తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
తండ్రి లేదా తాతలు, ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తికి సంబంధించి ఒరిజినల్ సేల్ డీడ్ (క్రయపత్రం) లేకపోవడం, చట్టబద్ధమైన విల్లు రాయకుండానే వారు మరణించడం భారతీయ కుటుంబాల్లో తరచూ ఎదురయ్యే ప్రధాన సమస్య. ఇటువంటి సందర్భాల్లో చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను ఎలా నిరూపించుకోవాలి? ఆ ఆస్తిపై వచ్చే అద్దె ఆదాయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై న్యాయ, పన్ను నిపుణులు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు.యాజమాన్య హక్కుల నిర్ధారణఒరిజినల్ సేల్ డీడ్ పోయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు (ఎఫ్ఐఆర్) చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. అనంతరం రెండు పత్రికల్లో (ఒక ఇంగ్లీష్, ఒక ప్రాంతీయ భాష) బహిరంగ ప్రకటన ఇవ్వాలి.సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి లింక్ డాక్యుమెంట్లు, ‘సర్టిఫైడ్ కాపీ’ పొందాలి. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన గుర్తింపు కలిగి ఉంటుంది.విల్లు లేనందున వారసులందరూ తమ హక్కులను నిరూపించుకోవడానికి తహసీల్దార్ ద్వారా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదా సివిల్ కోర్టు నుంచి సక్సెషన్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి.రెవెన్యూ/మున్సిపల్ రికార్డుల్లో పేరు మార్పిడి (మ్యుటేషన్) చేయించాలి. వారసుల్లో ఎవరైనా తమ వాటాను వదులుకోవాలనుకుంటే ‘రిలీజ్ డీడ్’ రిజిస్టర్ చేయాలి.అద్దె ఆదాయంపై పన్ను బాధ్యతలుఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం, వారసత్వంగా ఆస్తి సంక్రమించినంత మాత్రాన తక్షణమే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. విల్లు లేనప్పుడు వారసులందరూ సమాన వాటాదారులుగా పరిగణించబడతారు. ఆస్తిపై వచ్చే అద్దె ఆదాయాన్ని తమ తమ వాటాల ప్రకారం విభజించి వారి వ్యక్తిగత పన్ను స్లాబ్ల ఆధారంగా ఆదాయపు పన్ను రిటర్నులో చూపించాలి. అద్దె ఆదాయంపై చట్టంలోని సెక్షన్ 24(a) కింద 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ (మరమ్మతులు, నిర్వహణ నిమిత్తం), చెల్లించిన మున్సిపల్ పన్నుల మినహాయింపు లభిస్తుంది. ముందస్తుగా ఈ చట్టపరమైన పత్రాలను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆస్తి విక్రయాలు, బ్యాంక్ రుణాలు లేదా కుటుంబ వివాదాలు రాకుండా అరికట్టవచ్చని చట్ట నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు!
ఇన్ సర్వీస్ టీచర్లకు షాక్.. స్పెషల్ టెట్!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించిన స్పెషల్ టెట్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ విషయంలో కొన్ని మినహాయింపులు, సడలింపులు ఇవ్వాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే.. ప్రభుత్వం విడుదల చేసిన తాజా స్పెషల్ టెట్ షెడ్యూల్లో ఆ మినహాయింపులకు చోటు లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పెషల్ టెట్కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పరీక్షకు సంబంధించిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పటికే సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి పరీక్ష విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం విడుదల చేసిన షెడ్యూల్లో ఉపాధ్యాయ సంఘాలు కోరిన సడలింపులను ప్రకటించలేదు. దీంతో ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం నుంచి షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు టెట్ పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి రావడం ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారవచ్చని సంఘాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నాయి. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోతే ఏ విధంగా స్పందించాలనే విషయాన్ని రేపు ప్రకటించే అవకాశం ఉంది.
రైతులను మరోసారి మోసం చేసిన కూటమి సర్కార్
కర్నూలు: రైతులను కూటమి సర్కార్ మరోసారి మోసం చేసింది. సాగునీరు ఇవ్వలేమంటూ రైతులకు షాకిచ్చింది చంద్రబాబు సర్కారు. తుంగభద్ర, పోతిరెడ్డిపాడు నుంచి తాగడానికి తప్ప వ్యవసాయానికి నీరు ఇవ్వలేమని మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చిచెప్పారు. 2027 జూలై వరకూ సాగునీరు అడగొద్దన్నారు నిమ్మల. నీరు లేక పంటలు ఎండిపోయాయని చెప్తే ఏం చేయలేం? అని రైతులకు స్పష్టం చేశారు. హంద్రీనీవా నీళ్లను తాగునీటికే వాడుకోవాలని మంత్రి నిమ్మల కరాఖండీగా చెప్పేశారు.విద్యాశాఖ నిర్వహణలో మంత్రి లోకేష్ ఘోర వైఫల్యం
జపాన్ అణ్వస్త్ర డైలమా
కొన్ని విషయాలు వినేందుకు విచిత్రంగా తోస్తాయి. ప్రపంచంలో అణ్వస్త్రాలంటూ తయారైన తర్వాత వాటి దాడికి 1945లో మొట్టమొదట గురైన దేశం జపాన్. అప్పటినుంచి 81 సంవత్సరాలు గడిచినా మరెవరూ ఎవరిపై ఆ దాడులు చేయ లేదు. అనగా ఆ ఊహాతీత వినాశనానికి గురైన ఏకైక దేశం జపాన్. ఆ దుష్ఫలితాలను వారు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఇటీవల తాము కూడా అణ్వాయుధాలు తయారు చేయాలా, లేదా కనీసం తమ దేశంలో అణ్వస్త్ర స్థావరాల ఏర్పాటుకు అనుమతించాలా అనే చర్చ జరుగుతున్నది.ఇప్పటికే వ్యతిరేకతే1945 ఆగస్టు నెలలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణ్వస్త్రాలను ప్రయోగించింది. ఆ సందర్భంగా ఆ రెండు నగరాలలో అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యాన ప్రతి సంవ త్సరం విస్తృత స్థాయిలో సంతాప సభలు జరిగినట్లే ఈసారి కూడా 81వ సంవత్సర సభలు జరిగాయి. మునిసిపల్ మేయర్ల అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమాలలో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ కూడా సభికులలో ఒకరిగా కూర్చుని పాల్గొన్నారు. అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా రెండు నగరాల మేయర్లు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. జపాన్ నగరాలన్నిటా భారీ ప్రదర్శనలు జరిగాయి. దేశ వ్యాప్తంగా జరిగిన వేర్వేరు ప్రజాభిప్రాయ సేకరణలలో సగటున 70 శాతానికి పైగా ప్రజలు అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా ఓటు చేయగా, మరొక 10 శాతం వరకు తటస్థంగా ఉండిపోయారు.దీనంతటి మధ్య గమనించదగినదేమంటే, 1971 నాటి అణ్వస్త్ర విధానాన్ని తీవ్ర మితవాద తకాయిచీ ప్రభుత్వం అధికారికంగానైతే ఏమీ మార్చలేదు. కానీ దానిని సవరించాలంటూ జరుగుతున్న చర్చను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నది. అప్పటి విధానం ప్రకారం జపాన్ స్వయంగా అణ్వాయుధాలను తయారు చేయ రాదు, ఇతర దేశాల నుంచి స్వీకరించి నిల్వ చేయరాదు, ఇతరులు తమ అణ్వాస్త్రాలను జపాన్ భూభాగంపై మోహరించేందుకు అంగీ కరించరాదు. ఇపుడు జరుగుతున్న చర్చ ఇందులో మొదటి రెండు నిబంధనలు యథాతథంగా కొనసాగాలనీ, మూడవ దానిని మాత్రం సడలించాలనే ధోరణిలో సాగుతున్నది. అనగా జపాన్లో ఇతర దేశాల అణుస్థావరాలకు అవకాశం ఇవ్వటం. ఇతర దేశాల న్నవి తమపై 1945లో అణుదాడి చేసిన అమెరికాయే అవుతుందని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య ఇప్పటికే పూర్తిస్థాయి రక్షణ ఒప్పందం ఉంది. జపాన్కు అణ్వస్త్ర స్థాయి రక్షణ కల్పించటం అందులోని అంశాలలో ఒకటి. జపాన్లోని ఒకినావా దీవిపై గల విస్తారమైన రక్షణ స్థావరాలు గాక దేశవ్యాప్తంగా 80కి పైగా సైనిక సదుపాయాలున్నాయి. పసిఫిక్ ప్రాంతంలో ఇరువురి ప్రయోజ నాలు, వ్యూహాలు ఒకటే. ఇటువంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నపుడు, జపాన్కు స్వయంగా అణ్వస్త్రాలు ఉత్పత్తి చేసుకోవలసిన అవసరం ఏమిటి? లేదా ఇతరుల అణ్వస్త్ర స్థావరాలకు చోటివ్వటం ఏమిటి?మారుతున్న అమెరికా వైఖరిమొదట ఒక మాటగా అనుకోవాలంటే, పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాలు మారు తున్నాయనే అంచనా. చైనాను ప్రపంచంలో తమ పోటీదారు, పసిఫిక్ ప్రాంతంలో తమకు సవాలు అంటూ వచ్చిన అమెరికా, ఇటీవల జి–2 ఫ్రేమ్వర్క్ పద్ధతిలో వారితో సహకారానికి సిద్ధ పడటం. ఇదే సంవత్సరం ఆరంభంలో ‘ఇండో–పసిఫిక్ వ్యూహ పత్రం’ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం, పసిఫిక్ నుంచి ఉపసంహరించుకున్నట్లయితే ప్రకటించలేదుగానీ (ఆ పని ఎన్నటికీ చేయరు), ఆ ప్రాంతంలోని తమ మిత్ర దేశాలు ఇక నుంచి తమ రక్షణ భారాన్ని చాలావరకు తామే మోయాలని స్పష్టం చేసింది. ఇదిగాక, దక్షిణ కొరియాను ఉపేక్షించి ఉత్తర కొరియాతో మైత్రికి ప్రయత్నించటం, జపాన్పై రకరకాల ఒత్తిడులు సృష్టించటం వంటివి జరుగుతున్నాయి.ట్రంప్ ఇదే విధంగా ఇచ్చిన స్పష్టతలతో యూరప్పై ఒత్తిడులు పెరిగినట్లు, పసిఫిక్ ప్రాంతంలోనూ అదే జరుగుతున్నది. దానితో ఇదే సంవత్సరం నుంచి అందరూ రక్షణ బడ్జెట్లు పెంచుతున్నారు. ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇది ప్రధా నంగా చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో ముప్పు ఉందనుకునే దేశాల నుంచి కనిపిస్తున్నది. గమనించదగినదేమంటే దీనంతటికి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటూ తీవ్రస్థాయిలో మాట్లాడుతున్నది జపాన్ ప్రభుత్వం. చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో సరిహద్దు వివాదాలు మరికొన్ని దేశాలకు కూడా చిరకాలంగా ఉన్నాయి. అదే విధంగా ఆ సముద్ర ప్రాంతం నుంచి స్వేచ్ఛా నౌకా యాన సమస్యలు. కానీ అక్కడినుంచి పూర్తిగా తూర్పున గల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల వరకు ఏదో ఒక మేరకు సామరస్యత చూపుతూ ఆర్థిక సంబంధాలకు ప్రాధాన్యతనిస్తుండగా, జపాన్ నుంచి భిన్న ధోరణి కనిపిస్తున్నది.తైవాన్పై వైఖరిలో దూకుడునిరుడు అక్టోబర్లో ప్రధానిగా ఎన్నికైన తకాయిచీ నవంబర్లో పార్లమెంట్లో మాట్లాడుతూ, ఒకవేళ చైనా సైన్యం తైవాన్ను ఆక్ర మించుకొనజూసినట్లయితే, అందువల్ల జపాన్ ఉనికికి ప్రమాదం వాటిల్లగలదు గనుక తాము కూడా ఆ యుద్ధంలో పాల్గొనవలసి రావచ్చునని అన్నారు. దానితో ఒక్కసారిగా పరిస్థితి వికటించింది. ఆ ప్రకటనలోని ప్రమాదాన్ని గుర్తించిన ట్రంప్ హెచ్చరించిన మీదట తకాయిచీ మౌనం వహించటమైతే చేశారుగానీ, చైనా డిమాండ్ చేసినట్లు తన ప్రకటనను ఉపసంహరించుకోలేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తైవాన్ చైనాలో అంతర్భాగ మని ఐక్యరాజ్యసమితితో పాటు అత్యధిక దేశాలు గుర్తిస్తున్నాయి. వాటిలో జపాన్ కూడా ఉంది. తైవాన్ చైనాలో శాంతియుతంగా విలీనమవుతుందా, బలప్రయోగం ద్వారానా అన్నది వేరే విషయం. కానీ అసలు ఆ విలీనం విషయంలో జపాన్కుగానీ, మరొకరికిగానీ పాత్ర ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఆ విలీనం సైనికంగా జరిగినా తైవాన్ నుంచి 100 కిలోమీటర్లకు పైగా దూరంలో గల జపాన్ ఉనికికి ముప్పు కలగడమేమిటి? విలీనాలు శాంతియుతంగా జరగాలని కోరటానికీ, ఇటువంటి వైఖరి తీసుకోవటానికీ తేడా ఉంటుంది. అందుకు కారణం తకాయిచీ పూర్తి కన్సర్వేటివ్ కావటంతోపాటు, తైవాన్ కొంతకాలం తమ ఆక్రమణలో ఉండటం, అమెరికా వ్యూహంలో భాగం కావటమనే అభిప్రాయం ఉంది.సమస్య ఈ విధంగా మొదలై ఇపుడు జపాన్ అణ్వస్త్రాల గురించి ఆలోచించే వరకు వచ్చింది. తైవాన్, చైనా ఒకటేనని స్వయంగా తైవాన్ కూడా సూత్ర రీత్యా అంగీకరించటం మరొక విశేషం. తమకు స్వాతంత్య్రం కావాలనే వర్గం ఒకటి అక్కడ ఉన్నా, వద్దనే వర్గం కూడా ఉంది. ఎప్పటికైనా, ఏదో విధంగా విలీనం చేసు కోగలమని చైనా కృతనిశ్చయంతో చెప్తున్నది. ట్రంప్ ఈ సంవత్సరం మే నెలలో చైనాకు వెళ్లినపుడు తనకు ఆ మాట అర్థమైనట్లే రాజీ ధోరణిలో వ్యాఖ్యానించారు. అటువంటి స్థితిలో, చైనాను తాము సైనికంగా నిలువరించగలమని జపాన్ ప్రధాని నిజంగానే నమ్ము తున్నారా? 1945 తర్వాత 81 ఏళ్లకు జపాన్ ప్రధాని ఆ వినాశనాన్ని మరచి అక్కరలేని అణ్వస్త్ర డైలమాను సృష్టించుకొని ఉండవచ్చు. జపాన్ ప్రజల వ్యతిరేకత మాత్రం సంతృప్తిని కలిగిస్తోంది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
దుక్కి లేని ఎస్ఆర్టీ సాగు!
బలిపీఠాలవుతున్న ఆస్పత్రులు
పర్యావరణ హిత జీవన సేద్యం
డార్క్ లైట్ టు లైమ్లైట్
ఐదు నెలల గరిష్ఠానికి బంగారం ధర!
జపాన్ అణ్వస్త్ర డైలమా
దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే!
నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.2,000..? మరి 'టాక్సిక్'కి ఎంతో తెలుసా?
కొత్త లుక్తో 2026 పల్సర్ బైక్స్ లాంచ్: ధరలు, ఫీచర్లు ఇవే..
సైబర్ టెర్రరిజం కేసులో NIA దూకుడు.. ఐదు రాష్ట్రాల్లో సోదాలు!
ఈ వారం బ్యాంకులకు సెలవులు.. 4 రోజులు బంద్!
...అలా చేస్తే మనమెవరమూ మిగలం సార్!
పోతే పోనీవోయ్.. పవర్ కంపెనీలు పోతే మన సారు పవరేమన్నా పోతుందా!
రాహుల్ సిప్లిగంజ్ బర్త్ డే.. సతీమణి స్పెషల్ విషెస్
తండ్రికి మూడు.. కూతురికి మొదటి ర్యాంక్.. ‘లా’లో తండ్రిని మించిన తనయి
దావూద్ నేర సామ్రాజ్యానికి పునాది.. ఈ మహిళనే!
విటమిన్ డి సీక్రెట్ బయటపెట్టిన న్యూరాలజిస్ట్
దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్
'ఇరుముడి'తో జాక్పాట్ కొట్టిన రవితేజ
రవితేజ ఇరుముడి.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్
‘బాహుబలి’తో నిర్మాణం కూల్చివేత షురూ
మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!
ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ
జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్గా
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా
ఈ రాశి వారికి భూలాభాలు.. పనుల్లో పురోగతి
బంగ్లా నిర్ణయంపై హైటెన్షన్.. భారత్కు డేంజర్ బెల్!
దుక్కి లేని ఎస్ఆర్టీ సాగు!
బలిపీఠాలవుతున్న ఆస్పత్రులు
పర్యావరణ హిత జీవన సేద్యం
డార్క్ లైట్ టు లైమ్లైట్
ఐదు నెలల గరిష్ఠానికి బంగారం ధర!
జపాన్ అణ్వస్త్ర డైలమా
దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే!
నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.2,000..? మరి 'టాక్సిక్'కి ఎంతో తెలుసా?
కొత్త లుక్తో 2026 పల్సర్ బైక్స్ లాంచ్: ధరలు, ఫీచర్లు ఇవే..
సైబర్ టెర్రరిజం కేసులో NIA దూకుడు.. ఐదు రాష్ట్రాల్లో సోదాలు!
ఈ వారం బ్యాంకులకు సెలవులు.. 4 రోజులు బంద్!
...అలా చేస్తే మనమెవరమూ మిగలం సార్!
పోతే పోనీవోయ్.. పవర్ కంపెనీలు పోతే మన సారు పవరేమన్నా పోతుందా!
రాహుల్ సిప్లిగంజ్ బర్త్ డే.. సతీమణి స్పెషల్ విషెస్
తండ్రికి మూడు.. కూతురికి మొదటి ర్యాంక్.. ‘లా’లో తండ్రిని మించిన తనయి
దావూద్ నేర సామ్రాజ్యానికి పునాది.. ఈ మహిళనే!
విటమిన్ డి సీక్రెట్ బయటపెట్టిన న్యూరాలజిస్ట్
దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్
'ఇరుముడి'తో జాక్పాట్ కొట్టిన రవితేజ
రవితేజ ఇరుముడి.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్
‘బాహుబలి’తో నిర్మాణం కూల్చివేత షురూ
మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!
ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ
జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్గా
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా
ఈ రాశి వారికి భూలాభాలు.. పనుల్లో పురోగతి
బంగ్లా నిర్ణయంపై హైటెన్షన్.. భారత్కు డేంజర్ బెల్!
ఫొటోలు
రవితేజ ‘ఇరుముడి’ సక్సెస్ సెలబ్రేషన్స్.. (ఫొటోలు)
19 ఏళ్ల కేరళ అమ్మాయికి మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఏకంగా 52 మంది బ్యూటీలను..(ఫొటోలు)
'ఇరుముడి'లో విలనిజం.. ఈ నటిని గుర్తుపట్టారా? (ఫొటోలు)
‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ రుక్మిణి వసంత్ (ఫొటోలు)
ఆదిలాబాద్ : ఐటీడీఏ ముట్టడికి భారీగా తరలివచ్చిన ఆదివాసీలు (ఫొటోలు)
ఈ అనుభూతి మాటల్లో చెప్పలేను.. 'దృశ్యం' పాప (ఫొటోలు)
హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
ఇన్నాళ్లకు మళ్లీ ఒకే వేదికపై..(ఫోటోలు)
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్ ప్రిషా సింగ్ (ఫొటోలు)
బిగ్బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)
సినిమా
ఆమె కళ్లలో వెలుగు.. ఓ దేశాంతర ప్రేమకథ మొదలు
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పలేం. విహారయాత్రకు వచ్చిన విదేశీ మహిళా టూరిస్టులు.. మన దేశానికి చెందిన టాక్సీ డ్రైవర్లతో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం లాంటివి మీరు విని చూసే ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ స్టోరీనే సోషల్ మీడియాలో కనిపించింది. ఓ తైవాన్ నటుడు, హోటల్లో పనిచేసే భారతీయ మహిళతో ప్రేమలో పడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ వీళ్లెవరు? ఎప్పుడు ఎలా ప్రేమలో పడ్డారు? వీళ్ల కథేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)తైవాన్కు చెందిన నటుడు, మోడల్ చెంగ్ చాంగ్ ఫాన్ గతేడాది నవంబరులో మన దేశానికి వచ్చాడు. ఓ హోటల్లో దిగిన సందర్భంగా హోటల్లో పనిచేసే ఓ అమ్మాయి.. భారతీయ సంప్రదాయం ప్రకారం అతడికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఆహ్వానించింది. సరదాగా తీసుకున్న వీడియోని చెంగ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే ఆరు నెలలు తిరిగేసరికి వీరిద్దరూ ప్రేమికులు అయ్యారు. సన్నిహితంగా ఫొటోలకు పోజులిచ్చేంత చనువుగా మారిపోయారు. దానికి తోడు చెంగ్.. భారతీయ మహిళల గురించి పెట్టిన సుధీర్ఘ పోస్ట్ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని విషయం చెప్పకనే చెప్పినట్లయింది.'భారతీయ మహిళల్లో అత్యంత అందమైన విషయం మన కళ్లకు కనిపించేది మాత్రమే కాదు. మనకు అనిపించేది కూడా. వారు తమ ప్రేమని బహిరంగంగా వ్యక్తపరుస్తారు, ఎంతో శ్రద్ధ చూపిస్తారు, మనస్ఫూర్తిగా నవ్వుతారు. తమలోని సున్నితత్వాన్ని అలానే కాపాడుకుంటారు. భారతీయ మహిళలు అతిథులని ఆహ్వానించే విధానంలో ఒక ప్రత్యేకమైన ఆప్యాయత ఉంటుంది. వారి నిజాయితీ, ఆత్మీయత కారణంగా ఒక అపరిచితుడు కూడా కొంతసేపటికి ఆత్మీయుడు అయిపోతాడు''ఆమె కళ్లలోని ఆ వెలుగు గురించి చెప్పాలి. ఆమె నవ్వినప్పుడు, తన ఇంటి గురించి మాట్లాడినప్పుడు లేదా ఏదైనా చిన్న విషయం ఆమెని సంతోషపరిచినప్పుడు కనిపించే ఆ వెలుగు ఎంతో నిజాయితీగా ఉంటుంది. ప్రపంచం కొంత సున్నితంగా, అందంగా ఉందనిపించేలా చేస్తుంది. మీరు దాన్ని చూడొచ్చు లేదా చూడకపోవచ్చు. నేను చూశాను. అనుభూతి చెందాను. నేను ఆ హోటల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అలా అనుభూతి చెందాను. చాలా కాలం తర్వాత దేవుడు నా వైపు ఉన్నట్టుగా అనిపించింది' అని చెంగ్ రాసుకొచ్చాడు.ఈ క్యాప్షన్ చూసిన ఎవరికైనా చెంగ్ చాంగ్.. సదరు యువతితో ప్రేమలో ఉన్నాడని అర్థమవుతోంది. కాకపోతే అధికారికంగా వీళ్లు ఆ విషయాన్ని బయటపెట్టలేదు. చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారేమో అనిపిస్తుంది. ప్రస్తుతానికి అమ్మాయి ఎవరు ఏంటనేది తెలియట్లేదు. చెంగ్ చాంగ్ విషయానికొస్తే.. ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పనిచేసిన ఇతడు 2020లో వచ్చిన 'క్రెవింగ్ యూ' సిరీస్లో నటించాడు. 2022లో రిలీజైన 'ఆరెంట్ యూ నథింగ్' అనే ఆల్బమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న తెలుగు హీరో) View this post on Instagram A post shared by Cheng. 范成章 (@chengchangfan) View this post on Instagram A post shared by Cheng. 范成章 (@chengchangfan)
ఒకవైపు వివాదం.. బాయ్ఫ్రెండ్తో ఆదిపురుష్ భామ చిల్..!
ఆదిపురుష్ భామ కృతిసనన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. రక్షాబంధన్ ప్రకటనలో ధరించిన డ్రెస్తో పాటు కుక్కకి రాఖీ కట్టడంపై పెద్దఎత్తున విమర్శలొస్తున్నాయి. హిందూ సంప్రదాయాలను ఎందుకిలా అప్రతిష్ట పాలు చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. రక్షాబంధన్ వేడుకపై ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ గివా రూపొందించిన యాడ్ ఈ వివాదానికి కారణమైంది. దీంతో కృతిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.అయితే ఈ ముద్దుగుమ్మ అవేమీ తనకు పట్టవు అన్నట్లు వ్యవహరిస్తోంది. తన ప్రకటనపై వివాదం తలెత్తినప్పటికీ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. అంతలోనే తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకవైపు వివాదం నడుస్తుంటే.. తన ప్రియుడితో కబిర్ బహియాతో ఉన్న పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా తన పనిలో తాను పుల్ బిజీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. హిందూ సంప్రదాయాలపై గౌరవం లేని ఇలాంటి వారిని తగిన బుద్ధి చెప్పాలంటున్నారు. View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon)
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి యష్ 'టాక్సిక్', నయనతార 'హాయ్' లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు 'కికు చిరంజీవి' అనే తెలుగు మూవీ థియేటర్లలోకి రానుంది. వీటిలో యష్ చిత్రానికి మంచి హైప్ ఉంది. అందుకు తగ్గట్లే రెగ్యులర్గా శుక్రవారం నాడు కాకుండా బుధవారమే(ఆగస్టు 26) పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఐ నోబడీ', మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. దీనితో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ లాంటి తెలుగు సిరీసులు.. బంధర్ అనే హిందీ చిత్రం కూడా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తోంది. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 24 నుంచి 30 వరకు)హాట్స్టార్ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 25అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29నెట్ఫ్లిక్స్ద లాస్ట్ సెల్యూట్: ఏ లవ్ లెటర్ టూ MiG-21 (హిందీ డాక్యుమెంటరీ) - ఆగస్టు 26లిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28అమెజాన్ ప్రైమ్ద లాస్ట్ సన్రైజ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 26బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28సోనీ లివ్అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28జీ5బంధర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28ఆహాఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28ఆపిల్ టీవీ ప్లస్డార్క్ మేటర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28లయన్స్ గేట్ ప్లేహంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)
న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న తెలుగు హీరో
తెలుగు హీరో ప్రిన్స్ పెళ్లి చేసుకున్నాడు. న్యూజిలాండ్లో ఈ శుభకార్యం జరగ్గా.. తన ప్రియురాలు సాయి మాచిరాజు మెడలో మూడు ముళ్లు వేసి కొత్త జీవితం ప్రారంభించాడు. తన ఇన్ స్టాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన 'లైఫ్ టైమ్ హ్యాపీనెస్' అని రాసుకొచ్చాడు. దీంతో కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)ఓ పెళ్లిలో ప్రిన్స్, సాయికి పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. పెద్దల్ని ఒప్పించి ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఈ వేడుక జరిగింది.ప్రిన్స్ కెరీర్ విషయానికొస్తే.. తేజ దర్శకత్వం వహించిన 'నీకు నాకు డాష్ డాష్'తో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత బస్ స్టాప్ సహా పలు సినిమాల్లో హీరోగా నటించాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో సహాయ నటుడిగా మారి నేను శైలజ, డీజే టిల్లు తదితర చిత్రాలు చేశాడు. చివరగా ఈ ఏడాది మార్చిలో రిలీజైన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీలో కనిపించాడు. గతంలో బిగ్బాస్ తొలి సీజన్లోనూ పాల్గొని ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: హోటల్లో ఏం జరిగిందో మీకు 90% తెలియదు: ఈశ్వర్ సాయి)
క్రీడలు
అభిజిత్ పాంచ్ పటాకా.. ఈస్ట్జోన్కు భారీ ఆధిక్యం
దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో ఈస్ట్జోన్ భారీ ఆధిక్యం సాధించింది. ఈస్ట్జోన్ బౌలర్లు అభిజిత్, షాబాజ్ అహ్మద్ ధాటికి నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా నార్త్ ఈస్ట్ జోన్ 111 పరుగులకే కుప్పకూలింది. అర్పిత్ సుభాష్ (32) టాప్ స్కోరర్గా నిలవగా, రాంగ్సన్ జొనాథన్ (21) పర్వాలేదనిపించాడు. అభిజిత్ సర్కార్ 5 వికెట్లతో చెలరేగగా, షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 356 పరుగుల ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ ఆడకుండా నార్త్ ఈస్ట్ను ఫాలోఆన్ ఆడిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్ ఈస్ట్ జోన్ జట్టు వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అంతకముందు ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులకు ఆలౌటైంది. సుదీప్ కుమార్ (185 బంతుల్లో 146), షాబాజ్ అహ్మద్ (244 బంతుల్లో 167) సెంచరీలతో చెలరేగారు. కుమార్ కుషాగ్రా (55) అర్ధసెంచరీ సాధించాడు. నార్త్ ఈస్ట్ బౌలర్లలో ఫిరోజైమ్ జొతిన్, ఆకాశ్ చౌదరీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.ఎవరీ అభిజిత్ సర్కార్?త్రిపురకు చెందిన అభిజిత్ సర్కార్ కుడిచేతి ఫాస్ట్ బౌలర్. 2022లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా అభిజిత్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్పై మూడు వికెట్ల ప్రదర్శనతో టోర్నమెంట్ను ప్రారంభించిన అభిజిత్, నాలుగు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2022-23 రంజీ ట్రోఫీ సీజన్లో త్రిపుర తరఫున అభిజిత్ ఏడు ఇన్నింగ్స్ల్లోనే 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విదర్భపై ఆరు వికెట్ల చిరస్మరణీయ ప్రదర్శన ఉంది. ఇక 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో కేవలం ఆరు ఇన్నింగ్స్లలోనే 15 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో బరోడాపై ఐదు వికెట్ల ప్రదర్శనలతో మెరిశాడు.pic.twitter.com/fNCliUpmou 🚨 THREE WICKETS IN ONE OVER! 🔥🔥🔥Abhijit Sarkar completes his five-wicket haul in style, ripping through the batting with three wickets in the over! 🎯That’s how you finish a fifer! 💥#DuleepTrophy #3rdManView— Third Man View (@3rdManView) August 24, 2026Read: కష్టాల్లో పడిన లంక.. రెండోరోజు భారత్దే ఆధిపత్యం
యశస్వి జైశ్వాల్ సంచలన క్యాచ్.. బిత్తర పోయిన లంక్ బ్యాటర్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో దేవ్దత్త్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115) సెంచరీలతో కదం తొక్కగా.. రిషబ్ పంత్(63), యశస్వి జైశ్వాల్(45), శుబ్మన్ గిల్(50), రవీంద్ర జడేజా(43) రాణించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీలంక కేవలం 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. లహిరు ఉదారను ప్రసిద్ద్ కృష్ణ పెవిలియన్కు పంపగా. నైట్ వాచ్మెన్ ప్రభాత్ జయసూర్య(2)ను మానవ్ సుతార్ పెవిలియన్కు పంపాడు.జైశ్వాల్ సూపర్ క్యాచ్కాగా రెండో రోజు ఆట ముగిస్తుందున్న సమయంలో భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుత క్యాచ్తో మెరిశాడు. లంక తొలి ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ.. ఉదారకు బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని ఉదార డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న జైశ్వాల్.. ఎడమవైపు డైవ్ చేస్తూ సంచలన క్యాచ్ను అందుకున్నాడు. దీంతో లంక బ్యాటర్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.a masterclass in fielding, executed with breathtaking grace by Yashasvi Jaiswal 🚨 pic.twitter.com/neTfMmYHpF— َ (@pipnook) August 24, 2026
కష్టాల్లో పడిన లంక.. రెండోరోజు భారత్దే ఆధిపత్యం
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది. మొదటి రోజులాగే రెండో రోజు ఆటలో కూడా భారత్దే ఆధిపత్యం. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగితే, ఆ తర్వాత బౌలింగ్లో మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెలరేగడంతో లంకకు ఆదిలోనే షాకులు తగిలాయి.అంతకముందు తమ తొలి ఇన్నింగ్స్ను టీమిండియా 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది .బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బ్యాటర్లు చెలరేగడంతో తొలి టెస్టు తరహాలోనే రెండో టెస్టులోనూ భారత్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దేవదత్ పడిక్కల్ (193 బంతుల్లో 117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్)సెంచరీలతో చెలరేగారు. మిగతా బ్యాటర్లలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (63), కెప్టెన్ గిల్ (50) అర్ధసెంచరీలు సాధించగా, జైస్వాల్ (45), జడేజా (43) రాణించారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 4 వికెట్లు తీయగా, కెషారా నువంతా, ప్రబాత్ జయసూరియ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్నైట్ స్కోరు 300/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 307 పరుగుల వద్ద డెబ్యూ ఆటగాడు సారాంశ్ జైన్ (6) ఔట్ కావడంతో ఆరో వికెట్ కోల్పోయింది. మొదటి రోజు ఆటలో గాయంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రిషబ్ పంత్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్తో కలిసి పంత్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్కు 152 బంతుల్లో 112 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే పంత్, జురెల్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వర్షం అంతరాయంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 475 పరుగుల వద్ద నిలిచింది. వర్షం తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగకపోయినప్పటికీ, జురెల్ తన కెరీర్లో రెండో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత సిరాజ్ (3) ఔటవ్వడంతో భారత్ 489 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జురెల్ ఒక సిక్సర్ సహా రెండు ఫోర్లు కొట్టడంతో టీమిండియా స్కోరు 500 పరుగుల మార్క్ దాటింది. వెంటనే కెప్టెన్ గిల్ 503 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు.Read: వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే?
భారత్తో టీ20 సిరీస్.. అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన
భారత్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ నాయకత్వం వహించనున్నాడు. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్-హక్కు అఫ్గాన్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.ఈ రైట్ ఆర్మ్ పేసర్ దాదాపు రెండేళ్ల తర్వాత అఫ్గాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించిన నవీన్.. ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లితో గొడవపడిన సంగతి తెలిసిందే. దీంతో కొన్నాళ్ల పాటు ఈ అఫ్గాన్ పేసర్ మారు మ్రోగిపోయింది.ఆ తర్వాత నవీన్ గాయం కారణంగా నవీన్ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. తర్వాత ఫిట్నెస్ సాధించినప్పటికి సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు ఎట్టకేలకు తిరిగి జట్టులో చోటు కల్పించారు. ఇక ఈ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అతల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్ వంటి ప్రధాన ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఏడాది జూన్లో భారత్-అఫ్గాన్ మధ్య టెస్టు, వన్డే సిరీస్లు జరిగిన సంగతి తెలిసిందే. ఏకైక టెస్ట్తో పాటు వన్డే సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే జోరును కనబరిచాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మొత్తం మూడు మ్యాచ్లు ఢిల్లీ వేదికగా జరగనున్నప్పటికి.. ఈ సిరీస్ అఫ్గానిస్తాన్ హోమ్ సిరీస్గా పరిగణించబడుతుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.భారత్తో టీ20 సిరీస్కు అఫ్గాన్ జట్టుఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రెహమాన్ , సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ఎఫ్ ముజీబ్ ఉర్ రహ్మద్, ఎఫ్. నవీన్-ఉల్-హక్.చదవండి: IND vs SL: ధ్రువ్ జురెల్ సెంచరీ.. దెబ్బకు ధోని ఆల్టైమ్ రికార్డ్ బ్రేక్
న్యూస్ పాడ్కాస్ట్
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
బిజినెస్
వైఫై, బ్లూటూత్, నెట్తో ఈవీఎంలను కనెక్ట్ చేయొచ్చా?
భారత ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) పూర్తి సురక్షితమైనవని, వాటికి ఎలాంటి వైఫై, బ్లూటూత్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదని కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. లఖ్నవూలోని కాళ్వీన్ తాలుక్దార్స్ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఈవీఎంలపై వచ్చే పలు అనుమానాలకు సమాధానమిస్తూ భారతదేశంలో ఉపయోగించే ఈవీఎంలను ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేస్తాయని వెల్లడించారు. ఇవి ఇతర వైర్లెస్ సాంకేతికతలతో అనుసంధానం కావు కాబట్టి వీటిని హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తెలిపారు.సోషల్ మీడియా ప్రచారాలపై అప్రమత్తతసామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని విద్యార్థులకు జ్ఞానేష్ కుమార్ సూచించారు. ఏ సమాచారాన్నైనా స్వీకరించే ముందు లేదా ఇతరులతో పంచుకునే ముందు దాని మూలం, ప్రామాణికతను తనిఖీ చేయడం ఎంతో అవసరమని అన్నారు. భారతదేశంలో సుమారు 100 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని, ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం ఒక బృహత్తర కార్యమని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను ప్రస్తావిస్తూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు.అమెరికా వంటి దేశాల్లో భారత ఓటింగ్ విధానం, ఓటరు గుర్తింపు కార్డుల నిర్వహణపై ఇటీవల ప్రశంసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల విధానాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఓటింగ్ ఆధారాలపై ఓటర్లు అవగాహన పెంపొందించుకోవాలని పౌరులకు సూచించారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
ఐపీఓకి సిద్ధమవుతున్న ఫ్రీడమ్ ఆయిల్స్ మాతృ సంస్థ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ వంటనూనెల తయారీ సంస్థ ఫ్రీడమ్ ఆయిల్స్ మాతృ కంపెనీ ‘జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ఎల్)’ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సిద్ధమవుతోంది. పరిశ్రమ దిగ్గజం ప్రదీప్ కుమార్ చౌదరి సారథ్యంలో వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ ఐపీవోలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 4.115 కోట్ల షేర్లను విక్రయించనుంది.విక్రయదారుల్లో బ్లాక్ రివర్ ఫుడ్ 2 (3.086 కోట్ల షేర్లు), ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ (61.7 లక్షల షేర్లు), ప్రమోటర్ అల్కా చౌదరి, జీఏఐఈ (చెరో 20.6 లక్షల షేర్లు) ఉన్నారు.ఆర్థిక వృద్ధి.. తయారీ సామర్థ్యంవంటనూనెలు, స్పెషాలిటీ ఫ్యాట్స్ తయారీ, ట్రేడింగ్, మార్కెటింగ్లో పట్టు సాధించిన జీఈఎఫ్ఎల్ వినియోగ ఉత్పత్తుల సమగ్ర ప్లాట్ఫామ్గా ఎదిగేందుకు మసాలా దినుసులు, కన్వీనియెన్స్ ఫుడ్స్ను పోర్ట్ఫోలియోలోకి తెచ్చింది. డీఆర్హెచ్పీలోని సమాచారం ప్రకారం, 2020-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య బ్రాండెడ్ ఆదాయం ఏటా 20.5% కాంపౌండ్ వృద్ధిని నమోదు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,053.84 కోట్లుగా ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 16.83% వార్షిక వృద్ధితో రూ.12,650 కోట్లకు చేరుకుంది.ఉత్పత్తి కేంద్రాలు..ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ (రెండు ప్లాంట్లు), కృష్ణపట్నం (ఒక ప్లాంట్)ల్లో ఉన్న మూడింటి ఉమ్మడి రిఫైనింగ్ సామర్థ్యం వార్షికంగా 12.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2026 నివేదిక ప్రకారం 6.66 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించింది.తదుపరి వ్యూహందక్షిణాది ప్యాకేజ్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రిటైల్ విపణిలో ఆదాయంపరంగా 22.2% వాటాతో జీఈఎఫ్ఎల్ అగ్రస్థానంలో ఉంది. 1,600 డిస్ట్రిబ్యూటర్లు, 3 లక్షలకు పైగా రిటైల్ ఔట్లెట్లు, 60కి పైగా వేర్హౌస్ల బలమైన నెట్వర్క్తో దాదాపు 31.8 కోట్ల మంది వినియోగదారులకు కంపెనీ చేరువైందని ప్రతినిధులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో మార్కెట్ లీడర్షిప్ను కాపాడుకుంటూనే తెలంగాణ, కర్ణాటకలతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లకు తమ నెట్వర్క్ను విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ సొంత ‘రైడ్-హెయిలింగ్’ యాప్!
తెలంగాణలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలం కావడంతో డ్రైవర్లు సమ్మెను విరమించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం, ఆదాయ మార్గాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం కొన్ని సంచలనాత్మక నిర్ణయాలను వెల్లడించింది.సొంత యాప్ రూపకల్పనఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ అగ్రిగేటర్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక 'రైడ్-హెయిలింగ్ యాప్'ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిద్వారా ప్రైవేట్ యాప్ల కమిషన్ల భారం తగ్గి డ్రైవర్ల నికర ఆదాయం పెరిగే అవకాశముందని చెప్పారు.2012 తర్వాత తొలిసారిగా ఛార్జీల పెంపురవాణా రంగ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2012 తర్వాత మొదటిసారిగా ఆటో ఛార్జీల సవరణకు ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ఆమోదం తెలిపింది. కొత్త ఛార్జీలకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.ఈవీ కన్వర్షన్కు రూ.1.50 లక్షల సాయంహైదరాబాద్లో కాలుష్య నియంత్రణతో పాటు ఇంధన భారాన్ని తగ్గించేందుకు డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు (రెట్రోఫిట్టింగ్) ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు.బైక్ ట్యాక్సీలు.. సంక్షేమంపై స్పష్టతవాణిజ్య అవసరాలకు మాత్రమే ఉపయోగించే ‘పసుపు రంగు నంబర్ ప్లేట్’ ఉండే ద్విచక్రవాహనాలను మాత్రమే బైక్ ట్యాక్సీలుగా అనుమతించే అంశంపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, ఎన్నికల హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
తండ్రి లేదా తాతలు, ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తికి సంబంధించి ఒరిజినల్ సేల్ డీడ్ (క్రయపత్రం) లేకపోవడం, చట్టబద్ధమైన విల్లు రాయకుండానే వారు మరణించడం భారతీయ కుటుంబాల్లో తరచూ ఎదురయ్యే ప్రధాన సమస్య. ఇటువంటి సందర్భాల్లో చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను ఎలా నిరూపించుకోవాలి? ఆ ఆస్తిపై వచ్చే అద్దె ఆదాయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై న్యాయ, పన్ను నిపుణులు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు.యాజమాన్య హక్కుల నిర్ధారణఒరిజినల్ సేల్ డీడ్ పోయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు (ఎఫ్ఐఆర్) చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. అనంతరం రెండు పత్రికల్లో (ఒక ఇంగ్లీష్, ఒక ప్రాంతీయ భాష) బహిరంగ ప్రకటన ఇవ్వాలి.సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి లింక్ డాక్యుమెంట్లు, ‘సర్టిఫైడ్ కాపీ’ పొందాలి. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన గుర్తింపు కలిగి ఉంటుంది.విల్లు లేనందున వారసులందరూ తమ హక్కులను నిరూపించుకోవడానికి తహసీల్దార్ ద్వారా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదా సివిల్ కోర్టు నుంచి సక్సెషన్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి.రెవెన్యూ/మున్సిపల్ రికార్డుల్లో పేరు మార్పిడి (మ్యుటేషన్) చేయించాలి. వారసుల్లో ఎవరైనా తమ వాటాను వదులుకోవాలనుకుంటే ‘రిలీజ్ డీడ్’ రిజిస్టర్ చేయాలి.అద్దె ఆదాయంపై పన్ను బాధ్యతలుఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం, వారసత్వంగా ఆస్తి సంక్రమించినంత మాత్రాన తక్షణమే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. విల్లు లేనప్పుడు వారసులందరూ సమాన వాటాదారులుగా పరిగణించబడతారు. ఆస్తిపై వచ్చే అద్దె ఆదాయాన్ని తమ తమ వాటాల ప్రకారం విభజించి వారి వ్యక్తిగత పన్ను స్లాబ్ల ఆధారంగా ఆదాయపు పన్ను రిటర్నులో చూపించాలి. అద్దె ఆదాయంపై చట్టంలోని సెక్షన్ 24(a) కింద 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ (మరమ్మతులు, నిర్వహణ నిమిత్తం), చెల్లించిన మున్సిపల్ పన్నుల మినహాయింపు లభిస్తుంది. ముందస్తుగా ఈ చట్టపరమైన పత్రాలను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆస్తి విక్రయాలు, బ్యాంక్ రుణాలు లేదా కుటుంబ వివాదాలు రాకుండా అరికట్టవచ్చని చట్ట నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు!
ఫ్యామిలీ
ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు!
ఒక చోట చెట్ల వేర్లు వంతెనలుగా మారుతాయి. మరొక చోటు నీటిపై తేలుతున్న ద్వీపాలు కనిపిస్తాయి. ఇంకొక చోటు పూలతో నిండిన లోయలు, ఆకాశాన్ని తాకిన సరస్సులు, వర్షం వచ్చినప్పుడు రంగులు మార్చుకునే మైదానాలు, లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉంటాయి.ఈ ఐదు ప్రదేశాలు అలాంటి ప్రకృతి అద్భుతాలే. మేఘాలయలోని సజీవ వేర్ల వంతెనల నుంచి మహారాష్ట్రలోని కాస్ పీఠభూమి వరకు ప్రతి ప్రదేశంలో ప్రకృతి మనకు కొత్త రూపంలో కనిపిస్తుంది.త్సో మోరీరి సరస్సులడఖ్ అంటే చాలా మందికి ప్యాంగాంగ్ గుర్తొస్తుంది. కానీ చాంగ్థాంగ్లో ఉన్న త్సో మోరీరి ఒక ప్రశాంతమైన అనుభవాన్ని ఇస్తుంది. సుమారు 4,500 మీటర్ల ఎత్తులో, చుట్టూ కొండల మధ్య నీలం రంగులో విస్తరించిన ఈ సరస్సు ఒక పెద్ద ప్రకృతి చిత్రంలా కనిపిస్తుంది.లేహ్ నుంచి త్సో మోరీరి వైపు ప్రయాణం చేస్తుంటే భూదృశ్యం పూర్తిగా మారిపోతుంది. రాళ్లు, గడ్డి మైదానాలు, దూరంగా కనిపించే హిమ శిఖరాల మధ్య చివరికి సరస్సు కనిపించిన క్షణం మర్చిపోలేని దృశ్యంగా మిగిలిపోతుంది. కోర్జోక్ గ్రామం, కోర్జోక్ మఠం, సరస్సు చుట్టూ తిరిగే వలస పక్షులు ఈ ప్రదేశంలో ప్రత్యేక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చాంగ్పా సంచార జీవన విధానాన్ని కూడా చూసే అవకాశం లభిస్తుంది.నీళ్లపై తేలే జీవితంమణిపూర్లోని లోక్టక్ సరస్సును మొదటిసారి చూసినప్పుడు అది ఒక పెద్ద సినిమాటిక్ సీన్లా, ఒక కొత్త సముద్రంలా అనిపించవచ్చు. కానీ దగ్గరగా చూస్తే ఆ నీళ్లపై చిన్న చిన్న తేలియాడే ద్వీపాలు కనిపిస్తాయి. వీటిని ఫుమ్డీలు అంటారు. వాటిపై ఇళ్లు, జీవనం, చేపల వేట అన్నీ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపిస్తుంది.ఇంఫాల్ నుంచి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్టక్, ఈశాన్య భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు. అదే సరస్సులో కీబుల్ లాంజోవా జాతీయ ఉద్యానవనం ఉండటం మరో అద్భుతం. ప్రకృతి, నీరు, జీవన విధానం కలిసి ఒక చిత్రంలా కనిపించే అందమైన ప్రదేశం ఇది.మేఘాలు నివసించే లోయనాగాలాండ్, మణిపూర్ మధ్య ఉన్న జుకోవ్ లోయను చూస్తే భూమిపై ఒక పచ్చని సముద్రం పరుచుకున్నట్టు అనిపిస్తుంది. సుమారు 2,452 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లోయలో సీజనల్ పూలు, వెదురు తోటలు, చిన్న చిన్న సెలయేర్లు అందంగా ఉంటాయి.హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు పడితే ముందుగా నాగాలాండ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈశాన్య భారతదేశపు భూదృశ్యం మెల్లిగా మారుతుంది. నాగాలాండ్ కొండలు దగ్గరవుతున్న కొద్దీ రోడ్డు ప్రయాణంలోనే ప్రకతి తన రంగులను మార్చుకుంటూ వస్తుంది.జుకోవ్లో ఒక రోజు గడపడం అంటే కేవలం ట్రెక్కింగ్ అనుభవం మాత్రమే కాదు. మేఘాల లోయలో నిలిచిపోయిన సమయం, గాలిలో వెదురు ఆకుల శబ్దం, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ కలిసి ఒక అందమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎండాకాలంలో కనిపించే ప్రత్యేక జుకోవ్ లిల్లీ ఈ ప్రదేశానికి మరో గుర్తింపు ఇస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు గమ్యస్థానాలకు వెళ్లే మార్గం అనేది గమ్యస్థానాన్ని బట్టి మారుతుంది. మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలకు మీరు గువాహటి, ఇంఫాల్, దిమాపూర్ నుంచి చేరుకోవచ్చు. లడఖ్ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి లేహ్ చేరుకుని, అక్కడి నుంచి చాంగ్థాంగ్ వైపు రోడ్డు ప్రయాణం చేసి వెళ్లవచ్చు. ఈ ప్రయాణం చాలా మందికి నచ్చుతుంది. కాస్ పీఠభూమికి పుణే లేదా సతారా మార్గంలో వెళ్లడం అనుకూలంగా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలులివింగ్ రూట్ బ్రిడ్జ్లు అనేవి మేఘాలయలోని ఖాసీ, జైంటియా సామాజిక వర్గాల ప్రజలు ప్రకృతితో కలిసి పెంచిన సజీవ నిర్మాణాలు.లోక్టక్ సరస్సు అనేది ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇందులో కనిపించే ఫుమ్డీలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.జుకో లోయ అనేది నాగాలాండ్, మణిపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లోయ. సీజనల్ పూలతో పాటు జుకోవ్ లిల్లీకి ప్రసిద్ధి.త్సో మోరీరి చాంగ్థాంగ్ ప్రాంతంలో సుమారు 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన, ఎత్తైన ప్రాంతంలోని సరస్సు.కాస్ పీఠభూమి అనేది పశ్చిమ కనుమల్లోని జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ పీఠభూమి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.దక్షిణాది పూల లోయమహారాష్ట్రలోని సతారా దగ్గర ఉన్న కాస్ పీఠభూమిని మహారాష్ట్రలోని పూల లోయ అని కూడా పిలుస్తారు. వర్షాకాలం తరువాత ఈ పీఠభూమిపై వందల రకాల పూలు ఒకేసారి విరిసి, భూమి మొత్తం రంగుల తివాచీలా మారుతుంది. 1200 మీటర్ల ఎత్తులో ఉన్న కాస్లో 850 కిపైగా పూల జాతి మొక్కలు ఉంటాయి.హైదరాబాద్ నుంచి పూణే వైపు ప్రయాణం చేసి, అక్కడి నుంచి సతారా మార్గంలో సాగాల్సి ఉంటుంది. పశ్చిమ కనుమల మధ్య సాగే ఈ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది. ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య పూల సీజన్ లో ఈ పీఠభూమి పూర్తిగా మారిపోతుంది. దగ్గరలోని కాస్ సరస్సు, బమ్నోలి, ఠోసేఘర్ జలపాతాలు, సజ్జన్ గడ్ లాంటి ప్రదేశాలు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణలుగా మిగిలిపోతాయి.ఏం తినాలి?మేఘాలయలో స్థానిక ఖాసీ వంటకాలు, మణిపూర్లో అన్నంతో తయారు చేసే సంప్రదాయ వంటకాలు, నాగాలాండ్లో స్థానిక మాంసాహార వంటకాలు, లడఖ్లో తుక్పా, మోమోలు, మహారాష్ట్రలో కంది పెఢా, పిట్లా, ఇతర స్థానిక మహారాష్ట్ర వంటకాలు మీ ప్రయాణానికి రుచికరమైన అనుభూతిని ఇస్తాయి.వేర్లతోనే వంతెనలు మేఘాలలో ఖాసీ ప్రజల జీవన విధానం ప్రకతితో మమేకమైన జీవన విధానం. దీనికి సాక్షాలే సజీవ వేర్ల వంతెనలు. ఫికస్ ఎలాస్టికా చెట్ల వేర్లను సంవత్సరాల పాటు పెంచి, నది రెండు వైపుల కలిసేలా తయారు చేసిన ఈ వంతెనలు కాంక్రీట్ నిర్మాణంలా బలంగా ఉంటాయి. కొన్ని వంతెనలు వందేళ్ల పాటు నిలిచి ఉన్నాయని మేఘాలయ పర్యాటక శాఖ చెబుతుంది.నాంగ్రియాట్, సోహ్రా, మాలినాంగ్ ప్రాంతాల్లో ఇలాంటి వంతెనలను చూడవచ్చు. పచ్చని అడవుల్లో నడుస్తుంటే కింద ప్రవహిస్తున్న నీటి మధ్య వేర్లు కలిసి వంతెనలా మారడం చూస్తే, మనిషి, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం అవుతుంది.ఎక్కడ ఉండాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్ల సమీపంలో గ్రామీణ హోమ్స్టేలు, లోక్టక్ సరస్సు వద్ద సరస్సు ఒడ్డున ఉండే వసతి సౌకర్యాలు, జుకో లోయ ప్రయాణంలో పర్వత రహదారులు కనిపించే వసతి ప్రదేశాలు బాగుంటాయి.త్సో మోరీరి సమీపంలోని కొర్జోక్లో అతిథి గృహాలు, క్యాంపులు అందుబాటులో ఉంటాయి. కాస్, సతారా ప్రాంతంలో హోటళ్లు, హోమ్స్టేలు ఉంటాయి. ప్రతీ గమ్యస్థానంలో బస చేయడం కూడా ఒక జ్ఞాపకంగా మారిపోతుంది.ఏం చూడాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్ల మధ్య ప్రవహించే నీరు, లోక్టక్ సరస్సులో తేలియాడే ఫుమ్డీలు, జుకో లోయలో కనిపించే సీజనల్ పూలు, త్సో మోరీరి నీలిరంగు సరస్సు, కాస్లో విరబూసే సీజనల్ పువ్వులుం ఈ ఐదు గమ్యస్థానాల్లో మీరు ఎక్కడా ప్రయాణ అనుభూతిని మిస్ అవరు. ఈ గమ్యస్థానాలను వేగంగా చుట్టేయాలని కాకుండా ప్రశాంతంగా ఆస్వాదించడానికి ్రపాధాన్యత ఇవ్వండి.సందర్శనీయ ప్రదేశాలుఈ ఐదు ప్రదేశాలలో ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని ఇస్తుంది. మేఘాలయలో మనిషి చేతులతో పెంచిన వేర్ల వంతెనలు ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని కొనసాగించే సందేశాన్ని అందిస్తాయి. అలాగే లోక్టక్లో నీటిపై జీవితం, జుకోలో పూల మధ్య మేఘాలు, త్సో మోరీరిలో ఆకాశం సరస్సులో ప్రతిబింబించడం, వర్షాల తరువాత భూమి పూలనే అక్షరాలుగా మార్చుకుని మాట్లాడటం ఇవన్నీ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలే కదా.యాక్టివిటీస్ఈ ప్రయాణంలో రూట్ బ్రిడ్జ్పై నడవడం, లోక్టక్ సరస్సులో తేలియాడే ప్రకతి దశ్యాలను చూడటం, జుకో లోయలో మేఘాల మధ్య నడవడం, త్సో మోరీరి సరస్సు తీరంలో పర్వతాల ప్రతిబింబాలను ఆస్వాదించడం, కాస్లో సీజనల్ పూల మధ్య ప్రకృతిని గమనించడం ఇవన్నీ ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుఐదు రోజుల ట్రిప్లో బడ్జెట్ అనేది గమ్యస్థానాన్ని బట్టి మారిపోతుంది. హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణించడం, స్థానిక రవాణా, బస, ఆహారం అన్నీ కలిపి బడ్జెట్ ప్రయాణానికి సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చు అవ్వొచ్చు.సాధారణ స్థాయి ప్రయాణ బడ్జెట్తో వెళ్తే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు, ప్రత్యేకమైన ప్రయాణ అనుభవానికి అయితే రూ.70,000కు పైగా ఖర్చు కావచ్చు. త్సో మోరీరి, జుకో లోయ, లివింగ్ రూట్ బ్రిడ్జ్ల వంటి ప్రాంతాల్లో స్థానిక రవాణా, బస ఆధారంగా బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.బస విషయానికి వస్తే ఒక్క రాత్రికి రూ.1,000–4,000 మధ్యలో బడ్జెట్ పెట్టుకోవడం మంచిది. ప్రీమియం హోటళ్లకు మరింత ఖర్చు కావచ్చు. ఆహారం కోసం రోజుకు సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ రుచికి, ఎంపికకు అనుగుణంగా ఈ ఖర్చులు మారుతాయి.- ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుఇవి కూడా చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా?
ధర్మవాక్కు..! అతడి మరణాన్ని ముందే చెప్పిన అయోధ్య రాజు!
పూర్వం అయోధ్యను అనరణ్యమహారాజు పాలించేవాడు. ఆ రోజులలో రావణుడు తనకు యక్ష కిన్నర కింపురుషాదులలో ఎవరి వలననూ మరణం కలగకుండా బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు. ఆ బలంతో రాజులందరినీ పరాజితులను చేసి, అవమానపరచి ఆనందిస్తున్నాడు. అది తెలిసి, ముందుగానే లొంగిపోయి ప్రాణం రక్షించుకున్నారు కొందరు.అయోధ్యను పాలించిన అనరణ్యమహారాజు మాత్రం రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ‘పూటకొకమాటు ఆకలిదప్పులతో అల్లాడే నరుల సేనను నా సైన్యం వేసే శరసమూహజ్వాలల దాహాన్ని తీర్చడానికి తెచ్చావా?’ అని హాస్యమాడాడు రావణుడు. ఇరువురికీ ముఖాముఖి జరిగిన యుద్ధంలో చివరన సారథిని కూల్చి, అనరణ్యమహారాజును రథహీనుడిని చేసి నేలమీద పడేట్లు చేశాడు. ‘మృత్యువు కూడా నా దగ్గరకు రావడానికి భయపడుతుంది. అలాంటిది నువ్వెంత? ఓడిపోయానని ఒప్పుకో, వదిలేస్తాను!’ అన్నాడు. ఒప్పుకోకుండా రావణుడి చేతిలో వీరమణం పొందాడు. అయితే, మరణానికి ముందు, ‘ఎప్పటికైనా నా వంశంలో పుట్టిన వీరుడి చేతిలోనే నీవు మరణం పొందుతావు!’ అన్నాడు. ఆ మాటలకు నవ్విన రావణుడితో అనరణ్యమహారాజు ఇంకా ఇలా అన్నాడని కంకంటి పాపరాజు రచించిన ‘శ్రీమదుత్తర రామాయణం’ తృతీయాశ్వాసంలోని ఈ క్రింది పద్యం చెబుతోంది:చ. పురుషుడు కర్మసంగమున బొందు సుఖంబులు దుఃఖ మెవ్వరెవ్వరికి విరోధముల్ సలుపు వా రిది దైవవశంబు దీనగాతరతవహింప నే గనక దానమఖాధ్యయనాది కర్మముల్వొరసితి నేని బల్కు పొలివోవక నట్లగుగాక యంచనన్.‘మనిషి చేసే పనులను బట్టి సుఖదుఃఖాలు ఉంటాయి. ఎవరూ ఎవరికీ విరోధులు కారు. దైవం జరిపించే విధంగా జరిగేవే అన్నీ. నేనే గనుక దానధర్మాధ్యయనాది పుణ్యకర్మలను నిష్ఠగా చేసినవాడనైతే నా మాట అక్షరం పొల్లుపోకుండా జరుగుతుంది!’ అన్నట్లుగానే రావణుడి మరణం అయోధ్యను పాలించిన శ్రీరాముడి వలన జరిగింది. ధర్మబద్ధమైన జీవనం సాగించే వ్యక్తికి కష్టం కలిగి మాట్లాడే మాట తప్పక జరుగుతుందని దీనివలన అర్థమౌతుంది.– భట్టు వెంకటరావు
పాండవుల ధనుస్సులు, శంఖాల పేర్లు
మహా భారత యుద్ధంలో పాండవులు, ముఖ్యంగా యుద్ధానికి దిశ, దశ చూపిన శ్రీ కృష్ణ పరమాత్మ తదితరులు ఉపయోగించిన ధనుస్సులు, శంఖాల పేర్లు మీకు తెలుసా...? శ్రీ కృష్ణుని ధనుస్సు పేరు శారంగం...శంఖం పేరు పాంచజన్యంధర్మరాజు ధనుస్సు పేరు మహేంద్ర... శంఖం పేరు అనంత విజయం, భీముని ధనుస్సు పేరు వాయువ్య. అయితే చాలా మంది భీముడు గదతోనే యుద్ధం చేసాడని అనుకుంటారు. ఆ గద పేరు వృకోదర. అంతేకాకుండా భీముడు గొప్ప మల్ల యోధుడు కూడా. కాగా భీముని శంఖం పేరు పౌండ్రం. అర్జునిని ధనుస్సు పేరు గాండీవం. శంఖం పేరు దేవదత్తం. నకులుడి ధనుస్సు పేరు వైష్ణవ శంఖం పేరు సుఘోషం. సహదేవుని ధనుస్సు పేరు అశ్వివ. శంఖం పేరు మణి పుష్పకం. అభిమన్యుని ధనుస్సు పేరు రౌద్ర.ఘటోత్కచుని ధనస్సు పేరు పౌలస్త్రయ.కాగా కురుపితామహుడైన భీష్ముని శంఖం పేరు శైశాంక. ధుర్యోధనుని గద పేరు కౌముది. కర్ణుని ధనుస్సు పేరు విజయ. శంఖం పేరు హిరణ్యగర్భ.– సి.ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు
దృష్టి కొద్దీ సృష్టి!.
వేదాంత దృష్టిలో చూస్తే, సృష్టికి స్వతహాగా మంచి, చెడు అనేవి లేవు. అది ఒక ఖాళీ కాన్వాస్ లాంటిది. మనం ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే, ప్రపంచం మనకు ఆ రంగులోనే కనిపిస్తుంది. అద్దం మీద దుమ్ము పడితే మన ముఖం అందులో స్పష్టంగా కనిపించదు. అలాగే, మనస్సు అనే అద్దం మీద ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు’ అనే దుమ్ము చేరినప్పుడు ఈ ప్రపంచంలోని సౌందర్యం, మంచితనం మనకు కనిపించవు.మహాభారతంలో దుర్యోధనుడికి లోకంలో ఒక్క మంచివాడు కూడా కనిపించకపోవడం, ధర్మరాజుకు ఒక్క చెడ్డవాడు కూడా దొరకకపోవడం కేవలం ఒక కథ కాదు. ధర్మరాజు మనస్సు దయ, క్షమ, సత్యం, నిష్కామంతో నిండి ఉంది. అతని చిత్తం స్వచ్ఛంగా ఉంది. అందుకే ఆయనకు ప్రతి మనిషిలోనూ ఏదో ఒక సుగుణం కనిపించింది. చివరకు తనలో ఎక్కడో దాగి ఉన్న చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూసుకుని, తనకంటే చెడ్డవారు లేరని అంగీకరించగలిగాడు. జగత్తు అనేది మన మనస్సుకు ప్రతిబింబం మాత్రమే అన్న పరమ సత్యాన్ని ఈ ఘట్టం తేటతెల్లం చేస్తుంది. ఈ ‘ఆత్మ పరిశీలన’ ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు. మనకు ఎదుటివారిలో కేవలం లోపాలే కనిపిస్తున్నాయంటే, లోపం వారిలో లేదు, చూసే మన దృష్టిలో ఉందని గ్రహించాలి.మంచిని నిర్మించడం ఒక సుదీర్ఘ ప్రక్రియ. దానికి వనరులు, సమయం, అధికారం, వ్యవస్థల మద్దతు, చాలా మంది సహకారం కావాలి. ఒక సామాన్యుడు ఒంటరిగా ఒక గొప్ప వ్యవస్థను రాత్రికి రాత్రే నిర్మించలేక పోవచ్చు. చెడును నిరసించడం ఒక తక్షణ బాధ్యత. దీనికి వనరులు అక్కర్లేదు. కేవలం నైతిక బలం, ‘ఇది తప్పు‘ అని చెప్పే ధైర్యం, నిజాయితీ ఉంటే చాలు. ఒకరు ధైర్యంగా గొంతెత్తితే, అది ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలిస్తుంది. ఆ చెడుకు అక్కడితో ఒక అడ్డుకట్ట పడుతుంది.భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్లు కర్మయోగి అన్నింటినీ సమానంగా చూస్తాడు. ఎవరైనా తప్పు చేసినా, వారి పరిస్థితులను అర్థం చేసుకుని క్షమించగలగడం ధర్మరాజు లక్షణం. అది అంతర్గత శాంతికి మార్గం. ప్రపంచాన్ని మార్చడం మన చేతుల్లో లేదు, కానీ ప్రపంచాన్ని చూసే మన ‘దృష్టిని‘ మార్చుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం దానంతట అదే మారుతుంది. లోపాలను వెతికే దుర్యోధనుడి దృష్టి నుండి, గుణాలను చూసే ధర్మరాజు స్థాయికి మన మనస్సును ఎదిగేలా చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం.– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
అంతర్జాతీయం
భారత్కు 150 మంది పాక్ వధువులు
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, వాఘా-అటారీ సరిహద్దు మూసివేత తదితర పరిణామాల తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వివాహాలు వాయిదా పడిన 150 మందికి పైగా పాకిస్థానీ సింధీ వధువులు ఎట్టకేలకు తమ పెళ్లిళ్ల కోసం భారత్ చేరుకున్నారు. భారత యువకులతో నిశ్చితార్థం చేసుకున్న వీరు, నేరుగా కాకుండా ఇతర దేశాల మీదుగా విమాన మార్గంలో దేశంలోకి అడుగుపెట్టారు.సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా చిక్కుకుపోయిన వీరికి, వారి బంధువులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక షరతులతో కూడిన వీసాలు జారీ చేసిందని కమ్యూనిటీ నేత రాజేష్ ఝంబియా ఆదివారం తెలిపారు. ‘వారి సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వధువులు, దాదాపు 450 మంది బంధువులు మస్కట్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాల మీదుగా కనెక్టింగ్ విమానాల ద్వారా మాత్రమే భారత్ చేరుకోవాలని కేంద్రం నిబంధన విధించింది’ అని ఆయన పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు.గతంలో వాఘా-అటారీ సరిహద్దు గుండా వీసా ప్రక్రియ, ప్రయాణాలు సులభంగా ఉండటంతో పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్కు చెందిన కుటుంబాలు భారతీయులతో వివాహ సంబంధాలు కుదుర్చుకునేవి. అయితే జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన భారీ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించడంతో పరిస్థితి మారిపోయింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించి, వాఘా-అటారీ సరిహద్దును మూసివేసింది. దీంతో నాగ్పూర్, రాయ్పూర్, జోధ్పూర్, పుణె తదితర నగరాల్లో జరగాల్సిన సుమారు 150 వివాహాలు నిలిచిపోయాయని ఝంబియా వివరించారు.ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయా కుటుంబాలు పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ ఘోట్కిలోని ప్రసిద్ధ హిందూ మత క్షేత్రమైన షాదానీ దర్బార్ అధిపతి సంత్ యుధిష్ఠిర్లాల్ షాదానీని ఆశ్రయించాయి. ఆలయ యాజమాన్యం కేంద్ర హోం మంత్రిత్వ శాఖను (ఎంహెచ్ఏ) అభ్యర్థించడంతో, ప్రత్యేక విమాన ప్రయాణ షరతులతో కూడిన వీసాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫలితంగా, ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 150 మంది వధువులు భారత్ చేరుకున్నారని, ఇందులో 15 మంది నాగ్పూర్లో వివాహం చేసుకోనున్నారని ఝంబియా పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 300 మంది పాకిస్థానీ సింధీ మహిళలు సైతం వీసాల కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు.ఇది కూడా చదవండి: గినియాలో విషాదం: చెత్త కుప్ప కూలి 30 మంది మృతి
బంగ్లాదేశ్: హిందూ కుటుంబం కేసులో షాకింగ్ విషయాలు
ఓ కుటుంబంలోని అందరి ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంటి తలుపులు లోపలికి మూసివేసి ఉన్నాయి. తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కనిపించిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. అయితే దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత షాక్కు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ రంగ్పూర్లోని దాస్పారా ప్రాంతంలో నివసించే రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్ (12) మృతదేహాలు ఇంట్లోనే చెల్లాచెదురుగా పడి ఉన్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చనిపోయింది హిందూ కుటుంబం కావడంతో.. మత విద్వేష దాడా? అనే కోణంలోనూ తీవ్ర చర్చ జరిగింది. అయితే.. కారణం అది కాదని పోలీసులు తేల్చారు. అంతేకాదు హత్యల తర్వాత కూడా నిందితులు గంటల పాటు అదే ఇంట్లో ఉండటం, అక్కడే తినడం, స్నానం చేయడం వంటి విషయాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.అసలు ఏం జరిగింది?మొదట ఈ ఘటనను దోపిడీకి సంబంధించిన హత్య, మత విద్వేష దాడులా? అనే కోణంలో పోలీసులు అనుమానించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, దోపిడీ జరిగినట్లు కనిపించే పరిస్థితులు ఆ కోణంలో దర్యాప్తుకు దారితీశాయి. అయితే ఆధారాలు సేకరించే కొద్దీ అసలు కథ బయటపడింది.గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి పొరుగింటి మార్గం ద్వారా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ‘యాబా’ అనే మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నారు. ఆ శబ్దాలు విని పైకి వెళ్లిన గణపతి వారిని ప్రశ్నించడంతో.. తమను గుర్తిస్తాడనే భయంతో ఆయనను గొంతు నులిమి హత్య చేశారు. చక్రవర్తి ఎంతకీ కిందకు రాకపోవడంతో.. ఆ వెనకాలే వచ్చిన ఆయన భార్య, కుమార్తె, కుమారుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.గణపతి చక్రవర్తి ఫ్యామిలీ (పాత ఫొటో)గురువారం ఈ ఘోరం జరగ్గా.. ఈ కేసులో ముఘ్దో, సిద్ధార్థ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.హత్యల తర్వాత కూడా ఇంట్లోనే..ఈ ఘటనలో అత్యంత షాకింగ్ అంశం.. హత్యలు చేసిన తర్వాత నిందితులు వెంటనే పారిపోలేదని దర్యాప్తులో తేలడం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఆ ఇంట్లోనే ఆరు నుంచి ఏడు గంటల పాటు ఉన్నారు. ఇళ్లంతా కలియ దిరిగారు. ఖర్జూరాలు, దోసకాయలు తిన్నారని.. స్నానం చేశారని, ఆపైనా మత్తు పదార్థం తీసుకున్న ఆనవాళ్లు లభించాయని చెప్పారు.అంతేకాదు.. దోపిడీ జరిగినట్లు కనిపించేందుకు ఇంట్లో వస్తువులను చిందరవందర చేసినట్లు, ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల మొబైల్ ఫోన్లపై కూడా ఆధారాలు తొలగించే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.హిందువుల భద్రతపై మళ్లీ చర్చఈ ఘటనతో బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలోనూ అక్కడ హిందూ సమాజంపై దాడులు, దేవాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనారిటీలపై జరిగిన హింసాత్మక ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గతంలో తెలిపారు. అయితే తాజా ఘటన గంజాయి బ్యాచ్ పనిగా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు రంగ్పూర్ తాజా ఘటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: హ గదీ భారత్ దెబ్బంటే..
గినియాలో విషాదం: చెత్త కుప్ప కూలి 30 మంది మృతి
కొనాక్రీ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియా రాజధాని కొనాక్రీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఇక్కడి ఒక డంపింగ్ యార్డులోని భారీ చెత్త కుప్ప ఒక్కసారిగా కుప్పకూలి సమీపంలోని నివాసాలపై పడటంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.రాయిటర్స్ కథనం ప్రకారం.. కొనాక్రీలోని దార్ ఎస్ సలామ్ ప్రాంతంలో ఉన్న ల్యాండ్ఫిల్లో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్త దిబ్బలు సమీపంలోని ఇళ్లపై విరిగిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు ఒక అపార్ట్మెంట్తో పాటు సమీపంలోని పలు నివాసాలు పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయాయి.సమాచారం అందుకున్న గినియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఏఎన్జీయూసీహెచ) సిబ్బంది, స్థానికులు ఎక్స్కవేటర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ దుర్ఘటనలో తన ఐదుగురు పిల్లలను కోల్పోయినట్లు స్థానిక బాధితుడు సిరే డియాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డంపింగ్ యార్డు కూలే ప్రమాదం ఉందని గుర్తించిన ప్రభుత్వం, ముందస్తుగానే స్థానికులను ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పలువురు నివాసితులు అక్కడే ఉండిపోవడంతో ప్రాణనష్టం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి అమదౌ బార్ సందర్శించి బాధితులకు సానుభూతి తెలిపారు. ప్రజలు సంయమనం పాటిస్తూ, సహాయక చర్యలకు సహకరించాలని కోరారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ల్యాండ్ఫిల్ను శాశ్వతంగా మూసివేసి, వ్యర్థాలను నగర శివార్లకు తరలిస్తామని ప్రాదేశిక పరిపాలన శాఖ మంత్రి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బాక్సైట్ నిల్వలు, అపారమైన ఇనుప ఖనిజ సంపద ఉన్నప్పటికీ, గినియాలో మౌలిక సదుపాయాల కొరత, పేదరికం తీవ్రంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలు తెలియజేస్తున్నాయి.
మిడిల్ఈస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఇరాన్ నిర్ణయంపై ఉత్కంఠ
దశాబ్దాలుగా సాగుతున్న వైరం.. ఎప్పుడూ ప్రత్యర్థులుగా కనిపించిన దేశాలు.. ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తాయా? మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లు, ఇరాన్పై పెరుగుతున్న ఆంక్షలు, ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమిలో చేరాలని ఇరాన్కు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్-సౌదీ అరేబియా.. ఈ రెండు పేర్లు వినగానే గుర్తొచ్చేది ఆధిపత్య పోరు. గల్ఫ్ ప్రాంతంలో ప్రభావం కోసం ఇరు దేశాల మధ్య ఏళ్లుగా సాగుతున్న పోటీ. యెమెన్లో హౌతీల అంశం నుంచి సిరియా, లెబనాన్ వరకు పలు పరిణామాల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. అలాంటి రెండు దేశాలు భద్రతా వేదికపై దగ్గరవుతాయా? అనే ప్రశ్న ఇప్పుడు మిడిల్ఈస్ట్లో కొత్త చర్చకు తెరతీసింది. ఒకప్పుడు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకున్న దేశాలు.. ఇప్పుడు ఒకే భద్రతా గొడుగు కిందకు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రభావం, ప్రాంతీయ భద్రతా పరిణామాలు, మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఈ పరిణామం మిడిల్ఈస్ట్ భవిష్యత్ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది.మక్కా కూటమిలోకి ఇరాన్?సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రక్షణ సహకారం, వ్యూహాత్మక సమన్వయం, సంయుక్త భద్రతా చర్యలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని ప్రకటించారు. అయితే ఈ కూటమి ఏర్పడిన కొద్ది రోజులకే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. మక్కా ఒప్పందంలో చేరాలని ఇరాన్కు ఆహ్వానం అందినట్లు ‘అల్ మయదీన్’ నివేదించింది. ఇరాన్ పార్లమెంట్కు అనుబంధంగా ఉన్న ఖానే మెల్లత్ వార్తా సంస్థ అధిపతి మెహదీ రహీమి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే ఇరాన్ ప్రభుత్వం గానీ, సౌదీ, పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలు గానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.ట్రంప్ ప్రభావమేనా?ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం ఉందా? అన్న చర్చ కూడా మొదలైంది. ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెరగడం, ఆంక్షల భయం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రాంతీయ దేశాలు తమ భద్రతా వ్యూహాలను పునరాలోచిస్తున్నాయి. ఇప్పటివరకు మిడిల్ఈస్ట్లో భద్రతకు అమెరికా కీలక శక్తిగా ఉండేది. అయితే ఇటీవలి పరిణామాల్లో ప్రాంతీయ దేశాలే తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలోకి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మక్కా కూటమి కూడా ఇదే దిశలో మరో అడుగుగా భావిస్తున్నారు. శత్రువుల మధ్య కొత్త స్నేహమా?ఇరాన్ నిజంగా మక్కా కూటమిలో చేరితే అది సాధారణ పరిణామం కాదు. ఎందుకంటే ఈ కూటమిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియాతో ఇరాన్కు గతంలో తీవ్ర విభేదాలున్నాయి. 2016లో తెగిపోయిన దౌత్య సంబంధాలు 2023లో చైనా మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైనప్పటికీ.. అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, సౌదీ ప్రయోజనాల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సంబంధాలకు సవాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే రక్షణ వేదికపైకి రావడం జరిగితే.. అది మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో భారీ మార్పుగా మారే అవకాశం ఉంది.ఇరాన్ లెక్కలు ఏంటి?ఇరాన్ మాత్రం ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. ప్రాంతీయ దేశాలు తమ స్వంత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తనకు అనుకూలమైన కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితిలో టెహ్రాన్ ఉంది.అయితే.. మక్కా కూటమిలో చేరడం ద్వారా ఇరాన్కు లాభమా? లేదంటే తన పాత మిత్ర, ప్రత్యర్థి సమీకరణాలను మార్చుకోవాల్సి వస్తుందా? అన్నది కీలక ప్రశ్న.ఇరాన్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలు నిజంగా చేతులు కలిపితే.. అది ట్రంప్ హయాంలో మిడిల్ఈస్ట్లో అతిపెద్ద దౌత్య మలుపుగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాలో కాల్పులు.. భారతీయుడి దుర్మరణం
జాతీయం
సోషల్ మీడియాలో ‘సీజేపీ’ సౌరవ్ దాస్ అడ్రస్.. వారికి సమన్లు
న్యూఢిల్లీ: తన అనుమతి లేకుండా నివాస చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్ దాస్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో యాంకర్ అభిజిత్ అయ్యర్-మిత్రతో పాటు పలు మీడియా ప్లాట్ఫాంలకు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.వ్యక్తిగత సమాచారం బయటపెట్టారన్న ఆరోపణలపై మధ్యంతర రక్షణ కోరుతూ దాస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. దాస్ నివాస చిరునామా ఉన్న పోస్టులను ఎక్స్ తొలగించినట్లు కోర్టుకు తెలియజేశారు. న్యాయమూర్తి సచిన్ దత్తా నోటీసులు జారీ చేసి, ప్రతివాదులు తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ సెప్టెంబర్ 14న జరగనుంది.దాస్ తరఫున సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ వాదిస్తూ.. ‘ది పాంఫ్లెట్’కు చెందిన సిబ్బంది అనుమతి లేకుండా తన క్లయింట్ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించి ఒక వీడియో చిత్రీకరించారని తెలిపారు. అయ్యర్-మిత్ర ఆ వీడియోకు మరిన్ని దృశ్యాలను జత చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారని సిబల్ ఆరోపించారు. ఎక్స్లోని కొన్ని పోస్టుల్లో దాస్ నివాస చిరునామాను ప్రత్యేకంగా పేర్కొన్నారని కూడా ఆయన తెలిపారు.ఎక్స్లో ఇంకా ఉన్నాయా? తన క్లయింట్కు రక్షణ కల్పించాలని కోరుతూ, ఎక్స్ తన విధానం ప్రకారం ఇప్పటికే తొలగించిన పోస్టులను తిరిగి అందుబాటులోకి తీసుకురాకుండా చూడాలని సిబల్ కోర్టును కోరారు. ఎక్స్ తరఫున హాజరైన న్యాయవాది, సంబంధిత లింకులు "ఇకపై అందుబాటులో లేవు" అని కోర్టుకు తెలిపారు. ఈ వాదనను కోర్టు నమోదు చేసింది.‘ది పాంఫ్లెట్’ తరఫు న్యాయవాది కూడా పోస్టులు ఎక్స్లో ఇక అందుబాటులో లేవని తెలిపారు. ఆరోపణలపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వడానికి సమయం కోరారు. 3 రోజుల్లో ప్రతివాదుల వివరాల పత్రం, వ్యాజ్య పత్రాన్ని సవరించుకునేందుకు అనుమతించింది.అయ్యర్-మిత్ర, ‘ది పాంఫ్లెట్’తో పాటు లాబీట్, ‘ది జైపూర్ డైలాగ్స్’, ‘ది సండే గార్డియన్’, గూగుల్ ఎల్ఎల్సీ, ఎక్స్ కార్ప్లను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. తన గోప్యత, గౌరవం, భద్రతకు భంగం కలిగిందని ఆరోపిస్తూ, ప్రతివాదులపై శాశ్వత, తప్పనిసరి నిషేధాజ్ఞలతో పాటు నష్టపరిహారం చెల్లించాలని దాస్ కోరారు.తన అనుమతి లేకుండా తన నివాస చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసి ప్రచారం చేశారని దాస్ తన పిటిషన్లో ఆరోపించారు. తన కచ్చితమైన చిరునామా బయటపడటం వల్ల తనకు, తన నివాసంలో ఉండే ఇతరులకు భద్రతాపరమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.తాను నివసించే నివాస ప్రాంగణంలోకి ‘ది పాంఫ్లెట్’ ప్రతినిధులు ప్రవేశించి, ఇంటి లోపలి భాగాలతో సహా ఆస్తికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారని దాస్ ఆరోపించారు. ఆ దృశ్యాలను తర్వాత ఎక్స్లో పోస్టు చేశారని తెలిపారు.
బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బు
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నిజంగా ఈ ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. అత్యంత పేదరికంలో జీవిస్తూ, భిక్షాటనతో రూపాయి రూపాయి కూడబెట్టి, లక్షలు పోగు జేసింది. కానీ ఏ లాభం? ఆ లక్షలేవీ ఆమెకు అక్కరకు రాలేదు. ఆ ధనాన్ని అనుభవించ కుండానే ఆమె కన్నుమూయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మాండ్యకు చెందిన 68 ఏళ్ల హూర్ (Hoor) అనే వృద్ధురాలు వయోభారంతో వచ్చిన అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. జీవితాంతం భిక్షాటన చేస్తూ గడిపిన ఒక మహిళ ఇంట్లో లక్షల రూపాయల నగదుతో నిండిన సంచులు లభ్యమైన ఘటన సోషల్మీడియాలో వైరల్గా మారింది.అనంతరం స్థానికులు ఆమె అద్దె ఇంటిని తనిఖీ చేయగా, దాదాపు 30కి పైగా గోనె సంచుల్లో నింపి ఉన్న వేలాది నాణేలు, రూ. 10,20,రూ 50 కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. స్థానికులు ఆ డబ్బును లెక్కించగా రూ.8,40,000 (ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు) నగదు చూసి అందరూ దిగ్భ్రాంతి పోయారు.At least 30 cash-filled sacks worth over ₹8 lakhs have been found at the house of a woman in Karnataka who spent all of her life begging. She died yesterday due to an age-related illness. The money was handed over to her brothers. One of the brothers took Rs 6 lakh while the… pic.twitter.com/Q0L89fM8d1— Piyush Rai (@Benarasiyaa) August 24, 2026ఇదీ చదవండి: రోజుకు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్ హూర్ తన సోదరితో కలిసి ఆ అద్దె ఇంట్లో నివసించేవారు. ఇద్దరికీ వివాహం కాలేదు. రెండేళ్ల క్రితమే ఆమె సోదరి కూడా మరణించారు. దీంతో ఈ సొమ్మును హూర్ సోదరులకు అప్పగించారు. ఒక సోదరుడు రూ. 6 లక్షలు తీసుకోగా, మరొక సోదరుడు తన వాటాకి వచ్చిన రూ. 2,40,000 లను స్థానిక మసీదుకు విరాళంగా ఇచ్చారు.ఇదీ చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత : ఎవరీ కేరళ బ్యూటీ
తమిళనాడుకు సుప్రీంకోర్టు షాక్
సాక్షి, ఢిల్లీ: కావేరీ నదీ జలాల విడుదల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీటి వాటా విడుదలలో ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) ముందే లేవనెత్తాలని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కర్ణాటక నుంచి తమకు రావాల్సిన అదనపు నిష్పత్తి నీటి వాటాను విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.వివరాల్లోకి వెళితే.. కావేరీ నీటి నియంత్రణ కమిటీ (CWRC) ఆగస్టు 12 నుండి 15 రోజుల పాటు ప్రతిరోజూ తమిళనాడుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కూడా సమర్థించింది. అయితే వాటా న్యాయపరంగా తమకు దక్కడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ, తమకు దక్కాల్సిన సరైన నిష్పత్తిలో నీరు అందడం లేదని ధర్మాసనానికి తెలిపారు. దురదృష్టవశాత్తూ క్షేత్రస్థాయిలో నీటి విడుదల సక్రమంగా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశాన్ని సంబంధిత అథారిటీ (CWMA) సమావేశంలోనే లేవనెత్తాలని సుప్రీంకోర్టు సూచించింది.గత విచారణలో కర్ణాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ సమర్పించిన నీటి విడుదల వివరాల చార్ట్ను ధర్మాసనం ప్రస్తావించింది. ఆ చార్ట్ ప్రకారం CWMA ఆదేశాల మేరకే తమిళనాడుకు నీటిని విడుదల చేసినట్లు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. దీనిపై వైద్యనాథన్ స్పందిస్తూ, నిష్పత్తి ప్రకారం నీటిని విడుదల చేయడానికి CWMA దిశా నిర్దేశం చేయడం లేదని, దీనివల్ల తమిళనాడులోని రైతులకు తాము ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేకపోతున్నామని, కానీ కర్ణాటక మాత్రం తమ రైతులకు నీటిని ఇచ్చుకుంటోందని వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేస్తూ, ఆ రోజు నాటికి తాజా పరిస్థితిపై నివేదిక (అప్డేటెడ్ స్టేటస్) సమర్పించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది.అంతకుముందు ఆగస్టు 17న జరిగిన విచారణలో కూడా CWMA ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, వర్షపాతం తక్కువగా ఉన్న ఈ సంవత్సరంలో తమకు రావలసిన న్యాయమైన వాటా దక్కడం లేదు. CWRC కేటాయించిన పరిమాణం కంటే, పొరుగున ఉన్న కర్ణాటక విడుదల చేసిన నీటి పరిమాణం చాలా తక్కువగా ఉందని తమిళనాడు తన పిటిషన్లో పేర్కొంది.జూలై 28న జరిగిన CWRC సమావేశంలో జూలై 29 నుండి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినప్పటికీ, జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు బిలిగుండ్లు వద్ద కేవలం 158 నుండి 550 క్యూసెక్కుల లోపే నీరు అందిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని, హారంగి, హేమవతి జలాశయాలలో మొత్తం నీటి నిల్వ 77.537 టీఎంసీలుగా ఉంది. కాబట్టి తమిళనాడుకు చెందాల్సిన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయడానికి కర్ణాటకకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని డ్యామ్ల క్యాచ్మెంట్ ఏరియాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, బిలిగుండ్లు వద్ద తమిళనాడుకు అందాల్సిన నిష్పత్తి నీరు 26.954 టీఎంసీలుగా ఉండాలని పేర్కొంది. దీనితో పోలిస్తే కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కేటాయించిన 4.536 టీఎంసీలు చాలా తక్కువని తమిళనాడు ఆరోపించింది. మొత్తంగా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు ఇవ్వాల్సిన 26.954 టీఎంసీల న్యాయమైన వాటాను పంచుకోవడంలో విఫలమైందని తమిళనాడు ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
అలాగైతేనే విజయ్ టీవీకే ఇండియా కూటమిలో చేరొచ్చు: కాంగ్రెస్
చెన్నై: తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు పార్లమెంట్లో సొంతగా ప్రాతినిధ్యం ఉండాలని, ఆ తర్వాతే ఇండియా కూటమిలో చేరేందుకు ఆ పార్టీని ఆహ్వానిస్తామని టీఎన్సీసీ అధ్యక్షుడు, ఎంపీ బి.మాణిక్కం ఠాగూర్ తెలిపారు. “తమిళగ వెట్రి కళగానికి సొంత ఎంపీలు వచ్చిన తర్వాత వారిని ఇండి కూటమిలో చేరాలని మేము కోరుతాం. ఎంపీలు లేని పార్టీలను పదేపదే ఆహ్వానిస్తూ ఉండలేం. వారికి ఎంపీలు ఉంటేనే ఇండియా కూటమిలో చేర్చుకుంటాం” అని అన్నారు.టీవీకే ఎమ్మెల్యే, సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత శాఖ మంత్రి జగదేశ్వరితో పాటు రెవెన్యూ మంత్రి కె.ఎ.సెంగోట్టయ్యన్ సహా కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలకు ఠాగూర్ స్పందించారు. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ భవిష్యత్ ప్రధానమంత్రి అని, ఆయన ప్రధానమంత్రి పదవికి అర్హుడని టీవీకే నేతలు వ్యాఖ్యానించారు.విజయ్, రాహుల్, కాంగ్రెస్పై ఠాగూర్ వ్యాఖ్యలుఈ వ్యాఖ్యలపై ఠాగూర్ వ్యంగ్యంగా స్పందిస్తూ, “టీవీకే నేతలు ఇప్పటికీ అభిమాన సంఘం తరహాలోనే వ్యవహరిస్తున్నారు. కాబట్టి అభిమాన సంఘం తరహాలో ఉన్న వారిని మీరు మౌనం వహించేలా చేయలేరు” అని అన్నారు. 2029 ఎన్నికల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ముందుకు తెస్తున్న వేళ ఠాగూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత టీవీకేకు మద్దతు తెలుపుతూ లేఖ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అని ఆయన చెప్పారు.“మొదటగా విజయ్ గురించి చెప్పాలంటే, ఆయన పార్టీ 108 స్థానాల్లో గెలిచిన వెంటనే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు కోరుతూ మొదటగా రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన వ్యక్తి విజయ్. కాబట్టి ప్రస్తుతం తమిళగ వెట్రి కళగంలో మంత్రులుగా ఉన్న వారందరికీ ఈ విషయం తెలుసు” అని ఆయన పేర్కొన్నారు.ఇండియా కూటమిలో చేరడంపై టీవీకేఠాగూర్ వ్యాఖ్యలకు స్పందించిన టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి, ఇంధన వనరులు, న్యాయ శాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో ప్రాతినిధ్యం సాధించిన తర్వాత పార్టీ ఇండియా కూటమిలో చేరుతుందని చెప్పారు.“ప్రస్తుతం ఏయే పార్టీలకు ఎంపీలు ఉన్నారో, ఆ పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాతే మేము చేరతాం. ఎంపీలు ఉన్న పార్టీలే ఇండియా కూటమిలో ఉంటాయి” అని కుమార్ అన్నారు.ఎంపీలులేని పార్టీలను కూడా చేర్చుకుంటే ఇండియా కూటమిలో 1,000కు పైగా పార్టీలను చేర్చాల్సి వస్తుందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. “కాబట్టి ఎన్నికల తర్వాత టీవీకేకు ఎంపీలు వచ్చిన వెంటనే మేము కచ్చితంగా ఇండియా కూటమిలో చేరి కలిసి పనిచేస్తాం” అని ఆయన అన్నారు.ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయం సాధించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 118 స్థానాలను ఆ పార్టీ సాధించలేకపోయింది. ఆ తర్వాత వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఐ(ఎం)తో టీవీకే ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకుంది. ఆ రెండు పార్టీలు చెరో 2 స్థానాలు గెలుచుకున్నాయి. వామపక్ష పార్టీలు టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్నాయి.వామపక్ష పార్టీలతో పాటు విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), కాంగ్రెస్తో కూడా టీవీకే పొత్తు కుదుర్చుకుంది. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం ఉంది.ఇదీ చదవండి: 22ఏ బాధితులకు న్యాయం చేసి తీరుతాం.. మంత్రి పొంగులేటి
ఎన్ఆర్ఐ
సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం
సేవను జీవిత పరమార్థంగా, దాతృత్వాన్ని జీవన విధానంగా మలుచుకున్న శోభా రెడ్డి, ప్రసాద్ రెడ్డి దంపతులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. భారత్తో పాటు అమెరికాలోనూ చిన్నారులు, పేద కుటుంబాలు, వెనుకబడిన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.ఇటీవల కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఆహార రవాణా వాహనాల కొనుగోలుకు 25 వేల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. రోజూ సుమారు 15 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే లక్ష్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న వంటశాలకు 2.5 లక్షల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. నెల్లూరు సమీపంలోని వెంకటాచలం వద్ద ఐదు ఎకరాల భూమి సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత పాదరక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రథమ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రారంభించారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పది కేంద్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఆరోగ్య సేవల్లోనూ వారి సహకారం విశేషం.చెన్నైలోని శంకర నేత్రాలయ కోసం అత్యాధునిక మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటుకు 5.5 లక్షల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. దీంతో ఈ యూనిట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నేత్ర వైద్యం, శస్త్రచికిత్సలు అందించనున్నారు. ఇప్పటికే ఏపీలో ఎనిమిది నేత్ర శిబిరాలు నిర్వహించగా, తదుపరి శిబిరాన్ని తమిళనాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రసాద్ రెడ్డి శంకర నేత్రాలయ యూఎస్ఏకు బోర్డు సలహాదారుగా, బ్రాండ్ అంబాసిడర్గా సేవలందిస్తున్నారు. అలాగే, తన సంస్థ లాభాల్లో సుమారు 13 శాతాన్ని ప్రతి ఏడాది డల్లాస్ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా న్యూజెర్సీ సెనెట్, అసెంబ్లీ ఆయనను సత్కరించాయి. శంకర నేత్రాలయం ప్రతిష్ఠాత్మక ‘శంకర రత్న’ పురస్కారంతోనూ ఆయనను గౌరవించనుంది.ప్రసాద్ రెడ్డి సేవా ప్రస్థానంలో తన భార్య శోభా రెడ్డి ప్రోత్సాహం, సహకారం కీలకంగా నిలుస్తున్నాయి. చిన్నారుల సంక్షేమం, విద్య, పోషకాహారం, ఆరోగ్యం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ దంపతులు చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
బ్రిటన్ ప్రధాని సలహాదారుగా ఎన్నారై
లండన్: భారతీయ మూలాలున్న వ్యూహకర్త, మీడియా ఎగ్జిక్యుటివ్ గౌతమ్ రంగరాజన్ను బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. యూకే ప్రధాని ఆయన్ను స్ట్రక్చర్ అండ్ ప్రాసెసెస్ (రాజ్యాంగ వ్యవస్థలు, వ్యవహారాలు)పై ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వార్తా సంస్థ బీబీసీలో వ్యూహకర్తగా పనిచేసిన అనుభవమున్న రంగరాజన్ ఇప్పటికే కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించారని అని యూకే ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. లేబర్ పార్టీ నేత బర్న్హామ్ గత నెల ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన వికేంద్రీకరణ చర్యల్లో భాగంగా మ్యాంచెస్టర్లో ‘నంబర్ 10 నార్త్’ను ప్రారంభించారు. పలు ప్రభుత్వ విభాగాల పునర్వవ్యవస్థీకరణ చేపటాట్టరు.ఎవరీ గౌతమ్ రంగరాజన్?గౌతమ్ రంగరాజన్ (Gautam Rangarajan) బీబీసీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1993లో బీబీసీ రేడియో క్లాసికల్ మ్యూజిక్లో ట్రెయినీ ప్రొడ్యూసర్గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత బీబీసీ వేల్స్, బీబీసీ రేడియోలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో గౌతమ్ రంగరాజన్ గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ పెర్ఫార్మెన్స్గా నియమితులయ్యారు. 2025 ఏప్రిల్ వరకు ఈ పదవిలో కొనసాగారు. గ్రూప్ డైరెక్టర్గా బీబీసీ మొత్తానికి సంబంధించిన వ్యూహరచనకు 10 సంవత్సరాల పాటు బాధ్యత వహించారు.2025లో బీబీసీని వీడిన తర్వాత ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా పనిచేశారు. 2025 జనవరి నుంచి గ్లైండ్బోర్న్లో బోర్డ్ ట్రస్టీగా కూడా కొనసాగుతున్నారు. టెంపుల్ చర్చ్ క్వైర్తో కలిసి ఆయన పాటలు పాడారు. అలాగే పాలీఫోనీతో పాటు వెస్ట్మినిస్టర్ అబ్బే, సెయింట్ పాల్స్ కేథడ్రల్, విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్ గాయక బృందాలతో డిప్యూటీగా కూడా పనిచేశారు. రికార్డింగ్ ప్రొడ్యూసర్గా కూడా ఆయన పనిచేశారు. 2012లో విడుదలైన A Festival of Psalms అనే సీడీకి కూడా ఆయన రికార్డింగ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.చదవండి: విజయ్ పార్టీలో చేరిన యువనేత
చాట్జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్
అమెరికాలో జంట హత్యలు కలకలం రేపాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబాన్ని ఎలా హత్య చేయాలనే విషయాలను ఏఐలో వెతికి మరీ ఈ దురాగతానికి పాల్పడటం మరింత ఆందోళ రేపింది. గోతిక్ నవల (Gothic novel) తరహా కథలు, పాత్రలను రూపొందించడంలో సాయం చేయాలని AI ఛాట్బాట్ను కోరినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.మసాచుసెట్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోని మాసాచుసెట్స్ సబర్బన్ ఏరియాలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్ అర్జున్ అరవింద్, తల్లి సుధా వెంకటేశన్ (45), సోదరుడు సిద్ధార్త్ (14) దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు.Accused killer 17 year old Arjun Aravind of Acton was taken into custody in Wayland overnight and tomorrow he’s expected in adult court charged with murdering his mother and younger brother…his dad was at work when the murders took place #7News pic.twitter.com/ljpT6lNZGR— Steve Cooper (@scooperon7) August 12, 2026 మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన ట్యూటర్ లోపలికి వెళ్లలేక అర్జున్ తండ్రికి సమాచారం అందించారు. తండ్రి ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ‘వెల్ బీయింగ్ చెక్’ చేయాల్సిందిగా కోరారు. పోలీసులు వచ్చి చూడగా తల్లీ కొడుకులిద్దరూ మృతి చెంది ఉన్నారు. ఆక్టన్ ప్రాంతంలోని వారి ఇంట్లోనే ఈ హత్యలు జరిగాయి.నేరం జరిగిన తర్వాత అర్జున్ తన తల్లికి చెందిన హోండా కార్లో పరారైనట్టు పోలీసులు గుర్తించారు. మృత దేహాలపై తీవ్రమైన గాయాలున్నాయనీ, తల్లి మృతదేహం బేస్మెంట్లో, తమ్ముడి మృతదేహం మొదటి అంతస్తులో లభ్యమయ్యాయనీ వెల్లడించారు. దీంతో అర్జున్పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడి, కారు దొంగతనం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాలింపు చర్యల అనంతరం వేలాండ్ (Wayland) ప్రాంతంలోని ఒక పార్కింగ్ లాట్లో కారులో అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు.ఛాట్జీపీటీ వాడకంపై పోలీసుల ప్రకటనఅర్జున్ కొంతకాలంగా విచిత్రమైన ప్రవర్తన కనబరుస్తున్నాడు. కుటుంబాన్ని చంపేందుకు సంబంధించిన ఊహాజనిత కథనాలు, ఆలోచనల కోసం ఇంటర్నెట్, ChatGPTని ఉపయోగించినట్లు విచారణలో తేలిందని మిడిల్సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీసీ నెట్వర్క్ ఏర్పాటు..
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్వర్క్ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు 'ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్'(AAA) మరియు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ(ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లుబొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.నాయకత్వం, నెట్వర్కింగ్కు ప్రాధాన్యంAAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బలమైన నెట్వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
క్రైమ్
కాంగ్రెస్ మహిళా నేతపై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: చెందిన కాంగ్రెస్ మహిళా నేతను ఉద్దేశించి ఆన్లైన్లో మార్ఫింగ్ వీడియోలతో అనుచిత పోస్టులు చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడకు చెందిన ఓ స్టాఫ్ట్వేర్ ఉద్యోగి (30) ఇన్స్ట్రాగామ్లో నకిలీ ఖాతా సృష్టించాడు. గతేడాది అక్టోబర్లో ‘పూరా లోకల్’ పేరుతో ఉన్న ఆ ఖాతా ద్వారా నగరానికి చెందిన ఓ మహిళా నాయకురాలి వీడియోను మార్ఫింగ్ చేసి పోస్టు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని అరెస్టు చేశారు.
పట్టిన దయ్యాన్ని వదిలిస్తా..!
బెంగళూరు: పట్టిన దయ్యాన్ని విడిపిస్తానంటూ మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న నకిలీ స్వామి ఉదంతమిది. చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా మేకనహుడ్లు గ్రామంలో సతీశ్ పత్రి అనే వ్యక్తి స్వామీజీ వేషమెత్తి దయ్యం, భూతం విడిపిస్తానని చెప్పుకుంటున్నాడు. దీంతో కొందరు అతనిని ఆశ్రయించగా, పూజల పేరుతో యువతితో కలిసి చిందులేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దయ్యం వీడాలంటే కోడిని కొరికి రక్తం తాగాలని ఆమెను ఒత్తిడి చేశాడు. ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. కొందరు గ్రామస్థులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఐఏఎస్ అధికారి ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఈడీ సోదాలు
శివాజీనగర(కర్ణాటక): కేపీఎస్సీ ఉద్యోగాల కుంభకోణంలో ఆరోపణలు వచ్చిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్ ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు బెంగళూరు జయమహల్ రోడ్డులోని ఆయన ఇంటి తలుపులు బద్ధలు కొట్టి సోదాలు నిర్వహించారు. ముఖ్యమైన పత్రాలు, కంప్యూటర్ తదితరాలను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. జ్ఞానేంద్రకుమార్ కేపీఎస్సీలో ఎగ్జామ్ కంట్రోలర్గా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో పశు వైద్యాధికారులు, కేఏఎస్ పరీక్షలు కూడా నిర్వహించారు. కేఏఎస్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈడీ సోదాలు మొదలుకాగానే జ్ఞానేంద్రకుమార్ జాడ లేకుండా పోయారు. ఆగస్టు 20న మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు విమానం టికెట్ తీసుకున్నారు. కానీ గంటన్నర ముందుగానే రూ.30,253 చెల్లించి హడావుడిగా మరో విమానం టికెట్ తీసుకుని వెళ్లిపోయారని తెలిసింది.
అంతులేని.. భర్తల క్రూరత్వం
పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని భర్త, అత్త వేధింపులు.. టెక్కీ ఆత్మహత్య. కేజీ బంగారం, రూ.కోటికి పైగా నగదు, వైభవంగా పెళ్లి చేశారు, వారం తిరక్కుండానే వధువు బలవన్మరణం.. ఇలాంటి విషాద ఘటనలు తరచూ సంభవిస్తున్నాయి. కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని చట్టం చెబుతున్నా ఎవరూ పాటించడం లేదు. పైగా మరింత డబ్బు, బంగారం కావాలని సతాయిస్తూ ఆడపిల్లల ఉసురుతీసే భర్తల అఘాయిత్యాలు పెరిగిపోయాయి.బెంగుళూరు: గత నాలుగేళ్లలో రాష్ట్రంలో బెంగళూరుతో సహా వివిధ జిల్లాల్లో 617 మంది మహిళలు వరకట్న భూతానికి బలయ్యారు. రాష్ట్ర మహిళా కమిషన్ 2022 నుంచి 2026 జూన్ వరకు రాష్ట్రంలో మహిళలపై సంభవించిన నేరాల గురించి విడుదల చేసిన నివేదికలో ధనదాహపు భర్తలు, అత్తమామల హింసోన్మాదం పెల్లుబికింది. శిక్ష 7 మందికి మాత్రమే వరకట్న వేధింపులతో మహిళల మృతి, అత్యాచారం, లైంగిక దాడులు, మహిళలపై భర్తల హింస తదితరాలను నివేదికలో ప్రస్తావించారు. మెట్టినింట కట్న వేధింపులతో 617 మంది మరణించారు. కానీ ఇందులో 7 మందికి శిక్ష పడింది. 467 కేసులు ఇంకా కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. సుదీర్ఘమైన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ ప్రక్రియ, సాక్షులకు భద్రత కల్పించడం, న్యాయప్రక్రియ అంశాల వల్ల కేసుల విచారణ సవాళ్లు ఎదుర్కొంటోంది. లైంగిక వేధింపులు.. మహిళలపై లైంగిక వేధింపుల కేసులు 2022లో 5,857 నమోదుకాగా, 54 మందికి శిక్షలు పడ్డాయి. 559 నకిలీ ఆరోపణలని తెలిసింది. 2023లో 6,489 కేసులు నమోదుకాగా 651 నకిలీ కేసులుగా వెల్లడైంది. 2024లో 6335 కేసులు నమోదుకాగా ఇందులో 722 నకిలీ కేసులున్నాయి. 2025లో 5843 కేసులు నమోదు కాగా 610 నకిలీ కేసులు. నాలుగేళ్లలో 27,828 లైంగిక వేధింపుల ఘటనలు సంభవించాయి. అత్యాచారం కేసులు.... రాష్ట్రంలో గత నాలుగేళ్లలో మొత్తం 2,527 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. 2022లో 537, 2023లో 600, 2024లో 623, 2025లో 550 కేసులు, 2026లో 262 కేసులు వచ్చాయి. అంతులేని.. భర్తల క్రూరత్వం భర్తల క్రూరత్వ ప్రవర్తనపై 2022లో 2,779 కేసులు నమోదు కాగా ఇందులో 2,467 కేసుల్లో నేరం రుజువైంది. 2023లో 2,946 దౌర్జన్యం కేసుల్లో 329 నకిలీవని తేలింది. 2,556 కేసుల్లో వేధింపులు నిజమేనని నిర్ధారణ అయ్యింది. 2024లో 2,894 కేసులు నమోదు కాగా, ఇందులో 2,566 కేసుల్లో భర్తల దాషీ్టకాలు రుజువయ్యాయి. 2025లో 2,744 కేసులు నమోదుకాగా 231 నకిలీ కేసులున్నాయి. 2026 జూన్ వరకు 1,534 దౌర్జన్యం కేసులు నమోదయ్యాయి. ఏటా 2 వేల కేసులువివాహం, ఆ తరువాత వరకట్న వేధింపుల నియంత్రణ చట్టం కింద 2022లో 2,245 కేసులు నమోదు కాగా, 2023లో 2,348 కేసులు, 2024లో 1,999 కేసులు, 2025లో 2,110, 2026 జూన్ వరకు 1,039 కేసులు నమోదయ్యాయి. తమ వద్ద నమోదైన కేసులను పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డా.నాగలక్ష్మీ చౌదరి తెలిపారు.
వీడియోలు
భారీ వర్షం..ఎక్కడికక్కడే ఆగిపోయిన వాహనాలు
కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ పై వరుదు కళ్యాణి స్ట్రాంగ్ రియాక్షన్
కూటమి ఇంత దిగజారుతోంది వాళ్ల టార్గెట్ బిసీలే..! కడిగిపారేసిన విడదల రజిని
సాధిక్ ఖాన్ కి 14 రోజుల రిమాండ్
Reventh Reddy: నన్ను కాదు 4 కోట్ల మందిని అవమానించారు
ఉద్యోగినిపై స్కూల్ పిల్లల దాడి! వైరల్ విడియో
జలద్రోహంపై YSRCP సమరభేరి పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్
LIVE: సీఎం రేవంత్ సంచలన ప్రెస్ మీట్
Life Story: ఆస్ట్రేలియాకు దడ పుట్టించిన నాయకుడు.. దాదా లేకపోతే.. ఈ టీమిండియా ఉండేదా?
కొండా సురేఖ విషయంపై సీఎం రేవంత్ స్ట్రాంగ్ రియాక్షన్

