రానున్న నాలుగైదు రోజులు చాలా కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సర్లో రెండో విడత కార్యక్రమం దాదాపు పూర్తవుతున్నందున మ్యాపింగ్, నాన్-మ్యాపింగ్, గైర్హాజరు, చిరునామా మార్పులు, డూప్లికేట్, మరణించిన ఓటర్లకు సంబంధించిన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల అన్నారు.ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సమన్వయకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర స్థాయి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు, అసెంబ్లీ పరిశీలకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలు చేసేందుకు నెలాఖరు వరకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నందున పార్టీ యంత్రాంగం వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు.గత నాలుగైదు నెలలుగా బూత్ స్థాయిలో బీఎల్ఏలు చురుకుగా పనిచేయడం వల్ల అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవడంలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. ఓటర్ల సంఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిన నేపథ్యంలో తొలగింపులకు సంబంధించిన వివరాలను పార్టీ శ్రేణులు నిశితంగా పరిశీలించాలని సూచించారు.17.29 లక్షల అనుమానాస్పద ఓట్లపై అప్రమత్తంగా ఉండాలిఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ఓట్లు తొలగించే పరిస్థితిలో ఉంటే సంబంధిత ఫారాలను సమర్పించి వాటిని తిరిగి జాబితాలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లుగా భావించిన వాటిపై అవసరమైన అభ్యంతరాలను సమర్పించాలని చెప్పారు. ఇదే సమయంలో చిరునామా మార్పులు, ఇతర సవరణలకు సంబంధించిన దరఖాస్తులను కూడా అవసరాన్ని బట్టి సమర్పించాలని సూచించారు. పార్టీ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తించిన సుమారు 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లను బూత్ స్థాయిలో పరిశీలించాలని సజ్జల తెలిపారు.డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరంఒకే పేరుకు లేదా ఇతర వివరాలకు దగ్గరగా ఉన్న ఓటర్లు వాస్తవంగా ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అనే అంశాన్ని బీఎల్ఏలు స్థానికంగా నిర్ధారించాలని సూచించారు. తమకు చెందిన ఓటు అయితే దాన్ని కొనసాగించేలా, తమకు సంబంధం లేని లేదా డూప్లికేట్గా గుర్తించిన ఓటుపై అవసరమైన అభ్యంతరం దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీఎల్ఏల ద్వారా వచ్చిన సమాచారాన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్లు సమీకరించి సంబంధిత ఈఆర్ఓలకు సమర్పించాలని, సమర్పించిన ప్రతిసారీ రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.భవిష్యత్తులో అభ్యంతరాలపై చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ రసీదులు, ఇతర పత్రాలు ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను నాలుగైదు రోజుల్లో పూర్తి చేసేలా బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.బయట ఉన్న ఓటర్లతో సమన్వయం అవసరంక్లస్టర్ ఇన్చార్జీలు, కంట్రోల్ రూమ్లు, టాస్క్ఫోర్స్, పార్లమెంట్ మరియు అసెంబ్లీ పరిశీలకుల సహకారంతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. హైదరాబాద్కు సంబంధించిన అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపైనా వచ్చిన జాబితాలను పరిశీలించి, అవసరమైన అభ్యంతరాలను సమిష్టిగా సమర్పించాలని చెప్పారు. ఆగస్టు 27, 28 తేదీల నాటికి ప్రధాన ప్రక్రియను పూర్తి చేసి, నెలాఖరు చివరి రెండు రోజుల్లో తుది పరిశీలనకు అవకాశం ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఆగస్టు 30 తర్వాత అవకాశాలు పరిమితమవుతాయని, అందువల్ల ప్రస్తుతం ఉన్న సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.ప్రత్యేక క్యాంపెయిన్ రోజుల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, ఆ అవకాశాన్ని బీఎల్ఏలు వినియోగించుకుని ఓటర్ల జాబితా, దరఖాస్తులు, నోటీసులు, సవరణల వివరాలను పరిశీలించాలని సూచించారు. బయట ఉన్న ఓటర్లకు సంబంధించిన అంశాల్లో వారికి అందుబాటులో ఉన్న విధానాలపై అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైన సమాచారాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. సర్ ప్రక్రియను క్రమబద్ధంగా పూర్తి చేయడం ద్వారా అర్హులైన ఓటర్ల ప్రయోజనాలను కాపాడటంతో పాటు భవిష్యత్ ఓటర్ల జాబితా సవరణల్లో కూడా ఇబ్బందులు తగ్గుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల సన్నద్ధతపై 25న వైఎస్ జగన్ దిశానిర్దేశం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్టీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందని, పార్టీ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండేలా శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సజ్జల తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆగస్టు 25న కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. రాబోయే కొద్దిరోజులు పార్టీకి చెందిన సిబ్బంది, సహాయకులు, నియోజకవర్గ స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి స్పష్టమైన టార్గెట్లు కేటాయించి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు.
మనం తింటున్నది చేపనా.. లేక ప్రాణాంతక విషమా? షాకింగ్ నిజాలు!
ముంబై: మీరు నాన్వెజ్ ప్రియులా?.ఫిష్ కర్రీని లొట్టేలసుకొని మరీ లాగించేస్తారా? అయితే. మీరు చేప గురించి తెలుసుకోవాల్సిందే. సాధారణంగా కొర్రమీను, శీలవతి,బొచ్చె, జెల్లలు పేర్లు వినే ఉంటారు.అచ్చం అలాగే థాయ్ మాంగూర్ అనే పేరుతో ఓ చేపకూడా ఉంది. ఈ చేపతో చేసిన వంటల్ని రుచి చూస్తే ప్రాణాల మీదకు కొని తెచ్చుకున్నట్లే. అలాంటి 36వేల కేజీల థాయ్ మాంగూర్ చేపల్ని గొయ్యి తీసి పాతిపెట్టారు.పైన మనం చెప్పుకున్న చేపల్లో పోషకాలు అధికం,బడ్జెట్ ఫ్లెండీ, జ్యూసీ, పులుసు పెట్టుకునేందుకు విరివిరిగా వినియోగిస్తుంటాం.కానీ ఈ థాయ్ మాంగూర్ పేరు వింటే నాన్ వెజ్ ప్రియుల్లో గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత చందంగా ఉక్కిరిబిక్కిరవుతుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు అర్జించేందుకు కొంతమంది వ్యాపారస్థులు అడ్డదార్లలో ఈ చేపల్ని పెంచుతుంటుంటారు. మన దేశంలో ఎప్పటి నుంచే నిషేధంలో ఉన్న ఈ చేపలు మహరాష్ట్రలో కలకలం రేపాయి. నాగ్పూర్ జిల్లాలోని పార్శివని పరిధిలో ఉన్న చిచోలి-మహదులా గ్రామం పరిసర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో చెరువులు ఉన్నాయి. అయితే, ఈ చెరువుల్లో ప్రాణాంతకమైన థాయ్ మాంగూర్ చేపల్ని పెంచుతున్నట్లు మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందింది. మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందడంతో గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఆ చెరువులను గుర్తించారు. కస్టమర్లలా నటిస్తూ వెళ్లి గుట్టు రట్టు చేశారు. 👉ఇదీ చదవండి: గ్రీకుల గర్భనిరోధక మొక్క.. రెండువేల ఏళ్ల తర్వాత ప్రత్యక్షంఆ వెంటనే 25 మంది స్థానిక జాలర్లతో కలిసి చెరువులపై మెరుపు దాడి చేశారు. వలలు వేసి బయటకు తీస్తుంటే అధికారులకే ఒళ్లు గగుర్పొడిచింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 36 టన్నుల (36,000 కేజీలు) థాయ్ మాంగూర్ చేపలు కుప్పలుగా పడ్డాయి. కాలకూట విషాన్ని దాచుకున్న ఆ 36 టన్నుల చేపలను భారీ గోతులు తీసి, మట్టిపెట్టి అక్కడికక్కడే సమాధి చేసేశారు.ఎందుకంటే.. ఈ చేపలను తినడం అంటే నోటి ద్వారా నేరుగా మరణాన్ని ఆహ్వానించడమే.ఈ చేపలు పెరగడానికి స్వచ్ఛమైన నీరు అవసరం లేదు. కుళ్ళిన మాంసం, చికెన్ వేస్ట్, హాస్పిటల్ వ్యర్థాలు, మురుగు నీరు వీటికి ప్రధాన ఆహారం. ఎంత దారుణమైన వ్యర్థాలను తింటే ఇవి అంత వేగంగా, లావుగా పెరుగుతాయి. లాభాల కోసం కొందరు స్వార్థపరులు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వీటిని పెంచుతున్నారు.వైద్యులు, శాస్త్రవేత్తల ప్రకారం థాయ్ మాంగూర్ను ఒక్కసారి తిన్నా అది శరీరంలో విషంలా పనిచేస్తుంది. ఈ చేపల శరీరంలో లెడ్ (సీసం), ఆర్సెనిక్, మెర్క్యురీ వంటి అత్యంత ప్రమాదకరమైన భారీ లోహాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో కణాలు దెబ్బతిని క్యాన్సర్ బారిన పడటం ఖాయం.వీటిలోని విషపూరిత రసాయనాలు నేరుగా లివర్, కిడ్నీలపై దాడి చేస్తాయి. క్రమంగా అవి పనిచేయడం ఆగిపోయి మనిషి ప్రాణాలు కోల్పోతాడు. అసహ్యకరమైన వ్యర్థాలను తిని పెరగడం వల్ల వీటి మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గుండె జబ్బులకు, చర్మ వ్యాధులకు మరియు రోగనిరోధక శక్తి పూర్తిగా పడిపోవడానికి కారణమవుతుంది.మార్కెట్లో సాధారణ చేపల ధర కంటే ఈ థాయ్ మాంగూర్ చేపల ధర చాలా తక్కువగా ఉంటుంది. హోటళ్లలో, బిర్యానీలలో, రోడ్డు పక్కన దొరికే ఫిష్ ఫ్రై సెంటర్లలో తక్కువ ధరకు వస్తుందని కొందరు దీనిని వాడుతుంటారు. నాగ్పూర్లో దొరికిన 36 టన్నుల చేపలు గనుక మార్కెట్లోకి వచ్చి ఉంటే.. వేలాది మంది ఇళ్లల్లో కూరలుగా మారి, ఎంతోమంది ప్రాణాలను బలితీసుకునేవి. అదృష్టవశాత్తూ అధికారులు సకాలంలో స్పందించి ఆ ముప్పును తప్పించారు.హెచ్చరిక: చేపలు ఆరోగ్యానికి మంచిదే. కానీ కొనే ముందు అది దేశవాళీ చేపేనా అని నిర్ధారించుకోండి. నల్లగా, నోటి చుట్టూ పెద్ద మీసాలతో, అతి తక్కువ ధరకు దొరికే ‘థాయ్ మాంగూర్’ కనిపిస్తే.. ప్రాణాల మీద ఆశ ఉంటే అక్కడి నుండి వెనక్కి వచ్చేయండి!
రాయదుర్గంలో భూముల వేలానికి రికార్డు ధర
సాక్షి, హైదరాబాద్: నగరంలో భూముల ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహిస్తున్న భూముల వేలం పాటల్లో భూమికి రికార్డు ధర పలికింది. రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడైంది. రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నెంబర్ 83 /1 లో 5.25 ఎకరాల భూమిని టీజీఐఐసీ వేలం వేసింది. గతంలో ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది.కనీస ధర 175కోట్ల రూపాయలుగా టీజీఐఐసీ నిర్ధారించింది. 10 కోట్ల రూపాయల డిపాజిట్గా అధికారులు నిర్ణయించారు. 10కోట్ల రూపాయలు డిపాజిట్ చెల్లించి ఆన్ లైన్ వేలంలో పాల్గొన్న బిడ్డర్లు.. ఖరీదైన భూమి కావడంతో పోటీపడి స్థిరాస్తి సంస్థలు బిడ్డింగ్ దాఖలు చేశాయి. 3 నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఎకరా భూమి 237కోట్ల రూపాయలు పలికింది.ఇదీ చదవండి: మాట్లాడతా.. అన్ని విషయాలు చెబుతా: కొండా సురేఖ
‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఇరుముడినటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిర తదితరులునిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై రవిశంకర్కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మఎడిటింగ్: ప్రవీణ్ పూడివిడుదల తేది: ఆగస్ట్ 21,2026వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ.. రవితేజ ఖాతాలో ఓ మంచి హిట్ పడి చాలా కాలమైంది. దీంతో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లోనూ గతంలో ఉన్నంత ఆసక్తి, అంచనాలు కనిపించడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత రవితేజ నటించిన ఓ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయిందంటే అది ‘ఇరుముడి’ అనే చెప్పాలి. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరి ఇంతటి హైప్ మధ్య నేడు(ఆగస్ట్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’ ఎలా ఉంది? ఈ చిత్రంలో రవితేజ హిట్ట్రాక్ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, సీలేరు ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ గ్రామానికి చెందిన త్రినాథ(రవితేజ) అరటిపళ్ల వ్యాపారం చేస్తుంటాడు. భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), కూతురు మణికంఠ అలియాస్ మణెమ్మ (బేబీ నక్షత్ర) అంటే అతనికి ప్రాణం. ప్రతి ఏడాది అయ్యప్పమాల ధరించిన 41 రోజులు తప్ప.. మిగతా రోజులన్నీ తాగుతూనే ఉంటాడు. ఊర్లో ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టిన.. త్రినాథ్ ఊరుకోడు. దానివల్ల త్రినాథ్కు చాలా మంది శత్రువులు ఏర్పడతారు. మరోవైపు ఊర్లో ఐదో తరగతి వరకు మాత్రమే ఉండడంతో హైస్కూల్ కోసం కూతురిని సీలేరుకు పంపిస్తాడు. ఆ స్కూల్ టీచర్(స్వసికా) స్టూడెంట్స్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంటుంది. అదే సమయంలో ఆ స్కూల్లో చదువుకునే అమ్మాయిలు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని నిజాలు మణికంఠకు తెలుస్తాయి. ఆవేంటి? ప్రతి విషయాన్ని తండ్రితో చెప్పే మణికంఠ.. ఆ విషయాలను కూడా తండ్రికి చెప్పిందా? ఆ విషయం తెలిసిన తర్వాత త్రినాథ్ ఏం చేశాడు? గురుస్వామి గోపరాజు (సాయికుమార్)తో త్రినాథ్ అనుబంధం ఎలా ఉంది? త్రినాథ్ మాలలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి? తన కూతురుకు జరిగిన అన్యాయానికి త్రినాథ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..మాస్ మహారాజా రవితేజను అయ్యప్పమాల నేపథ్యంలో చూపిస్తామని ప్రకటించినప్పటి నుంచే ‘ఇరుముడి’పై ఆసక్తి మొదలైంది. రవితేజ మాస్ ఇమేజ్కు పూర్తి భిన్నమైన భక్తి నేపథ్యాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఎలా డీల్ చేశారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఈ విషయంలో దర్శకుడు తనదైన మార్క్ చూపించారు. అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని తీసుకుని ఓ కుటుంబ కథను రాసుకున్న ఆయన.. దానికి క్రైమ్ ఎలిమెంట్ను జోడించి కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచారు.ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కథకు తగ్గట్టుగా మిక్స్ చేయడం సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లను దర్శకుడు బలంగా రాసుకున్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేయడంతో పాటు.. పిల్లలను ఎలా పెంచాలి, వారి విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అనే విషయాలను ఇందులో చర్చించారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి.భక్తి నేపథ్యం ఉన్నప్పటికీ ‘ఇరుముడి’ పూర్తిగా భక్తి చిత్రంగా మారిపోలేదు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. రొటీన్ స్టోరీనే అయినా.. స్క్రీన్ప్లేను నడిపించిన విధానం ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప పాటలు, భక్తి సన్నివేశాలను కథలో మిళితం చేసిన విధానం సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది.స్కూల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టే టీచర్ సన్నివేశంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత రవితేజ ఎంట్రీ, భార్య-కూతురితో ఆయనకున్న అనుబంధం, కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలు ఫస్టాఫ్ సాగుతుంది. అయితే ఫస్టాఫ్ పూర్తిగా పాజిటివ్గా ఉందని చెప్పలేం. ముఖ్యంగా స్కూల్ ఎపిసోడ్స్లో కొన్ని సన్నివేశాలు ఒకే తరహాలో రిపీట్ కావడం, కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ లోపాలను అయ్యప్ప పాటలు, భక్తి సన్నివేశాలు కొంతవరకు కవర్ చేశాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. పాత్రల మధ్య సంఘర్షణ, ఎమోషనల్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కథను ముందుకు తీసుకెళ్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉంది. సినిమాకు సంబంధించిన ప్రధాన ఎమోషన్ను క్లైమాక్స్లో బలంగా క్యారీ చేయడంలో దర్శకుడు మంచి ప్రభావాన్ని చూపించారు.అయితే ‘ఇరుముడి’లో లోపాలు కూడా లేకపోలేదు. దర్శకుడు కథను నమ్మి కొన్ని సందర్భాల్లో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారు. కొన్ని సన్నివేశాలు లాజిక్కు దూరంగా అనిపించడంతో పాటు.. మరికొన్ని చోట్ల కథనం మరింత సహజంగా ఉండాల్సిందనే భావన కలుగుతుంది. మొత్తంగా ‘ఇరుముడి’ భక్తి నేపథ్యాన్ని కమర్షియల్ కథతో ముడిపెట్టిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎవరెలా చేశారంటే.. రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్కు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించాడు. సాధారణ మధ్యతరగతి తండ్రి త్రినాథ్ పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా అన్ని రకాల సన్నివేశాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తండ్రిగా భావోద్వేగాలను పలికించిన సన్నివేశాల్లో రవితేజ నటన మెప్పిస్తుంది.ప్రియా భవానీ శంకర్ మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో సహజంగా నటించింది. కుటుంబ బాధ్యతలు, భావోద్వేగాలను తన నటనతో చక్కగా చూపించింది. ఇక ఈ సినిమాకు బేబీ నక్షత్ర ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఆమె పాత్ర చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతుంది. కీలక సన్నివేశాల్లో నక్షత్ర అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.జబర్దస్త్ కొమరం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన మార్క్ చూపించాడు. సీరియస్ సన్నివేశాల్లోనూ మెప్పిస్తూ పాత్రకు న్యాయం చేశాడు. ఇక గురుస్వామి పాత్రలో సాయి కుమార్ అనుభవం కనిపిస్తుంది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో వచ్చే ‘ఇరుముడి’ పాట, సెకండాఫ్లో వచ్చే ‘మల్లె పూల’పాటు అయ్యప్ప భక్తులకు పూనకాలు తెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
తాను చేసిన స్వీటును తానే తిననని చెప్పిన దుకాణదారుడు
జో రూట్ ప్రపంచ రికార్డు
సెంట్రల్ బ్యాంక్ నుంచి బంపర్ లోన్ ఆఫర్లు!
ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
రానున్న నాలుగైదు రోజులు చాలా కీలకం: సజ్జల
‘సింగం’ తుకారాం రాజకీయాల్లోకి వస్తారా? కుండబద్దలుకొట్టిన అధికారి
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
అందుకే ఐటమ్ సాంగ్స్ చేయను: హీరో సిద్ధార్థ్
‘లింగమనేని కుమారుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు..?’
వచ్చారు.. వెళ్లారు.. మంత్రి నారాయణ తీరుపై విమర్శలు
‘ఓహో..నీకు పీరియడ్స్ సమయమా’ అని చులకనగా చూసేవాడు: అనుపమ
ఎన్నో సంస్కరణలు, అద్భుతాలు సృష్టించారు.. మీ టాలెంట్తో కరువు కనబడకుండా చేయండి సార్!
ఇంత వరకూ ఆయన తప్ప ఎవరూ మెచ్చుకోలేదట... కృతజ్ఞతగానట!!
అయ్యో! వెన్నుపోటు పొడిచారని కాదయ్యా
పగటి కలలు కనొద్దు.. రాందేవ్కు కంగనా ఘాటు కౌంటర్
ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
ఆ ఒక్క కారణం వల్లే మా ఆయన దూరమయ్యారు: మీనా
బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్
4 పాములు.. అప్పుడు ఒకదానికొకటి చుట్టుకుని..
‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మరో 79 పరుగులు చేస్తే రూట్ ప్రపంచ రికార్డు
అర్జున్ టెండూల్కర్ కీలక నిర్ణయం
యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు
‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’
అందుకే.. అప్పు చేసి ఆస్తులు కొంటున్న కియోసాకి!
మద్యం సేవిస్తే బైక్ స్టార్ట్ కాదు.. బైక్కు కొత్త సిస్టమ్
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా
విజయ్-త్రిష బంధంపై నటి సంజన కీలక వ్యాఖ్యలు
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
తాను చేసిన స్వీటును తానే తిననని చెప్పిన దుకాణదారుడు
జో రూట్ ప్రపంచ రికార్డు
సెంట్రల్ బ్యాంక్ నుంచి బంపర్ లోన్ ఆఫర్లు!
ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
రానున్న నాలుగైదు రోజులు చాలా కీలకం: సజ్జల
‘సింగం’ తుకారాం రాజకీయాల్లోకి వస్తారా? కుండబద్దలుకొట్టిన అధికారి
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
అందుకే ఐటమ్ సాంగ్స్ చేయను: హీరో సిద్ధార్థ్
‘లింగమనేని కుమారుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు..?’
వచ్చారు.. వెళ్లారు.. మంత్రి నారాయణ తీరుపై విమర్శలు
‘ఓహో..నీకు పీరియడ్స్ సమయమా’ అని చులకనగా చూసేవాడు: అనుపమ
ఎన్నో సంస్కరణలు, అద్భుతాలు సృష్టించారు.. మీ టాలెంట్తో కరువు కనబడకుండా చేయండి సార్!
ఇంత వరకూ ఆయన తప్ప ఎవరూ మెచ్చుకోలేదట... కృతజ్ఞతగానట!!
అయ్యో! వెన్నుపోటు పొడిచారని కాదయ్యా
పగటి కలలు కనొద్దు.. రాందేవ్కు కంగనా ఘాటు కౌంటర్
ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
ఆ ఒక్క కారణం వల్లే మా ఆయన దూరమయ్యారు: మీనా
బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్
4 పాములు.. అప్పుడు ఒకదానికొకటి చుట్టుకుని..
‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మరో 79 పరుగులు చేస్తే రూట్ ప్రపంచ రికార్డు
అర్జున్ టెండూల్కర్ కీలక నిర్ణయం
యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు
‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’
అందుకే.. అప్పు చేసి ఆస్తులు కొంటున్న కియోసాకి!
మద్యం సేవిస్తే బైక్ స్టార్ట్ కాదు.. బైక్కు కొత్త సిస్టమ్
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా
విజయ్-త్రిష బంధంపై నటి సంజన కీలక వ్యాఖ్యలు
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఫొటోలు
బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు
శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు
హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు)
‘ఇరుముడి’మూవీ ప్రెస్మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?
నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)
హైదరాబాద్ : హైటెక్స్లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు)
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
స్టన్నింగ్ లుక్లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)
చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)
సినిమా
అతిలోక సుందరిని పరిచయం చేసిన జానకి
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె.. తుదిశ్వాస విడిచారు. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన షావుకారు జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి స్టార్గా ఎదిగారు. ఇవాళ ఆమె మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.జానకమ్మ మరణం వేళ జానకమ్మకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దివంగత నటి శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జానకమ్మ గారే. ఆరేళ్ల వయసులోనే బాలనటిగా శ్రీదేవిని వెండితెరపైకి తీసుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్లో రాజేశ్వరి(శ్రీదేవి అమ్మ) పాపను పట్టుకుని దూరంగా నిలబడి చూస్తున్నారు.అదే సమయంలో డైరెక్టర్ మురుగన్ ఓ చిన్న పిల్లాడు కావాలని అడిగారు. దీంతో నేను వెంటనే శ్రీదేవి తీసుకుందామని రాజేశ్వరితో చెప్పా.. ఆమె వెంటనే ఒప్పుకున్నారు. మేకప్ వేశాక బాల మురుగన్ పాత్రకు శ్రీదేవి చక్కగా సరిపోయింది. చిన్న చిన్న డైలాగ్లు చెప్పమంటే.. ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, తను చెప్పడం చూసి, మరో ఆలోచన లేకుండా ఓకే చేశారు.
‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. టికెట్ ధర ఎంతటే..?
యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. అమెరికాలో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే సుమారు రూ.1.06కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటివరకు 204 ప్రాంతాల్లో 589 షోలకు కలిపి 5,500 టికెట్లు అమ్ముడయ్యాయట. విడుదలకు ముందు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.బుక్మైషోలోనూ మార్క్ ఇక బుక్మైషోలో ‘టాక్సిక్’కు ఇప్పటికే 10లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ నమోదయ్యాయి. ఈ ఘనత సాధించిన 13వ భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ నిలిచింది. యశ్ కెరీర్లో కేజీఎఫ్2 తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందిన రెండవ చిత్రమిది కావడం విశేషం.నేడు భారత్లో అడ్వాన్స్ బుకింగ్స్?ఇప్పటివరకు అమెరికాలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. భారత్లో బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యశ్ క్రేజ్ కారణంగా తొలి రోజు భారీ ఓపెనింగ్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఇదే జోరులో కొనసాగితే తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.టికెట్ ధరలు భారీగా ఉండే ఛాన్స్తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు టికెట్ ధరలు రూ.500–600 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణ షోల టికెట్ ధరలు కూడా సాధారణ ధరల కంటే రూ.50–100 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముంబై, ఢిల్లీలో కొన్ని ప్రీమియం షోలకు టికెట్ ధరలు ఏకంగా రూ.2,600 వరకు ఉండొచ్చని సమాచారం.‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యశ్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో ‘టాక్సిక్’పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి భారత్ అడ్వాన్స్ బుకింగ్స్పైనే ఉంది.ఇదీ చదవండి: ‘టాక్సిక్’కు ‘ఏ’ సర్టిఫికేట్..! కంటెంట్ సంగతేంటి?
జానకమ్మ మరణం.. టాలీవుడ్ సినీతారల నివాళి
ఫ్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి మరణవార్తపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆమె మనల్ని విడిచివెళ్లడం ఎంతో బాధ కలిగించిందన్నారు. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్రవేసిన ఆమెను కోల్పోవడం మనకు తీరని లోటు అన్నారు. జానకమ్మ సినీ ప్రయాణం, ఆమె పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటాయన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.షావుకారు జానకి గారి మరణం ఎంతో బాధాకరమని మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఆమె హుందాతనం, గౌరవప్రదమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నట ప్రస్థానం తరతరాలకూ ఆదర్శంగా నిలిచిపోతాయని తెలిపారు. నేటి యువత ఆమె ఎంత గొప్ప వ్యక్తిత్వమో తప్పక తెలుసుకోవాలని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇక లేరనే వార్త ఎంతో బాధ కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె మృతి పట్ల తన సంతాపం ప్రకటంచారు. షావుకారు చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగిందని తెలిపారు. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి అని కొనయాడారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.షావుకారు జానకి అమ్మగారి మరణవార్త విని ఎంతో బాధపడ్డానని నటి రాధిక శరత్ కుమార్ అన్నారు. ఆమె దృఢ సంకల్పం కలిగిన, స్వతంత్ర భావాలున్న, కొత్త ఒరవడిని సృష్టించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నా తండ్రి శ్రీ రాధా గారికి సన్నిహిత మిత్రురాలిగా ఉంటూ.. పరస్పరం ఎంతో గౌరవాభిమానాలు కలిగి ఉన్న ఆమెతో పరిచయం, కలిసి పనిచేసే అవకాశం నాకు లభించిందని అన్నారు. తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏— Jr NTR (@tarak9999) August 21, 2026
ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
దక్షిణాది సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటి షావుకారు జానకి(94) తీవ్ర అనారోగ్యంతో కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో కథానాయికగా, ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోసిన ఆమె.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు. షావుకారుతో మొదలైన ఆమె నట ప్రస్థానం.. వందలాది పాత్రలతో సాగి.. దక్షిణాది సినిమా చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయింది. ఆమె మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజమండ్రిలో జననం..1931 డిసెంబరు 12న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించిన జానకి అసలు పేరు శంకరమంచి జానకి. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆమె రేడియో నాటికల ద్వారా తన కళా ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా కథానాయికగా ఎదిగారు.‘షావుకారు’తో గుర్తింపుదర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన ‘షావుకారు’ (1950) చిత్రంతో జానకి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్రతో ‘షావుకారు జానకి’గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అనంతరం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్తో..తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించిన జానకి.. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ తదితర ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. ‘రోజులు మారాయి’, ‘కన్యాశుల్కం’, ‘జయం మనదే’, ‘పాండురంగ మహత్యం’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘అక్కాచెల్లెలు’, ‘బడిపంతులు’, ‘సంసారం ఒక చదరంగం’ తదితర చిత్రాలు ఆమెకు గుర్తింపును తీసుకొచ్చాయి. ఇలా ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో షావుకారు జానకి దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించారు.ప్రతిష్ఠాత్మక పురస్కారాలునటనకు గాను జానకి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి, ఆంధ్రప్రదేశ్ నుంచి నంది పురస్కారాలు, ఇతర జీవిత సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి. 2022లో భారత ప్రభుత్వం ఆమెకు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించింది.
క్రీడలు
భారత్తో రెండో టెస్టు.. శ్రీలంక జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు
కొలంబో వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టులో కీలక మార్పులు చేసింది. స్టార్ బ్యాటర్లు కుశాల్ మెండిస్, పాథుమ్ నిస్సాంక గాయాల కారణంగా రెండో టెస్టుకూ దూరమయ్యారు.మరోవైపు తొలి టెస్టులో కాన్కషన్ (తలకు దెబ్బతగలడం)కు గురైన వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ చండీమల్ సైతం రెండో టెస్టుకు అందుబాటులో లేడు. దీంతో యువ బ్యాటర్ కామిల్ మిషార, ఆల్రౌండర్లు సహన్ అరచ్చిగెలను జట్టులో లంక సెలక్టర్లు చేర్చారు. ఇప్పటికే శ్రీలంక తరపున పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేసిన అరచ్చిగె.. కొలంబో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో కూడా డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. 30 ఏళ్ల సహన్కు ఫస్ట్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. అరచ్చిగె ఇప్పటివరకు 85 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 4365 పరుగులతో పాటు 63 వికెట్లు పడగొట్టాడు.మరోవైపు 25 ఏళ్ల కామిల్ మిషార కూడా ఇప్పటివకే లంక తరపున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. టాపార్డర్లో దూకుడుగా ఆడడం అతడి స్పెషాలిటి. అతడు సైతం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ గణంకాలు సాధించాడు. ఇప్పటివరకు 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన మిషార..3521 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 187గా ఉంది. కాగా గాలే వేదికగా తొలి టెస్టులో శ్రీలంక 165 పరుగుల తేడాతో చిత్తు అయిన సంగతి తెలిసిందే.రెండో టెస్టుకు శ్రీలంక జట్టు: లహిరు ఉదార, కామిల్ మిషార, పసిందు సూరియబండార, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), ధనంజయ డి సిల్వా (కెప్టెన్), సహన్ అరచ్చిగె, సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా, కేశర నువంత, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, లహిరు కుమార, అసిత్ ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో.చదవండి: IND vs SL: శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం
IND vs SL: శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికి కెప్టెన్ శుబ్మన్ గిల్ మాత్రం పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. గిల్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ (16, 8) శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్లోనే అవుటై నిరాశపరిచాడు. ఈ క్రమంలో లెఫ్టార్మ్ స్పిన్ వీక్నెస్ను అధిగమించేందుకు గిల్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రెండో టెస్టు కోసం ఇప్పటికే కొలంబో చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. రాహుల్, కుల్దీప్ వంటి సీనియర్ క్రికెటర్లు విశ్రాంతి తీసుకున్నప్పటికి గిల్ మాత్రం నెట్స్లో చెమట్చోడ్చాడు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్ను గిల్ సుదీర్ఘంగా ఎదుర్కొన్నాడు. గిల్ తాజా నెట్ సెషన్కు సంబంధించిన వివరాలను భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ప్రెస్కాన్ఫరెన్స్లో వెల్లడించారు.భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఆ రోజు గిల్ నెట్ సెషన్కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఆ కుడిచేతి వాటం బ్యాటర్ కొలంబో పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు."గిల్ బ్యాటింగ్ శైలి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు స్వేచ్ఛగా పరుగులు సాధించే బ్యాటర్. పిచ్ స్వభావం, బౌన్స్ అంచనా వేస్తూ కొలంబో పరిస్థితులకు అలవాటు పడేందుకే కాస్త ఎక్కవ సమయం నెట్స్లో గడిపాడు. ఇందులో ఎలాంటి ప్రత్యేకమైన ప్రణాళికలేమీ లేవు" అని బహుతులే పేర్కొన్నాడు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్.. కొలంబోలోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
సెమీస్కు దూసుకెళ్లిన గాయత్రి-ట్రీసా జోడీ.. 15 ఏళ్ల తర్వాత భారత్కు పతకం
న్యూఢిల్లీ వేదికగా జరుగున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ - గాయత్రి గోపీచంద్ సత్తాచాటారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో చైనాకు చెందిన నాలుగో సీడ్ జై యి ఫాన్ - జాంగ్ షు క్సియాన్పై విజయం సాధించిన ఈ భారత జంట.. సెమీస్కు దూసుకెళ్లింది. దీంతో 15 ఏళ్ల తర్వాత మహిళల డబుల్స్ విభాగంలో భారత్కు పతకం రానుంది. చివరిసారిగా 2011లో లండన్ వేదికగా జరిగిన టోర్నమెంట్లో అశ్విని పొన్నప్ప - జ్వాలా గుత్తా జోడీ కాంస్య పతకం సాధించింది. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. గాయత్రి- ట్రీసా జాలీ జోడీ తొలి గేమ్ను 16-21తో కోల్పోయింది. కానీ రెండో గేమ్లో భారత షట్లర్లు అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు. హోరాహోరీగా సాగిన రెండోగేమ్లో 21-15 తేడాతో భారత్ గెలిచి సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్లోనూ గాయత్రి-ట్రీసా సత్తాచాటారు. 21-13 తేడాతో చైనా జోడీని చిత్తు చేసి గేమ్తో పాటు మ్యాచ్ను భారత జంట సొంతం చేసుకుంది. కాగా గాయత్రి గోపీచంద్ ఇటీవలే అర్జున అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఆసీస్ తుది జట్టు ప్రకటన.. మూడేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ ఎంట్రీ
మెకే వేదికగా బంగ్లాదేశ్తో జరగనున్న సిరీస్ డిసైడర్ రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. ఈ కీలక మ్యాచ్లో ఆసీస్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. పేలవ ఫామ్తో సతమవుతున్న జేక్ వెదరాల్డ్పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. తిరిగి మాట్ రెన్షాకు పిలుపునిచ్చారు.2023 మళ్లీ ఆసీస్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రెన్షా.. ట్రావిస్ హెడ్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. అయితే వరుస మ్యాచ్లలో విఫలమవుతున్న మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్కు ఆసీస్ మేనెజ్మెంట్ మరో అవకాశమిచ్చింది. ఈ మ్యాచ్లో కూడా అతడు రాణించకపోతే ఆసీస్ టెస్టు జట్టులో చోటు కోల్పోయే ఛాన్స్ ఇచ్చింది.అయితే రెండో టెస్టుకు స్పిన్నర్ నాథన్ లియోన్ను పక్కన పెట్టి పేసర్ స్కాట్ బోలాండ్ను తుది జట్టులోకి తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆసీస్ మేనెజ్మెంట్ నాథన్ లియోన్వైపే ముగ్గు చూపింది. దీంతో బోలాండ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు. కాగా డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో మెకే టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని కంగారులు పట్టుదలతో ఉన్నారు. ఆగస్టు 22 నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియా తుది జట్టు : మ్యాట్ రెన్షా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), బో వెబ్స్టర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జోష్ హేజిల్వుడ్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన గిల్ సహచరుడు
న్యూస్ పాడ్కాస్ట్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
బిజినెస్
రూ.35 లక్షల వేతనం.. అయినా మానసిక క్షోభ!
ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. వార్షిక ప్యాకేజీ రూ.35 లక్షలు.. మౌలిక వసతులు.. ఇవన్నీ చూసి ఆ ఉద్యోగి కెరీర్ అత్యున్నత దశలో ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లే! అధిక వేతనాలు అందుతున్నప్పటికీ కార్పొరేట్ రంగంలో విపరీతంగా పెరుగుతున్న టాక్సిక్ వర్క్ కల్చర్ (విషతుల్యమైన పని వాతావరణం) ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా పాతాళానికి నెట్టివేస్తోంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక టెక్కీ వేదన ఈ చేదు నిజాలను మరోసారి హైలైట్ చేసింది.టెక్కీ పంచుకున్న వివరాలు..‘సుదీర్ఘ పని గంటలు, శని-ఆదివారాలు కూడా పనిచేయడంపై నా మేనేజర్లతో మాట్లాడగా.. రోజుకు 14 గంటలు పనిచేయడమే ఈ కంపెనీ సంస్కృతి.. అని తేల్చి చెప్పారు. నెలల తరబడి కష్టపడి నేను విజయవంతంగా పూర్తి చేసిన ఒక ప్రాజెక్ట్ను ఉన్నతాధికారుల వద్ద మేనేజర్ ప్రదర్శిస్తూ.. నేను 3 నెలల పాటు ఏ పనీ చేయలేదని, అతనే ప్రతిదీ సరిచేశాడని అబద్ధాలు చెప్పారు. అంతేకాకుండా, నేను రూపొందించిన మోడల్ వల్ల కంపెనీకి 10కి పైగా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. కానీ ఆ శ్రమనంతటినీ వారి ఖాతాలో వేసుకున్నారు’ అని చెప్పాడు.‘తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మూడు రోజులు చికిత్స పొందుతున్న సమయంలోనూ విశ్రాంతి ఇవ్వలేదు. కేటీ (Knowledge Transfer) ఇచ్చి ఆ తర్వాత నీ పనులు చేసుకో అంటూ 10 సార్లు ఫోన్ చేసి వేధించారు. వన్-ఆన్-వన్ సమావేశాల్లో ప్రోత్సహించాల్సింది పోయి, 'నువ్వు కేవలం ఫిర్యాదులు చేస్తావు.. ఏ పనీ చేయవు' అని నిందించారు. నన్ను తప్పుగా చిత్రీకరిస్తూ బలవంతంగా రాజీనామా చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని వెల్లడించారు.ప్యాకేజీలు భారీగానే ఉన్నాయి.. ఆరోగ్యం ఏది?సాధారణంగా భారీ జీతాలు లభించే ఉద్యోగాల్లో అన్ని సదుపాయాలు ఉంటాయని భావిస్తారు. కానీ, నిరంతర ఒత్తిడి, అపరిమితమైన పని గంటలు, సెలవు రోజుల్లో కూడా పనులు చేయడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి రావడం వంటి అంశాలు ఉద్యోగులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు పండుగల వేళల్లో కూడా విశ్రాంతి లేకపోవడం, హెచ్ఆర్ విభాగాల కఠిన వైఖరి ఉద్యోగుల్లో భయాందోళనలు, తీవ్రమైన మానసిక అలసట, ఆందోళనకు దారితీస్తున్నాయి.లేఆఫ్ల భయం.. అనిశ్చితిలో భవిష్యత్తుఅధిక వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులకు మరో వైపు లేఆఫ్ భయం ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంది. కేవలం ఒక 10-15 నిమిషాల హెచ్ఆర్ సంభాషణతో ఏళ్ల శ్రమ తుడిచిపెట్టుకుపోతోందని, ఎంతటి ప్రతిభ ఉన్నప్పటికీ కంపెనీ బడ్జెట్ గణాంకాల ముందు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ జీతాలు మానసిక ప్రశాంతతకు ప్రత్యామ్నాయం కాజాలవు. ఉద్యోగులు తమ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అత్యవసర నిధులు, ప్రత్యామ్నాయ రంగాలు, బలమైన నెట్వర్కింగ్ను పెంపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్
స్విగ్గీపై కస్టమర్ రివేంజ్
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ సేవలపై వినియోగదారుల అసంతృప్తి మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. గతంలో ఆర్డర్ చేసిన ఆహారం సుమారు రెండు గంటలు ఆలస్యంగా డెలివరీ కావడంతోపాటు కస్టమర్ కేర్ నుంచి సరైన స్పందన లభించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ వినియోగదారుడు, ప్లాట్ఫామ్పై వినూత్న రీతిలో రివేంజ్ తీర్చుకున్న ఉదంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సదరు కస్టమర్ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.500 విలువైన మునుపటి ఆర్డర్ గంటల తరబడి ఆలస్యమైనప్పటికీ ఆర్డర్ రద్దుకు యాప్ యాజమాన్యం నిరాకరించింది. పైగా బాధ్యతనంతా వినియోగదారుడిపైనే నెడుతూ వంద శాతం క్యాన్సిలేషన్ ఛార్జీలు విధిస్తామని తెలిపింది. ఆటోమేటెడ్ చాట్బాట్లు, సరిగా స్పందించని కస్టమర్ సపోర్ట్ కారణంగా మానసిక క్షోభకు గురైన సదరు వ్యక్తి మరుసటి రోజు రూ.1,400 విలువైన క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ను ఉంచాడు. డెలివరీ ఏజెంట్ రాగానే దాన్ని నిరాకరించి రద్దు చేయడం ద్వారా తన నిరసన వ్యక్తం చేశాడు.ఈ ఘటన క్విక్ కామర్స్, ఫుడ్ టెక్ రంగంలో పడిపోతున్న సేవా ప్రమాణాలను, కస్టమర్ కేర్ వ్యవస్థలలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఒకవైపు వినియోగదారులు సంస్థల బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తుండగా, మరోవైపు ఈ తరహా ప్రతీకార చర్యల వల్ల స్థానిక రెస్టారెంట్లు, అల్పదాయక డెలివరీ భాగస్వాములే ఆర్థికంగా దెబ్బతింటారని రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల హక్కులను కాపాడటంతో పాటు సంస్థల జవాబుదారీతనాన్ని నిర్దేశించే కఠిన నిబంధనలు తక్షణ అవసరమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్
భారత ‘శాంతి’ నిబంధనలపై త్వరలో యూఎస్ స్పందన
భారత పౌర అణు విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరుస్తూ కేంద్ర అణుశక్తి శాఖ (డీఏఈ) ఇటీవల విడుదల చేసిన చారిత్రాత్మక ‘శాంతి’ (SHANTI - Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India) చట్టం ముసాయిదా నిబంధనలపై అమెరికా అణు పారిశ్రామిక రంగాలు సమగ్ర సమర్పణలు (ఫైనల్ సబ్మిషన్స్) చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికా-ఇండియా స్ట్రాటెజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) నేతృత్వంలో అమెరికాలోని న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ (ఎన్ఈఐ), ప్రముఖ న్యాయ నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలు కలిసి భారత ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను అందించేందుకు కసరత్తు పూర్తి చేస్తున్నాయి.సెప్టెంబర్ 4వ తేదీ నాటికి డీఏఈకి సమర్పించాల్సిన ఈ స్పందనల కోసం యూఎస్ఐఎస్పీఎఫ్ ఇటీవల ఒక ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. భారత పౌర అణు రంగంలో లైసెన్సింగ్ ప్రక్రియ, పరిమితులు, ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్, ప్రైవేట్ పెట్టుబడుల భద్రత, ప్రాజెక్ట్ నిర్మాణం వంటి కీలక అంశాలపై అమెరికా కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి.‘శాంతి’ నిబంధనల ప్రకారం ప్రైవేట్ సంస్థలు, జాయింట్ వెంచర్లు అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించడం, వాటిని నిర్వహించడం, పరిశోధనలు చేపట్టడానికి తొలిసారిగా అనుమతి లభించింది. అంతేకాకుండా డేటా సెంటర్లు, సెమీకండక్టర్ తయారీ, వైద్య రంగం, వ్యవసాయం వంటి విద్యుతేతర వినియోగానికి కూడా రేడియేషన్ సాంకేతికతను అనుమతిస్తుండడం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తోంది.2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సాధించాలని, అలాగే 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను అభివృద్ధి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సంబంధించి నిబంధనలలో స్పష్టత, సరళమైన లైసెన్సింగ్ విధానం ఉన్నప్పటికీ నష్టపరిహార నిబంధనలపై అంతర్జాతీయ కంపెనీల సూచనలు భారత నిర్ణయంలో కీలకం కానున్నాయి. ఈ సవరణలు భారత్-అమెరికా అణు వాణిజ్య సంబంధాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంతోపాటు భారత గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారనున్నాయని పారిశ్రామిక నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్
టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తమ ఉద్యోగులకు కేటాయించిన ల్యాప్టాప్ల్లో ‘డిజిటల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మానిటరింగ్’ (డీఈఎం) టూల్ను ఏర్పాటు చేయడం ఐటీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీనిపై కంపెనీ, ఉద్యోగుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అసలేం జరిగింది?ఉద్యోగులు ఏయే అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు, వాటిపై ఎంత సమయం వెచ్చిస్తున్నారు అనే వివరాలను ఈ కొత్త సాఫ్ట్వేర్ సేకరిస్తుందని సమాచారం. డేటా లీకేజీలను అరికట్టడం, ఐటీ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడం, సాంకేతిక సమస్యలను వేగంగా గుర్తించడమే లక్ష్యంగా సంస్థ ఈ చర్యలు చేపట్టినట్లు భావిస్తున్నారు. అయితే, కంపెనీ ఇటీవల ‘జీస్కేలర్’ భాగస్వామ్యాన్ని విస్తరించి డిజిటల్-మానిటరింగ్ పరిష్కారాలను ప్రారంభించినప్పటికీ అదే సాంకేతికతను ఇక్కడ వాడుతున్నారా లేదా అనేది అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.ఉద్యోగులలో పెరుగుతున్న ఆందోళనఈ నిర్ణయంపై టీసీఎస్ ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఐటీ భద్రతకే పరిమితం కాకుండా తమ వ్యక్తిగత పనితీరు, దైనందిన కార్యకలాపాలను పర్యవేక్షించే సర్వైలెన్స్ టూల్గా మారుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ఈ సాఫ్ట్వేర్ పేరు, దాని వెండర్ వివరాలు, అది ఎలాంటి డేటా సేకరిస్తుంది, ఆ సమాచారాన్ని ఎవరు చూడగలరనే అంశాలపై టీసీఎస్ స్పష్టత ఇవ్వలేదు. ఈ డేటాను వ్యక్తిగత ఉద్యోగి ఐడీతో అనుసంధానిస్తున్నారా లేదా భద్రతా బృందాల విశ్లేషణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారా అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.డేటా నిర్వహణ సవాలుప్రస్తుతం టీసీఎస్లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంత భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగుల ల్యాప్టాప్ల నుంచి నిరంతరం వచ్చే కార్యకలాపాల సమాచారాన్ని క్రోడీకరించడం, భద్రపరచడం, విశ్లేషించడం ఐటీ బృందాలకు పెద్ద సాంకేతిక సవాలుగా మారనుంది. యాజమాన్యం తమ స్పష్టమైన విధివిధానాలను వెల్లడించి పారదర్శకతను పాటిస్తేనే సంస్థ భద్రతతో పాటు ఉద్యోగుల విశ్వాసాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: సైబర్ ముఠాల ఆన్లైన్ దోపిడీకి కేంద్రం చెక్
ఫ్యామిలీ
ఏజ్–టెక్తో స్కామ్స్పై ఎటాక్
సాంకేతికతలో వేగంగా వస్తున్న మార్పులు వయోవృద్ధులలో చాలామందికి తెలియడం లేదు. సరికొత్త గ్యాడ్జెట్లు, మొబైల్ అప్లికేషన్లు, కొత్త స్మార్ట్ఫోన్లు... మొదలైనవి తమకు అందుబాటులోకి రావడం చాలా కష్టంగా మారింది. ఈ ప్రతికూలత వృద్ధులను మెయిన్ స్ట్రీమ్కు దూరం చేస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ‘హెల్ప్ఏజ్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘డిజిటల్ అక్షరాస్యత’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వృద్ధులను ఆన్లైన్ ప్రపంచంలోకి తీసుకురావడంతోపాటు అక్కడ సురక్షితంగా ఉండడానికి అవసరమైన జాగ్రత్తలు కూడా చెబుతోంది.ప్రాజెక్ట్ సురక్షిత్వృద్ధుల కోసం ‘హెల్ప్ ఏజ్’ సంస్థ దేశవ్యాప్తంగా వర్క్షాప్లు నిర్వహిస్తోంది. జీవనోపాధి మార్గాలకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు గ్రామీణ భారతదేశంలోని వృద్ధులకు డిజిటల్ అక్షరాస్యత అనేది కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘హెల్ప్ఏజ్’ గ్రామీణ ప్రాంతాలలోని వృద్ధుల కోసం డిజిటల్ సాధికారత కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇంటర్నెట్ మోసాలు, స్కామ్ల నుండి వృద్ధులను రక్షించడానికి ‘హెల్ప్ ఏజ్’ సంస్థ ‘ప్రాజెక్ట్ సురక్షిత్’ పేరుతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ భద్రతా నైపుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తరాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ‘డిజిటల్ గురుకుల్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులే డిజిటల్ గురువులై వృద్ధులకు శిక్షణ ఇస్తారు.సులువైన లక్ష్యాలుగా...ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్లు, నకిలీ కేవైసీ అప్డేట్లు, బ్యాంక్ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అని చెప్పే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ నేరాలకు సంబంధించి అన్ని వయసుల వారు బాధితులుగా ఉన్నప్పటికీ తక్కువ డిజిటల్ అక్షరాస్యత కారణంగా వృద్ధులు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారు.డిజిటల్ మోసాల వల్ల ఆర్థిక నష్టాలే కాదు తీవ్రమైన మానసిక క్షోభకూ గురవుతున్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. మోసాలను నివారించే తొలి అడుగు అవగాహన. మోసాలను ఎలా గుర్తించాలి, సమాచారాన్ని ఎలా ధ్రువీకరించుకోవాలి, అనుమానాస్పద ఫోన్ సంభాషణలకు సురక్షితంగా ఎలా స్పందించాలి... మొదలైన విషయాలను వృద్ధులకు నేర్పించే లెర్నింగ్ మాడ్యూల్స్లో ఏజ్–టెక్ ప్లాట్ఫామ్లు పెట్టుబడి పెడుతున్నాయి. రోజువారీ డిజిటల్ లావాదేవీలలో భద్రతను పెంపొందిస్తున్నాయి.సులువుగా... సౌకర్యంగా...సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్, బయోమెట్రిక్ సెక్యూరిటీ, రియల్–టైమ్ అలర్ట్లు, అథెంటికేషన్లాంటి ఫీచర్లు వయోవృద్ధులకు సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని కాపాడుతున్నాయి. వయోవృద్ధులు డిజిటల్ ప్లాట్ఫామ్లలో సౌకర్యంగా ఉండడానికి వీలైన డిజైన్లపై దృష్టి పెడుతున్నాయి టెక్ కంపెనీలు. ఉదాహరణకు... చదవడానికి స్పష్టమైన, సులభంగా ఉండే ఫాంట్లు, సహజ నావిగేషన్, వాయిస్ కమాండ్ వంటి ఫీచర్లు.‘ఏజ్–టెక్ ప్లాట్ఫామ్లు ఈ డిజిటల్ యుగంలో నివసిస్తున్న వృద్ధులను మోసాల బారిన పడకుండా కాపాడడమే కాదు వారి జ్ఞానాన్ని విస్తరిస్తున్నాయి. భద్రతను పెంచి ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతున్నాయి..ఈజీగా ఇన్వెస్ట్మెంట్టెక్నాలజీ అనేది వయోవృద్ధులకు సరికొత్త ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అందిస్తోంది. డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లు సులభతరం చేశాయి. పెట్టుబడులకు సంబంధించి ఈ ప్లాట్ఫామ్లు సమగ్రమైన సమాచారాన్ని, సులభంగా ఉపయోగించుకోగల ఇంటర్ఫేస్లను అందిస్తున్నాయి.హెల్తీ గ్యాడ్జెట్స్వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని రకరకాల గ్యాడ్జెట్లను రూపొందిస్తున్నాయి టెక్ కంపెనీలు. ఎస్వోఎస్ హెచ్చరికలతో కూడిన స్మార్ట్ వాకింగ్í Ü్టక్ల నుండి ఇంట్లో శారీరక శ్రమను తగ్గించే రోబోట్ వాక్యూమ్ క్లీనర్ల వరకు వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవే. ఆరోగ్యంపై దృష్టి సారింటచే వేరబుల్స్, వాయిస్ అసిస్టెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్లు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. దినచర్యలను స్వతంత్రంగా నిర్వహించుకోవడాన్ని సులభతరం చేస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్లలో చాలా వరకు మన దేశంలోని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, రిటైల్ స్టోర్ల ద్వారా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. వయసు పైబడడం అంటే ఒంటరితనానికి దగ్గర కావడం కాదు. గతంలో కంటే వంద రెట్లు ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయడం. ఆ ఉత్సాహం ఉండాలంటే... యాక్టివ్ లైఫ్స్టైల్ ఉండాలి. యాక్టివ్ లైఫ్ స్టైల్లో సాంకేతికతకు దగ్గర కావడం కూడా ఒకటి. ఏ కొద్దిమందికో తప్ప చాలామంది వృద్ధులకు సాంకేతికత చాలా దూరంగా ఉంది. ‘డిజిటల్ నిరక్షరాస్యత’ వల్ల వృద్ధులు ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆధునిక సాంకేతికతను వయో వృద్ధులకు దగ్గరచేసే కార్యక్రమాలు చేపడుతున్నాయి...
మా రాంబాబు గాడి పొల్యూషన్ పొదుపులు!
‘‘కాలుష్యం కాలుష్యం అంటూ ఏదో గగ్గోలు పెడుతూ ఉంటారు గానీ... అసలు పొల్యూషన్ వల్ల ఎంత పొదుపో తెల్సా?’’ అంటూ తెగ స్పీచుతున్నాడు మా రాంబాబుగాడు. ఏం జరిగిందంటూ వాళ్లావిడను పలకరించాన్నేను. ‘‘పొదుపూ... పొదుపూ అంటూ మీ ఫ్రెండుగారు చేస్తున్న పనులేమిటో చూస్తున్నారా. పొల్యూషన్ ఎక్కువ ఉండే పంజగుట్ట సెంటర్లో నిల్చుంటే జస్ట్ ఓ గంట సేపుంటే రోజుకు 20 సిగరెట్లు తాగినంత అట. ఓరోజు పాన్డబ్బా దగ్గకు వెళ్లి కాస్ట్లీ పెద్ద సిగరెట్ల పెట్టె రేటెంతో తెలుసుకున్నారు. అంతే... రోజూ ఆ పంజగుట్ట సెంటరుకెళ్లి నిల్చుండిపోతున్నారు. అదేమిటంటే... ‘చూశావా... ఒక్క సిగరెట్టూ కొనకుండా రోజూ 500 రూపాయలకు పైగా ఆదా చేస్తున్నాను తెల్సా’ అంటున్నారండీ ఆయన’’ అంటూ వాపోయింది. ‘‘నేను మాట్లాడ...’’ అంటూ ఏదో చెప్పబోతుండగానే... కట్ చేసి కంప్లెయింట్స్ కొనసాగించింది. ‘‘అంతేనా... ‘పంజగుట్టలో పొల్యూషన్ మాత్రమే కాదండీ.. ఆ రద్దీ తాలూకు ట్రాఫిక్ శబ్దాలూ, ఎడాపెడా రణగొణధ్వనులూ, ఆగకుండా హారన్లూ... బోల్డంత సౌండు పొల్యూషన్ కూడా కదండీ... వద్దండీ’ అన్నా. ఆ మాట వినగానే... ‘పిచ్చిదానా... ఈమధ్యే ఓ సర్వేలో తేలిందేమిటంటే... ఆ శబ్దాల మధ్య ఉండటం అంటే పేద్ధ పేద్ధ స్పీకర్లున్న మ్యూజిక్ సిస్టమ్లో డీజే సౌండ్లతో ఒక పాటను ఫుల్ వాల్యూమ్తో విన్నట్టట. చూశావా... ఫ్రీగా సిగరెట్లే కాదు... ఎగస్ట్రాగా బోలెడన్ని పాటలు ఫ్రీగా విన్నట్టే కదా! ఇగ... మనింట్లో మ్యూజిక్ సిస్టమ్ కొనాల్సిన అవసరమేముంది చెప్పు’ అంటూ పొదుపు పాఠాలు చెబుతున్నారండీ’’ అంటూ ఇంకా దిగులుపడిపోయింది. ‘‘అరెరె... అలాగా’’ అంటుండగానే... ‘‘అంతేనా... మొన్న సమ్మర్లో కాలుష్యం వల్ల వాతావరణంలో వేడి బాగా పెరిగిపోయి ఎక్కడో గుడ్డు పగలగొట్టి రోడ్డు మీద వేస్తే కుతకుతా ఉడికి ఆమ్లెట్ అయ్యిందని టీవీలో న్యూసొచ్చింది. అంతే... మర్నాటి నుంచీ ఎప్పుడు ఆమ్లెట్ కావాలనుకున్నా రోడ్డు మీదే వెయ్యి. అసలే ఈ మధ్య సిలెండరు ధరలు బాగా పెరిగాయి. రోడ్డుమీదే వంట చెయ్... గ్యాసు పొదుపు చెయ్యి’ అంటూ లెక్చర్లిస్తున్నారండీ’’ అంటూ మరో ఫిర్యాదు. ‘‘ఏరా’’ అంటూ వాణ్ణి పలకరించబోతుంటే ఏదో గొప్పపని సాధించినవాడిలాగా చిద్విలాసంగా కనిపిస్తూ... మాంఛి గీర పోజుతో స్టైల్గా చుట్టూ చూస్తున్నాడు వాడు. వాళ్లావిడ మాత్రం కళ్లనీళ్లొత్తుకుంటూ కనిపించింది. వాడి దారిలోనే వాణ్ణి ఎలా దారిలోకి తేవాలో తెలియక... చివరగా ఓ చిన్న ట్రిక్కు ప్లే చేశా. ‘‘ఒరేయ్ రాంబాబుగా... నీకో విషయం తెలుసా? ఇకపై పొల్యూషన్ మీద కూడా జీఎస్టీ వేస్తున్నారట’’ అన్నా. ‘‘ఊరుకో... పొల్యూషన్ మీద జీఎస్టీ ఏమిట్రా?’’ అన్నాడు వాడు. ‘‘ఎందుకు వేయరూ... జీఎస్టీ అంటే ఏమిటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. పొల్యూషన్ ఓ వస్తువు అనుకుందాం. దాన్ని నువ్వు ఫ్రీగా వాడుకుంటున్నావు. అంతేకాదు... ఆ కాలుష్యమేమో నీకు రోజూ ఉచితంగా సిగరెట్లు సప్లైచేస్తూ, ఫ్రీగా మ్యూజిక్ వినిపిస్తూ... ఇంతటి సర్వీసు ఇస్తుంటే... మన గవర్నమెంటు ఊరికే చూస్తూ ఉంటుందా? అందుకే నీలాంటి ‘ఫ్రీగా వస్తే ఫినాయిలు’ బాపతుగాళ్లను ఐడెంటిఫై చేసి జీఎస్టీ వసూలు చేయబోతున్నారట తెల్సా!’’ అంటూ హెచ్చరించా. దాంతో... దిగులుగా చూస్తూ ఇంటికి బయల్దేరిపోయాడు మారాంబాబుగాడు.– యాసీన్
లివింగ్ బ్యాంకులివి లవ్ డ్రా చేసుకోండి
వయోవృద్ధులకు ఫోన్ చేసి ‘మీ ఖాతా బ్లాక్ అయ్యింది’ అని డబ్బు దొంగిలించే డిజిటల్ దొంగలున్న ఈ కాలంలో వారి వద్ద ఉండే అసలైన నిధిని పట్టించుకుంటున్నామా? 70, 80 ఏళ్లు దాటిన మన అమ్మమ్మ, తాతయ్యల గుండెల్లో ఉన్న భాష, జ్ఞాపకం, సామెత, పాట, పండుగ, రుచి... ఈ పెన్నిధులను వింటున్నామా? రికార్డు చేస్తున్నామా? ‘లివింగ్ బ్యాంక్’ వంటి పెద్దల నుంచి ఏదైనా డ్రా చేస్తున్నామా అసలు?జీవితానుభవాలతో పండిపోయిన పెద్దలు ఎదురు పడితే వారికి చెయ్యెత్తి నమస్కరించాలి. కాని వాళ్లకు తెలియని టెక్ మోసాలు చేసి ఎలా దోచుకుందామా అని చూస్తున్నారు సైబర్ దొంగలు. ఏ సమాజంలో అయినా వయోవృద్ధులు ఆ సమాజానికి అనుభవాల బ్యాంక్. సాంస్కృతిక గని, ఆచారాల టెక్స్›్టబుక్. వాళ్ల దగ్గర ఉన్నవాటిలో విలువైనది డబ్బు కాదు... డేటా కాదు... డాక్యుమెంట్ చేయని అనుభవం. గూగుల్లో సెర్చ్ చేస్తే రాని వంటకం, ఏఐ జనరేట్ చేయలేని సామెత, యూట్యూబ్లో దొరకని బుర్రకథ, ఒక తుఫాను రాత్రి తెగువ, ఏడుతరాల జ్ఞాపకాలు, కష్టాలను ఎదుర్కొన్న స్థయిర్యం... ఇవన్నీ వారి లాకర్లలో నిక్షిప్తం అయి ఉన్నాయి. ఈ తరం చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది, కానీ వారిని గత దారుల్లో నడిపే తాత లేడు. ఈ లోటును పూరించాలి. అసలు పెద్దల నుంచి పొందాల్సిన అసలైన పెన్నిధిని పంచి పెట్టే ఖాతాలేమిటో చూద్దాం...మాటల ఖాతాఅమ్మమ్మ ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటూ పెట్టే ముద్దలో ఒక నీతి ఉంటుంది.‘చెట్టు నరికితే నీడ పోతుంది’ అనే సామెత వెనుక పర్యావరణ పాఠం ఉంటుంది. బుర్రకథ, హరికథ, జానపద గేయాలు పుస్తకాల్లోకి ఎక్కలేదు. అవి 75 ఏళ్ల నానమ్మ గొంతులోనే బతికున్నాయి. ఈరోజు పిల్లలకు రామాయణం కార్టూన్ లో చూపిస్తున్నాం, కానీ తాత చెప్పే ‘మాటల రామాయణం’లోని ఎమోషన్ వేరు. హైదరాబాద్లో ఒకటి రెండు ఎన్.జి.ఓలు ‘నానమ్మ కథలు’ లాంటి ప్రాజెక్ట్స్ నడుపుతున్నారు. డెబ్బయిలు దాటిన మహిళల నుంచి జానపద కథలు రికార్డ్ చేసి పిల్లలకు పాడ్కాస్ట్లుగా ఇస్తున్నారు. అంటే టెక్నాలజీని వాళ్ల కోసం కాకుండా వాళ్లతో కలిపి వాడుతున్నారు. జెన్ జి బాధ్యత ఏంటి? వారి మాటలను ఫోన్ లో రికార్డ్ చేయడం. 10 నిమిషాలు కూర్చొని ‘అమ్మమ్మా, మీ చిన్నప్పటి సంక్రాంతి ఎలా ఉండేది?’ అని అడగడం. ఆ ఒక్క వీడియో భావి తరాలకు ఆస్తి అవుతుంది.రుచి, ఆచారాల ఖాతా‘ఈ పూర్ణం బూరెలో నువ్వులు ఎందుకు వేస్తారు?’ అని అడిగితే అమ్మమ్మ చెబుతుంది– ‘చలికాలంలో ఒళ్లు వేడిగా ఉండటానికి’. ఇది వంటకం కాదు, మూలికా వైద్యం. ఉగాది పచ్చడి ఆరు రుచులు ఎందుకు, వినాయక చవితిలోని పత్రి తాలూకు ఔషధ గుణాలేమిటి, పెళ్లిలో ‘జీలకర్ర బెల్లం’ అర్థం ఏంటి – ఈ కోడ్ అంతా పెద్దల మెమరీలో ఉంది. మనం స్విగ్గీ, జొమాటోకు అలవాటు పడ్డాం. కానీ ‘చేతి రుచి’కి ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు చాలా మంది 65 దాటిన మహిళలు వంటలతో వ్యాపారం మొదలుపెడుతున్నారు. అది డబ్బు కోసం కాదు. ‘నా ఆచారం చావకూడదు’ అనే పట్టుదల. వాళ్ల నుంచి ఒక వంటకం నేర్చుకోవడం అంటే ఒక సంస్కృతిని సేవ్ చేయడమే. వాళ్లు వండేది కర్రీ కాదు, వారసత్వం.జీవిత పాఠాల ఖాతాగెలుపు కోసం ఏఐ మనకు 1000 ఆప్షన్లు ఇస్తుంది. కానీ ‘ఓటమి తర్వాత ఎలా లేవాలి’ అని ఎవరు చెబుతారు? కరువు చూసిన తాత, ఎమర్జెన్సీ చూసిన అమ్మమ్మ, ఉద్యోగం కోల్పోయి మళ్లీ నిలబడిన నాన్న... వీరికి మించిన వారున్నారా? నేటి జెన్–జి చిన్న చిన్న ఒత్తిళ్లకు, కెరీర్ టెన్షన్లకు తట్టుకోలేక ‘మెంటల్ పీస్’ కోసం థెరపీల చుట్టూ, మైండ్ఫుల్నెస్ యాప్ల చుట్టూ తిరుగుతోంది. కానీ మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల జీవితాలను ఒక్కసారి గమనించండి. వాళ్లు తమ జీవితంలో ఎన్నో ఆర్థిక సంక్షోభాలను చూశారు, సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా సరే ప్రశాంతంగా, నవ్వుతూ కూర్చోగలరు. వాళ్ల మైండ్ సెట్లో ఉన్న ఆ ‘మెంటల్ రెసిలియెన్స్’ (మానసిక స్థిరత్వం) నేటి తరానికి కావలసిన అసలైన పాఠం. డిప్రెషన్లను దరి చేరనీకుండా జీవితాన్ని ముందుకు సాగేలా చేసుకున్న అమ్మమ్మలు, నానమ్మలు అనే ఆ రియల్ లైఫ్ థెరపిస్ట్ల పక్కన కూర్చుని ఒక పది నిమిషాలు మాట్లాడితే మీ యాంగ్జైటీలన్నీ పటాపంచలవుతాయి. వాళ్ల వాలెట్లో క్రెడిట్ కార్డులు లేకపోవచ్చు.. కానీ వాళ్ల మనసులో ఉన్న ధైర్యం మన జీవితాలకు శ్రీరామరక్ష.ఈరోజు మనం ఏం చేయాలిసీనియర్ సిటిజన్స్ డే అంటే ‘శుభాకాంక్షలు’ పోస్ట్ పెట్టి వదిలేయడం కాదు. వాళ్ల ‘జ్ఞాపకాల అకౌంట్’ నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఈరోజు ఒక పని చేద్దామా? ఇంట్లో పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లి ఇవి అడగండి: మీకు ఇష్టమైన సామెత ఏంటి? మీరు చేసే స్పెషల్ వంట ఏంటి? మీ జీవితంలో మర్చిపోలేని రోజు ఏది? రికార్డ్ చేయండి. ఫోటో తీయండి. ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. అదే మనకు వచ్చే అసలైన వారసత్వం.
వరాలతల్లి.. కల్పవల్లి
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వివాహితలు తమ కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాల కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారని తెలుసు కదా... అయితే ఈసారి వరలక్ష్మీ వ్రతం రెండు వారాల పాటు చేసుకునే విధంగా రావడం విశేషం. సాధారణంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని అందరికీ తెలిసిందే. అయితే ఈసారి శుక్రవారం పౌర్ణమి రోజే వచ్చింది. పౌర్ణమి అమ్మవారికి ఇష్టమైన తిథి కాబట్టి మూడవ శుక్రవారం అయినా ఆ రోజున ఈ వ్రతం ఆచరించడం మరింత శ్రేష్ఠమని పండితుల అభిప్రాయం. శ్రద్ధ, భక్తి, ఓపిక, వెసులుబాటు ఉండాలే కానీ నెలలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా ఈ వ్రతం ఆచరించవచ్చునన్నది పెద్దల మాట. ఎప్పుడు చేసుకున్నా, ప్రాంతీయ భేదానుసారం కొద్దిపాటి మార్పు చేర్పులతో చేసుకునే ఈ వరలక్ష్మీ వ్రతవిధానమిది...ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు, గడపకు పసుపు, కుంకుమ, అందమైన ముగ్గులతో గృహాలంకరణ చేయాలి. ఒక పీఠంపై బియ్యం పోసి, దానిపై రాగి లేదా వెండి కలశాన్ని ఉంచాలి. కలశంలో నీరు, నాణేలు, పసుపు, కుంకుమ వేసి, పైన మామిడి ఆకులు, కొబ్బరికాయను ఉంచి లక్ష్మీదేవి గా భావించాలి. అమ్మవారి ముఖరూపాన్ని అలంకరించి పీఠంపై ప్రతిష్ఠించాలి.తోరాలు: తొమ్మిది నూలు దారపు పోగులతో, తొమ్మిది ముడులు వేసి, పసుపు రాసి తోరాలు (రక్షా సూత్రాలు) తయారు చేసి పూజలో ఉంచాలి.సంక్షిప్త పూజా విధానంగణపతి పూజ: సంప్రదాయం ప్రకారం ఏ పూజ చేసినా మొదట విఘ్నేశ్వరుడి పూజతోనే ప్రారంభించాలి. అందువల్ల పసుపు వినాయకుడిని చేసి, అక్షతలు, పూలతో పూజించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. లక్ష్మీ ఆరాధన: ఆ తర్వాత కలశంలో ఉన్న వరలక్ష్మీ దేవికి షోడశోపచార పూజ చేయాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదువుతూ సుగంధభరితమైన పువ్వులు, కుంకుమతో అర్చన చే యాలి.తోర పూజ: అమ్మవారి మూలమంత్రాలను పఠిస్తూ పూజలో ఉంచిన తోరాలకు పూజ చేసి, ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవడం వ్రతంలో ముఖ్య క్రతువు. నైవేద్యం: లక్ష్మీదేవికి ఇష్టమైన నవధాన్యాలు, బూరెలు, గారెలు, పరమాన్నం, కొబ్బరికాయలు వంటి నవకాయ పిండివంటలను, ఐదు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. వ్రత కథ: పూర్వం పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రత మహత్యాన్ని వివరించాడు. మగధ దేశంలోని కుండినం అనే నగరంలో చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాలు ఉండేది. ఆమె అత్తమామలను, భర్తను దైవంగా భావించి సేవించేది. ఆమె భక్తికి మెచ్చిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో ప్రత్యక్షమైంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానంటూ వ్రతవిధానాన్ని చెప్పింది. చారుమతి తన కలను కుటుంబ సభ్యులకు వివరించి, ఊరిలోని మిగతా స్త్రీలతో కలిసి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించింది. పూజ పూర్తి కాగానే, వ్రతం చేసిన స్త్రీలందరి ఇళ్లు ధనధాన్యాలతో, బంగారు ఆభరణాలతో నిండిపోయాయి. అప్పటినుండి ముత్తైదువులు ఈ వ్రతాన్ని ప్రతి ఏటా సంప్రదాయంగా చేసుకుంటున్నారు.వాయనం: పూజ తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి, వ్రత కథాక్షతలను శిరస్సున ధరించాలి. సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి, తాంబూలంలో పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, రవికె గుడ్డ, ప్రసాదాలను వాయనంగా ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి.మరికొన్ని విశేషాలు‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్టమైన’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మీవ్రతం.శ్రావణ మాసమంటే ఎందుకని ఇష్టం? శ్రవణం లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం పేరు మీదుగా వచ్చిన మాసం కాబట్టి ఈ మాసమంటే అమ్మవారికి ఇష్టం. అలాగే పూర్ణిమ రోజున అమ్మవారు షోడశ కళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతికరం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీ నివాస స్థానాలుమహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్తాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, గోమయం, గోపృష్టం, ఆవు కొమ్ముల మధ్యన, పూజామందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార సంపన్నుడైన పండితుడు లేదా గురువు. శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలి. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందట. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, ధనం, ధాన్యం, సౌభాగ్యం వంటివి కూడా ధనమే. వరలక్ష్మీ వ్రతం పూజా విధానంవరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి. అది వరలక్ష్మీవ్రతం. వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వివరాలు...పండ్లు – పిండివంటలు అలంకరణ వస్తువులు ∙పసుపు, కుంకుమ, గంధం ∙అక్షతలు, అగరుబత్తీలు ∙కర్పూరం, నెయ్యి, నూనె ∙దూది వత్తులు, హారతి పళ్ళెం ∙తమలపాకులు (20), వక్కలు ∙నాణేలు ∙కలశం పాత్ర (వెండి/రాగి/ఇత్తడి) ∙ఐదు రకాల పండ్లు (అరటి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష, జామ వంటి పండ్లు ∙కొబ్బరికాయలు (కనీసం 3) ∙తోరాలు (9 పోగుల దారాలు) నానబెట్టిన శనగలు ప్రసాదాలు (పరమాన్నం, గారెలు, బూరెలు) ∙అమ్మవారి ముఖరూపం ∙మామిడి ఆకులు, అరటి మొక్కలు ∙పూలమాలలు, విడిపూలు ∙కొత్త రవికల గుడ్డలు (వాయనం కోసం) ∙పీఠం (చెక్క పీట), ఎర్రటి వస్త్రం ∙గాజులు, తాంబూలం వస్తువులు.కలశం ఎందుకు?వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి. ఎందుకంటే కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం. అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తిస్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.– డి.వి.ఆర్.
అంతర్జాతీయం
4 పాములు.. అప్పుడు ఒకదానికొకటి చుట్టుకుని..
అమెరికాలోని వ్యోమింగ్, వైట్ రివర్ ఫార్మేషన్లో శాస్త్రవేత్తలకు సుమారు 38 మిలియన్ సంవత్సరాల నాటి 4 పాముల శిలాజాలు లభించాయి. ఇవి ఒకదానికొకటి చుట్టుకుని, బొరియలాంటి ప్రదేశంలో కలిసి ఉన్న స్థితిలోనే శిలాజాలుగా మారాయి. ఈ కొత్త జాతికి హైబర్నోఫిస్ బ్రెయితాప్టి అని పేరు పెట్టారు.వైట్ రివర్ ఫార్మేషన్లో లభించిన ఈ శిలాజాలను అగ్నిపర్వత బూడిద, మట్టి, వరద నీరు కలిసి వేగంగా కప్పివేయడంతో ఇంతకాలం చెక్కుచెదరకుండా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా పాముల శిలాజాలు విడిపోయిన వెన్నెముక భాగాల రూపంలో మాత్రమే దొరుకుతాయి. కానీ ఇక్కడ పూర్తి అస్థిపంజరాలు లభించడం ప్రత్యేకత.మూడు పాములు ఒకే చోట కలిసి ఉండటం వల్ల అవి చలికాలంలో ఒకే బొరిలో ఆశ్రయం పొందేవని, బహుశా కలిసి నిద్రాణ స్థితిలో ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, పాములు నిజంగానే నిద్రాణ స్థితిలో ఉన్నాయని నిర్ధారించడానికి శిలాజ ఆధారాలు సరిపోవని వారు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా ప్రాచీన పాముల పరిణామక్రమంతో పాటు వాటి సామూహిక ప్రవర్తనపై కూడా కీలక సమాచారం లభించింది.పాముల శరీరంలో తల నుంచి తోక వరకు పొడవైన వెన్నెముక ఉంటుంది. ఇందులో వందల సంఖ్యలో వెన్నుపూసలు ఉంటాయి. పాముల వెన్నెముకలో సాధారణంగా వందలాది వెన్నుపూసలు ఉంటాయి. ప్రతి వెన్నుపూసకు పక్కటెముకలు అనుసంధానమై ఉంటాయి. వెన్నెముక చాలా వంగేలా ఉండటం వల్ల పాములు మెలికలు తిరుగుతూ కదలగలుగుతాయి. పాములకు చేతులు, కాళ్లు లేకపోయినా వెన్నెముక మాత్రం ఉంటుంది.ప్రారంభ ఒలిగోసీన్ కాలానికి చెందినవి.. కాగా, ఈ పాములు ప్రారంభ ఒలిగోసీన్ కాలానికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ ద్వారా ఉత్తర అమెరికాలోని చిన్న బొరియల్లో నివసించే పాముల చరిత్రపై కొత్త సమాచారం లభించింది. ఈ పాముల సమూహం గురించి శాస్త్రవేత్తలు 1986లోనే తొలిసారి వివరించారు. ఈ శిలాజాలు పాములు కలిసి ఆశ్రయం పొందిన ప్రదేశానికి సంబంధించినవి కావచ్చని సూచించారు. శిలాజాల వెన్నుపూసలు, పుర్రెను నిశితంగా పరిశీలించిన తర్వాత ఇవి గతంలో తెలిసిన ఒగ్మోఫిస్, కలమాగ్రాస్ పాముల నుంచి భిన్నమైనవని తేలింది. పరిణామ విశ్లేషణలో ఈ కొత్త పాము ఇతర బోయిడ్ పాములన్నింటికీ సోదర సమూహంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇదీ చదవండి: యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని కుమారుడు
ఇజ్రాయెల్ ఎన్నికల ప్రచార హోర్డింగుపై మమ్దానీ చిత్రం
టెల్అవీవ్: అక్లోబర్లో ఎన్నికలు జరగనున్న ఇజ్రాయెల్లో ఒక ప్రచార హోర్డింగ్ ఇప్పుడు చర్చనీయాంశ మైంది. టెల్ అవీవ్ నగరం మధ్యలో అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పార్టీ ఏర్పాటు చేసిన బిల్బోర్డ్పై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీని చిత్రించారు. పోస్టర్లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇరాన్ నాయకుడు మొ జ్తాబా ఖమేనీ, హెజ్»ొల్లా అధిపతి నయీమ్ ఖాసెమ్ల పక్కన ఆయన ఫోటోను చిత్రించారు. ‘వారు నెతన్యాహు ఓడిపోవాలని కోరుకుంటున్నారు. వారిని గెలవ నివ్వకండి’అని లికుడ్ పార్టీ లోగోతో రాశారు. గాజా కాల్పుల విరమణ ప్రయత్నాలు నిలిచిపోయిన తరుణంలో, ఈ చర్య వారి మధ్య బహిరంగ వైరాన్ని మరింత తీవ్రం చేసింది. జులైలో ఇజ్రాయెల్ నెసెట్ను రద్దు చేయడంతో, అక్టోబర్లో ఎన్నికలకు మార్గం సుగమమైంది. 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో దాడుల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జాతీయ ఎన్నికలు ఇవే. తన అతివాద కూటమిని తిరిగి అధికారంలో తీసుకొచ్చేందుకు నెతన్యాహు ప్రచారలోకి దిగారు. అమెరికాలో ఇటీవల జరిగిన పోల్స్లో, అమెరికన్ యూదుల్లో నెతన్యాహు కంటే మమ్దానీకే ఎక్కువ ప్రజాదరణ ఉందని తేలింది. అభిప్రాయ సేకరణలో తన అధికార కూటమి వెనుకబడి ఉండటాన్ని గ్రహించిన నెతన్యాహు, తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ బిల్బోర్డ్ ఫోటోను పోస్ట్ చేశారు. మమ్దానీ తనను ఒక యుద్ధ నేరస్థుడని పిలుస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు. అయితే, నెతన్యాహు ఎన్నికల ప్రచార సామగ్రిలో తన చిత్రాన్ని చేర్చడంపై మమ్దానీ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. ఇదీ చదవండి: యూకేలో కుప్పకూలిన విమానం భారత సంతతి దంపతుల దుర్మరణం మమ్దానీ తన మేయర్ ఎన్నికల ప్రచారం నుంచే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని గట్టిగా విమర్శిస్తూ వచ్చారు. గత నెలలో నెతన్యాహును యుద్ధ నేరగాడు అనడంతో మాటల యుద్ధం తీవ్రమైంది. సెపె్టంబరులో నగరంలో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి నెతన్యాహు హాజరైతే, ఆయన అరెస్టు కోసం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్ను అమలు చేయాలని అమెరికా అధికారులకు పిలుపునివ్వడం తెలిసిందే.ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్
ప్రపంచం అంతం కావడానికి ఇక ఇది చాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరకొరియాతో దౌత్య చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 వరకు అణు వార్హెడ్లు ఉండొచ్చని దక్షిణ కొరియా అంచనా వేసింది. అణు బాంబును మోసుకెళ్లి పేల్చగల అణ్వాయుధ భాగాలను అణు వార్హెడ్లు అంటారు.దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూ బ్యాక్ గురువారం ఈ అంచనాను వెల్లడించారు. ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 అణు వార్హెడ్లు ఉండొచ్చని ఆయన తెలిపారు. ఈ సంఖ్య ట్రంప్ ఒక రోజు ముందు చెప్పిన అణ్వాయుధాల కంటే గణనీయంగా ఎక్కువ. ఉత్తర కొరియా వద్ద 57 చాలా శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు.పార్లమెంటరీ కమిటీ ముందు ఆన్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా వద్ద సాధారణంగా 80 నుంచి 120 అణు వార్హెడ్లు ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పారు. అయితే కచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం కష్టమని హెచ్చరించారు. అనంతరం ఈ అంచనా ప్రైవేట్ పరిశోధనా సంస్థల నుంచి వచ్చిందని, దక్షిణ కొరియా సైన్యం అధికారికంగా ధ్రువీకరించలేదని స్పష్టం చేశారు.కిమ్ను మళ్లీ కలుస్తానన్న ట్రంప్కిమ్తో మళ్లీ సంబంధాలను ఏర్పరచుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలకు ఆయన నుంచి స్పందన వచ్చిందని ట్రంప్ తెలిపారు. ఈ ఏడాది చివరలో ఉత్తర కొరియా నేతను కలుస్తానని భావిస్తున్నట్లు ధ్రువీకరించారు. ఈ వ్యాఖ్యలతో 2018, 2019లో ఇద్దరు నేతలు నిర్వహించిన అపూర్వమైన సమావేశాల తర్వాత మరో ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సమావేశంపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఉత్తర కొరియా అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపుపై విభేదాలతో ఆ దౌత్య ప్రయత్నాలు చివరకు విఫలమయ్యాయి. ట్రంప్ తన రెండో పదవీకాలంలో కిమ్తో మళ్లీ చర్చలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు.చర్చల గురించి నాకు తెలియదు: కిమ్ సోదరిట్రంప్తొ మళ్లీ సంబంధాలు ఏర్పడుతున్నాయన్న ప్రకటనపై ఉత్తరకొరియా నుంచి జాగ్రత్తతో కూడిన స్పందన వచ్చింది. ట్రంప్, కిమ్ మధ్య ఇటీవల ఎలాంటి సంప్రదింపులు జరిగాయో తనకు తెలియదని కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాల్లో అమెరికా భాగస్వామ్యాన్ని తగ్గించాలని ట్రంప్ ఆదేశించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విన్యాసాలను ఉత్తర కొరియాపై వైరంగా ట్రంప్ అభివర్ణించారు. వార్షిక ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలను 11 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించారు. అయితే ఈ మార్పులతో విన్యాసాలు రెచ్చగొట్టే లేదా దూకుడు చర్యలు ఏమీ తగ్గలేదని కిమ్ యో జోంగ్ అన్నారు.57 అణ్వాయుధాలా?ట్రంప్ 57 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పడం అసాధారణంగా మారింది. ఎందుకంటే ఉత్తర కొరియా అణ్వాయుధ నిల్వల పరిమాణంపై అమెరికా ప్రభుత్వం అధికారిక అంచనాను బహిరంగంగా వెల్లడించదు. దక్షిణ కొరియా కూడా ఉత్తరకొరియా వద్ద ఉన్న అణ్వాయుధ నిల్వలపై వివరణాత్మక అంచనాలను బహిరంగంగా వెల్లడించకుండా సంప్రదాయంగా వ్యవహరిస్తోంది. ఉత్తర కొరియాను అణ్వాయుధ దేశంగా అధికారికంగా గుర్తించదు.ప్రయోగిస్తే ప్రపంచం ఏమైపోతుంది?చిన్న స్థాయి అణు యుద్ధం కూడా ప్రపంచ ఆహార వ్యవస్థను ప్రభావితం చేయగలదని శాస్త్రీయ నమూనాలు సూచిస్తున్నాయి. ఉత్తరకొరియా ఒకవేళ 120 అణు వార్హెడ్లు ప్రయోగిస్తే ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రాణనష్టం, ఆహార సంక్షోభం, పర్యావరణ నష్టం సంభవించే అవకాశం ఉంది. అయితే, ఒక్క అణ్వాయుధమే జనసాంద్రత ఉన్న ప్రాంతంలో పేలితే భారీ ప్రాణనష్టం, మౌలిక వసతుల విధ్వంసం, దీర్ఘకాలిక రేడియేషన్ ప్రభావాలు సంభవించవచ్చు. పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలు ఉపయోగిస్తే పేలుళ్ల వల్ల ఏర్పడే పొగ వాతావరణంలోకి చేరి సూర్యకాంతిని తగ్గించవచ్చు. దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పడిపోవడం, పంటల దిగుబడి భారీగా తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా కరువు ఏర్పడటం వంటి పరిణామాలు సంభవించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, ప్రభావాన్ని వార్హెడ్ల సంఖ్యతో మాత్రమే నిర్ణయించడానికి వీల్లేదు. వాటి పేలుడు శక్తి, ఎక్కడ పేలుతాయి, ఎంతమేర నగరాలు లేదా పారిశ్రామిక ప్రాంతాలు దెబ్బతింటాయి వంటి అంశాలు కూడా కీలకం. వాటిని ప్రయోగిస్తే మానవ నాగరికతకు అత్యంత తీవ్రమైన విపత్తును రావచ్చు. ఇదీ చదవండి: యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు
‘భారతీయులే గొప్ప.. పాకిస్తానీలకు దిక్కులేదా?’ అవమానంపై పాక్ ఎంపీ ఆవేదన!
విమానం రద్దు కావడంతో హోటల్ ముందు ప్రయాణికుల క్యూ.. కానీ ఒక్క ప్రకటనతో పాకిస్తానీలకు షాక్!. ‘ఇండియా, అమెరికా పాస్పోర్ట్ ఉన్నవారికే వసతి’ అంటూ ప్రకటన. దీంతో, పాకిస్తాన్ మాజీ స్పీకర్ అసద్ ఖైసర్ సంచలన ఆరోపణలు చేశారు. తాను కూడా ఈ పరిస్థితిని స్వయంగా ఎదుర్కొన్నానని పార్లమెంట్లో చెప్పడంతో ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. యూఏఈని ‘సోదర దేశం’గా చెప్పుకునే పాకిస్తాన్కు.. అక్కడే ఇలాంటి అనుభవం ఎదురైందంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.వివరాల మేరకు.. విమానం రద్దు కావడంతో తాను సహా పలువురు ప్రయాణికులు హోటల్లో ఉండేందుకు ప్రయత్నించారని ఖైసర్ తెలిపారు. అయితే పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉన్న ప్రయాణికుల పట్ల హోటల్ సిబ్బంది తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియా, అమెరికా పాస్పోర్ట్ ఉన్నవారికి మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే దౌత్యపరంగా స్పందించాలని ఖైసర్ డిమాండ్ చేశారు. యూఏఈతో పాకిస్తాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ దేశాన్ని తాము సోదర ఇస్లామిక్ దేశంగా భావిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేయకుండా పాక్ విదేశాంగ శాఖ, విదేశాంగ మంత్రి యూఏఈ అధికారులతో ఈ విషయాన్ని లేవనెత్తాలని కోరారు.అంతేకాదు.. యూఏఈ అభివృద్ధిలో పాకిస్తానీల పాత్ర ఎంతో ఉందని ఖైసర్ గుర్తుచేశారు. యూఏఈలో 15 లక్షలకు పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామని చెప్పారు. కాగా, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ‘సానుకూల పాత్ర’ పోషించిందని చెప్పుకున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని ఖైసర్ ప్రస్తావించారు. దీంతో అసలు యూఏఈలో ఏం జరిగింది? పాకిస్తాన్ ప్రయాణికులకే ఎందుకు వసతి నిరాకరించారన్న ఆరోపణలు వచ్చాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యూఏఈలో 15 లక్షలకు పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారని తాజా నివేదిక పేర్కొంటోంది. అందువల్ల ఇలాంటి ఆరోపణలు పాకిస్తాన్కు రాజకీయంగానే కాకుండా ప్రవాసుల భద్రత, ప్రయాణాల విషయంలోనూ ప్రాధాన్యం కలిగిస్తాయి. అయితే, గతంలో కూడా యూఏఈలో పాకిస్తాన్, భారత్ సహా వివిధ దేశాల ప్రయాణికులు ప్రవేశ నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భాల్లో యూఏఈ అధికారులు నిబంధనలు జాతీయత ఆధారంగా కాకుండా, హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్, ఆర్థిక సామర్థ్యం వంటి ప్రవేశ నిబంధనల ఆధారంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు.
జాతీయం
రాజస్థాన్లో ఉద్రిక్తత : 24 గంటల్లో 'జంతర్ మంతర్ 2.0' సీజేపీ హెచ్చరిక
జైపూర్, రాజస్థాన్: స్కూల్ ఠీక్ కరో' (పాఠశాలలను బాగు చేయండి) ప్రచారంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రాజస్థాన్లో చేపట్టిన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు దాడిచేయడంపై సీజేపీ స్పందించింది. సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, ఇతరులపై అమానుషంగా దాడిచేయడాన్ని,వాహనాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. తమపై ఎటాక్ చేసిన దుండగులను 24 గంటల్లో అరెస్టు చేయాలని రాజస్థాన్ పోలీసులను డిమాండ్ చేసింది. లేదంటే 24 గంటల తర్వాత రాజస్థాన్లో 'జంతర్ మంతర్ 2.0' ప్రారంభమవుతుంది; ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని హెచ్చరించింది. అయితే ఈ విషయంలో గ్రామస్తులను మాత్రం వేధించకూడదని స్పష్టం చేసింది. ఇందులో గ్రామస్తుల ప్రమేయం ఏమీ లేదనీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. గ్రామ పాఠశాలను సందర్శించిన సందర్భంగా జరిగిన ఘర్షణ వాతావరణంపై కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ స్పందిస్తూ , "ప్రజలు, యువత , విద్యార్థులలో ఆగ్రహం ఉంది. ప్రభుత్వం దానిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించడం, ఫోటోలు తీయడం లేదా నివేదికలు ప్రచురించడం వంటివి చేయరాదని జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తప్పబట్టారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలను జారీ చేయడం సరైనది కాదన్నారు. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న పరిస్థితిని, సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టడానికి బదులుగా, ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి చేటున్నారు. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించకుండా లేదా ఫోటోలు తీయకుండా ప్రజలను అడ్డుకోలేరన్నారు. వాస్తవానికి, ప్రభుత్వం వార్తలను అణచివేయడానికి , ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ <राजस्थान पुलिस को 24 घंटों का समय दिया गया है इन गुंडों को गिरफ्तार करें,बिना गांव वालो को परेशान किए इसमें गांव वालो का कोई योगदान नहीं है24 घंटे निकलने के बाद राजस्थान में शुरू होगा जंतर मंतर 2.0 , जो आगे होगा उसकी जिम्मेदार हम नहीं होंगे@Cockroachisback#schoolThikKaro pic.twitter.com/kRyFncu9Sj— Cockroach Janta party (@IAMVICKYFANS) August 21, 2026 కాగా సీజేపీ ప్రచారంలో భాగంగా జయపూర్ జిల్లాలోని బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాంపురా కన్వర్పురా గ్రామంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేయడానికి వచ్చిన కార్యకర్తలను గ్రామస్తులు, సీజేపీ బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. సీజేపీ బృందం రాకముందే గ్రామస్తులు ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం సీజేపీ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీజేపీ కార్యకర్తలను గ్రామంలోనికి రానీయకుండా అడ్డుకుని, అక్కడినుంచి పంపించివేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.గతంలో సీజేపీ నిర్వహించిన తనిఖీల నేపథ్యంలో, రాజస్థాన్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు మరియు మీడియా ప్రతినిధుల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంపై సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని దాచి పెట్టేందుకే విద్యాశాఖ మంత్రి ఇలాంటి ఆంక్షలు విధిసస్తోందని, తమ ప్రచారం ఆగదని పేర్కొన్నారు. 'స్కూల్ ఠీక్ కరో' ప్రచారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు.#WATCH | Attack on Cockroach Janta Party (CJP) team in Jaipur village | Jaipur, Rajasthan: Congress MLA Sachin Pilot says, "State Govt has issued a fresh order that no journalist can enter a school, no photos can be taken, and nothing can be reported. They want to keep their… pic.twitter.com/Q4NTYATzVe— ANI (@ANI) August 21, 2026 ప్రస్తుతం ఈ పాఠశాల భవనం ప్రమాదకరంగా మారి మూతపడటంతో, సమీపంలోని పశువుల కొట్టంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, స్థానిక ప్రయత్నాలతోనే పాఠశాలను బాగు చేసుకోవచ్చని గ్రామస్తులు, భాజపా కార్యకర్తలు తెలిపారు. అనంతరం వారు పాఠశాల వెలుపల ధర్నా చేపట్టి నినాదాలు చేశారు.సీజేపీ కార్యకర్త శివాంగి శర్మ మాట్లాడుతూ, "మమ్మల్ని ఉగ్రవాదులని, నక్సల్స్ అని అంటూ మా కార్యకర్తలపై దాడి చేశారు. ఈ బయటివాళ్ళు... లోపలివాళ్ళు... ఏంటిది... ఇది ఒకే దేశం. మేము ఏ పార్టీ నుంచో గానీ, మరో దేశం నుంచో గానీ రాలేదు. మేము మన సొంత దేశపు బిడ్డల గురించి మాట్లాడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్తో కలిసి రాహుల్గాంధీ ధర్నామరోవైపు తాము బీజేపీ కార్యక్తలం కాదని, సీజేపీ కార్యకర్తలే తమ కార్లను ధ్వంసంచేసుసుకున్నారని తెలిపారు. తమ పాఠశాలను బాగు చేసుకునే పనులను ఇప్పటికే ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఈ ఘటన గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని బగ్రూ డీఎస్పీ ధర్మేంద్ర శర్మ తెలిపారు.(14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’)
విజయ్ను రాహుల్గాంధీ ద్రోహి అంటారా?
తమిళనాడులో డీలిమిటేషన్ అంశం మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ విషయంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ వైఖరి మారిందంటూ అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం విజయ్ తన వైఖరిని సడలించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు విజయ్ మిత్రపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తారని నిలదీస్తున్నాయి.. డీఎంకే ఎంపీ దయానిధి మారన్, సీఎం విజయ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో డీలిమిటేషన్ బిల్లుపై ఓ పెద్ద జాతీయ పార్టీ డీఎంకేను ‘‘తమిళనాడు ద్రోహులు’’గా అభివర్ణించిందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే ఎప్పుడూ తన వైఖరిని మార్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ వైఖరిలో మార్పు కనిపిస్తోందని ఆరోపించారు.‘‘అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఒక తీర్మానం, అసెంబ్లీలో మరో తీర్మానం చేసి డీలిమిటేషన్కు వ్యతిరేకంగా నిలిచిన విజయ్.. ఇప్పుడు న్యాయమైన డీలిమిటేషన్ కావాలని చెబుతున్నారు. మరి విజయ్ను రాహుల్గాంధీ ద్రోహి అంటారా?’’ అంటూ దయానిధి మారన్ ప్రశ్నించారు.అర్ధరాత్రి భేటీతో మార్పు వచ్చిందా?కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విజయ్ భేటీ అయిన తర్వాతే ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని డీఎంకే ఆరోపిస్తోంది. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించిన టీవీకే.. ఇప్పుడు ‘‘న్యాయమైన డీలిమిటేషన్’’ అంటూ కొత్త వైఖరి తీసుకుందని విమర్శించింది. ఈ పరిణామాలను డీఎంకే రాజకీయంగా ఉపయోగించుకుంటూ విజయ్ స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఇది పూర్తి యూటర్న్: అన్నాడీఎంకేవిజయ్ వైఖరిపై అన్నాడీఎంకే కూడా తీవ్రంగా స్పందించింది. టీవీకే ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుందని ఆరోపించింది. ‘‘ఇప్పుడు మీరు చెబుతున్నదే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత మాట మార్చడం ఎందుకు?’’ అంటూ అన్నాడీఎంకే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. డీలిమిటేషన్ అంశంపై టీవీకే ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని అన్నాడీఎంకే ‘‘రాజకీయ డ్రామా’’గా అభివర్ణించింది.టీటీవీ దినకరన్ విమర్శలుఅమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్ కూడా విజయ్పై విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీవీకే అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆరోపించారు. డీలిమిటేషన్ అంశంలో విజయ్ వైఖరి మారడంతో ఆ రాజకీయ వ్యూహం బయటపడిందని వ్యాఖ్యానించారు.మా వైఖరిలో మార్పు లేదు: టీవీకేవిమర్శల నేపథ్యంలో టీవీకే ఐటీ విభాగం స్పందించింది. డీలిమిటేషన్ అంశంపై పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని, న్యాయమైన డీలిమిటేషన్ కోసం మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది.డీలిమిటేషన్పై కొత్త రాజకీయ సమరండీలిమిటేషన్ అంశం ఇప్పటికే తమిళనాడులో సున్నితమైన రాజకీయ అంశంగా మారింది. ఇప్పుడు విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందనే ఆరోపణలు రావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విజయ్ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ముప్పేట విమర్శలు గుప్పిస్తుండగా.. టీవీకే మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. దీంతో రానున్న రోజుల్లో డీలిమిటేషన్ అంశం తమిళనాడు రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: డీలిమిటేషన్.. కేంద్రం కీలక నిర్ణయం
డీలిమిటేషన్పై బిగ్ ట్విస్ట్.. ప్రత్యేక పార్లమెంట్ భేటీకి కేంద్రం కసరత్తు?
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లు కోసం పార్లమెంట్ను మరోసారి కొలువుదీర్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందా? వర్షాకాల సమావేశాలు ముగిసినా.. పార్లమెంట్ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. దీంతో అవసరమైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురావచ్చన్న ప్రచారం ఊపందుకుంది.ఇప్పటికే డీలిమిటేషన్ అంశంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. 543 నుంచి లోక్సభ స్థానాల సంఖ్య పెరిగినా.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత 129 స్థానాలకు గాను కొత్తగా 195కు పెరుగుతాయని, మొత్తం లోక్సభలో వాటి వాటా దాదాపు 24 శాతంగానే ఉంటుందని ఆయన వివరించారు.తమిళనాట ట్విస్ట్.. ఇక తాజాగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలోనూ డీలిమిటేషన్ అంశం చర్చకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడు సీఎం విజయ్.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడొచ్చన్న ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో దక్షిణాది వాటా తగ్గకుండా కేంద్రం హామీ ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందన్న ప్రచారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. గతంలో డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. ఇప్పుడు “దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకపోతే?” అన్న కోణంలో మాట్లాడటం చర్చకు దారితీసింది. ఈ మార్పును విపక్షాలు, ముఖ్యంగా డీఎంకే, రాజకీయంగా ప్రశ్నిస్తోంది.ఇది కూడా చదవండి: డీకే ఎదుట విజయ్ సరెండర్.. డీఎంకేకు చిక్కిన అస్త్రంమరోవైపు డీఎంకే వైఖరి కూడా కీలకంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల లోక్సభ వాటా తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్ను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మాత్రం ప్రస్తుత 543 స్థానాల సంఖ్యను, తమిళనాడుకు ఉన్న 39 స్థానాలను మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలన్న డిమాండ్ను తాజాగా వెల్లడించారు.ప్రత్యేక సమావేశాలపై చర్చ..ఇక అసలు ఆసక్తి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపైనే! వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగిశాయి. అయినప్పటికీ పార్లమెంట్ను ఇంకా ప్రొరోగ్ చేయకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్రం వ్యూహాత్మకంగా ప్రత్యేక సమావేశాలకు మార్గం సిద్ధం చేస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రత్యేక సమావేశాలు ఖరారయ్యాయని కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. మొత్తంగా చూస్తే.. డీలిమిటేషన్ బిల్లు, దక్షిణాది ప్రాతినిధ్యం, మహిళా రిజర్వేషన్, లోక్సభ స్థానాల పెంపు.. ఈ నాలుగు అంశాలు మరోసారి జాతీయ రాజకీయాలను వేడెక్కించే అవకాశముంది. అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని చెబుతుంటే.. దక్షిణాది నేతలు మాత్రం “సంఖ్య పెరిగినా.. రాజకీయ వాటా తగ్గకూడదు” అన్న హామీ కోరుతున్నారు. మరి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా? వస్తే డీలిమిటేషన్ బిల్లు టేబుల్పైకి వస్తుందా? అదే ఇప్పుడు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో అసలు ప్రశ్న!
గో బ్యాక్ సీజేపీ.. తరిమికొట్టిన గ్రామస్తులు!
కాక్రోచ్ జనతా పార్టీ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్ జైపూర్లో ఓ ప్రభుత్వ పాఠశాల పరిశీలనకు వెళ్లిన ఆ సంస్థ సభ్యుల్ని కొందరు అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పిడిగుద్దులతో తరిమి కొట్టారు. వాహనంలో వెళ్తున్న సమయంలో రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది.సీజేపీ దేశవ్యాప్తంగా స్కూల్ ఠీక్ కరో పేరిట ఓ ఉద్యమం నడుపుతోంది. ఇందులో భాగంగా.. జైపూర్ రాంపురా–కన్వర్పురా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితులను పరిశీలించేందుకు ఆ సంస్థ బృందం వెళ్లింది. గత కొంతకాలంగా ఆ స్కూల్లో పశువుల పాక నడుస్తోందన్నది సీజేపీ ప్రధాన ఆరోపణ. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల పరిస్థితి, బోధనా సౌకర్యాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్లు పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా కూడా పాల్గొనాల్సి ఉంది.Very satisfying face off 🤣🤣🤣Rajasthan showing the way. Dipke got taste in Jaipur and now Ranka and team again in Rajasthan 🔥🤲🏻 pic.twitter.com/37rDnrgPov— Lala (@FabulasGuy) August 21, 2026VIDEO | Jaipur, Rajasthan: Cockroach Janata Party (CJP) co-convenor Ashutosh Ranka and others chased away by locals as they tried to visit Bagru village. Shivangi Sharma, CJP worker, says, "They attacked our workers, saying we are terrorists, Naxals. What is this outsider...… https://t.co/MqgiMSCt8R pic.twitter.com/U3VjdVgrl4— Press Trust of India (@PTI_News) August 21, 2026🇮🇳 #Breaking: #Villagers reportedly chased #CJP protestors down and beat them, while their vehicles were also attacked and car windows were smashed during the confrontation in #Jaipur .The incident reportedly took place during a CJP team’s visit to a government #school .… pic.twitter.com/XyAY8uHGzV— pradhyumn sharma (@pradhyu78651514) August 21, 2026అయితే.. ఆ సమయంలో కొందరు వాళ్లను అడ్డుకుని దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ పరిణామాలపై రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటనపై అశుతోష్ రాంకా స్పందిస్తూ.. తమను అడ్డుకున్న వారు గ్రామస్తులు కాదని, బీజేపీ పంపించిన వ్యక్తులని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. "బీజేపీ పంపించిన గూండాలు" అంటూ విమర్శలు చేశారు.#WATCH | Jaipur, Rajasthan: CJP National Spokesperson Ashutosh Ranka says, "The entire country saw BJP's hooliganism live today. Stone pelting was already happening there but the Police remained mute spectators. Police said that they won't do anything. This has been done at the… pic.twitter.com/pYPCh3UCOP— ANI (@ANI) August 21, 2026ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికే తాము తనిఖీలు చేపడుతున్నామని సీజేపీ నేతలు తెలిపారు. అయితే సమస్యలను బయటకు రానివ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పాఠశాలల పరిస్థితిపై ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.అబ్బే జరిగింది అది కాదు: స్థానికులుఅయితే స్థానికుల్లో కొందరు మాత్రం సీజేపీ ఆరోపణలను ఖండించారు. పాఠశాలను కూల్చివేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానంతోనే తాము వ్యతిరేకించామని తెలిపారు. ‘‘వాళ్లు 250 మంది వచ్చారు. వాళ్లు చెబుతున్న దాంట్లో నిజం కూడా లేదు. ఆ పాఠశాలలో 20 నుంచి 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరమ్మతుల కోసం రూ. 12 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. బీజేపీనో, కాంగ్రెస్సో, మరేయితర రాజకీయ పక్షమో ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు. మా ఊరి అంశాన్ని రాజకీయం చేయొద్దని మేం అనుకుంటున్నాం. వాళ్లు నిరసన పేరిట స్కూల్కు నష్టం కలిగిస్తే ఎలా? విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పాఠశాల రక్షణ కోసం నిలబడ్డాం’’ అని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాదు.. తాము దాడి చేశామన్న దాంట్లో నిజం లేదని కూడా అంటుఉన్నారు.#WATCH | Jaipur, Rajasthan: A villager, Anu Sharma, says, "We opposed them because they are attempting to teardown this school...About 20-25 students come here to study. Where will they go?..We won't let them teardown the school. Funds (for repair) have already been… pic.twitter.com/kk86lCPUS4— ANI (@ANI) August 21, 2026స్కూల్ తనిఖీలపై సర్కారీ ఆంక్షలుఈ వివాదానికి కొద్ది రోజుల ముందే రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం.. ఓ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని ఆదేశించింది. విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. అనధికారికంగా ఎవరూ పాఠశాల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.ప్రతిపక్షాల విమర్శలుప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత టీకారామ్ జూల్లీ.. ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించకుండా అడ్డుకునేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చారని ఆరోపించారు. ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఇదీ చదవండి: మంత్రుల కుక్కలకు మెరుగైన వసతులున్నాయి!
ఎన్ఆర్ఐ
బ్రిటన్ ప్రధాని సలహాదారుగా ఎన్నారై
లండన్: భారతీయ మూలాలున్న వ్యూహకర్త, మీడియా ఎగ్జిక్యుటివ్ గౌతమ్ రంగరాజన్ను బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. యూకే ప్రధాని ఆయన్ను స్ట్రక్చర్ అండ్ ప్రాసెసెస్ (రాజ్యాంగ వ్యవస్థలు, వ్యవహారాలు)పై ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వార్తా సంస్థ బీబీసీలో వ్యూహకర్తగా పనిచేసిన అనుభవమున్న రంగరాజన్ ఇప్పటికే కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించారని అని యూకే ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. లేబర్ పార్టీ నేత బర్న్హామ్ గత నెల ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన వికేంద్రీకరణ చర్యల్లో భాగంగా మ్యాంచెస్టర్లో ‘నంబర్ 10 నార్త్’ను ప్రారంభించారు. పలు ప్రభుత్వ విభాగాల పునర్వవ్యవస్థీకరణ చేపటాట్టరు.ఎవరీ గౌతమ్ రంగరాజన్?గౌతమ్ రంగరాజన్ (Gautam Rangarajan) బీబీసీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1993లో బీబీసీ రేడియో క్లాసికల్ మ్యూజిక్లో ట్రెయినీ ప్రొడ్యూసర్గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత బీబీసీ వేల్స్, బీబీసీ రేడియోలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో గౌతమ్ రంగరాజన్ గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ పెర్ఫార్మెన్స్గా నియమితులయ్యారు. 2025 ఏప్రిల్ వరకు ఈ పదవిలో కొనసాగారు. గ్రూప్ డైరెక్టర్గా బీబీసీ మొత్తానికి సంబంధించిన వ్యూహరచనకు 10 సంవత్సరాల పాటు బాధ్యత వహించారు.2025లో బీబీసీని వీడిన తర్వాత ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా పనిచేశారు. 2025 జనవరి నుంచి గ్లైండ్బోర్న్లో బోర్డ్ ట్రస్టీగా కూడా కొనసాగుతున్నారు. టెంపుల్ చర్చ్ క్వైర్తో కలిసి ఆయన పాటలు పాడారు. అలాగే పాలీఫోనీతో పాటు వెస్ట్మినిస్టర్ అబ్బే, సెయింట్ పాల్స్ కేథడ్రల్, విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్ గాయక బృందాలతో డిప్యూటీగా కూడా పనిచేశారు. రికార్డింగ్ ప్రొడ్యూసర్గా కూడా ఆయన పనిచేశారు. 2012లో విడుదలైన A Festival of Psalms అనే సీడీకి కూడా ఆయన రికార్డింగ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.చదవండి: విజయ్ పార్టీలో చేరిన యువనేత
చాట్జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్
అమెరికాలో జంట హత్యలు కలకలం రేపాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబాన్ని ఎలా హత్య చేయాలనే విషయాలను ఏఐలో వెతికి మరీ ఈ దురాగతానికి పాల్పడటం మరింత ఆందోళ రేపింది. గోతిక్ నవల (Gothic novel) తరహా కథలు, పాత్రలను రూపొందించడంలో సాయం చేయాలని AI ఛాట్బాట్ను కోరినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.మసాచుసెట్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోని మాసాచుసెట్స్ సబర్బన్ ఏరియాలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్ అర్జున్ అరవింద్, తల్లి సుధా వెంకటేశన్ (45), సోదరుడు సిద్ధార్త్ (14) దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు.Accused killer 17 year old Arjun Aravind of Acton was taken into custody in Wayland overnight and tomorrow he’s expected in adult court charged with murdering his mother and younger brother…his dad was at work when the murders took place #7News pic.twitter.com/ljpT6lNZGR— Steve Cooper (@scooperon7) August 12, 2026 మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన ట్యూటర్ లోపలికి వెళ్లలేక అర్జున్ తండ్రికి సమాచారం అందించారు. తండ్రి ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ‘వెల్ బీయింగ్ చెక్’ చేయాల్సిందిగా కోరారు. పోలీసులు వచ్చి చూడగా తల్లీ కొడుకులిద్దరూ మృతి చెంది ఉన్నారు. ఆక్టన్ ప్రాంతంలోని వారి ఇంట్లోనే ఈ హత్యలు జరిగాయి.నేరం జరిగిన తర్వాత అర్జున్ తన తల్లికి చెందిన హోండా కార్లో పరారైనట్టు పోలీసులు గుర్తించారు. మృత దేహాలపై తీవ్రమైన గాయాలున్నాయనీ, తల్లి మృతదేహం బేస్మెంట్లో, తమ్ముడి మృతదేహం మొదటి అంతస్తులో లభ్యమయ్యాయనీ వెల్లడించారు. దీంతో అర్జున్పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడి, కారు దొంగతనం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాలింపు చర్యల అనంతరం వేలాండ్ (Wayland) ప్రాంతంలోని ఒక పార్కింగ్ లాట్లో కారులో అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు.ఛాట్జీపీటీ వాడకంపై పోలీసుల ప్రకటనఅర్జున్ కొంతకాలంగా విచిత్రమైన ప్రవర్తన కనబరుస్తున్నాడు. కుటుంబాన్ని చంపేందుకు సంబంధించిన ఊహాజనిత కథనాలు, ఆలోచనల కోసం ఇంటర్నెట్, ChatGPTని ఉపయోగించినట్లు విచారణలో తేలిందని మిడిల్సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీసీ నెట్వర్క్ ఏర్పాటు..
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్వర్క్ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు 'ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్'(AAA) మరియు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ(ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లుబొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.నాయకత్వం, నెట్వర్కింగ్కు ప్రాధాన్యంAAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బలమైన నెట్వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
యూరప్లో ఘోర రోడ్డు ప్రమాదం..జగిత్యాల యువకుడు దుర్మరణం
జగిత్యాల: బతుకుదెరువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. యూరప్లోని మాల్టా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన 27 ఏళ్ల మహ్మద్ జావెద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆయన మరణించడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ జావెద్ గత ఏడాది కాలంగా మాల్టాలోని పావోలా పట్టణంలో ఒక సేల్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ మాల్టాలోని కోర్మి ప్రాంతంలో జావెద్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక భారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జవ్వద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మహ్మద్ జావెద్కు మూడు నెలల క్రితమే స్వదేశానికి వచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకల అనంతరం జీవితంలో స్థిరపడాలనే ఆశతో ఆయన తిరిగి మాల్టాకు వెళ్లాడు. ఇంతలోనే ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో జావెద్ మృతి చెందారనే వార్త వినడంతో భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
క్రైమ్
లవర్ చాట్ చేయమంటుంది.. ఫోన్ కొనిస్తే వస్తా.. లేదంటే చస్తా!
సాక్షి, హైదరాబాద్: తనకు స్మార్ట్ఫోన్ కొనివ్వాలని తల్లితో వాగ్వివాదానికి దిగిన ఓ బాలుడు తల్లి నిరాకరించేసరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బంజారాహిల్స్ ఎన్బీటీనగర్ బస్తీలో నివసించే ఓ విద్యార్థి (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా ఏపీలోని తునికి చెందిన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు.చాటింగ్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసుకోవడానికి ఫోన్ లేకపోవడంతో బాలిక అఖిల్పై ఒత్తిడి పెంచింది. దీంతో తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటూ కొద్ది రోజుల నుంచి అఖిల్ తల్లితో గొడవ పడుతున్నాడు. పదో తరగతిలో బుద్ధిగా చదువుకోవాలని, ఈ వయస్సులో స్మార్ట్ఫోన్ వద్దంటూ తల్లి వారించినా వినిపించుకోలేదు.దీంతో రెండు రోజుల క్రితం తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పడుకున్నాడు. అక్కడే గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ తీసుకుని తన తల్లికి ఫోన్ చేసి ‘ఫోన్ కొనిస్తే వస్తా.. లేకపోతే చస్తా..’అంటూ చెప్పాడు. అప్పటికే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కాల్ నెంబర్ ఆధారంగా అఖిల్ను గుర్తించారు. ఠాణాకు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లికి అప్పగించారు. బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
'చీకటి అవుతుంది.. వద్దు తమ్మి.. పొద్దున పోదువు'
సాక్షి, సిద్దిపేట: “చీకటి అవుతోంది తమ్మీ.. ఈ రాత్రికి వెళ్లొద్దు.. పొద్దున్నే బయల్దేరు”.. అన్న చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చాయి. తమ్ముడు మాత్రం “అన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఈ రాత్రే వెళ్లనివ్వు” అంటూ భార్య, పిల్లలతో కలిసి కారులో బయల్దేరాడు. కొన్ని గంటల్లోనే ఆ ప్రయాణం తిరిగిరాని ప్రయాణంగా మారింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.బల్వంతపూర్కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కారు బావిలో పడింది. ఈ ఘటనలో నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం కంటే కూడా.. మృతుడు రాజు అన్న రవి చెబుతున్న మాటలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.రవి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటలో వారి బావ దీశెట్టి మల్లేశం మృతి చెందడంతో 19న దశదిన కర్మకు రాజు తన భార్య, పిల్లలతో కలిసి అక్కడికి వచ్చాడు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. సాయంత్రం కావడంతో రాజు ఇంటికి బయల్దేరుతానని అన్నకు చెప్పాడు. దీంతో రవి.. “చీకటి అవుతుంది తమ్మీ.. వద్దు. పొద్దున్నే పోదువు” అంటూ వారించాడు. కానీ రాజు వినలేదు. “అన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఈ రాత్రే పోనివ్వు” అంటూ భార్య, పిల్లలతో కలిసి కారులో బయల్దేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది.తమ్ముడిని కాపాడలేకపోయానన్న బాధతో రవి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. “నా మాట విని ఉంటే తమ్ముడు ఇప్పుడు బతికుండేవాడు” అంటూ ఆయన రోదించడం చూసి స్థానికులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు తమ్ముడిని ఇంటికి వెళ్లొద్దని ఆపిన అన్న.. మరోవైపు కుటుంబంతో కలిసి ఎలాగైనా ఇంటికి చేరుకోవాలన్న తమ్ముడి ఆరాటం.. చివరికి నాలుగు ప్రాణాలను బలిగొన్న విషాదంగా మారింది.
టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం): హోంవర్క్ చేయలేదన్న కోపంతో టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందిన ఘటన విశాఖపట్నం పాత నగరంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో గురువారం జరిగింది. హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించి, కొట్టిన తర్వాతే బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాతనగరం ఏవీఎన్ కళాశాల డౌన్రోడ్డు సమీపంలో కృష్ణప్రసాద్, సాయిలక్ష్మి దంపతులు ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ప్రణయ్తేజ్ (6) రీడింగ్రూమ్ సమీపంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే బాలుడికి అస్వస్థతగా ఉందని తల్లిదండ్రులకు సమాచారం అందింది. హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు ప్రణయ్తేజ్ను మందలించడంతోపాటు చెంపపై కొట్టారు. అనంతరం ఉపాధ్యాయురాలిపైనే బాలుడు కుప్పకూలాడు. కేజీహెచ్కు తీసుకెళ్తుండగా బాలుడు మృతి చెందాడు. పాఠశాల సీసీ కెమెరాలో ఉపాధ్యాయురాలు బాలుడి చొక్కా పట్టుకుని తనవైపు లాగుతున్నట్లు, బాలుడు తనను కొట్టొద్దంటూ చేతులతో సైగలు చేస్తున్నట్లు కనిపించింది.అనంతరం ఉపాధ్యాయురాలు చెంపపై కొట్టిన వెంటనే ఆమెపైనే బాలుడు కుప్పకూలిపోయాడు. కేజీహెచ్లో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయురాలు, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జనసేన ఎంపీ లింగమనేని కుమారుడి రాష్ డ్రైవింగ్ యువతి మృతి
మాదాపూర్ (హైదరాబాద్): జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ హైదరాబాద్ ఐటీ కారిడార్లో లగ్జరీ స్పోర్ట్స్ కారుతో అతి వేగంతో దూసుకొచ్చి ఓ యువతిని బలిగొన్నాడు. అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఈ నెల 16న మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) దుర్మరణం చెందింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజ్యసభ సభ్యుడు, జనసేన పార్టీ నేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ (23) ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు తేలింది. దీంతో సంజుష్పై మాదాపూర్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.జీబ్రా క్రాసింగ్పై రోడ్డు దాటుతుండగా..ఇనార్బిట్ మాల్లోని లైఫ్స్టైల్ స్టోర్లో పని చేసే భారతి ముఖి తన సహోద్యోగి పూజా అశోక్ అలోన్తో కలిసి ఈ నెల 16న మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్ సమీపంలో భోజనం చేయడానికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారిద్దరూ తిరిగి వస్తూ ఇనార్బిట్ మాల్లోకి వచ్చేందుకు జీబ్రా లైన్పై రోడ్డు దాటుతుండగా టీజీ 09 జీ 0666 నంబరు ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చి భారతి ముఖిని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడింది. ఆమె తల, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆస్పత్రికి వచ్చిన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు లింగమనేని సంజుష్ అక్కడి నుంచి జారుకున్నట్లు చెబుతున్నారు. లైఫ్స్టైల్ స్టోర్ మేనేజర్ పంజాల అశ్విన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంజుష్ కారును నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడిపి మరణానికి కారణమైనట్లు తేల్చి, అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 106(1)కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంజుష్ను అదుపులోకి తీసుకున్నారు. కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్ట్లు చేయగా నెగెటివ్ వచ్చిందని, అందువల్ల నోటీసులు ఇచ్చి వదిలేశామని పోలీసులు చెబుతున్నారు. ఐటీ కారిడార్లో వాహనాలు గంటకు 40 కిలోమీటర్లు, కేబుల్ బ్రిడ్జిపై 30 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లకూడదని నిబంధనలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో రద్దీగా ఉండే ఐటీ కారిడార్లో మితిమీరిన వేగంతో వెళ్లడం నిందితుడి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అయినప్పటికీ, అతి వేగంగా కారు నడిపి ఓ యువతి మృతికి కారణమైన సంజుష్కు కేవలం నోటీసులు ఇచ్చి వదిలివేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు అతి వేగంగా రోడ్డు ప్రమాదానికి కారణమైతే ఇలానే వ్యవహరిస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వీడియోలు
20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే
విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం
చంద్రబాబుకు ఉద్యోగ JAC నేతలు వార్నింగ్
తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !
రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1 ఎవరికీ సాధ్యం కాని ఘనత -
రామోజీరావు ఆస్తులు అమ్మాల్సిందే.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
నువ్వు 10 కోట్లు ఇవ్వకపోతే.. లింగమనేని కొడుకు యాక్సిడెంట్ పై KA పాల్
బుడ్డోడి తెలివితో తండ్రి అడ్డంగా బుక్!
షావుకారు జానకి మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
ప్రముఖ నటి షావుకారు జానకి లాస్ట్ ఇంటర్వ్యూ


