‘నన్ను నగ్నంగా మార్చకండి!’
నేను మీ పాదాల కింద ఉన్న భూమిని. యుగాలుగా మిమ్మల్ని మోస్తున్న ఓర్పును. పేగు బంధంతో మీ పొట్ట నింపుతున్న తల్లిని. కానీ ఈరోజు మీ పురోగతి నా పాలిట శాపమైంది. మానవ మనుగడకు కావలసిన వనరులన్నీ నా గుండె లోతుల్లోంచి తీసి ఇచ్చినందుకు నాకిదేనా బహుమానం? ఒకవేళ నాకు గొంతు వస్తే.. నా వేదనను మీకు ఇలా విన్నవించుకునేదాన్ని!శాస్త్ర సాంకేతిక రంగాల మహత్తర ప్రగతి అని మీరు మురిసిపోతుంటే ఆ వెనుక కుమిలిపోతున్నది నేనే. రోజూ పారిశ్రామిక రంగాలు వెదజల్లే నల్లని దట్టమైన పొగలు, విషవాయువులతో నా శ్వాస ఆగిపోతోంది.మీ ఆసుపత్రులు, వైద్య రంగం ఇచ్చే చికిత్సలతో మనుషులు కోలుకుంటున్నారు గానీ, అక్కడి నుంచి వెలువడే బయో మెడికల్ వ్యర్థాలు, హానికర ప్లాస్టిక్ నన్ను రోగగ్రస్తురాలిగా మారుస్తున్నాయి.పారిశుధ్య లోపం వల్ల ఉత్పత్తయ్యే కుళ్లిన వ్యర్థాలు, పారిశ్రామిక రసాయనాలు నా సిరల్లోకి విషాన్ని నింపుతున్నాయి.ఎలక్ట్రానిక్స్, 5జీ యుగం తెచ్చిన మొబైల్ రేడియేషన్ నా వాతావరణాన్ని, జీవవైవిధ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. మానవ తప్పిదాల వల్ల నా నేల తల్లి నల్లబడిపోతోంది.పండిస్తున్న పంటల పేరుతో వ్యవసాయంలో విచ్చలవిడిగా వాడే క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువులు నా జీవసారాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి.పచ్చని చెట్లను నరికివేసి నన్ను నగ్నంగా మార్చడం వల్ల వర్షపు నీటికి నా పైపొరలు కొట్టుకుపోయి నేల తీవ్ర క్రమక్షయానికి గురవుతోంది.మీ నాగరికత సాధించిన ప్రగతికి నేను సంతోషిస్తున్నాను.. కానీ విషపు వలయాలతో నా గుండెలపై నిర్మించే ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదని గ్రహించండి!దయచేసి మానవాళికి నా విజ్ఞప్తి..క్రిమిసంహారకాలు, కృత్రిమ ఎరువులతో నేలను విషపూరితం చేయకండి; ప్రకృతి వ్యవసాయాన్ని ఆదరించండి.పచ్చదనాన్ని నాశనం చేసి నేల క్రమక్షయానికి కారణం కాకండి.ప్లాస్టిక్, ఇ-వేస్ట్, వైద్య వ్యర్థాలను నిర్లక్ష్యంగా నేలపై పడేసి నన్ను కలుషితం చేయకండి.పరిమితి లేని వాహన వినియోగం, పారిశ్రామిక వ్యర్థాలతో నా వాతావరణానికి, ఆయువుకు గొడ్డలిపెట్టు కాకండి.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..
రేపు వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం రేపు)బుధవారం) భేటీ కానుంది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాజా రాజకీయ పరిణామాలు, డీఎస్సీలో జరిగిన అవతవకలు, అక్రమాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఆ టరమ్లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్లో 2047 విజన్తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
మెడికో ప్రియాంక కేసు.. అసలు మాల్లో ఏం జరిగింది?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద కారుతో ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక కేసులో అనుమానాలు వీడడం లేదు. ఇప్పటి వరకు మాల్లో ప్రియాంకపై వాహనంతో జరిగిన దాడికి సంబంధించి మాత్రమే సీసీ ఫుటేజ్ బయటికి వచ్చింది. నిందితులు మాల్లోకి వచ్చిన ఫుటేజ్ గాని, ప్రియాంక మాల్లోకి ఎప్పుడు వచ్చిందన్న ఫుటేజ్ గాని పోలీసులు బయట పెట్టలేదు.మాల్లో ఏం జరిగిందన్న విషయంపై సందేహాలు తొలగలేదు. ప్రసాదిత్యా మాల్లో నిందితులతో మాల్ సిబ్బందికి జరిగిన గొడవ పుటేజ్ బయటకు ఎందుకు రాలేదన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ ప్రియాంక పోస్ట్మార్టం రిపోర్ట్, కెమికల్ ఎనాలసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అల్టర్ చేసే అవకాశం ఉంది.కాగా, ప్రియాంక మృతదేహానికి సోమవారం రాజమహేంద్రవరం డీఎస్పీ సుభాష్ బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు క్రైం డీఎస్పీ సుభాష్, ప్రకాశ్నగర్ సీఐ బాజీలాల్, ఎస్సై సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.మర్నాడు పోస్టుమార్టం పక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో స్వగ్రామమైన గద్వాల్ జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పురానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా
ఆర్ట్తో ఎడ్యుకేషన్..!
‘నన్ను నగ్నంగా మార్చకండి!’
ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అరెస్టు
‘డీసీ’ని రామ్గోపాల్వర్మ సినిమాతో పోల్చిన దర్శకుడు!
రేపు వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం
వర్షాకాలంలో ఫ్యాషన్ కంటే కంఫర్ట్కే ప్రాధాన్యం! ఎందుకంటే?
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్హౌస్ కొనుగోలు
‘రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి?
ప్రోస్టేట్ కేన్సర్ ఎముకలకు వ్యాపిస్తుందా..? అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కూడా..
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
హెరిటేజ్ - విజయ డెయిరీ
వరుస యుద్ధాలతో అడుగంటిన ఆయుధ సామగ్రి
కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా'
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాలలో పురోగతి
వారణాసిలో హనుమంతుడి పాత్ర.. రాజమౌళి ప్లాన్ అదేనా?
మహేశ్ బాబు బర్త్ డే.. నమ్రతా స్పెషల్ పోస్ట్
ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. స్థిరాస్తివృద్ధి
కేంద్రానికి పసిడి పంట
సాక్షి కార్టూన్: 09-08-2026
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా
ఆర్ట్తో ఎడ్యుకేషన్..!
‘నన్ను నగ్నంగా మార్చకండి!’
ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అరెస్టు
‘డీసీ’ని రామ్గోపాల్వర్మ సినిమాతో పోల్చిన దర్శకుడు!
రేపు వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం
వర్షాకాలంలో ఫ్యాషన్ కంటే కంఫర్ట్కే ప్రాధాన్యం! ఎందుకంటే?
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్హౌస్ కొనుగోలు
‘రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి?
ప్రోస్టేట్ కేన్సర్ ఎముకలకు వ్యాపిస్తుందా..? అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కూడా..
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
హెరిటేజ్ - విజయ డెయిరీ
వరుస యుద్ధాలతో అడుగంటిన ఆయుధ సామగ్రి
కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా'
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యవహారాలలో పురోగతి
వారణాసిలో హనుమంతుడి పాత్ర.. రాజమౌళి ప్లాన్ అదేనా?
మహేశ్ బాబు బర్త్ డే.. నమ్రతా స్పెషల్ పోస్ట్
ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. స్థిరాస్తివృద్ధి
కేంద్రానికి పసిడి పంట
సాక్షి కార్టూన్: 09-08-2026
ఫొటోలు
ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)
కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
హైదరాబాద్ లో అద్భుత ఘట్టం (ఫొటోలు)
కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు)
హైదరాబాద్ గచ్చిబౌలి లో సందడి చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మ మానస చౌదరి (ఫొటోలు)
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)
‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు)
హైదరాబాద్లో రాఖీ పండుగ సందడి (ఫొటోలు)
సినిమా
మాతృత్వం ఓవైపు.. సినిమా మరోవైపు
సినీ తారలు అనుకున్నది సాధించేందుకు ఎంతటి కష్టాన్నైనా లెక్కచేయరు అనడానికి ఈ బాలీవుడ్ బ్యూటీ చక్కటి ఉదాహరణ. మాతృత్వం వంటి కీలక దశలోనూ తన వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భంతో ఉంది. అయినప్పటికీ షూటింగ్కు బ్రేక్ ఇవ్వకుండా ‘రాకా’లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసేందుకు కష్టపడుతోందట. సంబంధించిన విషయాలు వైరల్ కావడంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.షూటింగ్లో మళ్లీ బన్నీ..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ‘రాకా’. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కాస్త విరామం తీసుకున్న బన్నీ.. మళ్లీ షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు దీపికాకు సెప్టెంబర్లో డెలివరీ ఉండటంతో.. అంతకంటే ముందే తనకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసేందుకు ఆమె పట్టుదలతో పనిచేస్తోందట. షూటింగ్ షెడ్యూల్ రాత్రివేళ వరకు కొనసాగుతున్నా సెట్లోనే ఉంటూ తన సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె అంకితభావాన్ని చూసి చిత్రబృందం సైతం ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం.గతంలోనూ వైరల్..దీపికా దాదాపు ఏడు నెలల గర్భంతో ఉన్న సమయంలోనూ ‘రాకా’ కోసం రోజూ షూటింగ్లో పాల్గొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండటంతో ఆమె పాత్ర సవాల్తో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఆమె పరిస్థితికి అనుగుణంగా చిత్రబృందం షూటింగ్ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ మాస్ టేకింగ్కు అల్లు అర్జున్ క్రేజ్ తోడవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్.
'ఇరుముడి'కి శబరిమలతో సంబంధం లేదు
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. పోస్టర్స్ దగ్గర నుంచి పాటల వరకు చూస్తుంటే ఇది అయ్యప్ప దీక్ష, స్వామి మాల నేపథ్య కథతో తీశారని చాలామంది అనుకున్నారు. అయితే శబరిమలకు ఈ మూవీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశాడు. వచ్చే శుక్రవారమే చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు: నాగార్జున)'ఈ సినిమా స్టోరీకి శబరిమలతో ఎలాంటి సంబంధం లేదు. హీరో జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఓ భాగం మాత్రమే. దీక్ష టైంలో అయ్యప్ప భక్తులు తమ అలవాట్లు, నియమావళి విషయంలో నిష్టగా ఉంటారు. వ్యసనాలు ఉన్న ఓ మనిషి ఈ దీక్ష స్వీకరించాల్సి వస్తే అతడు మద్యానికి దురంగా ఉండాల్సి వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. కఠినమైన నియమాలు ఉంటాయి కాబట్టి నేను అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని తీసుకున్నాను. అంతే తప్ప శబరిమలతో సినిమా స్టోరీ కాదు. 41 రోజుల దీక్ష కథే మూవీని మరింత ప్లస్. దీక్షకు ముందు ఏం జరిగింది? దీక్షలో ఉన్నప్పుడు ఏం జరిగిందనే విషయాలు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి' అని డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో రవితేజ భార్యగా హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ నటించింది. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. తండ్రికూతురు అనుబంధం కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది.(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)
అక్కకు పూర్తిగా పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా
తమిళ ప్రముఖ హీరోయిన్ దుషారా విజయన్.. తన జీవితంలో చెరిగిపోని విషాదాన్ని తలుచుకుని ఎమోషనల్ అయింది. అక్క మరణాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఈమె నటించిన లేటెస్ట్ సినిమా 'జీడీఎన్'. దీని ప్రమోషన్లలో భాగంగా చాలా విషయాలు మాట్లాడిన దుషార.. అక్కడతో తన అనుబంధం, పుట్టుకతోనే ఆమెకొచ్చిన పక్షవాతం గురించి చెప్పింది.(ఇదీ చదవండి: తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు: నాగార్జున)దుషారా విజయన్కు ఇద్దరు అక్కలు ఉండగా వారిలో రెండో అక్క దుర్గా దాదాపు పదేళ్ల క్రితం కన్నుమూసింది. ఈమెకు పుట్టుకతోనే మ్యోపతి అనే వ్యాధి ఉంది. దీని కారణంగా ఆమె మెడ కింది భాగం పూర్తిగా పక్షవాతానికి గురైందని దుషార చెప్పుకొచ్చింది.'మెడ పైభాగం వరకు ఆమెకు ఎలాంటి సమస్య లేదు. మెడ కింది భాగం మాత్రం పూర్తిగా పక్షవాతానికి గురైంది. అందుకే రోజువారీ పనులన్నింటికీ మేమే సహాయం చేయాల్సి వచ్చేది. నాకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్పై ఆసక్తి ఏర్పడటానికి అక్కే కారణం. నేను డ్యాన్స్ చేస్తుంటే వీల్ఛైర్లో కూర్చుని ఇలా చెయ్ అలా చెయ్ అని సూచించేది. నేను ఆమెని చాలా మిస్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్లినా నేను దేవుడిని మొక్కను. నా అక్క ఫొటో చూసి ప్రార్థిస్తాను' అని దుషారా చెప్పింది.తమ్ముడితో అనుబంధం గురించి మాట్లాడిన దుషారా.. దాదాపు ఏడేళ్ల పాటు తమ్ముడితో కలిసి చెన్నైలో నివసించాను. టెక్నికల్గా చెప్పాలంటే నేను వాడికి తల్లిలాంటిదాన్ని. వాడు నాకు నా బిడ్డ లాంటివాడు అని పేర్కొంది. సార్పట్ట పరంపరై, నచ్చతిరం నగర్గిరదు, రాయన్, వేట్టయాన్ తదితర సినిమాల్లో నటించింది. ఈ శుక్రవారం ఈమె ఓ హీరోయిన్గా చేసిన 'మకుటం' రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా':దుషారా విజయన్)
తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు
తన తల్లిదండ్రులని తలుచుకుని హీరో నాగార్జున భావోద్వేగానికి లోనయ్యారు. ఈయన నిర్మించిన 'పళ్లబురుసు' అనే చిన్న సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో సోమవారం సాయంత్రం జరిగింది. ఇందులోనే నాగ్ మాట్లాడుతూ ఎన్నడూ లేనంతలా ఎమోషనల్ అయ్యారు. తండ్రితో జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. త్వరలో మూడో పార్ట్?)'నా తండ్రి ప్రారంభించిన ఈ సంస్థతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ని మరింత విస్తరించాం. నా తల్లిదండ్రులని ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకున్నాను. నా భార్య అమల కూడా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమె కూడా తల్లిదండ్రులని ఎంతో శ్రద్ధగా చూసుకుంటోంది. తల్లిదండ్రులు మన కోసం చేసిన త్యాగాలని గుర్తించి వారికి అండగా నిలవడం మన జీవితంలో అత్యంత విలువైన బాధ్యత. తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవడం కంటే జీవితంలో గొప్ప అదృష్టం మరొకటి ఉండదు' అని నాగార్జున అన్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టారు. మొన్ననే కొడుకు అఖిల్తో తీసిన 'లెనిన్' సక్సెస్ అయింది. అలానే నాగ్ కూడా తన 100వ సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ కూడా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది.(ఇదీ చదవండి: ‘వారణాసి’లో హనుమంతుడిగా రామ్ చరణ్?)నేను నా తల్లిదండ్రులను చూసుకున్నాను.. అమల కూడా అదృష్టవంతురాలు .. పెరెంట్స్ ను దగ్గరుండి చూసుకుంటోంది. మన చినప్పుడు వారే మన వేలు పట్టుకుని నడిపించారు. అలాంటి వారిని చూసుకోవాలిగా..!#Nagarjuna #PallaburusuOnAug14th #Amala #Akhil #Nagachaitanya pic.twitter.com/JbvaRNZ2gN— SZN (@Suzenbabu) August 10, 2026
క్రీడలు
‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్!
ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో పదవి నుంచి తప్పించాలని ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు మద్దతుగా నిలవడం ఆసక్తి కలిగిస్తోంది. ఇన్ఫాంటియానోను పదవి నుంచి తప్పించాలని ప్రపంచ ఫుట్బాల్ నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకేమి ఉండదని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ఘాటుగా వ్యాఖ్యానించారు.ఫిఫా వరల్డ్ కప్ వంటి ప్రపంచ స్థాయి టోర్నమెంట్ల వాణిజ్య హక్కులను నిర్వహించేందుకు 20 బిలియన్ డాలర్ల విలువైన ఒక కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని ఫిఫా యోచిస్తోంది. ఇందులో 20 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రణాళికను విరమించుకునేంత వరకు ‘ఫిఫా’ అన్నీ టోర్నమెంట్లను బహిష్కరించనున్నట్లు యూరోపియన్ సాకర్ సంస్థ హెచ్చరించింది. ఫిఫా అధ్యక్ష పదవి నుంచి కూడా ఇన్ఫాంటినో తప్పుకోవాలనే డిమాండ్లు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అతడికి మద్దతు పలకడం గమనార్హం.ఇక ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ఇలా రాసుకొచ్చారు. "ఏ కారణం చేతనైనా, అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోను తొలగించాలని ఫీఫా కనీసం ఆలోచించినా అది ఒక ఘోరమైన పొరపాటే అవుతుంది. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఇప్పటివరకు నిర్వహించిన ప్రపంచ కప్లలోకెల్లా అత్యంత విజయవంతమైన దానిని నాలుగుసార్లు నిర్వహించారు. ఆయన లేకపోయుంటే ఇంత లాభదాయకంగా ఉండేది కాదేమో! ఈ విషయంపై శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.2016 నుంచి గియాని ఇన్ఫాంటినో ఫిఫా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2019, 2023 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన... వచ్చే ఏడాది మార్చిలో మొరాకో వేదికగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో చివరిసారి పోటీ చేయనున్నారు. ‘ఫిఫా’లో మొత్తం 211 సభ్య దేశాలు ఉండగా... యూరప్, దక్షిణామెరికాలోని 90 దేశాలతో పాటు ఆసియా ఫుట్బాల్ సమాఖ్యలోని 46 దేశాలు కూడా ఇన్ఫాంటినో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.Read: ఆ ముగ్గురి నుంచి ఫోన్కాల్.. అందరికీ ఒకటే సమాధానం!
ఆ ముగ్గురి నుంచి ఫోన్కాల్.. అందరికీ ఒకటే సమాధానం!
అజింక్యా రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో స్వదేశంలో కంటే విదేశీ టూర్లలో ఎక్కువగా రాణించిన రహానే సంతృప్తిగానే వీడ్కోలు పలికినట్లు పేర్కొన్నాడు. అయితే తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించిన సమయంలో సచిన్, కోహ్లి, రోహిత్లు తనకు ఫోన్కాల్ చేసి నిర్ణయంపై పునరాలోచన చేయాలని తెలిపారు. కానీ ఆ ముగ్గురికి తాను ఒకటే సమాధానం చెప్పానని, ఇష్టపూర్వకంగానే తాను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వాళ్లకు చెప్పానని రహానే చెప్పుకొచ్చాడు. వీళ్లతో పాటు ఇర్ఫాన్ పఠాన్, బుమ్రా నుంచి కూడా తనకు సందేశాలు వచ్చాయని తెలిపాడు. రిటైర్మెంట్ వీడియోనూ పోస్టు చేసిన తర్వాత తనకు మొదటి కాల్ సచిన్ టెండూల్కర్ నుంచి వచ్చిందని రహానే వెల్లడించాడు.'రహానే.. నువ్ ఇంకా ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడతావు అనుకున్నా' అని సచిన్ చెప్పినట్లు తెలిపాడు. ఇకపై క్రికెట్ను సాగదీయకుండా, ఎలాంటి అసంతృప్తి లేకుండా కెరీర్ ముగించాలనే నిర్ణయం తీసుకున్నానని సచిన్కు చెప్పినట్లు రహానే పేర్కొన్నాడు. ఇక మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా రహానేకి ఫోన్ చేసి మాట్లాడాడు. మరోవైపు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్లు రహానేకి మెసేజెస్ అండ్ కాల్స్ చేశారు. అయితే వీరందరికీ రహానే ఒకటే సమాధానం ఇచ్చినట్లు తెలిపాడు. క్రికెట్కు తాను పూర్తిగా న్యాయం చేశాననే సంతృప్తితో ఉన్నానని, తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేసినట్లు రహానే వెల్లడించాడు.కోహ్లి, పుజరాలతో ఉన్న బంధం గురించి రహానే స్పందించాడు. ‘దేశీయ క్రికెట్లో నేను, పుజారా చాలా కాలం కలిసి ఆడాము. అయితే, భారత్ తరఫున ఆడుతున్నప్పుడు నేను, విరాట్ ఎక్కువ సమయం కలిసి గడిపాము. కానీ మా మధ్య బంధం చాలా బలంగా ఉండేది. భారత టెస్ట్ జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లడమే మా ఉమ్మడి లక్ష్యం. 2015లో ఆరో, ఏడో ర్యాంకులో ఉన్న మేము, క్రమంగా నంబర్ 1 టెస్ట్ జట్టుగా ఎదిగాము. మేము నిరంతరం ఆట గురించి చర్చించుకుంటూ, విశ్లేషించుకుంటూ, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాము. చాంపియన్లుగా మారకముందు, టెస్టుల్లో మేమిద్దరం కలిసి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాము. అది ఎంతో ఆనందాన్నిచ్చింది.’ అని చెప్పుకొచ్చాడు.రహానే తన 15 ఏళ్ల కెరీర్లో భారత్ తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 8414 పరుగులు చేశాడు. అందులో 5077 రన్స్ టెస్ట్ క్రికెట్లో సాధించినవే కావడం గమనార్హం. అతడి పేరిట 12 టెస్టు సెంచరీలు ఉన్నాయి.చదవండి: విండీస్ ఆశలపై నీళ్లు చల్లిన అఫ్గానిస్తాన్
విండీస్ ఆశలపై నీళ్లు చల్లిన అఫ్గానిస్తాన్
ఐర్లాండ్పై విజయంతో 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించిన అఫ్గానిస్తాన్.. వెస్టిండీస్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని విండీస్ కోల్పోయింది. ఇక ప్రపంచకప్కు అర్హత సాధించేందుకు విండీస్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఎనిమిది జట్లు నేరుగా వన్డే ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. ఇక ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు కూడా అర్హత సాధించాయి. అయితే వెస్టిండీస్ ప్రస్తుతం ర్యాంకింగ్స్లో పదో స్థానంలో కొనసాగుతోంది. జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నప్పటికీ ఆతిథ్య హోదాలో ఆ జట్టు అర్హత సాధించడంతో కటాఫ్ తేదీ సమయానికి వెస్టిండీస్కు టాప్-9లో ప్రవేశించేందుకు చాన్స్ లేదు. ఒకవేళ సెప్టెంబర్-అక్టోబర్లో భారత్తో జరగనున్న వన్డే సిరీస్లో వెస్టిండీస్ అన్ని మ్యాచ్లు గెలిచినప్పటికీ వరల్డ్కప్కు అర్హత సాధించే అవకాశం మాత్రం వారికి లేదు. సెప్టెంబర్ 30 డెడ్లైన్ ప్రకారం టాప్-8లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అప్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు సౌతాఫ్రికా (ఆతిథ్య దేశం), జింబాబ్వే (ఆతిథ్య దేశం) నేరుగా వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించనున్నాయి. ఇక వెస్టిండీస్ మాత్రం వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించకపోవడం ఇది వరుసగా మూడోసారి. 2019, 2023 ఎడిషన్లలోనూ విండీస్ డైరెక్ట్ క్వాలిఫై సాధించడంలో విఫలమైంది. ఇక వెస్టిండీస్ ఈసారి కూడా ప్రపంచకప్లో ఆడాలంటే ఇతర అసోసియేట్ దేశాలతో కలిసి వరల్డ్కప్ క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా రెండో రౌండ్లో అడుగుపెడుతుంది.కాగా మిగిలిన జట్లు రెండో రౌండ్కు అర్హత సాధించేందుక సూపర్ సిరీస్ ఆడనున్నాయి. రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేత అయిన వెస్టిండీస్ దారుణ ఆటతీరుతో ర్యాంకింగ్స్లో అట్టడుగు స్థానంలో నిలుస్తూ నేరుగా అర్హత సాధించడంలో విఫలమవుతూనే వస్తోంది.Read: ఐసీసీకీ షాక్.. ఆక్రోశం వెళ్లగక్కిన స్కాట్లాండ్, నెదర్లాండ్
ఐసీసీకీ షాక్.. ఆక్రోశం వెళ్లగక్కిన స్కాట్లాండ్, నెదర్లాండ్
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ 2027 ఫార్మాట్లో మార్పులు చేయడం పట్ల స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ ప్రకటన జారీ చేశాయి. ఐసీసీ చేపట్టిన చర్యలు అంతర్జాతీయ క్రికెట్ సమగ్రతను, విశ్వసనీయతను బలహీనపరిచే ప్రమాదం పొంచి ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేశాయి. వన్డే ప్రపంచకప్కు సంబంధించి మార్పుల ప్రక్రియను కూడా ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఎత్తి చూపాయి. క్వాలిఫికేషన్ సైకిల్ మధ్యలో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఫార్మాట్లను మార్చడం వల్ల జట్ల ప్రణాళికలు దెబ్బతింటాయని, ఇప్పటికే పరిమిత వనరులతో పనిచేస్తున్న బోర్డులపై అదనపు ఆర్థిక, కార్యచరణ భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.‘2027 వన్డే ప్రపంచకప్ పోటీ ప్రారంభానికి 18 నెలల కంటే తక్కువ సమయమే ఉంది. అయితే పురుషుల వన్డే ప్రపంచకప్ క్వాలిఫికేషన్కు అనుసరిస్తున్న నూతన విధానం, టోర్నమెంట్ ఫార్మాట్లో గణనీయమైన నిర్మాణాత్మక మార్పులు అమలు చేయాలన్న ఐసీసీ నిర్ణయం పట్ల క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ (నెదర్లాండ్స్) బోర్డులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ మార్పులు ఐసీసీలో అసోసియేట్ సభ్యదేశాల క్రికెట్కు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ప్రపంచ క్రికెట్ను అభివృద్ధి చేయాలనే ప్రయత్నంలో ఇటీవలి సంవత్సరాల్లో క్రికెట్లో సాధించిన పురోగతిని కూడా ఈ మార్పులు దెబ్బతీసే ప్రమాదముంది. క్రికెట్లో తమ పరిధిని విస్తరించుకోవాలనే ఐసీసీ ఆలోచన మంచిదే అయినప్పటికీ, ఇప్పుడిప్పుడే క్రికెట్లో అడుగుపెడుతున్న దేశాలకు మాత్రం ఇలాంటి మార్పులు అవకాశాలను తగ్గించేందుకు ఆస్కారముంటుంది.’ అని తమ ప్రకటనలో పేర్కొన్నాయి.2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్ ఇదే..వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. అయితే, అర్హత సాధించిన జట్లలో చివరి మూడు జట్లు సూపర్ సిరీస్లో తలపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు మిగతా 11 టీమ్ లతో కలిసి ప్రధాన రౌండ్కు అర్హత సాధిస్తుంది. అప్పుడు 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించి 30 మ్యాచ్లు నిర్వహిస్తారు.ప్రతి గ్రూప్ నుంచి టాప్-3లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్కు క్వాలిఫై అవుతాయి. అంతేకాకుండా ఈ రెండు గ్రూప్ ల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన నాలుగో అత్యుత్తమ టీమ్ కూడా అర్హత సాధిస్తుంది. ఈ ఏడు జట్లు మూడో దశ అయిన సూపర్-7లోకి అడుగుపెడతాయి. ఈ రౌండ్లో 21 మ్యాచ్లు నిర్వహిస్తారు. టాప్-4 జట్లు సెమీ ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.BIG : Cricket Scotland and KNCB have jointly released a strongly worded statement against the ICC over the 2027 World Cup format changes.They say the changes were made without meaningful consultation with Associate Members, calling the ICC’s lack of response “disappointing and… pic.twitter.com/p6pN5DjXDX— Ragav X (@ragav_x) August 10, 2026Read: ‘నవ్వులాటగా ఉన్నా వారి చర్యలు హర్షనీయం’
న్యూస్ పాడ్కాస్ట్
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
బిజినెస్
యూట్యూబ్లో డబ్బు సంపాదించడం మరింత కష్టం!
డిజిటల్ కంటెంట్ ద్వారా ఆదాయం ఆర్జించాలనుకుంటున్న క్రియేటర్లకు ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ ‘యూట్యూబ్’ ఊహించని షాక్ ఇచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) ద్వారా యాడ్స్, సబ్స్క్రిప్షన్ల నుంచి డబ్బులు సంపాదించడానికి అవసరమైన ప్రాథమిక అర్హత ప్రమాణాల్లో మార్పులను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.కొత్త నిబంధనలు ఇవే..ప్రస్తుతం చలామణిలో ఉన్న నిబంధనల ప్రకారం కంటెంట్ క్రియేటర్లు ఏడాది కాలంలో (365 రోజుల్లో) 4,000 గంటల వాచ్ టైమ్ సాధించాల్సి ఉంది. నూతన ఉత్తర్వుల ప్రకారం ఇకపై 8,000 గంటల వాచ్ టైమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ పొందాలనుకునే వారు గత 90 రోజుల్లో పొందే వ్యూస్ పరిమితిని 10 మిలియన్ల నుంచి 20 మిలియన్లకు (2 కోట్లు) పెంచారు. అయితే, కనీసం 1,000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలనే పాత నిబంధనలో ఎలాంటి మార్పూ చేయలేదు.ఈ నూతన నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనితో పాటు, ఇప్పటికే మానిటైజేషన్ పొందుతున్న క్రియేటర్లు కూడా షార్ట్స్ ద్వారా ఆదాయం కొనసాగించాలంటే ప్రతి 90 రోజుల వ్యవధిలో నిరంతరం 10 మిలియన్ల వ్యూస్ నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.ఎందుకు ఈ నిర్ణయం?ఇటీవలి కాలంలో ప్లాట్ఫామ్పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన లో-క్వాలిటీ, కాపీడ్, రీసైకిల్డ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. నాణ్యమైన అసలైన కంటెంట్ సృష్టికర్తలకు ప్రాధాన్యత ఇవ్వడానికి, ప్రకటనకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి గూగుల్ ఈ కఠిన చర్యలు చేపట్టింది.చిన్న క్రియేటర్లపై ప్రభావంయూట్యూబ్ను పూర్తికాల కెరీర్గా ఎంచుకోవాలని భావిస్తున్న ఔత్సాహిక క్రియేటర్లకు, చిన్న ఛానెళ్ల నిర్వాహకులకు ఈ నిర్ణయం గొడ్డలిపెట్టుగా మారనుంది. ఆదాయ మార్గాలు సాధించాలంటే మునుపటి కంటే రెండింతలు శ్రమించాల్సి రావడంతో ప్రారంభ దశలోనే అనేకమంది నిరాశకు గురయ్యే అవకాశాలున్నాయని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..
ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
సెన్సెక్స్ 304 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు తగ్గి 24,491 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 304 పాయింట్లు నష్టపోయి 78,228 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.75బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.7 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.06 శాతం తగ్గింది.నాస్డాక్ 0.32 శాతం నష్టపోయింది.Today Nifty position 11-08-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
పెరిగిన ‘అండర్ రికవరీ’ భారం!
పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంక్షోభం, హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాల ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో వంటగ్యాస్ (ఎల్పీజీ) ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా వ్యయం పెరిగినా దేశీయంగా గృహ వినియోగదారులకు భారం పడకుండా తక్కువ ధరకు విక్రయించడంతో ప్రభుత్వ రంగానికి చెందిన చమురు మార్కెటింగ్ కంపెనీల (IOCL, BPCL, HPCL) ‘అండర్ రికవరీ’ (అమ్మకపు లోటు) 2026 జులై 31 నాటికి రూ.59,000 కోట్లకు పైగా పెరిగింది. ఈ మేరకు పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి అధికారిక వివరాలను వెల్లడించారు.పరిహారం ఉన్నప్పటికీ పెరుగుతున్న లోటుపెట్రోలియం కంపెనీల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.22,000 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరాలు 2025-26, 2026-27ల కాలానికి మరో రూ.30,000 కోట్ల పరిహారాన్ని మంజూరు చేసింది. మొత్తం రూ.52,000 కోట్ల ప్రభుత్వ సహాయం అందినప్పటికీ అంతర్జాతీయంగా ప్రొపేన్-బ్యూటేన్ బెంచ్ మార్క్ ధరలు భారీగా పెరగడంతో బకాయిపడ్డ అండర్ రికవరీ మొత్తాలు రూ.59,000 కోట్ల మార్కును దాటాయి.నెలవారీ పరోక్ష సబ్సిడీ మార్పులుఢిల్లీలో 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.942 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల పెట్రో కంపెనీలు భరించే పరోక్ష సబ్సిడీ (అండర్ రికవరీ) జూన్లో ప్రతి సిలిండర్పై రూ.700 కంటే ఎక్కువగా, జులైలో రూ.500 వరకు నమోదు కాగా ఆగస్టు నాటికి గ్లోబల్ ధరలు కొంత నెమ్మదించడంతో ఈ లోటు రూ.188కి తగ్గింది. ఇక పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తించే రూ.300 నిర్దేశిత సబ్సిడీతో కలిపి సిలిండర్ రూ.642కే లభిస్తోంది.గతంలో భారత్ తన వంటగ్యాస్ దిగుమతుల్లో 90% వరకు పశ్చిమాసియా పైనే ఆధారపడేది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ఖతార్ వంటి దేశాల నుంచి సరఫరా తగ్గినప్పటికీ అమెరికా నుంచి రికార్డు స్థాయిలో (జులైలో 9.12 లక్షల టన్నులు) ఎల్పీజీని దిగుమతి చేసుకుంటూ సరఫరాల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (ఇప్పటివరకు 1.7 కోట్లకు పైగా కనెక్షన్లు), ఇండక్షన్ స్టవ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.ఇదీ చదవండి: గౌతమ్ అదానీకి భారీ ఊరట
ఫ్యామిలీ
ప్రపంచంలోనే అతిపెద్ద గుహ.. ఇదొక ట్రావెల్ అడ్వెంచర్!
ప్రపంచంలోనే అతి పెద్ద గుహ అయిన సాన్ డూంగ్ కేవ్లోకి ఎంటర్ అయితే మనం మరో గ్రహంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. వియత్నాంలోని ఫోంగ్ నా కే బ్యాంగ్ నేషనల్ పార్క్లో సాన్ డూంగ్ కేవ్ ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ కేవ్గా ప్రసిద్ధి పొందింది.ఈ గుహ లోపల పెద్ద పెద్ద అడవులు, ప్రవహిస్తున్న నదులు, 200 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తైన రాక్ వాల్స్, పై నుంచి పడే సూర్య కిరణాలు కలిసి ఒక మ్యాజికల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. నేచర్ తన కళతో క్రియేట్ చేసిన మాస్టర్ పీస్ అని చెప్పడం అతిశయం కాదు.ఎందుకు స్పెషల్ ?సాన్ డూంగ్ గుహను 1991లో కనుగొన్నారు. కానీ 2009 లో అంతర్జాతీయ పరిశోధకులు పూర్తిగా సర్వే చేసిన అనంతరం ఈ గుహకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. సుమారు 9 కిమీ పొడవు, 200 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గుహలో ఒక చిన్న అడవి, మేఘాలు క్రియేట్ అయ్యే వాతావరణం, అండర్గ్రౌండ్ నది కూడా ఉంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద గుహ అని కూడా అంటారు.హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా వియత్నాంలోని హానోయ్ లేదా హో చి మిన్ సిటీ కి కనెక్టింగ్ విమానం తీసుకోవాలి. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్లో డాంగ్ హోయ్ ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. డాంగ్ హోయ్ నుండి సుమారు 45 కిమీ దూరంలో ఫోంగ్ నా విలేజ్కి ట్యాక్సీ లేదా షటిల్ బస్లో చేరుకోవచ్చు. సాన్ డూంగ్ కేవ్కి గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి.బడ్జెట్ ఎంత అవుతుంది? అఫిషియల్ సాన్ డూంగ్ ఎక్స్పిడిషన్ అనేది 4 నుంచి 6 రోజులు ఉంటుంది. గైడ్, పర్మిట్స్, క్యాంపింగ్, ఫుడ్ అన్నీ కలిసి ఒక వ్యక్తికి రూ.2 లక్షల 80 వేల నుంచి రూ.3 లక్షల 5 వేల వరకు ఖర్చు అవుతుంది. వియత్నాం ట్రిప్ని సాన్ డూంగ్ ఎక్స్పిడిషన్ లేకుండా ఫోంగ్ నా రీజియన్ వరకు ప్లాన్ చేస్తే రూ.60 వేల నుంచి రూ.90 వేల బడ్జెట్లో కంఫర్టబుల్గా పూర్తి చేయవచ్చు.ఏం తినాలి?వియత్నాం ఫుడ్ లవర్స్కి స్వర్గంలాంటిది. ఒక్క ఫో నూడిల్ సూప్, బాన్ మీ శాండ్విచ్, ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్, కామ్ టామ్ చాలా ఫేమస్. శాఖాహారుల కోసం వెజ్ ఆప్షన్స్ కూడా బాగానే ఉంటాయి. వియత్నాం లోకల్ కాఫీని మాత్రం మిస్ అవ్వకండి.దగ్గర్లో చూడాల్సినవిసాన్ డూంగ్ కేవ్తో పాటు ఫోంగ్ నా కేవ్, ప్యారడైజ్ కేవ్, డార్క్ కేవ్, మూక్ స్ప్రింగ్ ఎకో ట్రెయిల్, బొటానిక్ గార్డెన్ లాంటి ప్రాంతాలను అన్వేషించవచ్చు. ఈ ప్రాంతం మొత్తం యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద కాబట్టి ప్రతీ చోట నేచర్ బ్యూటీ కనిపిస్తుంది.సాహసమే శ్వాసగా సాగిపోయేవారికి, నేచర్, ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ ఈ నాలుగు మీకు ఇష్టం అయితే సాన్ డూంగ్ కేవ్ని లైఫ్లో ఒక్కసారి అయినా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశం. ఇది ఒక గుహ మాత్రమే కాదు... భూమిలోపల దాగున్న అద్భుత ప్రపంచం ఇది. వియత్నాం ట్రిప్ ప్లాన్ చేస్తున్న వాళ్లకి ఇది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.
వర్షం పడినా జర్నీ స్టైల్ తగ్గకూడదంటే… ఇలా చేయండి!
వర్షాకాలం అంటే కేవలం వర్షాలు మాత్రమే కాదుం చల్లని గాలి, పచ్చని ప్రకృతి, తాజా వాతావరణంతో ట్రావెల్కి పర్ఫెక్ట్ సీజన్ కూడా. కానీ వర్షాకాలంలో డ్రెస్సింగ్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే జర్నీ మరింత కంఫర్టబుల్గా ఉంటుంది. స్టైల్తో ΄ాటు కంఫర్ట్ని మెయింటేన్ చేయడం మాన్ సూన్ ఫ్యాషన్ లో ముఖ్యం.తక్కువ బరువు ఉన్న ఫ్యాబ్రిక్ ఎంచుకోండివర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాటన్, లైనిన్, రేయాన్ లాంటి లైట్వెయిట్ ఫ్యాబ్రిక్స్ కంఫర్టబుల్గా ఉంటాయి. హెవీ ఫ్యాబ్రిక్స్ వర్షపు నీటిని పీల్చుకుని ఎక్కువసేపు తడిగా ఉంటాయి. సులువుగా ఆరి΄ోయే బట్టలు అయితే బెటర్.బ్రైట్ కలర్స్ బెస్ట్వర్షాకాలంలో వాతావరణం ఆల్రెడీ కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ΄ాస్టల్ షేడ్స్, బ్రైట్ కలర్స్, ఎర్తీ టోన్స్ మీ ఔట్ఫిట్కి ఫ్రెష్ లుక్ ఇస్తాయి. వైట్ షేడ్స్ కన్నా మురికి అంతగా కనిపించని రంగుల దుస్తువులు ఈ సీజన్ లో పెర్ఫెక్ట్గా సెట్ అవుతాయి.కంఫర్టబుల్ ఫుట్వేర్ ముఖ్యంవర్షాకాలం సీజన్ లో ఫుట్వేర్ సెలెక్షన్ చాలా ఇం΄ార్టెంట్. వాటర్ రెసిస్టెంట్ శాండిల్స్, క్విక్ డ్రై షూస్ లేదా కంఫర్టబుల్ స్లిప్పర్స్ ట్రావెల్కి చాలా సూట్ అవుతాయి. తడిసిన రోడ్డుల్లో కంఫర్ట్ కోసం గ్రిప్ ఉన్న ఫుట్వేర్ ఎంచుకోవడం మంచిది.లేయరింగ్తో స్మార్ట్ లుక్హిల్ స్టేషన్ లేదా చల్లని ప్రదేశాలకు ఈ వర్షాకాలంలో వెళ్తే మాత్రం లైట్ జాకెట్, హుడీ లేదా విండ్చీటర్ క్యారీ చేయడం మంచిది. ఉదయం, సాయంత్రం ఉష్ణోగ్రతల్లో మార్పు ఉంటుంది. కాబట్టి లేయరింగ్ స్టైల్తో కంఫర్ట్ మెయింటేన్ చేయవచ్చు.రెయిన్ ఆక్సెసరీస్గొడుగు, లైట్వెయిట్ రెయిన్ కోట్, వాటర్ప్రూఫ్ బ్యాగ్ కవర్ లాంటి యాక్సెసరీలు మాన్ సూన్ వార్డ్రోబ్లో భాగం అవుతాయి. మరీ ముఖ్యంగా ట్రావెల్లో కెమెరా, మొబైల్, డాక్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వాటర్ప్రూఫ్ ΄ûచెస్ బాగా ఉపయోగపడతాయి.హెయిర్, పర్సనల్ కేర్ కూడా ముఖ్యంతేమ వల్ల హెయిర్ కేర్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సింపుల్ హెయిర్ స్టైల్, కంఫర్టబుల్ క్యాప్స్ లేదా స్కార్ఫ్లు వినియోగించడం వల్ల కాస్త లుక్ మెయింటేన్ చేయవచ్చు. అలాగే జుట్టును ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.వర్షాకాలంలో డ్రెస్సింగ్ అంటే కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు.. వర్షాకాలం అందాన్ని ఎంజాయ్ చేస్తూ కంఫర్టబుల్గా ఉండటం. సరైన ఔట్ఫిట్ ఛాయిస్తో వర్షాకాలంలో ప్రతి ట్రిప్ను స్టైలిష్గా మార్చుకోవచ్చు.
Tour: చరిత్ర చెప్పే భారత యాత్ర
కొన్ని ప్రదేశాలు మ్యాపులో కనిపించే లొకేషన్లు మాత్రమే కావు. అవి ఒక దేశ జ్ఞాపకాలు కూడా. అక్కడి నేల, గోడలు, దారులు అన్నీ అక్కడి త్యాగాల కథలను నేటికీ చెబుతూనే ఉంటాయి. భారత స్వాతంత్య్ర పోరాటం అనగానే కొన్ని ప్రముఖ నగరాలు ప్రదేశాలు, కట్టడాలు గుర్తొస్తాయి. అయితే దేశంలోని ప్రతిప్రాంతం తన వంతు పోరాట స్మృతులను రాసుకుంది. మన తెలుగు నేల కూడా అలాంటి వీర చరిత్రకు నిలయం.ఆంధ్రప్రదేశ్ అడవుల్లో వినిపించే మన్యం పోరాట స్వరాల నుంచి అండమాన్ సముద్రం మధ్యలో ఉన్న సెల్యులర్ జైలు వరకు ఈ ఫ్రీడమ్ ట్రెయిల్ యాత్ర (India Freedom Trail) భారత స్వాతంత్య్ర స్పూర్తిని పరిచయం చేస్తుంది. దేశం కోసం పోరాడిన వీరుల అడుగుజాడలను స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపే ఆనాటి పోరాట కథలు చెప్పే ప్రదేశాలను సందర్శించడానికి 5 రోజుల భారత్ ఫ్రీడమ్ ట్రెయిల్ ఇది..మన్యం అడవుల్లో స్వాతంత్య్ర పోరాట జాడలు...ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల మధ్యలో ఉన్న మన్యంప్రాంతం ప్రకృతి అందాలతో పాటు ఒక వీర చరిత్రను కూడా మోసుకొస్తుంది. అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నడిపిన రంపా పోరాటం తెలుగు స్వాతంత్య్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం.కొండలు, అడవులు, గిరిజన జీవన విధానం మధ్య ఆయన పోరాట జ్ఞాపకాలను ఇప్పటికీ ఆప్రాంతంలో ఫీల్ అవ్వవచ్చు. అల్లూరి పేరు వినగానే తెలుగు ప్రజల మనసులో ఒక వీరుడి రూపం కనిపిస్తుంది. మన్యం పోరాటం జరిగిన ప్రదేశాల్లో ప్రయాణం చేస్తే ప్రకతితో పాటు చరిత్ర కూడా మనతో నడుస్తున్నట్టు అనిపిస్తుంది.హైదరాబాద్ నుంచి రాజమండ్రికి లేక విశాఖపట్టణం చేరుకుని అక్కడి నుంచి రోడ్ జర్నీలో ఏజెన్సీప్రాంతాలకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రాజమండ్రి మార్గం కూడా అనుకూలంగా ఉంటుంది. రాజమండ్రి, రంపచోడవరం, మారేడుమిల్లిప్రాంతాల్లో స్టే ఆప్షన్స్ లభిస్తాయి.దండి మార్చ్కు నాంది పలికిన సబర్మతిగుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి ఆశ్రమం ఒక ప్రశాంతమైన చారిత్రక ప్రదేశం. సబర్మతి నదీ తీరంలో ఉన్న ఈ ఆశ్రమం నుంచి మహాత్మా గాంధీ అనేక ఉద్యమాలకు మార్గదర్శనం చేశారు. 1930లోప్రారంభమైన దాండీ మార్చ్ కూడా ఇక్కడేప్రారంభం అయింది.ఆశ్రమంలో మహాత్ముడు ఉపయోగించిన వస్తువులు, ఫొటోగ్రాఫ్స్, లెటర్స్ చరిత్రను దగ్గరగా పరిచయం చేస్తాయి.సబర్మతి ఆశ్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పర్యాటకుల కోసం తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజు తీసుకోరు.ఈ ఆశ్రమాన్ని సందర్శించాలి అనుకుంటే ముందుగా గుజరాత్లోని అహ్మదాబాద్కు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్కు ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ లేక చెన్నై ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.అహ్మదాబాద్లో బడ్జెట్ హోటల్స్ రూ.1500 నుంచి రూ.3000, కంఫర్టబుల్ హోటల్స్ రూ.3000 నుంచి రూ.7500 వరకు బడ్జెట్లో లభిస్తాయి.కాలాపాని సెల్యులర్ జైలు.. స్వాతంత్య్ర సమరయోధుల కన్నీటి గాథసముద్రం మధ్యలో ఉన్న అండమాన్ ద్వీపాల్లో సెల్యులర్ జైల్ చరిత్ర తెలుసుకుంటే నాటి పోరాటం వెనక ఉన్న త్యాగాలు అర్థం అవుతాయి. బ్రిటిష్ కాలంలో వీర్ సావర్కర్తో పాటు అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులను ఇక్కడే బంధించారు. జైల్లో ఉన్న ప్రతి గది దేశ భక్తుల త్యాగం, వారి పోరాటం గురించి మౌనంగా వివరిస్తుంది. ఇప్పుడు సెల్యులర్ జైలును నేషనల్ మెమోరియల్గా మార్చి పర్యాటకుల కోసం తెరిచి ఉంచారు. సందర్శకులు మ్యూజియం, పాత కారాగారాలు, ఫ్రీడమ్ ఫైటర్స్ జ్ఞాపకాలను చూడవచ్చు.భారతీయ పర్యాటకులకు ఇక్కడికి వెళ్లేందుకు సుమారు రూ.30 ఎంట్రీ ఫీజు ఉంటుంది. సాయంత్రం జరిగే లైట్ అండ్ సౌండ్ షో ఈ ప్రదేశ చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. షో టికెట్ కాస్ట్ వచ్చేసి రూ.300.కాలాపాని వెళ్లాలి అనుకునే ప్రయాణికులు హైదరాబాద్ నుంచి చెన్నై లేక కోల్కతా ద్వారా పోర్ట్ బ్లెయిర్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి చెన్నై రూట్లో వెళ్లడం సులువుగా ఉంటుంది.పోర్ట్ బ్లెయిర్లో బడ్జెట్ హోటల్స్ రూ.1500 నుంచి రూ.3000 వరకు లభిస్తాయి. కాస్త కంఫర్టబుల్ స్టే కావాలి అనుకుంటే మాత్రం రూ.3000 నుంచి రూ.6000 మధ్యలో లభిస్తాయి.సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని తెలిపే నేతాజీ భవన్పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ఉన్న నేతాజి భవన్ అనేది సుభాష్ చంద్రబోస్ జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసే ఒక ముఖ్యమైన వారసత్వ సంపద. ఇక్కడ నేతాజి ఉపయోగించిన వస్తువులు, ఫోటోగ్రాఫ్స్, డాక్యుమెంట్స్ భద్రపరిచారు. దేశం కోసం ఆయన చేసిన పోరాటాల గురించి తెలుస్తాయి.నేతాజి భవన్ టూరిస్టుల కోసం తెరిచే ఉంటుంది. హైదరాబాద్ నుంచి కలకత్తా వరకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ లేక చెన్నై ద్వారా చేరుకోవచ్చు. కలకత్తాలో బడ్జెట్ స్టే రూ.1,000 నుంచి రూ.3000లో లభిస్తుంది.జలియన్ వాలా బాగ్.. నెత్తుటి చరిత్రకు సాక్ష్యంపంజాబ్లో ఉన్న జలియన్ వాలా బాగ్ భారత చరిత్రలో ఒక పీడకలగా మిగిలిపోయింది. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఘటన భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక కొత్త దిశను ఇచ్చింది. ఇప్పుడు ఇది ఒక మెమోరియల్గా నిలిచి, ఆ నాటి చేదు జ్ఞాపకాలను నేటి తరానికి అందిస్తోంది.టూరిస్టులు ఇక్కడ మెమోరియల్, మ్యూజియం, చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఎంట్రీ సాధారణంగా ఫ్రీగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి అమత్సర్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి ఢిల్లీ రూట్ అనుకూలంగానే ఉంటుంది.అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ దగ్గర స్టే ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్ హోటల్స్ రూ.1,000 నుంచి రూ.2500 మధ్యలో దొరుకుతాయి. కంఫర్టబుల్గా స్టే చేయాలి అంటే రూ.3000 నుంచి రూ.5000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.ప్రతి ప్రాంతంలోని ప్రత్యేకమైన రుచులుఈ యాత్రలో ప్రతిప్రాంతం తన రుచులతో పరిచయం చేస్తుంది. ఆంధ్రా మన్యంప్రాంతాల్లో లోకల్ గిరిజన రుచులు, గోదావరి స్పెషల్ వంటకాలను ఆస్వాదించవచ్చు.అండమాన్ లో సీఫుడ్తో పాటు దక్షిణాది వంటకాలు లభిస్తాయి. గుజరాత్లో ఢోక్లా, తెప్లా, గుజరాతీ థాలీ, పంజాబ్లో అమత్సర్ కుల్చా, కోల్కతాలో బెంగాలీ స్వీట్స్ ఈ ట్రావెల్ ఎక్స్పీరియెన్స్లో భాగం అవుతాయి.5 రోజుల ఫ్రీడమ్ ట్రెయిల్.. ఎంత బడ్జెట్ కావాలి?ఈ ఫ్రీడమ్ ట్రెయిల్స్ని 5 రోజుల ప్లాన్ లో కవర్ చేయాలి అంటే ఎక్కువగా విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే విమాన చార్జీలు, వసతి, భోజనం, రవాణా, ప్రవేశ రుసుము కలిపి బడ్జెట్ ట్రావెల్ కోసం సుమారు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు అవసరం పడవచ్చు.కంఫర్టబుల్ స్టాండర్డ్ ట్రావెల్ కోసం రూ.50 వేల నుంచి రూ.70 వేల మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. ప్రీమియం ట్రావెల్ అనుభూతి కోసం రూ.80 వేలపైనే బడ్జెట్ అవసరం అవుతుంది.విజయవాడ నుంచి ప్రయాణం చేస్తే కనెక్టివిటీని బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది. స్టే కోసం ప్రతి డెస్టినేషన్ లో సుమారు రూ.1500 నుంచి రూ.4000 వరకు ఖర్చు అవుతుంది. ఫుడ్ కోసం రోజుకు రూ.300 నుంచి రూ.1500 వరకు మీ ఛాయిస్ను బట్టి ఖర్చు చేయవచ్చు.ఈ ఫ్రీడమ్ ట్రెయిల్లో ఆసక్తికర విశేషాలు...సెల్యులర్ జైల్ని బ్రిటిష్ కాలంలో కాలాపానీ అని పిలిచేవారు.అల్లూరి సీతారామ రాజుని తెలుగులో ప్రజలు మన్యం వీరుడు అని గౌరవిస్తారు.దాండీ మార్చ్ను మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి పారంభించారు.జలియన్ వాలా బాగ్ ఘటన భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక మలుపు లాంటిది.నేతాజి భవన్ లో సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన అరుదైన విషయాలు తెసుకోవచ్చు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
అచ్యుతం కేశవం: అదొక చిన్న పల్లెటూరు.. ఆ ఊర్లో వాళ్ళందరూ..
అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి శ్రీకృష్ణుడి గుడి కట్టారు. అదే ఊరికి చెందిన ఆవు పాలను అమ్మే ఓ మహిళ శ్రీకృష్ణుడి భక్తురాలిగా మారింది. తన మంచి చెడ్డలు, కష్ట సుఖాలు కృష్ణుడికి చెప్పుకునేది. తన భర్త కాలమయ్యాక ఆమెకు భక్తి మరింత ఎక్కువయ్యింది.ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. అతడు అప్పుడప్పుడూ ఫోనులో మాట్లాడటం చేస్తుండేవాడు. అక్కడే అమెరికాలో ఉన్న కన్నడ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇండియా కి రావడం తగ్గించాడు. కాగా ఆ ఊరి వాళ్ళు నెలనెలా కంతులవారీగా డబ్బును ΄÷డుపు చేసేవారు. అలా సమకూరిన డబ్బుతో రెండేళ్ళ కొకసారి తీర్థయాత్రలు చేసేవారు.ఆ తీర్థయాత్రల్లో ఓ సారి ఆమెకు ఒక కన్నడ వృద్ధురాలు పరిచయమయ్యింది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ఆ వృద్ధురాలు ఉడిపి కృష్ణుడి గురించి, స్వామి మహత్యాల గురించి విశేషంగా వర్ణించింది. అక్కడ బాలకృష్ణుడి రూపంలో స్వామి దర్శనమిస్తాడని, ఆయనను నేరుగా కాకుండా నవరంధ్ర కిటికీ ద్వారా దర్శించాలని చెప్పింది.అప్పటినుంచి ఆ పాలమ్మే మహిళకు ఉడిపి కృష్ణుడిని చూడాలని కోరిక మొదలయ్యింది. ఊరి వారు చేసే తీర్థయాద్రల్లో ఎన్నో గుడులూ గోపురాలు చూసింది కానీ ఉడిపి గుడికెళ్ళడం కుదరలేదు. ‘కృష్ణా... కరుణించవా’ అని స్వామిని వేడుకునేది. ‘ఉడిపి కృష్ణుని చూడని కళ్ళు కళ్ళేనా’ అని మదనపడేది. వయసు అరవై దాటింది. స్వామిని చూడకుండానే కాలం గడిచిపోతుందేమోనని భయం పట్టుకుంది. అదే విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పి బాధపడేది.3హఠాత్తుగా ఒకరోజు రాత్రి కొడుకు ఫోన్ చేసి, తనకు కూతురు పుట్టిందని, ఆరవ నెలలో అన్న్రపాశన అనీ, తన భార్య కుటుంబీకులకు ఉడిపిలో అన్న్రపాశన చేసే సంప్రదాయం ఉంది కాబట్టి తాము ఇండియా వస్తున్నామని, తమతోపాటు నువ్వు కూడా ఉడిపి వస్తే బాగుంటుందని అమ్మను కోరాడు. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా చెప్పుకుని పొంగిపోయింది.ఇండియాకి వచ్చిన కొడుకు, కోడలుతో మొదటిసారిగా విమానం ఎక్కింది. అది ఉడిపికి దగ్గరగా ఉండే షిమాగో వరకు వెళ్ళే విమానం. ఆమె తనతోపాటు చిన్న సంచి కూడా తీసుకు వచ్చింది. అందులో హుండీలో వేయడానికి డబ్బు దాచి ఉంది. తను పెంచే ఆవులకు దూడలు పుట్టిన ప్రతిసారీ అమ్మే జున్ను ద్వారా వచ్చిన డబ్బులవి.మనవరాలిని ఆడించుకుంటూ ‘అచ్యుతం కేశవం’ అనే పాట పాడుకుంటూ ఆమె ఉడిపి గుడిలోకి ఆధ్యాత్మికానందంతో అడుగు పెట్టింది.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
అంతర్జాతీయం
ఆ దేశ సైనిక పాలకులు ఆడుతున్న మైండ్ గేమ్స్ ఇవే..
ఎన్నో ఏళ్లుగా గృహనిర్బంధంలో మగ్గుతున్న మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూ కీని ఎట్టకేలకు రెడ్ క్రాస్ ప్రతినిధి కలవడం ప్రపంచ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఒకవైపు దేశంలో దారుణమైన సివిల్ వార్ (అంతర్యుద్ధం) కొనసాగుతుండగా, మరోవైపు మయన్మార్ సైనిక పాలకులు అంతర్జాతీయ వేదికలపై తమపై ఉన్న ఏకాకితనాన్ని (International Isolation) పోగొట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్, చైనా, లావోస్, థాయ్లాండ్ దేశాలతో దౌత్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కంటికి కనిపించకుండా సాగుతున్న ఈ దౌత్య రాజకీయాల వెనుక అసలు మయన్మార్ సైన్యం పన్నిన వ్యూహం ఏమిటి? అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటుతో మయన్మార్ ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. ఎన్నికల్లో విజయం సాధించిన ఆంగ్ సాన్ సూ కీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు, 'పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్' (PDF) రూపంలో తిరుగుబాటు చేయడంతో దేశం పూర్తిస్థాయి అంతర్యుద్ధంలోకి జారిపోయింది.గత కొన్నేళ్లుగా జరిగిన పోరులో జాతి సాయుధ సంస్థల చేతిలో సైన్యం భారీగానే భూభాగాన్ని కోల్పోయింది. అయితే, జనాభా ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాలపై పట్టు నిలుపుకున్న సైన్యం, గత ఏడాదిన్నరగా కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దాడులను తీవ్రం చేసింది.ఒత్తిళ్లను తట్టుకునేందుకు యత్నాలు అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకునేందుకు, తన ప్రభుత్వాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు సైనిక చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ డ్రామాలు మొదలుపెట్టారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో ఎన్నికలు నిర్వహించి, తానే స్వయంగా సైనిక పదవి నుంచి తప్పుకుని అధ్యక్షుడిగా పీఠం ఎక్కారు. సివిల్ ప్రభుత్వం ముసుగు వేసుకున్న తర్వాత ఆయన తన అంతర్జాతీయ పర్యటనలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా దేశాల్లో అధికారిక పర్యటనలు చేసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు భద్రత, చైనా ఆధిపత్యం, వాణిజ్య ప్రయోజనాలరీత్యా పొరుగు దేశాలు కూడా మయన్మార్ ప్రభుత్వంతో తిరిగి సంబంధాలు నెరపుతున్నాయి.ఆసియాన్ కూటమిలో చోటు కోసం.. ముఖ్యంగా ఆసియాన్ (ASEAN) కూటమిలో తిరిగి చోటు దక్కించుకోవడానికి మయన్మార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. థాయ్లాండ్ వంటి దేశాలు సరిహద్దు భద్రత, శరణార్థుల సమస్యలు, డ్రగ్స్ అండ్ సైబర్ స్కామ్ కాంపౌండ్ల నియంత్రణ కోసం మయన్మార్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఆసియాన్ విధించిన 'ఐదు సూత్రాల శాంతి ఒప్పందాన్ని' మయన్మార్ పార్లమెంట్ ఏకంగా విదేశీ జోక్యంగా అభివర్ణించి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆంగ్ సాన్ సూ కీని రెడ్ క్రాస్ ప్రతినిధి కలవడానికి అనుమతించడం అనేది మయన్మార్ మారుతోందడానికి సంకేతం కాదని, ఆసియాన్ కూటమిలో దేశాల మధ్య ఐక్యతను దెబ్బతీసి, తమపై ఒత్తిడి తగ్గించుకునేందుకు సైన్యం ఆడిన ఒక 'కాస్ట్-ఫ్రీ' మైండ్ గేట్ మాత్రమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 20 మంది మృతి
బొగోటా: కొలంబియా పశ్చిమ ప్రాంతంలో సోమవారం 7.4 తీవ్రతతో (రిక్టర్ స్కేలుపై) భారీ భూకంపం సంభవించింది. క్విబ్డో, పెరెయిరా, కాలి సహా పలు నగరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు విమానాశ్రయాల కార్యకలాపాలు కూడా అంతరాయం ఎదుర్కొన్నాయి. ఈ ప్రకంపనలు రాజధాని బొగోటాతో పాటు పొరుగు దేశాలైన వెనిజులా, ఈక్వడార్ వరకు సంభవించాయి.ఈ భూకంపం కొలంబియా పశ్చిమ ప్రాంతమంతటా తీవ్ర నష్టం సృష్టించింది. దాదాపు 20 మంది మరణించారు. పెరెయిరాలో 18 మంది మరణించినట్లు ఆ నగర మేయర్ తెలిపారు. మనిజాలెస్లో ఇద్దరు మరణించినట్లు అక్కడి మేయర్ బ్లూ రేడియోకు తెలిపారు. కాలిలో 20 భవనాలు కూలిపోయాయి. వాటిలో ప్రజలు చిక్కుకుపోయినట్లు నగర మేయర్ తెలిపారు. పెరెయిరా, మనిజాలెస్, క్విబ్డో, ఆర్మేనియా, కార్టాగో, బ్యూనావెంచురా విమానాశ్రయాల్లో కూడా నష్టం నమోదైంది. అక్కడ విమాన కార్యకలాపాలు నిలిపివేసినట్లు కొలంబియా విమానయాన సంస్థ వెల్లడించింది.అమెరికా భూగర్భ సర్వే, కొలంబియా భౌగోళిక సేవ సంస్థలు ఈ భూకంప తీవ్రత 7.4గా తెలిపాయి. భూకంప కేంద్రం బొగోటాకు పశ్చిమంగా సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాన్ జోసే డెల్ పాల్మార్ సమీపంలో, 96 కిలోమీటర్ల లోతులో నమోదైంది.కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డే లా ఎస్ప్రియెల్లా ఎక్స్లో చేసిన పోస్టులో.. పునరుద్ధరణ చర్యలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని, సాన్ జోసే డెల్ పాల్మార్లో అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు.“సాన్ జోసే డెల్ పాల్మార్లో అత్యవసర ప్రతిస్పందనకు నేను నేరుగా నాయకత్వం వహిస్తున్నాను. నష్టాలు, ప్రభావిత వ్యక్తులకు సహాయం సమన్వయం చేసేందుకు కమాండ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించాను. పరిస్థితి, అత్యవసర అవసరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని యూఎన్జీఆర్డీ డైరెక్టర్ను కోరాను. ప్రభావిత ప్రజలకు అండగా నిలిచేందుకు, ప్రభుత్వ స్పందనను పరిశీలించేందుకు నేను స్వయంగా పెరెయిరాకు వెళ్తాను” అని ఆయన తెలిపారు.చోకో గవర్నర్ నూబియా కరోలినా కొర్డోబా-క్యూరి మాట్లాడుతూ, ప్రావిన్స్ రాజధాని క్విబ్డోలో గాయాలు, భవనాలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలిపారు. అధికారులు ప్రభావాన్ని అంచనా వేయడం ప్రారంభించారని చెప్పారు. అనంతర ప్రకంపనలపై కూడా ఆమె హెచ్చరించారు.“చోకో విభాగంలో ఇప్పుడే భారీ భూకంపం వచ్చింది. అనంతర ప్రకంపనలపై మాకు ఆందోళనగా ఉంది. కేంద్రం సాన్ జోసే డెల్ పాల్మార్ సమీపంలో ఉన్నప్పటికీ, రాజధాని క్విబ్డోలో గాయాలు, భవనాలకు తీవ్ర నష్టం జరిగింది. నష్టాల అంచనా ప్రక్రియ కొనసాగుతోంది. తొలి అధికారిక నివేదికను త్వరలో విడుదల చేస్తాము” అని నూబియా కరోలినా కొర్డోబా-క్యూరి ఎక్స్లో పేర్కొన్నారు.రిసరాల్డా ప్రావిన్స్ గవర్నర్ జువాన్ డియాగో పాటినో స్థానిక బ్లూ రేడియోతో మాట్లాడుతూ.. ప్రావిన్స్ రాజధాని పెరెయిరాలో కొన్ని భవనాలకు తీవ్ర నష్టంజరిగినట్లు తెలిపారు. “గాయపడిన ప్రజలు, కూలిపోయిన భవనాల దృశ్యాలు నిజంగా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి” అని ఆయన అన్నారు.
పుతిన్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నారు.. జెలెన్స్కీ
కీవ్:ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దీనికొరకే త్వరలో భారీ స్థాయిలో సైనికుల సమీకరణ చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్లో జరిగే రష్యా దిగువ సభ ఎన్నికల తర్వాత ఈ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నడుస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల వరుసగా డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ దాడులలో పెద్దఎత్తున పౌరులు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఈ రోజు (సోమవారం) రష్యాలోని తతార్స్తాన్ ప్రాంతంపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో కనీసం 13 మంది మరణించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ జరిపిన అత్యంత ప్రాణాంతక దాడుల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా జరిపిన ఆర్టిలరీ దాడిలో ఐదుగురు మరణించారు. ఈ ఉద్రిక్తతల నడుమ జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందన్నారు. జెలెన్స్కీ మాట్లాడుతూ.. "రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇందుకోసం 5 లక్షల మంది కొత్త సైనికులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 21న జరిగే రష్యా డ్యూమా ఎన్నికల తర్వాత ఈ సమీకరణ చేపట్టాలని పుతిన్ భావిస్తున్నారు. రష్యా ప్రజల్లో వ్యతిరేకత భయంతో పుతిన్ ఈ ప్రక్రియను బహిరంగంగా చేపట్టకపోవచ్చు" అని జెలెన్స్కీ పేర్కొన్నారు.కాగా ఇటీవల టర్కీ విదేశాంగశాఖ మంత్రి హకాన్ ఫిదాన్ సంచలన ప్రకటన చేశారు." ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి సుదూర డ్రోన్ దాడులను పెంచుతున్న నేపథ్యంలో పుతిన్ అణ్వాయుధాలను ప్రయోగించే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. యుద్ధం ముందు వరుస నుంచి రష్యా భూభాగంలోకి కూడా తీవ్రంగా విస్తరిస్తే, రష్యా తన ఉనికినే కాపాడుకునే చివరి మార్గంగా అణ్వాయుధాలను ఉపయోగించే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు.
హసీనా తిరిగి వస్తే అధికార పీఠం కదిలిపోతుందా..?
గత వారం షేక్ హసీనా చేసిన ప్రసంగం ఒక ముఖ్యమైన రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, ఆమెకు ఉన్న మద్దతు స్థాయి ఎంత? అది ఎంత విస్తరించి ఉందో అంచనా వేసే ప్రయత్నం కూడా. ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్, సౌత్ ఏషియా వర్చువల్గా నిర్వహించింది. తాను బంగ్లాదేశ్కు తిరిగి వస్తానని, దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ప్రాణాలకు ముప్పు వచ్చినా సిద్ధంగా ఉన్నానని హసీనా ప్రకటించారు. తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వారసత్వం, స్వాతంత్య్ర పోరాటం, 1971 విమోచన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, 1981, 1983, 1985 సంవత్సరాల్లో తన ప్రవాస జీవితం, అరెస్టు, 2004 హత్యాయత్నాన్ని గుర్తుచేశారు. అయితే 2007లో అప్పటి సైన్య మద్దతు ఉన్న కేర్టేకర్ ప్రభుత్వం తన ప్రవేశాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం, ఢాకాలో లభించిన భారీ స్వాగతాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.ఇది రానున్న డిసెంబరులో ఆమె తిరిగి బంగ్లాదేశ్కు రావాలనే యత్నానికి ముఖ్యమైన సూచనగా నిలుస్తోంది. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, హసీనా ప్రతిపాదించిన పునరాగమనం బంగ్లాదేశ్లో రాజకీయ పోటీని మళ్లీ తెరపైకి తీసుకువస్తుందా? లేక ఇప్పటికే ఉన్న వ్యవస్థలో విభేదాలను మరింత పెంచుతుందా? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే అవామీ లీగ్ భవిష్యత్తు, బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలు, భారతదేశంతో సంబంధాలను నిర్దేశించనుంది.హసీనా మూడు ప్రధాన డిమాండ్లు ముందుంచారు. అవామీ లీగ్పై నిషేధం ఎత్తివేయాలి, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, మీడియా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ స్వతంత్రతను పునరుద్ధరించాలి. జులై ఉద్యమాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా రూపొందించారని మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యను ఆమె ప్రస్తావించారు. 2024 ఉద్యమం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనే అంశానికి దీన్నే ఆధారంగా చూపించారు. న్యాయపరమైన దర్యాప్తులు అడ్డుపడుతున్నాయని, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చట్టబద్ధతపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.రెండు సంకేతాలు ఇందులో రెండు సంకేతాలు ఉన్నాయి. మొదటిది, “1971 స్ఫూర్తి” ప్రాధాన్యాన్ని, అవామీ లీగ్ వారసత్వాన్ని మళ్లీ బలంగా నిలబెట్టడం. రెండోది, తన పునరాగమనానికి రాజకీయ వాతావరణాన్ని సిద్ధం చేయడం. ఆసక్తికర అంశం ఏమిటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా 1971 వారసత్వానికి తామే సంరక్షకులమని చెబుతోంది. వారి వాదన ప్రకారం సాయుధ పోరాటానికి జనరల్ జియౌర్ రెహ్మాన్ నాయకత్వం వహించారని, ఆయనే బంగ్లాదేశ్ విమోచన ప్రకటన చేశారని చెబుతున్నారు. అయితే ముజిబ్ హత్య తర్వాత రెహ్మాన్ కూడా పాకిస్థాన్ తరహాలోనే ఇస్లామిక్ రాజకీయాలను రాజ్యాంగబద్ధం చేసే ప్రయత్నం చేశారు.అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బీఎన్పీ రాజకీయాలు అవామీ లీగ్కు ప్లేస్ ఇవ్వడం లేదు. భారత భూభాగం నుంచి షేక్ హసీనా ప్రత్యక్షంగా మీడియాతో మాట్లాడడంపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2013 ఒప్పందం కింద ఆమెను అప్పగించాలని తమ డిమాండ్ను ప్రభుత్వం మళ్లీ పునరుద్ఘాటించింది. భారత భూభాగం నుంచి ఇలాంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం ద్వైపాక్షిక సంబంధాలపై నేరుగా ప్రతికూల ప్రభావం చూపుతుందని అధికారికంగా తెలిపింది.ఇక్కడ చారిత్రక నేపథ్యం చాలా ముఖ్యమైనది. బంగ్లాదేశ్లో జరిగిన ప్రతి ప్రధాన రాజకీయ మార్పులో భారత అంశం కనిపించింది. 1971 విమోచన యుద్ధం నుంచి హసీనా ప్రవాస జీవితం వరకు ఇదే పరిస్థితి. రాజ్యాంగేతర ఏర్పాట్ల కంటే ప్రజాస్వామ్య రాజకీయాలకే భారత్ ఎప్పుడూ మద్దతు ఇచ్చింది. అయితే తన చివరి పాలనా కాలంలో హసీనా రాజకీయ ప్రత్యర్థులకు తగిన ప్లేస్ ఇవ్వలేదు. దీనిపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి.నిషేధం అమలులో ఉన్నప్పటికీ, దేశంలోనే అత్యంత పురాతన రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్కు బంగ్లాదేశ్ అంతటా బలమైన ఉనికి, మద్దతు ఉంది. ఇటీవల ముగిసిన ఫిబ్రవరి ఎన్నికలు సమగ్రంగా జరిగి ఉంటే అవామీ లీగ్ రెండో అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిచే అవకాశం ఉండేది. ప్రజాభిప్రాయ సర్వేల ప్రకారం ఇప్పటికీ దాదాపు 30 శాతం ఓటర్లపై ఆ పార్టీ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో హసీనా తిరిగి వస్తే, 2007లో జరిగినట్టే ఆమెకు స్వాగతం పలకడానికి మద్దతుదారులు వీధుల్లోకి రావచ్చు. ప్రస్తుత వ్యవస్థకు ఇది రాజకీయ అసౌకర్యాన్ని కలిగిస్తోంది.అవామీ లీగ్ వేగంగా పునర్వ్యవస్థీకరణ? రాజకీయ కార్యకలాపాలు తిరిగి తెరుచుకుంటే అవామీ లీగ్ వేగంగా పునర్వ్యవస్థీకరణ చెందవచ్చనే ఆందోళన వారికి ఉంది. అందుకే హసీనా ప్రసంగాన్ని బంగ్లాదేశ్లో ప్రసారం చేయనివ్వలేదు. ప్రధానమంత్రి తారిక్ రెహ్మాన్ ఇప్పటికీ ప్రజలపై బలమైన పట్టు సాధించలేదు. మరోవైపు జమాత్-ఇ-ఇస్లామీకి అవామీ లీగ్తో చాలా కాలంగా ఉన్న విభేదాల నేపథ్యంలో, జమాత్ తీవ్రవాద రాజకీయాలను నియంత్రించేందుకు అవామీ లీగ్ రాజకీయ కార్యకలాపాలను తారిక్ రెహ్మాన్ అనుమతించే అవకాశం ఉంది.ఢాకాతో సంబంధాల్లో సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ను ఆహ్వానించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాజీ ప్రధానమంత్రి ఖలేదా జియా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఢాకా వెళ్లారు. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తారిక్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అయినప్పటికీ ఈ ప్రయత్నాల వల్ల స్పష్టమైన రాజకీయ హామీ గానీ, విశ్వాసం గానీ ఏర్పడలేదు. భారత్తో మరింత దగ్గరవ్వాలనే విషయంలో తారిక్ రెహ్మాన్ సందిగ్ధత స్పష్టంగా కనిపిస్తోంది. తన తొలి విదేశీ పర్యటనలకు ఆయన మలేషియా, ఆ తర్వాత చైనాను ఎంచుకున్నారు. చైనా పర్యటనలో మోంగ్లా పోర్టు వంటి సున్నిత అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ఇవి భారత్ భద్రతా ఆందోళనలకు కారణమవుతున్నాయి.ఇరు దేశాల మధ్య ఇంకా పలు అంశాలు పెండింగ్లో ఉన్నాయి. మొదటిది 1996 గంగా జల ఒప్పందం పునరుద్ధరణ. దీనిపై బిహార్, పశ్చిమ బెంగాల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండోది తీస్తా జలాల పంపిణీ ఒప్పందం. మూడోది షేక్ హసీనా అధికారిక అప్పగింత. నాలుగోది సరిహద్దు వాణిజ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం. బంగ్లాదేశ్ మారుతున్న రాజకీయాలు, వ్యూహాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశాలకు మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అప్పగింత విషయానికి వస్తే, రాజకీయ నేరాల కేసుల్లో దాన్ని తిరస్కరించే అవకాశం ఒప్పందంలో ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆర్టికల్ 6 రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసులపై అప్పగింతను నిరాకరిస్తుంది.వనరులు, అనుసంధానం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో ఇరు దేశాలు సంక్లిష్ట పరస్పర ఆధారిత సంబంధాలు కలిగి ఉన్నాయి. భారత ఈశాన్య ప్రాంత అభివృద్ధి, బంగ్లాదేశ్ అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. రాజకీయ విభేదాలు మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాంతీయ పురోగతి వంటి పెద్ద లక్ష్యాలను మసకబార్చకుండా ఢిల్లీ, ఢాకా చూసుకోవాలి.
జాతీయం
సీఎం విజయ్పై కమల్ హాసన్ ప్రశంసలు
తమిళనాడు సీఎం విజయ్పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్వహించే అన్ని అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాల్తుకు తొలి ప్రాధాన్యతను ఇచ్చి ఆలపించాలని అసెంబ్లీ వేదికగా చేసిన తీర్మానాన్ని కమల్ హాసన్ స్వాగతించారు. ప్రభుత్వం నిర్ణయం అభినందనీయం అని.. రాష్ట్ర హక్కులు, సాంస్కృతిక గుర్తింపుపై గట్టిగా నిలబడే ధోరణిని కొనసాగించాలని ఆయన ట్వీట్ చేశారు.సీఎం విజయ్ తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సీఎం విజయ్ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. సీఎం విజయ్ ప్రసంగిస్తూ భాష అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ మాత్రమే కాదని, ప్రపంచంలో ఏ భాషకైనా అది వర్తిస్తుందన్నారు. అయితే, తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది మన ప్రాణం, మన భావోద్వేగం. అమ్మ అని పిలిచినప్పుడు ఏ బంధం, ప్రేమ మనలో ఉప్పొంగుతుందో, మన మాతృభాష అయిన తమిళం కూడా అంతే పవిత్రమైనదని వ్యాఖ్యలు చేశారు.1891లో మనోన్మణియం సుందరనార్ రాసిన గీతాన్ని ప్రస్తావిస్తూ భారత ఉపఖండం అనే అందమైన ముఖానికి నొసటిపై రూపకమైన తిలకం వంటిది తమిళనాడు అని, దాని పరిమళం ప్రపంచమంతా వ్యాపించాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో తమిళులు లేని దేశమంటూ లేదని, తమిళం అంటే కేవలం ఒక భాష కాదని, అదొక సంస్కృతి, ఆలోచన , ఆతిథ్యానికి ప్రతీక అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళం అంటే గెత్తు (స్టైల్ లేదా గెలుపు), తమిళం అంటే పవర్‘ అని సీఎం స్పష్టం చేశారు. అనంతరం ఈ ప్రత్యేక తీర్మానానికి అసెంబ్లీలోని డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, పిఎంకే, వీసీకే సహా అన్ని రాజకీయ పక్షాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి.அரசு நிகழ்ச்சிகளில் தமிழ்த்தாய் வாழ்த்து முதலாவதாகப் பாடப்பட வேண்டும் என சட்டமன்றத்தில் தீர்மானம் நிறைவேற்றியிருப்பது மகிழ்ச்சிக்குரியது; வரவேற்கத்தக்கது. மாநில உரிமைகளை விட்டுத்தராத இந்தப் போக்கு தொடரவேண்டும்.— Kamal Haasan (@ikamalhaasan) August 11, 2026
నీట్ పేపర్ లీక్: ‘రసాయనశాస్త్రం’తో నమ్మించి..
న్యూఢిల్లీ: నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతానికి సంబంధించి జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) డైరెక్టర్ విశ్వజిత్ కుమార్ సహా 17 మంది అధికారుల వాంగ్మూలాలను సీబీఐ తన చార్జ్షీట్లో పొందుపరిచింది. ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జూలై 28న దాఖలు చేసిన ఈ చార్జ్షీట్లో మొత్తం 360 మంది సాక్ష్యాలను పేర్కొన్నారు. నీట్-యూజీ పేపర్ల తయారీ ప్రక్రియ ఏప్రిల్ 5 నాటికే పూర్తయిందని, మే 3న పరీక్ష జరగగా.. లీక్ కారణంగా మే 12న రద్దు చేసి జూన్ 21న రీ-టెస్ట్ నిర్వహించినట్లు విశ్వజిత్ కుమార్ సీబీఐకి వెల్లడించారు.ప్రశ్నపత్రాలు రూపొందించే నిపుణుల ఎంపికలో ఎలాంటి అప్రతిష్ట లేని వారికే ప్రాధాన్యత ఇచ్చామని, అయితే రసాయన శాస్త్రానికి చెందిన ఒక సీనియర్ నిపుణురాలు ప్రైవేట్ కోచింగ్ తరఫున తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి తాను ఆరా తీసినట్లు ఆయన తెలిపారు. ఎన్టీఏలో ఆమెకున్న మంచి పేరు కారణంగానే తాము అనుమానించలేదని వివరించారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉండే నిపుణులు ఎవరూ మొబైల్స్, పెన్నులు, కాగితాలు లోపలికి తీసుకెళ్లడానికి వీలే లేదని, అయితే నిపుణులను క్షుణ్ణంగా తనిఖీ (ఫ్రిస్కింగ్) చేసే విధానం ఎందుకు నిలిపివేశారనేదానికి తనకంటే ముందే ఉన్న పద్ధతినే కొనసాగించినట్లు ఆయన తెలిపారు.మరోవైపు ఎన్టీఏ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ వద్ద నిపుణుల రాకపోకలపై ఎలాంటి తనిఖీ వ్యవస్థ లేదని నీట్ కన్సల్టెంట్ శిల్పి శర్మ సీబీఐకి తెలిపారు. కేవలం ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు మాత్రమే వారిని ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. ఎన్టీఏ భవనంలోని ఒకటో అంతస్తులో 110 సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, రికార్డింగ్ నిల్వ సామర్థ్యం కేవలం 25 రోజులు మాత్రమే ఉండటం, సీసీటీవీ కంట్రోల్ రూమ్ సరిగ్గా లేకపోవడం వంటి భద్రతా లోపాలను సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. ప్రశ్నలను కాగితపు చిట్టీలపై రాసుకోవడం, కొందరు వాటిని జ్ఞాపకం ఉంచుకుని హోటల్ గదుల్లో నోట్ చేసుకోవడం వంటి పద్ధతుల ద్వారా బయటకు తరలించినట్లు తేలింది.ఇది కూడా చదవండి: ఇందిర హత్య కేసు దోషి కుమారునికి ‘పంజాబ్’ టికెట్!
క్షణాల్లో కొట్టుకుపోయిన భారీ వంతెన.. వీడియో వైరల్
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదుల నీటి మట్టం పెరగడంతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నీతి లోయలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంతానికి ప్రధాన పట్టణంతో సంబంధాలు తెగిపోయాయి. చమోలి జిల్లా పరిధిలోని ఈ ప్రాంతంలో ఉప్పొంగుతున్న నీటి ఉధృతికి సెకన్ల వ్యవధిలో కొట్టుకుపోయిన వంతెన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వంతెన చుట్టూ నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. కొద్దిసేపటికే బురదతో కూడిన భారీ నీటి ప్రవాహం దిగువకు దూసుకువచ్చి వంతెనను బలంగా ఢీకొట్టింది. ఆ నీటి తీవ్రతను తట్టుకోలేక వంతెన నిర్మాణం పక్కకు ఒరిగి, నది ఒడ్డు వైపునకు కూలిపోయింది. నది పక్కనే ఉన్న రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు, ఎస్యూవీ (SUV) వాహనాలు కూడా అదే వీడియోలో కనిపించాయి. ఆ రెండు వాహనాలను వెనక్కి మళ్లించి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. లోయలోని నదులు, వాగుల పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.🚨 Uttarakhand Bridge Swept Away In Seconds Due To Strong Currents pic.twitter.com/fvV0KM7Piy— Global News & Geopolitics 🌍 (@GlobalNewsGeo) August 11, 2026
ఇందిర హత్య కేసు దోషి కుమారునికి ‘పంజాబ్’ టికెట్!
ఫతేగఢ్ సాహిబ్: జైలులో ఉన్న ఖాదూర్ సాహిబ్ ఎంపీ, సిక్కు నేత అమృత్పాల్ సింగ్ పార్టీ ‘అకాళీదళ్ (వారిస్ పంజాబ్ దే)’ 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య కేసులో కుట్ర కోణంలో దోషిగా తేలి ఉరిశిక్షను ఎదుర్కొన్న కేహార్ సింగ్ కుమారుడు సత్వంత్ సింగ్ను బస్సీ పఠానా నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నట్లు వెల్లడించింది. అమృత్పాల్ సింగ్ తండ్రి, డబ్ల్యూపీడీ తాత్కాలిక అధ్యక్షుడు తర్సేమ్ సింగ్, ఫరీద్కోట్ ఎంపీ సరబ్జిత్ సింగ్ ఖల్సాలతో కలిసి అమృత్సర్లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు.ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని బస్సీ పఠానా నియోజకవర్గానికి చెందిన 61 ఏళ్ల సత్వంత్ సింగ్ రిటైర్డ్ బ్యాంక్ అధికారి. ఆయన ఈ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తర్సేమ్ సింగ్ మాట్లాడుతూ.. తమ పార్టీ అజెండా కేవలం రాజకీయ అధికారాన్ని సాధించడం మాత్రమే కాదని పంజాబ్ హక్కులు, సమాజం కోసం త్యాగాలు చేసిన కుటుంబాల సేవలను గుర్తించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో త్యాగం చేసిన కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకే సత్వంత్ సింగ్కు టికెట్ కేటాయించినట్లు తెలిపారు. అంతేకాకుండా, పార్టీ పార్లమెంటరీ బోర్డులో సత్వంత్ సింగ్ మేనల్లుడు సుఖ్విందర్ సింగ్ అగ్వాన్కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.గత 2024 లోక్సభ ఎన్నికల్లో బీయంత్ సింగ్ కుమారుడు సరబ్జిత్ సింగ్ ఖల్సా ఫరీద్కోట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందగా, అమృత్పాల్ సింగ్ ఖాదూర్ సాహిబ్ నుంచి భారీ విజయం సాధించారు. తాజాగా సత్వంత్ సింగ్ అభ్యర్థిత్వం ద్వారా పంజాబ్ రాజకీయాల్లో రాడికల్ భావజాలం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రాంతీయ హక్కులు, సిక్కు రాజకీయ ఖైదీల కుటుంబాల ప్రాతినిధ్యమే తమ ఎన్నికల ప్రధాన అజెండా అని పార్టీ స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: యువతపై దౌర్జన్యం సరికాదు: ప్రకాశ్ రాజ్
ఎన్ఆర్ఐ
శ్రీ బాలాజీ దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
యూకేలోని గ్లౌసెస్టర్షైర్ ప్రాంతంలో తాత్కాలిక శ్రీ బాలాజీ ఆలయం ఏర్పాటు తోపాటు ఘనంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఆధ్యాత్మిక శక్తి, ఐక్యతలకు నిదర్శంనగా నిలిచింది ఈ వేడుక. విదేశీగడ్డపై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భక్తులంతా వాలంటీర్గా ముందుకు వచ్చి.. సనాతన ధర్మ స్ఫూర్తిని చాటడం విశేషం. ఈ వేడుకలో పురోహిత విధులను అరవింద్, లక్ష్మి, సహస్ర నిర్వహించగా, ఆలయ కార్యక్రమాల్ని దిగ్విజయంగా జరిగేలా శ్రీనిరెడ్డి, మాధురి కుటుంబం, అలాగే శ్రీలక్ష్మీ, శ్రీని అర్గిల్ల, శిల్ప కుటుంబం పర్యవేక్షించింది. నరేష్, సురేష్ బండారులు విగ్రహాలను సమకూర్చగా, మహిళలు, చిన్నారులు స్వామి అలకంరణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు శ్రీలక్ష్మీ, రాజేష్, నానీ, సోను కుటుంబ సభ్యులు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలా వాలంటీర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవిశ్రాంతంగా సేవలందించారు. ఇది గ్లౌసెస్టర్ హిందూ సమాజపు బలాన్ని, సనాతన ధర్మ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. (చదవండి: న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు)
అట్లాంటా: విజయవంతంగా ‘వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్’
అట్లాంటాలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలను వివరించారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న Let’s Speak for Jagananna, Let’s Write for Jagananna, Let’s Post for Jagananna, Let’s Code for Jagananna’’ కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో Online Reputation Management-ORM ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు. కేవలం పోస్టులు చేయడం, కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా.. స్పష్టమైన లక్ష్యం, సమన్వయంతో ముందుకు సాగాలని ఎన్ఆర్ఐ కార్యకర్తలకు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు.వాస్తవాలను ప్రజలకు సమర్థంగా చేరవేయాలన్న సాంబశివారెడ్డి.. తప్పుడు ప్రచారాలను ఆధారాలతో ఎదుర్కోవాలని సూచించారు. YSRCP NRI Wing Portal, Jagan 2.0 Super యాప్ల కూడా అవగాహన కల్పించారు. మన గ్లోబల్ డిజిటల్, సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.
లండన్లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
క్రైమ్
పెళ్లైన 24 గంటల్లోనే భార్యను బేరం పెట్టిన భర్త..!
ఏలూరు జిల్లా: ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిన యువకుడిపై యువతి తల్లిదండ్రులు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొల్లపల్లికి చెందిన యువతి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని తన మేనమామ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ, మూడు రోజుల క్రితం వివాహం చేసుకుని బాపులపాడు మండలం వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, యువతిని భర్త ఇంటికి పంపించారు. అయితే, తమ అమ్మాయిని తమ దగ్గరకు పంపించాలంటే ఆమె భర్త రూ.12 లక్షలు డిమాండ్ చేస్తున్నాడంటూ సోమవారం నూజివీడు రూరల్ పోలీస్స్టేషన్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కానీ యువకుడిని పెళ్లి చేసుకున్న యువతినుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో.. యువతి తల్లిదండ్రులు పెట్టిన ఆరోపణలు ఎంత వరకు నిజం ఉందేనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
భర్తను చంపేందుకు భార్య భారీ స్కెచ్..!
తమిళనాడు: మాదక ద్రవ్యాలతో భర్తను హత్య చేసేందుకు యత్నించిన భార్యను పోలిసులు అరెస్టు చేశారు. కల్లకురిచి జిల్లాలోని చిన్నసేలం గ్రామానికి చెందిన రాజీవ్ గాంధీ(40) వ్యవసాయ కూలీ. ఇతను తన భార్య కనగ, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, గత 6వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటలకు రాజీవ్ గాంధీ తన ఇంటి ముందు నిలబడి ఉండగా, పొలం బయట రోడ్డు నుండి బైకు పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతని మెడపైనా, నడుముపైనా పొడిచారు. కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. వారు రావడం చూసిన, ఆ గుర్తుతెలియని వ్యక్తులు బైకు పై పారిపోయారు .దీని తరువాత, రాజీవ్ గాందీని రక్షించి కల్లకురిచి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఈ విషయమై చిన్నసేలం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశారు. అందులో, రాజీవ్ గాంధీ భార్య కనక, ఆమె వివాహితర ప్రియుడు, మాజీ పంచాయత్ అధ్యక్షుడు ధనపాల్ (53), ఇద్దరు అనుచరులతో కలిసి రాజీవ్ గాందీని హత్య చేయడానికి యత్నించినట్లు వెల్లడైంది. దీంతో చిన్నసేలం పోలీసులు ఆ గ్రూపు మాజీ నాయకుడు ధనపాల్, కనక, కిరాయి హంతకులైన పాల్ రాజ్ (24), కార్తీక్తో సహా మరో నలుగురి పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం..!
అనంతపురం సెంట్రల్: అనంతలో హైటెక్ వ్యభిచారం గుట్టు బయట పడింది. గుంటూరు, అమలాపురం, రాజమండ్రి ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నగరానికి చెందిన విటులను రప్పించి ఎవరికి నచ్చిన వారు.. వారితో గడిపే విధంగా సెటప్ చేశారు. నగరానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనతో మరికొందరు చోటా నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధర్ధరాత్రి వన్టౌన్ పోలీసులు సదరు వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. మొత్తం 10 మంది వేశ్యలు, 10 విటులను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళలను విచారణ నిమిత్తం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడస్తున్న ఓ హోంకు తరలించారు. ఈ వ్యభిచార కేంద్రం వెనుక పెద్ద రాకెట్ ఉండడంతో కూపీ లాగేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. త్వరలో దీనిపై వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.
డాక్టర్ ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం
తూర్పు గోదావరి జిల్లా: జీఎస్ఎల్ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతికి విచారాన్ని వ్యక్తం చేస్తూ కళాశాలలో సోమవారం సంతాప సభ నిర్వహించారు. పీజీలో డెర్మటాలజీ ఫస్టియర్ చదువుతున్న ఆమె ఇకలేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నామని, ఆమె కుటుంబానికి మనోధైర్యాన్ని అందించి, ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలని దేవుడిని ప్రార్థించారు. ఆఖరి నిమిషం వరకు ఆమెను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఆమె చిత్రపటం వద్ద సహ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ ప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించాలని జీఎస్ఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందని వైద్య కళాశాల ఎండీ డాక్టర్ గన్ని సందీప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి ఈడీ డాక్టర్ గన్ని సాధిక ద్వారా త్వరలోనే అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గన్ని సారిక, డాక్టర్ సీతారామ్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ తేజస్విని, డాక్టర్ సుభాషిణి, విద్యార్థులు పాల్గొన్నారు.
వీడియోలు
ఆడపిల్లలు సవాల్ చేస్తుంటే ముడుచుకున్నావ్ లోకేష్ పరువు తీసేసిన RK రోజా
వైఎస్సార్సీపీ ర్యాలీ @ రణస్థలం
పార్లమెంటులో బిజేపీ వ్యూహమేంటి?
ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారు.. కూటమి నేతలకు బొత్స వార్నింగ్
నిన్ను సొంత అన్న అనుకున్న.. మా చావుకు కారణం నువ్వే చింతమనేనిపై రెచ్చిపోయిన బాధితులు
చంద్రగిరి YSRCP ర్యాలీ DRONE VISUALS
DSP సాబ్ దెబ్బ ఓడిపోయే మ్యాచ్ని గెలిపించిన సిరాజ్
అట్టుడుకుతున్న జార్ఖండ్ వెనక్కి తగ్గేదే లే!
YSRCP మాజీ సర్పంచ్ ఇల్లు కూల్చేసిన అధికారులు
ట్రంప్ నకు ఇరాన్ ముప్పు టర్కీలో ట్రంప్ సీక్రెట్ ఆపరేషన్


