‘నీ భార్య స్వాతి నా దగ్గరే ఉంది, నువ్వు ఏమీ చేయలేవు‘
హైదరాబాద్: వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జహీరాబాద్ టౌన్ ఎస్సై లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. కోహిర్ మండలం బిలాల్పూర్ గ్రామానికి చెందిన కొనగారి వినయ్కుమార్కు రెండేళ్ల క్రితం తోరమామిడి గ్రామానికి చెందిన బంటు స్వాతితో వివాహమైంది. కాగా పెళ్లికి ముందే స్వాతికి కోహీర్ పట్టణంలోని లాలాగూడకు చెందిన వరుసకు బావ అయిన నాగరిగారి ప్రవీణ్ కుమార్తో ప్రేమలో ఉంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో స్వాతికి వినయ్కుమార్తో వివాహం జరిగింది. కాగా పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రవీణ్ కుమార్ తన మరదలు స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి భర్త భార్యతో విడిగా ఉంటున్నాడు. కొన్ని రోజుల నుంచి ప్రవీణ్ కుమార్ తరచూ స్వాతి భర్తకు ఫోన్ చేస్తూ, ‘నీ భార్య నా దగ్గరే ఉంది, నువ్వు ఏమీ చేయలేవు‘ అని బెదిరిస్తూ మెసేజ్లు, ఫొటోలు పంపిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాడు. ఈ క్రమంలో వినయ్ కుమార్ను పూర్తిగా మట్టుబెట్టాలని ప్రవీణ్ కుమార్ కర్నాటక బీదర్కు చెందిన తన పెద్దమ్మ కొడుకు ప్రవీణ్తో కలిసి హత్యకు పథకం పన్నాడు. గత నెల 9న సాయంత్రం జహీరాబాద్లోని చెన్నారెడ్డి కాలనీలో వినయ్కుమార్ను అడ్డుకుని గొడవ పెట్టుకున్నారు. ప్రవీణ్ అతనిని వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా నాగరిగారి ప్రవీణ్ కుమార్ వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్ వీపుపై తీవ్రంగా పొడిచాడు. ఈ దాడిలో వినయ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరిని రిమాండ్కు తరలించారు. చదవండి: తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు
ఆరేళ్లకే తొలి సంపాదన! ఆ ఒక్క నిర్ణయంతో మారిన మమితా రేంజ్
ఒకట్రెండు హిట్లు రాగానే స్టార్డమ్ వచ్చేసిందంటూ హడావుడి చేసే హీరోయిన్లు చాలామందే. కానీ.. వరుసగా మూడు భారీ విజయాలతో తన స్థాయినే మార్చేసుకుంటే? ఇప్పుడు మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు చేస్తున్నది అదే. ఈ ఏడాదిలో విజయ్, సూర్య, నివిన్ పౌలీ వంటి అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించిన ఆమె.. వరుస విజయాలతో సౌత్ ఇండియాలో తన మార్కెట్ను ఒక్కసారిగా పెంచుకుంది. తెరపై కనిపించే ఆ పక్కింటి అమ్మాయి ఇమేజ్ వెనుక.. కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ కూడా తయారవుతోంది.మమితా బైజు కెరీర్లో 2026 ఓ ప్రత్యేక అధ్యాయం. జూలై 23న విజయ్ నటించిన జన నాయగన్ విడుదలైంది. ఆ తర్వాత ఆగస్టు 14న సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటి తర్వాత.. ఆగస్టు 21న నివిన్ పౌలీతో కలిసి నటించిన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ థియేటర్లలోకి వచ్చింది. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో.. ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగింది. బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ జస్ట్.. 11 రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. ముఖ్యంగా.. ఈ మూడు చిత్రాల విడుదల మధ్య వ్యవధి కేవలం 29 రోజులు. దీంతో ఒకే ఏడాదిలో(ఇప్పటివరకు..) మూడు రూ.200 కోట్ల సినిమాల్లో నటించిన భారతీయ నటిగా మమితా రికార్డు సృష్టించినట్లైంది. ఈ మధ్యకాలంలో మరేయితర హీరోయిన్ ఖాతాలో ఇలాంటి అరుదైన రికార్డు నమోదు కాలేదు.‘ప్రేమలు’తో మారిపోయిన కెరీర్అయితే ఈ స్థాయికి ఆమె ప్రయాణం ఒక్కరోజులో మొదలైనదేమీ కాదు. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన మమితా.. ఆపరేషన్ జావా, ఖో ఖో, సూపర్ శరణ్య వంటి చిత్రాల్లో కనిపించింది. కానీ 2024లో వచ్చిన ప్రేమలు ఆమె కెరీర్ను పూర్తిగా మార్చేసింది. అందులో రీనూ పాత్రలో ఆమె చూపించిన సహజమైన నటన, ఎక్స్ప్రెషన్స్ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత తమిళం, తెలుగు చిత్రసీమల్లోనూ అవకాశాలు వరుసకట్టాయి. అక్కడి నుంచి మమితా ఎంచుకున్న సినిమాలూ ఆమె మార్కెట్ను పెంచాయి. డ్యూడ్, కరా వంటి తమిళ చిత్రాలతో పాటు విజయ్ జన నాయగన్, సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్లో నటించడం ఆమెకు మరింత క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు సొంత భాషలో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ సక్సెస్తో ఆ జాబితాలో మరో భారీ హిట్ చేరింది.డాక్టర్ కావాలనుకుని.. హీరోయిన్గామమితా జీవితంలో ఆసక్తికరమైన మలుపు స్కూల్లో ఉండగానే జరిగింది. ఆమె స్వస్థలం కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్. మె తండ్రి డాక్టర్ బైజు కృష్ణన్.. తల్లి మినీ బైజు. అన్నయ్య మిథున్ కెనడాలో చదువు పూర్తి చేశారు. చిన్నతనంలో ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేదట. అయితే తొమ్మిదో తరగతిలో ఉన్న సమయంలో ఓ ఆడిషన్కు వెళ్లడం ఆమె జీవితాన్నే మార్చింది. ఆ తర్వాత చదువుతో పాటు నటనపైనా దృష్టి పెట్టింది. చివరకు వైద్య వృత్తికి బదులు సినీ రంగాన్నే కెరీర్గా ఎంచుకుంది.ఫ్యాన్స్ ముద్దుగా ‘SSMB’..మమితకు ఉన్న క్రేజ్ సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. ఆమె షార్ట్ వీడియోలు, డ్యాన్సింగ్ క్లిప్పులు వైరల్ అవుతుంటాయి. సాదాసీదాగా ఉంటూ అభిమానులతోనూ ఆమె అంతే హుందాగా వ్యవహరిస్తుంటారు. ఫ్యాన్స్ సరదాగా ‘SSMB’ సూపర్స్టార్ మమితా బైజు అనే ట్యాగ్ కూడా ఇస్తున్నారు. ‘సూపర్స్టార్’ అనే అర్థంలో ఈ పేరును వాడుతూ.. మలయాళ సినీ పరిశ్రమకు మమ్ముట్టి, మోహన్లాల్ తర్వాత మరో ఎం(M) దొరికిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెకున్న క్రేజ్, వరుస అవకాశాలను చూసి సోషల్ మీడియాలో ఈ సరదా పోలికలు వైరల్గా మారుతున్నాయి.రెమ్యునరేషన్ విషయంలో.. ఇక సంపాదన విషయానికొస్తే.. ఆరేళ్ల వయసులో పాల్గొన్న ఫ్యాషన్ షోలో తొలిసారి రూ.500 సంపాదించిన విషయాన్ని ఆమె తరచూ చెబుతుంటారు. అలాగే తొలి సినిమా ‘సర్వోపరి పాలక్కారన్’కు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని, రెండో సినిమాకు మాత్రం రూ.6,000 అందుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ఇన్నేళ్ల శ్రమకు ఆమెకు అవకాశాలు, సక్సెస్లు దక్కుతున్నాయి. వరుస విజయాలతో మమితా బైజు పారితోషికం కూడా గణనీయంగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆమె సుమారు రూ.2–3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలే కాకుండా ఫ్యాషన్, స్కిన్కేర్, జ్యువెలరీ తదితర బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తోంది. దీంతో నటనతో వచ్చే ఆదాయానికి అదనంగా ఎండార్స్మెంట్లు, పెట్టుబడులు కూడా ఆమె సంపాదనలో భాగమవుతున్నాయి.కోచిలో కోట్ల విలువైన ఇల్లు.. కార్లు కూడామమితా బైజు ఆస్తుల గురించి కూడా మాలీవుడ్ వెబ్సైట్లు ఆసక్తికర విషయాలు షేర్ చేస్తుంటాయి. కోచిలో ఆమెకు సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. షూటింగ్స్ ఎక్కువగా ఉండటంతో కోచినే ఆమెకు ప్రధాన నివాసంగా మారినట్లు సమాచారం. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూరులో కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇల్లు కూడా ఉంది.కార్ల విషయానికొస్తే.. మమితా బైజు గ్యారేజీలో వోక్స్వాగెన్ టైగన్, మారుతి సుజుకీ జిమ్నీ ఉన్నాయి. అయితే ఆమె మొత్తం ఆస్తుల విలువపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. మాలీవుడ్ మూవీ సర్కిల్స్ వెబ్సైట్లు మాత్రం.. ఆమె నికర ఆస్తుల విలువను సుమారు రూ.20–30 కోట్లుగా అంచనా వేస్తున్నాయి.ఇష్టాలుఫేవరెట్ యాక్టర్: ధనుష్ ఇష్టమైన హాబీస్: డ్యాన్స్, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, ట్రావెలింగ్. ఇష్టమైన ఆహారం: చైనీస్ ఫుడ్ ఇష్టమైన రంగు: బ్లాక్ఇష్టమైన సింగర్: ఆంథోనీ దాసన్ఇష్టమైన పెర్ఫ్యూమ్: చానెల్ఇష్టమైన హాలిడే డెస్టినేషన్: దుబాయ్ఇష్టమైన ఆట: క్రికెట్ఇకపై మమితా రేంజ్ మరింత పెరిగేనా?ప్రేమలుతో వచ్చిన గుర్తింపు.. ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాలు.. ఇప్పుడు మూడు రూ.200 కోట్ల చిత్రాలతో వచ్చిన రికార్డు. మమితా బైజు కెరీర్ గ్రాఫ్ చూస్తే.. తక్కువ సమయంలోనే ఆమె ఎంత వేగంగా ఎదిగిందో అర్థమవుతుంది. పాతికేళ్ల వయసులోనే ఇలాంటి మార్కెట్ రావడం ఆమెకు కలిసొచ్చిన మరో అంశం. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథ, పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగితే.. మమితా బైజు దక్షిణాది చిత్రసీమలో మరో బలమైన హీరోయిన్గా ఎదగడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఇదీ చదవండి: ఆమె దోసె వేస్తే లక్షలు కురవాల్సిందే!
ఇక రాజకీయాలకు గుడ్ బై.. అయ్యన్నపాత్రుడు
అనకాపల్లి: భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయను.. వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటానని స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏరియా ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల నుంచి తప్పుకుంటాను. తర్వాత ఏది చేద్దామన్నా అవకాశం ఉండదు. పదవీకాలం మూడేళ్లు మాత్రమే ఉన్నందున ఈలోపే ఏదో ఒక మంచి పని చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను’’ అని చెప్పారు. అయ్యన్నపాత్రుడు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు
రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు
G R Balasubramaniam success journey తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రి చిన్న రైతు , వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారి. ఆరుగురు పిల్లలున్న కుటుంబంలో కడుపు నిండా తిండి తినడానికి ఎన్నో కష్టాలు. అందుకే 13 ఏళ్ల వయసులో బడి మానేసి బెంగళూరులో పనికి కుదిరాడు. కట్ చేస్తే..రూ. 1400 కోట్లకు పైగా టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగిన 'జి.ఆర్.బి డెయిరీ ఫుడ్స్' (GRB Dairy Foods) ఫౌండర్ అయ్యాడు. బెంగళూరులోని ఒక చిన్న వెన్న వ్యాపారంగా మొదలైన రూ. 1400 కోట్లకు పైగా ఆదాయం కలిగిన ప్యాకేజ్డ్-ఫుడ్స్ కంపెనీగా ఎదిగింది. ఎంతో స్ఫూర్తిదాయక మైన జీఆర్ బాలసుబ్రహ్మణ్యమ్ విజయప్రస్థానం గురించి తెలుసుకుందాం ఈ కథనంలో.కుగ్రామం నుంచి ప్రారంభమైతమిళనాడులోని పళని సమీపంలోని చిన్న కరాట్టుపట్టి అనే కుగ్రామంలో పుట్టారు బాలసుబ్రహ్మణ్యం. ఆ ఊరి జనాభా కేవలం 300 మంది. సరైన విద్యుత్, రవాణా, నీటి సదుపాయాలు లేవు. తండ్రి పప్పుధాన్యాలు , ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా వ్యాపారం చేసేవారు. ఆయన సైకిల్పై ఊరూరా తిరుగుతూ, పంటను కొని సమీప పట్టణాలలో అమ్మేవారు. ఆ ఆదాయంతో ఎనిమిది మంది సభ్యులున్నకుటుంబాన్ని పోషించాల్సి ఉండేది. దీంతో 8వ తరగతి చదువుతున్న సమయంలోనే, కుటుంబానికి అండగా ఉండేందుకు బెంగళూరుకు బయలుదేరాడు. అక్కడ అక్క బావలకు చేస్తున్న వ్యాపారానికి తోడుగా నిలిచాడు. దాదాపు అతనికి 13 ఏళ్ల వయసున్నప్పుడు ఇంటింటికీ తిరిగి వెన్న అమ్మడం మొదలుపెట్టాడు. అలా 14 ఏళ్ల పాటు వెన్న వ్యాపారంలో మెళకువలను నేర్చుకున్నాడు. గ్రామాల నుంచి వెన్న సేకరించడం, ఇళ్లకు సరఫరా చేయడం, ఖాతాలు నిర్వహించడం, నెయ్యి తయారీ ప్రక్రియలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. 1984లో 28 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని వదిలేశారు. సొంతంగా ఏదైనా చేయాలన్నా కుటుంబం ఆర్థికంగా సహాయపడే స్థితిలో లేదు, పైగా సరైన విద్యార్హతలు లేదా వృత్తిపరమైన అర్హతలు లేకపోవడంతో సాధారణ ఉద్యోగం దొరకడం కూడా కష్టంగా ఉండేది. తన వద్ద ఉన్న కేవలం రూ. 6,000 పొదుపు మొత్తంతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన. ఇందులో రూ. 3,000 అద్దెకే పోయాయి. ఎలాంటి బ్యాంక్ రుణాలు లేకుండానే పరిచయస్తులతో ఒక 'చిట్ ఫండ్' సంస్థను ప్రారంభించారు. ఆయన బావగారు గతంలో ఇలాంటి పథకాన్ని నిర్వహించేవారు, కాబట్టి బాలసుబ్రహ్మణ్యంకు ఆ విధానంపై అవగాహన ఉండేది.అలా రెండో నెలలోనే రూ. 50,000 చేతికి వచ్చింది. ఆ డబ్బుతో మొదటిసారి వెన్నను కొనుగోలు చేసి, నెలకు 75 కిలోల చొప్పున డోర్-టు-డోర్ డెలివరీ చేయడం ప్రారంభించారు. అయితే ఈ సమయంతో తాను సరఫరా చేసిన వెన్న త్వరగా పాడైపోతుందని, హోటళ్లు/స్వీట్ షాపులు దీనిని నెయ్యిగా మార్చు కోవడంలో ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. అందుకే వెన్న అమ్మడం కంటే, తానే నెయ్యి కాచి, నాణ్యమైన నెయ్యిని తయారుచేసి ప్యాక్ చేసి అమ్మడం లాభదాయకమని భావించాడు. పెద్ద పెద్ద డైరీ బ్రాండ్లు మార్కెట్ను శాసిస్తున్న 80వ దశకంలో డెయిరీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు. ఏడాదిలోనే వారి నెల ఆదాయం రూ. 25వేలకి పెరిగింది. షాపును అద్దెకు తీసుకుని, సిబ్బందిని నియమించుకున్నారు.ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియోతొలి ఫ్యాక్టరీ1991లో బెంగళూరులో తొలి ఫ్యాక్టరీని ప్రారంభించారు. తరువాత దిండిగల్, హోసూరు (1999)లలో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మెల్లిగా తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారతదేశం అంతటా విస్తరించారు. వ్యాపారం వృద్ధి చెందుతున్న క్రమంలో కేవలం డెయిరీ ఉత్పత్తులకే పరిమితం కాకుండా మసాలా మిక్స్లు, ఇన్స్టంట్ మిక్స్లు, స్వీట్లు, స్నాక్స్, ఐస్క్రీమ్ల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు.బయటినుంచి ఎలాంటి భారీ పెట్టుబడులు లేకుండానే కేవలం తాను సాధించిన లాభాలను తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ సంస్థ లాభాలను భారీ స్థాయిలో పెంచుకుంటూ వచ్చారు. అనేక దశాబ్దాల పాటు, జీఆర్బీ ఒక ప్రైవేట్ యాజమాన్యం లోని, చాలా వరకు సొంత నిధులతోనే నడిచే వ్యాపారంగా కొనసాగింది. రూ. వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎంట్రీ2014లో రూ. 4.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ 2021 నాటికి రూ. 76.67 కోట్ల లాభాన్ని కళ్ల జూసింది. 2024నాటి రూ. 1,011.12 కోట్ల రాబడితో వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. 2025 నాటికి రాబడి రూ. 1,084.47 కోట్లకు చేరగా, నికర లాభం రూ. 75.45 కోట్లుగా నమోదైంది. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో 'GRB డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్' బ్రాండ్ 40కి పైగా దేశాల్లో విస్తరించి, ప్రస్తుతం రూ.1,400 కోట్లకు పైగా టర్నోవర్ను సాధించింది.ఎంబీఏలు ఐఐటీలు లాంటి చదువు లేకపోయినా, వ్యాపారంలో సంపాదించిన ఆచరణాత్మక అనుభవం, మార్కెట్ అవసరాలను గుర్తించే చాకచక్యంతో జీఆర్ బాలసుబ్రహ్మణ్యం GRB బ్రాండ్ను భారతదేశంలోనే అగ్రగామి ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలలో ఒకటిగా నిలపడం విశేషం. ఉత్పత్తి నాణ్యత విషయంలో రాజీ పడటం కంటే వ్యాపారాన్ని వదులుకోవడానికే ఆయన మొగ్గు చూపేవారు. ఇది కేవలం ఒక విధానం కాదు, ఆయన దృఢమైన నమ్మకం.,500 మందికి పైగా ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్నారు. పట్టుదలతో, నిబద్ధత ఉంటే విజయతీరాలకు చేరడం సాధ్యమేనని నిరూపించి , తనలాంటి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు.
చిన్నారి ఎక్కడ? అని అడిగితే.. భార్యపై భర్త పైశాచికం!
‘నీ భార్య స్వాతి నా దగ్గరే ఉంది, నువ్వు ఏమీ చేయలేవు‘
తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు
భారత్తో మ్యాచ్.. విజయం మాదే! పాక్ ప్లేయర్ సంచలన కామెంట్స్
ఉద్యోగం మారితే EPF ఏమౌతుంది?
ది డికాయ్ ప్లేన్ రివ్యూ: ట్రంప్ ‘ఎస్కేప్’.. థ్రిల్ చేసిందా?
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్లు
‘అందమైన సాయంత్రం.. చెన్నైలో మాకు మరో కుటుంబం’
ఇది దేవుడు చెప్పిన సత్యం: బొత్స
బంగారు తల్లుల్ని బలిగొన్న బస్సు!
కొత్త కెరీర్ను ప్రారంభించిన అభినందన్ వర్ధమాన్
కరువు, ధరల బరువు, అప్పుల అరువు.. ఈ టైంలో వెళితే దరువు తప్పేలా లేదు సార్!
Viral: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలు
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
‘రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి’
ఈసారి ప్రారంభోత్సవానికి హెల్మెట్, స్విమ్సూట్ తప్పనిసరి సార్!
సినిమాల్లో స్టార్.. రియల్ లైఫ్లో ఫెయిల్.. ఓ హీరోయిన్ జీవిత కథ..!
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 12 సినిమాలు స్ట్రీమింగ్..!
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
జియో రూ.200 రీచార్జ్ ప్లాన్: ప్రయోజనాలివే..
సాక్షి కార్టూన్: 04-09-2026
‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
రోడ్డు కింద 20 వేల పాత టైర్లు.. ఎందుకు పాతిపెట్టారంటే?
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
రేవంత్రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
Romanchakam: రోమాంచకం మూవీ రివ్యూ
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
చిన్నారి ఎక్కడ? అని అడిగితే.. భార్యపై భర్త పైశాచికం!
‘నీ భార్య స్వాతి నా దగ్గరే ఉంది, నువ్వు ఏమీ చేయలేవు‘
తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు
భారత్తో మ్యాచ్.. విజయం మాదే! పాక్ ప్లేయర్ సంచలన కామెంట్స్
ఉద్యోగం మారితే EPF ఏమౌతుంది?
ది డికాయ్ ప్లేన్ రివ్యూ: ట్రంప్ ‘ఎస్కేప్’.. థ్రిల్ చేసిందా?
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్లు
‘అందమైన సాయంత్రం.. చెన్నైలో మాకు మరో కుటుంబం’
ఇది దేవుడు చెప్పిన సత్యం: బొత్స
బంగారు తల్లుల్ని బలిగొన్న బస్సు!
కొత్త కెరీర్ను ప్రారంభించిన అభినందన్ వర్ధమాన్
కరువు, ధరల బరువు, అప్పుల అరువు.. ఈ టైంలో వెళితే దరువు తప్పేలా లేదు సార్!
Viral: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలు
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
‘రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి’
ఈసారి ప్రారంభోత్సవానికి హెల్మెట్, స్విమ్సూట్ తప్పనిసరి సార్!
సినిమాల్లో స్టార్.. రియల్ లైఫ్లో ఫెయిల్.. ఓ హీరోయిన్ జీవిత కథ..!
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 12 సినిమాలు స్ట్రీమింగ్..!
.. రెండో స్థానం ఏంటి సార్!మనమెప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉంటాం.. అంతే!
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
జియో రూ.200 రీచార్జ్ ప్లాన్: ప్రయోజనాలివే..
సాక్షి కార్టూన్: 04-09-2026
‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
రోడ్డు కింద 20 వేల పాత టైర్లు.. ఎందుకు పాతిపెట్టారంటే?
గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా
సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
రేవంత్రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
Romanchakam: రోమాంచకం మూవీ రివ్యూ
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఫొటోలు
ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)
రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)
‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఇంద్రగిరిపై వరలక్ష్మీవ్రత శోభ (ఫోటోలు)
విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)
శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)
హాయ్ మూవీ మూడ్లో నయనతార పోజులు.. ఫోటోలు
బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు
సిప్లిగంజ్కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు
సినిమా
‘బిగ్బాస్’ కొత్త ఇల్లు సిద్ధం
విజయవంతంగా 10వ సీజన్లోకి అడుగుపెడుతున్న బిగ్ బాస్ తమిళం కొత్త ఇంటింతో సిద్ధమైంది. గడిచిన పదేళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఈ సీజన్ హౌస్ను సరికొత్తగా తీర్చిదిద్దారు. 10 సంఖ్య ప్రతిబింబించేలా ఆర్కిటెక్చర్, విండోస్, జామెట్రిక్ డిజైన్లతో ఇంటి ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా మలిచారు. ఈ రియాలిటీ షో చరిత్రలో ప్రపథమంగా మీడియా టూర్ పేరిట హౌస్లోకి ప్రతినిధులను తీసుకెళ్లారు. సామాన్యుడే ప్రధాన థీమ్ నేలతల్లి మూలాలను చాటేలా ఎర్తీగ్రీన్, రస్టిక్ బ్రౌన్ రంగులతో ప్రకృతి సిద్ధమైన లుక్ ఇచ్చారు. హౌస్ మధ్యలో నేల నుంచి ఉద్భవించే కామన్ మ్యాన్ శిల్పం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సంప్రదాయ భారతీయ కోర్ట్యార్ట్ శైలిలో డైనింగ్ ఏరియాను రూపొందించారు. డీప్ గ్రీన్స్, టీల్స్, సుడెన్ టెక్స్చర్లతో కర్వ్డ్ ఐలాండ్ మోడల్లో కిచెన్ స్పేస్ను తీర్చిదిద్దారు. ఈ సీజన్ నుంచి మొదటిసారిగా సింగపూర్, కెనడా, యూకేలోని ప్రేక్షకులు కూడా తమ అభిమాన పోటీదారులకు లైవ్ ఓటింగ్ వేసే వెసులుబాటు కల్పించారు. బిగ్ బాస్ తమిళ సీజన్ 10 గ్రాండ్ ప్రీమియర్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయ్ టీవీ , జియోహాట్స్టార్లో ప్రసారం కానున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. సాక్షి, చెన్నై:చదవండి: వైష్ణవి గురించి 'ఇరుముడి' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
జానీ మాస్టర్ సతీమణి సుమలతపై ఫిర్యాదు
సుమలత ఆరోపణలపై రఘు మాస్టర్ కౌంటరిచ్చారు. సుమలత పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రఘు మాస్టర్ ఫిర్యాదు చేశారు. తమ కార్యవర్గాన్ని ఫెడరేషన్ గుర్తించిందని రఘు మాస్టర్ స్పష్టం చేశారు. ఫెడరేషన్ గుర్తింపు లేఖతోనే బ్యాంకును ఆశ్రయించామని వెల్లడించారు. మేం ఇచ్చిన లేఖ ఆధారంగానే బ్యాంకు అనుమతించిందని రఘు మాస్టర్ తెలిపారు.సుమలత ప్యానెల్ను ఫెడరేషన్ గుర్తించలేదని రఘు మాస్టర్ ఆరోపించారు. సుమలత వ్యవహారంతో డాన్సర్స్ అసోసియేషన్ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. అసోసియేషన్లో వివాదాలను సుమలత మరింత పెంచుతున్నారని రఘు మాస్టర్ విమర్శించారు. త్వరలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతానని రఘు మాస్టర్ ప్రకటించారు. కాగా.. అంతకుముందు రఘు మాస్టర్ ప్యానెల్పై సుమలత ఫిర్యాదు చేసింది. బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ సుమలత ఆరోపించింది.
దుల్కర్ సల్మాన్ ‘ఐమ్ గేమ్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఐమ్ గేమ్నటీనటులు:దుల్కర్ సల్మాన్, ఖయాదు లోహర్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్, కథిర్ తదితరులునిర్మాతలు: దుల్కర్సల్మాన్, జోమ్ వర్గీస్దర్శకత్వం: నహాస్ హిదయత్సంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్విడుదల తేది: సెప్టెంబర్ 3, 2026దుల్కర్ సల్మాన్ పేరుకు మలయాళ నటుడే అయినా..తెలుగు వాళ్లకు బాగా దగ్గరైనవాడు. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. అలా ఈ వారం(సెప్టెంబర్ 3) తెలుగు ప్రేక్షకులను పలకరించిన చిత్రం ‘ఐమ్ గేమ్’.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. సినిమాపై మాత్రం హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డ్యాన్(దుల్కర్ సల్మాన్) ఓ రిచ్ కిడ్. చదువు పూర్తి చేసి తండ్రి కోరిక మేరకు బిజినెస్ రంగంలోకి వెళ్తాడు. అయితే ఆయన పని కంటే గ్యాంబ్లింగ్పైనే ఎక్కువ దృష్టిపెడతాడు. లక్షల రూపాయలు అప్పుతెచ్చి జూదం ఆడుతాడు. డబ్బులన్నీ పోగొట్టుకొని.. చివరకు అప్పు ఇచ్చినవాడి చేతిలో తన్నులు తింటాడు. కొడుకు పరిస్థితి చూసి తల్లి మెర్సీ(జయసుధ)దాచుకున్న రూ. 60 లక్షలు ఇస్తే..వాటిని కూడా క్రికెట్ బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకుంటాడు. బెట్టింగ్ నిర్వాహకులతో గొడవకు దిగి..కారులో పారిపోతుండగా ప్రమాదం జరిగి కుడి చేతిని కోల్పోతాడు. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి..వేరొకరి చేయిని డ్యాన్కి అతికిస్తారు. ఈ క్రమంలోనే ఫిజియోథెరపిస్ట్ ఇషా (కయాదు లోహర్)తో పరిచయం.. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. ఇలా అంతా బాగుందనుకునేలోపు డ్యాన్ కుడి చేయి.. అతని నియంత్రణలో లేకుండా పోతుంది. అతను చెప్పని,ఇష్టంలేని పనులన్నీ కుడి చేయి చేస్తుంది.అలా ఓ రోజు పబ్లో మద్యం సేవిస్తుండగా.. అక్కడకు వచ్చిన బెట్టింగ్ డాన్ డేవిడ్ (మిస్కిన్)ని చంపేందుకు ప్రయత్నించగా..డ్యాన్ బలవంతంగా అడ్డుకుంటాడు. అసలు డ్యాన్ కుడి చేయి ఎవరిది? ఎందుకు అలా ప్రవర్తిసుంది? డేవిడ్కు ఎందుకు చంపాలనుకుంది? అసలు ఆ చేతికి అంత శక్తి ఎలా వచ్చింది? క్రికెట్ విక్రమ్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతనితో డ్యాన్కు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..చేతికి వేరే ప్రాణం రావడం అనే కాన్సెప్ట్ కొత్తదేమి కాదు. ‘మావీరన్’, ‘సవ్యసాచి’ లాంటి చిత్రాలు ఈ కాన్సెప్ట్తో తెరకెక్కినవే. ఐమ్ గేమ్ కథ కూడా అలాంటిదే. కానీ ఆ కథను తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంది. యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు బాగుంది. అయితే అసలు కథ ప్రారంభం అంటే హీరోకి ఆపరేషన్ చేసి చేతిని అతికించే వరకు కథనం రొటీన్గా సాగుతుంది. అలాగే ద్వితియార్థం మొత్తం ఊహకందేలా సాగడం కూడా మైనస్. డ్యాన్ లైఫ్ స్టైల్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. జూదానికి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకోవడం.. అప్పు ఇచ్చినవాడు దాడి చేయడం.. బెట్టింగ్ ఇలా మొదటి అరగంట అంతా రొటీన్గానే సాగుతుంది. ఎప్పుడైతే ప్రమాదం జరిగి డ్యాన్కి చేతిని అతికిస్తారో అప్పటి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఆ చేయి తన నియంత్రణను కోల్పోయిన తర్వాత మరింత కామెడీ చేసే స్కోప్ ఉన్నా దర్శకుడు దాన్ని పైపైనే చూపించాడు. అలాగే లవ్స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. కానీ డేవిడ్పై దాడి చేసినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుటుంది. అయితే సెకండాఫ్పై మరింత ఆసక్తికరంగా ఉంటుందనుకుంటే.. కాసేపటికే నీరసం వచ్చేలా నెమ్మదిగా సాగుతుంది. హీరోకి చేతిని దానం చేసిన వ్యక్తి గురించి తెలియగానే.. ప్లాష్బ్యాక్లో ఏం జరిగింది? క్లైమాక్స్ ఎలా ఉంటుంది? అనేది ఈజీగా ఊహించొచ్చు. విక్కీ పాత్ర చుట్టూ సాగే ఫ్లాష్బ్యాక్ చాలా సాగదీసినట్లు, రొటీన్గా అనిపిస్తుంది. డేవిడ్ పాత్రను అటు భయంకరంగా చూపించలేదు.. ఇటు పూర్తి వినోదాత్మకంగానూ అలరించలేదు. బెట్టింగ్ వల్ల జరిగే అనర్థాల గురించి ఇచ్చిన సందేశం కూడా ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. అలాగే సినిమా నిడివి(177 నిమిషాలు) కూడా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. డ్యాన్ పాత్రకి దుల్కర్ సల్మాన్ పూర్తి న్యాయం చేశాడు. సినిమా ప్రారంభంలో గ్యాంబ్లర్గా, ఆ తర్వాత తన చేతిని తనే కంట్రోల్ చేసుకోలేని నిస్సహాయుడిగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఒక చేతితోనే చేసే యాక్షన్ సీన్లు బాగా అలరిస్తాయి. ఇక కయాదు పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. విక్కీ పాత్రలో ఆంటోనీ చక్కగా నటించాడు. మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చాలా చక్కగా నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం.తనదైన బీజీఎంతో చాలా సన్నివేశాలను ఎలివేట్ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. కొన్ని సాగదీత సీన్లను కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ
15-20 ఏళ్ల క్రితం కామెడీ సినిమాలు అనగానే అల్లరి నరేశ్ గుర్తొచ్చేవాడు. తర్వాత కాలంలో చాలానే మూవీస్ చేశాడు గానీ ఎందుకనో సక్సెస్ కాలేకపోయాడు. అనంతరం 'నాంది' లాంటి డిఫరెంట్ చిత్రం చేసి హిట్ అందుకున్నాడు. తర్వాత రకరకాల సీరియస్ సినిమాలు ట్రై చేశాడు. అవి పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో తిరిగి తనకు అచ్చొచ్చిన కామెడీనే నమ్ముకున్నాడు. అలా చేసిన మూవీ 'రంభ ఊర్వశి మేనక'. ఈరోజు(సెప్టెంబరు 04) థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేశ్) కుటుంబం నాటకాలు వేస్తూ బతుకుతుంటుంది. వీళ్ల ఇంట్లో ఓ మ్యాజిక్ బుక్. దానిపై సరిగ్గా గీతలు గీస్తే స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనక వస్తారని చిన్నతంలో సూరికి తెలుస్తుంది. దీంతో ఏ పనిచేయకుండా ఊరంతా అప్పులు చేసి సదరు పుస్తకంపై 15 ఏళ్లుగా గీతలు గీస్తూనే ఉంటాడు. ఓ సందర్భంలో సూరికి తన తల్లి ప్రాణాంతక వ్యాధి బారిన పడిందని తెలుస్తుంది. అదే టైంలో ప్రేమించిన చిన్ని(సురభి) తండ్రితో ఓ చిక్కొచ్చి పడుతుంది. మరోవైపు ఓ రాత్రి చేసిన పనివల్ల నిజంగానే రంభ-ఊర్వశి-మేనకలు సూరి కోసం దిగివస్తారు. వీళ్ల రాకతో సూరి జీవితం ఎలా మారింది? ఎస్సై అప్పలనాయుడితో సూరికి గొడవేంటి? చివరకు ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకప్పుడు అల్లరి నరేశ్ సినిమాలు గానీ మీరు చూసుంటే అతడు చేసే సిల్లీ కామెడీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు అదే తరహా కథ, కథనాలతో అదే హీరో చేసిన మూవీ ఇది. గతంలో ఇతడు తీసిన చిత్రాల చూస్తున్నట్లే ఉంటుంది. అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయినప్పటికీ ఓవరాల్గా ఓకే ఓకే అనిపిస్తుంది తప్పితే మరీ పగలబడి నవ్వేంత గొప్పగా లేదు.నాటకాలు వేసే ఓ కుటుంబంలో హీరో పుట్టడం, మ్యాజిక్ బుక్ అతడి దొరకడం, రంభ, ఉర్వశి, మేనక కోసం హీరో పట్టువదలకుండా ప్రయత్నించడం.. ఇదంతా అలా సాగుతూ ఉంటుంది. మరోవైపు తన ఊరిలో ఉండే చిన్నితో హీరో ప్రేమ, వీళ్ల ప్రేమకథకు ఓ విలన్.. ఇలా హడావుడి లేకుండా ఫస్టాప్ అంతా ఉంటుంది. ఇదేమంత కొత్తగా ఉండదు. ఎన్నో తెలుగు సినిమాల్లో ఇలాంటివన్నీ చూసేశాం కదా.. అసలు పాయింట్లోకి ఎప్పుడొస్తారా అనిపిస్తుంది.ఎప్పుడైతే సూరి దగ్గరకు రంభ-ఊర్వశి-మేనకలు దిగివస్తారో అక్కడి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఓవైపు తల్లి చావు బతుకుల్లో ఉంటే అప్సరసలతో కలిసి హీరో కామెడీ చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. సరేలే కామెడీ కదా ఎంజాయ్ చేద్దాంలే అనుకుంటే మధ్యమధ్యలో తల్లి సెంటిమెంట్ వస్తూ ఉంటుంది. కామెడీని చూసి అక్కడక్కడ నవ్వుతాం గానీ తల్లి ఎమోషన్కి కనెక్ట్ కాలేకపోతాం. ఎందుకో తల్లి ట్రాక్ సహజంగా కుదరలేదు.ఈ సినిమా చూస్తున్నంతసేపు పెద్దగా లాజిక్స్ వెతక్కూడదు. పొరపాటున హీరో అలా ఎందుకు చేశాడు? ఇది ఎందుకు ఇలా జరిగింది? అనే సందేహం బుర్రలో వచ్చిందా? మూవీ కనెక్ట్ కావడం కష్టమైపోవచ్చు. కాబట్టి సరదాగా నవ్వుకోవడానికి చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారు?సూరి పాత్రలో అల్లరి నరేశ్ బాగానే చేశాడు. ఈ తరహా పాత్రలు ఇతడికి కొట్టినపిండి. సీనియర్ నరేశ్ కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. వయసైపోయిన వ్యక్తి పాత్రలో ఇతడు.. రంభతో నడిపే లవ్ ట్రాక్ మంచి ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. హీరోయిన్ సురభికి పెద్దగా స్కోప్ లేదు. రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ అందంగా ఉన్నారు. కాకపోతే షో కేస్ బొమ్మలా చూపించారు తప్పితే వీళ్లకు సరైన సీన్స్ పడలేదనిపించింది. వెన్నెల కిశోర్, హరితేజ కామెడీ ఓకే ఓకే. ఎస్సై అప్పలనాయుడిగా కన్నడ నటుడు తారక్ పొన్నప్పకు మంచి స్కోప్ దొరికింది. ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు ఓకే ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. అద్భుతాలు జరిగిపోయి తమ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుందనుకునే చాలామంది సోమరిపోతు కుర్రాళ్లకు చివర్లో ఇచ్చిన మెసేజ్ బాగుంది. దర్శకుడు చంద్రమోహన్ తన రైటింగ్తో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాడు కానీ కొంతమేర సక్సెస్ అయ్యాడు.- చందు డొంకాన
క్రీడలు
అసలు అతడిని ఎలా ఎంపిక చేశారు? ఇదేం పద్ధతి?
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది.ఫిట్నెస్ ఆధారంగా..జింబాబ్వే పర్యటనలో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను తప్పించి.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా అఫ్గాన్తో సిరీస్ ఆడిస్తామని తెలిపింది. ఇక గాయాల నుంచి జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి కోలుకున్నప్పటికీ.. ఫిట్నెస్ ఆధారంగానే వారు అఫ్గాన్తో సిరీస్ ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ విషయంలో మేనేజ్మెంట్ ఎందుకు ఇంత ఉదారంగా ఉంటుందో తనకు అర్థం కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రతీ రెండు, మూడు సిరీస్లకు ఓసారి గాయపడే ఆటగాడి కోసం ఇతరులను బలి చేయడం ఏమిటని ప్రశ్నించాడు.రెండువారాల్లో ఏం మారింది?ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో వాషింగ్టన్ సుందర్ బాగా ఆడతాడు. కానీ ఇటీవల గాయం వల్ల శ్రీలంకతో సిరీస్కు దూరమయ్యాడు. మరి రెండువారాల్లోనే అతడు ఎలా ఫిట్గా మారాడు?ఇప్పటికీ అతడు మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోలేదు. అలాంటపుడు జట్టుకు ఎంపిక చేసి ఏం ఉపయోగం? టీమిండియాకు ఎంపిక చేసే ముందు కనీసం కొన్ని మ్యాచ్లలో ఆడి.. ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్నది చూడాలి.డాక్టర్ సర్టిఫికెట్తో ఆడేస్తారా?కానీ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే చాలు ఆడిస్తామంటే ఎలా? వాషింగ్టన్ సుందర్ ప్రతీ రెండు, మూడు సిరీస్లకు ఓసారి గాయపడుతున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో అతడి బౌలింగ్ బాగాలేదు.నిజానికి టీ20 ఫార్మాట్తోనే అతడు టీమిండియాలోకి వచ్చాడు. ఆ తర్వాత తన ప్రదర్శనలతో టెస్టు క్రికెట్లోనూ అడుగుపెట్టాడు. కానీ ఇప్పుడు వైట్బాల్ క్రికెట్లో అతడు ఏమాత్రం సత్తా చాటడం లేదు’’ అని మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్య విధానాలను విమర్శించాడు. అదే సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి గురించి చిక్కా స్పందించాడు.ఇదేం పద్ధతి?ఒకవేళ నితీశ్ గనుక మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకుంటే.. శివం దూబేకు బదులు నితీశ్నే తుదిజట్టులో ఆడించాలని సూచించాడు. ఏదేమైనా మ్యాచ్ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని.. అంతే తప్ప డాక్టర్ సర్టిఫికెట్తో ఓ ఆటగాడు సులువుగా టీమిండియాలోకి రాకూడదని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పునరుద్ఘాటించాడు. చిన్నపుడు స్కూల్ ఎగ్గొట్టిన తర్వాత డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి.. చాలా మంది శిక్ష నుంచి తప్పించుకునే వాళ్లని.. టీమిండియాకు అలాంటి దుస్థితి రాకూడదని ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: గంజాయి వాసన వస్తోందని మ్యాచ్ ఆపిన సబలెంకా!
టీమిండియా నుంచి తీసేశారు.. ఆ కసి అక్కడ చూపించేస్తున్నాడు!
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్లో జలంధర్ వారియర్స్ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం మెహాలీ వేదికగా లూధియానా లయన్స్తో జరిగిన మ్యాచ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. 168 పరుగుల లక్ష్య చేధనలో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆర్యన్ యాదవ్(32) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా జలంధర్ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో ఊదిపడేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లుథియానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లుథియానా ఇన్నింగ్స్లో మాధవ్ సింగ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 72) టాప్ స్కోరర్గా నిలిచాడు. జలంధర్ బౌలర్లలో ఆర్యన్ యాదవ్ మూడు, రణ్దీప్ సింగ్, గుర్వీందర్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.కొనసాగుతున్న ప్రభ్సిమ్రాన్ నిరీక్షణ?కాగా 26 ఏళ్ల ప్రభ్సిమ్రాన్ సింగ్ గత కొన్నాళ్లగా వైట్బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హాజారే వంటి దేశవాళీ టోర్నీలతో ఐపీఎల్ వంటి మెగా లీగ్లో కూడా అతడు దుమ్ములేపుతున్నాడు. ఇండియా-ఎ జట్టు తరపున కూడా తన మార్క్ చూపించాడు. కానీ సీనియర్ జట్టు తరపున మాత్రం అరంగేట్రం చేసే అవకాశం అతడికి లభించడం లేదు. జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్ గైర్హజరీ కారణంగా ప్రబ్సిమ్రాన్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. కానీ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. మొత్తం మూడు మ్యాచ్లకు బెంచ్కే పరిమితం చేశారు. ఇప్పుడు అఫ్గానిస్తాన్తో సిరీస్కు సంజూ తిరిగి రావడంతో ప్రభ్సిమ్రాన్ను పక్కన పెట్టేశారు.అయినప్పటికి అతడు ఏ మాత్రం నిరాశ చెందకుండా తన అద్భుత ప్రదర్శనలతో సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఇప్పటివరకు ఈ పంజాబ్ టీ20 లీగ్లో కేవలం 4 మ్యాచ్లు ఆడిన ప్రభ్సిమ్రాన్ 401 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు.చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
అఫ్గాన్ సిరీస్కు బుమ్రా డౌటే.. రేసులోకి యార్కర్ల స్పెషలిస్ట్!
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడా? అంటే 'అవును' అనే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. అఫ్గాన్తో టీ20 సిరీస్తో పాటు ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్లలో బుమ్రా పేరు ఉన్నప్పటికీ, అతడికి ఇంకా బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు.బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని 'బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో పునరావాసం పొందుతున్నాడు. అతడు తన మోకాలి గాయం నుంచి కోలుకునే క్రమంలో ఉన్నాడు. అయితే బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకుండా మైదానంలోకి దించి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఈ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సెప్టెంబర్ 10 నుంచి ఢిల్లీలో ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది.అంతకంటే ముందే బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే వారు జట్టుతో కలిసే అవకాశముంది. అయితే బుమ్రా ఫిట్నెస్పై ఇంకా స్పష్టత లేకపోవడంతో అతడికి ప్రత్యామ్నాయంగా ప్రిన్స్ యాదవ్ను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే టీమిండియా తరఫున ఆరు టీ20లు ఆడిన ప్రిన్స్.. 9 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే బుమ్రా, హర్షిత్ రాణా వంటి ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వడంతో ప్రిన్స్ టీ20 జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు బుమ్రా ఇంకా కోలుకోకపోవడంతో ప్రిన్స్ మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.ప్రిన్స్కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ పరుగులను కట్టడి చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా పిన్ పాయింట్ యార్కర్లు వేయడంలో అతడు దిట్ట. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టు:శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, హర్షిత్ రానా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
'అతడి కోసమే నా భార్య క్రికెట్ చూస్తోంది'
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెడ్ బాల్ క్రికెట్లోనూ సత్తాచాటుతున్నాడు. సెంట్రల్ జోన్తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్లో ఈస్ట్జోన్ తరపున సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 132 పరుగులు చేసి తన జట్టు ఫైనల్కు చేరడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అయితే టీ20ను తలపిస్తూ బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో తన ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను సునాయసంగా అందుకునేలా కనిపించిన సూర్యవంశీ.. 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. ఇప్పుడు సెప్టెంబర్ 6 నుంచి సౌత్జోన్తో ప్రారంభం కానున్న ఫైనల్ మ్యాచ్కు సూర్యవంశీ సన్నదమవుతున్నాడు.ఈ నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్పై భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ ఒక అద్భుతమని, అతడి కారణంగానే తన భార్య దులీప్ ట్రోఫీని చూస్తుందని శ్రీకాంత్ వెల్లడించాడు.వైభవ్ ప్రస్తుతం మంచి రిథమ్లో ఉన్నాడు. అతడిని ప్రోత్సహించాలి గానీ, ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదు. సరైన మార్గంలో నడిపిస్తే భవిష్యత్తులో అతడు కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. టెస్ట్ క్రికెట్కు పూర్వ వైభవం తెచ్చే సత్తా వైభవ్కు ఉంది. అతడి ఆట తీరు వల్లే అందరూ ఇప్పుడు దులీప్ ట్రోఫీని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఆఖరికి మా భార్య కూడా వైభవ్కు పెద్ద అభిమానిగా మారిపోయింది. కేవలం అతడి బ్యాటింగ్ చూడడం కోసమే ఆమె దులీప్ ట్రోఫీ మ్యాచ్లను వీక్షిస్తోంది" అని చిక్కా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ఈ బిహార్ క్రికెటర్ ఇప్పటికే వరల్డ్ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అటు అండర్-19 నుంచి ఇటు అంతర్జాతీయ క్రికెట్ వరకు ఎన్నో అద్భుత రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!
న్యూస్ పాడ్కాస్ట్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
కొండా సురేఖను తప్పించాల్సిందే.... కేసీ వేణుగోపాల్తో భేటీలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
బిజినెస్
వచ్చే వారం 4 ఐపీవోలు రెడీ
కొత్త ఏడాది(2026)లో సెకండరీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతుంటే.. ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కుతున్నాయి. ఇప్పటికే 55 కంపెనీలకుపైగా ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్కాగా.. వచ్చే వారం మరో 4 కంపెనీలు ఇన్వెస్టర్లను పలకరించనున్నాయి. జాబితాలో కనోహర్ ఎలక్ట్రికల్స్, ప్రసోల్ కెమికల్స్, గ్లాస్ వాల్ సిస్టమ్స్తోపాటు.. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా(ఆర్సిల్) సైతం చేరింది. తొలి మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు 8న ప్రారంభంకానుండగా.. ఆర్సిల్ 9న మార్కెట్లకు చేరనుంది. ఈ నెల 16, 17న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఇవి లిస్ట్కానున్నాయి. ఉమ్మడిగా ఈ సంస్థలు రూ. 2,717 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. వివరాలు చూద్దాం.. ట్రాన్స్ఫార్మర్ల తయారీట్రాన్స్ఫార్మర్ల తయారీ, ఈపీసీ సేవల కంపెనీ కనోహర్ ఎలక్ట్రికల్స్ పబ్లిక్ ఇష్యూ రానున్న మంగళవారం(8న) ప్రారంభంకానుంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 601–632 ధరల శ్రేణి ప్రకటించింది. గురువారం(10న) ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 756 కోట్ల విలువైన 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్ కే సన్స్ ఆఫర్ చేస్తోంది. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,056 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 64 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. వీటిలో గంగోల్ తయారీ ప్లాంటుకు అవసరమైన మెషీనరీ, పరికరాల కొనుగోలు, ముడిసరుకులు సమకూర్చుకునే సౌకర్యాలకు, ఆఫీస్ బిల్డింగ్ ని ర్మాణం తదితరాలున్నాయి. మరో రూ. 155 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు, మిగిలిన సొమ్మును సాధా రణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. విద్యుత్, రైల్వేలు, పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీలకు ప్రొడక్టులను అందిస్తోంది. ట్రాన్స్మిషన్ లై న్లు, సబ్స్టేషన్ల ఈపీసీ కార్యకలాపాలు సైతం నిర్వహిస్తోంది. 2023–24తో పోలిస్తే 2025–26లో ఆదాయం దాదాపు 3 రెట్లు జంప్చేసి రూ. 654 కోట్లకు చేరింది. లాభం సైతం రూ. 18 కోట్ల నుంచి భారీగా దూసుకెళ్లి రూ. 130 కోట్లను తాకింది.స్సెషాలిటీ కెమికల్స్..స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ప్రసోల్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ 8న ప్రారంభంకానుంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 643–676 ధరల శ్రేణి నిర్ణయించింది. 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 80 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 420 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 500 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 7న షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్సహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 1992లో ప్రాచీ పాలీ ప్రొడక్ట్స్గా ఏర్పాటైన కంపెనీ 2007లో ప్రసోల్ కెమికల్స్గా రూపాంతరం చెందింది. కంపెనీ ప్రధానంగా ఎసిటోన్తోపాటు.. ఫాస్ఫరస్ ఆధారిత స్పెషాలిటీ కెమికల్స్ను రూపొందిస్తోంది. ఫార్మాస్యూటికల్స్, ఆగ్రోకెమికల్ ఫార్ములేషన్స్ తదితరాలలో ప్రొడక్టులను వినియోగిస్తారు. అంతేకాకుండా గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో కీలక ముడిసరుకుగానూ వినియోగిస్తారు. ఫాసేడ్ సొల్యూషన్లు..భవంతుల నిర్మాణ సంబంధ(ఫాసేడ్) సొల్యూషన్లు అందించే గ్లాస్ వాల్ సిస్టమ్స్(ఇండియా) పబ్లిక్ ఇష్యూ 8న ప్రారంభంకానుంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 172–182 ధరల శ్రేణి నిర్ణయించింది. 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 368 కోట్ల విలువైన 2.02 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేస్తున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 428 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 7న షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్కు కేటాయించనుంది. వీటిని మహారాష్ట్రలోని విలే భగడ్ ప్లాంటులో గ్లాస్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు, మిగిలిన రూ. 10 కోట్లు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2002లో ఏర్పాటైన కంపెనీ భారత్సహా యూఎస్, ఆస్ట్రేలియాలోనూ సర్వీసులు సమకూర్చుతోంది. రూ.733 కోట్లకు సై..రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టే అసెట్ రీకన్స్ట్రక్షన్(ఇండియా) లిమిటెడ్ వచ్చే బుధవారం(9న) ఐపీవోకు రానుంది. ఆర్సిల్గా పిలిచే ఈ సంస్థ ఇందుకు ఒక్కో షేరుకి 132–139 ధరల శ్రేణి ప్రకటించింది. 11న ముగియనున్న ఇష్యూలో భాగంగా 5.27 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థలు ఎవెన్యూ ఇండియా రిసర్జెన్స్ పీటీఈ, స్టేట్బ్యాంక్తోపాటు, ప్రస్తుత వాటాదారు సంస్థలు లాథే ఇన్వెస్ట్మెంట్ పీటీఈ, ఫెడరల్ బ్యాంక్ విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఇష్యూ ద్వారా సమీకరించే రూ. 733 కోట్లు కంపెనీకి చేరబోవు. యాంకర్ ఇన్వెస్టర్లకు 8న షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ ప్రధానంగా ఒత్తిడిలోపడిన రుణాలను బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి కొనుగోలు చేసి రుణ పరిష్కార ప్రణాళికల ద్వారా పునర్వ్యవస్థీకరణకు తెరతీస్తుంటుంది.ఇదీ చదవండి: జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతోందా?
టాటా.కార్స్ నుంచి కర్వ్ ‘సిరీస్ ఎక్స్’
టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగం తన ‘కర్వ్’ మోడల్లో ‘సిరీస్ ఎక్స్’ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ శ్రేణి ప్రారంభ ధరను రూ.9.99 లక్షలు (ఎక్స్–షోరూమ్)గా నిర్ణయించింది. కూపే తరహా డిజైన్, పనితీరు, సౌకర్యం, ప్రీమియం ఫీచర్లు, భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ కొత్త రేంజ్ను తీసుకొచి్చనట్లు కంపెనీ తెలిపింది. ‘సిరీస్ ఎక్స్’లో ప్యూర్ ఎక్స్ రూ.10.99 లక్షల ప్రారంభ ధరతో, ప్యూర్ ఎక్స్ ప్లస్ రూ.11.79 లక్షలతో, క్రియేటివ్ ఎక్స్ ప్లస్ రూ.12.91 లక్షలతో అందుబాటులోకి వచ్చాయి. ప్యూర్ ఎక్స్ ప్లస్ ఆధారిత ‘డార్క్’ ఎడిషన్ను రూ.11.99 లక్షల ప్రారంభ ధరతో అందిస్తోంది.ప్యూర్ ఎక్స్ వేరియంట్లో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు, టెయిల్ల్యాంప్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్యూర్ ఎక్స్ ప్లస్లో అదనంగా ప్రీమియం లెదరెట్ సీట్లు, 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. క్రియేటివ్ ఎక్స్ ప్లస్ వేరియంట్లో పనోరమిక్ సన్రూఫ్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ కాక్పిట్, నావిగేషన్ డిస్ప్లే వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. అకెంప్లిష్డ్ ఎక్స్, అకెంప్లి‹Ù్డ ఎక్స్ ప్లస్ టాప్–ఎండ్ మోడళ్లలో లెవెల్–2 ఏడీఏయస్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6–వే పవర్డ్ డ్రైవర్ సీట్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, 9 స్పీకర్లు, వైర్లెస్ ఛార్జర్, ట్విన్–జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలెక్సా ఇంటిగ్రేషన్ వంటి అధునాతన ఫీచర్లు అందిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.డార్క్ ఎడిషన్ను బ్లాక్–అవుట్ రూపాన్ని కోరు కునే వినియోగదారుల కోసం ప్యూర్ ఎక్స్ ప్లస్ వేరియంట్ ఆధారంగా రూ.11.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సీసీఓ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ఎస్యూవీ డిజైన్ ఆలోచనా విధానాన్ని ‘కర్వ్’ మార్చివేసింది. రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో వస్తున్న కర్వ్ సిరీస్ ఎక్స్ మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. ఎలాంటి రాజీ లేకుండా ఆకర్షణీయమైన డిజైన్, పనితీరు, సౌకర్యం, ప్రీమియం ఫీచర్లు, భద్రతను అందించడమే దీని లక్ష్యం’’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతోందా?
భారత కంపెనీలపై కెన్యా ‘సఫారీ’!
కెన్యాలోని కజియాడో కౌంటీలోని మగాడి సరస్సు వద్ద టాటా కెమికల్స్ మగాదీ లిమిటెడ్(టీసీఎంఎల్) సోడా యాష్ గనులను నిర్వహిస్తోంది. శతాబ్దంపైగా చరిత్ర గల ఈ గనులను 2005లో బ్రిటన్కు చెందిన బర్నర్ మాండ్ నుంచి కొనుగోలు చేయడం ద్వారా టాటా కెమికల్స్ కెన్యాలోకి అడుగుపెట్టింది. 100 ఏళ్ల మైనింగ్ హక్కులను దక్కించుకుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే సోడా యాష్ను గ్లాస్, డిటర్జెంట్లతో సహా రకరకాల పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. ఈ ఖనిజం విదేశాలకూ భారీగా ఎగుమతవుతోంది. అయితే, ఈ ఏడాది జూలై 28న మైనింగ్ క్యాబినెట్ సెక్రటరీ హాసన్ జోహో టీసీఎంఎల్ మైనింగ్ కార్యకలాపాలను సస్పెండ్ చేయడంతో గొడవ మొదలైంది. మైనింగ్ లైసెన్సులతో పాటు ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించిందనేది గనుల శాఖ ఆరోపణ.అంతేకాదు, రాయల్టీలు, ఖనిజ శుద్ధి, ఎగుమతుల రిపోర్టింగ్, కమ్యూనిటీ అభివృద్ధికి సంబంధించి కూడా పలు ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా టాటా కెమికల్స్ ఇక్కడ గనుల నుంచి వెలికితీస్తున్న ఖనిజాన్ని ప్రాసెసింగ్ చేసేందుకు తగినన్ని ఫ్యాక్టరీలను పెట్టకుండా, ఎగుమతి చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, మైనింగ్ శాఖ సస్పెన్షన్ ఆదేశాలపై కెన్యా హైకోర్టులో సవాలు చేసినా టాటాలకు ఊరటదక్కలేదు.రూటో అల్టిమేటం..కెన్యా అధ్యక్షుడు విలియం రూటో టాటా కెమికల్స్ తమ దేశాన్ని విడిచిపోవాలంటూ అల్టిమేటం జారీ చేయడంతో వివాదం మరింత ముదిరింది. టాటా దశాబ్దాలుగా తమ దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ.. తగినన్ని ఫ్యాక్టరీలను నెలకొల్పలేదని, స్థానికంగా ఎలాంటి పారిశ్రామిక ప్రగతీ లేదని రూటో విరుచుకుపడ్డారు. ప్రజలకు టాటా కెమికల్స్ వల్ల పైసా ప్రయోజనం లేదని, అందుకే ఈ ప్రాంతంలో గ్లాస్, కెమికల్ తయారీ ఫ్యాకర్టీల కోసం ప్రభుత్వం రెండు కంపెనీలను నెలకొల్పుతుందన్నారు. టాటాల వ్యాపారాన్ని ఆ కంపెనీలు టేకోవర్ చేస్తాయని ప్రకటించారు.గతంలో కూడా ఇక్కడ టాటాలతో గొడవ నడిచింది. భూమి ధరలు, రాయల్టీలకు సంబంధించి తమకు 17.4 బిలియన్ కెన్యన్ షిల్లింగ్లను చెల్లించాలంటూ కిజియాడో కౌంటీ కోర్టుకెక్కింది. అయితే, దీనిపై టాటాలకు అనుకూలంగా తీర్చురావడంతో పరిస్థికి కాస్త సద్దుమణిగింది. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడే టాటాలను దేశం నుంచి వెళ్లగొట్టే చర్యలకు తెరతీయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాలు, కోర్టులే టాటా కెమికల్స్ కెన్యా వ్యాపార భవిష్యత్తును తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది.సమస్యలను పరిష్కరించుకుంటాం టాటా కెమికల్స్ వెల్లడిమగాడి గనుల సస్పెన్షన్ ఆదేశాల నేపథ్యంలో కెన్యా గనుల శాఖ కోరిన సమాచారం, డాక్యుమెంట్లు, రిపోర్టులు అన్నీ ఇప్పటికే సమర్పించామని టాటా కెమికల్స్ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని, ప్రభుత్వ యంత్రాంగం నుంచి తదుపరి ఆదేశాల కోసం వేచిచూస్తున్నట్లు తెలిపింది. వివాదాస్పద అంశాల పరిష్కారం కోసం న్యాయపరంగా, నియంత్రణపరంగా కెన్యా ప్రభుత్వంతో కలిసి తగిన చర్యలు చేపట్టడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తమ ఉద్యోగులు, మగాదీ ప్రజల శ్రేయస్సుతో పాటు కెన్యా ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. మన కంపెనీలపై కన్నెర్ర...టాటాకు ముందు కెన్యాలో వివిధ రకాల ప్రతికూలతలతో దుకాణం సర్దేసిన భారతీయ కంపెనీలు చాలానే ఉన్నాయి.అదానీ: నైరోబీ జోమో కెన్యాటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (జేకేఐఏ) ఆధునీకరణ ప్రాజెక్టును (1.85 బిలియన్ డాలర్లు) 30 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ 2024లో దక్కించుకుంది. వ్యూహాత్మక జాతీయ ఆస్తులను విదేశీ కంపెనీలకు కట్టబెడితే ఉద్యోగాలు పోతాయంటూ కెన్యాలోని విమానయాన యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోపక్క, అదానీ ఎనర్జీ, కెన్యా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీతో 30 ఏళ్ల పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ఒప్పందాన్ని కుదుర్చకుంది. ఈ విద్యుత్ ట్రాన్స్మిషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు విలువ 736 మిలియన్ డాలర్లు. అమెరికాలో గౌతమ్ అదానీపై లంచాల కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత రూటో ఈ రెండు అదానీ ప్రాజెక్టులను రద్దు చేశారు. అయితే, ఎయిర్పోర్టు ప్రాజెక్టు రద్దు వెనుక చైనా హస్తంపై అనుమానాలున్నాయి. ఎందుకంటే 1.2 బిలియన్ డాలర్లతో చైనా రోడ్ అండ్ బ్రిడ్స్ కార్పొరేషన్ జేకేఐఏ విస్తరణకు ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.ఎస్సార్: 2008లో ఎస్సార్ తన యూమొబైల్ టెలికం వ్యాపారాన్ని కెన్యాలో ప్రారంభించింది. 40 బిలియన్ కెన్యన్ షిల్లింగ్స్ పెట్టుబడులు పెట్టింది. అయితే, నష్టాల కారణంగా 2014లో దీన్ని ఎయిర్టెల్, సఫరీకామ్లకు విక్రయించింది. ఇక కెన్యా పెట్రోలియం రిఫైనరీస్లో 50 శాతం వాటాను ఎస్సార్ ఎనర్జీ 2016లో కెన్యా ప్రభుత్వానికి 5 మిలియన్ డాలర్లకు వదిలేసి వైదొలగింది. కెన్యా ప్రభుత్వ ప్రతికూల పాలసీలే దీనికి కారణమనేది ఎస్సార్ ఆరోపణ.కరుటూరి గ్లోబల్: బెంగళూరుకు చెందిన ఈ ఫ్లవర్ బిజినెస్ కంపెనీ దాదాపు 383 మిలియన్ డాలర్ల రుణాలు తిరిగి చెల్లించలేక పోవడం, పన్నుల సంబంధ వివాదాదలతో దుకాణం సర్దేసింది.మహీంద్రా: కామ్సన్ మోటార్స్ పేరుతో కెన్యాలో మహీంద్రా వాహన వ్యాపారాన్ని వివాదాస్పద సరఫరా ఒప్పందం కారణంగా మూసేసింది. అయితే, 2012లో స్థానిక పంపిణీ ఒప్పందం ద్వారా మహీంద్రా మళ్లీ కెన్యాలో అడుగుపెట్టింది.ఎయిర్టెల్: కెన్యాలో 2015లో ముగిసిన యూమొబైల్ లైసెన్స్ విషయంలో భారీ ఫీజుల చెల్లింపు డిమాండ్పై అక్కడి టెలికం నియంత్రణ సంస్థలతో ఎయిర్టెల్ తీవ్ర పోరాటమే చేయాల్సి వచ్చింది. కెన్యాలో రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా నిలుస్తున్న ఎయిర్టెల్ గత నెలలోనే కోర్టు వెలుపల సెటిల్మెంట్ ద్వారా మళ్లీ 25 ఏళ్ల కొత్త లైసెన్స్ దక్కించుకుంది.అయితే, ప్రభుత్వంతో వివాదాలు నెలకొంటున్నా... కెన్యాలో ఇప్పటికీ 200 భారతీయ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండటం విశేషం. ఇందులో గోద్రెజ్, థెర్మాక్స్, యూపీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు ఐటీ, ఫార్మా సంస్థలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలా కంపెనీలు నేరుగా ప్లాంట్ల ఏర్పాటు కంటే వాణిజ్యపరమైన లావాదేవీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. కాగా, అదానీతో డీల్ రద్దు తర్వాత 311 మిలియన్ డాలర్ల విలువైన ట్రాన్స్మిషన్ కాంట్రాక్టు కోసం ప్రభుత్వ రంగ పవర్గ్రిడ్ కార్పొరేషన్తో కెన్యా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.ఇదీ చదవండి: జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతోందా?
ఎన్ఎస్ఈ ఐపీఓ వచ్చేస్తోంది!
న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం లిస్టింగ్కు ఎట్టకేలకు తెరలేచింది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పచ్చ జెండా ఊపింది. ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్సే్ఛంజీగా నిలుస్తున్న ఎన్ఎస్ఈ.. సెబీ ఆమోదంతో లిస్టింగ్ ప్రణాళికలను వేగవంతం చేయనుంది. వచ్చే వారమే ధరల శ్రేణిని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ నెల 15కల్లా ఐపీవోకు తెరతీయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.టాప్–10లోకి...ఐపీవోలో భాగంగా ఎన్ఎస్ఈ వాటా మూలధనంలో 6 శాతానికి సమానమైన 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 30,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఎల్ఐసీ, పేటీఎమ్, టాటా క్యాపిటల్, కోల్ ఇండియా ఇష్యూలను అధిగమించి అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలుంది. మరోపక్క జియో ప్లాట్ఫామ్స్ సైతం రూ. 37,700 కోట్ల మెగా ఐపీవో కోసం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఎన్ఎస్ఈ లిస్టయితే దేశీయంగా మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా టాప్–10లో నిలిచే అవకాశముంది. 1.8 లక్షలమంది వాటాదారులతో రూ. 5 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువను అందుకోవచ్చని అంచనా. 2016లో చెక్...ఎన్ఎస్ఈ తొలుత 2016 డిసెంబర్లో పబ్లిక్ ఇష్యూ(రూ. 10,000 కోట్ల సమీకరణ)కు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అయితే లిస్టింగ్ ప్రణాళికలకు నియంత్రణ, న్యాయ, పాలనా సంబంధ వివాదాలు అడ్డుపడుతూ వచ్చాయి. ఆపై అవాంతరాల కారణంగా 2019, 2020, 2024లో ఎన్వోసీ కోసం పత్రాలు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో వివాద పరిష్కారాలకుగాను సెబీకి రూ. 1,491 కోట్లకుపైగా చెల్లించింది. ఎప్పటినుంచో నడుస్తున్న కోలొకేషన్, డార్క్ఫైబర్ కేసులపై ఈ వారం సుప్రీం కోర్టు సెబీ అప్పీల్ను కొట్టివేసిన నేపథ్యంలో ఎన్ఎస్ఈకి ఉపశమనం లభించింది. ఆపై తాజాగా సెబీ నుంచి అనుమతి పొందింది.వాటాదారులు ఇలా...ఐపీవోలో ప్రస్తుత వాటాదారు సంస్థలు ఈక్విటీ వాటాలను ఆఫర్ చేయనున్నాయి. తద్వారా తమ వాటాలను విక్రయించేందుకు(మానిటైజ్) వీలు చిక్కనుంది. దీంతో నిధులు ఎక్సే్చంజీకి చేరబోవు. బ్యాంకర్ల అంచనా ప్రకారం ఎన్ఎస్ఈ ఐపీవో ధర రూ. 2,000గా ఉండవచ్చు. ఈ నెల 11కల్లా ధరల శ్రేణిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈ ఐపీవోలో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 2.48 కోట్ల షేర్లు, ఎంఎస్ స్ట్రాటజిక్(మారిషస్) 1.6 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఈ జాబితాలో కెనడా పెన్షన్ ప్లాన్, అరండా ఇన్వెస్ట్మెంట్స్, బీవోబీ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, జీఐసీసహా ఇతర బీమా కంపెనీలు చేరాయి. అయితే అతిపెద్ద వాటాదారు(10.72 శాతం) ఎల్ఐసీ షేర్లను విక్రయించడం లేదు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్బీఐ వాటా 3.23 శాతంకాగా.. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్కు 4.33 శాతం, స్టాక్ హోల్డింగ్కు 4.44 శాతం చొప్పున వాటా ఉంది. డెరివేటివ్స్ కింగ్ దేశీయంగా ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్లో ఎన్ఎస్ఈ ఆధిపత్యం వహిస్తోంది. ట్రేడవుతున్న కాంట్రాక్టులరీత్యా ప్రపంచంలోనే అత్యంత రద్దీగల ఎక్సే్ఛంజీగా నిలుస్తోంది. ఇక గతేడాది(2025–26)లో మొత్తం ఆదాయం రూ. 18,713 కోట్లుకాగా.. నికర లాభం 15 శాతం తగ్గి రూ. 10,302 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2024–25) ఆదాయం రూ. 19,177 కోట్లుకాగా.. రూ. 12,188 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 3,120 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 9 శాతం ఎగసి రూ. 5,252 కోట్లకు చేరింది. ఈ షేర్లకు పండుగ ఎన్ఎస్ఈ లిస్ట్కానుండటంతో ఐఎఫ్సీఐ, న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. దీంతో తాజాగా ఐఎఫ్సీఐ షేరు 6 శాతం జంప్చేసి రూ. 101ను దాటింది. తొలుత రూ. 107కు ఎగసింది. ఇక న్యూ ఇండియా 17.5 శాతం దూసుకెళ్లి రూ. 230కు చేరింది. ఇవి 52 వారాల గరిష్ట ధరలుకాగా.. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్లో 52.86 శాతం వాటా కలిగిన ఐఎఫ్సీఐ ఎన్ఎస్ఈ లిస్టింగ్తో లబ్ధి పొందనుంది. స్టాక్ హోల్డింగ్కు ఎన్ఎస్ఈలో 4.44% వాటా ఉంది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో 1.42% వాటా కలిగిన న్యూ ఇండియా సైతం వాటా విక్రయం ద్వారా లాభపడనుంది. గత నెల రోజుల్లో ఐఎఫ్సీఐ 42%, న్యూ ఇండియా 33% చొప్పున బలపడటం గమనార్హం! బంపర్ లిస్టింగ్.. ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్, ప్రయారిటీ జ్యువెల్స్ షేర్లు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ను తాకి, అక్కడే లాక్ అయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే తొలి రోజే ఈఎస్డీఎస్ షేరు 109%, ప్రయారిటీ జ్యువెల్స్ షేరు 18 శాతం లాభాలు ఇన్వెస్టర్లకు పంచాయి. → ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిస్టింగ్ ఇష్యూ ధర (రూ.429)తో పోలిస్తే బీఎస్ఈలో ఏకంగా 74 శాతం ప్రీమియంతో రూ.746 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఇంట్రాడేలో 109 శాతం ఎగసి రూ.895.55 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకి, అక్కడే లాక్ అయింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.10,647 కోట్లుగా నమోదైంది. → ప్రయారిటీ జ్యువెల్స్ ఇష్యూ ధర (రూ.200)తో పోలిస్తే 12 శాతం ప్రీమియంతో రూ.225 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 18 శాతం ఎగసి రూ.236 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకి, అక్కడే స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.426 కోట్లుగా నమోదైంది.
ఫ్యామిలీ
ఒక టెక్నికల్ లోపం.. ప్రపంచానికి కొత్త ప్యాకింగ్ సొల్యూషన్!
బబుల్ రాప్.. ఈ రోజుల్లో దీని పాత్ర చెప్పలేనిది. ఆన్లైన్ షాపింగ్ వచ్చాక ప్యాకేజింగ్లో దీని అవసరం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణాలు, గాజు వస్తువులు ఒక్కటేమిటీ ప్రతీ వస్తువుకు రక్షణ కవచంలా మారిపోయింది. మరి ఇంతలా వినియోగిస్తున్న ఈ బబుల్ రాప్ కవర్..మీకు తెలుసా? బబుల్ రాప్ కథ అమెరికాలోని న్యూజెర్సీలో 1957లో మొదలైంది. ఆల్ఫ్రెడ్ ఫీల్డింగ్, మార్క్ చవాన్నెస్ అనే ఇద్దరు ఇంజనీర్లు తమ గ్యారేజీలో పని చేస్తూ.. గోడలకు ఒక కొత్త స్టైల్ ఇవ్వడానికి ప్లాస్టిక్ వాల్పేపర్ను తయారు చేయాలని భావించారు. దీని కోసం రెండు ప్లాస్టిక్ షీట్లను ఒక యంత్రం సాయంతో అతికించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు, యంత్రంలో ఒక చిన్న సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల రెండు ప్లాస్టిక్ షీట్ల మధ్య చిన్నచిన్న గాలి బుడగలు చిక్కుకుపోయాయి. బయటకు వచ్చిన షీట్ సాదాగా కాకుండా, బుడగలతో నిండి ఉంది. అయితే ఈ బుడగల వాల్ పేపర్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేదు.1960లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బబుల్ రాప్కి మంచిరోజులొచ్చాయి. అప్పట్లో ఐబీఎం సంస్థ 1401 కంప్యూటర్ను లాంచ్ చేసింది. అది చాలా సున్నితమైన యంత్రం, కాబట్టి దానిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం పెద్ద సవాలుగా మారింది. అప్పుడు మార్క్ చవాన్నెస్ ఈ బబుల్ ప్లాస్టిక్ను ఆ సంస్థకి చూపించారు. ఆ గాలి బుడగలు వస్తువులకు రక్షణ కవచంలా పనిచేస్తాయని ఐబీఎం ఇంజనీర్లు గుర్తించారు. అలా తమ కంప్యూటర్లను సురక్షితంగా రవాణా చేయడానికి దీనిని వాడటం మొదలుపెట్టారు. దీంతో బబుల్ రాప్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. నేటి ఈ–కామర్స్ కాలంలో ఈ బబుల్ రాప్ లేని పార్సిల్స్ను ఊహించడం అసాధ్యం.ఇవి కూడా చదవండి: నెల జీతంతో ఇంత కుటుంబాన్ని నడిపించేది ఎవరో తెలుసా?
నెల జీతంతో ఇంత కుటుంబాన్ని నడిపించేది ఎవరో తెలుసా?
మనందరికి బాగా గుర్తుండే ఉంటుంది... చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికొచ్చినప్పుడు వంటింట్లో నుంచి కమ్మటి వాసన..ఈవెనింగ్ స్నాక్స్ కింద అమ్మ గారెలో, బజ్జీలో వేస్తోంది అని ఇట్టే పసిగట్టేస్తాం. అమ్మ చాలా పనులు చేసేది. నాన్నమ్మకి మందులు ఇవ్వాలి. మనకి ట్యూషన్కి వెళ్లే ముందు చాక్లెట్లకి డబ్బులివ్వాలి. దీపావళి, సంక్రాంతి లాంటి పండగలొస్తే కొత్త బట్టలు ఒంటిమీదకొస్తాయని చెప్పక్కర్లేదు. ఇక బంధువులు వచ్చినప్పుడు హడావిడిగా తిరుగుతూ అందరికీ అన్నీ చేస్తూ ఇంటి భారాన్ని మోస్తూ నవ్వుతూ కనిపించే అమ్మ నిజంగా మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటో చెప్పకనే చెప్పేది. నెలకోసారి వచ్చే నాన్న జీతంతోనే ఇన్ని చేయగలగడమే నిజమైన ఫైనాన్షియల్ డిసిప్లిన్.ఒకప్పుడు వంటింటి బడ్జెట్కే పరిమితమైన మహిళలు.. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. కేవలం సంపాదించడమే కాకుండా, సరైన ΄÷దుపు ప్రణాళికలు, పెట్టుబడుల ద్వారా మహిళలు నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం వైపు అడుగులు వేస్తున్నారు. తమ కుటుంబాలకు ఆర్థిక రక్షణ కవచంగా మారుతున్నారు.ఆర్థిక స్థిరత్వం దిశగా..ఆర్థికంగా నిలదొక్కుకున్న మహిళ.. ఒక కుటుంబానికే కాదు, యావత్ సమాజానికే ఆత్మవిశ్వాసం. కష్ట కాలంలో ఇతరులపై ఆధారపడకుండా, తమ కష్టార్జితాన్ని సరైన ΄÷దుపు మార్గాల్లో మళ్లించడం ద్వారా తమకు తాము సాధికారతౖవైపు నడవవచ్చు. గృహిణి అయినా, ఐటీ ఉద్యోగిణి అయినా.. నేడు ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అసలైన మంత్రం ‘డబ్బు సంపాదించడం ఒక ఎతై ్తతే, ఆ డబ్బును మన కోసం పని చేయించడం మరొక ఎత్తు’. అలా ఉండాలంటే కొన్ని ఆర్థిక వ్యూహాలు, జాగ్రత్తలు తప్పనిసరి.స్వయంగా తెలుసుకోవాలి..మీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ అవుతోంది, దానిపై ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనే విషయాలను మీరే స్వయంగా పర్యవేక్షించాలి. మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయానికి మీరే పూర్తి బాధ్యత వహించాలి. పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలు చదవడం, మంచి ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోవడం ద్వారా మీలో ఆర్థిక అవగాహన, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కీలకమైన ఆర్థిక నిర్ణయాల కోసం ఇతరులపై ఆధారపడటం తగ్గుతుంది.క్లిష్ట పరిస్థితుల్లోనూ..జీవితంలో ఎప్పుడు ఎలాంటి అత్యవసర పరిస్థితి వస్తుందో చెప్పలేం. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం మంచిది. అందుకోసం మన సంపాదనలో ప్రతినెలా కొంత మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్లు లేదా క్రెడిట్ కార్డ్ల ఊబిలో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఆర్థిక నిర్వహణ అంటే.. కేవలం డబ్బు దాచడం మాత్రమే కాదు. అది మీ భవిష్యత్తును మీరే నిర్దేశించుకునే ఒక ఆత్మవిశ్వాసమని గుర్తించాలి.ఇవి చదవండి: యూరప్ పరిస్థితి చూస్తే భయమేస్తోంది.. ప్రకృతి హెచ్చరిక ఇదేనా?
యూరప్ పరిస్థితి చూస్తే భయమేస్తోంది.. ప్రకృతి హెచ్చరిక ఇదేనా?
మనదేశంలో యూరప్కి ఉన్న క్రేజే వేరు. సమ్మర్ వస్తే యూరప్ ట్రిప్, సినిమా షూటింగులకి యూరప్ ట్రిప్, అంతెందుకు? కూల్డ్రింక్ తాగండి యూరప్ ట్రిప్ గెలవండి అంటూ ప్రకటనలను కూడా మనం చూశాం.. కాని ఇప్పుడు అదే యూరప్ కాలుతున్న పెనుములా కనిపిస్తోంది. అక్కడ కూడా రికార్డ్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ మన తెలంగాణాలోని రామగుండం, కొత్తగూడెం, ఆంధ్రాలోని నెల్లూరు, వైజాగ్ లాంటి ప్రాంతాలను తలపిస్తున్నాయంటే నమ్ముతారా? కాని ముమ్మాటికి ఇది నిజం..గ్రీస్ తీరం, పారిస్ నగరం, రోమ్ వీధులు, స్పానిష్ రుచులు ఒక్కసారిగా వేడెక్కాయి.. 2026 మే నెలలో పశ్చిమం నుంచి మొదలైన హీట్ వేవ్ కారణంగా మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగి జనజీవనాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎండతాపానికి రోడ్లు సైతం కరిగిపోయాయి. రైలు పట్టాలు వంకర్లు తిరిగాయి. జనాలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే హడలెత్తిపోయారు. యూరప్ ఖండంలో దాదాపు సగభాగం హీట్ వేవ్ కారణంగా ప్రజలు దారుణమైన పరిస్థితులను చవిచూశారు. అనధికార లెక్కల ప్రకారం ఎండ దెబ్బకి దాదాపు 35 వేల మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.పెరిగిన మరణాల రేటుఅత్యధికంగా జర్మనీలో ఏప్రిల్ 6 నుంచి ఆగస్టు 9 వరకు సుమారు 14 వేల మంది మరణించినట్టు జర్మనీ రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ అంచనా వేసింది. సాధారణంగా వేసవి కాలంలో నమోదయ్యే మరణాల కంటే రెండు వేల కంటే తక్కువగా ఉంటాయి. అక్కడ ఈ స్థాయిలో మరణాల రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. తర్వాత స్థానంలో ఫ్రాన్స్ ఉంది.అక్కడ సాధారణం కంటే 7,300 మరణాలు అధికంగా నమోదయ్యాయి. మే చివరి నుంచి జూలై 22 వరకు ఇంకా పూర్తి స్థాయిలో మరణాలను లెక్కించాల్సి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తర్వాత స్పెయిన్లో 4,947 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత ఇంగ్లండ్లో 2,877, బెల్జియంలో 1,222, పోలాండ్లో 1,070, నెదర్లాండ్స్లో సుమారు 900 వరకు మరణాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయి.తగ్గిన పర్యాటకంమన భారతీయులకు యూరప్ ట్రిప్ అంటే యమ క్రేజ్. ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం ప్రయాణించే వారి కంటే విహారం కోసం వెళ్లే వారే ఎక్కువ. 2024లో భారతదేశం నుంచి దాదాపు 38 లక్షల మంది యూరప్కి వెళ్లగా, 2025లో ఆ సంఖ్య 40 లక్షలకు చేరుకుంది. కాని యూరప్లో మారిన వాతావరణం దృష్ట్యా ఈ ఏడాది మాత్రం ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. రోజుకో ఏఐ టూల్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. దినదినాభివృద్ధి చెందుతున్న మానవ మేధస్సు ప్రకృతి ప్రకోపానికి మాత్రం సరైన జవాబు ఇవ్వలేకపోతోందనడానికి ఇదో ఉదాహరణ.మునుపెన్నడూ లేనంతగా..జూన్ 23న ఫ్రాన్స్లోని పిప్సోస్లో 44.3 డిగ్రీలు నమోదయ్యాయి. 1947 తర్వాత ఇదే ఆ దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. ఇక జర్మనీలో అయితే జూన్ చివరలో 46 ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సాధారణ వేసవితో పోలిస్తే ఇది దాదాపుగా రెట్టింపు. పారిస్, బెర్లిన్ నగరాలలో సాధారణం 23 డిగ్రీలు కాగా, ఈ ఏడాది 40కి చేరుకుంది. అలాగే ప్రాగ్, వియన్నా, మాడ్రిడ్, డబ్లిన్, బుకారెస్ట్ నగరాలలో సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.కారణమేంటి?భూతాపం పెరగడం, వాతావరణంలోని మార్పులు, పశ్చిమం నుంచి వచ్చిన వడగాల్పులు, కర్బన ఉద్గారాల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. మేలో వచ్చిన వడగాల్పులు అధిక పీడన ప్రభావంతో ఎండ తీవ్రత ఒక్కచోట కేంద్రీకృతం కావడం వల్ల యూరప్ ఉక్కపోతతో అల్లాడింది.ఇవీ చదవండి: మీ మెదడుకు బాస్ మీరే అనుకుంటున్నారా? నిజాలు తెలిస్తే షాకే!
మీ మెదడుకు బాస్ మీరే అనుకుంటున్నారా? నిజాలు తెలిస్తే షాకే!
మీరు మీ మెదడుకు బాస్ అనుకుంటున్నారా? ΄÷ర΄ాటే! మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీకు తెలియకుండానే మీ మెదడు బోలెడన్ని పనులు చేసేస్తుంటుంది. మీరు ‘‘నేను ఆలోచించి చేశాను’’ అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అసలు ఆలోచించింది మీరు కానే కాదు మీ మెదడే!మన కళ్ల ముందు కనిపించేది, మనం గుర్తుంచుకునేది, మనకు నచ్చేది, భయపడేది..ఇలా చాలా విషయాల్లో మెదడు తనదైన గేమ్ ఆడుతుంది. అందులో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని ‘‘అరే! ఇలానా?’’ అనిపిస్తాయి. ఇంకా మనకు తెలియకుండా మన మెదడు చేసే పనులేంటో చూసేద్దామా?1. మల్టీటాస్కింగ్మీరు ఫోన్ లో మెసేజ్ టైప్ చేస్తూనే టీవీ చూస్తూ, పక్కన ఎవరో మాట్లాడుతుంటే సమాధానం ఇస్తున్నారా? అది మీ గొప్పేం కాదు. ‘నా మల్టీటాస్కింగ్ సూపర్’ అని ఫీలవ్వకండి. చాలా సందర్భాల్లో రెండు క్లిష్టమైన పనులను ఒకేసారి చేయడం మెదడుకి వెన్నతో పెట్టిన విద్య.2. కనిపించని విషయాలను ఊహిస్తూ..మన కళ్లకు ప్రపంచం మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటాం. నిజానికి మన దృష్టిలో చిన్న ప్రాంతం కూడా స్పష్టంగా కనిపించదు. దానిని మెదడు చుట్టుపక్కల సమాచారంతో అంచనా వేసి నింపేస్తుంది. దీనినే ఇమేజ్గ్రాస్పింగ్లో మెదడు చేసే ‘‘ఫిల్లింగ్–ఇన్’’గా భావిస్తారు.3. జ్ఞాపకాలను నిర్మిస్తుంది!‘‘ఆ రోజు జరిగిన ప్రతి విషయం నాకు అచ్చంగా గుర్తుంది’’ అని చెప్పేవాళ్లను కాస్త అనుమానంతో చూడొచ్చు. మన జ్ఞాపకాలు సాధారణంగా వీడియో రికార్డింగ్లా స్టోర్ అవ్వవు/. గుర్తు చేసుకునే సమయంలో మెదడు అందుబాటులో ఉన్న సమాచారంతో ఆ సంఘటనను మళ్లీ సృష్టిస్తుంది.4. కాలింగ్..కాలింగ్ఒక ΄ార్టీకి వెళ్లారు. చుట్టూ పెద్ద శబ్దం. అందరూ మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా ఎవరో మీ పేరు పిలిచారు. వెంటనే మీ చెవులు అటువైపు తిరుగుతాయి. దీనిని సాధారణంగా‘ కాక్టెయిల్ ΄ార్టీ ఎఫెక్ట్’ అంటారు. 5. బోర్ కొట్టినా...మీరు ఏ పని చేయకుండా కూర్చున్నారు. బయటకు చూస్తున్నారు. కానీ మెదడు మాత్రం షిఫ్ట్ ముగించదు. మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మెదడులోని కొన్ని నెట్వర్క్లు చురుకుగా ఉంటాయి. 6. భయపెడుతుంది!రాత్రి ఒంటరిగా గదిలో కూర్చున్నారు. చిన్న శబ్దం వచ్చింది. వెంటనే గుండె వేగం పెరుగుతుంది. ‘‘ఎవరు?’’ అని చూస్తే.. కిటికీకి తగిలిన కొమ్మ! మెదడు ప్రమాదాన్ని గుర్తించే విషయంలో జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. 7. ముందే అర్థం చేసుకుంటుంది!మన కళ్లకు వచ్చే సమాచారాన్ని మెదడు కేవలం రిసీవ్ చేయదు. గత అనుభవాలు, సందర్భం, అంచనాలను కూడా ఉపయోగించి మనం ఏం చూస్తున్నామో అర్థం చేసుకుంటుంది. ఒకే చిత్రం లేదా ఒకే వాక్యాన్ని ఇద్దరు వ్యక్తులు కొంచెం భిన్నంగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ.8. అలవాట్లకు ఆటోపైలట్రోజూ ఒకే మార్గంలో ఆఫీసుకు వెళ్లే వ్యక్తికి మధ్యలో ఎన్నో విషయాలు గుర్తుండక΄ోవచ్చు. ఎందుకంటే పదేపదే చేసే పనుల్లో కొన్నింటిని మెదడు అలవాటుగా మార్చుకుంటుంది. దాంతో ప్రతి చిన్న చర్యను మొదటి రోజు లాగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.9. ఫోర్కాస్ట్‘‘రేపు ఇలా చేస్తే ఎలా ఉంటుంది?’’ అని ఊహించేటప్పుడు మెదడు ఖాళీ తెరపై సినిమా తీయదు. గత అనుభవాలు, జ్ఞాపకాలు, తెలిసిన సమాచారాన్ని ఉపయోగించి ఊహించడంలో సహాయపడుతుంది.10. మీకంటే ముందే నిర్ణయంఒక విషయం గురించి మనం ‘‘నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను’’ అనుకుంటాం. కానీ నిర్ణయ ప్రక్రియలో మనకు పూర్తిగా స్పష్టంగా తెలియనివి అనేకం పనిచేస్తుంటాయి. మన మెదడు మనకు కనిపించకుండా పనిచేసే ఒక భారీ నియంత్రణ కేంద్రం. మనం చూస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నుంచి జ్ఞాపకాలు, దృష్టి, భయం, అలవాట్లు, నిర్ణయాల వరకు.. ప్రతిచోటా దాని ΄ాత్ర ఉంటుంది. మరి మెదడు ఇంత పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ‘అదొక అర్థం కాని ప్రశ్నలా ఉందే’ అని మళ్లీ మన మెదడే సర్దిచెప్పుకుంటుంది.- శ్రావణ్ జయఇవి కూడా చదవండి: మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది!
అంతర్జాతీయం
ఇరాన్ పికాక్స్.. ట్రంప్కు ఎందుకంత పట్టుదల?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన భూగర్భ అణు కేంద్రంగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’పై తమ నిఘా కొనసాగుతోందని.. త్వరలోనే దానిపై దాడి చేసే అవకాశం ఉందని ప్రకటించారు. తద్వారా ఇరాన్ను మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారాయన. ఓవల్ ఆఫీసులో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. అక్కడ అణు కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే ఎంతకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారాయన.ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా అడ్డుకోవడమే అమెరికా సైనిక చర్యల ప్రధాన లక్ష్యం. మేం ఐదు నెలలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో ఇరాన్కు అణ్వాయుధం లేకుండా చేశాం. ఒకవేళ ఆ దేశం అణ్వాయుధాన్ని పొందితే పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారతాయి. అందుకే మా నిరంతర నిఘా కొనసాగుతుంది అని అన్నారాయన. పికాక్స్ మౌంటెన్పై నిఘానటాంజ్ యురేనియం శుద్ధి కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ మౌంటెన్ అత్యంత లోతైన భూగర్భ నిర్మాణాలతో కూడిన ప్రాంతంగా భావిస్తున్నారు. అక్కడ రెండు లోతైన సొరంగ వ్యవస్థలు ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనా ప్రకారం.. ఇరాన్ వేలాది సెంట్రిఫ్యూజ్లను ఈ భూగర్భ కేంద్రానికి తరలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.‘‘పికాక్స్లో ఏదైనా కార్యకలాపం జరుగుతున్నట్లు గుర్తిస్తే చాలా త్వరలోనే దాడి చేయవచ్చు. అక్కడి ప్రతీ కదలిక మాకు తెలుసు. ఇరాన్ అంతటా జరుగుతున్న కదలికలపై నిఘా ఉంది. ఏదైనా తప్పు జరిగితే తీవ్రంగా దాడి చేస్తాం’’ అని ట్రంప్ హెచ్చరించారు.భూగర్భంలో అత్యంత లోతుగా నిర్మించిన ఈ కేంద్రం.. సాధారణ వైమానిక దాడులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయితే అమెరికా ఇక్కడ దాడి చేస్తే ఇరాన్ అణు మౌలిక వసతులపై యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశముంది.ట్రంప్ ఇలా అనడం ఇదే తొలిసారి కాదు. జులైలోనే పికాక్స్ మౌంటెన్ను అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. అప్పట్లో ‘‘త్వరలోనే, భారీగా దాడి చేస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే స్థావరాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ అణు కార్యకలాపాలకు పికాక్స్ భవిష్యత్తులో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలోనే ట్రంప్ దృష్టి దీనిపైనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఎక్కడ ఉంది.. ఎందుకు కీలకం? ఇరాన్లోని జాగ్రోస్ పర్వత శ్రేణిలో ఉన్న పికాక్స్ మౌంటెన్.. దేశంలోని ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రం నతాంజ్కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతం లోపల వందల మీటర్ల లోతులో రెండు భారీ భూగర్భ టన్నెల్ సముదాయాలను నిర్మిస్తున్నారు. అత్యంత పటిష్ఠమైన ఈ నిర్మాణం వల్ల సాధారణ బంకర్-బస్టర్ బాంబులతోనూ దీనిని పూర్తిగా ధ్వంసం చేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తన అణు పరికరాలు, సెంట్రిఫ్యూజ్లు లేదా యురేనియం నిల్వలను ఇక్కడ భద్రపరిచే అవకాశం ఉండటంతో.. భవిష్యత్తులో అణు కార్యక్రమాలను తిరిగి కొనసాగించేందుకు ఇది కీలక స్థావరంగా మారొచ్చన్నదే అమెరికా ఆందోళన.ఇజ్రాయెల్కు అండగా..అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్, మొత్తం మిడిల్ఈస్ట్ మరింత తీవ్రమైన ముప్పును ఎదుర్కొనేవని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితిని తాము అడ్డుకున్నామని చెప్పారు. ఇరాన్ నుంచి యూరప్, అమెరికా నగరాలపైనా భవిష్యత్తులో ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇటీవల ఇరాన్కు చెందిన పలు సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్లు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతాలు, మైన్లు అమర్చే సామర్థ్యాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.రాడార్లను రెండుసార్లు ధ్వంసం చేశాంఇరాన్ రాడార్ వ్యవస్థలపై అమెరికా దాడులను కూడా ట్రంప్ ప్రస్తావించారు. అత్యాధునిక రాడార్ వ్యవస్థలను ఇరాన్ రెండుసార్లు ఏర్పాటు చేసినా.. వాటిని అమెరికా ధ్వంసం చేసిందన్నారు. ‘‘రాడార్ను మళ్లీ ఏర్పాటు చేసి మళ్లీ దాడికి గురికావడం వారికి విసుగొచ్చిందని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు.అమెరికా తాజా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. పలు ప్రావిన్సుల్లో సైనికేతర మౌలిక వసతులు, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించింది. అమెరికా దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ‘తీవ్రమైన ప్రతిదాడులు’ చేపట్టినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.ఇదీ చదవండి: అబ్బే.. అదసలు విషయమే కాదు: ట్రంప్
9 రోజులు... 216 గంటలు వరదను జయించిన ఆ ఇద్దరు
కఠ్మాండు: సరిగ్గా 9 రోజులు.. 216 గంటలు.. చుట్టూ చిమ్మచీకటి.. ఆకలేస్తున్నా తినడానికి తిండి లేదు. దాహమేస్తున్నా తాగడానికి మంచినీరు లేదు. అయినా బతుకుతామన్న ఆశను కోల్పోలేదు. శ్రీకృష్ణుడి నామస్మరణ చేస్తూ రేపటి కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. అదృష్టం వారిపైపే ఉంది. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు. పవిత్ర పర్వదినం కృష్ణాష్టమి రోజే వారికి పునర్జన్మ లభించడం గమనార్హం. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టులోని ఒక సొరంగం నుంచి ఇద్దరు వ్యక్తులను అధికారులు శుక్రవారం రక్షించారు. వారిద్దరినీ ఈ ప్రాజెక్టులో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్న కబిర్ మహర్జన్(45), ఫోర్మెన్ సంజయ్ షా(30)గా గుర్తించారు. మహర్జన్ను కఠ్మాండులోని నేపాల్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు సంజయ్ షా నువాకోట్లోని త్రిశూలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సహచరుల ప్రాణాలే ముఖ్యం సెంట్రల్ నేపాల్లోని త్రిశూలి నది పరీవాహక ప్రాంతంలో ఆగస్టు 24న సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు సొరంగంలోకి నీరు చేరింది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న కబిర్ మహర్జన్, సంజయ్ షా బయటకు రాలేకపోయారు. సొరంగం ముఖద్వారం మట్టితో మూసుకుపోయింది. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. తొమ్మిది రోజుల అన్వేషణ ద్వారా వారిద్దరూ బయటపడ్డారు. గత తొమ్మిది రోజులుగా సొరంగంలో హరే కృష్ణ మహా మంత్రాన్ని జపిస్తూనే ఉన్నానని సంజయ్ షా భద్రతా సిబ్బందికి చెప్పాడు. ప్రమాదం జరిగినప్పుడు తాను కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నానని తెలిపాడు. ‘‘కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నప్పుడు అందరి ప్రాణాలను కాపాడటమే నా బాధ్యత. ప్రమాదం తర్వాత అందరినీ బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాను. మొదట నా ప్రాణాల కంటే సహచరుల ప్రాణాలే ముఖ్యమని భావించా. వారు బయటకు వెళ్లేదాకా అక్కడే వేచి చూశాను. నేను తప్పించుకోవడానికి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సొరంగం మూసుకుపోవడంతో నుంచి బయటకు రాలేకపోయాను. సొరంగం లోపల నా చట్టుపక్కల ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించా. వారితో మాట్లాడేందుకు ప్రయతి్నంచా. శబ్దాలు చేయడం ద్వారా సంభాíÙంచగలిగాం. పవర్హౌస్ పరిసరాలతో సహా సొరంగం లోపలి భాగంలో మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చు. వారు ఏమైపోయారన్నది తెలియదు. ఆ సొరంగం చాలా పొడవైనది. వరద నీటి ఉధృతికి లోపలున్న కారి్మకులు దూరంగా కొట్టుకుపోయి ఉండొచ్చు. అందరూ క్షేమంగా బయటపడే అవకాశమైతే లేదు’’అని సంజయ్ షా చెప్పాడు. మాధేషి ప్రావిన్స్లోని సప్తరి జిల్లాకు చెందిన సంజయ్ షా చాలా రోజులుగా ఈ సొరంగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. నా భర్తకు ఇది పునర్జన్మ: మహర్జన్ భార్య కబిర్ మహర్జన్ ప్రాణాలతో తిరిగిరావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. తన భర్తకు పునర్జన్మ లభించిందని మహర్జన్ భార్య హీరా శోభ చెప్పారు. ఆయనను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన రక్షక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రార్థనలు, ఎదురుచూపులు ఫలించాయని, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గడచిన తొమ్మిది రోజులు తనకు, తన కుటుంబానికి అత్యంత బాధాకరమైనవని చెప్పారు. తాము సరిగ్గా తినలేకపోయామని, నిద్ర కూడా పోలేదని అన్నారు. తన భర్త బతికే ఉన్నాడని, కచ్చితంగా తిరిగి వస్తాడని విశ్వసించానని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇతర సొరంగాల్లో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది మంది కార్మికలు గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియరావడం లేదు. నేపాల్ సైన్యం నేతృత్వంలోని భద్రతా దళాలు ప్రత్యేక పరికరాలను ఉపయోగించి గాలింపు, సహాయక చర్యలు సాగిస్తున్నాయి. కబిర్ మహర్జన్, సంజయ్ షాలు చిక్కుకుపోయిన సొరంగం లోపలి నుంచి అరుపులు వినిపించడంతో అతికష్టంమీద వారిని రక్షించగలిగామని అధకారులు వెల్లడించారు. 11 హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న 600 మందికిపైగా కారి్మకులు వరదల్లో గల్లంతైనట్లు నేపాల్ స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. కబిర్ మహర్జన్, సంజయ్ షాను సజీవంగా టన్నెల్ నుంచి బయటకు తీయడం సహాయక సిబ్బందిలో కొత్త ఆశను రేకెత్తించింది. మరికొందరిని కూడా కాపాడగలమని వారు భావిస్తున్నారు. శాటిలైట్ డేటాతో గుర్తింపు త్రిశూలి 3ఏ జలవిద్యుత్ కేంద్రం వద్ద సొరంగంలో ఆచూకీ తెలియకుండా పోయిన 42 మంది కారి్మకుల కోసం డజన్ల కొద్దీ సహాయక సిబ్బంది గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. వారు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టడానికి శాటిలైట్ డేటాను ఉపయోగించారు. ఆ తర్వాత బురద, మట్టిని తొలగించడానికి భారీ యంత్రాలను రంగంలోకి దించారు. చేతులతో జాగ్రత్తగా తవ్వడం కొనసాగించడానికి ముందు దారిని సుగమం చేయడానికి పేలుడు పదార్థాలను ప్రయోగించారు. చివరకు ఇద్దరి ఆచూకీ మాత్రం కనిపెట్టగలిగారు. శుక్రవారం తొలుత సంజయ్ షాను సొరంగం నుంచి బయటకు తీశారు. కొద్దిసేపటికే తర్వాత కబీర్ మహర్జన్ను రక్షించారు. బయటకు వచ్చిన తర్వాత సంజయ్ షా అడిగిన మొదటి ప్రశ్న.. ఈ రోజు తేదీ ఏమిటి? అని. అత్యవసర వైద్య చికిత్స కోసం వారిద్దరినీ విమానంలో రాజధాని కఠ్మాండులోని సైనిక ఆసుపత్రికి తరలించారు. సంజయ్ షా పరిస్థితి నిలకడగా ఉండగా, మహర్జన్ పరిస్థితి విషమంగా ఉంది. అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు.ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు భారతీయులను కాపాడిన సిబ్బంది న్యూఢిల్లీ: నేపాల్–భూటాన్ సరిహద్దుల్లో సంభవించిన భీకర వరదల్లో గల్లంతైన ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు భారతీయులను శుక్రవారం నువాల్కోట్ జిల్లా త్రిశూలి బజార్ ప్రాంతంలో సహాయక సిబ్బంది కాపాడారు. వీరిని అభిజిత్ సురేశ్ పవార్, దీపికా అభిజిత్ పవార్, సమర్థ్ అభిజిత్ పవార్గా గుర్తించామని విదేశాంగ శాఖ తెలిపింది. కఠ్మాండులోని భారత రాయబారి కార్యాలయం వీరిని విమానంలో స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేసిందని వివరించింది. దీంతో సురక్షితంగా బయటపడిన భారతీయుల సంఖ్య 166కు చేరుకుంది. మరోవైపు, 275 మంది భారతీయుల జాడ తెలియాల్సి ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ తెలిపారు.చైనా నుంచి నేపాల్లోకి 1,907 మంది భారతీయులు సురక్షితంగా చేరుకున్నారని పేర్కొన్నారు. టిబెట్లో చిక్కుకుపోయిన వారిలో భారతీయులెవరూ లేరని చైనా ప్రభుత్వం తెలిపిందని జైశ్వాల్ వెల్లడించారు. 1,295కి చేరిన మృతుల సంఖ్య నేపాల్లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 1,295కి చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఎనిమిది వేర్వేరు జిల్లాల్లో ఇప్పటివరకు 1,293 మృతదేహాలను వెలికితీశారు. చిత్వాన్ జిల్లాలో 359, తూర్పు నవల్పరాసిలో 221, పశి్చమ నవల్పరాసిలో 212, నువాకోట్లో 186, రసువాలో 140, గోర్ఖాలో 72, ధాడింగ్లో 65, తనాహులో 38 మృతదేహాలను వెలికితీశారు. శుక్రవారం కఠ్మాండులో రెండు వేర్వేరు ఆసుపత్రులలో వరద బాధితులు ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,295కు చేరింది. ఇప్పటివరకు 13,093 మందిని రక్షించారు. మరో 5 వేల మందికిపైగా గల్లంతయ్యారు. రసువా, నువాకోట్ జిల్లాల్లో సుమారు 600 మంది పిల్లల ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు నేపాల్లో సహాయక చర్యలకు భారతదేశం మద్దతు ఇస్తోంది. భారత్ నుంచి ఫోరెన్సిక్ కిట్లు, వైద్య సామగ్రితో సహా 21.5 టన్నుల సహాయక సామగ్రితో విమానాలు గురువారం రాత్రి కఠ్మాండుకు చేరుకున్నాయి.
ఇరాన్ యుద్ధం అమెరికాకు పెద్ద విషయమే కాదు: ట్రంప్
ఇరాన్తో జరుగుతున్న సైనిక ఘర్షణ అమెరికాకు పెద్ద విషయం కాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీనిని యుద్ధం అని పిలవడం కంటే 'సైనిక ఘర్షణ' అని చెప్పడమే సరైందని వ్యాఖ్యానించారు. ఇరాన్పై అమెరికా అడపాదడపా దాడులు చేస్తోందని, ప్రస్తుతం తమ దేశం నేరుగా యుద్ధంలో లేదని చెప్పారు.వైట్హౌస్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'చాలామంది దీనిని యుద్ధం అని పిలవడం లేదు. నేను సైనిక ఘర్షణ అంటాను. ఎందుకంటే ఇది మాకు పెద్ద విషయం కాదు' అని ట్రంప్ పేర్కొన్నారు.'ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకున్నాం'ఇరాన్పై అమెరికా సాధించిన విజయాలను ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. తమ చర్యలతో ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకున్నామని అన్నారు. హర్మూజ్ జలసంధిపై అమెరికాకు గణనీయమైన నియంత్రణ ఉందని కూడా పేర్కొన్నారు.మధ్యంతర ఎన్నికల వేళ యుద్ధంపై చర్చఅమెరికాలో నవంబర్లో కీలక మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ ఘర్షణపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం అమెరికా ప్రజలపై ఆర్థిక భారం పెంచుతోంది.ఇంధన ధరల పెరుగుదల వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లకు నష్టం కలిగించే అవకాశం ఉందన్న ఆందోళనల మధ్య.. ఇరాన్తో జరుగుతున్న ఘర్షణ తీవ్రతను తగ్గించి చూపేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి.ఇదిలా ఉంటే, అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో హర్మూజ్ జలసంధి భద్రత, అంతర్జాతీయ నౌకాయానం, చమురు సరఫరాలపై ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి.చదవండి: పాకిస్తాన్కు వెళ్తున్న రష్యా నౌకపై డ్రోన్ దాడి.. అందులో23 మంది భారతీయులు
పాకిస్తాన్కు వెళ్తున్న రష్యా నౌకపై డ్రోన్ దాడి.. అందులో23 మంది భారతీయులు
రష్యా నుంచి పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తున్న ఓ నౌకపై (ఎంవీ బేరియన్) డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది నివాస ప్రాంతం దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. దాడి సమయంలో నౌకలో 23 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. నౌక సమీపంలో మరో డ్రోన్ కూడా కనిపించినట్లు సమాచారం.హోర్ముజ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతఅమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో నౌకాయానానికి ముప్పు పెరిగింది.డ్రోన్ దాడులు, నౌకలపై దాడుల ముప్పు, సముద్ర మార్గాల్లో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. హర్మూజ్ వద్ద పరిస్థితి మరింత దిగజారితే ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు సరఫరాలపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.స్పష్టత లేదుఎంవీ బేరియన్పై జరిగిన డ్రోన్ దాడి హర్మూజ్ జలసంధిలో జరిగిందా, లేక దాని సమీపంలో జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.నౌకపై దాడి జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.చదవండి: అమెరికాలో డీజిల్ ధరలు ఆల్టైమ్ హై
జాతీయం
నగ్న పూజ చేస్తే కోరికలన్ని నెరవేరుతాయని!
కెనడాకు చెందిన 37 ఏళ్ల శ్రీలంక తమిళ మహిళను మోసం చేసి, వీడియో కాల్ ద్వారా నగ్న పూజలు చేయించిన ఘటన చెన్నైలో వెలుగు చూసింది. ఈ కేసులో టీవీ ఛానళ్లలో కనిపించే గిరి అనే కిళి చిలుక జ్యోతిష్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై కోడంబాక్కంలో నివసిస్తూ, టీవీలో వచ్చే చిలుక జ్యోతిష్య కార్యక్రమాలను చూసి బాధితురాలు సంప్రదించింది. ఆమెకు నమ్మకం కలిగించేలా మాట్లాడిన జ్యోతిష్యుడు, ఒక ప్రత్యేక నగ్న పూజ చేస్తే ఆమె కోరికలన్ని నెరవేరుతాయని నమ్మబలికాడు. దానికి అంగీకరించిన సదరు మహిళకు వీడియో కాల్ చేసి, బట్టలు విప్పించి తను కూడా నగ్నంగా ఉంటూ ఈ పూజల కోసం మొదట రూ.20 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత, వీడియో కాల్ మొత్తాన్ని రికార్డ్ చేశానని, తనకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వకపోతే ఆ అశ్లీల దశ్యాలను ఇంటర్నెట్లో లీక్ చేస్తానని సదరు మహిళను బెదిరించడం ప్రారంభించాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడి ఫోన్ నంబర్ ఆధారంగా అతను తెన్కాసి జిల్లాకు చెందిన ఇసక్కి ముత్తు అని, కుట్రాలం పరిసరాల్లో దాక్కున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇలాగే మరికొంతమంది మహిళలను కూడా మోసం చేశాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. -తమిళనాడుచదవండి: లైంగిక దాడిని అడ్డుకున్న కుక్కలు!
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026
పాకిస్తాన్కు చెక్ పెట్టిన భారత్.. సింధు నదిపై మాస్టర్ప్లాన్!
సింధు నదిపై భారత్ వేసిన ఓ చిన్న అడుగు ఇప్పుడు పాకిస్తాన్ను టెన్షన్కు గురి చేస్తోంది. లడఖ్లోని ఉప్షి వద్ద సింధు నదిపై భారత్ తొలిసారిగా రాక్ చెక్డ్యామ్ నిర్మించింది. సహజ రాళ్లతో నిర్మించిన ఈ చెక్డ్యామ్ వల్ల నదిలో నీటి మట్టం దాదాపు 10 అడుగులు పెరిగింది. దీంతో ఇన్నాళ్లుగా సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సరిహద్దు గ్రామాల రైతులకు నీరు అందే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ ప్రాజెక్టును కేవలం రైతుల కోసం చేపట్టిన నీటి సంరక్షణ చర్యగానే చూడాలా? లేక భవిష్యత్తులో సింధు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకునే భారత్ వ్యూహంలో ఇది తొలి అడుగా? అన్న చర్చ మొదలైంది.ఇక్కడ పాకిస్తాన్కు తక్షణంగా భారీ నష్టం లేకపోయినప్పటికీ.. ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని ప్రాంతాల్లో వరుసగా నిర్మిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది. లడఖ్ పరిపాలన ఇప్పటికే మరో 36 చెక్డ్యామ్లు, వీయర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లేహ్లో ఏడు హిమాలయన్ రాక్ చెక్డ్యామ్లు, కార్గిల్లో 29 చెక్డ్యామ్లు లేదా వీయర్లను నిర్మించే ప్రతిపాదన ఉంది. అంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నీటిని అక్కడికక్కడే నిల్వ చేసి స్థానిక అవసరాలకు వినియోగించే మౌలిక వసతులను భారత్ క్రమంగా పెంచుకుంటోంది.నీటి నిల్వతో పాక్కు టెన్షన్.. ఇదే అంశం పాకిస్తాన్కు ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. సింధు నదీ వ్యవస్థ ఆ దేశ వ్యవసాయానికి, నీటి సరఫరాకు, ఆహార భద్రతకు అత్యంత కీలకం. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఈ నదీ వ్యవస్థపై భారీగా ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన భూభాగంలో లభించే సింధు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకోవడం ప్రారంభిస్తే.. భవిష్యత్తులో పాకిస్తాన్కు చేరే నీటి ప్రవాహం, దాని సమయంపై ప్రభావం పడొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఉప్షి వద్ద నిర్మించిన ఈ చెక్డ్యామ్ ప్రధాన ఉద్దేశం స్థానికంగా నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించడమే. లడఖ్లోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వ్యవసాయాన్ని కాపాడుకోవడం అక్కడి ప్రజలకు కీలకంగా మారింది. నది లోతైన గార్జ్లలో ప్రవహించడం, వసంతకాలంలో నీటి మట్టం తగ్గిపోవడంతో రైతులు నేరుగా పంపుల ద్వారా నీటిని తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. చెక్డ్యామ్ నిర్మాణంతో ఈ సమస్యకు కొంత పరిష్కారం లభిస్తోంది.పహల్గామ్ ఎఫెక్ట్?అయితే దీని వెనుక వ్యూహాత్మక కోణం కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. 2025లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. అదే సమయంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ‘అబేయన్స్’లో ఉంచింది. అప్పటి నుంచి సింధు జలాల అంశం ఇరు దేశాల మధ్య కీలక వ్యూహాత్మక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని భారత్ పెంచుకోవడం పాకిస్తాన్కు సహజంగానే ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. భారత్ ఇప్పటివరకు పరిమితంగా వినియోగించిన నీటి వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకునే మౌలిక వసతులను పెంచుకుంటే.. దాని ప్రభావం భవిష్యత్తులో పాకిస్తాన్పై పరోక్షంగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి ప్రాజెక్టులు ఒక్కటిగా కాకుండా వరుసగా అమలైతే.. సరిహద్దు ప్రాంతాల్లో నీటి నిల్వ, సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెరగొచ్చు.ఇదీ చదవండి: కాంగ్రెస్కు బిగ్ షాకిచ్చిన టీవీకేఅందుకే ఉప్షి వద్ద నిర్మించిన చెక్డ్యామ్ పరిమాణంలో చిన్నదైనా.. దాని వెనుక ఉన్న సందేశం మాత్రం పెద్దదిగా కనిపిస్తోంది. ఒకవైపు లడఖ్ రైతులకు సాగునీరు అందించడం, మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో నీటి భద్రతను బలోపేతం చేయడం.. భవిష్యత్తులో సింధు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఒక్క చెక్డ్యామ్తో పాకిస్తాన్కు నీళ్లు ఆగిపోవు.. కానీ ఇలాంటి ప్రాజెక్టుల సంఖ్య పెరిగితే సింధు జలాలపై భారత్ వినియోగ సామర్థ్యం మాత్రం పెరగవచ్చు. ఇదే ఇప్పుడు పాకిస్తాన్కు అసలు టెన్షన్గా మారుతోంది.
లైంగిక దాడిని అడ్డుకున్న కుక్కలు!
సాక్షి, చెన్నై : మద్యం, గంజాయి మత్తులో ఒక బాలుడి నుంచి మానసిక వైకల్యంతో బాధపడుతున్న మహిళను వీధి కుక్కలు కాపాడిన ఘటన కోయంబత్తూరులోని తుడియలూరు వద్ద అశోకపురంలో వెలుగుచూసింది. ఓ దుకాణంలో అగ్నిప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్న సమయంలో ఈ సంచలన విషయం బయటపడింది. దీంతో ఆ కెమెరా దృశ్యాల ఆధారంగా ఆ బాలుడిని అరెస్టు చేశారు. వివరాలు.. అశోకపురం జీజీఓ కాలనీలోని ఒక దుకాణానికి గురువారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో తుడియలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను తనిఖీ చేశారు. ఇందులో ఓ దృశ్యం పోలీసుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అశోకపురం ఫ్లైఓవర్ వద్ద ఒంటరిగా తిరుగుతూ ఉండే ఒక మానసిక వైకల్యంతో బాధపడే మహిళపై మద్యం, గంజాయి మత్తులో ఉన్న బాలుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. Street Dog in Tamil Nadu’s Coimbatore have become unlikely heroes after they intervened and saved a mentally ill woman from an alleged sexual assault attempt by a minor boy. 🐕#TamilNadu #India #Dog pic.twitter.com/LOE5ny0Q6m— মৃত্যুঞ্জয়/姆里蒂尤恩贾伊/Mrityunjay 🇮🇳 (@VloggerCalcutta) September 4, 2026 బాధితురాలు కేకలు వేసినా అర్ధరాత్రి వేళ ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు తక్షణమే స్పందించాయి. ఆ బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. అతడి కాళ్లను కరుస్తూ అడ్డుకున్నాయి. కుక్కల దాడితో భయపడిన బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, గణేష్ నగర్కు చెందిన 16 ఏళ్ల బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలల అబ్జర్వేషన్ హోమ్కు తరలించారు. చదవండి: ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
ఎన్ఆర్ఐ
అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది.వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా తదితర రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. Run4Telugu పోటీలను రెండు విభాగాలలో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనబడి ధృవపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాలలో పాల్గొన్న వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేగాదు “తెలుగు నేర్చుకుందాం… తెలుగు మాట్లాడుదాం… తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం” అనే మనబడి సందేశాన్ని అమెరికా వ్యాప్తంగా ధ్వనింపచేసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. (చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)
లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
ఆరంకెల జీతం, హెచ్1-బీ వీసా కలలతో అమెరికాకు ఎగిరిపోయే భారతీయులకు ఈ కల సాకారమైనాక ఇక లైఫ్ సెట్ అనుకుంటారు. కానీ ఒక భారత సంతతి మహిళ అలా అనుకోలేదు. వాటన్నింటినీ వదులుకుని మాతృదేశానికి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకో తెలుసా?'బిజినెస్ ఇన్సైడర్' అందించిన వివరాల ప్రకారం 28 ఏళ్ల దిశా లాంబా, 2021లో న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ విజయ వంతమైన కెరీర్ను నిర్మించుకుని, 2024లో CVS హెల్త్లో డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని పొందింది. ఆరెంకల భారీ వేతనంతో కూడిన ఉద్యోగం. H-1B వీసా లాటరీ ప్రక్రియలోనూ విజయం సాధించింది. కానీ తన కుటుంబానికి దగ్గరగా ఉండటంతో పాటు,మారుతున్న పరిస్థితుల రీత్యా వాటన్నింటినీ వదులుకోవాలని నిర్ణయించుకుంది.ఒంటరితనం, అమెరికా సమయానికి అనుగుణంగా ఇండియాలోని తల్లిదండ్రులతో మాట్లాడాల్సి రావడం ఆమెను మానసికంగా ఇబ్బందికి గురి చేసినట్టు ఆమె వెల్లడించారు. H-1B వీసా పొందినప్పటికీ ఉద్యోగం మారడం, ఇతర ఆదాయ మార్గాలు (Side hustles) వెతుక్కోవడం, ప్రయాణాలు లేదా కెరీర్ గ్యాప్ తీసుకోవడం H-1B నిబంధనల వల్ల చాలా కష్టంతో కూడుకున్నవి కావడం కూడా ఆమె నిర్ణయానికి ఊతమిచ్చాయి.ఇదీ చదవండి: రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి2026 మేలో ఉద్యోగానికి రాజీనామా చేసి గురుగ్రామ్లోని తన తల్లిదండ్రుల వద్దకు తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఒక చిన్న కెరీర్ బ్రేక్ తీసుకుని, భారతదేశంలోనే కొత్త అవకాశాలు లేదా స్వంతంగా వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్నారు. H-1B వీసాలపై కొత్త ప్రతిపాదనలప్రకారం, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసాలకు సంబంధించి కొన్ని కఠినమైన మార్పులను ప్రతిపాదించింది: H-1B వీసా ఫీజు పెంచే ప్రతిపాదనతోపాటు. గ్రేస్ పీరియడ్ రద్దచేయాలని భావిస్తోంది. దీంతో ఉద్యోగం కోల్పోయిన H-1B హోల్డర్లకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగిస్తారు.అలాగే H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే (H-4 వీసా) ఇచ్చే పని అనుమతులను రద్దు చేసే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నిబంధనలు ఎక్కువ మంది భారతీయ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనం.. డాలస్లో ఘన సత్కారం!
డాలస్, టెక్సస్: అనేక దశాబ్దాలుగా పార్క్ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ తదితర సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం, డయాలసిస్ సేవలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించిన ప్రముఖ సామాజిక సేవకురాలు డా. భానుమతి ఇవటూరికి డాలస్లో ఘన సత్కారం లభించింది. 90 ఏళ్ల వయస్సులో అమెరికాలో 50 సంవత్సరాలకు పైగా జీవితం గడిపిన ఆమె ఇకపై మాతృదేశంలో జీవించేందుకు పయనమవుతున్న సందర్భంగా ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, శ్రీధర్ కోడెల, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె; అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి; నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) పూర్వాధ్యక్షులు బాపు నూతి; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, TANA బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం; కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, డా. జగదీశ్వరన్ పుడూర్ తదితరులు డా. భానుమతి ఇవటూరిని జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.సభాధ్యక్షత వహించిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “సమస్యకు–పరిష్కారానికి మధ్య, వివాదానికి–అవగాహనకు మధ్య, గందరగోళానికి–స్పష్టతకు మధ్య, నిరాశకు–ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారు. అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులభమైన విషయం కాదు. తల్లిదండ్రులు తమతో పాటు మాతృభూమి విలువలు, సంప్రదాయాలు, ఆశలు, ఆకాంక్షలను తీసుకువస్తారు. అయితే వారి పిల్లలు మాత్రం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లలపై ఉన్న ఆశలు అపార్థాలకు, చివరకు కుటుంబ కలహాలకు దారితీస్తాయి. ఈ సమస్యను ఎంతో లోతుగా అర్థం చేసుకున్న భానుమతి.. తల్లిదండ్రుల ఆశలు, అంచనాల కారణంగా పిల్లలనే దూరం చేసుకునే పరిస్థితి రాకూడదని చెబుతారు” అన్నారు.“జీవితంలో విజయం అంటే కేవలం డిగ్రీలు, పదవులు, బిరుదులు కాదు. మన వల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి అనేదే నిజమైన విజయానికి కొలమానం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డా. భానుమతి ఇవటూరి జీవితం. 50 సంవత్సరాలకు పైగా అమెరికాలో జీవితం గడిపి, తొమ్మిది పదులు దాటిన వయస్సులో మాతృదేశంలో తన భవిష్యత్ జీవితాన్ని గడపాలనుకోవడం హర్షనీయమైన విషయం. ఆమె మిగిలిన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని డా. ప్రసాద్ తోటకూర అన్నారు.వివిధ సందర్భాల్లో డా. భానుమతి ఇవటూరితో సన్నిహితంగా పనిచేసిన ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. కృష్ణబాబు చుండూరి, డా. కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి తదితరులు భానుమతి సామాజిక సేవలను కొనియాడారు.డా. భానుమతి ఇవటూరి మాట్లాడుతూ.. “అతి తక్కువ సమయంలో, వారాంతం కానప్పటికీ, ఇర్వింగ్లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి దాదాపు వంద మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఒక మధురమైన రోజుగా మిగిలిపోతుంది. నా సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.ఇవీ చదవండి: 8 ఏళ్లకే చెస్లో సంచలనం.. 9/9 గెలిచిన తెలుగు బాలిక!
అమెరికాలో తెలుగు యువతి కేసులో కీలక పరిణామం
అమెరికా తెలుగు యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రియురాలి హత్య కేసులో సాప్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని ఓ అపార్ట్మెంట్లో దాక్కున్న అర్జున్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అర్జున్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో శంకర్ గ్రీన్ రెసిడెన్షియల్ సొసైటీలో అరెస్ట్ చేశారు.అమెరికా-భారత్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి చర్యలు చేపట్టనున్నారు. 2025 డిసెంబర్ 31న డబ్బు తిరిగి ఇస్తానంటూ నిఖితను పిలిచి హత్య చేశాడు. ఆర్థిక వివాదమే హత్యకు కారణమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో నివసించే నిఖిత జనవరి 2న కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మేరీల్యాండ్లోని కొలంబియాలో ఉన్న ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లోనే ఆమె మృతదేహాన్ని గుర్తించారు. నిఖిత శరీరంపై కత్తిపోట్ల గాయాలు ఉన్నట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. నిఖిత నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడనే ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఏప్రిల్లో తెలంగాణలో అర్జున్పై మోసం కేసు నమోదైంది.దర్యాప్తులో భాగంగా కొన్ని కీలక ఆధారాలు లభించడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఆగ్రాకు పంపించాం. అక్కడ ఓ ఫ్లాట్లో అర్జున్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. మోసం కేసుకు సంబంధించి అతడికి నోటీసులు జారీ చేశాం. అదే సమయంలో అమెరికాలో అతడిపై కేసు ఉండటంతోపాటు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) పెండింగ్లో ఉన్న విషయం గుర్తించాం. దీంతో కేంద్ర అధికారులకు సమాచారం అందించాం’’ అని హైదరాబాద్ పోలీసు అధికారి తెలిపారు. అర్జున్ను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. నిఖిత గత నాలుగేళ్లు అమెరికాలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేసింది.
క్రైమ్
పెళ్లి విషయంలో గొడవ.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన ప్రియుడు!
తమిళనాడు: గర్భిణి అని కూడా చూడకుండా ఓ యువతిని గొంతు నులిమి హత్య చేసి, సంచిలో పెట్టి బావిలో పడేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఎడప్పాడి పక్కన కొంగనపురం సమీపంలోని వ్యవసాయ బావి నుంచి కొన్ని రోజుల క్రితం దుర్వాసన వెలువడింది. నీటిలో ఒక తెల్లటి సంచి తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న కొంగనపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు బావిలో తేలుతున్న సంచిని బయటకు తీసి తెరిచారు. ఆ సంచిలో కుళ్లిపోయిన స్థితి ఓ యువతి మృతదేహం ఉంది. విచారణలో, కరుంగుళ్లవట్టం ప్రాంతానికి చెందిన పేరకౌండర్ కుమార్తె కోకిల (23) అని తెలిసింది. ఆమెని ఎందుకు హత్య చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాశాల చదువు పూర్తి చేసుకున్న కోకిల, పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 20వ తేదీన కోకిల తనకు తీవ్రమైన కడుపునొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే వారు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి 7 నెలల గర్భవతి అని వెల్లడించారు..ఈ విషయం తెలుసుకుని కోకిల కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. విచారించగా, పొరుగు గ్రామానికి చెందిన అమ్మసి (26) అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని కోకిల చెప్పింది. దీని తర్వాత, కోకిల కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో, గ్రామంలో ఒక పండుగ ఉందని, ఆ తర్వాత కోకిలను పెళ్లి చేసుకుంటానని అమ్మాసి చెప్పాడు. అప్పటి వరకు ఆమె అక్కడ ఉండడానికి వీలుగా కోకిలను తన ఇంటికి తీసుకువెళ్లాడని తెలుస్తుంది.ఇంతలో, కోకిల 31వ తేదీ నుంచి కనిపించడం లేదని అమ్మాసి, కోకిల కుటుంబానికి తెలియజేశాడు. అంతటా వెతికినా జాడ దొరకలేదు. కోకిల హత్యకు గురైందని, ఆమె మృతదేహం బావిలో తేలుతున్న ఒక సంచిలో లభ్యమైందని తెలిసింది.. కొంగనపురం పోలీసులు అమ్మాసిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగా తాను దుపట్టాతో కోకిల గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అమ్మాసి వెల్లడించాడు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి అమ్మాసిని అరెస్టు చేశారు.
ఆయనకు ఇద్దరు భార్యలు.. 15ఏళ్లుగా మొదటి భార్య దూరం!
విశాఖపట్నం జిల్లా: మండల కేంద్రం రావికమతానికి చెందిన నవర మలేశ్వరరావు (42) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. బంధువులు, కుటుంబ సభ్యులు శుక్రవారం ఆయన మృతదేహానికి దహన సంస్కారాలు చేయడానికి ఏర్పాట్లు చేసి, శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి వాటిని నిలిపివేశారు. మలేశ్వరరావు మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు రావడంతో మృతదేహాన్ని నర్సీపట్నం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.మొదటి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మలేశ్వరరావుకు ఇద్దరు భార్యలు కాగా, 2009లో మొదటి భార్య మాధవితో వివాహం జరిగింది. ఆమె 15 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటోంది. మలేశ్వరరావు మృతిపై మొదటి భార్యకు, బంధువులకు అనుమానాలు ఉండటంతో వారు 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని, దీనిపై స్పందించి దహన సంస్కారాలను నిలిపివేసి మృతదేహాన్ని నర్సీపట్నం పోస్టుమార్టానికి తరలించామని రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపారు. చదవండి: గోదావరిలో దూకిన కుటుంబం
మహిళను వివస్త్రను చేసి, దాడి : వీడియోలతో బెదిరింపులు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో లోన్ వడ్డీ చెల్లించలేదనే నెపంతో ఒక మహిళను వివస్త్రను చేసి, విచక్షణారహితంగా దాడి చేసిన కలకలం రేపింది. దీనికి తోడు బాధితురాలిపై దాడి చేసిన ఆ దృశ్యాలను నిందితులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడడం మరింత ఆందోళనరేపింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు రెండేళ్ల క్రితం రేష్మ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. అయితే గత ఆరు నెలలుగా వడ్డీ చెల్లించలేక పోయింది. రేష్మా ద్వారా పరిచయమైన నజ్రత్ వద్ద కూడా బాధితురాలు రూ. 50 వేలు రుణం తీసుకుని, వారానికి రూ. 5,000 చొప్పున చెల్లిస్తూ వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల గత నాలుగు వారాలుగా ఈ చెల్లింపులు కూడా నిలిచిపోయాయి అయితే డబ్బులకోసం వేధిస్తారనే భయంతో బాధితురాలు రేష్మా ఫోన్ నంబర్ను బ్లాక్ చేసి, వేరే ప్రాంతానికి మకాం మార్చింది.దాడి జరిగిన తీరుదీనితో నజ్రత్, రేష్మా, సుహైల్, సైఫ్గా కలిసి ఒక పన్నాగం పన్నారు. దీని ప్రకారం నజ్రత్ బాధితురాలికి ఫోన్ చేసి, పని ఇప్పిస్తానని, డబ్బులు ఇస్తానని నమ్మించి తన ఇంటికి పిలిపించింది. బాధితురాలు నజ్రత్ ఇంటికి వెళ్లగానే సుహైల్ ఆమెపై బూతులతో నానా దుర్భాషలాడుతూ దాడి చేశాడు. అనంతరం బాధితురాలిని బలవంతంగా ఆటోరిక్షాలోకి ఎక్కించారు. ఆమె పక్కన రేష్మా, నజ్రత్ కూర్చోగా, సుహైల్ మరికొందరితో కలిసి ఫాలో అయ్యారు. బెంగళూరు శివార్లలోని కుంబళగోడు సమీపంలోని ఒక ఇంటికి తీసుకువెళ్లి బాధితురాలిని బంధించారు. అక్కడ ఆమెను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియోమరోవైపు కుమార్తె కనిపించడం లేదంటూ రేష్మ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆరాగా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని సురక్షితంగా రక్షించి, నలుగురు నిందితులు నజ్రత్, రేష్మ, సుహైల్, సైఫ్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హనీ ట్రాప్ చేసిన లావణ్య!
వరంగల్ క్రైం : ‘వై 99’ యాప్లో మహిళగా పరిచయం చేసుకుని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హనీ ట్రాప్ చేసి రూ.14.75 లక్షలు మోసం చేసిన నిందితుడిని వరంగల్ సైబర్ క్రైం పోలీసులు తమిళనాడులోని సేలం జిల్లాలో అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నమోదైన సీఆర్ నెం.21/2026 కేసులో వరంగల్కు చెందిన తుమ్మ ఉదయ్ కిరణ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు ‘వై 99’ వెబ్సైట్లో ‘లావణ్య’ పేరుతో మహిళగా నటిస్తూ బాధితుడితో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం సన్నిహితంగా మెలుగుతూ నమ్మకం పొందిన నిందితుడు అత్యవసర అవసరాల నిమిత్తం పలుమార్లు డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు వెల్లడైంది. వివిధ బ్యాంకు ఖాతాలు,యూపీఐ లావాదేవీల ద్వారా బాధితుడి నుంచి మొత్తం రూ.14,75,100 మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో సాంకేతిక, ఆర్థిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన ప్రత్యేక బృందం సేలం జిల్లాలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఆదేశాల మేరకు, వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగింది. సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ కె. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బి. శివకృష్ణ, దినేశ్, భరత్, జహూర్ మొహమ్మద్.. నిందితుడి అరెస్ట్లో కీలకంగా వ్యవహరించారు.ఆన్లైన్ పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలిఆన్లైన్లో పరిచయమైన వారు డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైం హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. చదవండి: మినిమం చార్జీ రూ.30
వీడియోలు
వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా
ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?
సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్
కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక
ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..
సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు
సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..
POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్
మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్
KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

