తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు కారు..
సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రభుత్వమే కారు, వ్యక్తిగత సహాయకుడిని కేటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం వెలువడింది. వివరాలు.. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో టీవీకేకు చెందిన 107 మంది అత్యధిక సభ్యులుగా ఉన్నారు.వీరిలో సీఎం విజయ్తో పాటూ 90 శాతం మంది తొలి సారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కిన వారే. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, వీసీకే, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ , ఎండీఎంకే ,డీఎండీకే తదితర పారీ్టలలో ఇద్దరు ముగ్గురు కొత్త వారు ఉన్నారు. ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో మెజారిటీ శాతం కొత్త వారు, తొలి సారిగా అడుగు పెట్టినవారే ఉన్నారు. వీరికి అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వాల్సిన పరిస్థితిఏర్పడింది. టీవీకే నుంచి గెలిచిన వారిలో అత్యధిక శాతం అభిమానులే. వీరి ఆస్తి పస్తులు అంతంత మాత్రమే. అప్పోసొప్పో చేసి ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీలోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీసీకే చెందిన కాట్టుమన్నార్కోయిల్ ఎమ్మెల్యే జ్యోతిమణి మాట్లాడుతూ.. సభలో చెప్పులు కూడా వేసుకోలేని నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు.. నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు సేవ చేయడానికి తమకు సొంత వాహనాలు లేవు అని, అద్దె వాహనాల్లో తిరగాల్సి వస్తున్నట్టు వివరించారు. అలాగే సహాయకుడిని పెట్టుకుని జీతం ఇచ్చే ఆర్థిక స్థోమత కూడా లేదన్నారు. అవినీతి లేని పాలన అందించాలంటే ఎమ్మెల్యేల కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేల నుండి వచ్చిన విజ్ఞప్తులను ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి తీసుకెళ్తానని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. సీఎం వద్దకు ప్రతిపాదన.. ఈ విషయంగా స్పీకర్ వినతిపత్రాన్ని సీఎం విజయ్కు పంపించారు. ఎమ్మెల్యేలు ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవ చేసేలా చూడాలనే ఉద్దేశంతో.. తొలిసారి సభలోకి అడుగుపెట్టిన శాసనసభ్యులకు కారు, అసిస్టెంట్ను కేటాయించేందుకు సీఎం విజయ్ ఆమోదం తెలిపినట్లు, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ దృష్ట్యా,కారు కూడా లేని ఎమ్మెల్యేలందెరికో వాహనాలు మరికొద్ది రోజులలో దరి చేరనున్నాయి. ఎవ్వరెవ్వరికి కార్లు లేవో, వారి వివరాలను సేకరించి కార్ల కొనుగోలుకు సంబం«ధించిన కసరత్తులపైఅ ధికారులు దృష్టి పెట్టారు.
మనిషి పెరిగితే సరిపోదు.. అచ్చెన్నకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఈ అంశంపై మండలి ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన క్రమంలో.. తనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడికి బొత్స గట్టి కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మనిషి ఎద్దులా పెరిగితే సరిపోదు.. బాష కూడా బాగుండాలి. సభలో ఎలా మాట్లాడాలో అచ్చెన్నాయుడు నేర్చుకోవాలి. తోటి సభ్యులకు గౌరవం ఇచ్చి మాట్లాడాలి. డీఎస్సీ పై చర్చ జరగాలన్నదే మా డిమాండ్. లోకేశ్ రాజీనామా చేసి.. సీబీఐతో దర్యాప్తు జరిపించాల్సిందే అని అన్నారు. ‘‘ఎద్దులా పెరిగితే తెలితేటలు రావు. మాటలు మంచిగా రావాలి. ఎరువులు లేకుండా రైతులు ఎలా చనిపోతున్నారో ఈ దద్దమ్మ వచ్చి చూస్తే తెలుస్తుంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఛైర్మన్ పరిశీలించాలి. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో చిర్రెత్తుకుపోయిన అచ్చెన్నాయుడు.. కుర్చీలోంచి లేని బొత్స వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దద్దమ్మ అనడం అన్పార్లమెంటరీనా? అంటూ అచ్చెన్న గట్టి గట్టిగా అరిచారు. క్షమాపణలు చెప్పమంటే చెబుతానని.. దానికే అంతలా రియాక్ట్ కావాలా? అంటూ బొత్సను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనగా.. చైర్మన్ మళ్లీ మండలిని వాయిదా వేశారు.అంతకు ముందు.. డీఎస్సీ అక్రమాల పై సమాధానం చెప్పలేక మంత్రులు ఎదురుదాడికి దిగారు. పదేపదే వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను కించపరిచేలా మాట్లాడారు.
బాబుకు బిగ్ షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే.. అమరావతిపై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. దీంతో, రాజధాని గ్రామాల దుస్థితి బయటకు వచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూటమి నేతలు చెబుతున్న అమరావతి అభివృద్ధి ఎలా ఉందో స్పష్టమవుతోంది.ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. అమరావతి గ్రామాల్లో ప్రజలు కనీస రహదారి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మూడు, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తోందని అసెంబ్లీలో ప్రశ్నించారు. రాజధాని గ్రామాలకు సరైన ట్రంక్ రోడ్లు, కనెక్టివిటీ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అసెంబ్లీ, సచివాలయం ఉన్న వెంకటపాలెం ప్రాంతానికి కూడా సరైన కనెక్టివిటీ లేదని తెలిపారు.పూలింగ్లో భూములు ఇచ్చిన కాలనీలకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కానీ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మాత్రం అవసరమైన సదుపాయాలు అందడం లేదని ఆరోపించారు. రాజధాని గ్రామాలకు మెరుగైన రహదారులు, తాగునీరు, కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటం సరికాదని అసెంబ్లీ వేదికగా శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.
అంట్లు తోమే స్థాయి నుంచి..రూ. 160 కోట్ల కంపెనీ నిర్మించే రేంజ్కు..!
కటిక పేదరికం అందమైన బాల్యం దూరంచేసి చదువు దారిదాపుల్లోకి రానివ్వకుండా చేసింది. కానీ అతడి ఎదుగుదలను ఆపలేకపోయింది. చదువు లేకపోయినా..బతక నేర్చిన తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి..అంట్లు తోమే స్థాయి నుంచి వ్యవస్థాపకుడిగా మారి ఏకంగా 160 కోట్లు విలువ చేసే కంపెనీని నిర్మించే స్థాయికి చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచాడు. అంతేగాదు జీవితం అన్ని ఇవ్వకపోయినా..కష్టపడి సాధించుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు అని చూపించాడు.ఆ వ్యక్తే రాజస్థాన్కు చెందిన విజయ్ వర్మ. రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లా, బిసౌ గ్రామంలో అక్టోబర్ 1978లో జన్మించిన ఆయన బాల్యం కటిక దారిద్యంలో గడించింది. అతనికి పదేళ్లు వచ్చేసరికి తాతయ్య, నానమ్మ ఇద్దరూ చనిపోయారు. ఏడాదిలోపే తండ్రి కూడా చనిపోయారు. మిగిలింది తల్లి ఒక్కత్తే..ఆమెనే ఆరుగురు పిల్లలను పోషించాల్సి ఉంది. అయితే అక్కడ మహిళలు ఎప్పుడూ పొడవాటి ఘూంఘట్లతో గడప దాటి బయటకు రావడం చాలా అరుదు. అందువల్ల నాటి సమాజ ఆంక్షలను ధిక్కరించే అవకాశం లేక అతడి తల్లి ఆరుగురు పిల్లలను పోషించేందుకు ప్రతి రోజు సూర్యోదయానికి ముందే ఇంటి వెనుక ఉన్న అడవిలోకి వెళ్లి ఎండిన ఆకులు, పేడను సేకరించి బదులుగా 30-40 కిలోల పిండిని తెచ్చుకునేదని చెప్పుకొచ్చారు విజయ్ వర్మ. ఇంతలో అన్నయ్య అమ్మకు సాయంగా ఆస్పత్రిలో రెండు రూపాయల జీతానికి కార్మికుల భోజన పెట్టెలు మోసుకెళ్లే పనిలో చేరాడని అన్నారు. అంతా బాగానే సాగుతుంది అనుకుంటుండగా..ఒక ఏడాది తర్వాత మళ్లీ చేతిలో పనుల్లు లేక ఇబ్బందిపడాల్సి వచ్చింది. అప్పుడే తమ కుటుంబానికి తెలిసిన సీతారాం భాయ్ అనే వ్యక్తి మా అన్యయ్యను ముంబై తీసుకువెళ్లి నెలకు రూ. 500లు ఇప్పిస్తానని చెప్పారు. ఆరో తరగతిలో ఉన్నా తాను ఆ మాటలు విని పట్టుబట్టి మరి అన్యయ్య తోపాటు ముంబై వెళ్లినట్లు తెలిపారు. అయితే అక్కడ మురుగు కాలువ దుర్గంధం, దోమల బెడద తట్టుకోలే నరకం చూసి, ఇంటికి వెనుదిరిగి వెళ్లిపోదాం అనుకున్న తరుణంలో పూణే వెళ్లి పరిశుభ్రమైన వాతావరణ చూడమని సలహా ఇవ్వడంతో అక్కడికి పయనమైనట్లు తెలిపారు. అయితే తమకు సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి రూ. 200లు ఇవ్వడంతో ఆ డబ్బులతో తాము రైలు ఎక్కి పూణేకి చేరుకున్నట్లు తెలిపారు. రైలు టికెట్ రూ. 20లు పోగా మిగిలినడబ్బుని ఎవరో ఎత్తుకుపోయిన ఘటన అస్సలు మరవనన్నారు. ఆ సమయంలో టాయిలెట్లు క్లీన్ చేసే ఒక అపరిచితుడు మమ్మల్ని చూసి జాలిపడి మాకు మూడు రోజులు అన్నం పెట్టి..టాయిలెట్ వాడుకునేందుఉ అనుమతించాడని అన్నారు. ఆ తర్వాత తాము అతడి వద్దే 18 రోరజు ఉండి వడా పావ్ అమ్మేవారికి గిన్నెలు కడుగుతూ రూ. 3లు సంపాదించినట్లు తెలిపారు. సరిగ్గా ఆ సమయంలోనిరాధర్ అనే రాజస్థానీ కాంట్రాక్టర్, వర్మ తనసోదరుడికి మంగళా థియేటర్లో రోజుకు రూ. 18 చొప్పున పునరుద్ధరణ పనులు చేసే పనులు అప్పగించడంతో తమ రాత మారినట్లు తెలిపాడు. అయితే విజయ్కి పనిచేసే వయసు తక్కువగా ఉండటంతో ఒక వృద్ధురాలికి ఇసుక జల్లించడంలో సాయం చేయమని చెప్పారు. అయితే ఆమె కంటే మూడు రెట్లు వేగంగా పనిచేయడంతో ఆశ్చర్యపోయిన కాంట్రాక్టర్ తనకు రోజుకు రూ. 8లు చెల్లించినట్లు తెలిపారు. ఆ తర్వాత నెలలో ఒక గదికి మారి రూ. 2లకు ఒక సైకిల్ని అద్దెకు తీసుకుని ఒక భవన నిర్మాణానికి సంబంధించి.. టైల్ ఫ్లోరింగ్ నుంచి ప్లాస్టరింగ్, ఆర్సీసీ వరకు ప్రతి అంశంలో నైపుణ్యం సాధించినట్లు తెలిపారు. ప్రతి నెల 25వ తేదీకి రూ. 90 నుంచి 170 వరకు మనీ ఆర్డర్లను పంపేవాళ్లమని అన్నారు. ఒక ఏడాది తర్వాత టిఫిన్ బాక్సులలో రూ. 65,000 నగదును దాచి మా ఊరికి వెళ్లి..మా ఇంటి వెనుకు ఉన్న పొదలను తొలగించి ఒక గోడను నిర్మించుకోగలిగామని గర్వంగా చెప్పారు.అన్నింటినీ మార్చేసిన ఆ అవకాశందానితో ధైర్యం తెచ్చుకున్న ఆ సోదరులు, సొంతంగా కాంట్రాక్టర్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు విజయ్. ఇందుకోసం తమ గ్రామం నుంచి ఆరుగురు అబ్బాయిలను శిక్షణ కోసం చేర్చుకున్నామని అన్నారు. వారు విమల్ కుమార్ జైన్ అనే ఒక ప్రసిద్ధ బిల్డర్ వద్ద పని చేయాలని ఆశపడ్డారు. మూడు నెలల పాటు, ఆ బిల్డర్ వారిని "కేవలం పిల్లలు" అని కొట్టిపారేశాడు. చివరకు విజయ్ తాము, టైలింగ్, కిచెన్ ప్లాట్ఫారమ్లు, ఆర్సిసి, ప్లాస్టరింగ్ వంటి వాటిలో తనకు నైపుణ్యం ఉందని వాదించి మరి అవకాశం ఇవ్వమని అర్థించాడు. దాంతో ఆ బిల్డర్ 15 రోజుల్లో పూర్తి చేయాల్సిన ఒక శాంపిల్ ఫ్లాట్ను కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేయాలనే అసాధ్యమైన గడువు ఇచ్చాడు, అంతేగాదు పని పూర్తి చేయకపోతే జీతం కూడా ఉండదని హెచ్చరించాడు. కానీ విజయ్ బృందం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రేయింబవళ్లు పనిచేసి మూడు రోజుల్లోనే ఆ పనినని పూర్తి చేసి ఆశ్చర్యపోయేలా చేశారు. వారి వేగం, నాణ్యత చూసి ఆ ఇంజనీర్ కాంట్రాక్టర్ ఏకంగా రూ. 5100 అందజేశారు. అదే తమనుఅన్న పేరుమీద శ్యామ్సుందర్ చీరంజీవ్లాల్జీ కన్స్ట్రక్షన్ అనే కంపెనీని పెట్టే స్ధాయికి తీసుకెళ్లిందని చెప్పుకొచ్చారు. కొద్దిమంది కార్మికులతో మొదలైన ఆ కంపెనీ..చూస్తుండగానే ఏకంగా 350 మందికి పెరిగింది.ఆ తర్వాత కాంట్రాక్టర్ నుంచి వ్యవస్థాపకుడిగా1998 నాటికి, ఆ సంస్థలో సుమారు 850 మంది కార్మికులు పనిచేసేవారు, పైగా రూ. 8 కోట్ల వార్షిక టర్నోవర్ను నమోదు చేసేదని వెల్లడించారు. అయితే ఈ సంఖ్య పెరుగుతూనే ఉండి, 2004-05 నాటికి రూ. 20 కోట్లకు చేరుకుందని చెప్పారు. ఫైవ్-స్టార్ హోటళ్ల లాబీల నుంచి ఫామ్హౌస్ల వరకు, తాము అస్సలు వెనుతిరిగి చూడలేదని తెలిపారు. ఆ తర్వాత ఆయన 2008లో,సొంతంగా సాయి విజయ్ కన్స్ట్రక్షన్ను స్థాపించి, 2011లో దానిని LLPగా లాంఛనప్రాయంగా మార్చారు. 2017లో, ఆ కంపెనీ ఆదాయపు పన్ను విచారణను కూడా ఎదుర్కొన్నప్పటికీ, ఎటువంటి నష్టం లేకుండా బయటపడిందన్నారు. తమ రికార్డులు ఎంత పకడ్బందీగా ఉండేవంటే, దర్యాప్తు అధికారులు కనీసం రూ. 5,000 వ్యత్యాసాలను కూడా కనిపెట్టలేకపోయేవారని గర్వంగా చెప్పారు. ఈనాడు, ఆ కంపెనీ విలువ సుమారు రూ. 160 కోట్లు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయనకు పూణేలో నాలుగు ఇళ్లు, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఒమన్, యెమెన్ వంటి దేశాల్లో ఏకంగా రూ. 730 కోట్ల అంతర్జాతీయ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని అన్నారు. అలాగే తన వద్ద శిక్షణ తీసుకున్న కార్మికులే కొందరు సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఆర్థికపరిస్థితుల దృష్ట్యా కోల్పోయిన చదువుని తిరిగిపోందడం కోసం..30వ ఏట ఓపెన్ స్కూలింగ్ సాయంతో పది పూర్తి చేసి, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా, పీహచ్డీ పూర్తి చేసినట్లు తెలిపారు. అంతేగాదు ఆయన ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలను చెబుతున్నారు. అరగంటగా మొదలయ్యే తన ప్రసంగాలు విద్యార్థుల ప్రోత్సాహంతో రెండు మూడు గంటల వరకు సాగుతాయని చెప్పుకొచ్చారు. అంతేగాదు విజయ్ వర్మ కుమారుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు.ఆయన చెప్పే జీవిత పాఠాలు..తనలాంటి జీవితాన్ని నిర్మించుకోవడానికి ఏం కావాలని అడిగితే, నిజాయితీ, కఠోర శ్రమ, పట్టుదల అని తడుముకోకుండా చెప్పేస్తారు. అంతేగాదు తాము ఎదిగే క్రమంలో ఒక రాత్రి పోలీసులో దాడిలో తీవ్రంగా గాయపడ్డమని అన్నారు. దాంతో తన అన్నయ ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఆ ఘటన తనకు గౌరవనీయమైన వ్యక్తులతో సత్ససంబంధాలు ఏర్పరుచుకోవడం అత్యంత ముఖ్యమని తెలిసొచ్చిందన్నారు. అంతేగాదు విజయ్ అందమైన జీవితాన్ని నిర్మించుకోవడమే కాదు, బాల్యంలో మిస్సైన అభిరుచుల వైపుకి మళ్లుతూ పియానో, మార్వాడీ జానపద గీతాలు వంటివి కూడా నేర్చుకుంటూ..తన బాల్యన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తుంటానని అన్నారు.(చదవండి: చేతితో చిత్రించిన పటచిత్ర చీరలో నీతా అంబానీ అద్భుతమైన లుక్..!)
పాక్ మాజీ క్రికెటర్కు తీవ్ర గుండెపోటు
2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్లో
విషాదం.. 36 ఏళ్ల నటి అనుమానాస్పద మృతి!
ఎల్పీజీ e-KYC డెడ్లైన్ పొడిగింపు!
బాధపడొద్దు జడ్డూ.. ఇంకా చాలా టైమ్ ఉంది: సర్ఫరాజ్
సీజేపీ రెండో దశ ఉద్యమంలో మరో భారీ ఎదురుదెబ్బ
14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటించిన బీజేపీ
భారీ అగ్నిప్రమాదం.. ఇన్కం ట్యాక్స్ భవనంలో మంటలు
జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్.. కేవలం 85 మాత్రమే!
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
సార్ మీతో తెలుగులో మాట్లాడారా ఏంటి సార్!
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్క్రిస్ట్
'ఇక అతడి రీఎంట్రీ కష్టమే.. అందరూ మర్చిపోండి'
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఫ్యామిలీ పోషణ కోసం చీర, జాకెట్ కట్టుకున్నా: నటుడు
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
సాక్షి కార్టూన్: 15-08-2026
ఉన్నవే 26 ఐమ్యాక్స్ స్క్రీన్లు.. మరి జక్కన్న ప్లానేంటి..?
బోనాల్లో పాల్గొన్నందుకు ట్రోలింగ్.. ఏడ్చేసిన తెలుగు హీరోయిన్
ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
పాక్ మాజీ క్రికెటర్కు తీవ్ర గుండెపోటు
2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్లో
విషాదం.. 36 ఏళ్ల నటి అనుమానాస్పద మృతి!
ఎల్పీజీ e-KYC డెడ్లైన్ పొడిగింపు!
బాధపడొద్దు జడ్డూ.. ఇంకా చాలా టైమ్ ఉంది: సర్ఫరాజ్
సీజేపీ రెండో దశ ఉద్యమంలో మరో భారీ ఎదురుదెబ్బ
14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటించిన బీజేపీ
భారీ అగ్నిప్రమాదం.. ఇన్కం ట్యాక్స్ భవనంలో మంటలు
జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్.. కేవలం 85 మాత్రమే!
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
సార్ మీతో తెలుగులో మాట్లాడారా ఏంటి సార్!
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్క్రిస్ట్
'ఇక అతడి రీఎంట్రీ కష్టమే.. అందరూ మర్చిపోండి'
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఫ్యామిలీ పోషణ కోసం చీర, జాకెట్ కట్టుకున్నా: నటుడు
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
సాక్షి కార్టూన్: 15-08-2026
ఉన్నవే 26 ఐమ్యాక్స్ స్క్రీన్లు.. మరి జక్కన్న ప్లానేంటి..?
బోనాల్లో పాల్గొన్నందుకు ట్రోలింగ్.. ఏడ్చేసిన తెలుగు హీరోయిన్
ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఫొటోలు
‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)
విజయవాడ : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు)
హైదరాబాద్ ఉప్పల్లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు)
పద్ధతిగా 'హిట్' సినిమా హీరోయిన్ (ఫొటోలు)
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు)
భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు)
నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు)
సినిమా
ప్రభాస్ తల్లిగా పిలుస్తుంటే ఆనందంగా ఉంది
గతంలో ‘ఇంటింటా దీపావళి’, ‘రాంబంటు’ తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ప్రముఖ నటి ఈశ్వరిరావు.. ప్రస్తుతం అగ్రతారలకు తల్లిగా విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని తొలిసారిగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్న ఆమెకు సిబ్బంది గౌరవ సంప్రదాయం ప్రకారం అంతరాలయ దర్శనం కల్పించారు.అనంతరం ఈశ్వరిరావు మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం లభించిందన్నారు. ముఖ్యంగా ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘సలార్’, ‘దర్బార్’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు దక్కడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం కథకు, పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నానని తెలిపారు.హీరోయిన్గా నటించిన రోజులను గుర్తుచేసుకున్న ఈశ్వరిరావు.. ప్రస్తుతం అగ్రహీరోలకు తల్లిగా నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నానని అన్నారు. ముఖ్యంగా ‘సలార్’ సినిమాలో ప్రభాస్కు తల్లిగా నటించిన తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు. బయటకు వెళ్లినప్పుడు అభిమానులు తనను ‘సలార్లో ప్రభాస్ తల్లి’ అని గుర్తించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరణ, అభిమానం తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని ఈశ్వరిరావు పేర్కొన్నారు. భవిష్యత్లోనూ మంచి కథలు, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను మెప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం ఎంతో ప్రశాంతమైన అనుభూతిని కలిగించిందని, స్వామివారి ఆశీస్సులతో మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకున్నట్లు తెలిపారు.శ్రీకాకుళం:
ఇరుముడి డిఫరెంట్ మూవీ.. ఆ సీన్లు మనసుల్నీ తాకుతాయి: రవితేజ
‘‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్లా ఉంటుంది. కొన్ని పాత్రలు ఆడియన్స్కు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో స్వాసికను చూస్తే భయం వేస్తుంది. నేను, నక్షత్ర కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్ని తాకుతాయి. కావేరి పాత్రలో ప్రియ చక్కగా నటించింది. మైత్రీ బేనర్లో నాకు ఇది మూడో సినిమా. భవిష్యత్లో మరిన్ని సినిమాలు చేస్తాం’’ అని రవితేజ అన్నారు. రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘మల్లెపూల పల్లకి..’ పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఓ డిఫరెంట్ సినిమాను ప్రేక్షకులు, నా అభిమానులు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. డిఫరెంట్ రవన్నను (రవితేజ) చూడబోతున్నారు (ఫ్యాన్స్ను ఉద్దేశించి). జీవీ ప్రకాశ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శివ గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను’’ అని అన్నారు. ‘‘మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. సాధారణ తండ్రి, కూతుళ్ల కథ ఇది. మన అమ్మాయిలను ఇలా చూసుకోవాలని మనకు అనిపిస్తుంది’’ అని శివ నిర్వాణ అన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘అయ్యప్ప స్వామి దీక్షతో ఉన్న ఓ భక్తుడి బ్యాక్డ్రాప్లో ఉండే థ్రిల్లింగ్ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమా బ్లాక్బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేస్తూ ఆర్ఆర్ చేయడం సవాల్గా అనిపించింది’’ అన్నారు జీవీ ప్రకాష్ కుమార్. ‘ఇరుముడి’లోని ‘మల్లెపూల పల్లకి..’ పాట పాడిన ఒరిజినల్ సింగర్ డప్పు రాంబాబు, ఒరిజినల్ కంపోజర్ సుంకర ఆంజనేయులు, లిరిసిస్ట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ చిత్రసంగీతదర్శకుడు జీవీ ప్రకాష్ ఈ పాటను రీ క్రియేట్ చేశారు.
కారులో దారి తప్పిన నటుడు మమ్ముట్టి
సాక్షి, చైన్నె : తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడిలో సినిమా షూటింగ్ ముగించుకుని కారులో కేరళకు తిరుగు ప్రయనమైన ప్రముఖ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి విచిత్ర అనుభవం ఎదురైంది. వేకువజామున దారితెలియక దాదాపు గంటసేపు ఇబ్బంది పడ్డ ఆయనకు ఒక స్థానిక యువకుడు బైక్పై 10 కిలోమీటర్లు ముందు వెళ్తూ సరైన దారి చూపి ఆదుకున్నాడు. ఈ సందర్భంగా ఆ యువకుడిని ‘నమ్మ ఫ్రెండ్’ (మా దోస్త్) అంటూ కొనియాడుతూ మమ్ముట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.గంటపాటు దారితెలియక తిప్పలు..కారైక్కుడిలో షూటింగ్ పూర్తయిన తర్వాత, ఆగస్టు 12న తెల్లవారుజామున మమ్ముట్టి కారులో మదురై మీదుగా కేరళకు బయలుదేరారు. కారైక్కుడి – మేలూర్ కోత్త ఫోర్ లేన్ రహదారిలో తిరుపత్తూర్ సమీపంలోని పట్టమంగళం వద్ద తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కారు చేరుకుంది. అక్కడ పలు రహదారులు విడిపోవడంతో మదురైకి ఏ దారిలో వెళ్లాలో తెలియక అయోమయం నెలకొంది. గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకున్నప్పటికీ సరైన మార్గం చూపించలేదు. పెట్రోల్ బంక్ సిబ్బంది చెప్పిన దారిలో వెళ్లినా సరైన రహదారి దొరక్కపోవడంతో తిరిగి కారైక్కుడికే వెళ్లిపోదామని భావించారు.దేవుడిలా వచ్చిన యువకుడుదాదాపు గంటసేపటి నుంచి ఒకే కారు అటు ఇటు తిరగడం గమనించిన పూలాంగురిచ్చికి చెందిన పాండ్యన్ అనే యువకుడు కారు వద్దకు వచ్చి ఎక్కడికి వెళ్లాలని అడిగాడు. లోపల నటుడు మమ్ముట్టి ఉండటం చూసి ఆశ్చర్యపోయిన పాండ్యన్, వెంటనే తన ద్విచక్ర వాహనాన్ని (బైక్) తీసి మదురై వెళ్లే ప్రధాన రహదారి వరకు దాదాపు 10 కిలోమీటర్లు కారుకు ముందు వెళ్తూ సరైన దారి చూపించాడు.యువకుడు పాండ్యన్ ఆనందంమొదట దారి తెలీక ఇబ్బంది పడుతుంటే సాధారణంగానే వచ్చి మాట్లాడానని అయితే, లోపల నటుడు మమ్ముట్టిని చూడగానే మాటలు రాలేదన్నారు. వెంటనే బైక్పై ముందు వెళ్తూ మదురై రోడ్డు వరకు దారి చూపించానని పేర్కొన్నాడు. తనను కౌగిలించుకుని, సోషల్ మీడియాలో అభినందిస్తూ పోస్ట్ పెట్టడం రెట్టింపు సంతోషాన్నిచ్చిందన్నారు.మమ్ముట్టి ఆనందం– సోషల్ మీడియాలో పోస్ట్సమయానికి వచ్చి దారి చూపించిన యువకుడి అభిమానానికి మురిసిపోయిన మమ్ముట్టి, కారు దిగి వచ్చి పాండ్యన్ను హత్తుకుని వీడియో తీసుకున్నారు. ఆ వీడియోలో అతడిని ‘నమ్మ ఫ్రెండ్’ అని పరిచయం చేస్తూ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
ఇష్టపడి డాక్టర్ అయ్యాను..!
మనకు జీవితంపై ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తాం. అయితే విధి అనేది ఒకటి ఉంటుంది కదా. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేదు. ఎవరు ఏమి అనుకున్నా దాని రీతిలోనే నడవాల్సి ఉంటుంది. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకు నటి ఐశ్వర్య లక్ష్మినే తీసుకుంటే. ఈమె ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ పాపులర్ కథానాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విష్ణు విశాల్కు జంటగా ఐశ్వర్య లక్ష్మి నటించిన కట్టా కుస్తీ –2 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతకు ముందు సూరి సరసన నటించిన మామన్ చిత్రం సక్సెస్ అయ్యింది. ఇకపోతే మూడు పదుల వయసు దాటినా ఈ భామ అవివాహితగానే జీవిస్తున్నారు. వివాహ బంధంపై పెద్దగా నమ్మకం లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. ఐశ్వర్య లక్ష్మి కేరళాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఎకైక సంతానం. వారు తమ కూతురు బాగా చదువుకుని డాక్టర్లు కావాలని, పెళ్లి చేసుకుని ఒక మంచి వైద్యుడిని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా జీవించాలని ఆశపడ్డారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఐశ్వర్య లక్ష్మి చదువును చాలా ఇష్టంగా మనసు పెట్టి చదువుకున్నారు. తల్లి తండ్రుల కోరిక ప్రకారమే వైద్య విద్యలో ఉత్తీర్ణురాలై, హౌస్ సర్జరీ కూడా చేశారు. దీంతో ఆమె తల్లి దండ్రులు చాలా సంతోషిచారు. అలాంటిది అనూహ్యంగా ఐశ్వర్య లక్ష్మి మోడలింగ్ రంగంలో ప్రవేశించారు. ఆ తరువాత సినీ రంగం ప్రవేశం చేశారు. ఐశ్వర్య లక్ష్మి సినిమాల్లో నటించడం ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేక పోయారు. తమ ఆశలు పూర్తిగా అడియాశలు అయ్యాయని ఎంతో బాధపడ్డారని దర్శకుడు అలెప్పి అష్రాప్ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. మనం అనుకున్నవి అన్నీ జరగవు అనడానికి నటి ఐశ్వర్య లక్ష్మి జీవితం చిన్న ఉదాహరణ అంతే.
క్రీడలు
క్రికెట్ ఫ్యాన్స్కు పండగ.. డేవిడ్ భాయ్ ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత మాజీ క్రికెట్ దిగ్గజాలను మరోసారి మైదానంలోకి తీసుకొస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్కు స్టార్ పవర్ మరింత పెరిగింది. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్లో బరిలోకి దిగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 18 వరకు జరగనుంది. అయితే టోర్నీ వేదికను ఇంకా ప్రకటించలేదు.వార్నర్తో పాటు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాటర్ ఏబీ డివిలియర్స్, వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ వంటి దిగ్గజాలు కూడ టోర్నీలో కొనసాగనున్నారు.బంగ్లాదేశ్ ఛాంపియన్స్కు కూడా చోటుWCL మూడో సీజన్లో బంగ్లాదేశ్ ఛాంపియన్స్ను కొత్తగా చేర్చనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో ఈసారి టోర్నీకి మరింత అంతర్జాతీయ రంగు రానుంది.రెండు సీజన్లు.. రెండు వేర్వేరు ఛాంపియన్లుWCL తొలి సీజన్లో ఇండియా ఛాంపియన్స్ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ను ఓడించింది.రెండో సీజన్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. ఆ ఫైనల్లోనూ పాకిస్తాన్ ఛాంపియన్స్యే ప్రత్యర్ది.ఇప్పుడు మూడో సీజన్లో వార్నర్ వంటి మరో విధ్వంసకర బ్యాటర్ చేరడంతో WCL 2026పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి టోర్నీ యూకే వెలుపల నిర్వహించనున్నట్లు WCL వ్యవస్థాపకుడు, CEO హర్షిత్ తోమర్ తెలిపారు.
ఏషియన్ గేమ్స్కు ఆఫ్ఘన్ జట్టు ప్రకటన.. రషీద్కు నో ప్లేస్
2026 ఏషియన్ గేమ్స్ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ ప్రకటించారు. జపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్న ఈ టోర్నీలో దర్విష్ రసూలీ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.ఈ జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. ఇటీవల ముగిసిన స్థానిక టోర్నీలో (షపగీజా క్రికెట్ లీగ్) రాణించిన పలువురు ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.రషీద్ ఖాన్కు చోటు లేదుఆఫ్ఘనిస్తాన్ రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ జట్టులో లేడు. స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్, ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా ఆసియా గేమ్స్కు దూరంగా ఉండనున్నారు.అయితే అనుభవజ్ఞులైన నజీబుల్లా జద్రాన్, కరీమ్ జనత్ జట్టులో కొనసాగనున్నారు. వీరి అనుభవం యువ ఆటగాళ్లకు ఉపయోగపడే అవకాశం ఉంది.షపగీజా లీగ్లో అదరగొట్టిన ఆటగాళ్లకు అవకాశంటాపార్డర్ బ్యాటర్ మొహమ్మద్ అక్రమ్ షపగీజా లీగ్లో అద్భుత ప్రదర్శనతో జట్టులో చోటు సంపాదించాడు. ఎనిమిది ఇన్నింగ్స్ల్లో అతడు 339 పరుగులు, ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేశాడు.ఆల్రౌండర్ ఇస్మత్ ఆలం కూడా లీగ్లో 294 పరుగులతో పాటు 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. అతడికి షపగీజా లీగ్ బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా లభించింది.వికెట్ కీపర్-బ్యాటర్ మొహమ్మద్ ఇషాక్, హసన్ ఈసాఖైల్, ఖాలిద్ తానివాల్, ఇమ్రాన్ మిర్ వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది.ఏషియన్ గేమ్స్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టుదర్విష్ రసూలీ (కెప్టెన్), మొహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), మొహమ్మద్ అక్రమ్, హసన్ ఈసాఖైల్, ఖాలిద్ తానివాల్, ఇమ్రాన్ మిర్, ఫైసల్ ఖాన్ షినోజాదా, నజీబుల్లా జద్రాన్, ఫర్మానుల్లా సఫీ, ఇస్మత్ ఆలం, కరీమ్ జనత్, నంగ్యాల్ ఖరోటీ, అరబ్ గుల్ మొమంద్, ఫరీదూన్ దావుద్జాయ్, అబ్దుల్లా అహ్మద్జాయ్.ఏషియన్ గేమ్స్కు ముందు ఆఫ్ఘనిస్తాన్ భారత్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ (ఢిల్లీలో) ఆడనుంది. దీంతో ఆసియా గేమ్స్కు ఎంపికైన యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం పొందే అవకాశం కూడా లభించనుంది.
IND vs SL: రెండంటే రెండే పరుగులు.. ఇదేం వ్యూహం?
గాలె వేదికగా శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఆట మొదలైన తొలి రోజు నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేయగలిగింది.పడిక్కల్ భారీ శతకంఇందులో వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ది కీలక పాత్ర. ఈ కర్ణాటక స్టార్ మొత్తంగా 230 బంతులు ఎదుర్కొని 167 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక పడిక్కల్ భారీ శతకానికి తోడు.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ (51)లతో ఆకట్టుకున్నారు.వాన వల్ల అంతరాయంమిగిలిన వారిలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 32, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 39, ఆల్రౌండర్ మానవ్ సుతార్ 24 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి రెండో రోజు ఆటకు పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది.ఇక సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా ఓవర్నైట్ స్కోరుకు కేవలం మరో రెండు పరుగులు జతచేసి.. 462 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ టీమిండియా నాయకత్వ బృందం నిర్ణయాన్ని తప్పుబట్టాడు.ఎందుకిలా చేశారు?‘‘మూడో రోజు ఉదయం ఇద్దరు టెయిలెండర్లను బ్యాటింగ్కు పంపాల్సిన అవసరం ఏముంది? మీరు ఎందుకిలా చేశారు?’’ అని హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్మన్ గిల్లను ఎక్స్ వేదికగా దొడ్డ గణేశ్ ప్రశ్నించాడు. కాగా రెండో రోజు పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా ఆట ముగిసే సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తుందని అంతా భావించారు.అయితే, మూడోరోజు ఆట ఆరంభంలో భారత టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ బ్యాటింగ్కు వచ్చి.. తమ ఓవర్నైట్ స్కోరుకు తలా ఒక పరుగు చేశారు. కుల్దీప్ 13 పరుగులతో అజేయంగా నిలవగా.. ప్రసిద్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్గా వెనుదిరిగాడు.బౌలర్లకు మరింత ఉపయోగకరంగా ఉండేదినిజానికి రెండో రోజే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఉంటే.. సోమవారం ఉదయమే లంక బ్యాటింగ్కు దిగేది. అప్పుడు పిచ్ పరిస్థితులను భారత బౌలర్లు మరింత సద్వినియోగం చేసుకునే వారని.. దొడ్డ గణేశ్ అభిప్రాయపడ్డాడు. టెయిలెండర్లతో సమయం వృథా చేయకుండా.. ముందుగానే డిక్లేర్ చేసి బాగుండేదని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. భోజన విరామ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది. భారత బౌలర్లలో సిరాజ్ ఒకటి.. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ చేశాడు.. సంతోషం
విండీస్ వీరుడి విధ్వంసం.. చివరి ఓవర్లో గట్టెక్కారు!
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో బార్బడోస్ ట్రైడెంట్స్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్పై బార్బడోస్ ట్రైడెంట్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ (31 బంతుల్లో 61; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, బ్రాండన్ కింగ్ (39), క్వింటన్ డికాక్ (38) రాణించారు. 90 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో రివాల్డో క్లార్క్ (23)తో కలిసి రూథర్ఫోర్డ్ ఇన్నింగ్స్ నడిపించాడు. నాలుగో వికెట్కు ఈ జోడి 79 పరుగులు జోడించడంతో బార్బడోస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సెంట్ లూసియా బౌలర్లలో రోస్టన్ చేజ్, షెడ్లే వాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అకీమ్ ఆగస్టీ (34 బంతుల్లో 63) సిక్సర్లతో రెచ్చిపోయినప్పటికీ లాభం లేకపోయింది. రోస్టన్ చేజ్ (34), మాథ్యూ ఫోర్డ్ (24 నాటౌట్) చివరకు వరకు అజేయంగా నిలిచినప్పటికీ లాభం లేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు పడడంతో సెయింట్ లూసియా ఛేదనలో తడబడింది. ట్రైడెంట్స్ బౌలర్లలో గుదకేశ్ మోతి 3 వికెట్లు తీయగా, ముజీబ్ ఉర్ రెహ్మన్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీ సాధించిన రూథర్ఫోర్డ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.Ruthless Rutherford has unleashed! 😮💨Back to Back fifties for Sherfane! 🇱🇨 x 🇧🇧#CPL26 #SLKvBT #CricketPlayedLouder #BiggestPartyInSport #BYD pic.twitter.com/7SJWiO3s4Z— CPL T20 (@CPL) August 17, 2026CPL 2026 - Barbados Tridents defeated Saint Lucia Kings by 9 runs 🇧🇧 [DLS]Sherfane Rutherford hammered 61 in 31 balls and named as POTM for game defining inning.🎖️Ackeem Auguste smashed 63 from 34 balls 🇱🇨 pic.twitter.com/x1o95OKsIQ— Maina Singh (@Maina_Singhx77) August 17, 2026Read: 'నమ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే'
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 347.28 పాయింట్లు లేదా 0.45 శాతం నష్టంతో 77,661.97 వద్ద.. నిఫ్టీ 76.50 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 24,289.50 వద్ద నిలిచాయి.ఐపిసిఎ లాబొరేటరీస్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. NMDC స్టీల్ లిమిటెడ్, బెల్రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీఎస్ఈ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
బరోడా బీఎన్పీ పారిబా ఎంఎఫ్ సీఈవోగా మధు నాయర్
బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ (బీబీఎన్పీఏఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా మధు నాయర్ నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి డెప్యుటేషన్పై వచ్చిన ఎండీ, సీఈవో సంజయ్ కుమార్ గ్రోవర్ స్థానంలో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. సంస్థ ఏఏయూఎం రూ. 57,000 కోట్ల పైచిలుకు స్థాయిలో ఉన్న తరుణంలో నాయర్ నియామకం.. ఫండ్ మరింత వేగవంతమైన వృద్ధి సాధించేందుకు దోహదపడగలదని బీబీఎన్పీఏఎం ఈడీ బీనా వహీద్ తెలి పారు. హెచ్ఎస్బీసీ, ఇన్వెస్కో, కోటక్ తదితర సంస్థల్లో నాయర్కి 28 ఏళ్ల అనుభవం ఉంది.
డిఫెన్స్ బలగాల కోసం బజాజ్ ‘ప్రోషీల్డ్’ వాహన బీమా
బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా రక్షణ బలగాల కోసం ప్రోషీల్డ్ పేరిట వాహన బీమాను ప్రవేశపెట్టింది. పోస్టింగ్ల మధ్య వాహనాల రీలొకేషన్ సమయంలో ఏవైనా ప్రమాదాలు తలెత్తితే పరిహారం, డ్రైవింగ్ లైసెన్స్లాంటివి పోగొట్టుకుంటే వాటిని తిరిగి సమకూర్చుకునేందుకు ఆర్థిక తోడ్పాటు, విమానాశ్రయాలకు ప్రయాణించేటప్పుడు వాహన ప్రమాదాల బారిన పడటం వల్ల ఫ్లయిట్స్ మిస్ కావడం, హోటల్ బస వ్యయాలు మొదలైన వాటికి ట్రావెల్ ఎమర్జెన్సీ ప్రొటెక్షన్ కింద రీయింబర్స్మెంట్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాల విషయంలో వివిధ రకాల స్టాండెలోన్ యాడ్–ఆన్ కవర్స్ను ఎంచుకోవాల్సిన అవసరం లేకుండా మరిన్ని కొత్త ఫీచర్లతో వీపే 2.0 పథకాన్ని కూడా సంస్థ ఆవిష్కరించింది.
బంగారం కొనాలా...ఆగాలా...
ప్రతిరోజూ కోట్ల మంది ఇవాళ గోల్డ్ రేటు ఎంత అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటారు. లక్షల మంది తమ స్నేహితులను, తెలిసినవాళ్లని, ఇప్పుడు బంగారం కొనొచ్చా...మరికొంత కాలం ఆగాలా అని ప్రశ్నిస్తుంటారు. ప్రతిరోజూ ధర ఇంకాస్త పడుతుందేమో అనిపిస్తుంది. అంతలోనే మరింత పెరిగితే అవకాశం మిస్ అవుతుందేమో అనే భయం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ సంప్రదాయం కోసం కొనేవారికి, పెట్టుబడి చేసేవారికి ఇది సాధారణంగా కలిగే సందేహం. మరి ఇప్పుడు బంగారం ధర చూసి షాక్ అవుతున్నారా... ఇంకా పెరిగేముందే కొనేయాలని ఆలోచిస్తున్నారా... అయితే సాక్షి వెల్త్ మిమ్మల్ని ఈరోజే కొనండి అని చెప్పదు. కానీ సరైన నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన విషయాలను క్లియర్గా వివరిస్తుంది. బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో ఇప్పుడే కొనాలా లేక ధర తగ్గేవరకు వేచి చూడాలా? అనే ప్రశ్న ప్రతి కొనుగోలుదారుడిని వెంటాడుతోంది.అయితే బంగారం కొనడంలో కేవలం ఈరోజు రేటుమాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, దేశీయ డిమాండ్, మేకింగ్ చార్జీలు, కొనుగోలు ఉద్దేశం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. సరైన సమయంలో సరైన అవగాహనతో బంగారం కొంటేనే అది ఆభరణంగా మాత్రమే కాకుండా భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విలువైన ఆస్తిగా మారుతుంది. 2026 ప్రారంభంలోనే వినియోగదారులకు గోల్డ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ చూపించింది. జనవరిలో దాదాపు రూ.2 లక్షల దాకా ఎగసిన బంగారం ధర అమాంతంగా చల్లబడింది. మార్చిలో 1.30 లక్షలస్థాయికి పడిపోయింది. గరిష్టం నుంచి 23 శాతం కరెక్షన్. కానీ కథ అక్కడితో ముగియలేదు.జూన్లోకూడా పతనం చూసిన పసిడి ధర ఆగస్టులో మళ్లీ పైకి పరుగు ప్రారంభించించింది. ఇదే బంగారం అసలు స్వభావం. పరుగులో ఉన్నపుడు ఆకాశమే హద్దులా కనిపిస్తుంది. పడిపోతున్నపుడు ఇంకా పతనమవుతుందేమోనని భయం పుట్టిస్తుంది. బంగారం ధర పెరుగుతున్నపుడు ఇంత ధరలో ఎలా కొనగలం అని ఆగుతాం.తగ్గుతున్నపుడు ఇంకాస్త తగ్గాక కొందాంలే అని మళ్లీ వాయిదా వేస్తాం..ఊహించినట్టే కొన్నిరోజులకు బంగారం ధర భారీగా తగ్గుతుంది. అయితే అప్పుడు మళ్లీ కొత్త అనుమానం..కొనేశాక ధర ఇంకా పడితే అని ఆందోళన కలుగుతుంది.బంగారం విషయంలో ప్రతి వినియోగదారుడు/పెట్టుబడిదారుడు ఎదుర్కొనే సమస్య ఇదే. ధర పడినపుడు భయపడినవారు. మళ్లీ పెరుగుతుంటే కూడా అదే భయంతో ఉన్నారు. ఇంకా పెరిగిపోతుందేమో అనే అంచనాలతో కొందరు కొనడానికి పరుగులు తీస్తున్నారు.కానీ పెరుగుతున్న ధరను చూసి తొందరపడడం ఎంత ప్రమాదమో భారీ కరెక్షన్ను చూసి దూరంగా ఉండడం కూడా అంతే అవివేకం. బంగారం ఒకప్పటిలా కేవలం ఆభరణం కోసమే కాదు. ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, రూపాయి కదలికలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, వడ్డీరేట్ల నిర్ణయాలతో కదిలే ఒక ఆస్తి.అందుకే ఇప్పుడు కొనాలా?అన్న ఆలోచన కంటే ఎందుకు కొంటున్నాం, ఎంత కొంటున్నాం, ఏరూపంలో కొంటున్నాం? అన్నదే అసలు ప్రశ్న. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధర నేరుగా పైకి వెళ్లడంలేదు. భారీ ర్యాలీ. తర్వాత భారీ కరెక్షన్, మళ్లీ ర్యాలీ. ఇదే దాని ప్రయాణం. అందుకే బంగారం విషయంలో అసలు ప్రశ్న ఇపుడు ధర ఎంత అని కాదు ఇప్పుడు పెట్టుబడి వ్యూహం ఏమిటి అని? ఆగస్టులో ర్యాలీ ఎందుకు ఇటీవలి బంగారం ర్యాలీకి కారణం ఒకటి కాదు. అంతర్జాతీయ మార్కెట్లు, వడ్డీరేటు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దేశాల మధ్య యుద్ధాలు , సురక్షిత పెట్టుబడికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నడిమాండ్, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ఇలా అనేక అంశాలు కలిసి బంగారాన్ని పైకి ఎగదోశాయి. అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి పెరిగినపుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సేఫ్ హెవెన్ ఆస్తిగా చూస్తారు. ఇదే సమయంలో దేశీయంగా మరో అంశం పనిచేస్తుంది. అది రూపాయి కదలికలు. డాలరుతో రూపాయి బలహీన పడినా, బలపడినా అది బంగారం ధరను ప్రభావితం చేస్తుంది. అధిక ధరల కాలంలో ఆభరాణాల డిమాండ్ ఒత్తిడికి గురైనా బార్లు, కాయిన్లు ఈటీఎఫ్లలో పెట్టుబడి డిమాండ్ బలంగానే కొనసాగుతోంది. బంగారం ఎందుకు పడింది ఇదే పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సిన కీలకపాఠం.బంగారం ఎంత బలమైన ఆస్తి అయినా అది పడదని కాదు. జనవరిలో రికార్డు స్థాయికి చేరిన తర్వాత లాభాల స్వీకరణ, మార్కెట్ అంచనాల్లో మార్పులు, డాలర్/వడ్డీరేట్ల ప్రభావం వంటి అంశాలు కలిసి బంగారం ధరపై ఒత్తిడి తెచ్చాయి. జీవితకాల గరిష్టస్థాయికి చేరిన కొన్ని వారాల్లోనే పసిడి 23 శాతం పతనమైంది.పెట్టుబడిదారులకు ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక . బంగారం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అనే నమ్మకంతో మొత్తం డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. బంగారం మళ్లీ 2 లక్షలకు పెరుగుతుంది అనో, మళ్లీ లక్షకి పడిపోతుందనో ఇలా ఏ దిశగా ఆలోచించినా ప్రమాదకరమే. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా బంగారం ధర అంచనాల్లో ఒకే లక్ష్యాన్ని చెప్పలేదు. ప్రస్తుత స్థాయి నుంచి సాధారణ పరిస్థితుల్లో సుమారు 5 శాతం అటూ ఇటూ కదిలే అవకాశముందని మాత్రమే తెలిపింది. ఆర్థిక మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, తక్కువ వడ్డీరేట్ల అంచనాలు కారణంగా బంగారంధర మరింత పైకి వెళ్లే అవకాశముందని నివేదికలో పేర్కొంది. మరోవైపు బలమైన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న బాండ్ యీల్డ్స్, ప్రశాంతమైన స్టాక్ మార్కెట్లు ఉంటే బంగారం ధర వెనక్కి రావచ్చని కూడా తెలిపింది. అంటే బంగారానికి పైకి పెరిగే కారణాలు ఎన్ని ఉన్నాయో కిందికి దిగే కారణాలు కూడా అన్నీ ఉన్నాయి.అందుకే పెట్టుబడిదారులు బంగారం ధర టార్గెట్ ఎంత? కంటే కొనుగోలు విధానం ఎలా ఉండాలి అని మాత్రమే ఆలోచించాలి.ఇప్పుడు ఏం చేయాలి?బంగారంలో పెట్టుబడి చేయాలనుకుంటే ఒక్కసారిగా మొత్తం పెట్టుబడి పెట్టొద్దు. ఉదాహరణకి మీదగ్గర రూ.5 లక్షలు ఉంటే ఒకేసారి కొనడం సరికాదు.. ఎందుకంటే ధర 10 శాతం పడితే మీ పెట్టుబడిలో రూ.50000 పోతుంది.దీంతో మానసిక ఒత్తిడి మొదలవుతుంది.అందుకే ఐదు లక్షలను ఐదు విడతలుగా లక్ష చొప్పున ధర పడినపుడల్లా కొనుగోలు చేయడం సరైన నిర్ణయం ఇలా విడతల్లో తక్కువ ధరకు కొనుగోలు చేయడం మార్కెట్ టైమింగ్ అనుసరించడం మాత్రమే కాదు..మార్కెట్ టైమింగ్ ప్రమాదాన్నికూడా తగ్గించే వ్యూహం.ఆభరణమా?పెట్టుబడా?బంగారం కొనుగోలు విషయంలో ఈ రెండిటినీ ఎప్పుడూ కలపొద్దు..బంగారం కొనేటప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే ..ఆభరణాలు కొని బంగారంలో పెట్టుబడి పెట్టినట్టే అని అనుకోవడం. ఆభరణాల ధరలో బంగారం విలువతో పాటు మేకింగ్ చార్జీలు, వేస్టేజ్, జీఎస్టీ ఇతర పన్నులు అన్ని కలిసి ఉంటాయి. విక్రయించే సమయంలో ఈ ఖర్చు తిరిగి రాదు. పెట్టుబడే లక్ష్యమైతే గోల్డ్ ఈటీఎఫ్,గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్, కాయిన్లు, బార్లు, బిస్కట్ల రూపంలో అవసరానికి అనుగుణంగా కొనే మార్గాలు పరిశీలించవచ్చు. అయితే ప్రతి ఉత్పత్తికి లిక్విడిటీ, టాక్సేషన్, ట్రాకింగ్ డిఫెరెన్స్ వంటి అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి బంగారం ఒక్కటే అయినా పెట్టుబడి ఏ రూపంలో చేస్తున్నామనేది చాలా ముఖ్యం. పెట్టుబడి పెట్టేవారికి అత్యంత ఉపయోగకరమైన వ్యూహం గరిష్టధరను ఊహించి కొనడం కాదు..ధరల హెచ్చుతగ్గులను తట్టుకునేవిధంగా పెట్టుబడిని నిర్మించడం.పెట్టుబడిదారుడి కోసం గోల్డ్ చెక్ లిస్ట్→ బంగారం ఎందుకు కొనాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి → ఆభరణం కోసమా? పెట్టుబడా? రెండిటినీ వేరు చేయాలి → మొత్తం డబ్బును ఒకేసారి పెట్టొద్దు → ధర పెరుగుతున్నపుడు ఫోమోకు లోనుకావద్దు → ధర పడుతుంటే భయంతో అమ్మొద్దు → పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో బంగారం వాటా 10 శాతం వరకు ఉండాలి → గోల్డ్ ఈటీఎఫ్/ఫిజికల్ గోల్డ్ మధ్య ఖర్చులు, లిక్విడిటీ, పన్నులు పోల్చండి → స్వల్పకాలిక ధర అంచనాలను దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంగా మార్చొద్దు.ఇప్పుడే కొనాలా?ఆభరణం కొనడం అవసరం అయితే... అంటే పెళ్లి, ఏదైనా పూజా కార్యక్రమం వంటి నిర్దిష్ట అవసరం ఉంటే తక్కువ ధరకి దొరికేవరకూ వాయిదా వేయడం కంటే అవసరాన్ని బట్టి కొనుగోలును చేయడం మంచిది. అదే పెట్టుబడి కోసమైతే ఒకే రోజు ధరను చూసి పెట్టుబడి పెట్టకుండా విడతలవారీగా చేయడం సరైన విధానం. ఇప్పటికే కుటుంబ ఆస్తిలో బంగారం ఎక్కువగా ఉంటే ఆశతో అదనంగా మళ్లీ కొనడం కన్నా అది మొత్తం ఆస్తిలో ఎంత శాతం ఉందో చూసి పెట్టుబడి చేయడం ఉత్తమం. పసిడి ర్యాలీ సమయంలో వినియోగదారులకు కలిగే ప్రమాదకరమైన భావన ఏంటంటే ఫోమో (FOMO & Fear of Missing out) అంటే ఇప్పుడు కొనకపోతే రేపు ఇంకా ఖరీదవుతుంది. అవకాశాన్ని కోల్పోతాం అనే భావన. ఈ ఆలోచనతో పెట్టుబడిలోకి దిగడం ప్రమాదకరం. బంగారం మనకు చెప్పే పెద్ద పాఠం ఇదే..ధర పెరిగినపుడు ఉత్సాహంతో పరుగెత్తి కొనద్దు, ధర పడిపోతున్నపుడు భయంతో అమ్మొద్దు.ఫైనల్ వార్నింగ్బంగారం కథ ఇంకా ముగియలేదు. బంగారం కొనేవారు ‘ఇంకా ఎంత పెరుగుతుంది?‘ అనే ప్రశ్నతో చూడడం పొరపాటు. ఎందుకంటే 2026లో అది ఇప్పటికే ఒక పాఠం నేరి్పంది. రూ. 1.35 లక్షల నుంచి 1.79 లక్షలకి పెరిగి అక్కడినుంచి వారాల వ్యవధిలోనే 1.38 లక్షలకి పతనమైంది.మళ్లీ కొన్ని నెలల్లో 1.55 లక్షలకు చేరుకుంది. అందుకే సరైన రోజున కొనడంలో కాదు ..సరైన పద్ధతిలో కొనడం ద్వారానే బంగారంలో విజయం సాధించగలుగుతాం. – సాక్షి, వెల్త్డెస్క్
ఫ్యామిలీ
ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!
ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుకు సంబంధించిన కొత్త అధ్యయనం 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైంది.ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.కలిగే లాభాలు..సాధారణంగా తక్కువ ఆంథోసయనిన్ తీసుకునేవారితో పోలిస్తే, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కనిపించాయి:గుండె జబ్బుల ప్రమాదం 26% తగ్గింది.సాధారణంగా గుండెపోటు అని పిలిచే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం 18% తక్కువగా వుంది.టైప్ 2 మధుమేహం ప్రమాదం 11% తక్కువగా కనిపించింది.గుండె సంబంధిత మరణాల ప్రమాదం 9% తక్కువఅధిక రక్తపోటు ప్రమాదం 8% తక్కువరోజుకు 50 మిల్లీగ్రాముల నుంచి ఆహారంలో ఆంథోసయనిన్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు, రక్తనాళాల పనితీరు, ఇన్సులిన్ సాంద్రతలలో మెరుగుదలలు కనిపించాయని యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షలు నివేదించాయి. ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాల ద్వారా ఈ స్థాయిని సాధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.రోజువారీ భోజనంలో సహజంగా రంగురంగుల పండ్లు , కూరగాయలను విస్తృత శ్రేణిలో చేర్చడం మొత్తం ఆహార నాణ్యతకు మద్దతు ఇస్తుంది. అమెరికా బ్లూబెర్రీలను తాజాగా, గడ్డకట్టించి లేదా ఎండబెట్టి ఆస్వాదించవచ్చు. వాటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, అల్పాహార వంటకాలు, సలాడ్లు, డెజర్ట్లు వంటి వంటకాల్లో సులభంగా చేర్చుకోవచ్చు.అంతేగాదు సులభమైన, ఆచరణీయమైన ఆహారపు మార్పులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు టైప్ 2 మధుమేహం వంటి వాటి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడతాయని ఈ కొత్త పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.
కేన్సర్ పరిశోధకురాలిగా తొలి ట్రాన్స్ జెండర్ మహిళ..!
మూడేళ్ల వయసుకే తల్లిదండ్రులను కోల్పోవడమే కాదు..తన పుట్టుక కూడా ఒక శాపంగా మారింది ఆ చిన్నారికి. తనెందుకు అందరికంటే భిన్నంగా ఉంటున్నా..తనలో ఈ మార్పు అందకానీ గందరగోళంలో సాగింది అతడి బాల్యం. తన శారీరక మార్పుని తప్పుగా చూపిస్తూ సమాజం చేత ఛీత్కారాలు, హేళనలతో బిక్కుబిక్కుమంటూ బతికాడు. కానీ కష్టాల కొలిమిలో అతడకి దారి చూపేది కేవలం చదువు మాత్రమే అని విశ్వసించి మొత్తం దృష్టి దాని మీదే పెట్టాడు. ఉన్నత చదువు కోసం విదేశాల వరకు వెళ్లి..తను అందరిలాంటి వాడిని కాదని తెలుసుకోవడమే గాక తనలాంటి వాళ్లు కూడా ఉన్నారని తెలసుకుని ఇన్నాళ్లు ముసుగులో బతికే ఆ బాలుడు కాస్త అమ్మాయిగా స్వతంగా సగర్వంగా బతకడమే కాదు తనలాంటి వాళ్లకు స్ఫూర్తిగా మారాడు.అతడే సూరి అనే ట్రాన్స్జెండర్. హర్యానాకు చెందిన సూరి మూడేళ్ల వయసుకే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అమ్మమ్మ, అత్తల చెంత పెరిగాడు. తనలోని విభిన్నమైన మార్పు తనకే అర్థంకానీ తరుణంలో సమాజం నుంచి ఎదురవ్వుతున్న చీత్కారాలకు తల్లడిల్లిపోయాడు. తానెంటో తన పరిస్థితి ఏంటో అమ్మమ్మకు, అత్తకు వివరించడంతో..బయటకు ఈ విషయ పొక్కనీయకుండా బాలుడిలానే పెంచారు. ఎన్ని హేళనలు, అవమానాలు వస్తున్నా..చదువే తన గమ్యం, లక్ష్యంగా చదవడం ప్రారంభించాడు. అలా ఉన్నత చదువులు చదివి జర్మనీలో పీహెచ్డీ చేసే స్థాయికి చేరుకున్నాడు. అది కూడా బ్రెయిన్ కేన్సర్పై పీహెచ్డీ పరిశోధన చేస్తున్న తొలి ట్రాన్స్జెండర్గా నిలిచింది. అక్కడకు వెళ్లాకే తనలాంటి ట్రాన్సజెండర్ మహిళలు ఉన్నారని తెలుసుకుని ఇది ఒక లోపం కాదని గుర్తిస్తుంది. వాళ్ల అందరిక కథలు తనలాంటివేనని తెలుసుకుని అలాంటి వాళ్ల కోసం పాటుపడుతోందామె. అప్పటి నుంచే ముసుగు తొలగించి ట్రాన్స్జెండర్ మహిళ స్వేచ్ఛగా బతకడం ప్రారంభించిందామె.(చదవండి: ప్లీజ్ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ మహిళ)
ప్లీజ్ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ మహిళ
సాధారణంగా మనకు నచ్చిన వాళ్లు లేదా మనకు బాగా పరిచయం ఉన్న పొరుగింటి వాళ్లు శాశ్వతంగా వేరోచోటికి వెళ్లిపోతున్నారంటే బాధగా అనిపిస్తుంది. అది సహజం. పైగా ఒకే దేశం, ఒకే జాతికి సులభంగా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా వెళ్లిపోతున్నప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్. కానీ దేశం కానీ దేశంలో భావోద్వేగంగా వీడ్కోలు చెప్పడం అసాధారణం. కానీ అలాంటి భావోద్వేగ సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాను విడిచివెళ్లిపోతున్న భారతీయ జంటకు వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది పొరగునే ఉండే అమెరికన్ మహిళ. ఒక్కక్షణం అది భావోద్వేగ వీడ్కోలుగా మారిపోయింది. విజయ్ కొక్కెరగడ్డ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోని పంచుకున్నారు. డెట్రాయిట్లో విమానాశ్రయానికి బయలుదేరుతుండగా ఈ దృశ్యం చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. ఆ వీడియోలో విజయ్ అమెరికాలోని తన ఇంటి బయట నిలబడి ఉండగా, పోరుగునే ఉండే అమెరికన్ మహిళ వాళ్లను పట్టుకుని భావోద్వగానికి గురవ్వుతుంది. ప్లీజ్ వెళ్లిపోకండి అని కన్నీటిపర్యంతమవుతుంది. అయితే విజయ్ నవ్వి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ వీడియో రికార్డు చేయడం గురించి విజయ్కి తెలియదట. తన స్నేహితుడు తనకి చెప్పకుండానే ఈ వీడ్కోలుని చిత్రీకరించినట్లు వెల్లడించాడు. అతనే తనకు ఈ వీడియో పంపడంతో షేర్ చేసినట్లు తెలిపాడు. ఒక రకంగా ఈ వీడియో తన వద్ద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. ఇది నిజమైన భావోద్వేగాలు, ప్రేమను చూపించిందని పేర్కొంటూ తన పోస్ట్ని ముగించాడు. నిజంగా గ్రేట్ కదూ..పరాయి దేశస్థులైనా..మనలానే వెళ్లిపోతుంటే భావోద్వేగానికి గురవ్వడం గ్రేట్ కదూ..!. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :(చదవండి: తొమ్మిది పదుల వయసులో అథ్లెటిక్గా బామ్మ..! ఆఖరికి వందేళ్ల తర్వాత కూడా..)
తల్లిపాలే.. తొలి పెట్టుబడి!
నాకు బిడ్డ పుట్టి, పది రోజులు అవుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, మొదట వచ్చే పసుపురంగు పాలను కొందరు పారేయమంటున్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలా? తల్లిపాలు బిడ్డ ఆకలి తీర్చడంతో పాటు మెదడు ఎదుగుదలకు కూడా నిజంగా అంత ఉపయోగపడతాయా?– సరస్వతి, నెల్లూరు. తల్లిపాలు కేవలం బిడ్డ ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు. బిడ్డ జీవితంలో ఆరోగ్యానికి వేసే తొలి అడుగు. ముఖ్యంగా మెదడు వికాసానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే సహజ సంపద. అందుకే తల్లిపాలను వీలైనంత త్వరగా ప్రారంభించడం ఎంతో ముఖ్యం. ఈ రోజుల్లో పిల్లల మెదడు వికాసం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం, సృజనాత్మకత గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి వీటికి పునాది పడేది బిడ్డ జీవితంలోని తొలి వెయ్యి రోజుల్లోనే. అందుకే ఆ సమయంలో సరైన పోషణ ఎంతో కీలకం. అందులో తల్లిపాలదే మొదటి స్థానం. అందుకే, తల్లిపాల గురించి, ప్రతి తల్లి గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాలు ఇవే.. పుట్టిన వెంటనే... మెదడు నిర్మాణం మొదలు!శిశువు పుట్టినప్పుడు మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదు. తొలి రెండు సంవత్సరాల్లోనే మెదడు దాదాపు 80 శాతం వరకు ఎదుగుతుంది. ప్రతి సెకనుకు లక్షలాది నాడీ సంబంధాలు ఏర్పడతాయి. ఈ అద్భుతమైన ప్రక్రియకు అవసరమైన పోషకాలు, జీవకణాలు, హార్మోన్లు, ఎదుగుదల కారకాలు... అన్నీ తల్లిపాలలో సహజంగానే లభిస్తాయి.సహజమైన మెదడు బూస్టర్!తల్లిపాలలో ఉండే డీహెచ్ఏ, ఏఆర్ఏ, కోలిన్, టారిన్, లాక్టోజ్, వివిధ ఎదుగుదల కారకాలు శిశువు మెదడు కణాల నిర్మాణానికి, నాడీ సంబంధాల ఏర్పాటుకు, జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడతాయి. అనేక అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో సగటు మేధస్సు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. భాషా నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం కూడా మెరుగవుతుంది. పాఠశాలలో విద్యా ప్రదర్శనపైనా ప్రభావం ఉండొచ్చు. కొన్ని నాడీ వికాస సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.ప్రేమతో పాలు... మెదడుకు శక్తి!తల్లిపాలు ఇస్తున్నప్పుడు తల్లి బిడ్డను హత్తుకోవడం, కళ్లల్లోకి చూస్తూ మాట్లాడటం, చిరునవ్వులు పంచుకోవడం... ఇవన్నీ తల్లి– శిశువు బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఈ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు తల్లి– బిడ్డ అనుబంధాన్ని బలపరచడమే కాకుండా, శిశువు భావోద్వేగ, సామాజిక అభివృద్ధికి కూడా పునాది వేస్తాయి. అందుకే తల్లిపాలు కేవలం పోషకాహారం కాదు... ప్రేమ, భద్రత, మెదడు వికాసం అనే మూడు వరాల కలయిక.తొలి బంగారు చుక్కలు!పుట్టిన తర్వాత వచ్చే పసుపు రంగు గాఢమైన పాలను చాలామంది పారేస్తారు. కానీ అది పెద్ద తప్పు. ఈ కోలస్ట్రం శిశువుకు తొలి టీకా లాంటిది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, శిశువు ఎదుగుదలకు అవసరమైన అనేక జీవపదార్థాలు ఉంటాయి. అందుకే మొదట వచ్చే ఆ కొద్దిపాటి పాలను కూడా వృథా చేయకండి.ఆరు నెలలు... తల్లిపాలు మాత్రమే!ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలు ప్రారంభించడం మంచిది. మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తరువాత సరైన అనుబంధ ఆహారంతో పాటు కనీసం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం మంచిది. తల్లికి అండగా... సమాజం కూడా!పని చేసే తల్లులకు పాలివ్వడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం కుటుంబం, కార్యాలయాలు, సమాజం అందరి బాధ్యత. తల్లిపాలను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కాదు... భవిష్యత్ తరాల ఆరోగ్యానికి, ఎదుగుదలకు బలమైన పునాది వేయడం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మంచి పాఠశాల, మంచి కోచింగ్, మంచి గాడ్జెట్లు ఇవ్వాలని ఎంతో ఆలోచిస్తారు. అవన్నీ వాటి స్థానంలో ముఖ్యమే. కానీ బిడ్డ జీవితంలో తొలి పెట్టుబడి మాత్రం పుట్టిన రోజునే మొదలవుతుంది. అది తల్లిపాలు. ప్రతి చుక్క తల్లిపాలు... ప్రతి బిడ్డ మెదడులో ఒక కొత్త భవిష్యత్తుకు పునాది!డా. కె.పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్
అంతర్జాతీయం
మూన్ బేస్..స్పేస్ రేస్
దశాబ్దాల కల సాకారానికి రంగం సిద్ధమైందిఆరేళ్లలో జాబిల్లిపై శాశ్వత మానవ ఆవాసం రెడీ గ్రహాంతరాళాల శోధనకు ఇదే నిచ్చెన నాసా, ఇస్రో, జాక్సా, ఈఎస్ఏలు కలిసికట్టుగా రెడీ చేస్తున్న మూన్బేస్ వింతలు విశేషాలు... అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నా సా) జాబిల్లిపై శాశ్వత నివాసం కట్టేందుకు ఉద్దేశించిన ‘మూన్ బేస్’ ప్రాజెక్టులో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భాగస్వామి కానుంది. ఈ రెండు మాత్రమే కాదు యూరోపియన్, జపాన్ అంతరిక్ష సంస్థలు చేయి కలపనున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే నాసా ఆధ్వర్యంలోని ఆర్టీమిస్–3 ప్రాజెక్టులో భాగంగా 2032 నాటికల్లా మూన్ బేస్ సిద్ధమవుతుందని అంచనా. ఈ స్థావరం ద్వారా మనకు ఒనగూరే ప్రయోజనాలు, ఏ దేశం ఏ రకంగా ఈ ప్రాజెక్టు పూర్తికి సాయపడుతుంది? అన్నది ఇక్కడ ఆసక్తికరం. 60, 70 ఏళ్లుగా శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలైతే చేస్తున్నారుగానీ భౌతికంగా చందమామను దాటి వెళ్లింది లేదు. కారణాలు అనేకం. అయితే మూన్బేస్ ఈ పరిస్థితిని మార్చేస్తుందని అంచనా. సౌర కుటుంబం మొత్తమ్మీద మనిషి నివసించేందుకు అవకాశమున్న ఏకైక గ్రహం అంగారకుడిపైకి చేరేందుకు మూన్బేస్ ఆధారం కానుంది. జాబిల్లిపై దొరికే వనరులను సద్వినియోగం చేసుకునేందుకు, తద్వారా ఎప్పటికైనా అంగారక గ్రహంపై అడుగుపెట్టాలన్నది సంకల్పం. ఇందుకు కావాల్సిన టెక్నాలజీలను పరిశీలించేందుకు మూన్బేస్ కీలకం కానుంది. ఎండ కన్ను పడని చోట... మూన్బేస్ను చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో ఏర్పాటు చేయాలని నాసా నిర్ణయించింది. సూర్యుడి వెలుతురు ఏమాత్రం సోకని ఈ ప్రాంతంలో నీటితోపాటు ఆవాసానికి తగిన ఏర్పాట్లు కొన్ని ఉన్నాయని అంచనా. ఇస్రో 2009లో జరిపిన చంద్రయాన్–1 ద్వారా జాబిల్లిపై నీటి ఉనికి నిర్ధారణ కాగా.. 2019 నాటి చంద్రయాన్–2 ద్వారా అక్కడి ఖనిజాలు, నీటి అణువుల గుర్తింపు కొనసాగుతోంది. చంద్రయాన్–2లోని అత్యాధునిక కెమెరాల పుణ్యమా అని ఇప్పుడు మనకు ఆ ప్రాంతపు అత్యంత స్పష్టమైన ఛాయాచిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్టెమిస్–3తో షురూ... 2027లో ప్రారంభమయ్యే ఆర్టెమిస్–3 ద్వారా వ్యోమగాములు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగనున్నారు. ల్యాండర్ వ్యవస్థల పరిశీలనతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. తర్వాత 2028–2030 మధ్య మానవ ఆవాసానికి సంబంధించిన మాడ్యూల్స్, విద్యుత్తు సరఫరాకు కావాల్సిన పవర్ గ్రిడ్ను ఒక్కొక్కటిగా చంద్రునిపైకి చేరుస్తారు. అవసరాల మేరకు వ్యోమగాములు, సరుకులు రవాణా అవుతూంటాయి.ఆవాస ప్రాంతాల మాడ్యూల్స్ బెలూన్ల మాదిరిగా విచ్చుకునేవిగా ఉంటాయి. వీటితోపాటు అక్కడి రేడియోధార్మికత నుంచి రక్షణ కోసం ప్రత్యేక బంకర్లు, ఆహారం పండించుకునేందుకు గ్రీన్హౌస్లు ఏర్పాటు చేస్తారు. నాలుగు కిలోమీటర్ల గొయ్యిలో... జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలోని షాకిల్టన్ క్రేటర్ వద్ద మూన్ బేస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 21 కిలోమీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల లోతు ఉండే భారీ లోయ ఈ షాకిల్టన్ క్రేటర్. అందువల్ల గొయ్యి అంచుల్లో 24 గంటలూ సూర్యరశ్మి సోకుతూ ఉంటుంది. లోపల మాత్రం ఎలాంటి వెలుతురూ ఉండదు. ఈ సహజ నిర్మాణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు నాసా క్రేటర్ అంచుల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోబోటిక్ రోవర్లు కలిగిన పవర్ గ్రిడ్ను ఏర్పాటు చేసి సౌరశక్తిని వినియోగించుకుంటారు. 2032 నాటికి సిద్ధం? ప్రాథమిక అంచనాల ప్రకారం మూన్బేస్ నిర్మాణం 2032 నాటికల్లా పూర్తి కావాలి. 2030 నాటికల్లా వ్యోమగాముల ప్రయాణాలు మొదలవుతాయని అంచనా. స్పేస్–ఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో పరిశోధనశాలలు, ఇతర వాణిజ్య ఏర్పాట్లు చేస్తారు. జాబిల్లిపై దొరికే నీరు, మట్టి నుంచి అవసరమైన ఇంధన వనరులు (హీలియం, ఆక్సిజన్ వంటివి) వెలికితీసే ఇన్–సిటు రిసోర్స్ యూటిలైజేషన్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లాలంటే భూమి పై నుంచి రాకెట్ ఇంధనాన్ని మోసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి విడిపోయినట్లు అంచనాలున్న జాబిల్లిని విస్తృతంగా అధ్యయనం చేయడం ద్వారా భూ వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం సులువు అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యేందుకు కొన్ని అంశాలు కలిసి రావాలి. మొదటిది అంతర్జాతీయ సహకారం. రెండోది ఆర్థిక వనరులు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కిలోగ్రాము బరువును జాబిల్లిపైకి చేర్చేందుకు భారీస్థాయిలో ఖర్చు అవుతుంది. అలాంటిది టన్నులకు టన్నులు అక్కడికి పంపించాలంటే అవసరమైన నిధులు సేకరించడం ఎలా అన్నది ప్రశ్న. –సాక్షి, నేషనల్ డెస్క్
800కు పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
కీవ్: ఉక్రెయిన్ సైన్యం సమారా నగరంలోని రష్యా రాకెట్, అంతరిక్ష కేంద్రంపై ఫ్లామింగో క్షిపణులతో దాడి చేసిందని అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఫ్లామింగో క్షిపణి సుమారు టన్ను పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని, తక్కువ ఎత్తులో 3,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని నివేదికలు తెలిపాయి. రష్యా యుద్ధ విమానాలకు స్థావరంగా ఉన్న సవాస్లేయ్కా సైనిక వైమానిక స్థావరంపై కూడా సైన్యం దాడి చేసిందని జెలెన్స్కీ తెలిపారు. సుదూర దాడుల్లో మంచి ఫలితాలు సాధించినట్లు ఆయన ప్రకటించారు.“మంచి విజయం. మా సరిహద్దు నుంచి దూరం సుమారు 900 కిలోమీటర్లు” అని సమారా దాడి గురించి ఆయన అన్నారు. “ఈ యుద్ధం విషయంలో రష్యాపై మా సుదూర ఆంక్షల ప్రణాళిక అమలవుతోంది. రష్యా యుద్ధ సామర్థ్యం తగ్గించడం ముఖ్యం. శాంతి అవసరం. నిర్దిష్ట స్థావరాలకు స్పష్టమైన నష్టం కలిగించడం ద్వారా ఇది రష్యాలో కనిపించాలి” అని ఆయన అన్నారు.రష్యా నౌకాశ్రయాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తున్న సమయంలో డ్రోన్ ఒకటి లాత్వియా గగనతలంలోకి ప్రవేశించడంతో శుక్రవారం నాటో యుద్ధ విమానాలను అత్యవసరంగా రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు.దీనికి స్పందనగా లిథువేనియా నుంచి 2 ఇటాలియన్ యూరోఫైటర్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఎస్టోనియాలోని ఒక స్థావరం నుంచి 2 టర్కీ ఎఫ్-16 యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించినట్లు నాటో ప్రతినిధి అల్లిసన్ హార్ట్ తెలిపారు.బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్న ఉక్రెయిన్గత 6 నెలలుగా రష్యా భూభాగంలో సుదూర దాడులు చేసేందుకు ఉక్రెయిన్ బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. చాలా దాడులు ఉక్రెయిన్ డ్రోన్లతోనే జరిగినప్పటికీ, బ్రిటిష్ డ్రోన్లు కూడా విజయవంతమైన దాడులు చేశాయని ఉక్రెయిన్ సైనిక వర్గాన్ని ఉటంకిస్తూ ది టైమ్స్ నిన్న నివేదించింది.బ్రిటిష్ డ్రోన్లు మాస్కో సమీపంలోనే కాకుండా యారోస్లావ్, వోల్గోగ్రాడ్ ప్రాంతాల్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేశాయి. బ్రిటిష్ రాయల్ నేవీ పరీక్షించిన న్యాన్ జెట్ ఇంజిన్ డ్రోన్ను రష్యా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ సరిహద్దు నగరం బెల్గొరోడ్ను లక్ష్యంగా చేసుకునేందుకు కూడా ఉపయోగించినట్లు ఆ పత్రిక తెలిపింది.
కుర్చీలో ఇరుక్కుపోయిన మెడ.. షాకింగ్ వీడియో!
బీజింగ్: చైనాలోని ఒక ఆస్పత్రిలో చోటుచేసుకున్న విచిత్ర ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలోని వెయిటింగ్ హాల్లో కుర్చీపై విశ్రాంతి తీసుకుంటున్న ఒక వ్యక్తి లేవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతని మెడ కుర్చీ ఆర్మ్రెస్ట్, బ్యాక్రెస్ట్ మధ్య భాగంలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోవడంతో, అతనికి సహాయం చేయడానికి వచ్చిన అతని స్నేహితుడు కూడా అదే రీతిలో తల దూర్చడంతో చివరకు అతని మెడ కూడా అదే కుర్చీలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొందరపాటులో మెడను బలంగా లాగడం లేదా ఇష్టానుసారంగా తిప్పడం చేయకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల నరాలకు తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. బాధితుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా, మెడనొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించాలని సూచించారు.ముఖ్యంగా, ఇతరులను రక్షించే క్రమంలో ఎలాంటి అవగాహన లేకుండా ప్రయత్నించడం ప్రమాదకరమని ఈ ఘటన నిరూపించింది. ఇలాంటి సందర్భాలలో బలవంతంగా లాగడానికి బదులుగా, శిక్షణ పొందిన నిపుణులు లేదా ఆసుపత్రి సిబ్బంది సహాయం కోరడమే అత్యంత సురక్షితమైన మార్గమని నిపుణులు తెలిపారు. కాగా ఆస్పత్రి సిబ్బంది అతి కష్టం మీద వారిద్దిరి మెడలకు కర్చీ నుంచి విడదీశారు. View this post on Instagram A post shared by 한국경제신문 (@hankyungmedia_official)ఇది కూడా చదవండి: అమితాబ్కు షాకిచ్చిన మూడడుగుల డాక్టర్ గణేశ్!
హంగరీలో ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది మృతి
హంగరీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు హంగరీలోని ఓ హైవేపై పోలాండ్కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై హంగరీ ప్రధాని పీటర్ మగ్యార్ విచారం వ్యక్తం చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. తూర్పు హంగరీలోని మెజోకెరెష్టెస్ పట్టణం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. న్యిరెగ్యాజా నగరానికి వెళ్తున్న పోలాండ్ దేశానికి చెందిన బస్సు ఎం3 మోటార్వేపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపక్కనున్న గోతిలోకి దూసుకెళ్లింది. అనంతరం అందులో బోల్తా పడింది.ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు హంగరీ ప్రభుత్వ వార్తా సంస్థ ఎంటీఐ తెలిపింది. ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు అదుపు తప్పి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
జాతీయం
ఉజ్జయినిలో తొక్కిసలాట.. 13 మందికి గాయాలు
ఉజ్జయిని: నేడు శ్రావణ మాస సోమవారం కావడంతో ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సంవత్సరానికి ఒకేసారి తెరుచుకునే నాగచంద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని హర సిద్ధి ఆలయం ఎదుట ఉన్న బారికేడింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా జనసమ్మర్ధం పెరిగింది. భక్తుల ఒత్తిడి విపరీతంగా పెరగడంతో అక్కడ స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు భక్తులు కిందపడిపోవడంతో పాటు స్పృహ కోల్పోయినట్లు సమాచారం.వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు బాధితులను జనసమ్మర్దం నుండి బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు 13 మంది భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. మహాకాళుడితో పాటు నాగచంద్రేశ్వర స్వామి ప్రత్యేక దర్శనాల కోసం ఉదయం నుంచే ఆలయ పరిసరాల్లో విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది. ఇప్పటివరకు సుమారు 5.50 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్కు బాబా రామ్దేవ్ హెచ్చరిక
హరిద్వార్: భారతీయ జనతాపార్టీకి వీర విధేయుడుగా భావించే యోగా గురు బాబా రామ్దేవ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. విద్యా, నియామక పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు రామ్దేవ్ మద్దతుగా నిలవడమేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం విశేషం. కేంద్రం త్వరగా ఈ 'ఘప్లా' ( స్కాంలను)ను సరిదిద్దకపోతే, ఈ ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చవచ్చని, ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హితవుపలికారు. లేకపోతే తాను కూడా నిరసన చేపట్టాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హరిద్వార్లోని పతంజలి యోగపీఠ్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కొరతపై విద్యార్థులు నిరసన గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియపై అవినీతి, ధనబలం ప్రభావం చూపుతున్నాయని కూడా ఆ సందర్భంగా ఆయన ఆరోపించారు.దేశంలో అంతటా గందరగోళం నెలకొని ఉంది. తమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని పిల్లలు ఫిర్యాదు చేస్తున్నారు. విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కొరవడ్డాయి. కొన్నిచోట్ల మోసాలు విచ్చలవిడిగా జరుగుతుండగా, మరికొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూలలో అవినీతి 99 శాతం వరకు ఉంది. కుల, మత ప్రాతిపదికన ఎంపికలు జరుగుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం, అత్యంత అభ్యంతరకరమైనదని రామ్దేవ్ మండిపడ్డారు.వారికి సిగ్గుండాలిభారత పౌరులమని చెప్పుకుంటూనే, రాజకీయ కారణాలతో లేదా కులం పేరుతో ఒకరిపై ఒకరు ద్వేషం, కక్ష పెంచుకునే వారిని ఖండిస్తున్నా అన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, దళితులు, ఆదివాసీలు, అటవీ ప్రాంత వాసులు, అలాగే హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు... ఇలా ఒకరి రక్తం కోసం మరొకరు తహతహలాడుతున్నట్లుగా, పరస్పర శత్రుభావంతో నిలబడటం ఎంత దారుణంమని ఆవేదన వ్యక్తంచేశారు.ఒకవైపు 'సత్యమేవ జయతే', 'యతో ధర్మస్తాతో జయః' అని బోధిస్తూనే, మరోవైపు కోటి రూపాయల లంచం తీసుకున్న తర్వాతే నియామకాలు జరుగుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అందరూ నిరసనలు ప్రారంభిస్తే దేశం ఎలా నడుస్తుంది? అందుకే, ఇకనైనా పద్ధతులను మార్చుకోండి; లేకపోతే, ఆందోళన మరింత తీవ్రమవుతుందని మోదీ సర్కార్ను హెచ్చరించారు.అలాగే నిరసనలు హింసాత్మకంగా కాకుండా, రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని చెబుతూ, హింసకు, అరాచకానికి దూరంగా ఉండాలని జెన్ జెడ్ నిరసనకారులను రామ్దేవ్ కోరారు. స్కాములు జరుగుతున్నాయనేది కాదనలేని సత్యమన్నారు. భారతీయుల మధ్య పెరుగుతున్న శత్రుత్వాన్ని కూడా రామ్దేవ్ ఖండించారు. వివిధ కులాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడటం ప్రారంభించారని ఆయన అన్నారు. యువత తమ హక్కుల కోసం పోరాడేటప్పుడు చట్టాన్ని, రాజ్యాంగాన్ని అనుసరించాలని, హింసను విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా 2011లో ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో తాను చేసిన అవినీతి వ్యతిరేక నిరసనను ఆ యోగా గురువు ప్రస్తావించారు. ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
విద్యార్థుల ఆందోళనల వేళ సీఎం సోరెన్కు రాహుల్ లేఖ
సాక్షి, ఢిల్లీ: జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు లేఖ రాశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సీఎం స్వయంగా మాట్లాడాలని ఆయన సూచించారు. అలాగే, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక పరీక్షల్లో అక్రమాలు, విద్యా వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. దీంతో, రాహుల్ లేఖపై చర్చ నడుస్తోంది.లేఖలో భాగంగా.. రాజ్యాంగం కల్పించిన శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని రాహుల్ గాంధీ అన్నారు. జార్ఖండ్ రాష్ట్ర రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు, వారి డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారు. విద్యార్థులతో ప్రభుత్వం కమిటీ ద్వారా చర్చలు ప్రారంభించడం, వారి కొన్ని డిమాండ్లను అంగీకరించడం అభినందనీయమని రాహుల్ కొనియాడారు. అయితే కొందరు విద్యార్థులు ఇంకా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు.విద్యా వ్యవస్థపై బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు..భారతీయ విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ ఆధీనంలోకి తీసుకుని.. విద్యార్థుల శ్రమను దోచుకునే సాధనంగా మార్చాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరింత సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను వినాలని, వారి డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
జార్ఖండ్లో విద్యార్థుల విజయం: 14వ జేపీఎస్సీ పరీక్ష రద్దు!
రాంచీ: రాంచీలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల భారీ ఆందోళనల నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులతో జరిపిన రెండు విడతల చర్చలు విజయవంతం కావడంతో, 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయడానికి హేమంత్ సోరెన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ మంత్రి దీపికా పాండే వెల్లడించారు.రాంచీలో నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులతో చర్చల అనంతరం మీడియాతో మంత్రి దీపికా పాండే మాట్లాడుతూ.. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందులో భాగంగా 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయడంతో పాటు, టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలు, జేఎస్ఎస్సీ-సీజీఎల్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన సీఐడీతో సమగ్ర విచారణ జరిపించనున్నట్లు స్పష్టం చేశారు. అవసరమైతే ఈ దర్యాప్తు కోసం ఈడీని కూడా సంప్రదిస్తామని పేర్కొన్నారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం గతంలో విడుదలైన ఫలితాలు, నియామక పత్రాల విషయంలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకున్నారు. సీఐడీ దర్యాప్తును ఒక ప్రత్యేక న్యాయ కమిటీ పర్యవేక్షిస్తుందని, రాబోయే 90 రోజుల్లోగా ఈ విచారణను పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆశ్రయించి బాధితులకు త్వరగా న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పేపర్ లీక్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఎన్ఆర్ఐ
డల్లాస్లో ఘనంగా ఎస్ జానకి సంగీత నివాళి కార్యక్రమం
టెక్సస్: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అపూర్వమైన గానమాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఎస్ జానకి (జానకమ్మ) గారికి సంగీత నివాళిగా శనివారం డల్లాస్లోని తెలుగు కళాభిమానులు ఒక అద్భుతమైన సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.DGIT (Dallas Got India Talent) వ్యవస్థాపకుడు రామన్ వీరంరాజు నాయకత్వంలో, కళావాహిని వ్యవస్థాపకుడు అనంత్ మల్లవరపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం శుభమ్ ఈవెంట్ సెంటర్ – A2B, ఫ్రిస్కోలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాఖ్యాత పరిమళ మార్పాక జానకి గారి సంగీత ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు, ప్రతి గీతానికి ఇచ్చిన చక్కని పరిచయాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి.డల్లాస్ మెట్రోప్లెక్స్లోని పలువురు ప్రతిభావంతులైన గాయనీ, గాయకులు జానకి గారు ఆలపించిన అజరామరమైన గీతాలతో ఆమెకు సంగీతాంజలి ఘటించారు. ప్రేమ, భక్తి, శృంగారం, జానపదం, భావోద్వేగం వంటి విభిన్న భావాలను ప్రతిబింబించే ఆమె చిరస్మరణీయ గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రతి గీతం ముగిసినప్పుడల్లా సభాభవనం కరతాళ ధ్వనులతో మార్మోగింది.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ గాయనిగా శిష్ట్లా జానకి గారి విశిష్ట లక్షణాలను ఒకసారి పరిశీలిస్తే – భావ వ్యక్తీకరణ - పాటలోని ఆనందం, బాధ, ప్రేమ, భక్తి, కోపం, అమాయకత్వం ఇలా ఏ భావాన్నైనా ఆమె గాత్రంలో సహజంగా పలికించగల్గడం; గాత్ర వైవిధ్యం - హాస్యపాత్రల స్వరం, రెండేళ్ళ పసిపాప నుంచి, తొంబై ఏళ్ల వృద్ధురాలి వరకూ ఏ స్వరాన్నైనా అద్భుతంగా పలికించగల అరుదైన సామర్థ్యం; భాషలపై పట్టు - ఏ భాషలో పాట పాడినా, ఆ భాషకు చెందిన వ్యక్తే పాడుతున్నారేమో అనిపించేంత స్పష్టమైన ఉచ్చారణతో పాడడానికి నిరంతర సాధన; సంగీతదర్శకుల అభిరుచికి అనుగుణంగా - శాస్త్రీయ గీతాలు, జానపద గీతాలు, ప్రేమగీతాలు, భక్తిగీతాలు, వేగవంతమైన నృత్యగీతాలు ఇలా ఎలాంటి పాటనైనా సమాన ప్రతిభతో పాడే నైపుణ్యం; వినయం - ఎన్నో వేల పాటలు పాడి, అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నప్పటికీ, తాను నిత్య విద్యార్ధినేనంటూ ఎంతో నిరాడంబరంగా జీవించిన పుణ్యజీవి అన్నారు. 6 దశాబ్దాలపాటు 15 రకాల వివిధ భాషల్లో 50,000 కు పైగా పాటలగా సాగిన గాయనీమణి జానకి గారి గాత్ర జైత్రయాత్ర అజరామరం అంటూ ఘన నివాళులర్పించారు.” డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఎస్. జానకి గారి గానం భారతీయ సంగీతానికి ఒక అపూర్వమైన వరమని, ఆమె పాటలు యుగయుగాల పాటు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయని కొనియాడారు.ఈ సందర్భంగా నిర్వాహకులు రామన్ వీరంరాజు మరియు అనంత్ మల్లవరపు మాట్లాడుతూ - విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరాలకు మన సంగీత, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా భారతీయ కళలను ప్రోత్సహించే మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.అందమైన వేదిక అలంకరణ, అద్భుతమైన సంగీత బృందం, స్థానిక గాయనీ, గాయకుల ప్రతిభ, పరిమళ మార్పాక చక్కని వ్యాఖ్యానం, ప్రేరణాత్మక సందేశాలు, అలాగే బాల గణపవరపు అందించిన నాణ్యమైన ఆడియో సపోర్ట్ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశాయి. కార్యక్రమం ముగింపులో ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో గానకోకిల ఎస్. జానకి గారికి తమ సంగీత ప్రణామాలర్పించారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ విశాలమైన వేదికను అందించడమే కాకుండా, విచ్చేసిన అతిథులు మరియు ప్రేక్షకులకు ఆతిథ్యపూర్వకంగా రుచికరమైన అల్పాహారం అందించి కార్యక్రమ విజయానికి విశేషంగా సహకరించినందుకు A2B (Adyar Anand Bhavan) యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.DGIT (Dallas Got India Talent) మరియు కళావాహిని సంయుక్తంగా నిర్వహించిన ఈ సంగీత నివాళి కార్యక్రమం డల్లాస్ తెలుగు సాంస్కృతిక వేదికపై చిరస్మరణీయమైన సంగీత సంధ్యగా నిలిచి, జానకమ్మ ఆలపించిన అజరామరమైన గీతాల ద్వారా ఆమెకు ఘనమైన సంగీతాంజలి అర్పించిన ఒక విశిష్ట సాంస్కృతిక వేడుకగా చరిత్రలో నిలిచిపోనుంది.
తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) /TCSS యొక్క పదమూడో వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2వ తేదీన స్థానిక కుర్తాళం బోర్డర్, లిటిల్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 65-70 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో ముందుగా పన్నెండో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2025-2026 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు సమ్మయ్య మోలుగూరి, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ పూర్వ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల,కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మోడరేటర్ ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన నీలం సుఖేందర్ గార్లకు కృతజ్ణతలు తెలియజేశారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రస్తుత పదవీకాల అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన నల్ల భాస్కర్ గుప్త, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లు ప్రకటించారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు నల్ల భాస్కర్ తెలిపారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ సారి ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. దీని తోపాటు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి, శ్రీధర్ బండారు గార్లను ప్రకటించి ఎన్నుకోవడం జరిగింది.నూతన కార్యవర్గం కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు నల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్య, సరావేణి విజయ కుమార్ ఉన్నట్టు తెలిపారు.మాజీ అధ్యక్షుడు రమేష్ బాబు గడప, తన పదవీకాలంలో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన అసాధారణ, అద్భుతమైన సేవలను ఏవి (AV) రూపంలో ప్రదర్శించి కార్యనిర్వాహక సభ్యులందరూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. గత పన్నెండు సంవత్సరాలుగా రమేష్ బాబు గడప అందించిన సేవలను పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, నీలం మహేందర్ గార్లు ఘనంగా కొనియాడారు. గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో భాగమై రెండు సార్లు అధ్యక్షుడిగా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ సేవలందించిన దుర్గా ప్రసాద్, సుగుణాకర్ రెడ్డి గార్లకు కార్యనిర్వాహక సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి కార్యనిర్వాహక సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీని ఆస్వాదించారు.(చదవండి: అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్)
హైదరాబాద్కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్
సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు.
క్రైమ్
ఎస్బీఐ ఉద్యోగి అనుమానాస్పద మృతి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం రీజనల్ మేనేజర్గా పనిచేసిన తోటకూర రమణమూర్తి రాజు చేసిన మోసాలకు మరొకరు బలి అయ్యారు. 2023లో గార ఎస్బీఐ మేనేజర్ ఉరిటి స్వప్నప్రియ బలవన్మరణం చెందగా, తాజాగా మరో బాధితుడు నరసన్నపేట మాజీ బ్రాంచి మేనేజర్ శ్రీకర్ ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆర్ఎం చేసిన పాపాలకు ఇప్పటికే ఎంతో మంది బలయ్యారు. బయటికి వచ్చినవి కొన్ని కాగా, వెలుగు చూడనివి మరెన్నో. ఆర్ఎంగా రాజు పనిచేసిన హయాంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రతిష్ట మసకబారడమే కాకుండా ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు సైతం ఇరుక్కున్నారు. గార కేసులో స్వప్నప్రియ బలవన్మరణం.. గార ఎస్బీఐలో తనఖా బంగారం మిస్సింగ్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాటి అక్రమాలు ఆర్ఎం కనుసన్నల్లో జరిగాయన్న వాదనలు ఉన్నాయి. అయినప్పటికీ, బ్యాంకు ఉద్యోగిని స్వప్నప్రియపైనే పూర్తిగా నెట్టేశారు. ఆ అవమానం భరించలేక 2023 నవంబర్ 28న స్వప్నప్రియ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ 29న మరణించింది. నాటి ఆర్ఎం రాజు నవంబర్ 30వ తేదీన 86 సంచుల తనఖా బంగారం పోయాయంటూ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు డిసెంబరు 7న ఏడుగురిని అరెస్టు చేయగా ప్రథమ ముద్దాయిగా ఆత్మహత్య చేసుకున్న స్వప్నప్రియను చేర్చారు. మరో ఉద్యోగి క్యాషియర్తో కలిసి మొత్తం తొమ్మిది మంది నిందితులుగా డిసెంబరు 9న పోలీసులు గుర్తించారు. వాస్తవంగా ఆ ఏడాది సెపె్టంబర్లోనే సెంట్రల్ ఆడిట్ జరిగింది. అందులో ఎటువంటి తేడాలేనట్లు చూపించారు. పోలీసుల విచారణలో మాత్రం 14 నెలలుగా స్వప్నప్రియ ద్వారా ఈ తతంగం జరిగినట్లు చెప్పారు. దీన్నిబట్టి అక్కడ ఏం గోల్మాల్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. క్యాషియర్ సురేష్పై స్వప్నప్రియకు సంబంధించిన వారే దాడి చేశారంటూ అంతకుముందే గార పీఎస్లో కేసు నమోదు చేయడం.. అది ఫేక్ అని తేలడం జరిగాయి. ఇలా గార తాకట్టు బంగారం మిస్సింగ్ కేసులో ఎంతో మంది ఇరుక్కుపోయారు. దాని వెనక ఆర్ఎం పాత్ర ఉందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. నరసన్నపేట బ్రాంచిలో.. శ్రీకాకుళం ఆర్ఎంగా రాజు పనిచేసిన కాలంలో నరసన్నపేటలో మరో అవినీతి చోటు చేసుకుంది. బినామీ పేర్లతో కొంతమంది పర్సనల్ లోన్లు తీసుకుని రూ.3 కోట్ల వరకు టోకరా వేశారు. వ్యక్తిగత రుణాల కోసం ఉద్యోగులు దరఖాస్తులు చేస్తే.. వాటికి అర్హత లేదని వెనక్కి పంపించేసి, ఆ దరఖాస్తులను, ఉద్యోగులు సమర్పించిన శాలరీ సరి్టఫికెట్లు, మిగిలిన డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని, బ్యాంకు సిబ్బందే లోన్లు తీసేసుకున్నారు. దీంట్లో అప్పట్లో మేనేజర్గా పనిచేసిన శ్రీకర్ను బలి చేశారు. ఆ రూ.3కోట్లు చెల్లించేస్తే కేసుల ఉండవని, లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని భయపెట్టారు. వాస్తవంగా రుణాల మంజూరనేది రీజనల్ మేనేజర్ సంతకం లేకుండా కుదరదు. ఫీల్డ్ ఆఫీసర్ పరిశీలించి రుణం ఇవ్వొచ్చని నిర్ధారించిన తర్వాత రీజినల్ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయడమే బ్రాంచి మేనేజర్ పని. అక్కడ ఓకే చేస్తే రుణం సంబంధిత అకౌంట్లో జమైపోతుంది. కానీ, ఈ మొత్తం వ్యవహారాన్ని బ్రాంచి మేనేజర్ శ్రీకర్ పైకే నెట్టేసి, ఆయన ద్వారా సుమారు రూ.60లక్షలు కట్టించినట్టు వాదనలు ఉన్నాయి. అప్పట్లో శ్రీకర్ ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్న వార్తలు గుప్పుమన్నాయి. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. నరసన్నపేట బ్రాంచిలో ఘటన జరిగిన దగ్గరి నుంచి తీవ్ర మనస్థాపంతో శ్రీకర్ ఉన్నారని బ్యాంకు వర్గాలు చెప్పుకుంటున్నాయి. తాజాగా భీమిలి బీచ్ రోడ్డులోని తిమ్మాపురం తీరంలో అనుమానాస్పదంగా మృతిచెందారు. ఏ–10గా ఆర్ఎం రాజు సుదీర్ఘ విచారణ, స్వప్నప్రియ సోదరుడు కిరణ్ న్యాయపరమైన పోరాటం చేయడంతో పోలీసులు కూడా ఆర్ఎం తోటకూర రమణమూర్తి రాజును ఆలస్యంగానైనా నిందితుడిగా చేర్చక తప్పలేదు. న్యాయం జరిగేవరకు వదలనని కిరణ్ పోరాటం చేయడంతో ఆ కేసులో ఏ–10గా చేర్చారు. ఆ మేరకు కిరణ్కు సమాచారం అందించారు. ఆర్ఎం రాజుపై చర్యలు తీసుకోవాలని స్వప్నప్రియ తల్లి ఏకంగా నిరసనకు కూడా దిగారు. అటు ఎస్పీ, ఇటు జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించడంతో కేసు మూసివేయలేదు. ఇప్పుడా కేసులో ఎ–10గా రాజును చేర్చారు. విచిత్రమేమిటంటే బ్యాంకు అధికారులు చేసిన పాపానికి గార ఎస్బీఐలో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారుల కష్టాలు నేటికీ తీరడం లేదు. అటు ఉద్యోగులే కాదు ఇటు ఖాతాదారులు కూడా నలిగిపోయిన పరిస్థితి చోటు చేసుకుంది.
దారుణం : హనీమూన్లో పీరియడ్స్ వచ్చాయని..!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. వివాహమైన నెల రోజులకే హనీమూన్ సమయంలోనెలసరి వచ్చిందన్న ఆగ్రహంతో తన భర్త తనపై దాడిచేయడంతోపాటు గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆరోపించిన కేసు కలకలం రేపుతోంది.యూపీలోని రామ్ఘర్తాల్ ప్రాంతానికి చెందిన సదరు మహిళ తన ఫిర్యాదులో, ఢిల్లీకి చెందిన తన భర్త నిఖిల్ మిశ్రాపై కేసు నమోదు చేసింది.ఈ ఫిర్యాదు ప్రకారం 2023 మే 30న ఢిల్లీకి చెందిన నిఖిల్ మిశ్రాతో ఈమెకు వివాహమైంది. ఆ తర్వాత జూలై 4న హనీమూన్ కోసం అండమాన్ వెళ్లారు. అక్కడికి వెళ్లాక తీవ్రమైన కడుపునొప్పి, పీరియడ్స్ వచ్చాయి. అధిక రక్తస్రావం జరిగింది. దీంతో రుతుక్రమం గురించి తనకు ముందుగానే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తూ భర్త తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది. అలాగే గొంతు నులమడానికి ప్రయత్నించాడని కూడా చెప్పింది. ఆమెకు రుతుక్రమం (పీరియడ్స్) రావడంతో ఆగ్రహానికి గురైన భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొంది. చివరికి హోటల్ సిబ్బంది ఆమె కేకలు విని రక్షించినట్లు బాధితురాలు తెలిపింది.కట్నం కోసం వేధింపులు పెళ్లిలో కట్నంకోసం వేధించారని కూడా ఫిర్యాదు చేసింది. రూ. 20 లక్షల నగదు, ఒక కారు, రూ. 40 లక్షల విలువైన వస్తువులు కట్నంగా ఇచ్చినప్పటికీ, బ్రాండెడ్ వస్తువులు తీసుకురాలేదని అత్త, ఆడపడుచు మానసికంగా వేధించారని తెలిపింది. అంతేకాదు పెళ్లయిన 45 రోజులకే (జూలై 14, 2023) ఆమెను అత్తవారింటి నుంచి వెళ్లగొట్టారు. సమస్యను పరిష్కరించడానికి వచ్చిన ఆమె తండ్రిని కూడా అవమానించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. ఇప్పటికీ కట్నంగా ఇచ్చిన వస్తువులను తిరిగి ఇవ్వలేదని, తన భర్త ఇంకా తనకు బెదిరింపు సందేశాలు పంపుతూనే ఉన్నాడని కూడా ఆమె ఆరోపించింది.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనంమొత్తానికి గోరఖ్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కౌస్తుభ్ జోక్యంతో ఎట్టకేలకు ఆగస్టు 15న భర్త, అత్త మరియు ఆడపడుచుపై FIR నమోదు చేశారు. మిశ్రా, అతని తల్లి సంజు మిశ్రా సోదరి నేహా పాండేలపై సదరు మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 15న ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు రామ్ఘర్తాల్ ఎస్హెచ్ఓ శ్యామ నంద్ రాయ్ తెలిపారు. విచారణలో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్కు బాబా రామ్దేవ్ హెచ్చరిక
రోడ్డు బాలేదు.. బిడ్డ దక్కలేదు
సోంపేట: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని సోంపేట మండలం గొల్లవూరు పంచాయతీ దామోదరపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర రక్తస్రావానికి గురై బిడ్డను కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలివీ.. వ్యాపారరీత్యా భువనేశ్వర్లో ఉంటున్న యజ్జల లోలాక్షి కుటుంబం శుక్రవారం ఏరినమ్మ పూజ నిమిత్తం స్వగ్రామం దామోదరపురం వచ్చారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో గర్భిణి లోలాక్షి తీవ్ర ఇబ్బందులుపడి ఇంటికి చేరుకుంది. అప్పటికే రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలకు ఫోన్చేయగా అధ్వాన రోడ్డు కారణంగా వాహనాలు పాడైపోతున్నాయని, తాము రాలేమని చెప్పారు. చివరికి ఓ వ్యక్తిని అతికష్టంమ్మీద ఒప్పించి సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల సూచనతో అక్కడ నుంచి బరంపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ తల్లీబిడ్డ అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం.. బిడ్డ ప్రాణాలు పోయాయని, తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బాధిత తల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో కనీసం అంబులెన్స్ వాహనం కూడా రాని దుస్థితిలో రోడ్డు ఉన్నందున, ఈ మృతిని ప్రభుత్వ హత్యగా పరిగణనలోకి తీసుకుని బాధితులకు తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తారాపీఠ్లో ఘోర ప్రమాదం.. భక్తుల సజీవ దహనం
పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లా తారాపీఠ్లోని ఓ లాడ్జిలో భారీగా మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో మరికొందరు చిక్కుకుని ఉండడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. వీళ్లంతా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులుగా తెలుస్తోంది.తారాపీఠ్(Tarapith) ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా పేరొందింది. ఇక్కడి తారా దేవి ఆలయాన్ని శక్తి ఆరాధనకు సంబంధించిన ముఖ్యమైన పీఠాల్లో ఒకటిగా భక్తులు భావిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తారాపీఠ్కు దర్శనం కోసం వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసం, ప్రత్యేక పూజల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం పరిసర ప్రాంతాల్లో అనేక హోటళ్లు, లాడ్జీలు అందుబాటులో ఉంటాయి.సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో లాడ్జిలో ఒక్కసారిగా మంటలు(Tarapith Fire Accident) చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హోటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు.తారాపీఠ్కు పోటెత్తిన భక్తులు..శ్రావణ మాసం సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తారాపీఠ్కు చేరుకున్నారు. వీరిలో పలువురు సమీపంలోని హోటళ్లలో బస చేశారు. ఇదే క్రమంలో అగ్నిప్రమాదానికి గురైన హోటల్లో కూడా భక్తులు ఉన్నట్లు సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కొందరు బయటకు వచ్చే అవకాశం లేక సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదానికి కారణం..?హోటల్లో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదంటే ఇతర కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, మృతుల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
వీడియోలు
అచ్చెన్నాయుడికి ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిన MLC అరుణ్ కుమార్
సాక్షాలతో నేను బయటపెడతా! వాళ్ళ వెనుక బడా రాజకీయ నాయకులు ఉన్నారు...
మీ నాయకుడు ఇదే నేర్పాడా బోండా ఉమా నీకు... ఏకిపారేసిన నాగమల్లేశ్వరి
బెల్జియం లో మరణమృదంగం వేడికి చచ్చిపోతున్న జనాలు
ఐఫోన్ 18 ప్రో.. అప్డేట్ అదిరింది కొత్త వెర్షన్ ఫీచర్స్ ఇవే..
బెయిల్ ఇచ్చిన జడ్జికి బాబు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
ఒకటి కాదు.. రెండు కాదు గ్రామంలో ఎగబడ్డ వందలాది కోతులు
సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా
రూపారెడ్డి కేసులో కొనసాగుతున్న సస్పెన్స్
DSC అక్రమాలపై అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా బుక్కైన లోకేష్


