Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu Plans Permit Room Allowed Next To Liquor Shop1
ఏపీ లిక్కర్‌ షాపుల్లో పర్మిట్‌ రూమ్‌లు!

సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పర్మిట్ రూమ్‌ల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసిన చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తానని, రూ.99కే చీప్‌ లిక్కర్‌ ఇస్తానని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక మద్యం బ్రాండ్ల రేట్లు తగ్గించకపోగా మరింత పెంచారు. బెల్టు షాపులు భారీ ఎత్తున అధికారిక,అనధికారిక అనుమతులిచ్చారు.ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఊళ్లో, కుగ్రామంలో సైతం మద్యం షాపులు వెలిశాయి. వీధి వీధినా కిరాణా కొట్లతో పోటీ పడుతూ బెల్ట్‌ షాపులు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లైసెన్స్‌ ఇచ్చిన మద్యం షాపులు 3,396 మాత్రమే ఉండగా.. వాటికి అనుబంధంగా కూటమి నేతల కనుసన్నల్లో అనధికారికంగా ఏర్పాటైన బెల్ట్‌షాపులు గత బాబు పాలనలో ఉన్న 43 వేలకు మించి ఉండటం విస్తుగొలుపుతోంది. తద్వారా కింది స్థాయిలో ఎమ్మెల్యే మొదలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మద్యం విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారనే విమర్శలు కూటమి ప్రభుత్వంపై వెల్లు వెత్తుతున్నాయి. ఈ క్రమంలో విచ్చల విడిగా తాగి తూగడానికి మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇచ్చే చర్యలకు చంద్రబాబు ఉపక్రమించారు. గతంలో ఉన్న 4500 పర్మిట్ రూమ్‌లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది.కానీ ఇప్పుడు నేరాలు, ప్రమాదాలకు కారణమైన పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ వాటిని తెరపైకి తెచ్చింది.

IND vs ENG 3rd Test: England beat india by 22 Runs In lords Test2
జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్‌ అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. ఆఖ‌రివ‌రకు నువ్వానేనా అన్న‌ట్లు సాగిన మ్యాచ్‌లో 22 ప‌రుగుల తేడాతో టీమిండియా ఓట‌మి పాలైంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించిలేక భారత జట్టు చతికల పడింది. ఈ స్వల్ప లక్ష్య చేధనలో 170 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్‌) ఒంటరిపోరాటం చేసినప్పటికి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆరంభం నుంచే..జ‌డేజాతో పాటు కేఎల్ రాహుల్‌(54) ప‌ర్వాలేద‌న్పించ‌గా మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 58/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌.. ఆరంభం నుంచే త‌డ‌బ‌డింది. రిష‌బ్ పంత్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, రాహుల్ వ‌రుస క్ర‌మంలో పెవిలియ‌న్‌కు చేరారు. ఆ త‌ర్వాత రవీంద్ర జడేజా, నితీశ్‌ కాసేపు నిలకడగా ఆడి భారత గెలుపుపై ఆశలు రెకెత్తించారు. అయితే లంచ్‌ బ్రేక్‌కు ముందు నితీశ్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ మళ్లీ ఇంగ్లండ్ వైపు టర్న్‌ అయింది. ఆ తర్వాత జడేజా.. జస్ప్రీత్‌ బమ్రాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.బుమ్రా ఇంగ్లండ్‌ పేసర్లను ఎదుర్కొంటూ జడేజాకు మద్దతుగా నిలిచాడు. అయితే 50 బంతులకు పైగా బ్యాటింగ్‌ చేసిన బుమ్రా(5) భారీ షాట్‌కు ప్రయత్నించి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ సైతం తన వంతు సహకారం అందించాడు.కానీ ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో సిరాజ్‌ బౌల్డ్‌ కావడంతో టీమిండియా అభిమానుల హార్ట్‌ బ్రేక్‌ అయింది. సిరాజ్‌ సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంగ్లండ్‌ మాత్రం గెలుపు సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కెప్టెన్ బెన్ స్టోక్స్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి గిల్ సేన ప‌త‌నాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు కార్స్‌ రెండు, బషీర్‌, వోక్స్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకే చేయగల్గింది. అనంతరం ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బౌలర్లు అద్బుతంగా రాణించినప్పటికి.. బ్యాటర్లు విఫలం కావడంతో భారత్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: మెడ చుట్టూ చేయి వేసి ఆపేశాడు!.. ఇచ్చిపడేసిన జడ్డూ

 If No Ukraine Deal Trump Warns Russia3
పుతిన్‌.. నీకు 50 రోజుల సమయం ఇస్తున్నా: ట్రంప్‌

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు ట్రంప్‌. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్‌ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. వైట్‌ హౌస్‌లో నాటో చీఫ్‌ మార్క్‌ రూట్‌ను కలిసిన నేపథ్యంలో ట్రంప్‌ కాస్త ఘాటుగా స్పందించారు ఇదీ చదవండి:ట్రంప్‌- పుతిన్ బ్రొమాన్స్‌ ముగిసిందా?

CM Revanth Reddy challenges BRS leaders4
చర్చకు సిద్ధమా?.. సీఎం రేవంత్‌ సవాల్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కేసీఆర్‌ రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలేశ్వరం అయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘70 ఏళ్ల కిందట కాంగ్రెస్‌ పాలనలో కట్టిన మూసీ, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, జూరాల ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో.. కేసీఆర్‌ పాలనలో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఎలా ఉన్నాయో నాగార్జునసాగర్‌ కట్టపై చర్చిద్దామా?.. సుందిళ్ల వద్దకు పోదామా?.. చర్చకు సిద్ధమా?’ అని బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. రూ.లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కూలిన కూలేశ్వరం వద్ద మిమ్మల్ని ఉరి తీసినా పాపం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు పేదలకు స్వయంగా రేషన్‌కార్డులు అందజేశారు. అంతకు ముందు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. నాడు బెల్టు షాపులు తెరిచారు ‘రేషన్‌కార్డు.. పేదల ఆత్మగౌరవం, గుర్తింపు, ఆహార భద్రత. అలాంటి రేషన్‌ కార్డులను తమ పదేళ్ల పాలనలో పేదలకు ఇవ్వాలన్న ఆలోచనే బీఆర్‌ఎస్‌కు లేదు. అప్పుడు రేషన్‌ షాపులు తెరవలేదు. బెల్ట్‌ షాపులను మాత్రమే తెరిచింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో పేదలకు 5.61 లక్షల కొత్త రేషన్‌ కార్డులు ఇస్తున్నాం. 3.10 కోట్ల మంది పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నాం. ఈ రోజు రేషన్‌ షాపుల వద్ద జనాలు నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు. పేదలకు సన్న బియ్యం ఇస్తుంటే బీఆర్‌ఎస్‌ నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. దీనితో పాటు రైతు రుణమాఫీ, భరోసా, సన్న ధాన్యానికి బోనస్‌ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చాం. పండించిన ప్రతి గింజను కొని బోనస్‌ ఇచ్చాం. దాంతో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచాం. రైతును రాజును చేసింది ఇందిరమ్మ రాజ్యమే. సోనియాగాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులు పండుగ చేసుకుంటున్నారు. గత పదేళ్లలో కొత్త కోడలు వస్తే కార్డులో పేరు నమోదు చేయని పరిస్థితి. ఇప్పుడు 26 లక్షల మంది పేర్లను చేర్చాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మహిళలు అంబానీతో పోటీపడేలా చేస్తున్నాం.. ‘మహిళల స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నాం. రూ.21 వేల కోట్లు వడ్డీలేని రుణాలు అందించాం. మహిళా సంఘాలు వ్యాపారంలో అంబానీతో పోటీపడేలా చేస్తున్నాం. వెయ్యి బస్సులు కొని మహిళా సంఘాలు ఆర్టీసీకే అద్దెకు ఇచ్చేలా రుణాలు అందిస్తున్నాం. నాడు పెట్రోలు బంకులు రిలయన్స్‌ అంబానీలే పెట్టేవారు. వారితో పోటీ పడేలా మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి పెట్రోలు బంకులు ఏర్పాటు చేయిస్తున్నాం. మహిళ సంఘాల ఆధ్వర్యంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంటున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యేలోపు లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం. ఇప్పటికే 60 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచాం. జనగణనలో కులగణన చేసేలా కాంగ్రెస్‌ మోదీ మెడలు వంచాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తాం. బీసీలు రాజ్యాధికారం పొందేలా చేస్తాం..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏం చేసిందో మహిళలు ఆలోచించాలి ‘త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలి. ఆ ఎన్నికల్లో జిల్లాలో ఒక్క గంజాయి మొక్క మొలవకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ కార్యకర్తలదే. మహిళలు ఇంటికి పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించండి. మీకు వడ్డీ›లేని రుణాలు, ఉచిత బస్, సబ్సిడీ గ్యాస్‌ ఇచ్చాం. ఇవన్నీ ఇంట్లో మీ ఇంటాయనతో చర్చించి కాంగ్రెస్‌కు సహకరించండి. 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం. రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతాం..’ అని సీఎం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు: మంత్రి ఉత్తమ్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామని, ఇప్పుడు కొత్త రేషన్‌కార్డుల పంపిణీని చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో రేషన్‌ కార్డుల ద్వారా దొడ్డు బియ్యం వస్తే అందులో 90 శాతం వృధా అయ్యేవని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందజేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పాత రేషన్‌ కార్డులలో కూడా కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చుకునే అవకాశం ఉందన్నారు. దేవాదుల ప్రాజెక్టు–6 ప్యాకేజీ ద్వారా పాలకుర్తి, స్టేషన్‌ ఘనపూర్‌తో పాటు తుంగతుర్తి నియోజకవర్గానికి కూడా గోదావరి జలాలు అందుతాయని చెప్పారు.20 వేల ఎకరాలు అదనంగా సాగవుతాయన్నారు. బునాదిగాని కాల్వను రీడిజైన్‌ చేయడానికి రూ.200 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ పేదల ప్రభుత్వం: మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజా పాలనలో అమలు చేస్తున్నామని, 5 లక్షల మందికి రేషన్‌ కార్డులు ఇస్తున్న ఈరోజు శుభ దినమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఇది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం అని అన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మహేశ్‌గౌడ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, రామచందర్‌నాయక్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Sajjala Ramakrishna Reddy Fires on Chandrababu Naidu5
చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం

సాక్షి,తాడేపల్లి: మా ఓపికను మీరు చేతగానితనంగా తీసుకోవద్దని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం.వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.. తప్పుడు కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారుల్ని సైతం విచారిస్తామని స్పష్టం చేశారు.సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న రాక్షస పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాజ్యాంగాన్ని, చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తోంది. దీన్ని నియంతృత్వం అనాలా..? ఏమనాలి.?. అన్ని వ్యవస్థలను చంద్రబాబు దారుణంగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీశారు. టీడీపీ చెప్పినట్టు వినకపోతే వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా తప్పుడు కేసులు కోసం వాడుతున్నారు.వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తున్నందుకు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేశారు. టీడీపీ వాళ్ళు గుడివాడలో దారి కాసి గొడవలు చేశారు. పోలీసులు ఉండగానే గంటన్నర సేపు గుండాలు మహిళ జెడ్పి చైర్మన్‌పై దాడికి దిగారు. పోలీసులు రక్షణలో వాళ్ళు దాడులు చేశారు.కారుని పోలీసులు తాళ్ళు కట్టి తీసుకెళ్లాలని యత్నించారు.పోలీసులు దాడి చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ నాయకులు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేస్తుంటే ఆపే ప్రయత్నం చేయలేదు. దాడులు జరపకుండా నిలువరించలేదు. తాము అధికారంలో ఉన్నామని,మా గురించి ఎవరు గొంతెత్తి మాట్లాడకూడదనిదాడులు చేస్తున్నారు.పోలీసులు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు తప్పించుకోవచ్చు కానీ అందరూ చట్టం ముందు నిలబడాల్సి ఉంటుంది. దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై అక్రమ కేసు పెట్టారు. మాదాల సునీత అనే మహిళతో ఫిర్యాదు చేయించారు. ఆమె ఫ్లెక్సీలు చించారు. గాయం అయితే కారుతో గుద్దినట్టు కేసు పెట్టారు. ఉప్పాల రాము వెనకాల సీట్లు కూర్చొని ఉంటే ఆయన గుద్దించినట్టు కేసు పెట్టారు.ఎలాగైనా కేసులు పెడతాం అన్నట్టు ఇష్టానుసారం కేసులు పెట్టేస్తున్నారు. హైకోర్టు అన్ని కోర్టులకు మెకానికల్‌గా రిమాండుకు పంపొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానాలపై భయం లేకుండా ఇలాంటి కేసులు పెడుతున్నారు. వైఎస్ జగన్ బంగారు పాళ్యం పర్యటనకు వేలాది మంది రైతులు వచ్చారు. దానికి ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ వస్తే దాడి చేశారని కేసు పెట్టారు.ఎఫ్ఐఆర్‌ని మార్చి మరి తప్పుడు కేసు పెట్టారు.నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేశారు. పోలీసులు ఉండగానే ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేశారు.వాళ్ళ ముందే వస్తువులను కాల్చారు. వారం రోజులైనా ఎవరిపైనా కేసు పెట్టలేదు.ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.తాడిపత్రిలో పెద్దారెడ్డిని హైకోర్టు చెప్పినా నియోజకవర్గంలోకి రానివ్వలేదు. పొదిలి, బంగారు పాళ్యం అన్ని చోట్లా తప్పుడు కేసులు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం. తప్పుడు కేసుల్లో ఉన్న అధికారుల పైన కూడా విచారిస్తాం. మా ఓపికను చేతకాని తనంగా తీసుకోవద్దుని సూచించారు.

How Yediyurappa try to save his son Vijayendra Amid Turmoil PN6
క‌ర్ణాట‌క‌లో మ‌రో నాయకత్వ మార్పు?

క‌ర్ణాట‌క‌లో ఇప్పుడు ముఖ్య‌మంత్రి మార్పు గురించే అక్క‌డి రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎక్క‌వగా చ‌ర్చ న‌డుస్తోంది. సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను త‌ప్పించి డీకే శివ‌కుమార్‌ను ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చొబెడ‌తార‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. నాయ‌క‌త్వ మార్పును కాంగ్రెస్ అధిష్టానం తోసిపుచ్చింది. ముఖ్య‌మంత్రి మార్పు అంశంపై బ‌హిరంగంగా మాట్లాడొద్ద‌ని క‌న్న‌డ నేత‌ల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఏదోర‌కంగా దీనిపై చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. ఇదే స‌మ‌యంలో చాప కింద నీరులా ప్ర‌తిప‌క్ష బీజేపీలోనూ ముసలం మొద‌లైంది. అయితే దీనిపై మీడియా అంత‌గా ఫోక‌స్ చేయ‌లేదు.క‌ర్ణాట‌క బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర (BY Vijayendra) సీటు కింద‌కు నీళ్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న నాయ‌క‌త్వంపై సీనియ‌ర్లు గుర్రుగా ఉన్న‌ట్టు తేల‌డంతో బీజేపీ నాయ‌క‌త్వం పున‌రాలోచ‌నలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. గ్రూపు రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని, కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని విజయేంద్రపై కేంద్ర నాయ‌క‌త్వానికి ప‌లువురు ఫిర్యాదులు చేసిన‌ట్టు స‌మాచారం. సీనియ‌ర్ నేత‌ల‌తో స‌ఖ్యత‌గా ఉండ‌డం లేద‌న్న వాద‌న‌లు విన్పిస్తున్నాయి. విజయేంద్రతో పాటు ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక పనితీరుపైనా రాష్ట్ర నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. క్యాడ‌ర్‌ను నిర్లక్ష్యం చేయడం వ‌ల్లే పార్టీలో స‌మ‌స్యలు త‌లెత్తాయ‌ని బీజేపీ సీనియ‌ర్ నేత ఒక‌రు వ్యాఖ్యానించారు.రంగం దిగిన 'అప్పా'కొడుకు ప‌ద‌వికి గండం ఏర్ప‌డే ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో విజ‌యేంద్ర తండ్రి, మాజీ సీఎం యడియూరప్ప (Yediyurappa) స్వ‌యంగా రంగం దిగారు. త‌న కుమారుడిపై స్థానిక నేత‌లు, క్యాడ‌ర్‌లో నెల‌కొన్న అసంతృప్తిని తొల‌గించేందుకు ఆయ‌న ప‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర‌ కార్యాలయానికి వ‌స్తున్నారు. నాయకులు, కార్య‌క‌ర్త‌ల స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా వింటున్నారు. అసంతృప్తుల‌ను బుజ‌గించి గ్యాప్ త‌గ్గించేందును త‌న అనుభ‌వాన్ని వాడుతున్నారు. పార్టీ కార్యకర్తలు తమ‌ సమస్యలను నేరుగా నాయ‌క‌త్వం ముందు ప్ర‌సావించ‌డానికి వీలుగా ఒక వేదికను క‌ల్పించేందుకు యడియూరప్ప తిరిగి వ‌చ్చార‌ని బీజేపీ వ‌ర్గాలు అంటున్నాయి. "ఇది విజయేంద్ర తన సొంత నియోజకవర్గం శికారిపురపై దృష్టి పెట్టడానికి కూడా అవకాశం ఇస్తుంది" అని ఒక సీనియర్ కార్యకర్త అన్నారు.2023 నవంబర్‌లో విజయేంద్ర కర్ణాట‌క బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత యడియూరప్ప క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూరం జ‌రిగారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొడును గండం నుంచి త‌ప్పించ‌డానికి ఆయన తిరిగి రావాల్సి వచ్చింది. బెంగళూరులోని జగన్నాథ్ భవన్‌లో ప్ర‌తిరోజు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు పెద్దాయ‌న‌ అందుబాటులో ఉంటున్నారు. రాజ‌కీయంగా ఆయ‌న ఇంకా చురుగ్గానే ఉన్నార‌ని, గణనీయమైన ప్రభావాన్ని చూప‌గ‌ల‌ర‌ని స‌న్నిహితులు పేర్కొంటున్నారు.విజయేంద్రకు వ్య‌తిరేకంగా పావులుపార్టీ నుంచి సస్పెండ్ అయిన‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఎమ్మెల్యేలు బిపి హరీష్, మాజీ ఎమ్మెల్యే కుమార్ బంగారప్ప, మాజీ కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వర నేతృత్వంలోని వర్గాలు.. విజయేంద్రకు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నాయి. లింబవల్లి, రమేష్ జార్కిహోళి, ప్రతాప్ సింహా, హరీష్ త‌దిరత నాయ‌కులు కూడా విజయేంద్ర నాయ‌క‌త్వంపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో అస‌మ్మ‌తిని గుర్తించిన అధినాయ‌క‌త్వం.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషిని (Pralhad Joshi) క‌ర్ణాట‌క‌కు పంపించింది. అస‌మ్మ‌తి నేత‌ల‌తో ఆయ‌న జరిపిన సమావేశాలు పెద్దగా ఫ‌లితాన్ని ఇవ్వ‌లేద‌ని అంతర్గత వర్గాల స‌మాచారం. ఇంత జ‌రుగుతున్నా విజయేంద్ర‌కే పార్టీ మ‌ద్ద‌తుగా నిలిచింది. అస‌మ్మ‌తి గ‌ళం వినిపించిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌ను స‌స్పెండ్ చేసి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని సందేశం పంపింది.నాయకత్వ మార్పు త‌ప్ప‌దా?కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల కర్ణాటక పర్యటన తర్వాత పార్టీ అంతర్గత పునర్వ్యవస్థీకరణలపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. విజయేంద్ర శిబిరం నమ్మకంగా ఉన్నప్పటికీ, నాయ‌క‌త్వ మార్పు త‌ప్ప‌ద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. విజయేంద్ర ఢిల్లీ ప‌ర్య‌ట‌న కూడా ఈ ప్ర‌చారానికి ఊతం ఇచ్చింది. అదే స‌మ‌యంలో ప్ర‌తిపక్ష నాయ‌కుడు ఆర్ అశోక (R Ashoka) కూడా హ‌స్తిన‌లో ఉండ‌డంతో ప్ర‌చారం జోరందుకుంది. అయితే ప్ర‌తిప‌క్ష నేత‌ను మార్చే అవ‌కాశం ఉందంటూ కొత్త ప్ర‌చారం మొద‌లైంది.చ‌ద‌వండి: స్టాలిన్ చాణ‌క్యం.. ఏక‌మైన‌ మార‌న్ బ్ర‌ద‌ర్స్! ఏమైనా జ‌రగొచ్చు..పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిని మారుస్తార‌ని మేము అనుకోవ‌డం లేదు. కానీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని మార్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ సీనియర్ నాయ‌కుడొక‌రు వెల్ల‌డించారు. ఏమైనా జ‌రగొచ్చు అంటూ మ‌రో సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు. "ఎవరూ హైకమాండ్ మనసును చదవలేరు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. పార్టీని ఏకం చేసి మమ‌ల్ని ఎన్నికల మోడ్‌లోకి నడిపించగల వ్యక్తిని అధినాయ‌క‌త్వం ఎంపిక చేస్తుంద‌"ని అన్నారు. మ‌రి కొడుకును కాపాడ‌టానికి కోసం రంగంలోకి దిగిన యడియూరప్ప తాను అనుకున్న‌ది సాధిస్తారా, లేదా అనేది వేచి చూడాలి.

Kadapa Arts College Jagan Flexi Shocks To Kutami Government7
నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్‌ కదా జగనూ..!

ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని చంద్రబాబుకు సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తండావు. మీ నాయన ఆయనకి పాలన అంటే ఏంటో చూపిస్తే,ఇప్పుడు నువ్వు నేర్పించినావు కదా... తండ్రికి మించిన తనయుడువు అయితివి అబ్బా.. ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. అంటూ కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తుంది. అక్కడే కాసేపు నిలబడి ఆ ఫ్లెక్సీలోని పాయింట్లన్నీ ఆమూలాగ్రం చదివేలా చేస్తోంది.. ఆ తండ్రీకొడుకులిద్దరూ కళ్లు మూసుకుని నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావ్‌ కదయ్యా!. నిత్యం నిన్ను అవమానించే వాళ్ళు, నీ ఇమేజ్‌కు డామేజ్ చేసే వాళ్లు కూడా.. కిక్కురు మనకుండా నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్‌ కదయ్యా. ఎంత పని చేశావయ్యా జగన్..!! అంటూ అందులో రాసి ఉంది.. .. వాస్తవానికి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు పేదలంటే ఇష్టం ఉండదు!. అదొక అసహ్యమనే భావనలో ఉంటారు వాళ్లు. సర్కారు బడుల్లో, ప్రభుత్వ ఆసుపత్రులు, పథకాలు, సంక్షేమం వగైరా అంటే వారికి అసలు గిట్టదు. కానీ ప్రభుత్వం అంటే ప్రజలు అని.. ప్రజలతో మమేకం కాకుండా పరిపాలన చేసిన అది నిజమైన ప్రభుత్వం కాదు అని వైఎస్ జగన్ నిరూపించారు. ఐదేళ్ల పరిపాలనలో నిత్యం ఆయన ధ్యాస తపన ఆలోచన ప్రజల చుట్టూనే ఉండేది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేయాల్సిందే అని పట్టుబట్టిన ఆయన వాటి జాబితాను తన కార్యాలయ గోడలకు అతికించి నిత్యం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటి అమలుకు ముందడుగు వేస్తూ ఉండేవారు. అయితే.. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేడు చంద్రబాబు కూడా వైయస్ జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు తొలిసారిగా తల్లికి వందనం అంటూ ఓ పథకాన్ని ఇచ్చారు. వాస్తవానికి అది గతంలో జగన్ ‘అమ్మ ఒడి’ పేరిట ఇచ్చిన పథకమే. కానీ దాన్ని తామే కొత్తగా కనిపెట్టినట్లుగా ప్రజలను నమ్మిస్తూ వస్తున్నారు. జగన్ తన పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరిట ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్ మీడియం. సబ్జెక్ట్ టీచర్లు ఇలా రకరకాల కాన్సెప్ట్లతో ప్రభుత్వ విద్య విధానంలో నాణ్యత పెంచారు. ఇప్పుడు అదే పాఠశాలల్లో చంద్రబాబు లోకేష్ ఫోటోలు దిగి పిల్లలతో ముచ్చట్లు చెబుతూ అదంతా తమ ఘనతగా పత్రికల్లో రాయించుకుంటున్నారు. ఇలా ఎన్నో అంశాలను సదర్ ఫ్లెక్సీలో పేర్కొన్న రహస్య అభిమాని.. ‘‘ఎంత పని చేసావు జగన్’’ అంటూ జగన్ అభినందిస్తూనే చంద్రబాబు పడుతున్న తిప్పలను హాస్యపూరితంగా వివరించారు.నీ ఒత్తిడి భరించలేక పేద పిల్లలకు చంద్రబాబు తనకి ఇష్టం లేకపోయినా తల్లికి వందనం ఇచ్చాడు. నువ్వు అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న పరిశ్రమలు ప్రాజెక్టులు పథకాలనే చంద్రబాబు లోకేష్ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నువ్వు గతంలో ప్రజలతో మమేకం అయినట్లుగానే ఇప్పుడు చంద్రబాబు కోరికన్నా ముందు నిద్రలేచి టీ స్టాళ్ళు.. చేపల బజార్లు.. సందులు.. గొందుల్లో తిరుగుతూ జనంతో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. ఇవన్నీ గతంలో నువ్వు చేసినవి కాక మరేమిటి జగనూ!. .. నీ పర్యటనలకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని ఆపలేక చంద్రబాబు ఆఖరుకు తన కడుపు మంటను మంత్రుల మీదకు వెళ్ళగకుతున్నారు.. ఇది కూడా నువ్వే చేశావు జగనూ!. కూటమిలోని మూడు పార్టీలకు ఒకరంటే ఒకరికి పసగకపోయినా నీ భయంతో అందరూ చేతులు పట్టుకొని జట్లు పట్టుకొని ఒకరినొకరు పొగుడుకునేలాగా చేశావు.. విడిపోతే ముగ్గురూ అస్సామే అనే పరిస్థితి తీసుకొచ్చావు జగనూ!. నువ్వు ఏ ఊరికి పర్యటనక పోతే అక్కడ ముందుగానే పరిస్థితులు చక్కపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అక్కడి సమస్యలపై ఉరుకున పరుగున స్పందించే ప్రయత్నమూ చేస్తున్నారు.. ఎంత పని చేసావు జగనూ!.నువ్వు ఓడిపోయినా.. రాష్ట్రంలో మీ పరిపాలనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని ఈ తండ్రి కొడుకులు కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావ్‌.. ఎంత పని చేశావు జగనూ! అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందర్నీ ఆలోచింపజేస్తోంది.::సిమ్మాదిరప్పన్న

Sakshi Guest Column On Achievements of Dalit movement8
దళితోద్యమ విజయాలు ఎన్నెన్నో!

భారత దేశంలో నడిచిన ఉద్యమాల్లో దళి తోద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యమానికి అంబేడ్కర్‌ భావజాలమే ప్రధాన ఊపిరి. ఇందులో మేధావులు, కళాకారులు, కవులు, స్త్రీలు, ప్రజలు అంచెలంచెలుగా ఉద్య మంతో కలసి నడిచారు. ఉద్యమం ఒక విశ్వా సాన్ని ప్రజలకు కల్గించింది. స్వాతంత్య్రోద్యమంలో అంబేడ్కర్, పెరియార్‌ రామస్వామి నాయకర్‌ సామాజిక స్పృహను మేల్కొ ల్పారు. వీటన్నిటి అవగాహనతోనే కారంచేడు, చుండూరు ఉద్యమాలను సాగించడం సాధ్యమయ్యింది. అంబేడ్కర్‌ ‘మహద్‌ చెరువు’ పోరాట దృక్పథాన్ని అర్థం చేసు కుని సామాజిక, ప్రజాస్వామిక, లౌకిక వాద పోరాటాన్ని న్యాయ సమ్మతమైన పోరాట ధర్మాన్ని స్వీకరించాం. దానిని దళిత ఉద్యమా నికి అన్వయించడంతో కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట ఉద్యమాల నిర్మాణం జరిగింది. సిద్ధాంత పరమైన, తాత్త్విక పరమైన అనేక చర్చలు జరిగాయి. అంబేడ్కర్‌ ఇచ్చిన రాజ్యాంగ హక్కులు, అనేక సందర్భాల్లో ఆయన ఎదుర్కొని నిలబడిన పోరాట ఘట్టాలు, ప్రభు త్వాన్ని నిలదీయటానికి ఆయన వేసిన ప్రశ్నలు దళిత ఉద్యమానికి ఆయువుగా నిలిచాయి. ప్రధానంగా హేతువాద ఉద్యమాల నుండి దళిత ఉద్యమంలోకి వచ్చినవారం ఇందులో ఎక్కువగా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని అందుకే కుల నిర్మూలనా ఉద్యమంగా నడపగలిగాం. కారంచేడు, చుండూరు, ఇంకా అనేక చోట్ల మాల, మాదిగల మీద దాడులు జరిగినా అన్ని కులాలలో లౌకికవాదులు కలిసి రావటానికి కారణం ఈ ఉద్యమానికి ఉన్న కుల నిర్మూలన సైద్ధాంతిక భావనే. అంబేడ్కర్‌ ఆలోచనలను కమ్యూనిస్ట్‌ ఉద్యమాలు కూడా అర్థం చేసుకోవటం ప్రారంభించాయి. అస్పృశ్యులను ఎందుకు ఊరి బయట ఉంచారో అంబేడ్కర్‌ చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా అస్పృశ్యత కేవలం పేదరిక నిర్మూలన వల్ల పోతుందని కమ్యూనిస్టులు వాదించినందువల్ల అస్పృశ్యతా నివారణ జరక్కపోగా, అది స్వాతంత్య్రం అనంతరం మరింత జఠిల మైంది. అంబేడ్కర్‌ తీసుకొచ్చిన రిజర్వేషన్ల వల్ల దళితుల్లో చదువు కున్నవాళ్ళు పెరిగారు. రిజర్వేషన్ల వల్ల లాభం పొందినవారు కింది తరగతులను చైతన్యపరిచారు.కొన్ని గ్రామాల్లో జరిగిన సంఘటనల నుండి ప్రారంభం అయిన దళిత ఉద్యమం రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. దళితులపై దాడులు జరగకుండా ఉండటం కోసం సామాజిక న్యాయ పోరాటాన్ని అన్ని దిశలకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం జరిగింది.ఇందులో ప్రధానమైన అంశం కుల నిర్మూలనా భావాన్ని విస్తృతం చేయడమే. ఎందుకంటే కులం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా సమాజంలో ఘనీభవించింది. అది మెదడులోకి ఇంకిపోయింది. దాని రూపాన్ని మార్చాలి. ఆ మెదడులో ఏర్పడిన నమ్మకం శాస్త్రీయంగా నిజం కాదు. కొందరు ప్రత్యేకంగా ఆ భావాన్ని మెదడులోకి ఇంకించారు. దానికి మత ప్రయోజనాలు ఉన్నాయి. దళిత ఉద్యమ ప్రభావం వల్ల అంబేడ్కరిజాన్ని చాలా లోతైన విషయంగా కమ్యూనిస్ట్‌ ఉద్యమాలు గమనించాయి. కేవలం ఆర్థిక పోరాటాలు కుల సమస్యనూ, కుల ఆర్థిక దోపిడినీ నివారించలేవు అని తెలుసుకున్నారు. నక్సలైట్‌ ఉద్యమంలో ప్రసిద్ధులైన కేజీ సత్య మూర్తి, బీఎస్‌ రాములు, వైకే, కంచె ఐలయ్య, ఊసా, ఎంఎస్‌ గోపి నాథ్, గద్దర్‌ లాంటి ఎందరో కళాకారులు, మేధావులు, దళిత ఉద్య మంలోకి వచ్చారు. ఇది పెద్ద కీలకమైన పరిణామం. ఈ పరిణామంతో భారతదేశంలో భావజాల చర్చ బలంగా జరిగింది. దానివల్ల కుల నిర్మూలన మీద గొప్ప పరిణామాత్మకమైన చర్చ జరిగింది. ఈ ఉద్యమాలలో దళిత ఉద్యకారులు ఆ యా సంఘటనల్లో, ప్రధాన ఘట్టాల్లో, బొజ్జ తారకం లాంటి సామాజిక న్యాయవాదులు, ఉద్యమకారులతో కలిసి నడిచారు. అది చాలా విస్తృతమైన తాత్త్విక సామాజిక పరిణామానికి దారి తీసింది. 111 మంది ఎంపీలను ఏకతాటి మీదకు తీసుకు వచ్చిన ఉద్యమం... దళిత ఉద్యమం. అదే సమయంలో ‘‘ద ఎస్సీస్‌ అండ్‌ ద ఎస్టీస్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీస్‌) ఆక్ట్, 1989’’ని అంబేడ్కర్‌కి కొనసాగింపుగా చట్ట రూపంలోకి తెచ్చిన ఉద్యమం... దళిత ఉద్యమం. అలాగే ‘రాష్ట్రపతి దళితుడు కావాలి’ అనే నినాదాన్ని ప్రయోగాత్మకంగా చేసిన మహోద్యమం కూడా ఇదే. ముగ్గురు ప్రధాన మంత్రులు దళిత బాధితులను స్వయంగా కలసి చర్చలను జరిపిన ఉద్యమం కూడా దళిత ఉద్యమమే. మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్, రామ్‌ విలాస్‌ పాశ్వాన్, శరద్‌ యాదవ్, వెంకట స్వామి వంటి ఉద్ధండులు ఢిల్లీ బోటు క్లబ్‌లో ఉద్యమంలో పాల్గొ న్నారు. పార్లమెంటు భవనం ముందు మహా మానవహారం నిర్మించిన మహోద్యమం దళిత ఉద్యమం. బీసీ ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, ఉపకుల ఉద్యమాలు ఎన్నో దళిత ఉద్యమ ప్రేరణతో వచ్చాయి. భావ జాల చర్చతో పాటు ఆచరణాత్మకమైన కార్యక్రమం నిర్మాణం జరిగింది. ప్రత్యామ్నాయ భావజాల ఉద్యమాన్ని సాహిత్యాన్ని దళిత ఉద్యమం ముందుకు తీసుకువచ్చింది. నీతి, నిజాయతీ, ఆచరణ, కార్యాచరణ, నిరంతర ఆధునీకరణలు దళిత ఉద్యమ గమనంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దళిత ఉద్యమం పేదరిక నిర్మూలనను, కుల నిర్మూలనను పరస్పర సంబంధితాలుగా భావించింది. కుల నిర్మూలనతో పాటు ఆర్థిక స్వావలంబన కోసం కూడా కృషి చేసింది. ప్రభుత్వం కూడా ఉద్యమస్ఫూర్తితో దళితుల చైతన్యాన్ని అవగాహన చేసుకునే పరిస్థితులు వచ్చాయి. దళితుల్లో కళాకారులు, కవులు, ఉపన్యాసకులు, నిర్మాణ కర్తలు, ఆర్గనైజర్లు రూపొందారు. వీరికి అంబే డ్కర్, మహాత్మా ఫూలే, బుద్ధుడు వంటివారి భావధారలే బలం. అంబేడ్కరిజం సత్యం అనే పునాది మీద నిలబడి మాట్లాడగల్గే ధైర్యంతో నాలుగు దశాబ్దాల్లో కొన్ని లక్షల మందిని తీర్చిదిద్దింది. దళిత మహిళలు భూ పోరాట ఉద్యమాలను నడిపారు. యువకులు క్రమశిక్షణ కల్గిన సైనికులుగా రూపొందారు. మేధావులు ఎన్నో పరిశో ధనల ద్వారా భారతదేశ పునఃనిర్మాణానికి పూనుకున్నారు. నాలుగు దశాబ్దాల దళిత ఉద్యమ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, తాత్విక ప్రత్యామ్నాయ నిర్మాణానికి అందరం పూనుకోవాల్సిన సందర్భంలో ఉన్నాం. ఈ జూలై 17 నాటికి కారంచేడు ఉద్యమం ప్రారంభమై 40 ఏళ్ళు! చుండూరు ఉద్యమం 1991లో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 1 నాటికి ఈ సందర్భంగా ఒక పెద్ద మహాసభ జరిపి భవిష్యత్తు కార్యాచరణ మీద విస్తృతమైన చర్చ చేయాలనేది ఆలోచన. ఈ చర్చలు ఒక శతాబ్ది కాలానికి దిక్సూచి అవ్వాలి. అంబేడ్కర్‌ ఇచ్చిన స్ఫూర్తి కొన్ని తరాలు, యుగాలకు ఊపిరిగా నిలుస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వేలు, లక్షలమంది ఉద్యమంతో కలిసి నడిచారు. ఇది ఏ ఒక్కరో నడిపిన ఉద్యమం కాదు. ఇది సమూహ ఉద్యమం. ఉద్యమం ఒక అనంత ప్రయాణం. అది ఆగదు. భవిష్యత్తు కార్యాచరణలు కాలానుగుణంగా రూపొందించి ముందుకు నడవాలి. ఇది అంబేడ్కర్‌ బాట. దీనికి నిరంతర కార్యాచరణే ఊపిరి. ఆ దిశగా నడుద్దాం. అందరం ఏకమై మహా సంఘటిత శక్తిగా నడుద్దాం. ప్రతి ఒక్క దళిత బహుజనుడు ఉద్యమకారుడే. అంబేడ్కర్‌ ఆలోచన విధానమే దళిత ఉద్యమానికి స్ఫూర్తి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695(జూలై 17 నాటికి కారంచేడు ఉదంతానికి 40 ఏళ్లు.)

Sakshi Editorial On Gujarat Ahmedabad Air India plane crash9
ఈ అరకొర నివేదిక దేనికి?!

ఒక పెను విషాదంపై జరిగే దర్యాప్తు ఎంతో బాధ్యతాయుతంగా వుండాలి. ఆ ఉదంతంలో అసలు జరిగిందేమిటో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అస్పష్టతకు తావీయకూడదు. ప్రాథమిక దర్యాప్తుకైనా, పూర్తిస్థాయి దర్యాప్తుకైనా ఇదే వర్తిస్తుంది. కానీ గత నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం విషయమై శుక్రవారం అర్ధరాత్రి వెలువరించిన ప్రాథమిక దర్యాప్తు ఆ నియమాలను ఉల్లంఘించింది. బాధిత కుటుంబాల్లో అయోమయాన్ని మరింత పెంచింది. ఆ ప్రమాదం వైమానిక ప్రమాదాల చరిత్రలో పెద్దది. ఆ విషాద ఘటన సమ యంలో విమానంలో 242 మంది ప్రయాణికులుండగా, ఒకరు క్షేమంగా బయటపడ్డారు. భవంతిపై కూలినందువల్ల అక్కడున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఇంధనాన్ని నియంత్రించే స్విచ్‌లు రెండూ ఆపివేసి వుండటం వల్లనే ప్రమాదం జరిగివుండొచ్చని దర్యాప్తు చేస్తున్న విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక భావించింది. ఇది కేవలం ప్రాథమిక నివేదికే గనుక వెంటనే నిర్ణయానికి రావటం తగదని కేంద్ర వైమానిక మంత్రిత్వ శాఖ అంటున్నది. మంచిదే. అటువంటప్పుడు ఏఏఐబీ నివేదిక స్విచ్‌ల విషయంలో మరింత సమాచారం అందాకే వాటిని ప్రస్తావించి వుండాల్సింది. పైలెట్ల సంఘం కూడా నివేదికను తప్పుబడు తోంది. పైలెట్ల తప్పిదమే కారణమని అర్థం వచ్చేలా నివేదిక వుండటం సరికాదని విమర్శిస్తున్నారు. దర్యాప్తులో తమ ప్రతినిధికి ఇప్పటికైనా చోటీయాలని వారు అంటున్నారు. ఈ అయోమయం ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో వున్న బాధిత కుటుంబాలను మరింత నొప్పించదా? అంతర్జాతీయ వైమానిక నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన ఏడాదిలోగా తుది నివేదిక రావాలి. ఈలోగా విడుదల చేసే ప్రాథమిక నివేదిక పైలెట్లను తప్పుబట్టే విధంగా వుండటం, ఆ తర్వాత దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదనటం న్యాయమేనా? ఘటనా స్థలంలో దొరికిన స్విచ్‌లున్న పరికరంలో అవి రెండూ ‘ఆన్‌’ చేసివున్నాయి. కానీ కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో ఒక పైలెట్‌ మరొకరితో ‘ఇంధనం ఎందుకు నిలిపివేశావ్‌’ అని అడగటం, అందుకు రెండో పైలెట్‌ ‘నేనలా చేయలేదే...’ అంటూ జవాబివ్వటం వినబడటాన్నిబట్టి స్విచ్‌లు ఆపివేసి వున్నట్టు దర్యాప్తు బృందం నిర్ధారణకొచ్చింది. కానీ రెండో పైలెట్‌ ఆ వెంటనే వాటిని సరిచేసి వుండొచ్చని, అందుకే అవి సక్రమంగా వున్న స్థితిలో లభించాయని నివేదిక అంటున్నది. ఈ సంభాషణల్లో అడిగిన వారెవరో, జవాబిచ్చిన వారెవరో దర్యాప్తు చేసినవారు గుర్తించారా?గుర్తించి వుంటే ఆ సంగతి వెల్లడించటానికి వారికున్న అభ్యంతరమేమిటి? ఒకవేళ అలాంటి అభ్యంతరం వున్నప్పుడు అసలు ఆ సంభాషణను బయటపెట్టడం దేనికి? విమానంలోని యాంత్రిక వ్యవస్థలు సంక్లిష్టమైనవి. విమాన గమనంలో మనుషుల జోక్యం దాదాపు అవసరం లేని ‘ఫ్లై బై వైర్‌’ వ్యవస్థ అందుబాటులోకొచ్చి దశాబ్దాలవుతోంది. ముఖ్యంగా విమానం టేకాఫ్‌ సమయంలోనూ, దిగే సమయంలోనూ ఆ వ్యవస్థ పూర్తిగా తనకు తానే అన్నిటినీ సరిచేసుకుంటుంది. పైకెగిరినప్పుడూ, కిందకు దిగినప్పుడూ అవసరమైన ఇంధనం సరఫరా అయ్యేలా చూసుకుంటుంది. ఇవి విఫలమైన పక్షంలో పైలెట్‌ అవసరమైన మార్పులు చేసుకోవ డానికే స్విచ్‌లుంటాయి. రెండు స్విచ్‌లకూ రెండువైపులా రింగ్‌లుంటాయి. వాటికి ప్రత్యేక లాకింగ్‌ వ్యవస్థ వుంటుంది. మనిషి ప్రత్యేకించి వాటిని స్విచాన్‌ చేయటానికైనా, స్విచాఫ్‌ చేయటానికైనా ముందు ఆ లాకింగ్‌ను తెరవక తప్పదు. రెండు స్విచ్‌లూ ఆగిపోవటానికి మధ్య సెకను వ్యవధి వుందని తేల్చారు. పైగా పైకెగురుతున్న సమయంలో ఎక్కువ ఇంధనం సరఫరా కావాల్సి వుండగా దాన్ని కావాలని ఏ పైలెట్‌ కూడా స్విచాఫ్‌ చేయడు. దానిపై దర్యాప్తు బృందం ఏ నిర్ధారణకూ రాలేదు. పైలెట్లుగా వ్యవహరించినవారి చరిత్ర చూసినా ఉద్దేశపూర్వకంగా ఆపివుంటారని ఊహించటం అసాధ్యం. ప్రధాన పైలెట్‌ సుమీత్‌ సభర్వాల్‌కు బోయింగ్‌ 787ను 8,600 గంటలు నడిపిన సర్వీస్‌ (మొత్తంగా 15,638 గంటల సర్వీస్‌) వుండగా, కో పైలెట్‌ క్లైవ్‌ కుందేర్‌కు బోయింగ్‌పై 1,100 గంటల అనుభవం, మొత్తంగా 3,403 గంటల అనుభవం వుంది. ఇద్దరూ ఈ విమానం నడపటానికి ముందు తగినంత విశ్రాంతి తీసుకున్నవారే. ప్రధాన పైలెట్‌ పర్యవేక్షణలో కో పైలెట్‌ ఇష్టానుసారం చేయటం సాధ్యపడదు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగివుంటే వాగ్వాదం చోటుచేసు కునేది. అది రికార్డయ్యేది. పూర్తి స్థాయి పారదర్శకతకు దర్యాప్తు సంస్థ ఎందుకు వెనకాడుతోంది? ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను కేవలం ఒక ప్రశ్న, జవాబు స్థాయికి కుదించటంలోని మర్మమేమిటి? అటు తర్వాత లేదా అంతకుముందు వారేం మాట్లాడుకున్నారు? ఇది చెప్పకపోతే పైలెట్లలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడ్డారా అనే సంశయం బయల్దేరుతుంది. ఎయిర్‌లైన్స్‌ రేటింగ్స్‌ వెబ్‌సైట్‌ ప్రధాన సంపాదకుడు జెఫ్రీ థామస్‌ అడుగుతున్నది ఇదే. దర్యాప్తు ఫలితాల గురించి అంతర్జాతీయంగా అనేకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రకం విమానాలను బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ, వర్జిన్‌ అట్లాంటిక్‌ సంస్థ ప్రధానంగా వినియోగిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక విడుదల చేయటం స్వాగతించదగిందే. కానీ ఇప్పటికే వున్న సంశయాలను మరింత పెంచేలా, అస్పష్టత అలుముకునేలా అది వుండటం సరికాదు. పైలెట్ల మధ్య జరిగిన సంభాషణ పూర్తి పాఠం విడుదల చేస్తే అటు పైలెట్‌ల సంఘం అభ్యంతరాలతోపాటు, ఇటు బాధిత కుటుంబాల సంశయాలు కూడా సమసిపోతాయి.

GO firmly committed to reservations for BCs in local bodies10
ఆచితూచి 42% ఉత్తర్వులు!

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి ముందుకెళుతోంది. ఇటీవల మంత్రిమండలి ఆమోదించి పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం లభిస్తుందన్న అంచనాతో.. తదుపరి ప్రక్రియలో భాగంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసే దిశలో అడుగులు వేస్తోంది. ఈ జీవో రూపకల్పన కోసం.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 50 శాతానికి మించి ఇవ్వాలంటూ పంచాయతీరాజ్‌ చట్టం–2018కి చేసిన సవరణ, ఈ మేరకు ఆమోదించిన ఆర్డినెన్స్, నూతన మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్‌ కమిషన్‌ సమర్పించే నివేదికలను ఆధారంగా చేసుకోనుంది. ఆర్డినెన్స్‌కు మంత్రివర్గ ఆమోదం అనంతరం కొత్త విధివిధానాలతో మరో నివేదిక ఇవ్వాలని డెడికేటెడ్‌ కమిషన్‌ను కోరిన ప్రభుత్వం.. ఆ నివేదిక వచ్చిన తర్వాత వారం రోజుల్లోపు న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా జీవో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఆర్డినెన్స్‌ను, కమిషన్‌ నివేదికను ప్రస్తావిస్తూ.. పంచాయతీరాజ్‌ చట్టం–2018లోని సెక్షన్‌ 285 (ఏ)కు చేసిన సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి మించవచ్చు అని మాత్రమే ఆర్డినెన్సులో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్డినెన్సుతో పాటు డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చే నివేదిక మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంటారని చెబుతున్నాయి. ఈ జీవో మేరకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దఖలు పడతాయని వివరిన్నాయి. చట్టానికి చేసిన సవరణే ప్రాతిపదికగా జీవో ప్రభుత్వం జీవో విడుదల చేసే జీవో న్యాయ సమీక్షలోనూ నిలబడే విధంగా అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వివరణాత్మకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితిని ప్రత్యేక పరిస్థితుల్లో పెంచేందుకు పంచాయతీ రాజ్‌ చట్టానికి చేసిన సవరణనే ఈ జీవోకు ప్రాతిపదికగా ఉంటుందని అంటున్నారు. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు స్థాయి, జనాభాకు తగిన ప్రాతినిధ్యం అనే అంశాల ప్రాతిపదికన చట్టాన్ని సవరించామని, ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పేర్కొంటూ రిజర్వేషన్ల పెంపును సమర్థించే కోణంలో జీవోకు రూపకల్పన చేస్తున్నామని వెల్లడిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement