష్యంగా పరిగణించదని, అవి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ఆధారాలు, లీడ్స్ సేకరించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.కేసు ఇప్పటికే మిస్టరీగా మారిన నేపథ్యంలో, ఎవరి పాత్రపై కూడా ఇప్పటివరకు తేలికైన ఆధారాలు లభించకపోవడం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది. కోర్టు ఈ అభ్యర్థనపై ఎలా స్పందిస్తుందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ, పుణె రూరల్ పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వివాహం విషయంలో అసంతృప్తిగా ఉన్న కేతన్ను ఆయన కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫోటో షూట్ సమయంలో కేతన్ను 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాదు అంతకు ముందు.. జూన్ 14న ఇదే కోట వద్ద జరిగిన మరో ప్రయత్నం విఫలమైనట్లు కూడా దర్యాప్తులో బయటపడింది.దర్యాప్తులో కీలకంగా, 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ చౌదరి హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అలాగే జనవరి నుంచి జూన్ మధ్యలో సియా–చేతన్ మధ్య 2,000కుపైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. కేతన్ మరణం అనంతరం అతని మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాల నేపథ్యంలో జూన్ 23న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కేసు అత్యంత కీలక దశలో ఉండగా, దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసులో.. కేతన్ తరఫున ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్స్ 103 (హత్య), 61 (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.దర్యాప్తులో భాగంగా పోలీసులు జూన్ 28న సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఘటన పునర్నిర్మాణం (Crime Scene Recreation) నిర్వహించారు. జూలై 1న చేతన్ చౌదరిని నేరుగా లోహగఢ్ కోటకు తీసుకెళ్లి మరోసారి సీన్ రీక్రియేషన్ చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో గైట్ అనాలిసిస్, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, అలాగే డిలీట్ చేసిన డేటా రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఘటనకు ముందు.. మరో కోట వద్ద ఈ ఇద్దరూ కేతన్ను ఎలా తోసి చంపాలో రిహార్సల్స్ సైతం నిర్వహించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. లై-డిటెక్టర్ పరీక్షపై కోర్టు నిర్ణయం దర్యాప్తులో తదుపరి కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పోక్సో కేసులో ఎస్ఐ ప్రవీణ్ అరెస్ట్
బెంగళూరు: విచారణ పేరుతో బాలలను తీసుకువచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణలపై అమృతహళ్లి ఎస్ఐ ప్రవీణ్ను కొత్తనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం హత్య కేసులో విచారణ పేరుతో కొందరు బాలలను లాడ్జికి తీసికెళ్లిన ప్రవీణ్ వారిపై దాడిచేసి అసభ్యంగా డ్యాన్సులు చేయించి తన మొబైల్లో వీడియోలు తీసుకున్నాడు. ఇటీవల సదరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. దీంతో అమృతహళ్లి పోలీసులు స్వయంప్రేరితంగా పోక్సో కేసు నమోదు చేసి కొత్తనూరు పోలీసులకు బదిలీ చేశారు. ఎస్సై ప్రవీణ్ మొబైల్లోని వీడియోలు కాపీ చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు లీక్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్ఐకు సహకరించాడనే ఆరోపణలపై కానిస్టేబుల్ రాఘవేంద్రను సస్పెండ్ చేశారు.
వీడియోలు
క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి
కేతన్ కేసులో కీలక మలుపు
ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్
పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్
ఏంటి అన్న ఈ బూతు పురాణం.. పూలవర్తి నాని ఆడియో లీక్ ఏకిపారేసిన మహిళ
మీరు ఉండాల్సింది గన్ పార్క్ లో కాదు జూపార్క్ లో
ప్రశ్న రావణీని కోర్టుకు తీసుకెళ్తుండగా జనసైనికుల ఓవర్ యాక్షన్
వీళ్ళ కోసమారా! సింహం లాంటి బుద్దోడిని పక్కన పెట్టారు
సీనియర్ NTR డైలాగ్ చెప్పిన హెరోయిన్ భాగ్య శ్రీ
ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు.. పవన్ కు బిగ్ షాక్



