డీఎస్సీ పారదర్శకమైతే జీవోలు ఎందుకు మార్చారు?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానమా? దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు? అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీలో అక్రమాలకు ద్వారాలు తెరవలేదా..? జరిగిన పరిణామాలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా..?’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై సూటి ప్రశ్నలు సంధించారు. నియామకాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశం ఉంటే.. అర్హత పరీక్ష అవసరం లేదంటూ జీవోలు ఎందుకు జారీ చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత పరీక్ష ఆధారిత నియామక విధానాన్ని తిరిగి తీసుకొచ్చేలా నిబంధనలు ఎందుకు మార్చారని నిలదీశారు. ఈ పరిణామాలను నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియగా ఎలా పరిగణిస్తారని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ కుంభకోణానికి ఈ విధానాలు అవకాశం కల్పించలేదా? అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తాను మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు? » డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు? » అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా? » నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించడంపై చంద్రబాబు సమాధానం చెప్పరా?
ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టీడీపీ షాక్..!
సాక్షి ప్రతినిధి, కడప: క్షేత్రస్థాయిలో విలువ దక్కకపోయినా అధిష్టానం వద్ద పరపతి తగ్గలేదు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కాదని, మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి సిఫార్సుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రతి చిన్న విషయానికి అటు ఎమ్మెల్యే వరద ఇటు ప్రవీణ్కుమార్ పోటీ పడుతున్నారు. పైచేయి సాధించేందుకు ఎత్తులు..పైఎత్తులు వేస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రవీణ్ పాత్ర అతిస్వల్పం అని చూపించేందుకు ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా అధిష్టానం వద్ద ప్రవీణ్కుమార్రెడ్డిదే అప్పర్ హ్యాండ్ అయ్యింది. ప్రొద్దుటూరు సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా (ఏజీపీ) వినోద్కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు ప్రొద్దుటూరు ఇన్చిర్జిగా ఉక్కు ప్రవీణ్కుమార్రెడ్డి చురుగ్గా ఉండేవారు. సమీకరణల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి తెరపైకి వచ్చారు. అప్పటి వరకు కలిసికట్టుగా ఉన్నట్లు అనిపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వరద అన్నింటా తనదే పైచేయి ఉండాలనే దిశగా అడుగులు వేశారు. ఈక్రమంలో పరస్పర దాడులు వరకు వెళ్లారు. ఎప్పటికప్పుడు ఎవరికి వారు చోటుచేసుకున్న పరిస్థితులను అధిష్టానానికి వివరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ నియామకాలపై కూడా ఎప్పటికప్పుడు ఆయా వర్గీయులు అభ్యర్థులను సిఫార్సు చేస్తూ వచ్చారు. ఏజీపీగా వినోద్కుమార్ నియామకం... ప్రొద్దుటూరు సివిల్ జడ్జి కోర్టు ఏజీపీగా అడ్వకేట్గా ఈ.వినోద్కుమార్ను నియమిస్తూ జీఓ ఆర్టీ నెం.259 ద్వారా సెప్టెంబర్ 11న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏజీపీ నియామకం కోసం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అడ్వకేట్ నిర్మలను నియమించాలని సూచించారు. ఈవిషయాన్ని ఇన్చార్జి మంత్రి సవిత, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి అడ్వకేట్ వినోద్కుమార్ను ఏజీపీగా నిమించాలని మంత్రి నారా లోకేష్కు విన్నవించినట్లు సమాచారం. ప్రవీణ్ అభ్యర్థన మేరకు సిఫార్సులు పంపాల్సిందిగా సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ కావడం, ఆమేరకు నియామకపు ఉత్తర్వులు వెలుబడినట్లు విశ్వసనీయ సమాచారం. కొండారెడ్డి చర్యలతోనే పలుచబడ్డ పరపతి.... ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అయినప్పటీకీ అనధికార పెత్తనమంతా తనయుడు నంద్యాల కొండారెడ్డి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకొని కోటరీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మట్కా, గుట్కా, జూదం లాంటివి విచ్చలవిడిగా ఉన్నాయని స్వయంగా ఎమ్మెల్యే వరద బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అలాంటి వ్యక్తులనే కొండారెడ్డి ప్రోత్సహిస్తూ వారి సిఫార్సులకు అనుగుణంగా నడుచుకుంటున్నారని విశ్లేషకులు సైతం వివరిస్తున్నారు. ఇసుక అక్రమదందా, సెటిల్మెంట్లు ఈమారు ప్రొద్దుటూరులో సైర్వవిహారం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో అధిష్టానం వద్ద ఎమ్మెల్యే వరద పరపతి పలుచబడినట్లు సమాచారం. ఆమేరకే ఎమ్మెల్యే సిఫార్సులను కాదనీ, ఉక్కు ప్రవీణ్ సిఫార్సులకు అనుగుణంగా ఏజీపీ నియామకం చోటుచేసుకున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.7.44 వరకు తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తర ప.2.06 వరకు తదుపరి హస్త, వర్జ్యం: రా.10.36 నుండి 12.14 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.51 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: ఉ.6.57 నుండి 8.34 వరకు.సూర్యోదయం : 5.50సూర్యాస్తమయం : 6.04రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం... పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం... పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.మిథునం... కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు డీలా పరుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.సింహం... రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.కన్య... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. దైవచింతన.తుల... ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.వృశ్చికం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.ధనుస్సు....ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.మకరం... పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.కుంభం....రుణదాతల ఒత్తిడులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.మీనం... పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. ఆర్థికాభివృద్ధి. వస్త్రలాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.
మహానగరానికి కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: రాజధాని మహానగర భవిష్యత్తు రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026 (టీక్యూర్ బిల్లు)ను ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో సభ్యులకు పంపిణీ చేసింది. ఈ బిల్లుపై శనివారం సమగ్ర చర్చ జరగనుంది. 1956లో అప్పటి నగర అవసరాలకు అనుగుణంగా రూపొందిన మున్సిపల్ చట్టాల స్థానంలో ఆధునిక నగర అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర పాలనా వ్యవస్థను తీసుకురావడం బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం విస్తరించిన హైదరాబాద్ భౌగోళిక, జనాభా, ఆర్థిక అవసరాలకు పాత చట్టాలు సరిపోవడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. పాత జీహెచ్ఎంసీ పరిధితో పాటు చుట్టుపక్కల విలీన ప్రాంతాలను సమన్వయంతో అభివృద్ధి చేయడం, ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం, పౌర సేవలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఉంది. మూడు కార్పొరేషన్లు.. ఒకే సమన్వయం క్యూర్లోని ప్రాంతాల్ని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలుగా మూడు కార్పొరేషన్లుగా నిర్వహించే ప్రతిపాదనకు చట్టబద్ధ రూపం లభించనుంది. వీటి సమన్వయం కోసం ‘క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నారు. మహానగర స్థాయి వ్యూహాత్మక ప్రాధాన్యాలను ఈ కౌన్సిల్ నిర్దేశించనుంది.సామాన్యుల నెత్తిన బాంబుసామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపే అంశాల్లో ఆస్తిపన్ను మార్పు ప్రధానమైనది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంవత్సర అద్దె విలువ (ఏఆర్వీ) విధానానికి బదులుగా ఆస్తి మూలధన/రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ (సీవీఎస్) తేనున్నారు. దీనిద్వారా పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను రెట్టింపు, అంతకంటే ఎక్కువ కానుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నును ‘బేస్ ప్రాపర్టీ ట్యాక్స్’, కొత్త విధానంలో లెక్కించే పన్నును ‘బెంచ్మార్క్ ప్రాపర్టీ ట్యాక్స్’గా పరిగణించే విధానం ఉంది. కొత్త లెక్క ప్రకారం పన్ను ఎక్కువగా వస్తే ఒక్కసారిగా మొత్తం భారాన్ని మోపకుండా, క్రితం ఏడాది పన్నుపై ఏటా గరిష్టంగా 20 శాతం చొప్పున పెంచుతూ బెంచ్మార్క్ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.ఉదాహరణకు ప్రస్తుతం రూ.10వేలు పన్ను ఉండి, కొత్త విధానంలో రూ.20వేలు వస్తే.. మొదటి ఏడాది రూ.12,000, రెండో ఏడాది రూ.14,400, మూడో ఏడాది రూ.17,280 చొప్పున పెరుగుతూ చివరకు రూ.20వేలు స్థాయికి చేరుతుంది. కొత్త విధానంలో పన్ను తక్కువగా వచ్చినా వెంటనే ఆ తగ్గింపు ప్రయోజనం అందదు. బేస్ ట్యాక్స్నే కొనసాగిస్తూ భవిష్యత్లో క్యాపిటల్ వాల్యూ ఆధారంగా లెక్కించిన పన్ను దానికంటే ఎక్కువైనప్పడు కొత్త విధానాన్ని వర్తింపచేయనున్నారు. ప్రతి ఆస్తికి యూనిక్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూపీఐఎన్) కేటాయించడం ద్వారా ఆస్తుల గుర్తింపు, పన్నుల నిర్వహణ, కొనుగోలు–అమ్మకాల్లో పారదర్శకత పెరగనుంది.ఒక్క చాన్స్సెక్షన్ 160 కింద 2015, అక్టోబర్ 28 నాటికి పూర్తయిన, కొన్ని నిబంధనలకు విరుద్ధమైన లేదా అనుమతి లేని నిర్మాణాలకు జరిమానాతో ఒకసారి క్రమబద్ధికరణకు అవకాశం కల్పించే నిబంధన ఉంది. ఆ తేదీ నాటికే నిర్మాణం పూర్తయిందని అఫిడవిట్ ఇవ్వాలి. తప్పుడు అఫిడ విట్ సమర్పిస్తే క్రిమినల్ చర్యలకు అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటు భవిష్యత్తులో చేపట్టే అక్రమ నిర్మాణాలకు వర్తించదు. అక్రమ నిర్మాణాలను నిలిపివేయడం, వివరణ కోరడం, నిర్మాణ సామగ్రిని స్వా«దీనం చేసుకోవడం, కూల్చివేతకు ఆదేశించడం వంటి అధికారాలు కమిషనర్కు ఉంటాయి. సాధారణంగా భవనా న్ని సీజ్ చేయడానికి 24 గంటల ముందస్తు నోటీసు అవసరం కాగా, ప్రజా భద్రతకు అత్యవ సర ముప్పు ఉన్న పరిస్థితుల్లో ముందస్తు నో టీసు లేకుండానే సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ లేని భవనాలకు నీరు, విద్యుత్, మురుగునీటి కనెక్షన్లు ఇవ్వకుండా ని బంధనలు కఠినతరం చేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్లు ఇచ్చిన అధికారులపైనా చర్యలకు అవకాశం ఉంటుంది. నిబంధనలకు విరుద్ధమైన ఆస్తుల అమ్మకం, బహుమతి, లీజ్, తనఖా, మారి్పడి వంటి బదలాయింపులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అవసరమైతే వాటిని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చవచ్చు.సింగిల్ విండో.. నైట్ ఎకానమీ వ్యాపారాలకు వివిధ శాఖల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సింగిల్ విండో ఆన్లైన్ లైసెన్సింగ్ వ్యవస్థను తేనున్నారు. ఎంపిక చేసిన నైట్ ఎకానమీ జోన్లలో రాత్రివేళల్లో వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలకు చట్టబద్ధమైన అవకాశం కల్పించడం ద్వారా నగర ఆర్థిక వ్యవస్థను 24 గంటల కార్యకలాపాల దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు తదితర మౌలిక సదుపాయాల నిర్వహణకు ఏఐ, డిజిటల్ మ్యాపింగ్, సాంకేతిక పర్యవేక్షణను విస్తరించనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఆహార విక్రయ కేంద్రాల తనిఖీలు, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. భవనాలు, లేఅవుట్ల అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు నిర్ణీత వ్యవధిలో దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకపోతే అది పైస్థాయి అధికారుల వద్దకు వెళ్లే విధానం ఉంటుంది. అక్కడ కూడా నిర్ణయం రాకపోతే డీమ్డ్ అప్రూవల్కు అవకాశం కల్పించే నిబంధనలు ఉన్నాయి. అయితే ఇది నిబంధనలను పక్కన పెట్టే ‘ఆటోమేటిక్ అనుమతి’కాదు. ‘హైడ్రా’కు మరిన్ని అధికారాలు వరదలు, చెరువులు, నాలాలు, ఆక్రమణల నియంత్రణలో హైడ్రాకు కీలక అధికారాలను కల్పించే నిబంధనలు ఉన్నాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలా ప్రాంతాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై కఠిన చర్యలకు వీలు కలి్పస్తున్నారు. మున్సిపల్ వివాదాల త్వరిత పరిష్కారానికి ప్రత్యేక అప్పిలేట్ వ్యవస్థ, ప్రత్యేక మేజి్రస్టేట్ కోర్టుల ఏర్పాటుకు కూడా బిల్లు మార్గం చూపుతోంది.
బ్రష్ చేసినా నోటి దుర్వాసనా?
పందుల బీచ్!
విజయవాడలో భారీ వర్షం.. మరో గంటలో తెలంగాణలో వర్షాలు
నా ముఖమే అంతా.. 'ప్యారడైజ్' దర్శకుడి ట్వీట్
ఉల్లికి మళ్లీ రెక్కలు!
వానల్లేకున్నా.. గంగమ్మ గర్జన! బిహార్లో 47 లక్షల మంది విలవిల!
జపాన్ సముద్రం వైపు దూసుకెళ్లిన ఉత్తర కొరియా క్షిపణి
ఐదు రోజుల్లో రిటైర్మెంట్.. ఇంతలో కలెక్టర్కు బిగ్ షాక్!
గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి?
‘మరో దారి లేదు..’ ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
ప్రభుత్వాన్ని మూసెయ్యడం కాదయ్యా! ఓన్లీ కళాశాలలనే!
ఒక్కసారే అన్ని కహానీలు ఎందుకు చెప్పార్సార్!!
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే జుట్టు పెరుగుదల.. డా.స్తుతి ప్రత్యేక చికిత్స
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
తమిళనాడులో సంచలనం.. స్టాలిన్కు పళనిస్వామి బంపరాఫర్!
నా భర్త జీవితం సర్వనాశనమైంది : సుమంత్ భార్య
అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి
బిగ్బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్
దావూద్ ఇబ్రహీంను కాపాడింది అదృశ్య శక్తా?.. లేక మన పోలీసుల అతి తెలివా?
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
బ్రష్ చేసినా నోటి దుర్వాసనా?
పందుల బీచ్!
విజయవాడలో భారీ వర్షం.. మరో గంటలో తెలంగాణలో వర్షాలు
నా ముఖమే అంతా.. 'ప్యారడైజ్' దర్శకుడి ట్వీట్
ఉల్లికి మళ్లీ రెక్కలు!
వానల్లేకున్నా.. గంగమ్మ గర్జన! బిహార్లో 47 లక్షల మంది విలవిల!
జపాన్ సముద్రం వైపు దూసుకెళ్లిన ఉత్తర కొరియా క్షిపణి
ఐదు రోజుల్లో రిటైర్మెంట్.. ఇంతలో కలెక్టర్కు బిగ్ షాక్!
గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి?
‘మరో దారి లేదు..’ ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
ప్రభుత్వాన్ని మూసెయ్యడం కాదయ్యా! ఓన్లీ కళాశాలలనే!
ఒక్కసారే అన్ని కహానీలు ఎందుకు చెప్పార్సార్!!
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే జుట్టు పెరుగుదల.. డా.స్తుతి ప్రత్యేక చికిత్స
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
తమిళనాడులో సంచలనం.. స్టాలిన్కు పళనిస్వామి బంపరాఫర్!
నా భర్త జీవితం సర్వనాశనమైంది : సుమంత్ భార్య
అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి
బిగ్బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్
దావూద్ ఇబ్రహీంను కాపాడింది అదృశ్య శక్తా?.. లేక మన పోలీసుల అతి తెలివా?
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
ఫొటోలు
‘ది ప్యారడైజ్’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)
'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)
పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్ (ఫొటోలు)
కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)
చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)
సౌండ్ బాక్స్తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)
కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)
'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)
సినిమా
‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సుమంత్.. చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంటాడు. ఒకప్పుడు పక్కా మాస్ కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అక్కినేని హీరో.. ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. కథలో కొత్తదనం, పాత్రలో వైవిధ్యం ఉంటేనే సినిమాకు ఓకే చెబుతున్న సుమంత్.. తాజాగా ‘మహేంద్రగిరి వారాహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐశ్వర్య రాజేష్, సిద్ధు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘మహేంద్రగిరి వారాహి’తో సుమంత్ ఈసారి ఎలాంటి అనుభూతిని అందించాడు? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మహేంద్రగిరి రాజవంశస్థులకు ఓ శాపం ఉంటుంది. ఆ వంశంలో పుట్టిన ప్రతి మగబిడ్డ 33వ పుట్టినరోజున మరణిస్తాడు. ఈ శాపం 200 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంటుంది. అలా 1993లో ఆ వంశంలో పుట్టిన రాజేంద్ర వర్మ(సిద్దు జొన్నలగడ్డ)మరణిస్తాడు. ఇక ఈ సారి రాజేంద్రవర్మ అల్లుడు, ఆ రాజవంశానికి వారసుడు నరేంద్ర వర్మ(వంశీ చాగంటి) కూడా మరణిస్తాడని పూజారులు చెప్తారు. కథలో ఇదో భాగం.. మరోవైపు హైదరాబాద్కు చెందిన యూట్యూబర్ సిద్ధు అలియాస్ సిద్ధార్థ్(సుమంత్)..దెయ్యాలు, దేవుళ్ల పేరుతో కొంతమంది జనాలను మోసం చేస్తున్నారనేది ఆధారాలతో బయటపెడుతుంటాడు. అతని పెరెంట్స్తో పాటు అన్నయ్య రాజీవ్(కమల్ కామరాజు) కూడా దేవుడిని నమ్ముతాడు. పెళ్లి దోషం పోయేందుకు మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఆలయంలో పూజలు చేయమని చెప్పడంతో, రాజీవ్ తన బర్త్డే రోజు ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో నరేంద్ర వర్మ కూడా ఆలయానికి వస్తాడు. మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో గుడి ముందే ఉండే దున్నపోతు ఇద్దరినీ పొడిచి చంపేస్తుంది. సరిగ్గా 33వ పుట్టిన రోజు నాడే ఇది జరుగుతుంది. తన అన్న మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు సిద్ధు. ఈ క్రమంలో మహేంద్రగిరి రాజవంశం శాపం వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. అదేంటి? రాజవంశస్తులకు శాపం ఉంటే.. రాజీవ్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అసలు 200 ఏళ్ల క్రితం ఆ శాపం ఎలా వచ్చింది? ఇప్పుడు జరుగుతున్న మరణాలకు నిజంగా అమ్మవారి శాపమే కారణమా లేదా దాని వెనుక ఎవరైనా ఉన్నారా? సిద్ధార్థ్ రీసెర్చ్లో తెలిసిన అసలు నిజాలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక వంశానికి అమ్మవారి శాపం అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ‘మురారి’. ఆ తర్వాత ఇలాంటి శాపాలు, దేవుడి కథతో చాలా సినిమాలే వచ్చాయి. `మహేంద్రగిరి వారాహి` కూడా అలాంటి కథే. రాజవంశానికి శాపం ఉండడంతో 33 ఏళ్లకే చనిపోవడం.. దీనికి వెనుక ఒక కారణం ఉండడం.. హీరో రీసెర్చ్ చేసి అసలు కారణం తెలుసుకోవడం..చివరకు శాప విమోచనం.. కథ సుఖాంతం.. ఇదే మహేంద్రగిరి వారాహి చిత్రం కథ. ఇలాంటి కథలను మంచి ట్విస్టులతో, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో తెరపై చూపిస్తే ఆసక్తి కలుగుతుంది. మహేంద్రగిరి వారాహిలో అది మిస్ అయింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో మాత్రం కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలోనే శాపం బ్యాక్స్టోరీ చెబుతారు. అది కథపై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ తర్వాత కథనం రొటీన్గానే సాగుతుంది. యూట్యూబర్గా హీరో పరిచయం.. దెయ్యాలు, దేవుడు లేడని చెబుతూ చేసే యూట్యూబ్ వీడియోలు.. ఇవన్నీ రొటీన్గానే సాగుతాయి. మహేంద్రగిరి రాజవంశస్తులు శాఫ విమోచనం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆసక్తికరంగా సాగుతాయి. హీరో ప్యామిలీ మహేంద్రగిరి ఆలయం వద్దకు వచ్చిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. చావుల వెనుక ఉన్న అసలు నిజాన్ని కనుక్కునేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషనే సెకండాఫ్ కథ. ఫస్టాఫ్తో పోలిస్తే ద్వితియార్థం కొంత ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని సీన్లు థ్రిల్లింగ్గా ఉంటాయి. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. అమ్మవారి సంబంధించిన సీన్లు బాగుంటాయి. అయితే స్క్రీన్ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. సిద్ధార్థ్ పాత్రకి సుమంత్ న్యాయం చేశాడు. ఫస్టాప్లో నార్మల్ యూట్యూబర్గా కనిపించడంతో అతని పాత్ర అంత ఇంపాక్ట్ చూపదు. కానీ సెండాఫ్లో మాత్రం బాగా నటించాడు.అయితే ఇప్పటికే ఆయన ఈ తరహా పాత్రలు చేయడంతో కొత్తగా అనిపించదు. ఇక రాజేంద్ర వర్మగా సిద్ధు జొన్నలగడ్డ తెరపై కాసేపు కనిపించి మెప్పించాడు. ఐశ్వర్య రాజేష్ పాత్ర కాసేపు సర్ప్రైజ్ చేస్తుంది. కమల్ కామరాజు పాత్ర నిడివి కూడా తక్కువే. పూజారి పాత్రకి బ్రహ్మానందం న్యాయం చేశాడు. ఆయన పాత్ర ఇచ్చే ట్విస్టు ఆకట్టుకుంటుంది. రాజీవ్ కనకాల మంజు భార్గవి, మీనాక్షి గోస్వామితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అనూప్ రూబెన్స్ పాటలు, నేపథ్య సంగీతం ఓకే.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
15 ఏళ్లుగా మూసి ఉన్న భవనం.. ఆ రూమ్లో ఏం జరిగింది?
హారర్ సినిమాలంటేనే భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠ రేపే ట్విస్టులు గుర్తుకొస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో హారర్ జానర్లో సరికొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అలాంటి ఓ విభిన్నమైన హారర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘418’. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం మిస్టరీ, భయానక వాతావరణంతో ఆసక్తిని పెంచుతోంది.సెప్టెంబర్ 18న విడుదల..సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా.. వెంకీ జీజీ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ముందుగా జూలై 31న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదీ చదవండి: బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్లో భారీ నష్టం
శ్రీలత.. ‘ఇడుపు కాయితం’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్
వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. నిర్మాత బన్నీ వాస్, డైరెక్టర్ సుకుమార్ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. నాగదుర్గ హీరోయిన్. ఈ సినిమా నుంచి ‘శ్రీలత’ సాంగ్ను రిలీజ్ చేశారు.'శ్రీలత..' సాంగ్ లో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నాగదుర్గ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. సురేశ్ బొబ్బిలి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు అలరాజు సాహిత్యం అందించారు. శంకర్ బాబు కందుకూరి, మోహన్ భోగరాజు ఆలపించారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్లో భారీ నష్టం
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజైంది. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. అయితే ఆ జోరు ఒక్కరోజుకే పరిమితమైంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకోవడంతో ఈ సినిమా కలెక్షన్లు ఎంత రాబెట్టిందని ప్రస్తుతం అనే చర్చ జరుగుతోంది.తొలిరోజే రూ.100 కోట్లకు పైగా..ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ‘టాక్సిక్’ తొలి రోజే ఇండియాలో రూ.101 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.145 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఇండియాలో కేవలం రూ.37 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 10 నాటికి ‘టాక్సిక్’ ఇండియాలో రూ.247 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.339 కోట్లుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!భారీ నష్టాలు?‘టాక్సిక్’ సినిమా నిర్మాణానికి రూ.500 కోట్లకు పైగే ఖర్చయిందనే వార్తలు వచ్చాయి. కనీసం రూ.500 కోట్ల బడ్జెట్ను పరిగణనలోకి తీసుకున్నా.. ప్రస్తుత నెట్ వసూళ్లతో పోలిస్తే భారీగానే నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘టాక్సిక్’కు సంబంధించిన ప్రస్తుత ట్రేడ్ అంచనాలను పరిశీలిస్తే.. నష్టాల పరంగా ‘ఆదిపురుష్’ను కూడా అధిగమించినట్లు తెలుస్తోంది.కాగా ‘టాక్సిక్’లో యశ్తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విడుదలకు ముందే వివాదాలు, ఆసక్తికర ప్రచారం లభించాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, మహిళలను చూపించిన తీరు చర్చనీయాంశంగా మారాయి. సీబీఎఫ్సీ ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది.
క్రీడలు
రిజ్వాన్, ఇమామ్లపై విచారణ
లాహోర్: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు మొహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్లపై ఇటీవల వచ్చిన పలు ఆరోపణలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం విచారణ మొదలు పెట్టింది. పాక్కు చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్సీసీఐఏ) గురువారం ఈ ఇద్దరు క్రికెటర్లను పలు అంశాలపై ప్రశ్నించింది. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన తర్వాత వీరిని జట్టు నుంచి తొలగించిన పాక్ బోర్డు (పీసీబీ) స్వదేశానికి పంపించింది. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి కీలక సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేశారంటూ రిజ్వాన్, ఇమామ్లపై ఆరోపణలు వచ్చాయి. దాంతో వీరిద్దరి మొబైల్ ఫోన్లను జప్తు చేసి అధికారులకు అందజేశారు.ఇటీవలి కాలంలో వీరి ఆర్థిక లావాదేవీలు, అకౌంట్ల వివరాలన్నింటిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విచారణ అనంతరం తమ వాదనలు వినిపించేందుకు, రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు రిజ్వాన్, ఇమామ్ కొంత సమయం కోరినట్లు సమాచారం. పీసీబీ చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ ఆ దేశ అంతర్గత భద్రతా మంత్రి కూడా. నఖ్వీ ఆధ్వర్యంలోనే ఎన్సీసీఐఏ పని చేస్తుంది. దాంతో ఆటగాళ్లను విచారించాలని ఆయన నేరుగా ఆదేశించినట్లు సమాచారం.
బుమ్రా X వైభవ్
న్యూఢిల్లీ: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొంత విరామం తర్వాత మళ్లీ జట్టుతో చేరాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సమయంలో గాయంతో తప్పుకున్న బుమ్రా... ఇప్పుడు కోలుకొని అఫ్గానిస్తాన్తో సిరీస్కు సిద్ధమయ్యాడు. శుక్రవారం అతను ఫిరోజ్షా కోట్లా మైదానంలో ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. సాధనలో బుమ్రాకు ఎదురుగా నిలిచింది 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. వీరిద్దరి మధ్య నెట్స్లో ఆసక్తికర పోరు సాగింది. ఐపీఎల్లో ఇప్పటికే బుమ్రాను ఎదుర్కొన్న వైభవ్... ఇక్కడ మాత్రం తగిన రీతిలో జవాబివ్వడంలో విఫలమయ్యాడు. బుమ్రా వరుసగా వేసిన పదునైన బంతులకు వైభవ్ వద్ద సమాధానం లేకపోయింది. అతికష్టమ్మీద వాటిని ఎదుర్కొన్న అతను... ఒకటి, రెండు బంతులను మాత్రం నియంత్రణతో మంచి షాట్లుగా మలిచాడు. ఇతర పేసర్లు అర్ష్ దీప్ సింగ్, యశ్ ఠాకూర్ల బౌలింగ్లో కూడా వైభవ్ సమర్థంగా ఆడలేకపోయాడు.దాంతోపాటు పలుమార్లుసునాయాస ఏరియల్ క్యాచ్లు వదిలేసి ఫీల్డింగ్లో కూడా ఈ బిహార్ కుర్రాడు నిరాశపర్చాడు. మరోవైపు నెట్స్లో భారత టి20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బుమ్రా బౌలింగ్లో మెరుగ్గా ఆడలేకపోయాడు. ఇక్కడా బుమ్రా ఆధిపత్యమే సాగింది. అతను పూర్తి ఫిట్గా ఉండటంతో పాటు తనదైన శైలిలో బౌలింగ్ చేస్తున్న తీరు భారత టీమ్ మేనేజ్మెంట్కు సంతృప్తిని కలిగించిందనడంలో సందేహం లేదు.
సినియకోవా–టౌన్సెండ్ జోడీకి డబుల్స్ టైటిల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)–టేలర్ టౌన్సెండ్ (అమెరికా) జోడీ టైటిల్ గెల్చుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సినియకోవా–టేలర్ టౌన్సెండ్ ద్వయం 5–7, 6–0, 6–2తో రోబిన్ మోంట్గోమేరీ–యాష్లిన్ క్రుయెజెర్ (అమెరికా) జంటను ఓడించింది. సినియకోవా–టౌన్సెండ్ జోడీకి 10 లక్షల డాలర్లు (రూ. 9 కోట్ల 55 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. సినియకోవా కెరీర్లో ఇది 12వ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్కాగా... టౌన్సెండ్ కెరీర్లో ఇది నాలుగో గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్. తాజా విజయంతో టౌన్సెండ్ మహిళల డబుల్స్లో నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్నూ సాధించి ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంది. మరోవైపు సినియకోవా డబుల్స్ డబుల్ ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ (ఒక్కో గ్రాండ్స్లామ్ను రెండుసార్లు చొప్పున సాధించడం) ఘనతను సాధించింది. సినియకోవా భాగ స్వామిగా టౌన్సెండ్ 2024లో వింబుల్డన్, 2025లో ఆ్రస్టేలియన్ ఓపెన్, 2026లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్ను సాధించింది.
ఆసియా క్రీడల భారత అథ్లెటిక్స్ జట్టు నుంచి నిత్య తొలగింపు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ బృందంలో కీలక మార్పు చోటు చేసుకుంది. గురువారం ముగిసిన ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్లో ప్రదర్శనను బట్టి ముగ్గురు ఆటగాళ్లపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వేటు వేసింది. గతంలో ప్రకటించిన 77 మంది బృందంలో ముగ్గురిని తప్పించి 74 మందిని మాత్రమే ఆసియా క్రీడలకు పంపనున్నారు. తెలంగాణకు చెందిన స్ప్రింటర్ నిత్య గంధె, లాంగ్జంపర్ షానవాజ్ ఖాన్తో పాటు గత ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ అన్నూరాణిని కూడా తప్పించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారమే దీనిపై నిర్ణయం తీసుకున్న ఏఎఫ్ఐ కారణం వెల్లడిస్తూ వివరణ ఇచ్చింది. ‘ఫైనల్ ట్రయల్స్లో ఏఎఫ్ఐ నిర్దేశించిన అర్హతా ప్రమాణాన్ని అన్ను అందుకోలేకపోయింది. పేలవ ప్రదర్శనతో పాటు వైద్యపరమైన కారణాలతో నిత్య, షానవాజ్లను కూడా ఆసియా క్రీడలకు పంపించడం లేదు’ అని ఏఎఫ్ఐ అధ్యక్షుడు, సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆదిల్ సుమరివాలా వెల్లడించారు.
న్యూస్ పాడ్కాస్ట్
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరో 500 కోట్ల రూపాయల అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తెలంగాణ శాసన మండలి నుంచి తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్... సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట
ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల టెన్షన్... తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుంచి పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
తెగని పంచాయతీ.. వెనక్కి తగ్గని కొండా సురేఖ... కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
బిజినెస్
ఒకేరోజు 20 లక్షల ట్రైన్ టికెట్స్ బుకింగ్!
పండుగల సీజన్ కావడంతో రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో.. ఐఆర్సీటీ సెప్టెంబర్ 7న సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. ఐఆర్సీటీ చరిత్రలో ఒకే రోజులో 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 8న కూడా 19,50,699 టికెట్లు బుక్ అయ్యాయి.గత ఏడాది పండుగల సీజన్లో.. నమోదైన అత్యధిక రోజువారీ బుకింగ్స్ 18,40,203 టికెట్లు కాగా, ఈసారి రికార్డు స్థాయి బుకింగ్స్ దానికంటే దాదాపు 6 శాతం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రిజర్వ్డ్ రైల్వే టికెట్లలో సుమారు 89 శాతం ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయని ఐఆర్సీటీ వెల్లడించింది.పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీ కొత్త సర్వర్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ప్రయాణికులకు సులభమైన బుకింగ్ అనుభవాన్ని అందించేందుకు ఐఆర్సీటీ జూలై 15, 2026న కొత్త వెబ్సైట్, యూజర్ ఇంటర్ఫేస్ను ప్రారంభించింది. ఇందులో వివిధ తరగతుల్లో సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్పై చూసుకునే అవకాశం ఉంది.టికెట్ బుకింగ్లో మోసాలను అరికట్టేందుకు నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు. రిజర్వేషన్ ప్రారంభమైన ఉదయం 8 గంటల నుంచి 8:10 గంటల వరకు అధీకృత ఏజెంట్లు టికెట్లు బుక్ చేయలేరు. అలాగే రిజర్వేషన్ ప్రారంభమైన సమయంలో టికెట్ బుక్ చేసే వినియోగదారులకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3.04 కోట్ల యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేయగా, మరో 6.33 కోట్ల ఐడీలను రీ-వెరిఫికేషన్ కోసం ఫ్లాగ్ చేశారు.ఇంత భారీ స్థాయిలో టికెట్లు బుక్ అయినప్పటికీ.. కొత్త ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో ఎలాంటి పెద్ద సమస్య లేదా అవుటేజ్ ఏర్పడలేదని ఐఆర్సీటీ తెలిపింది. పండుగల సమయంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పెరుగుతున్న బుకింగ్ డిమాండ్ను తట్టుకునేందుకు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడం, బాట్స్ను నియంత్రించడం వంటి చర్యలు కీలకంగా మారాయి. మొత్తం మీద.. ఒకే రోజులో 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడం భారతీయ రైల్వే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.ఇదీ చదవండి: గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!
912.5GB డేటా.. అదిరిపోయే జియో ప్లాన్!
రిలయన్స్ జియో అందిస్తున్న పాపులర్ రీచార్జ్ ప్లాన్లలో రూ.3,599 ఒకటి. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. వాలిడిటీ ఎన్ని రోజులు?, డేటా ఎంత? వినియోగదారులకు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.జియో రూ.3599 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది పాటు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. ప్రతిరోజూ 2.5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఏడాది రోజులకు మొత్తం 912.5 జీబీ డేటా వస్తుంది. అదనంగా జియో యానివెర్సరీ అఫర్ కింద 120 జీబీ ఎక్ట్రా డేటా లభిస్తుంది. అంటే నెలకు 10 జీబీ చొప్పున 12 లల పాటు అదనపు డేటా లభిస్తుంది.రోజువారీ 2.5 జీబీ హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకు తగ్గుతుంది. అయితే 5G సేవలకు అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. అదేవిధంగా ప్రతిరోజూ 100 ఎస్ఎమ్ఎస్లు పంపుకునే అవకాశం ఉంటుంది.ఇతర ప్రత్యేకమైన ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే.. జియో టీవీ ప్రో ప్యాక్ ద్వారా 1000 అకంటే ఎక్కువ టీవీ ఛానల్స్ చూడటానికి అవకాశం ఉంటుంది. జియో క్లౌడ్ ద్వారా 50 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా లభిస్తాయి.ఇదీ చదవండి: గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!
అసలు బ్రిక్స్లో ఏం చర్చిస్తారు?
భారత రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ ఏడాది భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. అంతేకాక సంస్థ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలు దేశాధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొననున్నారు.ప్రధాన చర్చనీయాంశాలుగ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలపై నేతలు చర్చించనున్నారు. ప్రపంచ పాలనా వ్యవస్థలు ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా మార్పులు తేవాలన్నది ప్రధాన డిమాండ్గా ఉంది. ఇందులో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించే అంశం కీలకంగా మారనుంది.వాణిజ్యం, ఆర్థిక సహకారం: సభ్యదేశాలు వాణిజ్య మార్గాలను బలోపేతం చేసేందుకు 2026-2030 బ్రిక్స్ గ్లోబల్ వేల్యూ చైన్ యాక్షన్ ప్లాన్ను ఆమోదించాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యంత్రాంగం, సహకార పోర్టల్ ఏర్పాటుపై చర్చలు జరగనున్నాయి.సాంకేతికత, ఇన్నోవేషన్: స్టార్టప్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటుతో పాటు ఏఐ గవర్నెన్స్పై కూడా నేతలు దృష్టి సారించనున్నారు. భవిష్యత్ సాంకేతిక పోటీలో సభ్యదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగే వ్యూహాలపై చర్చిస్తారు.ఆహార, ఇంధన భద్రత: ఆహారం, ఇంధన భద్రత, ఆరోగ్యం, వ్యవసాయం రంగాల్లో సహకారంపై నేతలు లోతైన చర్చలు జరపనున్నారు. పేదరిక నిర్మూలన, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంయుక్త కార్యాచరణపై దృష్టి పెడుతారు.ద్వైపాక్షిక భేటీలు, ప్రపంచ అంశాలు: భారత్-చైనా సహా వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు. అలాగే వాణిజ్యం, అభివృద్ధి, సంస్థాగత సంస్కరణలపై సభ్యదేశాల మధ్య సన్నిహిత సహకారంపైనా చర్చించనున్నారు.ఇదీ చదవండి: కొత్త బిజినెస్లోకి ఫ్లిప్కార్ట్!
గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!
బంగారం ధరల్లో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ రోజు (సెప్టెంబర్ 11) ఉదయం రూ.2620 తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలు మారిపోయాయి. కొత్త ధరలు ఎలా ఉన్నాయి?, ఏ నగరంలో అధికంగా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,40,150 వద్ద ఉన్న 10 గ్రాముల పసిడి ధర.. సాయంత్రానికి రూ.141550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,52,890 వద్ద నుంచి రూ.1,54,420 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. బంగారం ధరలు గంటల వ్యవధిలో తారుమారు అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.చెన్నైలో కూడా బంగారం ధరలు, సాయంత్రానికే మారిపోయాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.152890 నుంచి రూ.154420 వద్దకు, 22 క్యారెట్ల రేటు రూ.140150 నుంచి రూ.141550 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా పసిడి ధరలు కొంత పెరిగినట్లు తెలుస్తోంది.ఢిల్లీలో రూ.140300 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి రూ.1400 పెరిగి రూ.141700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,53,040 నుంచి రూ.1530 పెరిగి రూ.1,54,570 వద్దకు చేరింది. అయితే వెండి ధరల్లో.. సాయంత్రానికి ఎలాంటి మార్పు జరగలేదు.ఇదీ చదవండి: టోల్ వసూళ్లకు కొత్త ప్లాన్.. గడ్కరీ కీలక ప్రకటన!
ఫ్యామిలీ
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? ఈ అలవాటు ప్రమాదమే!
ఉదయం నిద్ర లేవగానే తెలియకుండానే ఫోన్ వైపు చెయ్యి చాచడం ఈ రోజుల్లో అందరికీ ఒక అలవాటుగా మారిపోయింది. కేవలం అలారమ్ ఆపడం కోసమే ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పటికీ! ఆ తర్వాత తెలియకుండానే సోషల్ మీడియా స్క్రోలింగ్లో మునిగిపోతున్నాం. దీనివల్ల అసలు రోజేప్రారంభం కాకముందే, మనస్సు రకరకాల ఆలోచనలతో నిండిపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఫోన్కే మొదటిప్రాధాన్యత ఇవ్వడం వల్ల, మన రోజు ఒక నెగెటివ్ ఆలోచనలు, బలహీనమైన మానసిక స్థితితోప్రారంభమవుతోందట.మంచం దిగకముందే ఫోన్ చూడటం వల్ల మన మానసిక శక్తి తగ్గిపోతుందట. అంతేకాదు, ఆ రోజంతా మనం ఏ పని సరిగ్గా చేయలేమని పరిశోధకులు చెబుతున్నారు. మనం నిద్రలేవగానే ఒక్కసారిగా వచ్చే సందేశాలు, ఈ మెయిల్లు, సోషల్ మీడియా అప్డేట్లను చూడటం వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.ఫోన్ చూసే ముందు నీళ్లు తాగడం, బాడీ స్ట్రెచింగ్, ఆ రోజు పనులను ప్రణాళిక బద్ధంగా చేసుకోవడం వంటి వాటి కోసం ప్రతిరోజూ ఉదయం కేవలం 20 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. ఫోన్కి బదులు అలారం ఉపయోగిస్తే క్రమంగా మొబైల్ మీద ఆధారపడే అలవాటు తగ్గుతుందని చెబుతున్నారు.ఇవీ చదవండి: ‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’
‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’
‘‘నీకో విషయం చెప్పాలి.. కానీ ఎవరికీ చెప్పకూడదు!’’ ఇలాంటి మాట వినగానే చాలామందికి ఆసక్తి పెరిగిపోతుంది. స్నేహితుల మధ్యైనా, ఆఫీసులోనైనా, కుటుంబంలోనైనా.. మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడటం రోజువారీ మాటల్లో ఒక భాగమైపోయింది. అయితే దానిని వెంటనే ‘గాసిప్’ అంటూ చెడ్డ అలవాటుగా ముద్ర వేస్తాం. కానీ శాస్త్రవేత్తలు మాత్రం గాసిప్ను అంత సులభంగా చెడ్డదిగా చూడటం లేదు. గాసిప్ అనేది మనుషుల సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన ΄ాత్ర పోషించే సాధనం కూడా కావచ్చని అంటున్నారు.గాసిప్ అంటే సాధారణంగా మనం మన దగ్గర లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం అని అనుకుంటాం.. కానీ ఇతరుల వ్యక్తిగత విషయాలు, నిర్ధారణ లేని వార్తలు, ఇతరుల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా వ్యాప్తి చేసే సంభాషణలను కూడా గాసిప్ అంటారు.ఎందుకంత కుతూహలం!చాడీలు, రూమర్లు అనేవి కొత్తగా వచ్చిన అలవాటేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఇతరుల గురించి తెలుసుకోవడం, ఎవరు నమ్మదగినవారు? ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎవరి మాట నమ్మాలి? వంటి విషయాలు తెలుసుకోవడం సహజంగానే సాగుతుంటుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకరి గురించి సమాచారాన్ని పంచుకుని, ఇతరులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం ఒక రకమైన ఉపయోగం కావచ్చు. అదే సమయంలో, ఎలాంటి ప్రయోజనం లేకుండా ఒకరిని బ్లేమ్ చేసేందుకు అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రం హానికరమైన గాసిప్గా మారుతుంది.ఆఫీసుల్లోనూ గాసిప్స్‘ఆఫీసులో గాసిప్ చేయకూడదు’ అని ఎన్ని నియమాలు పెట్టినా.. ఉద్యోగుల మధ్య అనధికారిక చర్చలు ఉండటం సహజం. ఎవరు బాగా పనిచేస్తున్నారు? ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? వంటి సమాచారాన్ని ఉద్యోగులు పరస్పరం పంచుకుంటుంటారు. ఇలాంటి సమాచారం కొన్నిసార్లు సహకారాన్ని పెంచవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లోనూ పడేయవచ్చు. అనుమానాలు సృష్టించడం, నమ్మకాన్ని కోల్పోయేలా చేయడం, సంబంధాలను దెబ్బతీయడం మాత్రమే ఉద్దేశమైతే.. అది హానికరమైనదే.గాసిప్ అనేది జీవితంలో ఒక భాగమే అయినప్పటికీ.. పరిశోధనలు సూచించేది ఏమిటంటే.. గాసిప్ ఉందా లేదా అన్నది కంటే, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. మంచి గాసిప్ సమాచారం ఇవ్వొచ్చు.. స్నేహాన్ని బలపరచొచ్చు.. అవసరమైనప్పుడు ఇతరులను జాగ్రత్తపరచొచ్చు. కానీ అవే గాసిప్స్ ఒక్కోసారి సంబంధాలను దెబ్బతీయొచ్చు.. నమ్మకాన్ని కోల్పోయేలా చేయొచ్చు.. నష్టం కలిగించవచ్చు.– నిర్వహణ: రమా జంబులఇవి కూడా చదవండి: ప్రాథమిక చికిత్సలో ప్రథములమవుదాం
బస్సు ప్రయాణాల యాత్రా కుటుంబం
వాట్సాప్లో ఒకరు మెసేజ్ పెడతారు. ‘ఈ శనివారం చెక్కేద్దామా?’ ఎక్కడికి వెళ్లాలో చెప్తారు. ఖర్చు అంతా కలిపితే ఆరేడు వందలు. 300 మంది సభ్యులున్న వాట్సాప్ గ్రూపు ‘యాత్రా కుటుంబం’లో కనీసం 120 మంది ‘రెడీ’ అంటారు. రెండు బస్సులు మాట్లాడతారు. ఇంకేముంది... అక్క.. అమ్మ... పిన్నీ అంటూ అదొక కుటుంబంగా మారిపోయి ప్రయాణం కడతారు. కేరళ ఆర్టీసీ బడ్జెట్ యాత్రలు కేరళలో అపరిచితులను కుటుంబాలుగా మారుస్తున్నాయి. ఈ సరికొత్త ‘ట్రావెల్ ఫ్యామిలీ’ ట్రెండ్ గురించి...‘మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాల’ అనంటాడు రావు గోపాలరావు ఏదో సినిమాలో. చూడబోతే ఈ డైలాగుకు న్యాయం చేసే వాళ్లు కేరళలో మెండుగా ఉన్నట్టున్నారు. ఇంట్లో ముక్కిపోవడం కంటే తక్కువ ఖర్చులో పర్యటనలు చేస్తూ ప్రకృతిని చూసి పులకిస్తూ.... ఎవరికీ ఎవరూ పట్టని ఈ రోజుల్లో ఈ వంకన కొత్త బంధువులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. తిరువనంతపురంలో రెండేళ్ల క్రితం మొదలైన ఒక యాత్ర 300 మందిని ‘యాత్రా కుటుంబం’గా మార్చేసింది.సన్నివేశం: ఒక ఆదివారం ఉదయం. కేరళలోని వాయనాడ్ వెళ్లే ప్రభుత్వ బస్సు సీట్ నెంబర్ 12లో కూర్చుని ఉన్న మేరీకుట్టికి బెరుగ్గా ఉంది. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడటంతో, ఇంట్లోని నాలుగు గోడల మధ్యే ఆమె ప్రపంచం ఆగిపోయింది. కాని ఆ రోజు మొదటిసారి ఒంటరిగా బస్సెక్కింది. చుట్టూ ఉన్నవాళ్లంతా ముక్కుమొహం తెలియనివారు. ఏం మాట్లాడాలో తెలియదు. కానీ, ప్రయాణం మొదలయ్యాక పక్క సీటామె ‘కొంచెం ఉ΄్మా తింటావా అక్కా’ అని తన బాక్సు తెరిచింది. ఆ ఒక్క మాటతో ముఖం తెలియని అపరిచితుల మధ్య మాటల వంతెన పడింది.... అన్నీ ఇలాంటి బంధాలే ఈ ‘యాత్రా కుటుంబం’లో.ఇలా మొదలైంది: టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చే కేరళ ప్రభుత్వం స్థానికులు కూడా పర్యటనలు చేసేలా ఆర్టీసీ కింద ‘బడ్జెట్ టూరిజం సెల్’ను ఏర్పాటు చేసింది. తక్కువ ఖర్చులో బస్సు మాట్లాడుకుని తిరిగే ఏర్పాటు అది. బడ్జెట్ టూరిజం సెల్ నుంచి ఒక కోఆర్డినేటర్ తోడు వచ్చి యాత్రను సులువు చేస్తాడు. రెండేళ్ల క్రితం తిరువనంతపురం బస్టాండ్ నుంచి రెండు బస్సులు అలా అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలోని బోనాకాడ్ కొండ ప్రాంతానికి బయలుదేరాయి. దానిలో ఉన్నదంతా 60లు దాటిన స్త్రీలు. రిటైర్డ్ ఉద్యోగులు. తక్కువ ఖర్చుతో చేసిన ఆ యాత్ర సాయంత్రం వరకూ వారికి ఎంతో ఆనందం పంచింది. కోఆర్డినేటర్గా వచ్చిన బస్సు కండక్టర్ సజిత్ తిరుగు ప్రయాణంలో ‘మీరంతా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఇలా ప్రయాణాలు చేయొచ్చు’ అని సలహా ఇచ్చాడు. అలా పుట్టిందే ‘యాత్ర కుటుంబం’. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ కుటుంబంలో 300 మంది సభ్యులయ్యారు. ప్రతి వీకెండ్ ప్రయాణాలు చేస్తున్నారు. మొన్న తిరువనంతపురంలోని మేయంకడవు నది ఒడ్డున వీరంతా ఓనం పండుగ జరుపుకున్నారు. 60 మంది మహిళలు, వృద్ధులు కలిసి పడవ ప్రయాణం చేస్తూ, పాటలు పాడుకుంటూ, క్యాంప్ఫైర్ వేసుకుని నవ్వులతో రాత్రి గడిపారు. మొన్నటివరకు ఒంటరితనంతో బాధపడిన మేరీకుట్టి ఇప్పుడు ఆ గ్రూప్లో అందరికంటే హుషారుగా డాన్స్ చేస్తోంది.పురలిమల కొండల్లో వెన్నెల రాత్రులు! ఈ గ్రూప్ చేసే ప్రయాణాలు రొటీన్ టూరిస్ట్ ప్లేస్లలాగా అస్సలు ఉండవు. ‘యాత్ర కుటుంబం’ సభ్యుల్లో లోకల్ గైడ్స్ ఉండటంతో ఎవరికీ తెలియని అత్యంత సుందరమైన ఆఫ్–బీట్ లొకేషన్లను ఎంచుకుంటారు. దట్టమైన అడవుల మధ్య ఉండే ‘బొనాకాడు’ బేస్ క్యాంప్ కొండలు, తెల్లటి పాలధారల్లా జారే ‘కుంభవురుట్టి’ జలపాతాలు, అచ్చన్ కోవిల్ నదీ తీరాలు వీరి సొంతం. మొన్నటి ఓనం వేడుకల్లో నదీ తీరాన క్యాంప్ఫైర్ వేసుకుని వీరంతా కూర్చున్నప్పుడు.. పురలిమల కొండల వెనుక నుండి నిండు చందమామ పైకి వస్తుంటే అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. ఆ క్షణంలో వారి కళ్లలో కనిపించిన ఆనందం వందల కోట్ల ఆస్తి ఉన్నా దొరకనిది! అమాయక గిరిజన పల్లెల్లో, చారిత్రాత్మక పునలూరు తూగు వంతెనల మీద వీరు వేసే అడుగులు చూస్తుంటే... ‘మనం కూడా ఇలాంటి గ్రూప్ కడితే బాగుంటుంది కదా’ అనే ఆశ పుడుతుంది.వయసుతో పనేముంది? ఈ గ్రూప్లో ఉన్నవారంతా రిటైర్డ్ ఉద్యోగులు, ఒంటరిగా ఉండే గృహిణులే. మామూలుగా అయితే అయినవాళ్లు వీళ్లని ‘ఇంట్లో విశ్రాంతి తీసుకోండి’ అని కదలకుండా చూస్తారు. కానీ, వీరు మాత్రం ‘మా సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది’ అంటూ రోడ్డు ఎక్కారు. అన్నట్టు ఈ సెప్టెంబర్ 12న పెప్పరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని ఒక గిరిజన గ్రామానికి, అలాగే సెప్టెంబర్ 25న చొక్రముడి కొండలపై వికసించే ‘నీలకురింజి’ పూల అందాలను చూడటానికీ వీరంతా బస్సెక్కి ప్రయాణం చేయబోతున్నారు.వీరు ఆగేలా లేరు. ఏమంటే ప్రయాణమే ఒక జీవితం, అందులో దొరికే స్నేహాలే అమృతం!
ప్రాథమిక చికిత్సలో ప్రథములమవుదాం
అక్షర జ్ఞానం లేని వారి నుంచి పెద్ద చదువులు చదువుకున్న వారి వరకు... మనలో చాలామందికి అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స గురించి అవగాహన అంతంత మాత్రమే! పూర్తిగా వైద్యులపైనే ఆధారపడే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక వైద్యజ్ఞానం ఎప్పటికీ అవసరమే’ అని నాటినుంచి నేటి వరకు ఎన్నో తరాలకు గుర్తు చేస్తోంది ‘వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్’ పుస్తకం.‘వైద్యుడు లేని చోట’ (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ) పేరుతో తెలుగు పాఠకులను కూడా పలకరించింది. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా ఆ పుస్తకం గురించి మరోసారి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ప్రథమ చికిత్స గురించి శిక్షణ తరగతులు నిర్వహిస్తూ, కిట్స్ ఇస్తున్న ‘ఎమర్ రెడీ’ స్వచ్ఛంద సంస్థ గురించి ఒకసారి...‘వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్’ అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మాన్యువల్. మెక్సికోలో తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా డేవిడ్ వెర్నర్ 1970లో స్పానిష్ భాషలో రాసిన పుస్తకం... డోండే నో హే డాక్టర్. ఈ పుస్తకం వందకు పైగా భాషల్లోనికి అనువాదం అయింది. జీవశాస్త్రవేత్త అయిన వెర్నర్, మెక్సికోలోని గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల ఆరోగ్యం గురించి చాలా కాలం పనిచేశారు. ఎన్నో దేశాలలో ‘మార్పు కోసం ఆరోగ్య విద్య’ అనే అంశంపై వర్క్షాప్లు నిర్వహించారు. కాలిఫోర్నియాలో ‘హెల్త్ రైట్స్’ సంస్థ కో–ఫౌండర్గా, బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్లో అసోసియెట్ ప్రొఫెసర్గా పనిచేశారు వెర్నర్.ఎన్నో చిట్కాలు!‘వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్’ పుస్తకం అతిసారం నుంచి మలేరియా వరకు ఎన్నో విషయాలను ప్రస్తావించింది. పరిశుభ్రత ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన ఆహారం, ఇంటి చిట్కాలు, ఇంటి చిట్కాలు పనిచేస్తాయో లేదో తెలుసుకునే మార్గాలు, టీకాల ప్రాధాన్యత, అనారోగ్యానికి కారణమయ్యే నమ్మకాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నమ్మకాలు, మేలు చేసే ఔషధ మొక్కలు, తరచుగా గందరగోళానికి గురిచేసే అనారోగ్య సమస్యలు, అంటువ్యాధి కాని వ్యాధులు, థర్మామీటర్ను ఎలా ఉపయోగించాలి? అనారోగ్యంతో ఉన్నవారిని ఎలా చూసుకోవాలి, ప్రమాదకరమైన అనారోగ్య లక్షణాలు, వైద్యసహాయం ఎప్పుడు, ఎలా పొందాలి, మందులు లేకుండా చికిత్స చేసుకోవడం, నీటితో చికిత్స, మందుల వాడకానికి మార్గదర్శకాలు... ఇలా ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.స్పష్టంగా, సంక్షిప్తంగా, సులభంగా...స్పష్టమైన, సంక్షిప్త సమాచారం ఈ పుస్తకం బలం. కామిక్ పుస్తకంలా చదవడానికి సులభంగా ఉంటుంది. ప్రాథమిక వైద్యానికి సంబంధించి మీ నైపుణ్యం తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పటికీ మీ పరిమితులకు లోబడి పనిచేస్తే మంచి ఫలితాలు అందుతాయి. ఏం చేయలి, ఏం చేయకూడదు, అనేదానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకండి. ఏమీ చేయకపోతే ప్రమాదం ఉందని అనిపించినప్పుడు మాత్రం మీకు గట్టిగా నమ్మకం ఉన్న పద్ధతిని అనుసరించడానికి వెనకాడకండి’ అంటుంది ఈ పుస్తకం.ఎమర్జెన్సీలో ఎమర్ రెడీమూడు సంవత్సరాల క్రితం... ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళుతున్న ఒక వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది చూసిన ప్రచేతస్ యెరి అనే యువకుడు సహాయం కోసం కేకలు వేశాడు. 30 నిమిషాలకుగానీ అంబులెన్స్ రాలేదు. ఈ సంఘటన అతడిని ఒక వాస్తవాన్ని అర్థం చేసుకునేలా చేసింది. చాలామందికి అత్యవసర పరిస్థితులలో ఏంచేయాలో, ఏం చే యకూడదో తెలియదు. చాటా టెన్షన్ పడుతుంటారు. స్పృహ కోల్పోయిన వారికి చికిత్స చేయడం, సీపీఆర్, ఊపిరాడనప్పుడు సహాయం చేయడంలాంటి ప్రాథమిక చికిత్స పరిజ్ఞానం చాలామందిలో ఉండడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక చికిత్స పరిజ్ఞానాన్ని అందించే ‘ఎమర్ రెడీ’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టాడు ప్రచేతస్. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది.శిక్షణ తరగతులలో...‘పేద పిల్లలు అత్యవసర పరిస్థితులలో భయాందోళనలకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండేలా చేయడమే ఎమర్రెడీ లక్ష్యం’ అంటున్నాడు ప్రచేతస్. ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఎమర్రెడీ. కథలు చెప్పడం నుంచి వీడియోలు ప్రదర్శించడం వరకు ఆసక్తికరమైన పద్దతులలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఎమర్రెడీ ఇంటరాక్టివ్ లెర్నింగ్ విధానానికి మంచి స్పందన వచ్చింది. గాయాలు, ఎముకలు విరగడం, స్పృహ కోల్పోవడం, పాము, తేలు కాటు... మొదలైన సందర్భాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి శిక్షణ తరగతులలో వివరిస్తారు. భాషా అవరోధాలను అధిగమించడానికి ప్రాంతీయ భాషలలో శిక్షణ ఇస్తున్నారు.పాఠ్యాంశాలలో ప్రథమ చికిత్సబ్యాక్΄్యాక్లలో ఇమిడిపోయేంత చిన్నగా ఉండే, పదునైన వస్తువులు లేని, సురక్షితమైన కాంపాక్ట్ ప్రథమ చికిత్స కిట్లను పిల్లలకు ఇస్తారు. వీటిని పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ కిట్లు ఇప్పటికే ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడాయని ఉపాధ్యాయులు తెలియజేశారు. చిన్న అడుగులతో మొదలైన ‘ఎమర్రెడీ’ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. ఐక్యరాజ్య సమితి ‘యూత్ యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రచేతస్ పాఠశాలల పాఠ్యాంశాలలో ప్రథమచికిత్సను తప్పనిసరి పాఠంగా చేర్చాలనే సూచించాడు.భవిష్యత్ ప్రణాళికస్పృహ కోల్పోవడం, ఊపిరాడక పోవడం...ఇలాంటి పరిస్థితిలో సరైన సమయంలో ప్రాథమిక చికిత్స అందకపోవడం వల్ల ప్రాణహాని జరుగుతుంది. ‘అత్యవసర పరిస్థితులలో పిల్లలే ఆపద్భాందవులు. వైద్యుల సహాయం అందేలోపు బాధితులకు ప్రాణహాని తలెత్తకుండా చూడగలరు’ అంటుంది ఎమర్రెడీ.‘ఎమర్ రెడీ’కి స్పష్టమైన భవిష్యత్ ప్రణాళిక ఉంది. దీని ప్రకారం... దేశవ్యాప్తంగా పాఠశాలలో ‘ఎమర్రెడీ’ కార్యక్రమాలను విస్తరించడం ఆన్లైన్లో సెల్ఫ్–గైడెడ్ వీడియో ట్రైనింగ్ మాడ్యూల్స్ ప్రారంభించడం సెల్ఫ్–సస్టెయినింగ్ వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడం వంటివి ఇందులోని అంశాలు.
అంతర్జాతీయం
ట్రంప్ వారసుడెవరు?
డల్లాస్: డొనాల్డ్ ట్రంప్ తరువాత అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసేదెవరన్న అంశంపై చర్చ మొదలైంది. మధ్యంతర ఎన్నికల సందర్భంగా రిపబ్లికన్ పార్టీ డల్లాస్లో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు అనుకూలంగా కొన్ని నినాదాలు వినిపించడంతో ఈ చర్చ ఊపందుకుంది. వాన్స్ ప్రసంగిస్తూండగా ‘‘జేడీ..జేడీ..జేడీ’’అని ‘‘48..48..48’’అన్న నినాదాలు వినిపించాయి. అమెరికా 47వ అధ్యక్షుడు ట్రంప్ అన్నది తెలిసిందే. అయితే వాన్స్ ఈ నినాదాలకు చిరునవ్వుతో స్పందించి ‘‘నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’అని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ వారసుడిగా సహజంగానే ఉపాధ్యక్షుడైన వాన్స్కు దక్కుతుందన్న వాదన ఒకటి వినిపిస్తున్నా... వాన్స్కు పోటీగా మరికొన్ని పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. అయితే వాన్స్ ఈ సదస్సులో భవిష్యత్ ప్రణాళికలపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. మరోవైపు.. వాన్స్ ఇప్పటికే కీలక రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను సమీకరిస్తున్నారని విస్కాన్సిన్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు బ్రియాన్ షిమ్మింగ్ చెబుతూండటం గమనార్హం. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ వంటి వారు ఇందులో ఉన్నారు. 2028లో వాన్స్–రూబియో జోడీ పోటీ చేస్తే బాగుంటుందని టెక్సాస్లోని ఫ్రిస్కోకు చెందిన బిల్ ష్నైడర్ భావిస్తున్నారు. వాన్స్ అధ్యక్ష అభ్యర్థిగా, రూబియో ఉపాధ్యక్ష అభ్యరి్థగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. వాన్స్ ట్రంప్ విధానాలను కొనసాగిస్తారని, ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉండటం వల్ల అధ్యక్ష పదవికి ఆయన సరైన ఎంపిక అని ష్నైడర్ అన్నారు. అయితే... ‘‘2028 అధ్యక్ష అభ్యర్థి గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం తొందరపాటు అవుతుంది. కానీ ఒకరి పేరు తప్పనిసరిగా చెప్పాలంటే నేను రాన్ డిసాంటిస్ను ఎంచుకుంటాను. ఫ్లోరిడాలో ఆయన అమలు చేసిన విధానాలు అమెరికాకు మార్గదర్శకంగా ఉంటాయి’’అని డల్లాస్కు చెందిన ఐటీ మేనేజర్ రోషెల్ బ్రూక్స్ వ్యాఖ్యానించారు. ఇంకోపక్క హ్యూస్టన్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగిని పెగ్గీ స్టాంటన్ మాత్రం రూబియోకు మద్దతు తెలిపారు. ‘‘విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ప్రతి అంశంపై స్పష్టంగా మాట్లాడతారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్నాయి. ఏదో ఒక రోజు అధ్యక్షుడు అవుతారని ఎప్పటి నుంచో నమ్ముతున్నాను’’అని అన్నారు. ట్రంప్ నిర్ణయిస్తారా? 2028 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేది ఎవరన్న విషయంపై మధ్యంత ఎన్నికల సదస్సులో పాల్గొన్న వారిలో అంత స్పష్టత లేనట్టు తెలుస్తోంది. కొందరైతే ట్రంప్ ఎవరికి మద్దతు తెలుపుతారన్న దానిపై తన నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. వాన్స్, రూబియోలు ఇద్దరూ సమర్థులైనప్పటికీ ఎవరివైపు మొగ్గు చూపాలన్నది ఇప్పుడే చెప్పలేమని కొందరు చెబుతున్నారు. 2028 ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉండటంతో.. అభ్యర్థులెవరూ అధికారికంగా తమ అభ్యరి్థత్వాన్ని ప్రకటించలేదు. దీంతో ట్రంప్ మద్దతు ఎవరికి లభిస్తుందోనని రిపబ్లికన్ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.కొత్త ముఖాల మాటేమిటి? రిపబ్లికన్ పార్టీ శ్రేణుల్లో కొందరు ఊహించని నేతల పేర్లను కూడా ప్రతిపాదిస్తున్నారు. ట్రంప్ మద్దతున్న కెంటకీ ప్రతినిధి థామస్ మాసీని పార్టీ నాయకుడిగా చూడాలని ‘వెటరన్స్ ఫర్ అమెరికా ఫస్ట్’సంస్థకు చెందిన కింబర్లీ మోయర్స్ అన్నారు. గ్రాండ్ ప్రెయిరీకి చెందిన దినా, కెవిన్ మైయర్స్ దంపతులు టెక్సాస్ రిపబ్లికన్ ప్రతినిధి బ్రాండన్ గిల్ పేరును ప్రస్తావించగా డెలావేర్కు చెందిన ఆంథనీ జాన్స్టన్ వాన్స్ మేలు అంటున్నారు. ట్రంప్ అధికార అవధి దగ్గరవుతున్న నేపథ్యంలో.. రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడే నాయకత్వ పోటీ మొదలైనట్లు కనిపిస్తోంది. అయితే చివరకు ఎవరు బరిలోకి దిగుతారన్నది పార్టీ అంతర్గత సమీకరణాలు, మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉండనుంది.
సౌదీలో ఆయిల్ పైప్లైన్ టార్గెట్.. పెరుగుతున్న టెన్షన్
అంతర్జాతీయం: సౌదీ అరేబియాలోని కీలక చమురు పైప్లైన్ వ్యవస్థపై గురువారం రోజున దాడి జరిగింది. పైప్లైన్కు సమీపంలోని పంపింగ్ స్టేషన్లను ప్రాజెక్టైల్స్తో లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వర్గాల సమాచారం. దీంతో దాడి దాడి విషయంలో ముందుజాగ్రత్త చర్యగా పైప్లైన్ కార్యకలాపాలను సౌదీ అరేబియా నిలిపివేసింది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పైప్లైన్ భద్రతను పరిశీలించడంతోపాటు నష్టాన్ని అంచనా వేసే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి.అలాగే, దాడి ప్రభావం శాటిలైట్ చిత్రాల్లోనూ కనిపించింది. ఓ పంపింగ్ స్టేషన్ వద్ద భారీగా మంటలు చెలరేగిన ఆనవాళ్లు కనిపించగా.. మరో స్టేషన్ వద్ద గురువారం దట్టమైన నల్ల పొగలు వెలువడ్డాయి. అయితే పైప్లైన్ ప్రధాన భాగానికి ఎంతమేర నష్టం జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. పంపింగ్ స్టేషన్లకు మాత్రమే నష్టం జరిగితే మరమ్మతులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. దాడికి పాల్పడింది ఎవరన్నదానిపై స్పష్టత రాలేదుఅయితే ఇరాక్ నుంచి వచ్చిన డ్రోన్లతో దాడి జరిగి ఉండొచ్చని అమెరికా వర్గాల అంచనా. గతంలో ఇరాన్కు అనుకూలంగా ఉండే ఇరాక్ మిలీషియా గ్రూపులు సౌదీ అరేబియాపై డ్రోన్లతో దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుత దాడి కూడా అలాంటదే అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అమెరికా అధికారులు సేకరిస్తున్నారు.అమెరికా–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సౌదీ చమురు మౌలిక వసతులపై జరిగిన ఈ దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ హోర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇంచుమించుగా మూసివేయడంతో.. పెర్షియన్ గల్ఫ్ నుంచి నౌకల ద్వారా ఎగుమతి కావాల్సిన సౌదీ చమురులో రోజుకు సుమారు 50 లక్షల బ్యారెళ్లను ఈస్ట్–వెస్ట్ పైప్లైన్తో ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టుకు తరలిస్తున్నారు. దీంతో సౌదీ చమురు ఎగుమతులకు ఈ పైప్లైన్ కీలక మార్గంగా మారింది. మరోవైపు హౌతీ యోధులు సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిస్తుండటంతో ఎర్ర సముద్రం మార్గంపైనా ఆందోళనలు కొనసాగుతున్నాయి.పైప్లైన్ కార్యకలాపాలు ఎప్పటికి తిరిగి ఎప్పుడు మొదలవుతుందనేది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఇదే సమయంలో సౌదీ అరేబియా ముడి చమురు ఉత్పత్తి గత నెలలో 1990 తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు ఒపెక్కు సమాచారం అందింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఇప్పటికే బ్యారెల్కు 100 డాలర్లను దాటాయి. ఈ పరిస్థితుల్లో సౌదీ చమురు రవాణా వ్యవస్థపై దాడి జరగడం ప్రపంచ చమురు సరఫరాపై మరింత ఆందోళనకు దారితీస్తోంది.ఇవి కూడా చదవండి: ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్
ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్
లెబనాన్: గోటి చుట్టు రోకటి పోటులా ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లాకు కోలుకోలేని బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ లో తమ అధినేత హాసన్ నస్రల్లాను పోగొట్టుకుని తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ సంస్థకు.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరో కోలుకోలేని దెబ్బకొట్టింది. దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆర్మీ సృష్టించిన భీకర ‘కృత్రిమ భూకంపం’ ధాటికి హెజ్బొల్లాకు చెందిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక భూగర్భ స్థావరాలు, కమాండ్ సెంటర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.అంతర్జాతీయ కథనాల ప్రకారం.. దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో ఈ భూప్రకంపనలు నమోదయ్యాయి. అయితే, ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన భూకంపం కాదని, ఇజ్రాయెల్ సైన్యం జరిపిన అత్యంత భారీ భూగర్భ పేలుళ్ల వల్లే ఈ ప్రకంపనలు సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేతో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థలు ధృవీకరించాయి.సరిహద్దుల్లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా నిర్మించుకున్న భారీ భూగర్భ సొరంగాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ఈ వినాశకర దాడి చేపట్టింది. అలీ అల్-తాహర్ పర్వత శ్రేణి సమీపంలో ఏకంగా 1,100 టన్నుల (1.1 మిలియన్ కిలోల) అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి హెజ్బొల్లా బంకర్లను ఒకేసారి పేల్చివేశారు.ఈ భారీ పేలుడు ధాటికి పుట్టిన షాక్వేవ్స్ భూమి లోపల 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రయాణించడంతో, ఆ తీవ్రతకు సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇరాన్ ఆర్థిక,సాంకేతిక సాయంతో గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) హెజ్బొల్లా నిర్మించుకున్న దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక అండర్గ్రౌండ్ నెట్వర్క్ ఈ దాడిలో నాశనమైంది.ఇది హెజ్బొల్లాకు చెందిన అత్యంత కీలకమైన ‘బద్ర్’ప్రాంతీయ విభాగానికి ప్రధాన కమాండ్ సెంటర్గా వ్యవహరిస్తోంది. ఇక్కడే భారీగా దాచి ఉంచిన క్షిపణులు, డ్రోన్లు, యాంటీ-ట్యాంక్ ఆయుధాలు, వందలాది ల్యాండ్ మైన్స్ ఈ పేలుడుతో పాటు గాల్లో కలిసిపోయాయి. భూగర్భంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పేలుడు సంభవించడంతో ఆ ప్రకంపనలు పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న లెబనాన్ నగరాల వరకు తాకాయి. ముఖ్యంగా దక్షిణ లెబనాన్లోని నబాటియా ప్రాంత పరిధిలో ఉన్న భవనాలు తీవ్రంగా ఊగిపోవడంతో, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూగర్భంలో జరిగిన ఈ భారీ విస్ఫోటనం వల్ల స్థానికంగా భూమిపై పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడ్డాయని, పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లిందని రక్షణ నిపుణులు,శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.👉ఇదీ చదవండి : ఇరాన్ పికాక్స్.. ట్రంప్కు ఎందుకంత పట్టుదల?
సౌదీ యువరాజుకు షాకిచ్చిన ట్రంప్
హూతీలపై అమెరికా దాడులు చేయాలంటూ రెండుసార్లు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన విజ్ఞప్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు ఆక్సియోస్ సంచలన నివేదిక వెల్లడించింది. ఎర్ర సముద్రంలో కీలకమైన బాబ్ అల్-మందెబ్ జలసంధికి హూతీలు చేరువవుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ప్రస్తుతం అమెరికా నేరుగా ఈ పోరాటంలో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని ట్రంప్ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు నివేదిక తెలిపింది.బాబ్ అల్ మందెప్ జలసంధి దిశగా హూతీలు ప్రవేశిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ బృందంలోని ఓ సీనియర్ అధికారి మట్లాడుతూ.. ఎర్ర సముద్రాన్ని తెరిచి ఉంచడం అమెరికా ప్రధాన ప్రాధాన్యత. అయితే, విస్తృత స్థాయి పోరాటాన్ని ప్రాంతీయ భాగస్వాములే నిర్వహించాలన్నది అమెరికా విధానం. ఎర్ర సముద్రంలో నౌకా రాకపోకల స్వేచ్ఛ, మా ప్రధాన జాతీయ భద్రతా ప్రయోజనాల పరిరక్షణపై అమెరికా దృష్టి సారించింది. అదే సమయంలో ప్రాంతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడంలో ప్రాంతీయ భాగస్వాములు ముందుండేలా మేము వారికి మద్దతు ఇస్తున్నామని ఆయన తెలిపారు.మొఖా నుంచి బాబ్ అల్-మండెబ్ జలసంధి సుమారు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) దూరంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్తో కలిపే ఈ జలసంధి ద్వారా సాధారణంగా ప్రపంచ వాణిజ్య వస్తువుల్లో సుమారు 12 శాతం రవాణా అవుతాయి. సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వ దళాలను హూతీ బలగాలు దక్షిణం వైపు ధుబాబ్ ప్రాంతానికి వెనక్కి నెట్టాయని ఇద్దరు యెమెన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జాతీయం
అడ్డంకులు అధిగమించి ముందడుగు
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యం అంతరాయాలు లేకుండా కొనసాగాలంటే నౌకాయాన స్వేచ్ఛ, సురక్షిత సముద్ర మార్గాలు, నావికుల భద్రత అత్యవసరమని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. పెరుగుతున్న ఆర్థిక బలాన్ని భారీ పెట్టుబడులుగా, నూతన వ్యాపార సంబంధాలుగా మార్చుకోవాలని బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. 10 ప్రధాన వాణిజ్య అవరోధాలను గుర్తించి తొలగించాలని చెప్పారు. ప్రతి సంవత్సరం 100 బ్రిక్స్ స్టార్టప్లను ఇతర సభ్య దేశాల మార్కెట్లలోకి విస్తరించాలని, అలాగే ఏటా 1,000 కొత్త వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై మన పురోగతిని ప్రతి ఏటా సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన అడ్డంకులు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి అడ్డంకులను అధిగమిస్తూ మన ఆర్థిక శక్తిని నూతన వ్యాపార అవకాశాలుగా మార్చుకోవాలని స్పష్టంచేశారు. నౌకాయాన స్వేచ్ఛకు, నావికుల భద్రతకు భారత్ మద్దతిస్తోందని తెలిపారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ జీడీపీలో 40 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు వృద్ధి చెందగా, బ్రిక్స్ దేశాల ఉమ్మడి జీడీపీ మాత్రం నాలుగున్నర రెట్లు పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ప్రపంచ వ్యాపారాలకు భారతదేశం చేసే ప్రతిపాదనలో మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక సాంకేతికతలను ప్రధానాంశంగా మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాల వేగవంతమైన విస్తరణతోపాటు నౌకా నిర్మాణం, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ రంగాల్లో నూతన సామర్థ్యాలను ప్రస్తావించారు. ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ వరల్డ్’అన్నారు. ప్రపంచ మార్కెట్లకు భారత్ ఒక తయారీ కేంద్రంగా, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత లోతైన సహకారం కోసం భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. బ్రిక్స్ దేశాలు తమ సొంత మార్కెట్లకు అనువైన డిజిటల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారతదేశ అనుభవాన్ని వాడుకోవచ్చని అన్నారు. ఇండియాలో 2 లక్షలకు పైగా స్టార్టప్లు, 120కి పైగా యూనికార్న్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సహాయపడాలని కోరారు. వాణిజ్య అనుసంధానం అనేది మరో ప్రధాన అంశమని చెప్పారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, వ్యాపార అవకాశాలను విస్తరించడంపై బ్రిక్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి చెప్పారు.
ఐరాస చీఫ్ గుటేరస్తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, నౌకాయాన స్వేచ్ఛ, సుస్థిరాభివృద్ధి, మానవ కేంద్రీకృత కృత్రిమ మేధ(ఏఐ), ప్రపంచ ఆహార భద్రత వంటి పలు అంశాలపై చర్చించారు. బహుళ ధ్రువత్వం ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారు. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ నాలుగోసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆంటోనియా గుటేరస్ అభినందనలు తెలియజేశారు. గుటేరస్తో అద్భుతమైన సమావేశం జరిగిందని మోదీ ఎక్స్లో పోస్టుచేశారు. భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ కార్యకలాపాలు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలపై చర్చించానని పేర్కొన్నారు.
దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోండి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభాన్ని చర్చలు, దౌత్య మార్గాల్లో ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్కు సూచించారు. శుక్రవారం ఇరువురు నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, ఇరాన్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొడానికి పెజెష్కియాన్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే ఈ భేటీ జరగింది. పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపైమోదీ, పెజెష్కియాన్ చర్చించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న భారతదేశ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడం, నౌకాయాన స్వేచ్ఛ, వాణిజ్య కార్యకలాపాలు, నావికుల భద్రత, సంక్షేమాన్ని పరిరక్షించడం కోసం కృషి అవసరమని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్ప టికీ బ్రిక్స్ సమావేశాల్లో ఇరాన్ భాగస్వామ్యం వహిస్తున్నందుకు పెజెష్కియాన్కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఘర్షణను నివారించడానికి సహకరించాలని మోదీని ఇరాన్ అధ్యక్షుడు కోరారు.
బ్రిక్స్ సదస్సుకు దేశాధినేతలు, విశిష్ట అతిథులు
న్యూఢిల్లీ: బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సుకు కూటమి దేశాల అధినేతలతోపాటు పలువురు విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. శనివారం నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఈజిప్ట్ అధినేత అబ్దెల్ ఫతాహ్ ఎల్–సిసీ, ఇండోనేíసియా ప్రెసిడెంట్ ప్రబొవో సుబియాంతో, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేíసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, సౌదీ అరేబియా యువరాజు ఫైజల్ బిన్ ఫర్హాన్ అలీ సౌద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బ్రెజిల్ విదేశీ వ్యవహారాల మంత్రి మౌరో వియేరా పాల్గొనబోతున్నారు. అలాగే ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, నైజీరియా ఉపాధ్యక్షుడు సెనేటర్ కాషిమ్ షెట్టిమా, క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పారిల్లా, బెలారస్ విదేశాంగ మంత్రి మాక్సిమ్ రిజెన్కోవ్, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్ మరియు కజకిస్తాన్ అధ్యక్షుడు కాస్సిమ్–జోమార్ట్ టోకాయెవ్ సైతం హాజరు కాబోతున్నారు. బ్రిక్స్ కూటమిలో గత ఏడాది బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేíసియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా మారాయి.
ఎన్ఆర్ఐ
జర్మనీలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
బెర్లిన్: జర్మనీలోని మ్యూనిచ్, స్టుట్గార్ట్, బెర్లిన్ నగరాల్లో ఈ రోజు సోమవారం దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు తరలివచ్చి, ఆయన సేవలను కొనియాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేడు తామంతా ఉన్నత స్థాయిలో ఉండగలుగుతున్నామని ఆయన సేవలను స్మరించుకున్నారు.17వ వర్ధంతి సందర్భంగా మ్యూనిచ్ నగరంలో నిర్వహించిన “YSR Chess Tournament” విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం కృష్ణ తేజ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కోర్ కమిటీ సభ్యులు నాగార్జున రెడ్డి ఆవుల (జనరల్ సెక్రటరీ), గురు (కో-కన్వీనర్), విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల (ఐటీ కోఆర్డినేటర్), Dr. మల్లికార్జున రెడ్డి బండి (మీడియా స్పోకెస్పర్సన్), మనోజ్ కామసాని (మీడియా స్పోకెస్పర్సన్), నవీన్ రెడ్డి కలమకూరి (సోషల్ మీడియా కోఆర్డినేటర్), సాయి సూర్య చౌదరి (ఎగ్జిక్యూటివ్ మెంబర్), మంజునాథ్ రెడ్డి చవ్వాబాలన్న (ఎగ్జిక్యూటివ్ మెంబర్), వినోద్ అమలదాసు (ఎగ్జిక్యూటివ్ మెంబర్), షాలిని అక్షింతల (ఎగ్జిక్యూటివ్ మెంబర్), ఉపేంద్ర జలది, ప్రదీప్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ బాధ్యతని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలిపారు.
వైఎస్సార్ వర్ధంతి: వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ రక్తదానం
ఫీనిక్స్ (అరిజోనా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ, వైటలెంట్ సహకారంతో సెప్టెంబర్ 6న రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజాసేవకు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడానికి డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన జీవితం, ప్రజాసేవ, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన నిర్వహించారు.కమిటీ సభ్యులు డాక్టర్ వైఎస్సార్తో తమకున్న వ్యక్తిగత అనుభవాలను, ఆయనలోని నిరాడంబరత, ధైర్యం, ప్రజాకేంద్రిత పాలనా విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివ రెడ్డి డాక్టర్ వైఎస్సార్ను “ప్రజల నాయకుడు”గా అభివర్ణిస్తూ, సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేశారు. డాక్టర్ వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆ ఆశయాలను కొనసాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఫీనిక్స్ ఎన్నారై కమిటీని ఆయన అభినందించారు. రక్తదానం అనేది సులభమైనదైనా, అత్యంత విలువైన సేవా కార్యక్రమమని, ఒకరి రక్తదానం నేరుగా మరొకరి ప్రాణాలను కాపాడగలదని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని ధీరజ్ పోలా, వంశీ ఎరువరం, చెన్నా రెడ్డి మద్దూరి, రుక్మన్, శ్రీధర్ చెమిడితి, అంజి రెడ్డి,నాగేష్ పొర్ల, వేమ శేఖర్, విఘ్నేష్, కొండా రెడ్డి , శ్రీనివాస్ మామిడి, హేమ కుమార్, అజయ్ కాల్వ , కుడుముల సుధీర్, సుజన్, రాజేశ్వరరావు బండారు, రాజశేఖర్ అవుదూరి, హితేష్ తదితరులు నిర్వహించి, పాల్గొన్నారు. పలువురు వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైటలెంట్, రక్తదాతలు, వాలంటీర్లు, నిర్వాహకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ, మానవతా విలువలు, సమాజ సంక్షేమం పట్ల డాక్టర్ వైఎస్సార్ చూపిన నిబద్ధతను కొనసాగిస్తూ, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగల సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫీనిక్స్ ఎన్నారై కమిటీ తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించింది.
జయ పీసపాటి గౌరవార్థం సింగపూర్లో ఆత్మీయ సమ్మేళనం
సింగపూర్: హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి సింగపూర్ పర్యటన సందర్భంగా, శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సింగపూర్లో ఘనంగా జరిగింది. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్లో సుమారు 25 మంది తెలుగు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.సుబ్బు వి. పాలకుర్తి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి జయ పీసపాటి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరైనారు. ఈ సందర్భంగా జయ పీసపాటి మాట్లాడుతూ, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు, గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.మహిళలు మీడియా సహా వివిధ రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలవగలరని జయ పీసపాటి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఆదివారం కూడా ఇంతమంది తెలుగువారు ఒకచోట చేరి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సింగపూర్, హాంగ్ కాంగ్ తెలుగు సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న సత్సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.సింగపూర్తో 2016 నుంచే ప్రత్యేక అనుబంధంహాంగ్ కాంగ్లో తెలుగు సమాఖ్యను నిర్వహిస్తున్న తనకు విదేశాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం 2016లో సింగపూర్లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సింగపూర్లోని తెలుగువారి ఐక్యత, చురుకుదనం తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని ఆమె నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.ఇటీవల మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు ఒక మార్గదర్శకంగా, బెంచ్మార్క్గా నిలిచాయని ఆమె అభినందించారు. ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడటంతో పాటు పద్యాలు, గద్యాలను స్పష్టంగా చదివి వినిపించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.మలేషియా తెలుగు సమాజం చూపించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు భాష మరింతగా అభివృద్ధి చెంది, భావితరాల్లో సజీవంగా కొనసాగాలని జయ పీసపాటి ఆకాంక్షించారు.తమకు ఆత్మీయ‘జయక్క’గా మారిన“జయ పీసపాటి ఈ సందర్భంగా రత్న కుమార్ మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలుఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లితో పాటు సింగపూర్ తెలుగు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు.
మిస్సిసాగాలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మిస్సిసాగా: కెనడాలోని మిస్సిసాగా నగరంలో శనివారం(సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం 6 గంటలకు వైఎస్సార్సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, వైఎస్సార్సీపీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమ నిర్వాహకులు (వైఎస్సార్సీపీ కెనడా టీమ్):* సుబ్బారావు – వైఎస్సార్సీపీ కెనడా కో-కన్వీనర్* నూర్ గారు – వైఎస్సార్సీపీ కెనడా యూత్ వింగ్ కన్వీనర్ముఖ్య అతిథులు మరియు వక్తలుచల్లా మధుసూదన్ రెడ్డి గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ) – జూమ్ ద్వారా హాజరయ్యారుపాండుగాయల రత్నాకర్ గారు (మాజీ వైఎస్సార్సీపీ యూఎస్ఏ/ఎన్ఆర్ఐ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి) – జూమ్ ద్వారా హాజరయ్యారు. డాక్టర్ ప్రదీప్ చింత గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఎన్ఆర్ఐ వ్యవహారాలు) – జూమ్ ద్వారా హాజరయ్యారు. కొండం వెంకట్ రెడ్డి గారు (కెనడా కమ్యూనిటీ నాయకులు) – ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడారు.ఎగ్జిక్యూషన్ టీమ్: కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు: అస్లాం, సుమంత్, యశ్వంత్ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్, డాక్టర్ నిరంజన్ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్ కొరపోరలు.అడ్వైజర్ కమిటీ: కార్యక్రమానికి విలువైన మార్గదర్శకత్వం అందించిన సలహాదారుల కమిటీ సభ్యులు:* కృష్ణారెడ్డి పసల* రాజగోపాల్ గుంటక* విశ్వనాథ్ రెడ్డి* విజయభాస్కర్ రెడ్డి* కృష్ణ ఆలంపాటి* డాక్టర్ శివ రెడ్డిఈ కార్యక్రమంలో మిస్సిసాగాతో పాటు పరిసర ప్రాంతాల నుండి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్ కమిటీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూషన్ టీమ్కు, అడ్వైజర్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
భార్య, పెళ్లికెదిగిన ముగ్గురు కుమార్తెల హత్య, స్థానికంగా కలకలం
రాజస్థాన్లోని జైపూర్ పరిధిలోని గోవింద్ పురాలో భార్యాబిడ్డల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అక్కడి నుంచి ఉడాయించాడో వ్యక్తి. ఈ అమానుషం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ దాడిలో 40 ఏళ్ల గీతా ఝా, ఆమె ముగ్గురు కుమార్తెలు నందిని, గిరీష, రాధిక (17-23 ఏళ్లు) మృతి చెందారు. మృతురాలి భర్త, పిల్లల తండ్రి రాహుల్ ఝాగా నిందితుడిగా గుర్తించారు. కుటుంబంలో చెలరేగిన తీవ్రమైన వివాదాలే ఈ దారుణ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యల అనంతరం ఏమీ ఏరగనట్టుగా పాలవాడి దగ్గర పాలుతీసుకొని, తండ్రికి టీ పెట్టి వచ్చి, ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. రాహుల్ ఝా షేర్ ట్రేడింగ్ చేసేవాడు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే ఆయన గుజరాత్ నుండి జైపూర్కు తిరిగి వచ్చారు. భార్య గీతా ఝా తమ ఇంటి మొదటి అంతస్తులో ఒక బొటిక్ను నడిపేవారు. వారి పెద్ద కుమార్తె నందిని చదువుకుంటూనే ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు.ఈ హత్యలకు కేవలం మూడు రోజుల ముందు రాహుల్ ఒక పొరుగింటి వ్యక్తి వద్ద రూ. 25,000 అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!వెలుగులోకి వచ్చిందిలాశుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఎలాంటి కదలికలు లేకపోవడంతో పొరుగువారు, బంధువులకు అనుమానం వచ్చి చూడటంతో ఈ ఘోరం బయటపడింది. మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడి 85 ఏళ్ల తండ్రి ఇంట్లోనే ఉన్నారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు, డాగ్ స్క్వాడ్ ప్రదేశాన్ని పరిశీలించి రక్త నమూనాలు, ఆధారాలను సేకరించాయి. దాడికి ఉపయోగించిన ఇటుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసిపి (వెస్ట్) ప్రశాంత్ కిరణ్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నగర సరిహద్దుల్లో తనిఖీలు తీవ్రతరం చేసి, రాహుల్ ఝా ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.ఇదీ చదవండి: రూ. 100 కోట్ల బ్లాక్ బ్లస్టర్ : వారికి లగ్జరీ కార్లు, వామికాకు మొండి చేయి?
ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్-పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నాగ్పూర్-రాయ్పూర్ జాతీయ రహదారిపై ఉన్న పింపల్గావ్ రోడ్డు ప్రాంతంలోని 'భౌ ధాబా' సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ట్రక్, పికప్ వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది మృతి మరణించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రమాద స్థలం నుండి వెలికితీశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గుర్ని సకోలి సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంతమేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజం
కేపీహెచ్బీ: అర్ధరాత్రి లాఠీ ఝళిపించిన ఎస్సై మౌనిక
కేపీహెచ్బీ అంటేనే రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న చర్చ కొంతకాలంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ దీనిపై జరిగే చర్చ చాలామందికి తెలిసే ఉంటుంది. తాజాగా ఇలాంటి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రివేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్చల్ చేస్తున్న పలువురిని కేపీహెచ్బీ సెక్టార్ ఎస్ఐ మౌనిక లాఠీతో తరిమికొట్టారు.కేపీహెచ్బీ ఫోర్త్ ఫేజ్ సరీ్వస్ రోడ్డు సమీపంలో కొన్ని రోజులుగా ట్రాన్స్జెండర్లు రాత్రి వేళల్లో ఆగడాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వీరిని ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ ఠాణాకు పిలిపించి హెచ్చరించారు. అయినా మార్పు రాలేదు. చెట్ల పొదల వద్ద రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్చల్ సృష్టిస్తున్నారు. విషయం తెలుసుకున్న సెక్టార్ ఎస్ఐ మౌనిక బుధవారం రాత్రి కారులో వచ్చి లాఠీ తీసుకుని చెట్ల పొదల్లోకి రావడంతో ట్రాన్స్జెండర్లు పరుగులు పెట్టారు. ఎస్ఐ ధైర్యంగా వెళ్లి ట్రాన్స్జెండర్లను తరిమి కొట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు ఆమె సూచించారు. పలువురు ట్రాన్స్జెండర్లపై కేసులు నమోదు చేశారు.ఇప్పటికే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో పోలీసులు ఈసారి కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రోడ్ల పక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మౌనిక స్థానికులకు సూచించారు.At this point, KPHB is starting to look less like a residential area and more like Hyderabad’s unofficial red-light district.⁰How the hell did this happen? 🤦♀️ pic.twitter.com/ISCRPcCXl1— Shika Reddy (@Shika_Reddy) September 10, 2026
తిరుపతి జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం
ఓజిలి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి 19 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఓజిలి వద్ద జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన కామాక్షి ట్రావెల్స్ బస్సు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రేపల్లె నుంచి బెంగళూరుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్, 19 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మొదటి డ్రైవర్ జేడీ ప్రేమ్ రాత్రి 10 గంటలకు ఒంగోలు వద్దకు వచ్చేసరికి బస్సును రెండవ డ్రైవర్ తిరుపతయ్యకు అప్పగించారు. అర్ధరాత్రి 1:45 గంటల సమయంలో ఓజిలి పెద్దచెరువు సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి కాలిన వాసన, పొగ రావడాన్ని డ్రైవర్ తిరుపతయ్య గుర్తించారు. వెంటనే అప్రమత్తమై బస్సుకు ఉన్న అన్ని తలుపులు తెరిచి ప్రయాణికులను దించి దూరంగా పంపివేశారు. కొద్దిసేపటికి బస్సు డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ సమయంలో బస్సు రేకు ఒకటి ఎగిరి రోడ్డు డివైడర్పై ఉన్న చెట్లపై పడింది. డివైడర్పై ఉన్న చెట్లకు మంటలు వ్యాపించాయి. కేవలం 15 నిమిషాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. అనంతరం వేరే బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపారు. ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ తిరుపతయ్య అప్రమత్తం కావడంతోనే 19మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
TTD భూమిలో చెల్లెలికి చంద్రబాబు కానుక
ప్రశ్నిస్తే ఖాతాలు మాయం.. సాక్షి గొంతు నొక్కుతున్న కూటమి ప్రభుత్వం..!
జనసేన వాళ్ళని టీడీపీ నేతలు తొక్కుతున్నారని పవన్ కళ్యాణ్ కు తెలిసినా సరే..
ఏమైనా మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టండి... స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే ఎవరికీ ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేద్దాం..
అధికారులు తస్మాత్ జాగ్రత్త.. కొడుకు పాపాలన్నీ మీ మీదకు నెట్టేస్తున్నాడు
నా భర్త లైఫ్ నాశనమైంది.. Ex OSD సుమంత్ భార్య సంచలన వీడియో
అధికారులదే తప్పు.. నేను, నా కొడుకు నిప్పు.. కట్ చేస్తే బూడిద..
వంశీ ఆస్తి విలువెంతో తెలుసా.. ఎకరం 50 కోట్లు.. హైదరాబాద్ లో ఎన్ని ఎకరాలు అంటే..
ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమన్ దద్దరిల్లిన హైదరాబాద్
సంజు దెబ్బకు వైభవ్ అవుట్, టీ 20 ప్లేయింగ్ 11 భారీ మార్పులు

