ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం.. వైఎస్ జగన్ హయాంలోనే 'ఆరోగ్య భాగ్యం'
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రాథమిక స్థాయి నుంచి సమూలంగా సంస్కరించారని ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రశంసించింది. విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్తో పాటు తొలిసారిగా వినూత్న రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయడం గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేసిందని విశ్లేషించింది. టెలి మెడిసిన్ ద్వారా గత ప్రభుత్వంలో ప్రజలకు భారీ ఎత్తున సేవలు అందాయని తెలిపింది. ఇక వైద్య ఆరోగ్య వ్యవస్థలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేస్తూ రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య సిబ్బందిని నియమించారని పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ది ప్రభుత్వ రంగం బాట అయితే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ రంగం బాట అని ప్రపంచ బ్యాంకు నివేదిక కుండబద్దలు కొట్టింది. వైద్య కళాశాలలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి వాటిని నడపడం కోసం చంద్రబాబు సర్కారు ప్రైవేట్ రంగం, అవుట్ సోర్సింగ్పై ఆధారపడటం ప్రారంభించిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రాజెక్టును అమలు చేసింది. ఆ ప్రాజెక్టు అమలు ఫలితాల నివేదికను ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసింది. వైద్య ఆరోగ్య రంగంలో సేవలపై వైఎస్ జగన్ విధానాలు, చంద్రబాబు సర్కారు పోకడలపై ఈ నివేదికలో ప్రపంచ బ్యాంకు పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. ఆ వివరాలివీ...⇒ ప్రపంచ బ్యాంకు నుంచి ప్రాజెక్టు ఆమోదం పొందిన వెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేట్ రంగ కాంట్రాక్టులపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగంలో వైద్య సేవల నాణ్యత మెరుగుదల, ఆరోగ్య సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు లక్ష్యాలను సాధించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసింది. ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడంతో పాటు అగ్ర రాజకీయ నాయకత్వం ప్రాజెక్టుకు స్పష్టమైన ప్రాధాన్యత ఇచ్చింది. నిరంతర పర్యవేక్షణ, క్రమం తప్పకుండా సమీక్షలు ఫలితాల సాధనకు దోహదం చేశాయి. తద్వారా ప్రభుత్వ రంగంలోనే మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాన్ని సాధించింది.⇒ వైద్య ఆరోగ్య రంగంలో దీర్ఘకాలంగా అనుసరిస్తున్న మూస విధానాలను పక్కనపెట్టి మాజీ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకు మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యత అనే లక్ష్యాలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో ‘సున్నా ఖాళీల విధానం’ (జీరో వేకెన్సీ) పాలసీని అమలు చేశారు. సిబ్బంది నియామకాలను హేతుబద్ధీకరించారు. అడ్డంకులను తొలగించి భారీ నియామక కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రోత్సాహకాలు, పదోన్నతులు కల్పించారు. మారుమూల ప్రాంతాలలో పని చేసినందుకు అదనపు వేతనాన్ని అందచేశారు. అరుదైన నైపుణ్యాలు కలిగిన వైద్య నిపుణులను ఆకర్షించేందుకు సాధారణం కంటే ఎక్కువ వేతనాలు ప్రకటించి ప్రజారోగ్యం పట్ల నిబద్ధత చాటుకున్నారు.⇒ ‘జీరో వేకెన్సీ’ విధానంలో భాగంగా వేగంగా నియామకాలు చేపట్టేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. జీతభత్యాలు, ప్రోత్సాహకాలను సవరించారు. పీజీ వైద్య విద్యార్థులందరికీ తప్పనిసరి గ్రామీణ సేవను ప్రవేశపెట్టారు. అన్ని పీహెచ్సీలు, వీహెచ్సీ (విలేజ్ హెల్త్ క్లినిక్)లలో తగినంత మంది సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బంది... ప్రతి వీహెచ్సీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంతో పాటు ఆశాలు సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించారు.⇒ ప్రజలు దూర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను సంప్రదించేందుకు టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు. ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూర్చింది. రోజూ 75,000కిపైగా టెలికన్సల్టేషన్లు, ప్రిస్క్రిప్షన్లు అందచేశారు. దేశవ్యాప్తంగా జాతీయ టెలికన్సల్టేషన్లలో దాదాపు మూడింట ఒక వంతు ఆంధ్రప్రదేశ్లోనే నమోదయ్యాయి.⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాల బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టింది. ప్రతి పీహెచ్సీని 12–13 వీహెచ్సీలకు మ్యాప్ చేశారు. ప్రతి వీహెచ్సీ పరిధిలో 2,500–4,500 మంది జనాభాకు సేవలందాయి (గిరిజన ప్రాంతాలలో స్థానిక అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేశారు). 4,345 కొత్త వీహెచ్సీలు, 88 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేశారు. 977 గ్రామీణ, 184 పట్టణ పీహెచ్సీలను పునరుద్ధరించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు రెట్టింపు చేయడం ద్వారా 10,086కు చేరాయి. అధిక రక్తపోటు, మధుమేహం, సాధారణ క్యాన్సర్ల కోసం స్క్రీనింగ్, తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అత్యవసర ప్రసూతి సంరక్షణతో కూడిన విస్తరించిన సేవలను అందించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చారు.⇒ 2022–23లో నిర్వహించిన ఎన్సీడీ–2 సర్వే ద్వారా రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతం మందికి స్క్రీనింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ఆరోగ్య గుర్తింపు కార్డు కేటాయించారు. ⇒ అత్యవసర మందుల జాబితాలోని 105 ఔషధాలు, 14 ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యంతో మొబైల్ మెడికల్ యూనిట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక రిజర్వ్ మొబైల్ మెడికల్ యూనిట్ను ఏర్పాటు చేశారు. అవసరమైనప్పుడు విధులు నిర్వర్తించడానికి నలుగురు అదనపు వైద్యులను కేటాయించారు. వైద్యుడితో పాటు ప్రతి యూనిట్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.⇒ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ను అధికారికంగా 2023 ఏప్రిల్లో ప్రారంభించారు (2022 అక్టోబర్లో పైలట్ దశ తర్వాత). ఈ కార్యక్రమం కింద మొబైల్ మెడికల్ యూనిట్తో సహా డాక్టర్ ప్రతి నెలా రెండు సార్లు విలేజ్ హెల్త్ క్లినిక్స్ను సందర్శించారు. క్రమబద్ధమైన షెడ్యూల్తో వైద్యులను ఇంటి వద్దకే పంపించారు. ⇒ అన్ని ఆరోగ్య కేంద్రాలలో టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ, డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది అందరికీ కొత్త డిజిటల్, వైద్య సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో శిక్షణ ఇచ్చారు. సెంట్రల్ డిజిటల్ క్వాలిటీ డాష్బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు పనితీరు సూచికలను విశ్లేషించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.కోవిడ్లో కాపాడారు..!⇒ కోవిడ్ సమయంలో 10,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇన్ఫెక్షన్ నివారణ సామగ్రితో సహా కీలకమైన వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచారు. జిల్లా, బోధనాస్పత్రులలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులు, ఆక్సిజన్తో కూడిన పడకలు, క్రిటికల్ కేర్ యూనిట్లను సిద్ధం చేశారు. 100కు పైగా ప్రయోగశాలలకు కోవిడ్ పరీక్షా సామర్థ్యాన్ని కల్పించారు. మారుమూల ప్రాంతాలకు మొబైల్ పరీక్షా యూనిట్లను పంపించారు. గ్రామీణ, అణగారిన వర్గాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చికిత్స, వ్యాక్సినేషన్ సకాలంలో అందించి ప్రజల ప్రాణాలను కాపాడారు.
వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం ఏ స్థాయిలో నిర్వీర్యమైపోయాయో రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి ఘటన మరోసారి రుజువు చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఓ షాపింగ్మాల్ గేటు బయట ఘటన జరిగినా, నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసినా పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి, ఘటన తీవ్రతకు అనుగుణంగా కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని జగన్ పేర్కొన్నారు. కానీ, ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, నిందితులను కూడా వదిలేసి చేతులు దులుపుకోవడం అత్యంత దారుణమన్నారు. నిందితులు డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ను కారుతో ఢీకొట్టడమే కాకుండా, ఆ తర్వాత కూడా అమానవీయంగా ప్రవర్తించారని జగన్ ఆరోపించారు. బాధితురాలి మీదుగా కారు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత అలసత్వంగా వ్యవహరించిందో తేల్చేందుకు పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.సామాన్యుల కేసుల్లో చట్టం ఎందుకు పనిచేయదు?ప్రతిపక్ష నేతలపైనా, ప్రశ్నించేవారిపైనా, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిపైనా ‘రెడ్బుక్ రాజ్యాంగం’ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం.. సామాన్యులకు సంబంధించిన కేసుల్లో మాత్రం చట్టప్రకారం వ్యవహరించడంలో ఘోరంగా విఫలమవుతోందని జగన్ విమర్శించారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులు, కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం కూడా రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి కారణమని ఆరోపించారు.తల్లిదండ్రుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలిఎన్నో త్యాగాలు, కష్టాలను ఎదుర్కొని కుమార్తెను డాక్టర్గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు.. ఆమె ఎండీ చదువులు పూర్తి చేసి పదిమందికి వైద్య సేవలందించే స్థాయికి ఎదుగుతున్న సమయంలోనే తీవ్ర విషాదం ఎదురుకావడం అత్యంత బాధాకరమని జగన్ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ప్రియాంక కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరులందరినీ సమానంగా చూడాల్సిన వ్యవస్థల్లో రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అనే ధోరణులను తీసుకురావడం వల్లే వ్యవస్థల పునాదులు కదిలిపోయే పరిస్థితి ఏర్పడిందని జగన్ విమర్శించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు తీరు..వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్కు మద్యం దుకాణాలు, ప్రతి వీధి చివర బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు తీరు ఉందని జగన్ మండిపడ్డారు. గుడి, బడి, బీచ్ అనే తేడా లేకుండా మద్యం అందుబాటును పెంచడం వల్లే ఇలాంటి ఘటనలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని విమర్శించారు. డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా, వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో ఆ కంటెంట్ను తొలగిస్తోందని జగన్ ఆరోపించారు.
‘నో మ్యాన్స్ ల్యాండ్’.. ఈ భూమిపై ఎవరికీ హక్కు లేదా?
రెండు దేశాల సరిహద్దుల మధ్య ఎవరికీ చెందని భూమిగా పిలిచే ‘నో మ్యాన్స్ ల్యాండ్’ (No Man's Land), ‘జీరో లైన్’ (Zero Line) గురించి తరచూ చర్చలు జరుగుతుంటాయి. దేశాల మధ్య వివాదాలు, సరిహద్దు భద్రత మధ్య ఈ ప్రత్యేక ప్రాంతంపై ఎవరికి అధికారాలు ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.సరిహద్దుల్లో ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అంటే ఏమిటి?ప్రపంచంలోని పలు దేశాలు తమ పొరుగు దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఇలా రెండు దేశాల సరిహద్దుల మధ్య వదిలివేసిన ఖాళీ భూమిని ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అని పిలుస్తారు. దీనిని కొన్నిసార్లు ‘జీరో లైన్’ అని కూడా వ్యవహరిస్తారు. ప్రత్యేకించి భారత్-పాకిస్తాన్ సరిహద్దుల సందర్భంలో ఈ పదం ఎక్కువగా వాడుకలో వినిపిస్తుంటుంది. ఈ ప్రత్యేక ప్రాంతంపై ఏ ఒక్క దేశానికీ ప్రత్యేకమైన యాజమాన్య హక్కులు ఉండవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఎవరికీ చెందని భూమి మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఒక ‘బఫర్ జోన్ ’ మాదిరిగా పనిచేస్తుంది.‘జీరో లైన్’ ఎక్కడ ఉంటుంది?.. ప్రత్యేకత ఏమిటి?రెండు దేశాల సరిహద్దులు ముఖాముఖిగా కలిసే వాస్తవిక రేఖను ‘జీరో లైన్’ అని అంటారు. భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలలో ఈ జీరో లైన్ స్పష్టంగా హైలైట్ చేసి ఉంటుంది. అదే సమయంలో జమ్ము కశ్మీర్ లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)వద్ద దీని పరిస్థితి మరింత సున్నితంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రెండు దేశాల సైనిక చౌకీలు ఎదురుగా మోహరించి ఉంటాయి. సరిహద్దుల్లో జరిగే ప్రతీ చిన్న కదలికను ఇరు దేశాల భద్రతా బలగాలు అత్యంత నిశితంగా గమనిస్తూ ఉంటాయి.నిజంగా ఎవరికీ హక్కులు ఉండవా?జీరో లైన్ చుట్టుపక్కల ఉండే భూభాగాన్ని సాధారణంగా ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అంటారు. ఇది ఏ దేశపు పౌరులు కూడా వినియోగించడానికి వీలు లేని ప్రాంతం. సాధారణ పరిస్థితుల్లో ఇక్కడ ఏ దేశపు ప్రత్యక్ష పౌర నియంత్రణ ఉండదు. భద్రతాపరమైన కఠిన నిబంధనల కారణంగా సామాన్య ప్రజల ప్రవేశంపై ఇక్కడ నిషేధం కొనసాగుతుంది. కొన్నిసార్లు ఇదే వివాదాస్పద ప్రాంతం ఇరు దేశాల మధ్య జరిగే ఘర్షణలు, కాల్పులు, సైనిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుతుంది.రక్షణ వలయంగా మారిన సరిహద్దు భద్రతజీరో లైన్ పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కఠినంగా, పటిష్టంగా ఉంటాయి. భారతదేశం వైపు నుంచి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ రేంజర్స్ నిరంతరం గస్తీ కాస్తుంటాయి. పలు అత్యంత సున్నితమైన ప్రాంతాలలో మందుపాతరలు, అత్యాధునిక స్పై గ్యాజెట్లు, భారీ సైనిక శిబిరాలు ఏర్పాటై ఉంటాయి. ఈ కారణాల వల్ల ఎలాంటి అనుమతి లేకుండా ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం చట్టపరమైన నేరం మాత్రమే కాకుండా, ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది.చారిత్రక వివాదాలు.. సరిహద్దు ఉద్రిక్తతలుప్రపంచ చరిత్రలో ఇలాంటి భూమిని చేజిక్కించుకోవాలనే దురాశతో పలు దేశాల మధ్య భీకర యుద్ధాలు కూడా జరిగాయి. నేటికీ భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ముకశ్మీర్ లోని ప్రాంతాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ సున్నితమైన సరిహద్దుల వల్లే ‘నో మ్యాన్స్ ల్యాండ్’ ప్రాముఖ్యత మరింత పెరిగింది.ఒక చిన్న పొరపాటు తెచ్చే మృత్యువు‘నో మ్యాన్స్ ల్యాండ్’, ‘జీరో లైన్’ ప్రాంతాలలో నిఘా వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా ఉంటుంది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఈ ప్రాంతంలోకి కాలుపెట్టాలని చూస్తే, క్షణాల్లో ప్రణాలు పోయే అవకాశం ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు, నిఘా నేత్రాల మధ్య ఉండే ఈ భూభాగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను ముప్పుకు దారి తీస్తుంది. అందుకే సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా మెలుగుతారు.సరిహద్దుల నిర్వహణ - ఒక నిరంతర సవాలురెండు దేశాల మధ్య శాంతి భద్రతలను కాపాడటంలో ‘జీరో లైన్’, ‘నో మ్యాన్స్ ల్యాండ్’ కీలక పాత్ర పోషిస్తాయి. సరిహద్దు ఉల్లంఘనలను అరికట్టడానికి, అసాంఘిక శక్తుల చొరబాట్లను నివారించడానికి ఇరు దేశాల రక్షణ దళాలు నిత్యం సిద్ధంగా ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఈ సున్నితమైన సరిహద్దులను భద్రంగా ఉంచేందుకు ప్రభుత్వాలు నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ!
హైదరాబాద్లో హిట్ అండ్ రన్.. జవాన్ మృతి
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా, రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఓ జవాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడటంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.ఆర్మీ జవాన్ను ఢీకొట్టిన వాహనం.. ప్రమాదం జరిగిన తర్వాత ఆగకుండా దూసుకెళ్లింది. మార్గమధ్యలో మరో నలుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం వారు కారును వదిలి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు, అందులో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నకులుడు... అశ్వశిక్షణలో మేటి
‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’
విషమంగా జో బైడెన్ పరిస్థితి!
అచ్యుతం కేశవం: అదొక చిన్న పల్లెటూరు.. ఆ ఊర్లో వాళ్ళందరూ..
ఫస్ట్ టైమ్ ఈ మూవీలో ఫైట్స్ చేశాను
'ఈ' కేవైసీతోనే సిలిండర్.. గడువు మరో వారం రోజులే!
సింపుల్.. ఈ 7 టిప్స్ పాటిస్తే వందేళ్లు బతికేయొచ్చు!
ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు
ఈ 'రారాజు'కు ఓ రోజు!
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సాక్షి కార్టూన్ : 08-08-2026
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
ఉద్యోగుల సెలవుల్లో మార్పులు చేసిన యాక్సెంచర్
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
‘యముడు’ మూవీ రివ్యూ
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
హెరిటేజ్ - విజయ డెయిరీ
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
ఈ రాశి వారికి ఆస్తి యోగం.. వస్తులాభం
త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?
నకులుడు... అశ్వశిక్షణలో మేటి
‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’
విషమంగా జో బైడెన్ పరిస్థితి!
అచ్యుతం కేశవం: అదొక చిన్న పల్లెటూరు.. ఆ ఊర్లో వాళ్ళందరూ..
ఫస్ట్ టైమ్ ఈ మూవీలో ఫైట్స్ చేశాను
'ఈ' కేవైసీతోనే సిలిండర్.. గడువు మరో వారం రోజులే!
సింపుల్.. ఈ 7 టిప్స్ పాటిస్తే వందేళ్లు బతికేయొచ్చు!
ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు
ఈ 'రారాజు'కు ఓ రోజు!
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సాక్షి కార్టూన్ : 08-08-2026
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
ఉద్యోగుల సెలవుల్లో మార్పులు చేసిన యాక్సెంచర్
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
‘యముడు’ మూవీ రివ్యూ
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
హెరిటేజ్ - విజయ డెయిరీ
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
ఈ రాశి వారికి ఆస్తి యోగం.. వస్తులాభం
త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?
ఫొటోలు
'టాక్సిక్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
హైదరాబాద్ లో ఘనంగా బోనాల పండుగ (ఫొటోలు)
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సారె సంబరం (ఫొటోలు)
విశాఖపట్నంలో అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16)
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు)
టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)
వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు)
సినిమా
నటికి చేదు అనుభవం.. లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం
హిందీలో మూడు నాలుగు సినిమాలు చేసిన నటి నిఖితా రావల్కి ఊహించని అనుభవం ఎదురైంది. తాజాగా ఓ కార్యక్రమంలోనే ఈమె ఫొటోలకు పోజులిస్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి సెల్ఫీ అడిగింది. ఈ క్రమంలోనే అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, బ్లాక్ అండ్ వైట్, హీరో తదితర సినిమాల్లో నటించిన నిఖితా రావల్ మంచి డ్యాన్సర్గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అయితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. ఇప్పుడు అభిమాని ఈమెకు లిప్ కిస్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే బాలీవుడ్లో ఇలాంటివి నిజంగా జరగడం కంటే ఎక్కువగా పీఆర్ స్టంట్స్గా చేస్తుంటారు. తమ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎలాంటి మూవీ ఛాన్సులు రాకపోతే ఏదో ఒకలా వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. మరి నిఖితా రావల్ కూడా ఇలాంటి స్టంట్ ఏమైనా చేసిందా? లేదంటే నిజంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా)SHOCKING 😲 😱😭😲#NikitaRawal Forcefully Kissesd by her Female FAN . Or just a PR Gimmick ? pic.twitter.com/WJF8uuC4y5— Manoz Kumar (@ManozTalks) August 9, 2026
నటిగా కాదు.. భార్యగా ఆ ఛాన్స్ వదులుకున్నా: ఐశ్వర్య
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా 2014లో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో దీపికా పాత్రకు ముందుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ను సంప్రదించారట దర్శకురాలు ఫరాఖాన్. కానీ ఆ సమయంలో భర్త అభిషేక్ బచ్చన్తో కూడా నటిస్తుండటం, షారుఖ్తో ఎక్కువ కెమిస్ట్రీ సీన్లు ఉండటంతో ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించిందట.ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘‘ఆరాధ్య పుట్టిన తర్వాత సినిమాలకు కొంత విరామం తీసుకున్నా. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చేసి ఉంటే మంచి కంబ్యాక్ అయ్యేది. నటిగా ఆ అవకాశాన్ని వదులుకోవడం అంత సులభం కాదు. కానీ భార్యగా ఆ నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా ఐశ్వర్య చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్’లో కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా విషయానికి వస్తే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలోనూ నటిస్తోంది.
బ్రో... రిలాక్స్!
తిట్టకుండా తిట్టినట్లు కౌంటర్ ఇచ్చారు మృణాల్ ఠాకూర్. అసలేం జరిగిందంటే... తన కన్నా వయసులో పదేళ్లు చిన్న అయిన స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్తో మృణాల్ డేటింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త గురించి ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘బ్రో... రిలాక్స్. మేమిద్దరం ఎక్కడైనా జంటగా కనిపించామా? మీరు చూపించండి. చదువుకున్న మీలాంటివాళ్లు ఇలాంటి వదంతులు నిజం అని ఎలా నమ్ముతారు? దేశంలో ఎంతో జరుగుతోంది. జెన్ జీ నుంచి నేర్చుకుని, సరైన టాపిక్స్ మీద వీడియోలు చేయండి... అప్పుడు మీకు కావల్సినన్ని వ్యూస్ వస్తాయి’’ అని సోషల్ మీడియా వేదికగా మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఇక ముంబైలోని ఓ కేఫ్ నుంచి మృణాల్, యశస్వి జైస్వాల్ విడి విడిగా వచ్చిన ఓ వీడియోను ఉద్దేశించి... ఈ ఇద్దరూ డేటింగ్ అనే వార్తను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తాజాగా మృణాల్ చేసిన కామెంట్కి నెటిజన్లు ఆమెకు మద్దతుగా ‘అబద్ధపు వార్తను ఎలా ప్రచారం చేస్తున్నారో? అసలు ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు ఒకే రెస్టారెంట్కి వెళ్లకూడదా?’ అంటూ వదంతులు ప్రచారం చేస్తున్నవారిని ఉద్దేశించి కామెంట్ చేశారు.
ఆమిర్తో అట్లీ?
ఆమిర్ ఖాన్ హీరోగా నటించనున్న కొత్త చిత్రంపై పూర్తి స్థాయిలో ఇంకా సరైన స్పష్టత రావడం లేదు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్, ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్, దర్శకుడు లోకేష్ కనగరాజ్తో ఓ సూపర్ హీరో మూవీ, అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ మూవీ అంటూ ఆమిర్ నెక్ట్స్ చిత్రాలపై వార్తలు వినిపిం చాయి. కానీ ఇప్పటివరకు ఏ సినిమా సెట్స్కు వెళ్లలేదు.తమిళ దర్శకుడు అట్లీ ఇటీవల ఆమిర్ ఖాన్కు ఓ స్టోరీ లైన్ చె ప్పారట. ఈ కథ నచ్చి, ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట ఆమిర్. అయితే ఫైనల్ నరేషన్ జరగాల్సి ఉందట. ప్రస్తుతం అల్లు అర్జున్తో చేస్తున్న ‘రాకా’ చిత్రీకరణతో అట్లీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఆమిర్–అట్లీ కాంబినేషన్ సినిమా గురించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. మరి... వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే.
క్రీడలు
శివానికి రజతం... ఆరుశ్కు కాంస్యం
జైపూర్: జాతీయ సబ్ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో ఆదివారం తెలంగాణ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. గ్రూప్–2 బాలికల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో కర్రా శివాని రజత పతకం సొంతం చేసుకోగా... గ్రూప్–2 బాలుర 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో ఆరుశ్ దాస్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. శివాని 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్ను 1 నిమిషం 01.28 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ధీవశ్రీ కేశవన్ (తమిళనాడు; 1ని:00.23 సెకన్లు) స్వర్ణం, ఇంద్రాణి మీనన్ (కేరళ; 1ని:01.66 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్ను ఆరుశ్ 29.44 సెకన్లలో ముగించి మూడో స్థానం సంపాదించాడు. క్రిశివ్ దోషి (మధ్యప్రదేశ్; 28.36 సెకన్లు) స్వర్ణం... శ్లోక్ జాధవ్ (కర్ణాటక; 28.45 సెకన్లు) రజతం దక్కించుకున్నారు.ఆదివారంతో ముగిసిన ఈ పోటీల్లో ఓవరాల్గా శివాని కర్రా మూడు పతకాలు సాధించింది. అంతకుముందు శివాని 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో రజత పతకం... 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో పసిడి పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి చెందిన గచ్చిబౌలి స్విమ్మింగ్ స్టేడియంలో కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద శివాని, ఆరుశ్ శిక్షణ తీసుకుంటున్నారు.
జంపింగ్లో డబుల్ ధమాకా
యుజీన్ (అమెరికా): నాలుగు దశాబ్దాల చరిత్రగల ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ మూడోసారి తమ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. ఆదివారం ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల హైజంప్లో బసంత్ కుమార్ మేఘ్వాల్ రజత పతకం సాధించగా... పురుషుల లాంగ్జంప్లో షానవాజ్ ఖాన్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజత పతకం గెలిచిన సంగతి విదితమే. వెరసి ఈ మెగా ఈవెంట్లో భారత్ మొత్తం మూడు పతకాలు గెల్చుకుంది. 2021, 2022 ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్లోనూ భారత్ మూడు పతకాల చొప్పున సాధించింది. ఆఖరిరోజు సోమవారం మహిళల హైజంప్ ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ పూజా సింగ్ బరిలో ఉంది. పూజా పతకం గెలిస్తే భారత్ తొలిసారి నాలుగు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తుంది. ప్రస్తుతం ఆసియా అండర్–20 చాంపియన్గా ఉన్న 19 ఏళ్ల బసంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకాన్ని సంపాదించాడు. తద్వారా ప్రపంచస్థాయి అథ్లెటిక్స్ మీట్లో పతకం గెలిచిన తొలి భారతీయ హైజంపర్గా బసంత్ గుర్తింపు పొందాడు. బసంత్ 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. స్వర్ణం గెలిచిన యూనుస్ అయాచి (అల్జీరియా), కాంస్యం సాధించిన ఒటిస్ పూలే (బ్రిటన్) కూడా 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. ముగ్గురూ 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి సమఉజ్జీగా నిలిచారు. యూనుస్ తొలి ప్రయత్నంలోనే 2.21 మీటర్లను అధిగమించగా... బసంత్ రెండో ప్రయత్నంలో... ఒటిస్ మూడో ప్రయత్నంలో సఫలమయ్యారు. దాంతో యూనుస్కు స్వర్ణం ఖరారు చేయగా.. బసంత్కు రజతం, ఒటిస్కు కాంస్యం లభించాయి. రాజస్తాన్లోని గంగానగర్ జిల్లాకు చెందిన బసంత్ ప్రస్తుతం భారత నావికాదళంలో ఉద్యోగిగా ఉన్నాడు. బసంత్ తండ్రి గంగారాం డ్రైవర్గా, దినసరి కూలీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆసియా అండర్–20 చాంపియన్ అయిన షానవాజ్ ఖాన్ తనపై పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయకుండా పతకంతో మెరిశాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల షానవాజ్ 7.84 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. డేనియల్ లియోనారో ఇంజోలి (ఇటలీ; 7.97 మీటర్లు) స్వర్ణం... మేసన్ మెక్గ్రోడర్ (ఆస్ట్రేలియా; 7.96 మీటర్లు) రజతం గెలిచారు. షానవాజ్ తండ్రి నసీముద్దీన్ టాక్సీ డ్రైవర్గా పని చేసేవారు. 2018లో ఆయన క్యాన్సర్తో చనిపోయారు. తండ్రి మృతి చెందాక షానవాజ్ను అతని బాబాయిలు, క్రీడాకారులైన షారుఖ్, మొహమ్మద్ హాదీస్ దిశానిర్దేశం చేశారు. షారుఖ్ 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో జాతీయ చాంపియన్ కాగా, హాదీస్ మాజీ జావెలిన్ త్రోయర్. వీరిద్దరి స్ఫూర్తితో షానవాజ్ అథ్లెటిక్స్లో ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే స్థాయికి ఎదిగాడు.
‘జో ఖేలేగా... వో ఖిలేగా’
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. కాగా అథ్లెట్లతో భేటీ అయిన వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘జో ఖేలేగా... వో ఖిలేగా’ (ఆటలు ఆడేవాళ్లు వికసిస్తారు) అంటూ అథ్లెట్లను అభినందించిన ప్రధానమంత్రి... దేశం కోసం ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కామన్వెల్త్ క్రీడల మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో పసిడి నెగ్గిన సాక్షి మాట్లాడుతూ... ‘పతకాలు సాధించిన ప్లేయర్లను ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ భేటీని మేమంతా ఎంతో ఆస్వాదించాం’ అని పేర్కొంది. 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది.
సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్.. బీసీసీఐ అధికారిక ప్రకటన
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాలో కీలక మార్పు జరిగింది. గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. సాయి కుడి కాలివేలికి గాయం కావడంతో శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు.బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స తీసుకుంటున్న సాయి.. జట్టుతో చేరేందుకు అవసరమైన ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేకపోయాడు. సాయి గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడని, బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని బోర్డు వెల్లడించింది.శ్రీలంకకు వెళ్లనున్న సర్ఫరాజ్సర్ఫరాజ్ ఖాన్ కొలంబోలో భారత జట్టుతో కలవనున్నాడు. అక్కడి నుంచి టీమిండియా గాలేకు వెళ్లనుంది. శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.సాయి స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్కు తుది జట్టులో చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వార్మప్ మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ సెంచరీ చేయడంతో నంబర్ 3 స్థానం అతడికి దాదాపుగా ఖరారైపోయింది.శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు అప్డేటెడ్ టీమిండియా ఇదే..శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంశ్ జైన్, ఆకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్ఊహించని అవకాశందేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు సాధించిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ 2024లో ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి సిరీస్లోనే అతడు ఆకట్టుకున్నాడు. మూడు అర్ధ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు.అదే ఏడాది బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత టెస్టు జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది.2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతడికి ఒక్క మ్యాచ్లోనూ అవకాశం రాలేదు. ఆ తర్వాత సర్ఫరాజ్ భారత టెస్టు జట్టు నుంచి దాదాపుగా కనుమరుగయ్యాడు.ఇప్పటివరకు సర్ఫరాజ్ ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి టెస్టు బ్యాటింగ్ సగటు 37.1గా ఉంది.
న్యూస్ పాడ్కాస్ట్
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
బిజినెస్
కేటీఎం బైకుల ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు ఇవే!
కేటీఎం ఇండియా.. తన 160 డ్యూక్, ఆర్సీ 160 ధరలను పెంచింది. ఇందులో ఆర్సీ 160 ధర గరిష్టంగా రూ.15,000 పెరిగింది. అయితే.. వేరియంట్ను బట్టి, 160 డ్యూక్ ధర రూ.12,000 నుంచి రూ.13,000 మధ్య పెరిగింది.జీఎస్టీ రేట్లలో మార్పుల నేపథ్యంలో.. సెప్టెంబర్లో కేటీఎం ధరలను తగ్గించిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత, కేటీఎం తన బైకుల ధరలను పెంచింది. అయితే.. 350సీసీ వరకు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన ద్విచక్ర వాహనాలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో, కంపెనీ చిన్న మోటార్సైకిళ్ల ధరలు తగ్గాయి.కేటీఎం 160 డ్యూక్160 డ్యూక్ స్టాండర్డ్ వెర్షన్ ధర గతంలో రూ.1.71 లక్షలు ఉండగా, ఇప్పుడు అది రూ.1.84 లక్షలకు చేరింది. దీంతో దీని ధర రూ.13,000 పెరిగింది. అధిక స్పెసిఫికేషన్లు గల TFT వేరియంట్ ధర రూ.1.79 లక్షల నుంచి రూ. 1.91 లక్షలకు పెరిగింది. అంటే దీని ధర రూ. 12,000 పెరిగిందన్నమాట.కేటీఎం ఆర్సీ 160ఆర్సీ 160 ధర రూ.15,000 పెరిగింది. ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో రూ.1.85 లక్షలకు విడుదలైన ఈ ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్సైకిల్ ధర ఇప్పుడు రూ. 2 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ బైక్ 164.2 సీసీ ఇంజన్ను కలిగి.. 18.7 bhp పవర్, 15.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
బంగారం, వెండి ధరలు గత వారం రోజుల్లో భారీగా పెరిగాయి. ఇది వచ్చే వారం కూడా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటి?, ఎంతవరకు ధరలు పెరగనున్నాయి?, అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ద్రవ్యోల్బణ గణాంకాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న పాజిటివ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1.57 లక్షలు, వెండి ధర కేజీ రూ.2.80 లక్షల వరకు చేరే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు ప్రణవ్ మేర్ అంచనా వేశారు.దేశీయ మార్కెట్లో పసిడి ధరలు.. ఈ వారంలో దాదాపు 6 శాతం పెరిగి రూ.1.51 లక్షలకు చేరింది. వెండి రూ.2.49 లక్షలకు చేరింది. అమెరికా కార్మిక మార్కెట్.. అంచనాల కంటే బలహీనంగా ఉండటంతో.. అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కొంత సడలింపు చూపించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. దీంతో బంగారం, వెండిపై కొనుగోళ్లు పెరిగాయి. మరోవైపు డాలర్ బలహీనపడటం కూడా ధరలు పెరగడానికి కారణం అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బంగారం ధర దాదాపు 7 శాతం పెరగగా.. వెండి ఏకంగా 10 శాతం వరకు ఎగబాకింది. వచ్చే వారం అమెరికా ఆర్థిక గణాంకాలతో పాటు అమెరికా - ఇరాన్ మధ్య పరిణామాలు కూడా కీలకం కానున్నాయి. పశ్చిమాసియాలో ఏదైనా అనూహ్య పరిణామం చోటుచేసుకుంటే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలంటే.. ఎవరు ఏ వీసా తీసుకోవాలి?
అమెరికా వెళ్లాలంటే.. ఎవరు ఏ వీసా తీసుకోవాలి?
అమెరికాకు వెళ్లాలనుకునేవారికి సరైన వీసాను ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఉద్యోగం చేయడానికి, వ్యాపార పనుల కోసం, వివాహం చేసుకోవడానికి, తాత్కాలికంగా ఉండడానికి లేదా ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లేవారికి వేర్వేరు రకాల వీసాలు ఉంటాయి. ప్రతి వీసాకు ప్రత్యేకమైన అర్హతలు, నిబంధనలు, కాలపరిమితి, దరఖాస్తు విధానం ఉంటాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బీ-1 వీసాఅమెరికాలో వ్యాపార సమావేశాలు, క్లయింట్లను కలవడం, సమావేశాలు లేదా కాన్ఫరెన్స్లకు హాజరుకావడం, ఒప్పందాలపై చర్చించడం వంటి తాత్కాలిక వ్యాపార కార్యకలాపాల కోసం B-1 వీసా ఉపయోగపడుతుంది. అయితే.. ఈ వీసాతో అమెరికాలో సాధారణ ఉద్యోగం చేయడం లేదా అమెరికా సంస్థ నుంచి జీతం తీసుకోవడం సాధ్యం కాదు.ఈ వీసా కోసం దరఖాస్తుదారులు తమ ప్రయాణం తాత్కాలికమేనని, అమెరికా నుంచి తిరిగి వెళ్తారని, ప్రయాణ ఖర్చులను భరించగల సామర్థ్యం ఉందని చూపించాలి. సాధారణంగా పాస్పోర్ట్, DS-160 ఫారం, వీసా ఫీజు రసీదు, ఫొటోతో పాటు ప్రయాణ ఉద్దేశాన్ని తెలిపే పత్రాలు అవసరం.హెచ్-1బీ వీసాఅమెరికాలో ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలు చేయాలనుకునే వారికి H-1B వీసా ఉపయోగపడుతుంది. సాధారణంగా సంబంధిత విద్యార్హతలు, అమెరికా సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అవసరం. ఈ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, చాలా సందర్భాల్లో లాటరీ విధానం ఉంటుంది.సాధారణంగా ఏడాదికి 65,000 హెచ్-1బీ వీసాల రెగ్యులర్ క్యాప్ ఉంటుంది. అమెరికా మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నవారికి అదనంగా 20,000 వీసాల మాస్టర్స్ క్యాప్ ఉంటుంది. అయితే.. కొన్ని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలు ఈ క్యాప్కు మినహాయింపు పొందవచ్చు. సాధారణంగా హెచ్-1బీ స్టేటస్ మూడు సంవత్సరాల వరకు మంజూరు కావచ్చు. కొన్ని పరిస్థితుల్లో మొత్తం ఆరు సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. హెచ్-1బీను డ్యూయల్-ఇంటెంట్ వీసాగా పరిగణిస్తారు కాబట్టి, అమెరికాలో పనిచేస్తూనే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది.హెచ్-2బీ వీసాసీజనల్ లేదా తాత్కాలికంగా ఉద్యోగులు అవసరమైనప్పుడు హెచ్-2బీ వీసా ఉపయోగపడుతుంది. టూరిజం, సీజనల్ పనులు, తాత్కాలిక ప్రాజెక్టులు వంటి ఉద్యోగాలకు ఇది ఉపయోగపడుతుంది.హెచ్-2బీ ఉద్యోగులకు సాధారణంగా ప్రారంభంగా గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు స్టేటస్ ఇవ్వవచ్చు. అర్హత ఉన్న సందర్భాల్లో పొడిగింపులు లభించవచ్చు. అయితే హెచ్-2బీ స్టేటస్లో మొత్తం గరిష్ఠంగా మూడు సంవత్సరాలు మాత్రమే ఉండవచ్చు. ఇది డ్యూయల్-ఇంటెంట్ వీసా కాదు. కాబట్టి తాత్కాలిక ఉద్యోగం పూర్తైన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఉద్దేశాన్ని చూపించాలి.కే-1 వీసాఅమెరికా పౌరుడిని వివాహం చేసుకోబోయే విదేశీయులకు కే-1 వీసా ఉపయోగపడుతుంది. ఈ వీసాతో అమెరికాలోకి వెళ్లిన తర్వాత 90 రోజుల్లో వివాహం చేసుకోవాలి. వీసా ప్రక్రియలో I-129F పిటిషన్, మెడికల్ పరీక్ష, ఇంటర్వ్యూ వంటి దశలు ఉంటాయి. వివాహం తర్వాత గ్రీన్ కార్డ్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవచ్చు.కే-3 వీసాఅమెరికా పౌరుడిని ఇప్పటికే వివాహం చేసుకున్న విదేశీ జీవిత భాగస్వామి.. అమెరికాకు రావడానికి కే-3 వీసా ఉద్దేశించబడింది. అయితే I-130 పిటిషన్ ఆమోదం పొందిన తర్వాత K-3 అవసరం సాధారణంగా ముగుస్తుంది. అందువల్ల ఈ వీసా ప్రస్తుతం చాలా తక్కువగా ఉపయోగించబడుతోంది.ఎల్-1 వీసాఒక అంతర్జాతీయ కంపెనీ తన విదేశీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని అమెరికాలోని సంబంధిత కార్యాలయానికి బదిలీ చేయాలనుకుంటే L-1 వీసా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఉద్యోగి గత మూడు సంవత్సరాల్లో కనీసం ఒక సంవత్సరం సంబంధిత విదేశీ సంస్థలో పనిచేసి ఉండాలి. మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు లేదా కంపెనీకి ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ఈ వీసా కింద అర్హత పొందవచ్చు.ఓ వీసాతమ రంగంలో అసాధారణ ప్రతిభ లేదా ప్రత్యేక విజయాలు సాధించిన వ్యక్తులకు O వీసా ఉపయోగపడుతుంది. సైన్స్, విద్య, వ్యాపారం, క్రీడలు, కళలు, సినిమా, టెలివిజన్ వంటి రంగాల్లో ప్రతిభ ఉన్నవారు దీనికి అర్హత పొందవచ్చు. అవార్డులు, ప్రచురణలు, ప్రముఖ సంస్థల్లో సభ్యత్వం, అధిక జీతం, నాయకత్వ స్థానాలు, తమ రంగానికి చేసిన ముఖ్యమైన సేవలు వంటి ఆధారాలతో తమ ప్రతిభను నిరూపించాల్సి ఉంటుంది.పీ వీసాఅమెరికాలో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లే క్రీడాకారులు, కళాకారులు, ఎంటర్టైనర్లు, కొన్ని సందర్భాల్లో వారి బృందాలకు P వీసా ఉపయోగపడుతుంది. ఇందులో P-1, P-2, P-3 వంటి వివిధ కేటగిరీలు ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో ట్రైనర్లు, టూర్ మేనేజర్లు, సౌండ్ ఇంజినీర్లు, ఫిజియోథెరపిస్టులు వంటి అవసరమైన సహాయక సిబ్బందికి కూడా ఈ వీసా కింద అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: H-1B వీసాదారులకు అమెరికా బిగ్ షాక్!
రూ.1.50 లక్షలు పెరిగిన మెజెస్టర్ ధర!
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. మెజెస్టర్ ధరలను సవరించింది. మే నెలలో లాంచ్ అయిన ఈ కారు ధరలను కంపెనీ పెంచడం ఇదే మొదటిసారి. ఈ పెంపు సావీ 2డబ్ల్యుడీ వేరియంట్లకు (ఆరు-సీటర్, ఏడు-సీటర్ కాన్ఫిగరేషన్లకు) వర్తిస్తుంది.ధరలు ఇప్పుడు రూ.1.50 లక్షల వరకు పెరిగాయి. దీంతో ఎక్స్-షోరూమ్ ధర రూ. 42.49 లక్షలకు (గతంలో ఈ కారు ధర రూ. 40.99 లక్షలు) చేరింది. అయితే, టాప్ స్పెక్ సావీ 4డబ్ల్యుడీ వేరియంట్ ధర మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దీని రేటు రూ. 44.99 లక్షల ఎక్స్-షోరూమ్ వద్దే ఉంది.కంపెనీ మెజెస్టర్ ధరలను పెంచింది. కానీ కారులో ఎలాంటి అప్డేట్స్ చేయలేదు. కాబట్టి అదే పనోరమిక్ సన్రూఫ్, ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు, 12-స్పీకర్ల JBL సరౌండ్ సౌండ్ సిస్టమ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ వైర్లెస్ ఛార్జర్లు, 220-వోల్ట్ పవర్ అవుట్లెట్, ముందు సీట్లకు వెంటిలేటెడ్ అండ్ మసాజ్ ఫంక్షన్, లెవెల్ 2 ADAS, మరియు 360-డిగ్రీల HD కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 212 బీహెచ్పీ పవర్, 478.5 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే ట్విన్-టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఉంటుంది. 4WD వేరియంట్లో MG యొక్క ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, 10 ఆఫ్-రోడ్ మోడ్లు లభిస్తాయి.ఎంజీ మెజెస్టర్ దేశీయ మార్కెట్లో.. జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్, టయోటా ఫార్చ్యూనర్, వోక్స్వ్యాగన్ టేరాన్ వంటి వాటికి మాత్రమే కాకుండా.. కియా సోరెంటోలకు కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
ఫ్యామిలీ
తనలో తానే పాడుకున్న తత్త్వజ్ఞ!
‘మన మాటల్లో అత్యుత్తమమైనవి మనతో మనం చెప్పుకునేవే!’నన్నారు పోలిష్ రచయిత్రి ఓల్గ తొకార్చుక్. ‘మిగతా విషయాలెలా వున్నా, వాటిని ఎవరూ అపార్థం చేసుకోర’ని కూడా అన్నారామె. ఈ మాటలన్న మనిషి, ‘జైళ్ళు మన లోపలే వుంటాయి– బయట వుండవు; ఎటొచ్చీ మనలో చాలామందికి ఈ అంతర్గత కారాగారాల్లో ఎలావుండాలో తెలియదంతే!’ అనడంలో విడ్డూరమేముంది? అయినా, మానసిక చికిత్స పద్ధతుల్లో –క్లినికల్ సైకాలజీలో– పట్టా పొందిన ఓల్గా మాటతీరు మరోలా ఎందుకుంటుంది?ఆమె తల్లి వాండా, తండ్రి జోసెఫ్ ఇద్దరూ ‘పీపుల్స్ యూనివర్సిటీ’లో అధ్యాపకులే. వాస్తవానికి అది ఓ విశ్వవిద్యాలయం కాదు– హైస్కూల్ మాత్రమే. పోలండ్ వాయవ్య ప్రాంతంలోని శివారు నగరం మ్యేర్జిన్లో వుండే జానపద విజ్ఞాన కేంద్రాన్నే ‘పీపుల్స్ యూనివర్సిటీ’గా పిలుస్తారు. జెర్మన్ సరిహద్దులకు కొద్ది నిమిషాల దూరంలో ఉంటుంది మ్యేర్జిన్. పైగా, అప్పట్లో జోసెఫ్ ఆ స్కూల్ లైబ్రరీ కూడా నడిపేవాడు. అలా, చిన్న వయసు నుంచీ ఓల్గ ఆడుకున్నదీ– పాడుకున్నదీ పుస్తకాలతోనే!బాల్యంలో ఓల్గకు నచ్చిన పుస్తకం హెన్రిక్ సియెంకియేవిచ్ రాసిన ప్రేమకథ ‘క్వో–వాడిస్’. 1905లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న తొలినాటి రచయిత సియెంకియేవిచ్ రాసిన ఈ ప్రేమకథకే ‘ఎడారి–అడవి’ అనేది మరోపేరు. లాటిన్ భాషలో ఈ ప్రశ్నకు ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అనే అర్థం! నీరో చక్రవర్తి రోమ్ నగర రాజ్యాన్ని పాలించే రోజుల్లో జరిగిన ప్రేమకథగా ఈ నవలను రచించాడు సియెంకియేవిచ్. మరో 113 సంవత్సరాల తర్వాత ఓల్గ కూడా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడానికి వున్న చారిత్రక నేపథ్యం ఇదన్నమాట. ఈ పరిసరాలే, రచయిత్రిగా ఆమె సొంత గొంతు సవరించడానికి అవసరమైన స్వరాన్నిచ్చాయి.పదహారేళ్ళ ప్రాయంలోనే కలంపట్టి కథనరంగంలోకి దిగింది ఓల్గ! అయితే యువరచయితలకు సహజమైన బెరుకు కారణంగా ఆమె ‘నతాషా బరోదిన్’ అనే మారుపేరును ఆశ్రయించారు. యువ రచయితల కోసం ఉద్దేశించిన ‘కాలిబాట’ అనే చిన్నపత్రికలో అచ్చయిన మొదటి రెండు కథలనూ ఆ పేరుతోనే ప్రచురించారామె. దాదాపు దశాబ్దకాలం ఓల్గ కథలూ కాకరకాయలూ పక్కన పెట్టి సైకో థెరపిస్టుగా ఉద్యోగం చేసుకున్నారు. అప్పట్లో ఆమె విస్తృతంగా కవిత్వం రాశారు; అనేక పత్రికల్లో ప్రచురించారు; విస్తారమైన గుర్తింపు కూడా పొందారు. అప్పట్లోనే ఆమె ఓ కవితా సంపుటి కూడా అచ్చు వేసుకున్నారు. మూడు పదుల వయసు దాటిన తర్వాత, 1996లో ఓల్గ ‘ఆదిమ యుగం– ఇతర యుగాలు’ అనే ప్రయోగాత్మక నవల రాసి పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ నవలను ఓల్గ 60 ఖండికలుగా విభజించారు. ఈ ప్రయోగం జాతీయ స్థాయిలో కన్నా, అంతర్జాతీయ స్థాయిలో పెద్దపేరు తెచ్చుకుంది. ఈ పరిణామం వెనుక చిన్న నేపథ్యం లేకపోలేదు!ఇరవయ్యో శతాబ్ది చివర్లో పోలండ్ రాజకీయ– సామాజిక వ్యవస్థ సమూలమైన మార్పులకు గురైంది. అంతర్జాతీయంగా గొర్బచ్యేఫ్, జాతీయ స్థాయిలో పోలిష్ కార్మిక నేత వవుంజా (వలేజా) పరిచయం చేసిన భావాలే ఆ మార్పులకు ప్రాతిపదికలు. పోలండ్ సమాజంలో పడమటి గాలులు బలంగా వీస్తున్న పోకడ కనిపెట్టి ఎందరో సాహిత్యవేత్తలు తమ రంగు మార్చారు. ఎందుకైనా మంచిదని ఓల్గ తొకార్చుక్ కూడా వారిని అనుసరించారు. అలాంటి పెద్దల ప్రోత్సాహంతోనే ఆమె 1990 దశాబ్ది తొలినాళ్ళలో ఓల్గ కొన్నాళ్ళు ఇంగ్లండులో ఉండి, ఆంగ్లభాషా ప్రావీణ్యం సాధించారు. మరో అయిదేళ్ళ తర్వాత ఆమె రెండు స్కాలర్షిప్పులు సంపాదించి అమెరికాలోనూ– జెర్మనీ (బెర్లిన్)లోనూ రెండేళ్ళు గడిపి రావడం ఓల్గ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆనాటి నుంచీ ఆమెకి స్వదేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువ గుర్తింపు దక్కుతూ వచ్చింది. 1999లో ఓల్గ ‘పోలిష్ పెన్ క్లబ్’లో చేరడంతో ఈ మార్పు పరిపూర్ణమైంది. 2014లో ఓల్గ రాసిన ‘ద బుక్స్ ఆఫ్ జేకబ్’ అనే సుదీర్ఘ నవల ఆమె రచనలన్నింట్లోకీ ఉత్తమమని విమర్శకులు అంటారు. పదిహేడో శతాబ్దానికి చెందిన జేకబ్ ఫ్రాంక్ అనే ‘అవతార పురుషుడి’ జీవితకథ నేపథ్యంగా రాసినదీ 900 పేజీల నవల. ఈ నవల రాయడానికి ఓల్గ ఏడేళ్ళపాటు పరిశోధన చేశారట! ఈ నవల రాయడానికి ఏడేళ్ళ ముందు, ఓల్గ ‘దిమ్మరులు’ అనే చారిత్రక నవల పోలిష్ భాషలో వెలువరించారు. ‘ప్రాచీన విశ్వాసులు’గా ప్రసిద్ధులైన ఓ క్రై స్తవ శాఖకు చెందిన సంచారజీవన సమూహాల కథనే ఈ నవలకు ఇతివృత్తంగా తీసుకున్నారు ఓల్గ. 116 ఖండికలుగా ఈ నవలను నిర్మించి ఓల్గ తన ముద్ర గట్టిగానే వేశారు. చిత్రమేమిటంటే, కొన్ని ఖండికలు, ఏకవాక్య నిర్మాణాలే! 2008లో నైకీ సాహిత్య పురస్కారం ఓల్గ రచనకు తొలిసారి దక్కింది.అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ దాని ఆంగ్లానువాదం వెలువరించే వరకూ ఓల్గ రచనకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగుర్తింపు దక్కలేదు (2018 మే నెల్లో ఓల్గ తొకార్చుక్– అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ మ్యాన్ బుకర్ బహుమతి సొమ్మును పంచుకున్నారు– అది అలా వుంచండి!) అదే సంవత్సరం అక్టోబర్లో ఓల్గ నోబెల్ సాహిత్యపురస్కారం గెల్చుకోవడానికి మ్యాన్ బుకర్ పురస్కారం ఎంతగానో సహకరించింది. ఈ రెండూ పురస్కారాలు దక్కిన తర్వాతనే, ఓల్గ రచనలకు అనేక భాషల్లో అనువాదాలు వెలువడ్డాయి. అయినా, నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళ రచనలను సొమ్ముచేసుకునే సువర్ణావకాశాన్ని పెంగ్విన్ లాంటి వాణిజ్య ప్రచురణ సంస్థలు వదులుకుంటాయా?- మందలపర్తి కిషోర్
లెమనేడింగ్ ఏడో రుచి.. కష్టాలను తట్టుకునే శక్తి!
మానవాళికి ప్రకృతి షడ్రుచులను ప్రసాదించింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏడో రుచిని కనిపెట్టారు. ఆ ఏడో రుచి పేరే... ‘లెమనేడింగ్’! నిజానికి ఇది రుచి కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సరదాగా తీసుకుని... చేదు అనుభవాల నుండి తీపి అనుభూతులను పొందే జీవన విధానం. ఈ స్వభావం మానవుల్లో మునుపు లేదని కాదు. దాన్నిప్పుడు పరిశోధకులు ఉందని రూఢీగా వెల్లడించారు. చెడు కాలంలోనూ చెదరని గుండెతో ఉండటమే లెమనేడింగ్.‘‘జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే, నిమ్మరసమే చేసుకుని తాగండి’’ : 20వ శతాబ్దపు ప్రముఖ అమెరికన్ రచయిత, తత్త్వవేత్త, వ్యాపారవేత్త ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాట ఇది. 1909లో ‘లిటరరీ డైజెస్ట్’ అనే పత్రికలో ఎల్బర్ట్ ఇలా రాశారు : ‘విధి తనకిచ్చిన నిమ్మకాయలను తీసుకుని, వాటితో నిమ్మరసం వ్యాపారం మొదలుపెట్టేవాడే అసలైన మేధావి’ – అని. అప్పట్నుంచీ ఈ మాట పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులలో వాడుకగా వినిపిస్తోంది. నిమ్మరసాన్ని ‘లెమనేడ్’ అంటారు. కనుక ఇది ‘లెమనేడ్ ఫిలాసఫీ’ అయింది. తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో లెమనేడ్ ఫిలాసఫీ మానవ జీవితానికి ప్రశాంతతను చేకూర్చే మాట నిజమే అని నిర్థారణ అవటం విశేషం!నవ్వుతూ బతకాలిరా..!జీవితాన్ని సరదాగా తీసుకునే అలవాటు వల్ల కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుందట! కష్టాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు మనుషులు ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనం కోసం వారు కోవిడ్–19 సమయంలోని 503 మంది అమెరికన్ల ప్రవర్తన, వారి భావోద్వేగాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. జీవితాన్ని కాస్త సరదాగా, ప్రశాంతంగా తీసుకునే మనస్తత్వం ఉన్నవారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిజాయితీగా అంగీకరిస్తూనే, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని తేలింది. వీరు తమకు ఎదురయ్యే సవాళ్లకు త్వరగా అలవాటు పడటమే కాకుండా, రోజువారీ పనులను ఆనందంగా, ఆ పనుల్లో లీనమై మరీ చేయగలిగారు. ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే శక్తిని (రెజిలియన్స్) కనబరచారు.ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకుంటూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, అనుకూలమైన ఫలితాల కోసం ప్రయత్నించే ఈ అలవాటుకు శాస్త్రవేత్తలు ‘లెమనేడింగ్’ అని పేరు పెట్టారు. అంటే ‘చేదు’ లాంటి కష్టాలను కూడా నిమ్మరసంలా తీపిగా/సానుకూలంగా మార్చుకోవడం. దీనినే ఇంకోలా చెప్పాలంటే – జీవితంలో మనకు ఏది ఎదురైతే దానినే, దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వీకరించటం.చేదులోనే తియ్యని రుచి!జీవితాన్ని కాస్త సరదాగా తీసుకోవడం అంటే, మనం ఉన్న పరిస్థితిని తేలికగా తీసుకుంటున్నామని కాదు, ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతోందని అర్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో ప్రజల అనుభవాలను వీరు అధ్యయనం చేసినప్పుడు ఓ నిజం వెల్లడైంది. సరదా మనస్తత్వం ఉన్నవారు భవిష్యత్తు పట్ల సానుకూలంగా ఉంటూ, సమస్యలను చాలా చురుగ్గా, సృజనాత్మకంగా ఎదుర్కొన్నారు. అంటే, జీవితం వారికి చేదు వాస్తవాలను (నిమ్మకాయలు) ఇచ్చినప్పుడు, వారు వాటిని తీపి అనుభవాలుగా (నిమ్మరసం) మార్చుకున్నారు!దీనికి సంబంధించిన పరిశోధనా వ్యాసం ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ’ పత్రిక తాజా సంచికలో అచ్చయింది. ‘‘మా పరిశోధనలో తేలిందేమిటంటే సరదా మనస్తత్త్వం, మానసిక స్థైర్యం అనేవి ‘లెమనేడింగ్’ అనే భావన ద్వారా ఒకదానికొకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. కష్ట సమయాల్లో కూడా సానుకూల అనుభవాలను సృష్టించుకునే సామర్థ్యమే ఈ లెమనేడింగ్’’ అని వ్యాసకర్త, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షియాంగ్యూ ‘షారన్’ షెన్ అంటున్నారు.‘‘పాండమిక్ (మహమ్మారి) సమయంలో సరదా మనస్తత్వం ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఒకే రకమైన భయాన్ని, ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉండే వ్యక్తులు ఆ కష్టతరమైన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోగొట్టుకున్న వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు, అడ్డంకులను ఎదిగే అవకాశాలుగా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఆ పరిస్థితికి ఎలా స్పందించాలన్న విషయాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు’’ అని షెన్ తెలిపారు.‘లెమనేడింగ్’ పరిశోధన వెనుకడాక్టర్ షెన్, ఆమె సహచర శాస్త్రవేత్తలు మనుషుల సరదా మనస్తత్త్వం (ప్లేఫుల్నెస్) అనేది కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆసక్తితో చూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వారికి ఆ విషయాన్ని పెద్ద ఎత్తున పరిశోధించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకోసం వారు అమెరికాలో నివసిస్తున్న 503 మంది వయోజనులను ఎంచుకుని, 2021 ఫిబ్రవరి (కోవిడ్ రెండవ వేవ్, వ్యాక్సిన్ ప్రారంభ సమయం) ఒక సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో పాల్గొన్నవారిని – కరోనా సోకుతుందేమో అనే భయం ఎంతవరకు ఉంది? పరిస్థితులు బాగుపడతాయని నమ్ముతున్నారా? వారికి ఇతరుల మద్దతు ఉందా? వారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు, వారు ఎంత సరదాగా ఉంటారు? ఎంత స్పాంటేనియస్గా (సహజంగా / వెంటనే) స్పందిస్తారు? ఆనందంగా ఉండటానికి ఎంతవరకు ప్రయత్నిస్తారు? అనే అంశాల ఆధారంగా వారి సరదా మనస్తత్వాన్ని కొలిచారు.ఈ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు, సర్వేలో పాల్గొన్న వారిని వారి సరదా మనస్తత్వ స్థాయిని బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. సరదా మనస్తత్వం అనేది మనుషుల ఆలోచనలను, ప్రవర్తనను ఎలా మారుస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అత్యంత సరదాగా ఉండే మొదటి 126 మందిని, అసలు సరదా లేని చివరి 126 మందితో పోల్చి చూశారు.సానుకూల అవకాశాలపై దృష్టిఅత్యంత సరదాగా ఉండే వ్యక్తులు భవిష్యత్తు పట్ల చాలా ఆశావాదంతో ఉన్నారని, వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి వస్తుందని; జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని నమ్మారని ఈ పరిశోధన వివరాలు స్పష్టం చేశాయి. అయితే దీని అర్థం వారు అప్పటి పరిస్థితిని పట్టించుకోకుండా, ఊహల్లో బతికారనడం కాదు!‘‘అతిగా ఆశావాదంతో ఉన్నవారు వాస్తవాలను గుర్తించకుండా ప్రతిదీ బాగుందని భ్రమిస్తుంటారు. కానీ మేము గమనించిన ‘స్పాట్లైట్’ (దృష్టి) ప్రభావం అలా కాకుండా చాలా స్పష్టంగా ఉంది’’ అని డాక్టర్ షెన్ వివరించారు. ‘‘సరదా మనస్తత్వం ఉన్నవారు కోవిడ్–19 ప్రమాదాలను తేలికగా తీసుకోలేదు, అలాగని రక్షణ చర్యల ప్రభావంపై అతిగా అంచనాలూ వేసుకోలేదు. వారు తమ ‘స్పాట్లైట్’ ని కేవలం సానుకూల మార్పులు, మెరుగవటానికి ఉండే అవకాశాలపైకి మళ్లించారు. చీకటి లాంటి కష్టసమయాల్లో కూడా ముందుకు సాగే మార్గాలను వెలుగులోకి తెచ్చుకున్నారు’’ అంటారు షెన్.అధిక సరదా మనస్తత్త్వం కలిగినవారు ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎక్కువ ఉత్సాహపడ్డారు, సంకోచించకుండా ఆలోచించారు. ఇది అనిశ్చిత పరిస్థితుల్లో కూడా అనేక సానుకూల అవకాశాలను ఊహించడానికి వారికి సహాయపడింది. దీనికి తోడు వారి ప్రవర్తనలో ఉన్న సరళత, పనుల్లో వారు చూపించే శ్రద్ధ.. కష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని అందించాయి.చిన్న చిన్న మార్పులు చేసుకున్నారుపాండమిక్ సమయంలో ఇరు వర్గాల వ్యక్తులూ సమానంగానే ఒంటరితనాన్ని, భయాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉన్నవారు ఆ పరిస్థితులను తట్టుకోవడానికి సృజనాత్మక, క్రియాశీలక అడుగులు వేశారు. వారు వేరే ఏవో కొత్త వినోద కార్యక్రమాలలో పాల్గొనలేదు, కానీ తాము చేసే పనుల్లోనే సమయాలను మార్చుకోవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం లేదా చురుగ్గా ఉండటానికి కొత్త మార్గాలు వెతకడం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మారారు. వారు తమ రోజువారీ జీవితంలో మరింత చురుగ్గా, ఆనందంగా, లీనమై గడిపారు.‘‘మా పరిశోధన సరదా మనస్తత్త్వాన్ని కొలవడంపైనే దృష్టి పెట్టినప్పటికీ, ఈ గుణాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలను పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, మీకు ఆనందాన్నిచ్చే పనుల్లో పాల్గొనండి, కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. సరదాగా ఉండటానికి ఆటలే ఆడాల్సిన పనిలేదు. మన రోజువారీ క్షణాల్లో కాస్త ఆనందం, స్వేచ్ఛ, అనుకూలమైన ఆలోచనా విధానాన్ని తెచ్చుకుంటే చాలు’’ అని షెన్ చెబుతున్నారు. జీవితంలో సరదాలు ఉండాలి‘‘ముఖ్యంగా కష్టకాలంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరదా మనస్తత్వం అనేది చాలా కీలకమైనది. కానీ చాలామంది దీని ప్రాముఖ్యతను గుర్తించరు’’ అని అంటారు షెన్. ‘‘సరదాగా ఉండే వ్యక్తులు.. కష్టాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారో అర్థం చేసుకోవడం వల్ల, ఇతరులు కూడా ఒత్తిడిని, అనిశ్చితిని జయించే వ్యూహాలను రూపొందించవచ్చు. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రపంచ స్థాయి సవాళ్లకు వాస్తవిక అంచనా, సృజనాత్మకమైన సర్దుబాటు రెండూ అవసరం కాబట్టి, ఈ విషయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పరిశోధన ఫలితాలను ప్రతి పరిస్థితికీ లేదా అందరికీ ఒకేలా వర్తింపజేయలేమని షెన్, ఆమె సహచరులు హెచ్చరిస్తున్నారు. వేర్వేరు పరిస్థితుల్లో ఈ సరదా మనస్తత్త్వం వేర్వేరు వ్యక్తులపై భిన్నమైన ప్రభావం చూపవచ్చు. అలాగే, అత్యంత సరదాగా ఉండేవారికి, లేనివారికి మధ్య ఉన్న తేడాలన్నీ కేవలం ఈ ఒక్క గుణం వల్లే వచ్చాయని చెప్పలేము. ‘‘మనుషుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మేము గుర్తించినప్పటికీ, రోజువారీ సంఘటనలకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ప్రభావం చూపే ఈ సరదా మనస్తత్త్వం ఇతర పరిస్థితులకు కూడా (రోజువారీ కానివీ, వివిధ రంగాలకు చెందినవీ) వర్తిస్తుందని చెప్పలేం అని షెన్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘సరదా ఆలోచనా విధానం’ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో జీవితంలోని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరపవలసి ఉంది’’ అని షెన్ అంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్- షియాంగ్యూ ‘షారన్’ షెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్
సర్జికల్ మెనోపాజ్తో పెరిగే మూత్ర సంబంధ సమస్యలు!
సహజంగా మెనోపాజ్ వచ్చిన మహిళలతో పోలిస్తే... శస్త్రచికిత్స ద్వారా మెనోపాజ్ (సర్జికల్ మెనోపాజ్) వచ్చిన మహిళల్లో లైంగిక సమస్యలూ, మూత్ర సంబంధిత సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. సర్జికల్ మెనోపాజ్ అంటే ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ ద్వారా అండాశయాలను తొలగించడం వల్ల వచ్చే మెనోపాజ్ అని అర్థం.మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడంతో... జననేంద్రియాలు, దిగువ మూత్రనాళ వ్యవస్థలో మార్పుల కారణంగా వచ్చే దీర్ఘకాలిక సమస్యలతో కూడిన సిండ్రోమ్ను ‘జెనిటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’ (జీఎస్ఎమ్) అంటారు. సర్జికల్ మెనోపాజ్కు గురైన మహిళల్లో జీఎస్ఎమ్ లక్షణాలు చాలా ఎక్కువ తీవ్రతతో ఉన్నట్లు తేలింది. లైంగిక సమస్యల్లో యోని పొడిబారడం, కలయిక సమయంలో నొప్పి, కోరిక తగ్గడం, కలయిక తర్వాత రక్తస్రావం ప్రధానంగా కనిపించాయి.ఇక మూత్ర సంబంధ సమస్యల్లో మూత్ర విసర్జన సమయంలో నొప్పి కనిపించడం, తరచుగా లేదా అత్యవసరంగా మూత్ర విసర్జన చేయాలనిపించడం, మూత్రాన్ని అదుపులో ఉంచుకోలేక΄ోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. సర్జికల్ మెనోపాజ్కు గురైన మహిళల తాలూకు ఇతర ఫిజికల్ పరీక్షల్లోనూ జీఎస్ఎమ్ తీవ్రతను సూచించే స్కోర్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. (చదవండి: మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?)
విమానం కాలిపోతోంది... కాపాడండి! అర్ధరాత్రి బాలుడి కేకలు..
1945 మార్చి 3 – జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని ఇవోజిమా ద్వీపం...రెండో ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న సమయం... అప్పుడే అమెరికాకు చెందిన యుద్ధ విమాన పైలట్ జేమ్స్ హూస్టన్– యుద్ధనౌక నుంచి టేకాఫ్కు సిద్ధమయ్యాడు.‘జాక్! ఈరోజు శత్రువుల పీచమణిచి విజయంతో తిరిగొస్తా. పార్టీ చేసుకుందాం’ అని తన సహచరుడికి చెప్పి ఇవోజిమా ద్వీపం వైపు దూసుకెళ్లాడు జేమ్స్ హూస్టన్. జపాన్ సేనలపై బాంబుల వర్షం కురిపించాడు. అయితే, జపాన్ సైన్యం చేసిన దాడిలో ఇంజిన్కు మంటలంటుకుని విమానం సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న జేమ్స్ చనిపోయాడు.2000 ఏప్రిల్ 10 – అమెరికాలోని లూసియానాలో నివసించే బ్రూస్ లైనింజర్, ఆండ్రియా లైనింజర్ దంపతులు తమ రెండేళ్ల కుమారుడు జేమ్స్ లైనింజర్తో కలిసి ఎప్పటిలాగే నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆ బాలుడు గట్టిగా కేకలు వేశాడు.‘విమానం కాలిపోతోంది! మంటలు అంటుకున్నాయి! ఆ చిన్న మనిషి బయటకు రాలేకపోతున్నాడు... కాపాడండి!’ అంటూ అరిచాడు. దీంతో ఉలిక్కిపడ్డ అతడి తల్లిదండ్రులు జేమ్స్ను దగ్గరకు తీసుకుని బుజ్జగించి నిద్రపుచ్చారు. ఇక ఆ రోజు నుంచి వారికి నిద్ర కరువైంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రపోతున్న బాలుడు ఉన్నట్టుండి గాల్లో కాళ్లు, చేతులు విసిరేస్తూ, ఊపిరి ఆడనట్లు విలవిలలాడిపోయేవాడు. చెమటలతో తడిసిపోతూ గట్టిగా కేకలు వేసేవాడు.వారంలో నాలుగైదు రోజులు ఇదే సీన్. మొదట్లో తల్లిదండ్రులు ఏదో పీడకల అనుకున్నారు. కానీ అంతకంతకూ ఆ చిన్నారి ప్రవర్తన విచిత్రంగా మారింది. బొమ్మ విమానాలతో ఆడుకుంటూ, వాటిని నేలకేసి కొడుతూ ‘విమానం క్రాష్ అయిపోయింది’ అని అరిచేవాడు.రోజులు గడిచేకొద్దీ ఆ చిన్నారి చెబుతున్న మాటలకు తల్లిదండ్రులు షాకయ్యేవారు. ఆ వయసు పిల్లలకు అస్సలు తెలియని ‘విమాన çపరిభాష’ గురించి జేమ్స్ మాట్లాడటం చూసి నిర్ఘాంతపోయేవారు. విమానం కింద ఉండే ‘డ్రాప్ ట్యాంక్’ గురించి, దాన్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలో స్పష్టంగా చెప్పేవాడు. దీంతో ఒకరోజు తండ్రి బ్రూస్ తన కొడుకుని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా ఆరా తీశాడు.‘నాన్నా, అసలు ఆ విమానం ఎక్కడి నుంచి ఎగిరేది?’ అని అడిగితే, ‘అది నటోమా అనే పెద్ద యుద్ధనౌక మీద నుంచి ఎగిరేది డాడీ’ అని బదులిచ్చాడు. ఆ చిన్న మనిషి ఎవరు నాన్నా అని ప్రశ్నిస్తే, ‘అది నేనే.. నా పేరు కూడా జేమ్సే’ అని సమాధానమిచ్చాడు. ‘నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?’ అంటే.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ జాక్ లార్సన్ నాతోనే ఉండేవాడు’ అని చెప్పాడు. ‘జపాన్ సైనికులు తన విమానం ఇంజిన్ పై దాడి చేసి కూల్చివేశారు. విమానానికి మంటలు అంటుకుని సముద్రంలో పడిపోయి చనిపోయాను’ ఆ పసివాడు కళ్లు పెద్దవి చేసి మరీ వివరించాడు.ఇదంతా పసివాడి ఊహాజనిత కథ అని నిరూపించాలని బ్రూస్ నిశ్చయించుకున్నాడు. సైనిక రికార్డులు, రెండో ప్రపంచ యుద్ధ పత్రాలను జల్లెడ పట్టాడు. అవి చూసిన తర్వాత ఆయన వెన్నులో వణుకు పుట్టింది.పసిఫిక్ మహాసముద్రంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పేరు యూఎస్ఎస్ నటోమా బే అని, ఆ నౌకపై జాక్ లార్సన్ అనే పైలట్ పనిచేశాడని, అప్పటికి ఆయన ఇంకా జీవించే ఉన్నాడని తెలుసుకున్నాడు.1945 మార్చి 3న జేమ్స్ హూస్టన్ జూనియర్ అనే 21 ఏళ్ల పైలట్ విమానంపై జపాన్ సైనికులు దాడి చేయడంతో అది సముద్రంలో కూలిపోయి అతడు మరణించాడని మిలిటరీ రికార్డులను బట్టి బ్రూస్ నిర్ధారణకు వచ్చాడు. ఈ నమ్మలేని నిజాలను ప్రత్యక్షంగా నిరూపించుకోవడానికి లైనింజర్ కుటుంబం– చనిపోయిన పైలట్ జేమ్స్ హూస్టన్ సోదరి యాన్ బారన్ దగ్గరకు వెళ్లింది. అప్పటికి వృద్ధురాలైన యాన్ బారన్ ను చూడగానే జేమ్స్– పరిగెత్తుకుంటూ వెళ్లి ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. వారి చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, హూస్టన్ ఇంట్లో ఉన్న బొమ్మల పేర్లు, కేవలం ఆ ఇద్దరికీ మాత్రమే తెలిసిన కుటుంబ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు.అవన్నీ విన్న తర్వాత ఆనందబాష్పాలతో యాన్ బారన్ అన్న మాట: ‘ఇతడు నా తమ్ముడు జేమ్స్ హూస్టన్... నా తమ్ముడే మళ్లీ పుట్టాడు’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం అప్పటికి బతికి ఉన్న సహచర పైలట్ జాక్ లార్సన్ను కలిసినప్పుడు కూడా చిన్నారి జేమ్స్ ఆయనను గుర్తుపట్టి, నాటి యుద్ధ జ్ఞాపకాలను పంచుకున్నాడు.చిన్నారి జేమ్స్ లైనింజర్ కథ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాను, పారాసైకాలజీ పరిశోధకులను ఆకర్షించింది. గత జన్మ వివరాలన్నీ చెప్పిన జేమ్స్... తను మరణించిన జపాన్ సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి నివాళులర్పించాడు. అంతే, అప్పటి నుంచి అతడికి పీడకలలు రావడం ఆగిపోయాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు దీనికి ఎటువంటి శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్న జేమ్స్ లైనింజర్ కథ– ‘పునర్జన్మ’ ఉందనే నమ్మకానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన, సజీవ ఆధారంగా ఉంది.- సత్యకిశోర్ కొండ్రెడ్డి
అంతర్జాతీయం
హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా తన బుద్ధిని మార్చుకోనంత వరకు హార్మూజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బఘెర్ జొల్ఘాదర్ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనను ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.‘అమెరికా ఇకపై ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించే ప్రయత్నం చేయరాదు. ఇరాన్, ఈ ప్రాంతంలోని ఇరాన్ మిత్ర పక్షాలపై అమెరికా దాడులు మానుకోవాలి. ఇరాన్ నౌకాశ్రయాల నుంచి అమెరికా వైదొలగాలి. ఈ ప్రాంతం నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవాలి. ఇరాన్కు పూర్తి యుద్ధ పరిహారం చెల్లించాలి. ఆంక్షలను ఎత్తి వేయాలి. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలి..’వంటి డిమాండ్లు కూడా ఆ ప్రకటనలో ఉన్నాయి.శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్ విభాగానికి జొల్ఘాదర్ కమాండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించలేదు. తమ రెండు దేశాల మధ్య నుంచి వెళ్తున్న హార్మూజ్ జలసంధి ఉమ్మడి నిర్వహణపై ఒమన్తో ఒప్పందం తుది దశకు చేరుకుందని అంతకుముందు ఇరాన్ ప్రకటించింది.
క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్చల్!
టెహ్రాన్: ఇరాన్ సర్వోన్నత నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం, ఆచూకీపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఇరాన్క చెందిన సెమీ-అఫీషియల్ మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ వీడియో, ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందనే వదంతులను తిప్పికొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. Iran’s Mehr RELEASES VIDEO of Supreme Leader Mojtaba Khamenei for ‘FIRST TIME’ pic.twitter.com/v3Rp81VfLH— RT (@RT_com) August 8, 2026అయితే ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ చేసిందనే దానిపై స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులలో ఆయన తండ్రి అయతొల్లా అలి ఖమేనీ హత్య తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మొజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారాన్ని అందిస్తున్నారు. దాడుల సమయంలో ఆయన గాయపడ్డారని, ఆ తర్వాత రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని చెబుతున్నారు.జూలైలో సౌదీ వార్తా సంస్థ అల్-హదత్ ఇజ్రాయెల్.. ఖమేనీ ఇరాన్లో లేరని తెలిపింది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ, సర్వోన్నత నేతతో ప్రత్యక్ష సంబంధాలు ప్రస్తుతం చాలా కష్టంగా ఉన్నాయని అంగీకరించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగా లేదని ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు.ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ!
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్.. కారణం ఇదే!
ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం రాత్రి ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. కీలకమైన రంగాల్లో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. అదేవిధంగా, వాన్స్, ఉష దంపతులకు ఇటీవల కుమారుడు పుట్టిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్లో వెల్లడించారు.తుర్కియే, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వాన్స్ మోదీతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. పరస్పర రక్షణ ఒప్పందంపై తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్లు సంతకాలు చేసిన కొద్ది రోజులకే ప్రధాని మోదీకి వాన్స్ ఫోన్ చేయడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వర్తకం, రక్షణ, ఇంధన భద్రత రంగాలలో భారత్-అమెరికాల సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక సంబంధాలను విస్తరించడంపై కూడా చర్చించారు."అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కీలక రంగాల్లో భారత్-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మేము చర్చించాం" అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత అధికారిక ప్రకటన ప్రకారం.. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని ప్రధాని మోదీ, వాన్స్ సమీక్షించారు.ఉన్నత స్థాయి చర్చల్లో కొనసాగుతున్న పురోగతిని వారు ప్రస్తావించారు. వర్తకం, రక్షణ, సంక్లిష్ట, వర్ధమాన సాంకేతికతలు, ఇంధన భద్రత, కీలక ఖనిజాల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతంపై చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని ప్రకటన తెలిపింది. అయితే, ఈ సంభాషణకు సంబంధించి అమెరికా అధికారిక వర్గాల నుంచి ఇంకా ఎలాంటి వివరాలు వెలువడలేదు. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం గురించి ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందో లేదో స్పష్టత రాలేదు. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరుతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశాలు.. ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందంపై ఆ దేశాలు సంతకాలు చేశాయి.పెరుగుతున్న భద్రతా ఆందోళనల వేళ ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణనలోకి తీసుకోనున్నాయి. మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అలాగే మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మరింత పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.
బాధ్యులను గుర్తించాలి
ఐక్యరాజ్యసమితి: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో శాంతిభద్రతల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై బలప్రయోగం, కాల్పులకు దిగడం వంటి చర్యలకు పాల్పడిన వారిని తప్పనిసరిగా గుర్తించాలని స్పష్టం చేసింది. పీవోకేలో జరుగుతున్న పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన ప్రతినిధి ఫర్హాన్ హక్ వెల్లడించారు. ఈ విషయంలో ఐరాస మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ వెలిబుచ్చిన అభిప్రాయాలను ఆయన పూర్తిగా సమర్థిస్తున్నారన్నారు. జమ్మూ కశ్మీర్తోపాటు లద్దాఖ్లోని ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనివేనని, ఇందులో కొంతభాగాన్ని పాక్ సైన్యం చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుని, తిష్ట వేసిందంటూ భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో వాదిస్తోంది. పీవోకేలో హింసాత్మక ఘటనలను అంశాన్ని ఆగస్ట్ 4న ఐరాసలోనూ ప్రస్తావించింది. ఇందుకు పాక్ ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపించింది.కాల్పుల్లో 400 మంది మృతిపీవోకే అసెంబ్లీలో వలసదారులకు 12 సీట్లను రిజర్వు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలు ఉద్యమ గ్రూపులతో కూడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జాక్) వరుస ఆందోళనలు కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడి, తమకు నచ్చిన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో జాక్ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనలను అణచివేసేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నించింది. సైన్యం జరిపిన కాల్పుల్లో 40 మంది చనిపోయారు. తాము జూన్ మొదటి వారం నుంచి సాగిస్తున్న ఆందోళనలపై పాక్ బలగాలు సాగించిన దమనకాండ ఫలితంగా కనీసం 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాక్ ఆరోపిస్తోంది. పీవోకే జరుగుతున్న ఘటనలపై జూలై 17వ తేదీన వోల్కర్ టర్క్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. జాక్పై పాక్ ప్రభుత్వం నిషేధం విధించడం, పలువురు నేతలను అరెస్ట్ చేయడం, నిరసనకారులపై కాల్పుల ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలంటూ ఆయన పాక్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై శుక్రవారం ఫర్హాన్ హక్ జెనీవాలో మాట్లాడుతూ.. ‘శాంతియుత నిరసనలను ప్రభుత్వాలు అనుమతించాల్సిందే. ఇందుకు ఏ ఒక్కరికీ, ఏ దేశానికీ మినహాయింపు లేదు. పీవోకేలో హింసాత్మక చర్యల విషయంలో పాకిస్తాన్కూ ఇదే వర్తిస్తుంది. కాల్పులు, ఇతర తీవ్ర చర్యలకు కారకులను పాక్ ప్రభుత్వం గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ ఘటనలపై సంపూర్ణ, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలన్నారు.
జాతీయం
మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులు విసిరి.. బురద చల్లి రచ్చ రచ్చ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని హలీషహర్లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ... మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఆమె కాన్వాయ్ను నిరసనకారులు అడ్డుకున్నారు.ఆందోళనకారులు బెనర్జీ వాహనాన్ని చుట్టుముట్టి నిరసన చేపట్టారు. కాన్వాయ్లోని కార్లపై బురద పూశారు. నీటి సీసాలు, చెప్పులు, ఇతర బూట్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెను “దొంగ”, “దొంగల రాణి” అంటూ విమర్శించారు.ఈ నిరసనకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మరణం కారణమైంది. పోలీసు కస్టడీలో దాడికి గురై అతను చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక పోలీసులు కొట్టి చంపారని కుటుంబం ఆరోపించడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగి, ఆందోళనలు చెలరేగాయి. కస్టడీలో మృతి ఆరోపణలపై వివాదం పెరుగుతున్న నేపథ్యంలో, బాధిత కుటుంబాన్ని కలిసేందుకు బెనర్జీ హలీషహర్కు వెళ్లారు. అయితే, ఆమె ఇంటి వద్దకు చేరుకునే ముందే నిరసనకారులు కాన్వాయ్ను అడ్డుకోవడంతో కొద్దిసేపు ప్రతిష్ఠంభన నెలకొంది.పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులుపోలీసు సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భద్రతా సిబ్బంది బెనర్జీ కాన్వాయ్ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లి ఆమెకు మరింత భద్రత కల్పించారు. ఉద్రిక్తత మరింత పెరగకుండా చర్యలు చేపట్టారు. ఈ నిరసన, పోలీసు కస్టడీలో అస్వస్థతకు గురై మరణించిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త బిర్జు కియోత్ మరణం అనంతరం చోటుచేసుకుంది.అవినీతి, వసూళ్ల ఆరోపణలపై కియోత్ను అరెస్టు చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మృతిచెందినట్టు ప్రకటించారు. అతనికి గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతుండగా, కస్టడీలో తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని అతని భార్య ఆరోపించారు. దీంతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.Former #Bengal CM #MamataBanerjee car came under attack in Halisahar as she was on her way to meet with the bereaved family of her party worker - one who #TMC alleges had died in police custody. pic.twitter.com/6vOvbocGFX— Tamal Saha (@Tamal0401) August 9, 2026🚨 Attack on Mamata Banerjee’s carLarge stones allegedly hurled at her vehicle in Barrackpore, right before the police.Mamata: “The police are providing protection to the BJP.”⚠️ This demands answers.#MamataBanerjee #WestBengal #JantaKiMamata#AdivasiMahotsav2026… pic.twitter.com/S81dT97fGZ— Arffa Khannum (@ARFAKHANUMS) August 9, 2026
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ, కారునుఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాద్నగర్ పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచక్ వసా సమీపంలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఒక అధికారులు తెలిపారు. ఉజ్జైన్ వైపు వస్తున్న కంటైనర్ లారీ అకస్మాత్తుగా కార్ను ఢీకొనడంతో, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మృతి చెందినవారంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
మధ్య తరగతి వాళ్ల భావోద్వేగాలు ఇంత తీవ్రంగా ఉంటాయ్
విదేశాలకు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటి వచ్చే క్షణం ప్రతి కుటుంబానికీ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులు, జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఆనందం, ఆశ్చర్యం, ప్రేమ కలిసిన అలాంటి సందర్భాలు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. కుటుంబ బంధాల విలువను గుర్తు చేసే క్షణాలు సోషల్ మీడియాలోనూ విశేష ఆదరణ పొందుతుంటాయి. అలాంటి హృదయాలను హత్తుకునే ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.కెనడా నుంచి ఐదేళ్ల తర్వాత వచ్చి తల్లిదండ్రులకు సర్ప్రైజ్ ఇచ్చాడు ఓ యువకుడు. అతడు ఇంటికి తిరిగి రావడాన్ని చూసిన కుటుంబ సభ్యుల భావోద్వేగానికి లోనయ్యారు. కెనడాలో ఐదేళ్లు గడిపిన తర్వాత సూర్య నాయర్ తన ఇంటికి సర్ప్రైజ్గా రావడం అతనికి, అతని కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తింది. తాను ఇంటికి వస్తున్న విషయం తెలియని తన తల్లిదండ్రులకు ఎలా సర్ప్రైజ్ ఇచ్చాడో చూపిస్తూ నాయర్ తన రాకకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.“వారిని కలవబోతున్నందుకు నేను నిజంగా చాలా ఆత్రుతగా ఉన్నాను” అని చెప్పాడు. నాయర్ తన కుటుంబ సభ్యులను కలుసుకున్న క్షణాలు ఈ వీడియోలో ఉన్నాయి. అతడిని చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనై భావోద్వేగానికి గురైనట్టు కనిపించారు.నాయర్ ఇంటికి తిరిగి రావడాన్ని చూసిన కుటుంబ సభ్యుల భావోద్వేగాలను ఈ అనుకోని కలయిక ప్రతిబింబించింది. సూర్య ఇచ్చిన సర్ప్రైజ్, అతని స్పందనలు ఆ క్షణాన్ని హృదయానికి హత్తుకునేలా చేశాయి.సోషల్ మీడియా యూజర్లు సూర్య, అతని కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఓ యూజర్ “ఈ రోజు ఇంటర్నెట్లో ఇదే అత్యుత్తమ వీడియో” అని పేర్కొన్నాడు. మరో యూజర్ “కొన్ని రీల్స్ను ఇష్టపడకుండా ఉండలేం” అని పేర్కొన్నాడు. “ఇది ఎంతో హృదయానికి హత్తుకునే వీడియో” అని మరో వినియోగదారు వ్యాఖ్యానించాడు. View this post on Instagram A post shared by Surya Nair (@suryanair79)
అబ్బురపరుస్తున్న ఘటన.. నడిరోడ్డుపై గిఫ్ట్, చిన్నారుల కేరింతలు
స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారుల ఉత్సాహాన్ని గమనించిన ఓ లంబోర్ఘిని యజమాని వారికి ఊహించని విధంగా ఆనందాన్ని పంచాడు. రెండు లగ్జరీ కార్లను దగ్గరగా చూసే అవకాశం ఇవ్వడమే కాకుండా, వాటిని పరిశీలించేలా, డ్రైవర్ సీట్లో కూర్చునేలా, ఫొటోలు దిగేలా చేసి ఆ క్షణాన్ని మరపురాని అనుభూతిగా మార్చాడు.ఈ వీడియోను రాకేశ్ కుమార్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వీడియోలో కుమార్ తన నలుపు రంగు లంబోర్ఘిని నడుపుతుండగా, స్కూల్ బస్సులో ఉన్న చిన్నారులు కిటికీల్లోంచి అతని కారును చూస్తూ ఆనందంగా కేరింతలు కొడుతున్నట్టు కనిపించింది.వారి ఉత్సాహాన్ని చూసిన కుమార్.. బస్సు పక్కనే కారు నడుపుతూ కిటికీ అద్దాన్ని కిందకు దించి వారికి చేతులు ఊపాడు. ఆ తర్వాత సూపర్కార్ను దగ్గరగా చూసేలా తాను కారును ఆపేందుకు అనువైన చోటుకు దారి చూపాలని సరదాగా విద్యార్థులను కోరాడు.కారు ఆపిన తర్వాత కుమార్ స్కూల్ బస్సులోకి ఎక్కి చిన్నారులతో మాట్లాడాడు. తన కారు ఏదో గుర్తుపట్టగలరా అని అడగగా, అది లంబోర్ఘినినని విద్యార్థులు ఉత్సాహంగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బస్సు నుంచి దిగివచ్చి కారును దగ్గరగా చూడాలని వారిని ఆహ్వానించాడు. చిన్నారులు కారును తాకుతూ, లోపల పరిశీలిస్తూ, ఒక్కొక్కరిగా డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అలాగే కారుతో ఫొటోలు కూడా దిగారు.ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలని భావించిన కుమార్, తన ఫోన్లో “పప్పు డ్రైవర్” పేరుతో సేవ్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి మరో లగ్జరీ కారును అక్కడికి తీసుకురావాలని కోరాడు. కొద్దిసేపటి తర్వాత ఎరుపు రంగు సూపర్కార్ అక్కడికి చేరుకుని, నలుపు రంగు లంబోర్ఘిని, పసుపు రంగు స్కూల్ బస్సు పక్కనే ఆగింది. రెండు సూపర్కార్లను చూసిన చిన్నారులు ఆనందంతో మురిసిపోయారు. వారు కేరింతలు కొడుతూ, డ్యాన్స్ చేస్తూ, కార్ల చుట్టూ చేరి మరిన్ని ఫొటోలు దిగారు.వీడియోను పంచుకుంటూ కుమార్.. కొంతమంది పిల్లలు కార్ల గురించి కలలు కంటారని, తాను కూడా అలాంటి వారిలో ఒకడినని రాశాడు. బస్సు నిండా ఉన్న చిన్నారులకు ఆ కలను అనుభవించే అవకాశం ఇచ్చానని తెలిపాడు. అక్కడ రెండు సూపర్కార్లు, ఎన్నో చిరునవ్వులు, చిన్ననాటి కలను నెరవేర్చుకున్న ఒక వ్యక్తి ఉన్నాడని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by RAKESH KUMAR (@rakesh_knv)
ఎన్ఆర్ఐ
న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.
లండన్లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఘనంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 94వ సమావేశం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. “ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది. యూకేలో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.” తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాల నుంచి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఒత్తిడిని జయించడంపై టాంపాలో నాట్స్ సదస్సు)
క్రైమ్
భార్యను హత్యచేసిన భర్త
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతనంలోనే పోలియో ఉన్న కమ్మిడి లక్ష్మణరావు (32)కు మానసిక వికలాంగురాలు శ్యామల (30)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఆ గ్రామంలోనే మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ నడుపుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగనన్న కాలనీలో ఉంటున్న లక్ష్మణరావు అన్న కమ్మిడి రాంబాబు ఆదివారం లక్ష్మణరావుకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తమ్ముడి ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ విగతజీవులై కనిపించారు.రెండు చేతుల నుంచి రక్తం కారుతూ శ్యామల మృతి చెందగా, పక్కనే ఉరివేసుకుని లక్ష్మణరావు మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, వారి మరణానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. భార్యను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ మృతుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. లక్ష్మణరావు తల్లితో కలిసి ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం ఆమె మృతి చెందింది. శ్యామలతో వివాహమైన తరువాత కూడా తల్లిని మర్చిపోలేకపోయాడు. దీంతో ‘అమ్మ నీవు లేని ఈ జీవితం నాకు వద్దు, నీ వద్దకే వచ్చేస్తాను, నేను చనిపోతే శ్యామల ఒంటరిదైపోతుంది. కనుక ముందుగా ఆమెను చంపి, నేను చనిపోతాను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు.
ఐషర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. సీఐ శివశంకర్ నాయక్ తెలిపిన మేరకు.. ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్, 35 మందితో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అలాగే, ఐషర్ వాహనం జిమ్ పరికరాలతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతోంది. పొగరూరు గ్రామం వద్ద ఐషర్ వాహనం అదుపుతప్పి నీలూరు పుల్లేటి వంక బ్రిడ్జి ప్రారంభంలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా తిరిగింది. దాని వెనకే వేగంగా వస్తోన్న ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలూ బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకువెళ్లి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు ఎడమకాలు విరగ్గా, ఐషర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులోని 25 మంది గాయాలపాలయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో అనంతపురం నుంచి బెంగళూరు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘మత్తు’ మారుతోంది!
పోలీసులు బాటసింగారం ప్రాంతంలో నిర్వహించిన ఓ ఆపరేషన్లో గత జూన్ 12న ఎండీ డ్రగ్ తయారీ ముఠాను పట్టుకున్నారు. వీరివద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్తోపాటు రూ.50 లక్షల విలువైన డ్రగ్ తయారీ యూనిట్, రసాయనాలు స్వాదీనం చేసుకున్నారు. కీలక సూత్రధారి అయిన సూర్యాపేట జిల్లాకు చెందిన కీసరి మత్స్యగిరి అలియాస్ నరేశ్ మోత్కూరు సమీపంలోని ఓ మామిడి తోటలో రహస్యంగా డ్రగ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. గతంలో కెమిస్ట్గా పనిచేసిన మత్స్యగిరి గుజరాత్కు చెందిన కొందరితో మెఫెడ్రోన్ తయారీని నేర్చుకుని, సొంతంగా ల్యాబ్ పెట్టి ఎండీ డ్రగ్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.షాద్నగర్లోని ఒక అద్దె ప్రాంగణాన్ని రహస్య డ్రగ్ ల్యాబ్గా మార్చి మెఫెడ్రోన్ (ఎండీ) తయారు చేస్తున్న ముఠాను గత మార్చిలో ఈగల్ ఫోర్స్ ఛేదించింది. 17 కిలోల మెఫెడ్రోన్, 300 కిలోల ప్రీకర్సర్ కెమికల్స్ను స్వాధీనం చేసుకుంది. షాద్నగర్ కేంద్రంగా తయారు చేసిన ఎండీనిఇక్కడ విక్రయించడంతోపాటు రాజస్తాన్కు తరలించి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. సాక్షి, హైదరాబాద్: ఈగల్ఫోర్స్, పోలీస్, ఎక్సైజ్ శాఖల ముప్పేట దాడులతో కొకైన్ను సరఫరా చేసే ఆఫ్రికా దేశాలకు చెందిన డ్రగ్ సరఫరా ముఠాలు హైదరాబాద్ వైపు వచ్చేందుకు సాహసించడం లేదు. దీంతో రాష్ట్రంలో కొకైన్ సరఫరాకు దాదాపుగా అడ్డుకట్ట పడింది. విదేశాల నుంచి వచ్చే కొకైన్ సరఫరా తగ్గడంతో డ్రగ్స్ ముఠాలు రూటు మారుస్తున్నాయి. డ్రగ్ పెడ్లర్లు యువతను, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొత్త రకాల మత్తు పదార్థాల విక్రయాలు విస్తరిస్తున్నారు. గంజాయి, నల్లమందు, ఎండీఎంఏతోపాటు ప్రధానంగా ఎండీ డ్రగ్ను యువత గుట్కాలో కలిపి తీసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. మెల్లగా గుట్కాలో కొద్దికొద్దిగా కలిపి విద్యార్థులకు అలవాటు చేస్తున్న మత్తుముఠాలు నెమ్మదిగా వారిని బానిసలుగా మారుస్తున్నాయి. తొలుత తక్కువ రేటుకే మత్తుపదార్థాలను విద్యార్థులకు చేరవేసి.. తర్వాత వారిని బానిసలుగా మారుస్తున్నారు. డ్రగ్ పెడ్లర్లు కొకైన్ కాకుండా కొత్త మత్తు పదార్థాలపై దృష్టి సారిస్తున్నట్లు ఈగల్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా మెఫెడ్రోన్ (ఎండీ), మరో సింథటిక్ డ్రగ్ ఎండీఎంఏ, నల్లమందు (ఓపియం) వంటి మత్తు పదార్థాల వైపు స్థానిక డ్రగ్ నెట్వర్క్లు మళ్లుతున్నాయి. ఇటీవల వరుసగా ఎండీఎంఏ, మెఫెడ్రోన్, ఓపియం సరఫరాదారుల అరెస్టులు, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న స్థానిక డ్రగ్ తయారీ యూనిట్లు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దేశీయంగా తయారు చేస్తూ... అంతర్జాతీయంగా సరఫరా అవుతున్న డ్రగ్స్పై నిఘా పెరగడంతో కొన్ని ముఠాలు దేశీయంగానే కొన్నిరకాల డ్రగ్స్ తయారీకి తెరతీశాయి. గుట్టుచప్పుడు కాకుండా చిన్న చిన్న ల్యాబ్లలో సింథటిక్ డ్రగ్స్ను తయారు చేసి.. అంతర్రాష్ట్ర లింక్లతో దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. ఇటీవల జరిపిన కొన్ని సోదాల్లో ప్రధానంగా రాజస్తాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఎండీ డ్రగ్ తెలంగాణకు వస్తున్నట్టుగా ఈగల్ ఫోర్స్ అధికారులు గుర్తించి నిఘా పెంచారు. రాజస్తాన్కు చెందిన డ్రగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్న రెండు మెఫెడ్రోన్ తయారీ కేంద్రాలను ఇటీవలే గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. అదేవిధంగా గత జూన్లోనూ బాటసింగారం ప్రాంతంలో మత్స్యగిరి అనే వ్యక్తి మామిడి తోటలో రహస్యంగా ఏర్పాటు చేసిన ఎండీ డ్రగ్ తయారీ యూనిట్ను ఈగల్ అధికారులు గుర్తించారు. ఈ తరహా డ్రగ్స్ రాజస్తాన్కు చెందిన ముఠాలే నగరానికి సరఫరా చేస్తుండడంతో నిఘా పెంచిన ఈగల్ అధికారులు 2023 ఇప్పటి వరకు 78 సార్లు ఈ ముఠాలను అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత టార్గెట్గా.. మత్తుకు బానిసలుగా మారిన విద్యార్థులను డబ్బుకోసం, మత్తుపదార్థాల కోసం డ్రగ్ పెడ్లర్లుగా మార్చుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. పిల్లలు, యువత ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో డ్రగ్ నెట్వర్క్ల కార్యకలాపాలను తెలంగాణ పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. క్వాంటమ్ లీప్ స్కూల్ కేసు నేపథ్యంలో విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్ సరఫరా, విక్రయాలపై మరింత నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యార్థులు, కమ్యూనిటీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్రాష్ట్ర డ్రగ్ మాఫియాను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసుల సమన్వయంతో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు చేపడుతున్నారు. స్థానిక పెడ్లర్ నుంచి అంతర్రాష్ట్ర సరఫరాదారు వరకు మొత్తం గొలుసును ఛేదించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. పూర్తి సాంకేతికతను వాడుకుంటూ దాడులు చేస్తున్నారు. విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం ఉపేక్షించబోమని, ఇలాంటి నెట్వర్క్లపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు తీసుకుంటామని ఈగల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.‘ఎండీ’తో తీవ్ర ఆరోగ్య ముప్పు మెఫెడ్రోన్ (ఎండీ) అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ సైకోయాక్టివ్ డ్రగ్గా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల గుండె వేగంగా లేదా అసమానంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, తీవ్ర ఆందోళన, భయాందోళనలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తరచూ వినియోగిస్తే దీనికి బానిసగా మారి వ్యసనానికి గురయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. తీవ్రమైన మత్తు ప్రభావంలో దూకుడు ప్రవర్తన, భ్రాంతులు, ఫిట్స్ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎండీ మత్తులో కొందరు తమకు తామే తీవ్రంగా గాయపరుచుకోవడం, ప్రమాదకరంగా ప్రవర్తించడం వంటి ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. తయారీ కేంద్రాలపై నిఘా పెంచాంమత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలను, పెడ్లర్లను కట్టడి చేయడంతో డ్రగ్స్ నెట్వర్క్ను పూర్తిగా ధ్వంసం చేసేలా ఈగల్ ఫోర్స్ విస్తృతంగా పనిచేస్తోంది. అదేవిధంగా ఎండీ, ఇతర డ్రగ్స్ తయారీ కేంద్రాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇటీవల కాలంలో రాజస్తాన్తోపాటు తెలంగాణ కేంద్రంగా ఎండీ డ్రగ్ తయారీ కేంద్రాలపై నిఘా పెంచాం. ఇప్పటికే కొన్ని ల్యాబ్లను మూయించాం. అదేవిధంగా రాజస్తాన్ నుంచి వివిధ పనుల కోసం తెలంగాణకు వస్తున్న యువతలో ఈ మత్తుపదార్థాలు అలవాటు ఉన్న వాళ్ల ద్వారా ఇక్కడికి ఎండీ, నల్లమందు ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించాం. డ్రగ్స్ వాడితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని నమ్మించి ఇక్కడి యువతకు దీన్ని అలవాటు చేస్తున్నారు. మనకు ఎక్కువగా రాజస్తాన్ ముఠాల నుంచే వస్తున్నాయి. కానీ అక్కడి వాళ్లను అరెస్ట్ చేసేందుకు రాజస్తాన్కు వెళ్లిన సమయంలో మన ఫోర్స్పై దాడులు జరిగిన ఘటనలు ఉంటున్నాయి. త్వరలో రాజస్తాన్ పోలీసుల సహకారంతో భారీ ఆపరేషన్స్ చేస్తాం. – సందీప్ శాండిల్య, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్రూ.54 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురి అరెస్ట్ భువనగిరి (బీబీనగర్): కారులో తరలిస్తున్న మాదక ద్రవ్యాలను యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను యాదాద్రి భువనగిరి ఎస్పీ అక్షాంశ్యాదవ్ ఆదివారం బీబీనగర్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. వివరాలు ఇలా... బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద శనివారం స్థానిక పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో సుమారు రూ.54 కోట్ల విలువ చేసే 27 కిలోల నిషేధిత మెఫెడ్రోన్తోపాటు డ్రగ్స్ తయారీలో ఉపయోగించే 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను గుర్తించారు. కారులో ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన చేతన్ మధుకర్ మెప్రామ్, ఆకాశ్ అశోక్ గవాండే, అస్సాంలోని మారిగావ్కు చెందిన ముజుమాల్ హక్, హైదరాబాద్లోని చందానగర్కు చెందిన ఉపద్రష్ట రమణమూర్తిని అరెస్టు చేశారు. వారిని విచారించగా కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్లో మెఫెడ్రోన్ తయారుచేసినట్లు అంగీకరించారు. డ్రగ్స్ను కొండమడుగు నుంచి నాగపూర్కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. అనంతరం పోలీసులు వేటుకూరి ల్యాబ్కు వెâళ్లి తనిఖీలు చేశారు. పట్టుబడిన డ్రగ్స్తోపాటు ల్యాబ్లో డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తున్న రియాక్టర్, సెంట్రీఫ్యూజ్, ఇతర పరికరాలు, 6 సెల్ఫోన్లు, కారు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నాగపూర్కు చెందిన చందా ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్ పటేలియా, హైదరాబాద్ మేడిపల్లికి చెందిన ల్యాబ్ యాజమాని వేటుకూరి రామరాజును పట్టుకునేందుకు పోలీస్ బృందాలను నియమించినట్లు చెప్పారు.
రూ.500 కోసం దాడి.. అవమానం భరించలేక డ్రైవర్ ఆత్మహత్య
సాక్షి, జగిత్యాల: కేవలం రూ.500 విషయంలో జరిగిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. తన యజమాని వద్ద రావాల్సిన డబ్బులు అడిగిన ట్రాక్టర్ డ్రైవర్పై దాడి జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్ అనే ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. వెల్దుర్తికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రమేశ్కు తన యజమాని వద్ద రూ.500 రావాల్సి ఉంది. డబ్బులు ఇవ్వకపోవడంతో రమేశ్ ఫోన్లో యజమానిని మందలించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని గంగారెడ్డి మరో వ్యక్తితో కలిసి రమేశ్ ఇంటికి వెళ్లి ‘నన్నే తిడుతావా?’ అంటూ తన భార్య, పిల్లల ఎదుటే రమేశ్పై ఇద్దరూ కలిసి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో రమేశ్ స్పృహ కోల్పోయి కిందపడిపోయినట్లు తెలిపారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించిన తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం.అయితే తనకు జరిగిన అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జరిగిన ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రమేశ్పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగారెడ్డితో పాటు మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రమేశ్కు భార్య, కుమారుడు ఉన్నారు. రూ.500 కోసం తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీడియోలు
అసంతపురం, గుడివాడలో టెన్షన్ టెన్నన్.. అర్థరాత్రి పోలీసుల నోటీసులు
ఎంతో బాధతో ఈ వీడియో చేస్తున్న.. డాక్టర్ ప్రియాంక మృతిపై మార్గాని భరత్ ఎమోషనల్
గోల్డ్ రన్.. 2 లక్షల వైపు బంగారం పరుగు
పెద్ది ఫ్యామిలీకి కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతిపై వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
శ్రీకాకుళం పోలీసులకు కోర్టులో బిగ్ షాక్
ఈ కేసులో రాజకీయ హస్తం ఉంది..!? ప్రియాంక తండ్రి సంచలన వ్యాఖ్యలు
నీ కొడుకుని పదవి నుండి తొలగించు..!? లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు..!
ఆటమ్ టూ మర్డర్ కేసు..!? డాక్టర్ ప్రియాంక కేసులో ఎస్పీ సంచలన విషయాలు!
ఖబర్దార్ బోండా ఉమా.. ఒళ్లు దగ్గర పెట్టుకో! మీ ఇంటిని ముట్టడించడం ఖాయం!


