ముంబై : అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన బాలీవుడ్ భామలు (ఫొటోలు)
ది ఒడిస్సీకి మిస్... వారణాసికి ప్లస్?
క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన దిఒడిస్సీ భారతదేశ వ్యాప్తంగా సంచలన కలెక్షన్లు సాధిస్తూ సాగిపోతోంది. ఐమ్యాక్స్ ఫార్మాట్లో రూపొందిన చిత్రంగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ సినిమాను ఐమ్యాక్స్ తెరపై చూడడం ఒక ప్రత్యేక అనుభవంగా ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే హైదరాబాద్ ప్రేక్షకులకు మాత్రం అది అందుబాటులో లేకపోవడం అత్యున్నత వీక్షణానుభవాన్ని ఆశించేవారిని నిరుత్సాహ పరుస్తోంది.ఒకప్పుడు ఐమ్యాక్స్ తెరకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఆ తర్వాత ఆ అనుభవం తెరమరుగు కావడం తెలిసిందే. దాంతో ప్రస్తుతం హైదరాబాద్లో ఐమ్యాక్స్ స్క్రీన్ లోటు ఏర్పడింది. మరోవైపు ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో లాగా ది ఒడిస్సీ పూర్తి అనుభవాన్ని ఆస్వాదించే మిస్ అవుతున్నామని సినీ అభిమానులు అంటున్నారు. అల్లు సినిమాస్ తో ఊరట...ఐకాన్స్టార్ అల్లు అర్జున్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభమైన అల్లు సినిమాస్ ది ఒడిస్సీ అభిమానులను ఆదుకుంటోంది. మల్టీప్లెక్స్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ప్రేక్షకులకు అత్యున్నత శ్రవణ అనుభూతిని అందిస్తోంది. ఇప్పటిదాకా పలు చిత్రాలు ఈ థియేటర్లో ప్రదర్శితమైనప్పటికీ... ధియేటర్ ‘డాల్బీ’ సాంకే తిక సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో అనుభూతించడం ది ఒడిస్సీ ద్వారానే సాధ్యమైందని ప్రేక్షకులు అంటున్నారు.ఈ సినిమాలోని సముద్ర అలల గర్జన, యుద్ధ సన్నివేశాల సందర్భంగా నేపథ్య సంగీతపు పూర్తి అనుభవాన్ని 3డీ ఆడియో ద్వారా సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ముందునుంచే కాకుండా పక్కల నుంచి, వెనుక నుంచి, పై భాగం నుంచి కూడా ప్రవహించే శబ్ధ తరంగాల అనుభూతి ది ఒడిస్సీ ప్రేక్షకులకు వీనుల విందు చేస్తోంది. ఏది ఏమైనా గొప్ప గొప్ప చిత్రాలను ఆస్వాదించడానికి అదే స్థాయి సాంకేతిక సామర్ధ్యం కలిగిన థియేటర్లు కూడా తప్పనిసరి అని ది ఒడిస్సీ మరోసారి స్పష్టం చేస్తోంది.ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న దర్శక థీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్బాబుల వారణాసి కోసమైనా ఐమ్యాక్స్ను హైదరాబాద్లో కొలువుదీర్చాల్సిన అవసరం కనిపిస్తోంది. త్వరలోనే ఐమ్యాక్స్ తెరను హైదరాబాద్కు తెస్తామని ఇటీవల ఏషియన్ మూవీస్ ప్రకటించింది. ఆ ప్రకటన కార్యరూపం దాలిస్తే... ది ఒడిస్సీని మిస్సయినా, వచ్చే ఏడాది విడుదల కానున్న వారణాసిని అత్యద్భుతమైన దిగ్గజ తెరపై ఆస్వాదించే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుంది.
ఎట్టకేలకు మారుతికి 'మెగా' హీరో సెట్?
రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘రాజాసాబ్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేక పోయింది. అనంతరం ప్రభాస్ ఎప్పట్లానే తన సినిమాలతో బిజీ అయిపోయాడు. కానీ మారుతి మాత్రం చాలా కాలం పాటు ట్రోలింగ్కు గురైయ్యాడు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలో ఇచ్చిన సవాళ్లు, స్టేట్మెంట్లు ఆయనపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ తెచ్చాయి. అయితే, ఇటీవల ఆయన కొత్త స్క్రిప్ట్ పనిలో ఉన్నానని, దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నానని ప్రకటించారు.ఇప్పుడు ఆ స్క్రిప్ట్కి సరిపోయే హీరోను మారుతి ఫైనల్ చేసినట్టుగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆయన తదుపరి చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా తర్వాత, తన చెల్లెలు నిహారిక నిర్మాతగా తెరకెక్కుతున్న ‘బరి’ సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సినిమాతో పాటు మారుతి చేయబోయే చిత్రానికి కూడా వరుణ్ తేజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వీలైనంత రీజనబుల్ బడ్జెట్లో,మంచి కథతో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మారుతికి అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నాడని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
చలో సంసద్.. రణరంగం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో సంసద్ ర్యాలీ’రణరంగాన్ని తలపించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభల సాక్షిగా ఎంపీలను నిలదీసి విద్యార్థుల సమస్యలకు పరిష్కారం తేల్చుకుంటామంటూ వేలాది మంది కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు, పరీక్షార్థుల తల్లిదండ్రులు సోమవారం పార్లమెంట్ దిశగా మొదలెట్టిన ర్యాలీ చివరకు ఉద్రిక్తంగా ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నాటికే జంతర్మంతర్లోని దీక్షా స్థలికి వేలాదిగా మద్దతుదారులు, విద్యార్థులు చేరుకుని సోమవారం ఉదయం పార్లమెంట్ దిశగా ర్యాలీ మొదలుపెట్టగా పోలీసులు మొదట్లోనే అడ్డుకున్నారు. పార్లమెంట్, సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్, సమీప ప్రాంతాల్లో 163వ సెక్షన్ను విధించారు. ర్యాలీకి అనుమతిలేనందున ఐదుగురికి మించి గుమికూడవద్దని హెచ్చరించారు. వదంతలు వ్యాపించకుండా ఉండేందుకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను కొన్ని గంటలపాటు పోలీసులు నిలిపేశారు. ఉద్యమకారులున్న చోట్ల జామర్లను ఏర్పాటుచేశారు. అయినాసరే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మరింత మంది విద్యార్థులు, కార్యకర్తలు, మద్దతుదారులు బస్సులు, ఆటోలు, బైక్లలో వేర్వేరు దారుల్లో పార్లమెంట్ సమీపానికి చేరుకున్నారు. స్కూల్ యూనిఫామ్లో పాఠశాల విద్యార్థులు మొదలు కాలేజీ స్టూడెంట్స్, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, వృద్ధులు, యోగేంద్ర యాదవ్ వంటి సామాజికవేత్తలు పెద్దసంఖ్యలో పార్లమెంట్ సమీప రోడ్లమీదకొచ్చారు. జాతీయజెండాలు చేతపట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. భారత్ మాతాకీ జై, జై భీం, వందేమాతరం, ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వీళ్లు ముందుకెళ్లకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. వాటినీ ఆందోళనకారులు తొలగించారు. దీంతో వీళ్లను అదుపుచేయడం కోసం పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు తీవ్రస్థాయిలో గాయపడ్డారు. పార్లమెంట్ స్ట్రీట్, పటేల్ చౌక్, కాన్స్టిట్యూషన్ క్లబ్, శాస్త్రీ భవన్, రైల్ భవన్ సమీప ప్రాంతాల్లో జనాన్ని చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలు సైతం ప్రయోగించారు. పోలీసులు ఇష్టమొచ్చినట్లు చితకబాదుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తోటి కార్యకర్తలను కొడుతున్నాసరే ఇంకొందరు అలాగే రోడ్డు మీద బైఠాయించి ‘కొట్టండి సార్ కొట్టండి’అని తమ తీవ్రస్థాయి నిరసన తెలపడం ఒక వీడియోలో కన్పించింది. ‘‘పోలీసులు కొందరి తల పగలగొట్టారు. కిందపడ్డ విద్యార్థులనూ వదల్లేదు’’అని 55 ఏళ్ల హెలెన్ అనే మహిళ తెలిపారు. గాయపడిన వారిని తోటి విద్యార్థులు హుటాహుటిన సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే విద్యార్థుల నుంచి సైతం పోలీసులు తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొన్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. ఈ తోపులాటలో 118 మంది పోలీసులు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. తమపై జనం రాళ్లు రువ్వడంతోనే లాఠీచార్జ్ చేయాల్సివచ్చిందని పోలీసులు తమ చర్యను సమరి్థంచుకున్నారు. ఈ ఘటనలో 100కుపైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత అందర్నీ విడిచిపెట్టే ఆస్కారముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే సమీప రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65 మెడికో లీగల్ కేసులు నమోదయ్యాయి. ర్యాలీలో లద్దాఖ్ సామాజికవేత్త, నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగి కొట్టారని వచ్చిన వార్త అవాస్తవమని ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ స్పష్టం చేశారు.మా డిమాండ్లు నెరవేర్చండి నడ్డాతో సీజేపీ ప్రతినిధుల చర్చలు విన్నపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి న్యూఢిల్లీ: దాదాపు మూడు వారాలుగా దీక్షపర్వంలో మునిగిపోయిన సీజేపీ కార్యకర్తలకు తొలిసారిగా ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది. దీంతో సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు సోమవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రధాన డిమాండ్లను మంత్రికి వెల్లడించారు. ‘‘ఎలాంటి షరతుల్లేకుండా ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్చుక్ను విడుదలచేయాలి. ఆయన ఒక వీడియో సందేశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు అనుమతించాలి. ధర్మేంద్ర ప్రధాన్ను విద్యాశాఖ పదవి నుంచి తప్పించాలి లేదా ఆయనతో రాజీనామా చేయించాలి. నీట్–యూజీ,2026 ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో తీవ్ర నిరాశతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థులకు తలో రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం తక్షణం ప్రకటించాలి. దీక్షాస్థలిని నాశనంచేసిన పోలీసులు ఇకపై కార్యకర్తల జోలికి వెళ్లకూడదు. శాంతియుత నిరసనను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసేందుకు యత్నించకూడదు’’అని నడ్డాకు అందజేసిన లేఖలో సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు. సీజేపీ డిమాండ్లపై ప్రభుత్వ నాయకత్వం అంతర్గతంగా చర్చించేలా చేస్తానని ప్రతినిధులకు నడ్డా హామీ ఇచ్చారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తర్వాత నడ్డా మీడియాతో చెప్పారు. ‘‘మా షరతులను నడ్డాకు తెలిపాం. వీటిని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన మాకు హామీ ఇచ్చారు’’అని తర్వాత అశుతోష్ రంకా తెలిపారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు సీజేపీ ప్రతినిధులతో ఫోన్లో మంతనాలు జరిపామని, సాయంత్రం వాళ్లు స్వయంగా వచ్చి మెమోరాండం సమర్పించారని నడ్డా చెప్పారు. ఇప్పటికే ఈ మూడు డిమాండ్లపై ప్రభుత్వ పెద్దలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీక్ష కొనసాగిస్తా వాంగ్చుక్ సంసద్ ర్యాలీలో పాల్గొనేందుకు తనను డిశ్చార్జ్ చేయాలని సఫ్దర్జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్కు సోనమ్ వాంగ్చుక్ ఒక లేఖ రాశారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం బాగానే ఉందని, నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు పంపించాలని కోరారు. తాను నిరాహార దీక్షను విరమించాలంటే ప్రభుత్వం మూడు షరతుల్ని ఒప్పుకోవాలని చెప్పారు. ‘‘పేపర్ లీకేజీ ఉదంతాలకు తమదే బాధ్యత అని ప్రభుత్వం తన తప్పు ఒప్పుకోవాలి. లేదంటే ర్యాలీగా పార్లమెంట్కు వచ్చిన సీజేపీ నాయకులతో ఉభయసభల ఎంపీలు మాట్లాడి ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తామని వెంటనే హామీ ఇవ్వాలి. లేదంటే అధికార కూటమి ఎంపీలు ఆస్పత్రికి వచ్చి ఇదే అంశంపై నాకు స్వయంగా హామీ ఇవ్వాలి’’అని వాంగ్చుక్ ఒక టిష్యూపేపర్ మీద షరతులు రాసి ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. కానీ ర్యాలీలో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన కారణంగా తన దీక్షను ఇకమీదటా కొనసాగించాలని ఆయన ఆ తర్వాత నిర్ణయించుకున్నారు.దీప్కేను నిర్బంధించిన పోలీసులు! దీక్షా స్థలి నుంచి సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ ఆరోపించారు. సోమవారం సాయంత్రంకల్లా దీక్షా స్థలిలోని టెంట్లు, మైకులు, కార్పెట్లు, బ్యానర్లు, జెండాలను పోలీసులు తొలగించారు. అటువైపు ఎవరూ రాకుండా జంతర్మంతర్ వద్ద రోడ్డుకు రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. దీంతో దాదాపు 1,000 మంది ఉద్యమకారులు కొంతదూరంలోనే నిలిచిపోయారు. సమీపంలోని కేరళ హౌస్ సమీపంలో భైఠాయించి ఇక్కడి నుంచే ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. అయితే దీప్కేను అరెస్ట్చేశామన్న వార్తల్లో నిజంలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు.
వర్షాలు బాగుండాలి వర్షాకాల సమావేశాలూ బాగుండాలి
సీజేపిీ నిరసన పునః ప్రారంభం
తొలి రోజే దుమారం
పరిహారంపై పన్నాగం!
ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులు
జంట హత్యల కేసులో మరణశిక్ష
స్పానియార్డ్స్ జయకేతనం
బహదూర్గూడ భూములపై తదుపరి చర్యలొద్దు
జగన్నాథుడి ఆభరణాల లెక్కింపు పూర్తి!
‘ఎడారి’ బతుకు.. బితుకు!
వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్
బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం - టీఎంసీ కార్యాలయం కూల్చివేత
బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది
బంగారం, వెండి ధరలు ఇలా..
టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా
తండ్రీకొడుకుల బిజినెస్ బాగుంది ఇంక ఆ ‘బిజినెస్’ గురించి ఎందుకు పట్టించుకుంటారు!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
జియో రీఛార్జ్లు.. తక్కువలో టాప్ 10 ప్లాన్లు
భారత్లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?
ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం
బలూచ్ బిగ్ ట్విస్ట్తో చైనా-పాక్ ఫ్రెండ్షిప్ ఖతం!
డైవర్స్ కావాలి: భర్త - బిడ్డను కనాలి: భార్య
ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
నెతన్యాహు అరెస్టుకు మమ్దానీ కసరత్తు!
ఎల్ నినో నుంచి ఊరట? నైరుతి రీ ఎంట్రీ! వర్షాలు ఎక్కడంటే..
కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!
వర్షాలు బాగుండాలి వర్షాకాల సమావేశాలూ బాగుండాలి
సీజేపిీ నిరసన పునః ప్రారంభం
తొలి రోజే దుమారం
పరిహారంపై పన్నాగం!
ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులు
జంట హత్యల కేసులో మరణశిక్ష
స్పానియార్డ్స్ జయకేతనం
బహదూర్గూడ భూములపై తదుపరి చర్యలొద్దు
జగన్నాథుడి ఆభరణాల లెక్కింపు పూర్తి!
‘ఎడారి’ బతుకు.. బితుకు!
వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్
బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం - టీఎంసీ కార్యాలయం కూల్చివేత
బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది
బంగారం, వెండి ధరలు ఇలా..
టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా
తండ్రీకొడుకుల బిజినెస్ బాగుంది ఇంక ఆ ‘బిజినెస్’ గురించి ఎందుకు పట్టించుకుంటారు!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
జియో రీఛార్జ్లు.. తక్కువలో టాప్ 10 ప్లాన్లు
భారత్లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?
ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం
బలూచ్ బిగ్ ట్విస్ట్తో చైనా-పాక్ ఫ్రెండ్షిప్ ఖతం!
డైవర్స్ కావాలి: భర్త - బిడ్డను కనాలి: భార్య
ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
నెతన్యాహు అరెస్టుకు మమ్దానీ కసరత్తు!
ఎల్ నినో నుంచి ఊరట? నైరుతి రీ ఎంట్రీ! వర్షాలు ఎక్కడంటే..
కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!
ఫొటోలు
శ్రీనివాస మంగాపురం హీరో బర్త్ డే.. హీరోయిన్ స్పెషల్ విషెస్ (ఫోటోలు)
ముంబై : అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన బాలీవుడ్ భామలు (ఫొటోలు)
విజయవాడ : ఆషాఢ వైభవం..‘ఇంద్ర’ వైభోగం (ఫొటోలు)
హైదరాబాద్ : మురిపించిన మెరుపు తీగలు (ఫొటోలు)
FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్ (ఫొటోలు)
స్టన్నింగ్ లుక్స్లో కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
పట్టు చీరలో నభా నటేష్ అందాల మెరుపులు (ఫొటోలు)
తెల్లని చీరలో శ్రీదేవి విజయ్కుమార్ మనసు దోచే అందాలు (ఫొటోలు)
సింపుల్గా వంక పెట్టలేనంత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
ఫ్రెండ్స్తో కలిసి టాలీవుడ్ హీరోయిన్ నైట్ పార్టీ (ఫొటోలు)
సినిమా
మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్.. ఆసక్తిగా ట్రైలర్
సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న హాలీవుడ్ ఫ్రాంచైజీల్లో అవెంజర్స్ ముందు వరుసలో ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ అవెంజర్స్: డూమ్స్డే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్గా కాకుండా.. డాక్టర్ డూమ్గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోకి తిరిగి వస్తున్నారు. ఈ చిత్రంలో క్రిస్ హమ్స్వర్త్, వెనెస్సా కిర్బీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ట్రైలర్లో యాక్షన్ సీన్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్లో డౌనీ రూపాంతరం, అవెంజర్స్తో సంఘర్షణ, ఇవాన్స్ కనిపించడం హైలెట్గా నిలిచాయి. అవెంజర్స్: డూమ్స్డే మూవీ కోసం దర్శకులు జో, ఆంథోనీ రుస్సోలతో మార్వెల్ మళ్లీ కలిశారు. 2019లో వచ్చిన 'అవెంజర్స్: ఎండ్గేమ్' తర్వాత వీరు మొదటిసారిగా తిరిగి వస్తున్నారు. ఈ చిత్రానికి మైఖేల్ వాల్డ్రాన్, స్టీఫెన్ మెక్ఫీలీ రచయితలుగా ఉన్నారు. రుస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబరు 18న విడుదల కానుంది.
అందుకే అవార్డులు ఇవ్వలేదా?
జాతీయ చలనచిత్ర అవార్డులపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. విజేతలు ఆనందోత్సాహాల్లో తేలియాడుతుంటే, పరాజితుల మద్దతుదారులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అవార్డుల ఎంపిక విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తమ నటుడు అవార్డు ఎంపికపై పెదవి విరుస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, విక్రమ్లకు అవార్డు దక్కకపోవడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు మలయాళ నటుడు చందు సలీంకుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంచి సినిమాలను వదిలేసి మామూలు చిత్రాలకు అవార్డులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. పాలక పక్షం వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను అవార్డులకు ఎంపిక చేశారని వ్యాఖ్యానించారు.మమ్ముట్టితో పాటు కార్తీక్ ఆర్యన్ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడంపై చందు సలీంకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "జాతీయ అవార్డును అధికార పార్టీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు అందజేస్తున్నప్పుడు, దానికున్న హుందాతనాన్ని ఊహించండి. అయినా కూడా వారు మిమ్మల్ని (మమ్ముట్టి) విస్మరించలేకపోతున్నారు, ఎందుకంటే దేశంలోనే మీ నటన అత్యుత్తమమైనద"ని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కాగా, 'బ్రహ్మయుగం' చిత్రంలో తన నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్' చిత్రానికి కార్తీక్ ఆర్యన్.. ఉత్తమ నటులుగా ఎంపికైన సంగతి తెలిసిందే.సాధారణ సినిమాలకు అవార్డులా?మంచి చిత్రాలను విస్మరించి, సాధారణ సినిమాలకు అవార్డులు ఇచ్చారని చందు సలీంకుమార్ విమర్శించారు. అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. "ప్రతిభకు కాకుండా అధికార పార్టీకి దగ్గరగా ఉండటం వల్లే అవార్డులు వచ్చాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంటే, చరిత్ర కూడా వాటిని అలాగే గుర్తుంచుకుంటుంది. ప్రభుత్వాలు మారినా అవార్డుల విలువ నిలిచి ఉండాలి. అవి కళాత్మక శ్రేష్ఠతకు నిదర్శనంగా నిలవాలి. ఒకవేళ ప్రజలకు వాటిపై నమ్మకం పోతే, ఆయా కాలాల్లోని అత్యుత్తమ చిత్రాలుగా చరిత్ర వీటిని గుర్తించద"ని ఘాటుగా వ్యాఖ్యానించారు.'ఆడుజీవితం'కు మొండిచేయిపృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ (ఆడుజీవితం), చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘తంగలాన్’ చిత్రాలకు ప్రధాన విభాగాల్లో అవార్డులు రాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అవార్డుల జాబితా వెలువడిన వెంటనే #TheGoatLife, #Thangalaan హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘ది గోట్ లైఫ్’కు ఒక్క అవార్డు కూడా రాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటనకు కచ్చితంగా బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఒక్క పురస్కారం కూడా దక్కకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా గళం విన్పిస్తున్నారు. 'పుష్ప 2: ది రూల్', 'రాయన్' వంటి చిత్రాలకు అవార్డులు ప్రకటించిన జ్యూరీ.. ఈ రెండు సినిమాలను ఎందుకు విస్మరించిందని ప్రశ్నిస్తున్నారు. మెయ్యళగన్', 'మంజుమ్మెల్ బాయ్స్', 'కిష్కింధ కాండం' వంటి చిత్రాలకు అవార్డులు దక్కకపోవడాన్ని కూడా ప్రస్తావించారు.అవార్డుల విశ్వసనీయతపై అనుమానాలు72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రానికి సరైన గుర్తింపు లభించకపోవడం పట్ల సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తూ.. “జాతీయ అవార్డుల విశ్వసనీయత గతంలో ఉన్నంతగా ఇప్పుడు కనిపించడం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. “#TheGoatLife ఒక్క అవార్డు కూడా గెలవకపోవడం ఎలా సాధ్యమైంది? పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్ర కోసం చేసిన కృషి అసాధారణం. ఆయనకు అవార్డు రాకపోయినా, ఆయన చేసిన నటనే ఒక అవార్డు లాంటిది” అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని “మాస్టర్పీస్”గా అభివర్ణిస్తూ, పృథ్వీరాజ్ నటనను “ఐకానిక్ పెర్ఫార్మెన్స్”గా కొనియాడారు.విక్రమ్ అభిమానుల నిరాశ‘తంగలాన్’ సినిమాలో విక్రమ్ నటనకు కూడా అవార్డు వస్తుందని అనుకున్నారు. కానీ ఆయనకూ నిరాశ తప్పలేదు. దీంతో చియాన్ విక్రమ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. “చియాన్ విక్రమ్ను మరోసారి విస్మరించారు. ఇది ఆయన నష్టం కాదు, జాతీయ అవార్డులకే పెద్ద లోటు” అని వారు వ్యాఖ్యానించారు. “తంగలాన్ కోసం విక్రమ్ తన శరీరాన్నీ, మనసునీ పూర్తిగా అంకితం చేశారు. సినిమానే జీవితంగా భావించి పనిచేశారు. అయినప్పటికీ ఆయనకు జాతీయ అవార్డు రాకపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం” అని భావోద్వేగంగా స్పందించారు. “కృషికి గుర్తింపు ఉండాలి. చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ కోసం చేసిన శ్రమ జాతీయ అవార్డుకు అర్హమైనది” అని పేర్కొన్నారు.చదవండి: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నటుడు నరేశ్ ఆందోళనఅందుకే అవార్డులు ఇవ్వలేదా?పృథ్వీరాజ్ సుకుమారన్, విక్రమ్ సినిమాలకు అవార్డులు ఇవ్వకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని అభిమానులు అంటున్నారు. లూసిఫర్కు సీక్వెల్గా పృథ్వీరాజ్ తెరకెక్కించిన ఎల్2- ఎంపురాన్ సినిమా కేంద్ర ప్రభుత్వానికి గురైంది. దీంతో ఆయన సంస్థపై ఈడీ దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాకు అవార్డు ఇవ్వకుండా పక్కనపెట్టారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక తంగలాన్ దర్శకుడు ఫా. రంజిత్ కూడా మొదటి నుంచి అంబేద్కర్ వాదాన్ని గట్టిగా వినిపిస్తూ, వివక్షకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు. బహూశా ఈ కారణంతోనే ఆయన సినిమాకు అవార్డు రాలేదన్న అనుమానాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రాపగాండా సినిమాగా ఆరోపణలు ఎదుర్కొన్న హిందీ మూవీ 'ఆర్టికల్ 370'కి ఉత్తమ చలనచిత్ర పురస్కారం దక్కడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అర్థయిందని కామెంట్లు పెడుతున్నారు. Master Piece #TheGoatLife #AadujeevithamIconic Performance🔥 @PrithviOfficial Pillar of the movie ❤️ @arrahman"கற்பனைக்கு அப்பாற்பட்ட ஒர் உன்மை சம்பவம்." pic.twitter.com/sOrzH8ctWL— Sasikumar Periasamy (@SKP_Offl) July 19, 2026How did #TheGoatLife did not even win a Single award.On what basis are the #72ndNationalFilmAwards are given National Award deserved #PrithvirajSukumaranHe may not get an award but he himself is an award for the efforts that he have put for the Film. pic.twitter.com/DCSCPL7JDC— Surya (@Suryan0110) July 18, 2026#ChiyaanVikram ignored yet again!Not his loss - it’s a big miss for the National Award.#Thangalaan #72ndNationalAwardspic.twitter.com/6X08MX5jms— Balaji (@RDBalaji) July 18, 2026#ChiyaanVikram's dedication and hard work for #Thangalaan were unmatched..🙏 He put his heart and soul into the role.. It is very disappointing to see it go unrecognized by the National Awards..🚶 The man deserves more..🤝 pic.twitter.com/f4khOtoekh— Laxmi Kanth (@iammoviebuff007) July 19, 2026
బిగ్బాస్ బ్యూటీకి అసభ్యకర సందేశాలు.. పోలీసులకు ఫిర్యాదు
కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్ ఐశ్వర్య పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో వేధింపులు, దుర్భాషలు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించింది. తనకు తెలిసిన ఒక వ్యక్తి పేరును వెల్లడిస్తూ.. పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి తనను లక్ష్యంగా చేసుకున్నారని వాపోయింది.తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు తెలిపింది. దీని వెనుక ఉన్నవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. దీంతో బెంగళూరులోని సంజయ్నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వేధింపులు చాలా కాలంగా కొనసాగుతున్నాయని.. అందుకే తాను మరోసారి పోలీసులను ఆశ్రయించానని నటి తన ఫిర్యాదులో పేర్కొంది.కాగా.. కన్నడ చిత్ర పరిశ్రమలో మహిళా నటీమణులను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి రమ్య, దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ కూడా ఇలాంటి ఆన్లైన్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఈ రెండు కేసుల్లోనూ నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు కూడా చేశారు.
ఓటీటీకి ఆపరేషన్ సఫేద్ సాగర్.. ట్రైలర్ అదుర్స్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. సరికొత్త కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా మరో ఆసక్తికర కథనంతో వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్ తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న ఆపరేషన్ సఫేద్ సాగర్ ట్రైలర్లో యుద్ధ సన్నివేశాలు, వైమానిక దాడులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ పేరే సఫేద్ సాగర్. పాకిస్తాన్పై వైమానిక దాడులతో మంచు కొండలపై భారత్ విరుచుకుపడినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్లో ది గోల్డెన్ యారోస్ కీలక పాత్ర పోషించింది.కాగా.. ఈ సిరీస్లో సిద్దార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో ఎయిర్ఫోర్స్ కమాండర్గా కనిపించనున్నారు.
క్రీడలు
మెస్సీ అలా.. లామినే ఇలా; చివరికి!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఓటమి బాధను తట్టుకోలేక అర్జెంటీనా మిడ్ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ స్పెయిన్ ఆటగాళ్లతో తగాదా పెట్టుకున్నాడు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ ఒకవైపు మెస్సీ.. మరోవైపు లామినె యమాల్ మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు. ఓటమి షాక్ నుంచి తేరుకోని మెస్సీ మైదానంలోనే నిరాశతో కూర్చుండిపోయాడు. తనలో తాను కుమిలిపోతు కన్నీటిపర్యంతమయ్యాడు. Photo Credit: FIFA Twitterమరోపక్క యమాల్ కూడా తన పక్కనే అంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ తన దేశం గెలిచిందన్న సంతోషంతో అతను ప్రార్థనల్లో మునిగిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించకుండా యమాల్ తన పనిలో నిమగ్నమై ఉండడం చూస్తే అతడి ఆత్మవిశ్వాసం ఎలాంటిదో అర్థమవుతోంది. ఇంత గొడవలో కూడా మెస్సీ, యమాల్ మధ్య జరిగిన ఒక భావోద్వేగ ఘటన ఆసక్తిగా మారింది.MIENTRAS LAMINE YAMAL REZABA... 😳 pic.twitter.com/9SPl4s4Gep— Diario Olé (@DiarioOle) July 20, 2026Photo Credit: FIFA Twitterఒకరినొకరు ఆలింగనం..లామినే యమాల్ తన ప్రార్థన పూర్తి చేసుకొని లేచిన తర్వాత తన ఎదురుగా పెద్ద గొడవ జరుగుతున్న దృష్ట్యాలను చూశాడు. కానీ దానిని పట్టించుకోకుండా యమాల్ నేరుగా మెస్సీ వద్దకు వచ్చాడు. అప్పటికే నిరాశలో కూరుకుపోయిన మెస్పీని ఓదార్చి పైకి లేపాడు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. ఇది చూసిన అభిమానులు.. 'క్యా సీన్హై' అనకుండా ఉండలేకపోయారు. వీరిద్దరు ఆలింగనం చేసుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచాయి. 'నిజమైన క్రీడా స్ఫూర్తికి మెస్సీ, యమాల్ అర్థం చెప్పారంటూ' కామెంట్లు చేశారు.అసలేం జరిగింది?ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఓటమి బాధలో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లవైపు చూస్తూ స్పెయిన్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం వారికి కంటికి ఇంపుగా అనిపించలేదు. దీంతో అర్జెంటీనా మిడ్ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఒక్కసారిగా స్పెయిన్ ఆటగాళ్లవైపు దూసుకొచ్చాడు. Thank you, Leo. Legends are remembered, but you will never be forgotten. 🐐https://t.co/K8dqX5Tvlo— ketansusuw ✿ (@tansuuuw) July 20, 2026ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. Read: మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే!
మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే!
మెస్సీ ఒక ఉత్పాతం, మౌన ముని. ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురైనా తన ఆటతోనే సమాధానం చెప్పాడు తప్ప హద్దులు మీరిన సందర్భాలు చాలా తక్కువ. నిజానికి మెస్సీకి కోపం కూడా ఎక్కువే. కానీ దాని అవసరం ఎంతమేర ఉంటుందో అంతే చూపిస్తుంటాడు. కాబట్టే ఇవాళ ప్రపంచంలో ప్రతీ మూలన అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో ఫుట్బాల్ పీలే, మారడోనా సహా ఎందరో దిగ్గజ ఆటగాళ్లను అందించినప్పటికీ ఈ తరంలో మాత్రం మెస్సీనే దిగ్గజ ఆటగాడు. ఇంకా చెప్పాలంటే అతడో ఆరాధ్య దైవం.అలాంటి ఈ తరంలో ఫుట్బాల్ తెలిసినోడిని నిద్రలో నుంచి లేపి ఒక ఆటగాడి పేరు చెప్పమంటే మొదట వినిపించే పేరు లియోనల్ మెస్సీ. రెండు దశాబ్దాలుగా తన ఆటతో ఫుట్బాల్ అభిమానుల గుండెల్లో గుడి కట్టేసుకున్న మెస్సీ చూడాల్సినవన్నీ చూశాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు, ఆరుసార్లు యూరోపియన్ గోల్డెన్ షేస్, ఎనిమిది సార్లు ఫిఫా బెస్ట్ ప్లేయర్, అలాగే 2025లో ఆల్టైమ్ బెస్ట్ ప్లేయర్గాను నిలిచాడు. తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా ప్రపంచకప్ను కూడా నాలుగేళ్ల కిందట ఖతార్లోనే అందుకున్నాడు. మరి ఇన్ని చూసినా ఈసారి ఫిఫాలో కూడా మెస్సీ నామజపమే ఎందుకు నడిచిందనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. అదంతా మెస్సీ మాయ.Photo Credit: FIFA Twitterమెస్సీ బరిలో ఉన్నాడంటే చాలు అభిమానులకు ఎక్కడలేని జోష్ వస్తుంది. 2026 ఫిఫా ప్రపంచకప్లోనూ అదే రిపీట్ అయింది. ఈసారి ఫిఫాలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మరోసారి అన్నీ తానై నడిపించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్లో (ప్రి-క్వార్టర్ ఫైనల్ వరకు) కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. అయితే అతడి స్పీడుకు ఈసారి ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె (10 గోల్స్, 4 అసిస్ట్లు) బ్రేకులు వేశాడు. అయితే క్వార్టర్స్, సెమీస్లో గోల్ చేయనప్పటికీ కీలక అసిస్ట్లు అందించి జట్టు వెన్నంటే ఉన్నాడు. కానీ కీలకమైన ఫైనల్లో మెస్సీ ఏం చేయలేకపోయాడు. దుర్బేద్యమైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్లను అడ్డుకోవడంతోనే మెస్సీకి సరిపోయింది. మ్యాచ్లో మెస్సీ రెండు క్రాస్లతో పాటు ఒక్కసారి మాత్రమే గోల్పోస్ట్ వైపు షాట్ ఆడినప్పటికీ స్పెయిన్ గోల్ కీపర్ ఉనైయి సిమోన్ దానిని కూడా సమర్థంగా అడ్డుకున్నాడు. మ్యాచ్లో స్పెయిన్ 20 సార్లు తమ ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడులు చేస్తే.. అర్జెంటీనా మాత్రం రెండుసార్లు మాత్రమే ప్రయత్నం చేయడం గమనార్హం.Photo Credit: FIFA Twitterఇక మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ కన్నీటిపర్యంతమవడం వెనుక ఒక కారణముంది. ఈసారి ఫిఫా ఆరంభం నుంచి అర్జెంటీనా ఆటపై వివాదాలు నెలకొన్నప్పటికీ మెస్సీ మాత్రం తన ఆటను చాలా సందర్భాల్లో నిజాయితీగానే ఆడాడు. ఫైనల్లో కూడా తను చేయాల్సిందంతా చేశాడు. కానీ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన స్పెయిన్ ముందు అర్జెంటీనా పూర్తిగా తేలిపోవడంతో మెస్సీ కూడా చేష్టలుడిగి ఉండిపోయాడు.ఇక 1962 తర్వాత వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్లు గెలవాలన్న కల కూడా చెదరడం మెస్సీ కన్నీటికి మరో కారణం. 39 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడుతూ ఆటను కొనసాగించిన మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. మంచి ఫామ్లో ఉన్నందున ఈసారి ఎలాగైనా అర్జెంటీనాకు రెండోసారి ఫిఫా టైటిల్ను అందించాలని మెస్సీ కలగన్నాడు. బరిలోకి దిగిందే తడవుగా ప్రత్యర్థులతో పోరాట సింహంలా తలపడ్డాడు. 8 గోల్స్తో పాటు 4 అసిస్ట్లు చేసిన మెస్సీ సిల్వర్ బూట్ను కూడా గెలుచుకున్నాడు. Photo Credit: FIFA Twitterఅవార్డులు కొత్త కానప్పటికీ ఈసారి మెస్సీ ఫిఫా టైటిల్ను గెలిచిన మరుక్షణమే ఆటకు వీడ్కోలు పలికేవాడేమో. ప్రస్తుతం తన రిటైర్మెంట్పై మౌనమే వహించినప్పటికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడడం డౌటే. కాబట్టి ఫుట్బాల్లో ఒక శకం దాదాపు ముగిసినట్లే. Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm— Messi Anıları (@messianilari) July 19, 2026Lionel Messi gets emotional as Argentina fans shower him with love and support 🥹 pic.twitter.com/kff4YYJBwu— Instablog9ja (@instablog9ja) July 20, 2026 ESTE ULTÚIMO TANGO Una de las cosas más hermosas del fútbol es tener a Lionel Andrés Messi y su participación en todos los Mundiales. Gracias por todo lo que has logrado con la selección: récords, logros y campeonatos Gracias por cada momento de alegría que compartimos con la… pic.twitter.com/6GYfKBKpnz— AR (@ionlylei) July 20, 2026
ఆటకు గుడ్బై చెప్పు.. భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇంగ్లండ్తో కీలక మూడో మ్యాచ్లో ఓటమిపాలైన టీమిండియా వన్డే సిరీస్నూ కోల్పోయింది. లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన వన్డేలో గిల్ సేన 27 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం భారత బౌలర్ల వైఫల్యమే అని చెప్పడంలో సందేహం లేదు.నలుగురు సీమర్లు అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ కృష్ణలతో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్లను టీమిండియా బరిలోకి దించింది. ఈ మ్యాచ్కు ముందు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. దీంతో వాషీ స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారని విశ్లేషకులు భావించారు. అయితే, ఇక్కడ మధ్య ఓవర్లలో స్పిన్నర్ల కంటే పేసర్లే ఎక్కువ ప్రభావం చూపుతారన్న కెప్టెన్ శుబ్మన్ గిల్.. కుల్దీప్ను కాదని ప్రిన్స్ యాదవ్ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.మూకుమ్మడిగా విఫలంఅయితే, ఈ వ్యూహం బెడిసి కొట్టింది. బౌలర్లంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. గుర్నూర్ బ్రార్ అయితే పది ఓవర్ల కోటాలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకుని లార్డ్స్లో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇక అర్ష్దీప్ తన కోటా పూర్తి చేసి 72 పరుగులు ఇవ్వగా.. ప్రసిద్ కృష్ణ 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు.అత్యధిక స్కోరుమరోవైపు.. ప్రిన్స్ యాదవ్ పది ఓవర్ల కోటా పూర్తి చేసి 79 రన్స్ ఇచ్చుకుని ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్ పది ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులతో లార్డ్స్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 360 పరుగులు మాత్రమే చేసి ఓటమిని ఆహ్వానించింది.రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడిఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుల్దీప్ యాదవ్ పట్ల మేనేజ్మెంట్ వైఖరి సరిగ్గా లేదని విమర్శించాడు. ‘‘కుల్దీప్ కెరీర్ ముగిసిపోయింది.. ఇక బ్యాగులు సర్దుకోవడమే తరువాయి.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలి’ అనేలా కుల్దీప్ను గందరగోళంలో పడేస్తున్నారు.లార్డ్స్ మ్యాచ్లో బుమ్రా, వాషింగ్టన్, వరుణ్ చక్రవర్తి.. ఈ ముగ్గురూ లేరు. మరి వాషీ స్థానంలోనైనా కుల్దీప్ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు కదా!.. లార్డ్స్లో వైవిధ్యంగా బౌలింగ్ చేసేవాళ్లు కావాలి. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన కుల్దీప్ ఇక్కడ గొప్పగా బౌలింగ్ చేయగలడు.118 వన్డేల్లోనే అతడు 194 వికెటుల కూల్చాడు. అయినా సరే ఈ గణాంకాలను మీరు పరిగణనలోకి తీసుకోరు అనిపిస్తోంది. ఇక భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సైతం కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడాన్ని తప్పుబట్టాడు. అశూ ఆగ్రహంఇంగ్లండ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడించకుండా అతడిని పక్కనపెట్టారని.. ఇది కుల్దీప్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అశూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా యూకే పర్యటనలో టీ20 సిరీస్లలో ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా క్లీన్స్వీప్ అయింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో 2-1తో ఓటమిపాలైంది.చదవండి: అందుకే అతడు బెంచ్కే పరిమితం: గిల్
నాలుగేళ్లలో సీన్ రివర్స్.. విలన్గా మారిన అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ విజయంతో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మైదానంలో నిరాశతో కూర్చుండిపోయాడు. వరుసగా రెండోసారి అర్జెంటీనాకు ఫిఫా ప్రపంచకప్ అందించాలన్న కల చెదరడంతో ఏం చేయలేక కన్నీటిపర్యంతమయ్యాడు. ఈసారి ఫిఫా టోర్నీ ఆరంభం నుంచి ఫుల్జోష్లో కనిపించిన అర్జెంటీనా.. ఫైనల్ వరకు హీరోగానే నిలిచినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా మిడ్ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఓటమి బాధను తట్టుకోలేక స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగడం ఆ జట్టును విలన్గా మార్చేసింది. ఫిఫా ఆరంభం నుంచి ఎన్ని వివాదాలు జరిగినా ప్రపంచమంతా అర్జెంటీనా గెలవాలని బలంగా కోరుకుంది. కానీ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన గొడవ అర్జెంటీనాను హీరో నుంచి జీరోకు పడిపోయేలా చేయడమే గాక, టోర్నీ విలన్గా మారిపోయింది.Photo Credit: FIFA Twitter2022 ఖతార్ ప్రపంచకప్లో తమ ఆటతీరుతో అందరి మన్ననలు పొందిన అర్జెంటీనా నాలుగేళ్ల తర్వాత జరిగిన ఫిఫా 2026లో మాత్రం వారి ప్రయాణం మొత్తం వివాదాలతోనే నడిచింది. ఈజిప్ట్పై చివరి నిమిషంలో 3-2 తేడాతో విజయం సాధించినప్పటికీ, ఈ మ్యాచ్ విజయం అర్జెంటీనాను మరింత వివాదంలోకి నెట్టేసింది. అర్జెంటీనా గెలవడానికే ఫిఫా నిర్వహిస్తున్నారని, రిఫరీ ఎవరైనా అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటున్నాయని, అంతమాత్రాన ఫిఫా ప్రపంచకప్ నిర్వహించడం ఎందుకని, టైటిల్ను అర్జెంటీనాకు ఇచ్చేయాలనే విమర్శలు వచ్చాయి. ఇలా టోర్నీలో అర్జెంటీనా సాధించిన ప్రతీ విజయం వెనుక ఒక మెలిక ఉండడం పరిపాటిగా మారిపోయింది.Photo Credit: FIFA Twitterఈసారి టోర్నీ అంతటా వివాదాలు, సోషల్ మీడియాలో చర్చలు ఉన్నప్పటికీ, మెస్సీ మాత్రం తన ఆదర్శప్రాయమైన ప్రవర్తనతో జట్టును నడిపించాడు. అంతా చేజారిపోయినట్లు అనిపించిన మ్యాచ్ల్లో కూడా తన మ్యాజిక్తో అర్జెంటీనావైపు మొగ్గేలా చేశాడు. మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. కాబట్టి తర్వాతి ఫిఫాకు ఈ దిగ్గజం లేకుండానే అర్జెంటీనా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. మెస్సీకి ఒక పరిపూర్ణమైన ముగింపు కల్పించే అవకాశం అర్జెంటీనాకు లభించినప్పటికీ ఫైనల్ తర్వాత జరిగిన ఒక్క గొడవ ఆ జట్టు ఆటగాళ్లను విలన్లుగా మార్చేసింది.Read: కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది?
న్యూస్ పాడ్కాస్ట్
రామాయపట్నంలో భారీ స్కామ్... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తా... సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్
నంబర్ 1 నుంచి నేలచూపులే... నీతి ఆయోగ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారీగా పతనం
ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
బిజినెస్
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 442.93 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 77,708.52 వద్ద, నిఫ్టీ 95.80 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టంతో 24,238.50 వద్ద నిలిచాయి.సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్, అషిమా లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్ లిమిటెడ్, సిక్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భన్సాలీ ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిఎన్ఎ యాక్సిల్స్ లిమిటెడ్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, రాజదర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఈ ప్రైవేటు బ్యాంకులకు భలే లాభాలొచ్చాయ్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ. 19,060 కోట్ల నికర లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 18,155 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 5 శాతం అధికం. మరోవైపు బ్యాంకు ఆదాయం రూ. 99,200 కోట్ల నుంచి రూ. 92,184 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం రూ. 77,470 కోట్ల నుంచి రూ. 79,363 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) 1.4 శాతం నుంచి 1.17 శాతానికి, నికర ఎన్పీఎలు 0.47 శాతం నుంచి 0.41 శాతానికి నెమ్మదించాయి. పార్ట్టైమ్ చైర్మన్గా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నియామకంతో సంస్థకు స్థిరత్వం లభించినట్లవుతుందని ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్కి రుణ వృద్ధి దన్ను..దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంక్ తొలి త్రైమాసికంలో నికర లాభం (కన్సాలిడేటెడ్) సుమారు 14 శాతం వృద్ధితో రూ. 13,558 కోట్ల నుంచి రూ. 15,440 కోట్లకు పెరిగింది. రుణాలు 20 శాతం వృద్ధి చెందడం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం సుమారు 13 శాతం పెరిగి రూ. 24,384 కోట్లకు చేరింది. డిపాజిట్లు 14 శాతం పెరిగాయి. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) నిష్పత్తి 1.67 శాతం నుంచి 1.38 శాతానికి తగ్గింది. స్టాండెలోన్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం 16 శాతం వృద్ధితో రూ. 12,768 కోట్ల నుంచి రూ. 14,804 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ స్వల్పంగా 4.36 శాతానికి పెరిగింది. వివిధ కారణాలరీత్యా గత కొంతకాలంగా నెమ్మదించిన కార్పొరేట్ రుణాల విభాగం మళ్లీ గణనీయంగా మెరుగుపడగలదని బ్యాంకు ఈడీ సందీప్ బాత్రా తెలిపారు. కోటక్ మహీంద్రా 23 శాతం అప్..కోటక్ మహీంద్రా బ్యాంకు నికర లాభం గత క్యూ1తో పోలిస్తే 22.6 శాతం వృద్ధితో రూ. 5,480 కోట్లకు (కన్సాలిడేటెడ్) పెరిగింది. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 3,282 కోట్ల నుంచి రూ. 4,123 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ. 7,259 కోట్ల నుంచి రూ. 7,928 కోట్లకు వృద్ధి చెందింది. అయితే, నికర వడ్డీ మార్జిన్ మాత్రం 4.64 శాతం నుంచి 4.53 శాతానికి తగ్గింది. ఈ ఏడాది డిసెంబర్లో వైదొలగాలన్న నిర్ణయానికి వ్యక్తిగత, వృత్తిగత అంశాలు కారణమని బ్యాంకు ఎండీ, సీఈవో అశోక్ వాస్వానీ తెలిపారు. సమీక్షాకాలంలో డిపాజిట్లు 14 శాతం వృద్ధితో రూ. 4,92 లక్షల కోట్ల నుంచి రూ. 5.59 లక్షల కోట్లకు చేరాయి. రుణాలు 15 శాతం పెరిగి రూ. 4.59 లక్షల కోట్ల నుంచి రూ. 5.28 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. యాక్సిస్ బ్యాంక్కి తగ్గిన ప్రొవిజనింగ్ భారం..మొండిబాకీలు మొదలైన వాటికి ప్రొవిజనింగ్ తగ్గడం యాక్సిస్ బ్యాంక్ మెరుగైన పనితీరుకు దోహదపడింది. క్యూ1లో సంస్థ నికర లాభం 22 శాతం వృద్ధితో రూ. 7,632 కోట్లకు (కన్సాలిడేటెడ్) చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ. 7,114 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పెరిగి రూ. 14,646 కోట్లుగా నమోదైంది. రుణాలు 19 శాతం వృద్ధి చెందాయి. నికర వడ్డీ మార్జిన్ 3.80 శాతం నుంచి 3.46 శాతానికి తగ్గింది. కార్పొరేట్ రుణాలు 38 శాతం, రిటైల్ రుణాలు 8 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంకు సీఈవో అమితాబ్ చౌదరి తెలిపారు. ఇక నుంచి నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోగలవని ఆయన పేర్కొన్నారు. సమీక్షాకాలంలో ప్రొవిజనింగ్ రూ. 3,948 కోట్ల నుంచి రూ. 2,223 కోట్లకు తగ్గింది. జీఎన్పీఏ నిష్పత్తి 1.23 శాతం నుంచి 1.28 శాతానికి పెరిగింది.
ఒక్క యాప్.. నాలుగు కోట్ల డౌన్లోడ్స్!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. దాదాపు అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలాంటి సేవల్లో ఆధార్ యాప్ ముఖ్యమైనది. ఈ యాప్ ఇప్పటికే 4 కోట్ల డౌన్లోడ్లను దాటిందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే ప్రజలకు యాప్ ప్రజలకు ఎంత ఉపయోగకరమైనదో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఆధార్ యాప్ ద్వారా.. మొబైల్ నెంబర్ను మార్చుకోవడం, అడ్రస్ అప్డేట్ చేయడం, ఈ-ఆధార్ డౌన్లోడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ లేదా అన్లాక్ చేయడం వంటి సేవలను పొందవచ్చు. దీంతో.. ఆధార్ సేవల కోసం ప్రతిసారి కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది.ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 49 లక్షల మొబైల్ నెంబర్లు, 11.65 లక్షల చిరునామాలు, 12.5 లక్షల ఈమెయిల్ చిరునామాలు అప్డేట్ అయ్యాయి. అంతేకాకుండా.. 1.91 కోట్లకు పైగా బయోమెట్రిక్ లాక్/అన్లాక్ సేవలను వినియోగదారులు ఉపయోగించినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నటుడు నరేష్ ఆందోళన
దేశంలో పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ఈ ఇంధనం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు వస్తుండగా తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాను దేశద్రోహిని కాదని స్పష్టం చేస్తూనే.. ఈ ఇథనాల్ పెట్రోల్ విధానం సామాన్య బైక్ వినియోగదారుల నుంచి లగ్జరీ కార్ల యజమానుల వరకు అందరికీ ఇబ్బందిగా మారిందని ఆయన విమర్శించారు.లక్షల రూపాయల నష్టం..తన స్నేహితుడు (బీజేపీ సానుభూతిపరుడు) ఇటీవల కొనుగోలు చేసిన టయోటా క్యామ్రీ కారులో ఇథనాల్ పెట్రోల్ ద్వారా ఇంజిన్ వాల్వ్లు దెబ్బతిన్నాయని, వాటిని మార్చడానికి రూ.3.5 లక్షలు ఖర్చయిందని నరేష్ పేర్కొన్నారు. ‘ఇదే పరిస్థితి నా కొత్త పోర్షే పనమెరా కారుకు వస్తే దాదాపు రూ.12 లక్షల వరకు నష్టం వస్తుంది. అందుకే నేను తప్పనిసరి పరిస్థితుల్లో లీటరు రూ.165 ధర పలికే ‘హై ఆక్టేన్ 100’ పెట్రోల్ వాడుతున్నాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు లగ్జరీ ఇంధనాలు వాడగలరని, కానీ నిత్యం బతుకుదెరువు కోసం చూసే సామాన్య బైక్ వినియోగదారుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.I am not anti national but this ethanol Petrol is giving heart attacks from bike users to high-end car users . My friend( a sympathiser of BJP) who bought Toyota Camry recently had to change valves of the engine. Which cost him 3.5 lks . If the same happens to my new Porsche… pic.twitter.com/4ciFCJxRv4— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) July 19, 2026‘ఒక మాజీ బీజేపీ నాయకుడిగా నాకు తెలుసు.. పార్టీకి బలమైన థింక్ ట్యాంక్, ప్లాన్ A, B, C లు ఉంటాయి. కానీ కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి పర్యావరణాన్ని రక్షించాలనే ఈ నిర్ణయం చాలా హడావుడిగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఇది బీజేపీకి ఒక రెడ్ సిగ్నల్ లాంటిది’ అని నరేష్ విజయకృష్ణ తెలిపారు. బ్రెజిల్ వంటి చిన్న దేశాలు ఇథనాల్ను దశలవారీగా ప్రవేశపెట్టి విజయం సాధించాయని, భారతదేశంలో ఇంత హడావుడి ఎందుకని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?
ఫ్యామిలీ
విదుర నీతి
విదురుడు ధృతరాష్ట్రునికి అనేక విధాలుగా నీతిని బోధించాడని గతవారం చెప్పుకున్నాం కదా... విదురుడు బోధించిన నీతిసూత్రాలు విదురనీతిగా ప్రసిద్ధి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు...→ ఎల్లప్పుడూ అందరి శ్రేయస్సును కోరుకోవాలి. ఏ ఒక్క వర్గానికీ అపకారం, దుఃఖాన్ని కలిగించాలని కనీసం మనసులో అయినా అనుకోకూడదు. → కష్టాలు, ఆపదలు, ప్రతికూలతల్లో ఉన్న వారిపై శ్రద్ధ పెట్టాలి. మనల్నే నమ్మి ఆధారపడిన వారి నిరంతర బాధలను, అవి చిన్నవైనా నిర్లక్ష్యం చేయకూడదు.→ సకల ప్రాణుల పట్ల కరుణ చూపాలి. → మేలు చేసే పనులే చేయాలి. → ఎవరి వల్లా వ్యవసాయ, ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధికి, పెరుగుదలకు ఎప్పుడూ ఆటంకం కలిగించరాదు. → భద్రత, రక్షణ కోసం మనపై ఆధారపడిన వారిని కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.→ ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరించాలి. వారికోసం అంకిత భావంతో అందుబాటులో ఉండాలి. → సద్గుణం ద్వారానే విజయాన్ని సాధించి నిలబెట్టుకోవాలి. → ప్రజల సంక్షేమాన్ని వ్యక్తిగత బాధ్యతగా భావించాలి. → అభ్యసనాన్ని, జ్ఞాన ప్రసారాన్ని్రపోత్సహించాలి. → లాభాన్ని, సద్గుణాన్ని ప్రోత్సహించాలి. → శ్రేయస్సు మంచి పనులపై ఆధారపడి ఉంటుంది. మంచి పనులు శ్రేయస్సుపై ఆధారపడి ఉంటాయి. → దుష్టులతో... పాపాత్ములతో స్నేహాన్ని విడిచిపెట్టాలి. → ఎన్నడూ సంపదను దుర్వినియోగం చేయకూడదు. → కఠినమైన మాటలు మాట్లాడకూడదు, తీవ్రమైన లేదా క్రూరమైన శిక్షలు విధించకూడదు. → సద్గుణ చరిత్ర, స్వభావం, చురుకుదనం కలిగి ఉండాలి. – సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్
గ్రామ దేవతలకు భక్తి బోనాలు
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగ సందడి ఇప్పటికే ఆరంభం అయింది. ఈ సందర్భంగా ఆషాఢ బోనాల విశిష్టత, వివిధ ఆలయాల్లో జరిగే ప్రధాన జాతరల వివరాలను సమగ్రంగా తెలుసుకుందాం.‘బోనం’ అనే పదం ‘భోజనం’ అనే ప్రకృతి పదం నుండి వచ్చింది. ఇది తమను అంటువ్యాధులు, రకరకాల ప్రకృతి విపత్తుల బారిన పడకుండా చల్లగా చూస్తున్నందుకు గాను కృతజ్ఞతతో అమ్మవారికి సమర్పించే పవిత్రమైన నైవేద్యం. తయారీ విధానం: కొత్త మట్టి కుండలో పాలు, నీళ్లు, బెల్లం, కొత్త బియ్యంతో అన్నం (పరమాన్నం లేదా పసుపు అన్నం) వండుతారు. ఈ కుండకు సున్నం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, వేపాకులు, పూలతో అందంగా అలంకరిస్తారు. కుండపై వెలిగించిన దీపాన్ని ఉంచి, మహిళలు భక్తిశ్రద్ధలతో తలపై మోస్తూ మంగళవాద్యాల నడుమ ఆలయానికి తరలివెళ్తారు. ఈ పండుగ వెనుక ఉన్న ఆచారాలు: బోనాల జాతరలో భక్తితో పాటు అద్భుతమైన జానపద కళారూపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. శివసత్తుల పూనకాలు: డోలు సప్పుడు, మైసమ్మ, మహంకాళి పాటల మధ్య శివసత్తులు పూనకంతో ఊగిపోతూ భక్తులకు వేపమండలతో దీవెనలు అందిస్తారు. ఘటోత్సవం – రంగం (భవిష్యవాణి): పండుగలో భాగంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు జరుగుతుంది. జాతర ముగిసే మరుసటి రోజు ఉదయం ‘రంగం’ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జోగిని పచ్చి మట్టి కుండపై నిలబడి, భవిష్యత్తులో వచ్చే వర్షాలు, పంటలు, ప్రజల క్షేమం గురించి అమ్మవారి సాక్షిగా భవిష్యవాణి చెబుతుంది. ఆరోగ్య రహస్యం: వర్షాకాలం (ఆషాఢం) ప్రారంభంలో మశూచి, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వీటి నుంచి ప్రజలను కాపాడాలని కోరుకుంటూ భక్తులు వేపాకులు, పసుపుతో సాకపెట్టడం వల్ల అవి సహజ సిద్ధమైన కిమినాశకాలుగా పనిచేసి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి.జూలై 16న గోల్కొండ కోటలో ప్రారంభమైన ఆషాఢ బోనాల మహోత్సవాలు ఆగస్టు 13, 2026 వరకు నెల రోజుల పాటు ముక్కోటి దేవతల సాక్షిగా సాగుతాయి. బోనాల పండుగ కేవలం ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు, అది తెలంగాణ ప్రజల ఐక్యతకు, ఆచారాలకు అద్దం పట్టే ఒక సాంస్కృతిక పండగ. కులమతాలకు అతీతంగా ఊరంతా ఒక్కటై అమ్మవారిని కొలిచే ఈ జాతర వైభవం ప్రతి ఒక్కరినీ భకి ్త పారవశ్యంలో ముంచెత్తుతుంది. తెలంగాణ సంస్కృతిలో మమేకమైన ఈ జాతర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడిన వారిని కూడా ఈ పండగలో భాగస్వాములను చేస్తుంది. పోతురాజుల విన్యాసాలుబోనాల జాతరకు సిసలైన సింగారం బోనాల పండుగ అనగానే మొదట గుర్తొచ్చేది.. ఒళ్లంతా పసుపు, నుదుటున పెద్ద కుంకుమ బొట్టు, చేతిలో వేపమండలు, కొరడాతో డప్పు చప్పుళ్లకు అనుగుణంగా శివాలెత్తిపోయే పోతురాజు. పోతురాజుల విన్యాసాలు లేని బోనాల జాతరను ఊహించుకోలేము. ఈ ఉత్సవాలలో పోతురాజుల పాత్ర అత్యంత కీలకమైనది.ఎవరీ పోతురాజు?జానపద కథల ప్రకారం, పోతురాజు గ్రామ దేవతలైన మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటివారికి ఏకైక తమ్ముడు. అమ్మవార్ల ప్రతిరూపమైన ఘటాలకు రక్షకుడిగా, ఊరేగింపునకు ముందు నడిచే సైన్యాధిపతిగా పోతురాజును భావిస్తారు. వీర విన్యాసాలు: తీన్మార్ డప్పు చప్పుళ్లకు అనుగుణంగా గాల్లోకి ఎగురుతూ, చేతిలోని కొరడాతో నేలను కొడుతూ భీకరంగా నృత్యం చేస్తారు. భక్తి పారవశ్యంతో తమను తాము కొరడాతో కొట్టుకుంటూ విన్యాసాలు చేసే పోతురాజు చేతి కొరదా దెబ్బలు తినడానికి భక్తులు పోటీపడతారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, పోతురాజు చేత కొరడా దెబ్బలు తినడం వల్ల దిష్టి పోతుందని, రోగాలు రావని నమ్మకం. ఊరేగింపులో అమ్మవారి ’ఘటం’ ముందుకు కదపాలంటే పోతురాజు నృత్యం చేస్తూ దారి చూపిస్తూ ఉండాలి. ఫలహార బండి ఊరేగింపు: సికింద్రాబాద్, లాల్ దర్వాజా బోనాలలో జరిగే ఫలహార బండ్ల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు పతాక స్థాయికి చేరుకుంటాయి.గావు పట్టడం: జాతర చివరి రోజున అమ్మవారికి బలి ఇచ్చే ఆచారంలో భాగంగా, పోతురాజు కోడిపుంజును నోటితో కొరికి (గావు పట్టి) గుడి బయట విసిరేస్తారు. ఇది జాతరలోనే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం. వివిధ ఆలయాల్లో జాతరలు జరిగే తేదీల వివరాలుజూలై 21న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కళ్యాణోత్సవం, బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆగస్టు 2: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం– దీనిని ‘లష్కర్ బోనాలు‘ అని పిలుస్తారు. దీనికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఆగస్టు 3: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం–బోనాల పండుగలో అత్యంత కీలక ఘట్టమైన ‘రంగం’ (భవిష్యవాణి) జరుగుతుంది.ఆగస్టు 9: పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ఇది కేంద్ర బిందువు. ఇక్కడి ఘటాల ఊరేగింపుతో పండుగ ఊపు అందుకుంటుంది. ఉత్సవాల ముగింపు ఆగస్టు 13: నెల రోజుల పాటు సాగిన ఈ బోనాల మహా జాతర ముగుస్తుంది.– డి.వి.ఆర్.
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది, యాసిడ్ బాధితురాలు..! కానీ ఇవాళ ఆమె..
జీవితంలో ఎడతెగని సమస్యలు ఎదురైతే..ఎవ్వరికైనా జీవితంపై విసుగు వచ్చేస్తుంది. పుట్టుకతోనే కష్టాలు అనేవి..మనిషిలో ఒక విధమైన నిరాసక్తత పెంచుతుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం వాటన్నింటితో మరింత ఉన్నతంగా ఎదిగి..గొప్ప తల్లిగా మారింది. కంటేనే తల్లి కాదు అంటూ 'అమ్మ' అనే పదానికి గొప్ప అర్థం ఇచ్చింది. ఆ మహిళే దేవాంశి యాదవ్. ఏ బిడ్డ మోయకూడదని వేదనను ఎదుర్కొంది చిన్నతనంలో. తండ్రి ఆమెకు తొమ్మిది నెలల వయసున్నప్పుడే ఉగ్రవాద బాంబు దాడిలో మరణించాడు. ఆమెకు ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు. పోలీసు అధికారి అయిన తల్లి ఆధ్వర్యంలో పెరిగిందామె. పోనీ అక్కడితో ఆ చిన్నారికి కష్టాలు ఆగిపోలేదు. ఆ తర్వాత లైంగిక దాడి, యాసిడ్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారియర్ ఆమె. ఈ రెండు చేదు అనుభవాలు ఎవ్వరినైనా ఒంటరిగా నిస్తేజంగా మార్చేస్తాయి. కానీ ఆ కష్టాలు ఆమెను మరింత దృఢంగా మార్చాయి. ఎంతలా అంటే తాను తల్లిలా ఒక బిడ్డకు పూర్తి ప్రేమతో కూడిన జీవితం ఇవ్వాలనేంత విశాల హృదయాన్ని అందించే స్థాయికి మార్చింది. టీనేజ్లో ఉండగా ఏ అమ్మాయి అయినా..తన తోటి పిల్లలతో ఎంజాయ్ చేస్తే దేవాంశి మాత్రం తాను జీవసంబంధమైన తల్లిగా కాకుండా దత్తత తల్లిగా ఒక బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో పెరిగడం విశేషం. అది నిజం కావడానికి చాలా సమయమే పట్టింది. View this post on Instagram A post shared by Devanshi 🇮🇳 (@devanshi__yadav) ఆ చిన్నారితో నెరవేరిన కల..ఇరవైలలో దేవాంశి ఢిల్లీలోని ఒక అనాథాశ్రమంలో బోధిస్తున్నప్పుడు, వినికిడి, మాటల లోపంతో బాధపడుతున్న చిన్నారిని చూసింది. దేవాంశి ఆ చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంది. ఆ సంస్థ అందుకు అనుమతించలేదు. ఆ అనుభవమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఎందుకంటే తక్షణమే దత్తత తీసుకునేందుకు ప్లాన్ చేసుకుని కావల్సిన డాక్యమెంట్లు సిద్దంచేసుకుని కోర్టు అనుమతితో వన్మయిని అనే ఐదు నెలల చిన్నారిని సొంత చేసుకుంది. ఆ ఒక్కక్షణంలో ప్రదీది తనకు అపురూపమైనదిగా మారిందని అంటోంది దేవాంశి. ప్రస్తుతం ఆ బిడ్డకు ఏడు సంవత్సరాలు..కానీ ఆమెకు అన్ని తెలిసేలానే పెంచింది. దత్తత, సరోగసి అనేవి ఆ చిన్నారికి తెలుసు. పైగా తన గురించి అభద్రతా భావంతో కాకుండా.. ఎంతగానో ప్రేమించే గొప్ప తల్లితో ఉన్నా అనే భావనతో పెంచింది ఆ చిన్నారిని దేవాంశి. అంతా తనను ఒంటరి తల్లిగా ఎలా పెంచేస్తావని ప్రశ్నిస్తే..వాటికి ఆమె తన చేతల ద్వారా సమాధానిచ్చింది. పితృస్వామ్యాన్ని నిశ్శబ్దంగా బద్దలుకొట్టేలా ఆ చిన్నారి అధికారిక పత్రాలన్నింటిలో తన పేరుతో రిజిస్ట్రర్ చేసి..ఎంతో సాధించిన విజయంలా అనిపిస్తుందని సగర్వంగా చెబుతోంది దేవాంశి. అంతేగాదు తన తల్లి సైతం ఆ బిడ్డను ఎంతో అపురూపంగా చూస్తుందని చెబుతోంది. ఇక దేవాంశి లైంగిక హింస, గృహ హింస బాధితులు, బాలల సంక్షేమం కోసం పనిచేసే 'షహీద్ రామశ్రయ వెల్ఫేర్ సొసైటీ' అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. ఆమె ఒక న్యాయవాది కూడా. ఇవన్ని చేస్తూ తల్లిగా బాధ్యతలను కూడా నిర్వర్తిస్తుండటం విశేషం. ఇదేమంతా ఈజీ కాకపోయినా..తన కూతురు తనతోపాటు ఉంటూ..న్యాయవాదం, మానసిక ఆరోగ్యం గురించి పాఠ్యపుస్తకాల ద్వారా కాకుండా తన తల్లి రోజు వారీ ఆచరణ ద్వారా నేర్చుకునేలా చేస్తున్నా అని నవ్వుతూ చెబుతోందామె. ఇది పెంపకానికి, తల్లి అను మాటకు గొప్ప అర్థంలా ఉంది కదా ఆమె స్టోరీ. View this post on Instagram A post shared by Devanshi 🇮🇳 (@devanshi__yadav) (చదవండి: రూ. 38 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి టీ దుకాణం..! ఇప్పుడు ఏకంగా..)
రూ. 38 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి టీ దుకాణం..! ఇప్పుడు ఏకంగా..
జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయడానికి చాలామంది భయపడతారు. పెట్టుబడి పెట్టి వ్యాపారం రన్ చేశాక..అనుకున్న విధంగా లాభలు రాకపోతే..పరిస్థితి కష్టం కదా అని రిస్క్ చేసేందుకు ప్రయత్నించం. కానీ ఈ వ్యక్తి కథ విన్నాక..ట్రై చేస్తే తప్పు లేదు అనే ధైర్యం కలుగుతుంది. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆ పోస్ట్ ప్రకారం..సదరు వ్యక్తి పొరుగున నివశించే వ్యక్తి స్వీట్ల బాక్స్తో తన వ్యాపార విస్తరణను సెలబ్రేట్ చేసుకోవడానికి రావడంతో ఈ విషయం తెలిసిందంటూ మొదలవుతుంది పోస్ట్. ఆ ఎదురింటి వ్యక్తి 'టెలిపెర్ఫార్మెన్స్'లో పనిచేస్తూ నెలకు సుమారు రూ. 38,000 సంపాదించేవాడు. మే నెలలో ఉద్యోగానికి రాజీనామ చేశారు. మరో కార్పొరేట్ ఉద్యోగానికి బదులుగా ఆటో స్టాండ్ దగ్గర టీ దుకాణం పెట్టడానికి దాదాపు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, సాధారణ టీని రూ. 10కి, ప్రీమియం టీని రూ. 20కి విక్రయించడం ప్రారంభించారు. అలాగే టీ తయారు చేయడానికి, వినియోగదారులకు అందించడానికి ఇద్దరు మహిళలను నియమించుకున్నారు. ప్రస్తుతం ఆ దుకాణంలో సుమారు 400 కప్పుల టీ అమ్ముడవుతోందని, తద్వారా రోజుకు రూ. 6,000 లేదా నెలకు రూ. 1.8 లక్షల ఆదాయం వస్తోంది. ఒక వేళ ఆ వ్యక్తి పాత ఉద్యోగంలోనే కొనసాగితే..వార్షిక జీతాల పెంపు (appraisals) కోసం ఎదురుచూస్తూ ఇప్పటికీ నెలకు రూ. 38,000 మాత్రమే సంపాదిస్తూ ఉండేవారు. అతడికి ఆ వ్యాపారానికి అద్దెకు రూ. 25,000, సిబ్బంది జీతాలకు రూ. 30,000, విద్యుత్, ముడి సరుకుల కోసం రూ. 25,000 ఖర్చులను మినహాయించిన తర్వాత కూడా వ్యాపారి నెలకు దాదాపు రూ. 1 లక్ష లాభాన్ని ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఆయన వ్యాపారం ఇప్పటికే మరింత వృద్ధి చెందింది. ఆ టీ దుకాణంలో ఇటీవల వడా పావ్, సమోసాలు, జిలేబీలు అందించే కౌంటర్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ ఎదురింటి వ్యక్తి తనకు స్వీట్ల పంచడంతోనే ఈ విషయం తెలిసిందంటూ పోస్ట్లో రాసుకొచ్చాడు సదరు వ్యక్తి. నెటిజన్లు ఆ వ్యక్తి ధైర్యంగా తీసుకున్న రిస్క్ను ప్రశంసించడమే కాదు, మధ్యతరగతి వాళ్లకు ఇలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టే టీ వ్యాపారాలింటివే బెటర్..తొలిరోజు తక్కువ అమ్మకాలు వచ్చినా..క్రమంగా పుంజుకుంటుందంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!)
అంతర్జాతీయం
ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పాలస్తీనా నుంచి బందీలైన ఖైదీలను జైలు నుంచి పారిపోకుండా జైలు చూట్టుూ మెుసళ్లను పెంచుతూ అత్యంత కఠిన వలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ నిర్ణయం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఇటీవలే ఇజ్రాయెల్ పర్యావరణ పరిరక్షణ మంత్రి ఇడిత్ సిల్మాన్ మొసళ్లను "అడవి జంతువుల" జాబితా నుండి "బంధించి పెంచే వన్యప్రాణుల" జాబితాలోకి మార్చారు. ఈ మార్పు వల్ల భద్రతా కారణాల కోసం, ముఖ్యంగా జైలు పరారీలను అడ్డుకోవడానికి మొసళ్లను ఉపయోగించేందుకు అవకాశం లభించింది.ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ గతేడాది డిసెంబర్లో పాలస్తీనా ఖైదీలు ఉన్న జైలు చుట్టూ మొసళ్లను ఉంచాలని ప్రతిపాదించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న "అలిగేటర్ అల్కాట్రాజ్" ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ తరహాలో దీనిని ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. అయితే తొలుత ఈ నిర్ణయాన్ని అక్కడి నాయకులు వ్యతిరేకించారు. తాజాగా ఈ నిర్ణయంతో ఆయన ఆలోచనకు మార్గం సుగమమైంది. కొత్త చట్టం ఏమి చెబుతోంది?ఈ కొత్త నిబంధన ప్రకారం, నైలు నది మొసళ్లనుభద్రతా సంస్థల పర్యవేక్షణలో పెంచడానికి అనుమతిస్తారు. అయితే ఇవి అడవుల్లోకి తప్పించుకోకుండా ప్రకృతి ,పార్కుల అథారిటీ డైరెక్టర్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం కఠినమైన భద్రత మధ్య ఉంచాలి. అలాగే వీటిని కలిగి ఉండటం దేశ భద్రతకు అవసరమని పర్యావరణ పరిరక్షణ మంత్రి ధృవీకరించాల్సి ఉంటుంది.ఎక్కడ వీటిని ఏర్పాటు చేయనున్నారు.ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, దక్షిణ ఇజ్రాయెల్లోని 'కెట్జియాట్' జైలు చుట్టూ ఈ మొసళ్లను మోహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జైలులో ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడి తర్వాత పట్టుబడిన అనేక మంది హమాస్ ఉగ్రవాదులను బంధించారు. తాజాగా ఆ జైలు చుట్టూనే ఈ మెుసళ్ల వలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
అత్యంత భారీ బాలిస్టిక్ క్షిపణుల దాడులు చేసిన రష్యా
రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై వరుసగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, 14 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. గత రాత్రి వేళ ప్రాంతంలోని పలు చోట్ల దాడులు జరిగాయి. పూర్తి స్థాయి యుద్ధం మొదలైనప్పటి నుంచి కీవ్పై జరిగిన అత్యంత భారీ బాలిస్టిక్ దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ చెప్పారు.ఉక్రెయిన్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, 41 క్షిపణుల్లో 18 క్షిపణులను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మరో 108 డ్రోన్లను కూడా అడ్డుకున్నాయి. అటు ఉక్రెయిన్ కూడా రష్యాలోని లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తోంది. స్టావ్రోపోల్ గవర్నర్ మాట్లాడుతూ.. డ్రోన్ దాడి వల్ల ఒక పారిశ్రామిక పార్కులో అగ్నిప్రమాదం సంభవించింది. కీవ్పై తాజా దాడుల్లో ఇస్కాండర్, హైపర్సోనిక్ జిర్కాన్ క్షిపణులతో పాటు 125 డ్రోన్లను కూడా రష్యా వినియోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.ఆదివారం కీవ్ మేయర్ విటాలీ క్లిచ్కో మాట్లాడుతూ.. ఈ దాడుల్లో నివాస భవనాలు, ఇతర భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఒక సూపర్ మార్కెట్, ఒక వసతి గృహం కూడా నష్టం చవిచూశాయని అన్నారు. రెండు గిడ్డంగుల్లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చే పనిలో ఉన్నారు.గత వారం ఉక్రెయిన్పై రష్యా సుమారు 1,450 దాడి డ్రోన్లు, 1,640కు పైగా బాంబులు, 99 రకాల క్షిపణులను ప్రయోగించిందని టెలిగ్రామ్లో జెలెన్స్కీ పేర్కొన్నారు. రాత్రి జరిగిన ఈ దాడులకు ముందు, రష్యాలోని అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ వైల్డ్బెర్రీస్కు చెందిన రెండు గిడ్డంగులను ఉక్రెయిన్ డ్రోన్లతో ధ్వంసం చేసింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా, భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి.మాస్కోకు ఆగ్నేయంగా సుమారు 475 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంబోవ్ నగరంలోని ఒక కేంద్రంలో ఏడుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారు. రాజధాని సమీపంలోని ఎలెక్ట్రోస్టాల్లో ఉన్న మరో వైల్డ్బెర్రీస్ గిడ్డంగిలో ఒకరు మరణించగా, 37 మంది గాయపడ్డారు. శనివారం జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ చర్యలు రష్యా పౌర మౌలిక సదుపాయాలు, నగరాలు, సమాజాలపై చేసిన దాడులకు ప్రతిస్పందన అని చెప్పారు.వైల్డ్బెర్రీస్ను తరచూ రష్యాకు చెందిన అమెజాన్గా అభివర్ణిస్తారు. వైల్డ్బెర్రీస్, ప్రకటనల సంస్థ రస్ కలిసిన ఆర్డబ్ల్యుబీ గ్రూప్ విలువను 2026లో ఫోర్బ్స్ రష్యా సుమారు $12.6 బిలియన్ (£9.3 బిలియన్)గా అంచనా వేసింది.ఇటీవలి కాలంలో రష్యా కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దీర్ఘ శ్రేణి డ్రోన్ దాడులను ఉక్రెయిన్ మరింత తీవ్రం చేసింది. దీని వల్ల విస్తృత స్థాయిలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ నెల ప్రారంభంలో రష్యా చమురు శుద్ధి సామర్థ్యంలో దాదాపు 43% పనిచేయకుండా చేశామని కీవ్ ప్రకటించింది.
ట్రంప్ పోస్టులు ముందుగా చూడాలంటే రూ.85 లక్షలు ఇవ్వాలి..
వాషింగ్టన్: ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ‘పెయిడ్ డేటా సర్వీస్ ప్లాన్’ను ప్రకటించింది. దీని ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ట్రూత్ సోషల్లోని ప్రముఖ ఖాతాల పోస్టులు అత్యంత వేగంగా అందుతాయి. ట్రూత్ ఏపీఐ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్.. ప్రభావం ఎక్కువగా చూపే 10 ఖాతాల కంటెంట్ను బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, ట్రేడింగ్ సంస్థలకు సాధారణ యాప్ నోటిఫికేషన్ల కంటే వేగంగా అందిస్తుంది. ట్రూత్ ఏపీఐ సేవ ధర $60,000 నుంచి $100,000 మధ్య (సుమారు రూ.51 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య) ఉండొచ్చని సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కొన్ని సెకన్ల ఆలస్యం కూడా ఆర్థికంగా కొందరికి నష్టాలను తెచ్చిపెడుతుంది. అటువంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వీస్ రూపొందించారు. తాజా సమాచారం వచ్చిన వెంటనే చర్యలు తీసుకునే ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ సంస్థలు ఇందులో ఉన్నాయి. ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్లు ముందే నిర్ణయించిన నియమాల ఆధారంగా ఆటోమేటిక్గా కొనుగోలు, అమ్మకాలు చేసే విధానం.ఇప్పటి వరకూ ఇలాంటి సంస్థలు ట్రూత్ సోషల్ను అందరిలాగే గమనించేవి లేదా ప్లాట్ఫాం నిబంధనలకు విరుద్ధంగా డేటాను సేకరించేవి. ట్రూత్ ఏపీఐ ఆ లోటును భర్తీ చేసే పరిష్కారంగా తీసుకొచ్చారు. సోషల్ మీడియా వ్యాపారానికి బయట కొత్త ఆదాయ మార్గాన్ని ఓపెన్ చేయాలనే లక్ష్యంతో డేటా లైసెన్సింగ్లో ట్రంప్ మీడియా వేసిన తొలి అధికారిక అడుగు ఇదే. ప్లాట్ఫాంలో వచ్చే పోస్టులకు మార్కెట్లు ఇప్పటికే స్పందిస్తున్నాయని, వేగంగా సమాచారం పొందాలనే డిమాండ్ పెరుగుతుందని తాత్కాలిక సీఈవో కెవిన్ మెక్గర్న్ తెలిపారు.ఇందుకే పోస్టులను వేగంగా చదవాలి ట్రంప్ పోస్టులు సుంకాల ప్రకటనల నుంచి చైనా వాణిజ్య విధానంపై వ్యాఖ్యల వరకు ఎన్నో సందర్భాల్లో మార్కెట్లపై ప్రభావం చూపించాయి. 2025 ఏప్రిల్ 9న కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన పోస్టు చేసిన వెంటనే వాల్ స్ట్రీట్ సూచీలు భారీగా ఎగిశాయి.మార్కెట్ వర్గాలు కూడా ఈ ప్రభావాన్ని అంగీకరిస్తున్నాయి. ట్రూత్ సోషల్లో మార్కెట్ను నిరంతరం ప్రభావితం చేసేది ట్రంప్ ఒక్కరేనని ఒక ఫండ్ మేనేజర్ చెప్పారు. అందుకే ఆయన పోస్టులు ముందుగానే అందడం అత్యంత విలువైనదిగా భావిస్తున్నారు.అయితే ఈ చెల్లింపు సర్వీసు అసమానతలను పెంచుతుందని విమర్శకులు అంటున్నారు. వేగంగా సమాచారం అందడం వల్ల భారీ నిధులు ఉన్న సంస్థలకు, చిన్న సంస్థలపై పైచేయి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. సెనేటర్ రాన్ వైడెన్ ఈ చర్య వల్ల ట్రంప్ కుటుంబానికి ఆర్థిక లాభం చేకూరడంతో పాటు వాల్ స్ట్రీట్ లాభాలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్థాయుల వారీగా డేటా అందించడం కొత్త విషయం కాదు. ఇది సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించకపోవచ్చు. అయినా సమాన అవకాశాలపై సందేహాలు తలెత్తొచ్చు. ఈ సర్వీసు రోజంతా పర్యవేక్షణ సౌకర్యంతో పాటు 2022 నుంచి ఉన్న పాత పోస్టుల భద్రపరిచిన రికార్డులను కూడా అందిస్తుంది. ఆగస్టు 1న ప్రారంభం కానున్న ఈ సేవకు ఇప్పటికే తొలి ఖాతాదారులు చేరారు. రాజకీయ ప్రభావాన్ని ఆదాయంగా మార్చే ప్రయత్నాలను ట్రంప్ మీడియా మరింత దూకుడుగా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
డాలర్కు చెక్.. చైనా చెల్లింపుల వ్యవస్థలోకి లిబియా!
ట్రిపోలి: లిబియా తన వాణిజ్య బ్యాంకులను చైనాకు చెందిన ‘క్రాస్-బోర్డర్ ఇంటర్బ్యాంక్ పేమెంట్ సిస్టమ్’ (సీఐపీఎస్)తో అనుసంధానించనుంది. దీనివల్ల చైనా కరెన్సీ యువాన్ ఆధారిత లావాదేవీలకు మార్గం సుగమం కావడంతో పాటు, అమెరికన్ డాలర్పై ఆధారపడటం తగ్గుతుంది. ఈ నిర్ణయం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడం, సరిహద్దు దాటిన చెల్లింపులను సరళతరం చేయడం, లిబియా-చైనా ఆర్థిక సహకారాన్ని మరింత లోతుగా మార్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఒక కీలక పరిణామంలో చైనా చెల్లింపు, సెటిల్మెంట్ వ్యవస్థకు తమ వాణిజ్య బ్యాంకులను అనుసంధానించాలని లిబియా నిర్ణయించుకుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ లిబియా గవర్నర్ నాజీ మహమ్మద్ ఇస్సా, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ పాన్ గాంగ్షెంగ్ శనివారం (జులై 19) ఈ విషయాన్ని ప్రకటించారు. ఇస్సా బీజింగ్లో పర్యటించిన సందర్భంగా శుక్రవారం గాంగ్షెంగ్తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ బదిలీలను చైనీస్ యువాన్ ద్వారా సులభతరం చేయడానికి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 2015లో సీఐపీఎస్ను ప్రారంభించింది. లిబియా బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని సమీక్షించడంతో పాటు, దానిని బలోపేతం చేయడానికి, వృద్ధి రేటును పెంచడానికి గల మార్గాలపై ఇరుపక్షాలు చర్చించాయి.‘రెండు సెంట్రల్ బ్యాంకుల మధ్య నూతన వ్యూహాత్మక భాగస్వామ్య దశను ప్రారంభించడంపై ప్రాముఖ్యతను చర్చించాం. ఆర్థిక బదిలీలను సరళతరం చేయడానికి, వాటిని సులభంగా నిర్వహించడానికి లిబియా వాణిజ్య బ్యాంకులను చైనాకు చెందిన క్రాస్-బోర్డర్ ఇంటర్బ్యాంక్ పేమెంట్ సిస్టమ్తో అనుసంధానించాలని నిర్ణయించాం’ అని ఇస్సా పేర్కొన్నారు. అమెరికా పేరును ప్రస్తావించకుండానే, ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని మరింత పెంచే విధంగా అడ్డంకులను తొలగించి, వాణిజ్య ప్రక్రియలను సులభతరం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ఒక ప్రకటనలో తెలిపారు.నివేదికల ప్రకారం సీఐపీఎస్ అనేది మధ్యవర్తి బ్యాంకుల ద్వారా లావాదేవీలను ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా, నేరుగా యువాన్ ఆధారిత చెల్లింపులను పంపడానికి, స్వీకరించడానికి బ్యాంకులకు వీలు కల్పిస్తుంది. చైనీస్ బ్యాంకుల ద్వారా నేరుగా లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) జారీ చేయడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నేతృత్వంలో లిబియా బ్యాంకింగ్ ప్రతినిధుల బృందం త్వరలో బీజింగ్లో పర్యటించేలా ఏర్పాట్లు చేయాలని కూడా వారు నిర్ణయించారు. ఈ పర్యటన ఇరు దేశాల వాణిజ్య బ్యాంకుల మధ్య సహకారాన్ని నెలకొల్పడానికి, ఆర్థిక బదిలీల విషయంలో చైనా సహకారాన్ని అందిపుచ్చుకోవడానికి దోహదపడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.
జాతీయం
అప్పటివరకు నా నిరాహార దీక్ష కొనసాగుతుంది: వాంగ్చుక్
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఇందుకు కారణాన్ని ఆయన ఎక్స్లో తెలిపారు. "శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై క్రూరత్వాన్ని చూపుతున్నారు. యువ నాయకులకు సంసత్ భవన్లో పార్లమెంట్ సభ్యులను కలిసే అవకాశం ఇచ్చే వరకు, లేక ఇక్కడ ఆసుపత్రిలో నేను వారిని కలిసే అవకాశం వచ్చే వరకు నా నిరాహార దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. అంతకంటే ముందే విద్యాశాఖ మంత్రిని బాధ్యుడిగా నిర్ధారిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ సమస్యను పరిష్కరించేందుకు, విద్యార్థులు తమ ఫిర్యాదులు, డిమాండ్లు పార్లమెంట్ సభ్యుల ముందు ఈ రోజు లేదా రేపు చెప్పే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసు బలగాలను కోరుతున్నాను. ఈ రోజు చూపిన ఓర్పు, సహనాన్నే యువ నిరసనకారులు రేపూ చూపుతారని నా నమ్మకం" అని చెప్పారు. జులై 20 ఉదయం సోనం వాంగ్చుక్ ఒక ప్రకటన విడుదల చేసి, ఈ రోజు 3 షరతుల్లో ఏదైనా నెరవేరితే తన నిరాహార దీక్షను విరమిస్తానని తెలిపారు. పరిస్థితులు మారకపోవడంతో దీక్ష ముగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.కేరళ హౌస్ సమీపంలో నిరసనసెంట్రల్ ఢిల్లీలోని కేరళ హౌస్ సమీపంలో ధర్నా కొనసాగుతోందని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. "అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా, గీతాంజలి జంతర్ మంతర్లో ధర్నా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారు కేరళ హౌస్ ముందు ఉన్నారు" అని సీజేపీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
రథానికి విద్యుత్ తీగ తాకి ఇద్దరు విద్యార్థుల మృతి
ఖుంటి: ఝార్ఖండ్లోని ఖుంటి జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. భగవాన్ జగన్నాథుడి రథయాత్రలో ఉపయోగించిన రథాన్ని టోర్పాలోని మౌసీ బారీ వద్ద నిలిపి ఉంచగా, అది 11,000 వోల్టుల విద్యుత్ తీగను తాకడంతో ఇద్దరు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.టోర్పా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 10 మంది బాలురు రథంతో ఆడుకుంటుండగా, వారిలో కొందరు రథంపైకి ఎక్కారు. "రథం 11,000 వోల్టుల విద్యుత్ తీగను తాకడంతో ఏడుగురు బాలురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సదర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారికి టోర్పా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది" అని ఓ పోలీసు అధికారి చెప్పారు.ఖుంటి సదర్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ కిశోర్ ఒరావోన్ మాట్లాడుతూ.. దాదాపు 15 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురిని ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. "వారిలో ఇద్దరిని మృతులుగా తీసుకొచ్చారు. మరో బాలుడికి చికిత్స కొనసాగుతోంది" అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఉన్న రథాన్ని టోర్పాలోని మౌసీ బారీ వద్ద నిలిపి ఉంచారని మరో పోలీసు అధికారి తెలిపారు.
స్కూల్కు వెళ్తుండగా నడిరోడ్డులో విద్యార్థినిపై బుల్లెట్ల వర్షం.. మృతి
పట్నా: బిహార్లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన దారుణ ఘటన ఆ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలకు వెళ్తున్న 15 ఏళ్ల విద్యార్థినిని రోడ్డుపైనే కాల్చి చంపాడు ఓ యువకుడు. సైకిల్పై ఆ అమ్మాయి కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను చంపాక నిందితుడు బైక్పై పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.బైక్పై వెంబడించి.. వరుసగా కాల్పులుమృతురాలిని పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సోనం కుమారిగా గుర్తించారు. సమాచారం ప్రకారం, సోనం ఎప్పటిలాగే ఉదయం సైకిల్పై పాఠశాలకు బయల్దేరింది. ఆమె మంగళ్ స్థాన్ సమీపానికి చేరుకున్న సమయంలో పల్సర్ బైక్పై వచ్చిన ఓ యువకుడు వెంబడించడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కేజియా వార్డు-13 సమీపంలో నిందితుడు ఆమె సైకిల్ను ఓవర్టేక్ చేసి ఎదురుగా వచ్చాడు. వెంటనే తుపాకీ తీసి వరుసగా కాల్పులు జరిపాడు. సోనంకు 4 బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఘటన తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న వైని పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమస్తిపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) బృందం ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. సదర్ డీఎస్పీ-1 సంజయ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం లభించిందని చెప్పారు. ఆ సమాచారం ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేస్తున్నామని, నిందితుడిని త్వరగా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
10 ఏళ్లు ఇన్ఫీ మూర్తి చెప్పిన దానికి మించి చాకిరీ కానీ, టెకీ ఆవేదన
హైదరాబాద్కు చెందిన ఒక సీనియర్ టెక్నాలజీ ప్రొఫెషనల్ అర్జున్ సింగ్ (పేరు మార్పు) ఆవేదన నెట్టింట వైరల్గా మారింది. ప్రముఖ కన్సల్టింగ్ దిగ్గజం డెలాయిట్ (Deloitte) సంస్థలో పదేళ్ల పాటు నారాయణ మూర్తి చెప్పిన దానికంటే ఎక్కువ గంటలు పనిచేసినా, తీవ్రమైన మానసిక ఒత్తిడి తప్ప ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని వాపోయారు. చివరకు కంపెనీ నుండి బయటకు వచ్చేశారు.ఆయన తన ఉద్యోగ జీవితంలోనిఈ చేదు అనుభవాలను మనీకంట్రోల్తో పంచుకున్నారు. దీని ప్రకారం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటే అర్జున్ సింగ్ తాను అంతకంటే ఎక్కువగా, వారానికి కొన్నిసార్లు 74 గంటల పాటు పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇంత కష్టపడి పనిచేసినా, తనకు రావాల్సిన ప్రమోషన్ దక్కకపోగా.. కేవలం 5 శాతం జీతం పెంపు (Salary Hike) మాత్రమే లభించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.తీవ్ర ఒత్తిడిచదువు పూర్తి కాగానే డెలాయిట్లో చేరిన అర్జున్, తన కెరీర్ మొత్తం అక్కడే కొనసాగించాలనుకున్నారు. కానీ కాలక్రమేణా ఆయన కలలన్నీ కరిగిపోవడం మొదలైంది. విపరీతమైన పని ఒత్తిడి భరించలేనిదిగా మారింది. ముఖ్యంగా సాధారణంగా ఆరు నెలల పాటు ఆరుగురు చేయాల్సిన ప్రాజెక్ట్లను, పోటీ తట్టుకునే క్రమంలో కేవలం నలుగురు ఉద్యోగులతో ఐదు నెలల్లోనే పూర్తి చేయాలని యాజమాన్యం ఒత్తిడి తెచ్చేది. క్లయింట్ పనులతో పాటు ఇంటర్నల్ రిక్రూట్మెంట్, కొత్త ప్రపోజల్స్ తయారు చేయడం వంటి అదనపు బాధ్యతలను ఉద్యోగులపై మోపేవారు. హోదా పెరిగేకొద్దీ ఈ ఉచిత పనుల భారం మరింత ఎక్కువయ్యేది. కంపెనీలు మారే చాలా మందిలా కాకుండా, తాను డెలాయిట్ను విడిచిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని సింగ్ చెప్పారు. యంగస్టర్గా ఉన్నపుడు సీనియర్ నాయకులను చూసి, ఒక రోజు తాను కూడా ఆ స్థాయికి చేరుకోగలను అనుకోవడం చాలా సులభం. కానీ ఒక చోట చేరిన మొదటి రోజే 10 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించు కోకూడదన్నారు. అలాగే తన నిర్ణయం ఏదో ఒక ప్రాజెక్ట్ వల్లనో, లేదా ఒక కష్టమైన మేనేజర్ వల్లనో మార్పు రాలేదు, అది క్రమంగా జరిగింని చెప్పారు. అయితే ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, డెలాయిట్లో గడిపిన దశాబ్దం గురించి తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదనికూడా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్ఫ్యామిలీ జీవితానికి దూరంఆఫీస్ గంటలు ముగిసినా, పండగలు లేదా శుభకార్యాల్లో ఉన్నా సరే ఎప్పుడూ పనికి అందుబాటులో ఉండాల్సి వచ్చేది. పని నుండి డిస్కనెక్ట్ అవ్వడం అసలు సాధ్యపడేది కాదంటూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదని వాపోయారు. అర్జున్ మాటల్లో చెప్పాలంటే... "బాగా కష్టపడి అద్భుతంగా పనిచేసే వారికి, అలాగే నార్మల్గా పనిచేస్తూ లైఫ్ ఎంజాయ్ చేసే వారికి ఇచ్చే జీతాల పెంపులో పెద్దగా తేడా ఉండేది కాదు. మనం ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు రానప్పుడే ఉద్యోగి మానసికంగా కుంగిపోతాడు ." కోట్లాది రూపాయల విలువైన క్లయింట్ ప్రపోజల్స్ను రాత్రింబవళ్లు కూర్చొని టెక్నికల్ టీమ్ సిద్ధం చేస్తే, దానివల్ల వచ్చే లాభాల్లో వారికి ఎలాంటి వాటా దక్కేది కాదని ఆయన విమర్శించారు.ఇదీ చదవండి: షాకింగ్ జిప్లైన్ రైడ్ ప్రమాదం, 40 అడుగుల ఎత్తునుంచి..!కొత్త జీవితం వైపు అడుగులుఅలా టాక్సిక్ వాతావరణం మధ్య 35 ఏళ్ల వయసులో 22 ఏళ్ల వయసులో తనకు ఉన్న సక్సెస్ డెఫినిషన్ ఇప్పుడు మారి పోయిందని గ్రహించానని చెప్పారు. డబ్బు కంటే కూడా తన సమయం, మానసిక ప్రశాంతత ముఖ్యమని భావించి డెలాయిట్కు రాజీనామా చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే మరో కంపెనీలో చేరాననీ అక్కడ డెలాయిట్ కంటే మంచి ప్యాకేజీ రావడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితానికి, ఆఫీస్ జీవితానికి మధ్య సరైన సమతుల్యత (Work-Life Balance) లభిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: 50 సార్లు ట్రై చేశా డాడీ : బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య
ఎన్ఆర్ఐ
శంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్
లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్: శంకర నేత్రాలయ సంస్థ అమెరికా సలహా మండలి (అడ్వైజరీ బోర్డు) సభ్యుడిగా లక్ష్మీ నరసింహన్ వాసన్ను నియమితులయ్యారు. అమెరికన్ కిచెన్ ఎక్విప్మెంట్ రంగంలో స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఎన్నో సమాజ సేవ, దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. ఆయనను ప్రతీష్టాత్మకమైన అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమించామని సంస్థ అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి తెలియచేశారు.ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ నాయకత్వ బృందం, ఇతర సలహా మండలి సభ్యులు, శంకర నేత్రాలయ ఇండియా అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు తదితరులు లక్ష్మీ నరసింహన్ వాసన్, ఆయన సతీమణి డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్కు స్వాగతాభినందనలు తెలియచేశారు. లక్ష్మీ నరసింహన్ వాసన్ తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని పసూర్ గ్రామంలో జన్మించి, హైదరాబాద్లో పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన అనంతరం, 1981లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని రాయల్ కిచెన్ ఎక్విప్మెంట్ కంపెనీ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (CEO)గా సేవలందించారు.ఆయనకు క్రీడారంగంలో కూడా విశిష్టమైన ప్రస్థానం ఉంది. అమెరికాకు వెళ్లే ముందు ఆయన భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా రాణించి, హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోని జట్టులో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్లలో కూడా పాల్గొన్న ఆయన, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, ఎస్. వెంకటరాఘవన్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి మైదానాన్ని పంచుకున్నారు.లక్ష్మీ నరసింహన్ వాసన్ 1988లో డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కార్తీక్ వాసన్ వైద్య పరిశోధనలో పీహెచ్డీ. పూర్తి చేయగా, కుమార్తె మయూరి వాసన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా గుర్తింపు పొందారు.దాతృత్వ సేవలను జీవిత ధ్యేయంగా భావించిన లక్ష్మీ నరసింహన్, భారతదేశం, అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇటీవల శంకరనేత్రాలయా సంస్థకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో, శంకరనేత్రాలయ సంస్థ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మధ్యప్రదేశ్, సమీప ఐదు రాష్ట్రాల పేదప్రజలకు కంటిచూపు సంబందించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం కల్పిస్తుంది.శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ ఎమిరిటస్ ఎస్ వి ఆచార్య, పద్మభూషణ్ డాక్టర్ జగదీశ్ సేథ్, ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శ్రీమతి లీల క్రిష్ణమూర్తి , డాక్టర్ రాజ్ మోదీ, డాక్టర్ కిశోర్ చివుకుల , ఉదయ భాస్కర్ గంటి, శ్యామ్ అప్పలి, శ్రీ మూర్తి రేకపల్లి, వంశీకృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, వాసన్ కుటుంబం అందిస్తున్న విశేష దాతృత్వ సేవలను, సంకర నేత్రాలయ లక్ష్య సాధనకు వారు అందిస్తున్న సహకారాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.
ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇవాళ ఆక్లాండ్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సాన్ స్వాగతం పలికారు. ఇరు దేశాల ప్రధానులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్లో భారత ప్రధాని పర్యటించారు. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై దృష్టిపెట్టారు.భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1968లో ఇందిరా గాంధీ, ఆ తర్వాత 1986లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పర్యటించిన అనంతరం.. భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇది మూడోసారి మాత్రమే. ఈ పర్యటనను భారత్-న్యూజిలాండ్ సంబంధాలలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభంగా భావిస్తున్నారు.భారత ప్రధాని శనివారం లక్సాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు, సముద్ర భద్రత, విద్య, పర్యాటకం, క్రీడలపై ఈ చర్చలు సాగనున్నాయి. వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం 'స్పార్క్ అరేనా'లో జరిగే ఒక భారీ కమ్యూనిటీ ఈవెంట్లో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కింద తమ దేశం నుంచి భారత్కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్లో పోస్టు చేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందం తో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉద్యోగం లేదు, ఎలాంటి వేతనం లేదు..!దర్జాగా స్విట్జర్లాండ్లో..
ఎలాంటి ఆదాయం లేకుండా ఏ ఒక్క పని కాదు కదా..బయటికి కాలు కదపడం కూడా కష్టమే. అలాంటిది ఈ మహిళ ఏకంగా అత్యంత ఖరీదైన స్విట్జర్లాండ్ దేశంలో బేషుగ్గా బతికేస్తోందామె. కార్పొరేట్ ఉద్యోగం లేకుండా అలాంటి దేశంలో నివశించడం అంటే..అత్యంత హాస్యాస్పదం, నమ్మశక్యం కానీ విషయం. కానీ ఈ భారత సంతతి మహిళ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న ఉదంతం వింటే..ఔనని అంగీకరిస్తారు. మరి ఆమె దాన్ని ఎలా సాధ్యం చేసిందంటే..భారత సంతతి మహిళ స్నేహ గౌర్ తాను కార్పొరేట్ ఉద్యోగం లేకుండా ఆరు నెలలపాటు స్విట్జర్లాండ్లో ఎలా గడపగలిగిందో పంచుకుంది. చాలామందికి ఆర్థిక భద్రత అనేది పూర్తికాలపు ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. కానీ ఒక భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటైన స్విట్జర్లాండ్లో ఏ కంపెనీలో పనిచేయకుండానే ధీమాగా స్పెండ్ చేస్తోంది. అంతకుముందు తాను ఒక కార్పొరేట్ ఉద్యోగంలో నెలకు సుమారు రూ. 45,000 సంపాదిస్తున్నప్పటి నుంచి తన ప్రయాణం ప్రారంభమైందని అన్నారు. డిగ్రీ సంపాదించడం, జీతం తీసుకోవడం, ఉద్యోగం సంపాదించడం,తదుపరి ప్రమోషన్ పొందడం వంటివే అతిపెద్ద విజయాలుగా భావించానని చెప్పుకొచ్చింది. కానీ కాలక్రమేణ స్వేచ్ఛగా బతకడమే అసలైన జీవితం అని తెలిసి వచ్చింది. ముఖ్యంగా తాను ఎక్కడ నివశించాలో ఎంచుకునే స్వేచ్ఛ, ప్రయాణించే స్వేచ్ఛ, నచ్చిన విషయాలపై పనిచేసే స్వేచ్ఛ ఉంటేనే లైఫ్ అని గ్రహించానని అంటోందామె. అందుకే స్పానిష్ నేర్చుకోవడంపై పెట్టుబడి పెట్టి..చివరికి ఆ నైపుణ్యమే తన జీవిత గమనాన్ని మార్చేసిందని చెబుతోంది. ఆ భాష ఆమెకు స్పెయిన్కు వెళ్లడానికి, అంతర్జాతీయ అనుభవాన్ని పొందడానికి ఉపకరించిందని పేర్కొంది. అదే క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించింది. ఏళ్ల తర్వాత ఆ నైపుణ్యాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నట్లు వెల్లడించింది. అలా క్రమంగా తన ఆదాయ మార్గాలను విస్తరింపచేయడంతో శాలరీపై ఆధారపడాల్సిన అవసరం రాలేదంటోంది. అందువల్లే తనకు స్విట్జర్లాండ్కు వెళ్లినప్పుడూ కంపెనీ జీతంపై ఆధారపడలేదని అంటోంది. జస్ట్ ఒక ల్యాప్టాప్, రిమోట్ టీమ్ సరిపోయాయని చెబుతోంది. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది కేవలం ప్రమోషన్ కాదని అది ఒక నైపుణ్యం కూడా అంటూ పోస్ట్ని ముగించింది. అందుకు సంబంధించిన వీడియో తోపాటు క్యాప్షన్లో గౌర్ ఇలా రాసుకొచ్చారు. ‘ఆఫీసు లేదు.. బాస్ లేరు.. అనుమతి అంతకన్నా అవసరం లేదు’ అయినా స్విట్జర్లాండ్ హాయిగా నిద్రపోగలను అని రాసి మరి వీడియోని పోస్ట్ చేసింది. అలాగే తాను స్పెయిన్లో ఉన్నప్పుడే ఒక వ్యవస్థను రూపొందించుకున్నానని, అది తనకు నచ్చిన చోట నివశించే స్వేచ్ఛను అందించిందని తెలిపింది. నిజంగా సాధించదగిన స్వేచ్ఛ అంటే ఇదే అని చెబుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Sneh Gaur (@snehgaur_) (చదవండి: 14 ఏళ్ల వయసులో టాయిలెట్ క్లీనింగ్.. ఇప్పుడేమో మార్స్ మిషన్కు లీడర్!)
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు.
క్రైమ్
ప్రభుత్వ ఉద్యోగం రావడంతో.. భార్యకు చిత్రహింసలు..!
ఖమ్మం: అదనపు కట్నం కోసం భర్త, ఆడపడుచులు పెట్టిన శారీరక, మానసిక వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. శంభునిగూడెం గ్రామానికి చెందిన భట్టు భద్రయ్య తన కుమార్తె సుమ (25)ను 2023 మే 16న లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన వజ్జా వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.లక్ష కట్నంగా ఇచ్చారు. వివాహం అనంతరం కొద్దిరోజుల పాటు ఈ దంపతులు హైదరాబాద్లో ఉన్నారు. ఏడాది గడిచిన తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను అనుమానించడం, బంధువులతో ఫోన్ మాట్లాడినా అవమానించడం, ఎవరితోనూ మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టడం ప్రారంభించాడు. కాగా, తొమ్మిది నెలల క్రితం వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వీరిద్దరూ నాగార్జునసాగర్కు కాపురం మార్చారు. సుమకు పిల్లలు కలగకపోవడం, మరోవైపు వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అతడి కుటుంబంలో మార్పులు వచ్చాయి. భర్త వెంకటేశ్వర్లుతో పాటు అతని అక్కలు అదనంగా కట్నం తీసుకురావాలంటూ సుమను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారు. పది రోజుల క్రితం భర్త వెంకటేశ్వర్లు సుమను చిత్రహింసలకు గురిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో సుమ శంభునిగూడెంలోని పుట్టింటికి వచ్చింది. శనివారం భర్త వెంకటేశ్వర్లు, అతని అక్కలు కలిసి శంభునిగూడెంలోని సుమ పుట్టింటికి వచ్చిన, అక్రమ సంబంధం అంటకట్టి, దూషించి, విపరీతంగా కొట్టి వెళ్లిపోయారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సుమ ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి బట్టు భద్రయ్య ఫిర్యాదు మేరకు భర్త వెంకటేశ్వర్లు, ఆడ బిడ్డలు విజయ, రజిత, సుజాతలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తిరుపతి వెల్లడించారు.
వైద్యం వికటించి మహిళ మృతి
హైదరాబాద్, హయత్నగర్: వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనె తండా గ్రామానికి చెందిన మంజుల(25) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం శుక్రవారం రాత్రి హయత్నగర్లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత శనివారం వార్డుకు షిఫ్ట్ చేశారు.సాయంత్రం కడుపునొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. మంజుల మృతికి నీలాద్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. మృతురాలి తల్లి కొర్రా లక్ష్మీభాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బంజారాహిల్స్లో భారీ చోరీ.. కిలో బంగారం మాయం
బంజారాహిల్స్: ఓ ప్రైవేటు సంస్థ కార్యాలయంలో భద్రపరిచిన కిలో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఈడెన్ గార్డెన్లో ఉన్న గురుకృప ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో డైమండ్ ఫిక్సింగ్ కోసం సంస్థ లాకర్లో భద్రపరిచిన 1028.59 గ్రాముల బరువు ఉన్న 14 బంగారు ఆభరణాలు (7 నెక్లెస్లు, 7 జతల చెవిపోగులు) కనిపించలేదు. కార్యాలయంలో వాష్రూమ్ కిటికీ ధ్వంసమైనట్లు గుర్తించడంతో దుండగులు అక్కడి నుంచి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గుజరాత్ సూరత్కు చెందిన వ్యాపారి ప్రీతేష్రమణి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కవాడిగూడలో ముగ్గురు బాలికల అదృశ్యం
హైదరాబాద్: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఇన్స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన మేరకు.. చత్తీస్ఘడ్క చెందిన టోటారాం కుటుంబం ఫరీద్ బస్తీలో నివాసముంటోంది. వీరికి ఇద్దరు కూతుళ్లు సహిత కుమారి(16), స్నేహ కుమారి(14). ఇద్దరూ ఇంటివద్దే ఉంటున్నారు.ఇంటిపక్కనే ఉన్న బంధువు రోహిణి కూతురు లత (14)తో కలిసి ముగ్గురూ శనివారం హిమాయత్నగర్లో ఆటో ఎక్కొ వెళ్లి పోయారు. తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. రైలులో వెళ్లారా.. లేదా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వీడియోలు
Open AI CTO ఉదయ్ రుద్దరాజుకు YS జగన్ అభినందనలు
APలో 3 రోజులు భారీ వర్షాలు.. IMD బిగ్ అలర్ట్..!
మీరు దొరికిపోయే టైం వచ్చేసింది... పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ధరేంద్ర ప్రధాన్ రాజీనామాపై జేపీ నడ్డాతో కాక్రోచ్ నేతల భేటీ
ఢిల్లీలో హైటెన్షన్.. ధరేంద్ర ప్రధాన్ రాజీనామాకు CJP డిమాండ్
ISRO పని ఖతం..? ప్రైవేటీకరణపై బయటకు వస్తున్న సంచలన విషయాలు
బ్రేకింగ్ న్యూస్..సాయి కృష్ణ ఇంటికి సిట్ అధికారులు
అంతా కోహ్లి వల్లే.. రిటైర్మెంట్ పై తొలిసారి స్పందించిన రోహిత్
నూర్ ఫాతిమా ఆగ్రహం.. "కొంచమైనా బుద్ధుందా?"
మహిళా బట్టలు చించేస్తే ... ఈవిడిగారు ఏం మాట్లాడుతుందో చుడండి


