నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం
నౌతన్వా (మహారాజ్గంజ్): నేపాల్లో సంభవించిన భారీ వరదల ప్రభావం భారత్-నేపాల్ సరిహద్దుల్లోని వాణిజ్యంపై తీవ్రంగా పడింది. వరదల కారణంగా ప్రధాన రవాణా మార్గాలు దెబ్బతినడంతో సోనౌలీ, భగవాన్పుర్, ఠూఠీబారీ వంటి సరిహద్దు పట్టణాల్లో వ్యాపార కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్కెట్లు నేపాల్ నుంచి వచ్చే వినియోగదారులు లేక బోసిపోయాయి.సోనౌలీ మార్కెట్ వ్యాపారం భారత్, నేపాల్ రెండు దేశాల కస్టమర్లపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. నేపాల్లో వరద పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రజలు భారత సరిహద్దు వైపు రావడం తగ్గిపోయింది. దీంతో దుకాణాల వద్ద సందడి కనిపించక, వ్యాపారులు వినియోగదారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భగవాన్పుర్, ఠూఠీబారీ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేపాల్ నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో దుస్తులు, నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని రకాల విక్రయాలు భారీగా పడిపోయాయి.సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించడం వల్ల చిన్న, పెద్ద వ్యాపారులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. సరిహద్దు దకాణాలకు నేపాల్ వినియోగదారులే కీలకమని, రాకపోకలు దెబ్బతిన్నప్పుడు వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని స్థానిక వర్తకులు తెలిపారు. నేపాల్లో పరిస్థితులు త్వరగా చక్కబడి, రాకపోకలు పునరుద్ధరణ జరకపోతే రానున్న రోజుల్లో మరింత భారీ నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్
16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..
తండ్రిని పాకెట్మనీ అడిగే వయసులో తండ్రికే ఉపాధి ఇచ్చి..జీతం ఇస్తున్నాడో యువకుడు. పైగా తన తండ్రినే ఎందుకు నియమించుకున్నాడో ఇచ్చిన వివరణ సైతం అదుర్స్. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు. మరి పేరెంట్స్కే గర్వకారణమైన ఆ తనయుడు ఎవరంటే..అతడే కేరళలోని కొచ్చి, కున్నుంపురంకి చెందిన 16 ఏళ్ల రౌల్జాన్ అజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్ ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరుతెచ్చుకుంటున్నాడు ఈ యువకుడు. అతడు కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్ చదువుతున్నప్పుడే ఏఐ కంపెనీని నడుపుతుండటం విశేషం. ఆ కంపెనీ సాయంతో ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడం, ఈ టెక్నాలజీలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తుంటాడు. నిజానికి అజుకి ఏఐ పట్ల ఉన్న అభిరుచే ఒక స్టార్టప్ కంపెనీకి దారితీసింది. పైగా తండ్రిపై ఆధారపడే టీనేజ్ యువకుల మాదిరిగా కాకుండా తన నాన్ననే తన కంపెనీలో ఉద్యోగిగా నియమించుకుని, నెలకు రూ. 2 లక్షల జీతం ఇస్తుండటం విశేషం. ఏఐలో పట్టు ఎప్పుడు సాధించాడంటే..తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఏఐ సాంకేతికతను నేర్చుకోవడంపై దృష్టి సారించాడు. ఆ తర్వాత ఒక స్టార్టప్ను స్థాపించాడు. అందులో ప్రస్తుతం తన తండ్రితో సహా సుమారు 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతేగాదు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.అజు ఈ టెక్నాలజీని వీడియో ఎడిటింగ్ ద్వారా తెలుసుకున్నాడు. ఇక తండ్రి వల్ల తనకు ఈ ఏఐ సాంకేతికపై పట్టు సాధించగలిగినట్లు చెబుతున్నాడు. ఎలాగంటే..తన తండ్రికి అడోబ్లో ఉద్యోగం వచ్చినప్పుడు, తనకు అన్ని ప్రీమియం టూల్స్కు ఉచిత యాక్సెస్ లభించిందని, దానివల్ల ఏఐ గురించి పూర్తిస్థాయిలో నేర్చుకోగలిగానని అంటున్నాడు. ఆ తర్వాత స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం మీబాట్ అనే సొంత రోబోట్ను తయారు చేసినట్లు తెలిపాడు. ఇక తన తండ్రినే కంపెనీలో ఎందుకు నియమించుకున్నాడంటే..తాను ఫోన్ నుంచి కావల్సినంత జ్ఞానాన్ని ఆర్జించగలను కానీ, ఆయనకున్న అపార అనుభవం తనకు లేదని చెప్పుకొచ్చాడు. పైగా ఆయనకు అమెజాన్, అడోబ్, విప్రో, ఐబీఎం వంటి కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉంది, అందువల్ల ఆయన నుంచి తాను మరిన్ని విషయాలు సులభంగా నేర్చుకోగలగడం తోపాటు ఆయన అనుభవం కంపెనీ మార్కెటింగ్కి చక్కగా ఉపయోగాపడుతుందని చెబుతున్నాడు. కాగా, అజు స్టార్టప్ ఏఐ టెక్నాలజీస్, థింక్క్రాఫ్ట్ అకాడమీని నడుపుతోంది. ఇవి ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, విదేశీ విద్యార్థులు చాలా సునాయాసంగా ఏఐ నైపుణ్యాలను పుణికి పుచ్చుకునేలా ట్రైన్ చేస్తాయి. అక్కడితో ఆగిపోలేదు అజు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో RESQ AI, MeBot, ZapGap, Investo AI, FeedFye, 15 AI సాధనాలను రూపొందించారు. అంతేగాదు అజు కంపెనీ ఏకంగా వరల్డ్వైడ్గా వివిధ రిమోట్ ఉద్యోగులను కలిగి ఉంటూ ఇంటర్నేషనల్ రేంజ్లో గుర్తింపు పొందుతుండటం విశేషం.(చదవండి: రోజువారీ కూలీ నుంచి ..రూ. 15 లక్షల వార్షిక వేతనం, పీహెచ్డీ..!)
ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...
పటమట(విజయవాడతూర్పు): బీటెక్ చదివిన సూరవరపు షకీనా(24) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమవారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు. భీమవరానికి చెందిన షకీనాకు రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం
CSKలో ఏకంగా 25 శాతం వాటా అడిగిన ధోని?
మహేంద్ర సింగ్ ధోని... చెన్నై సూపర్ కింగ్స్.. ఈ రెండు పేర్లు పర్యాయపదాల్లాంటివని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్ నుంచి అన్నీ తానై ధోని సీఎస్కేను ముందుకు నడిపిస్తున్నాడు. మధ్యలో జట్టుపై నిషేధం పడినా.. ఆ తర్వాత రీఎంట్రీలోనూ ధోని తనదైన ముద్ర వేశాడు.ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనతకెప్టెన్ హోదాలో చెన్నైని ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత ధోనిది. జట్టులో జరిగే ప్రతీ మార్పు, కీలక నిర్ణయాల వెనుక ఈ మిస్టర్ కూల్ ఉంటాడనేది బహిరంగ రహస్యమే. నిజానికి సీఎస్కే ప్రధాన ఆకర్షణ ధోనినే. 45 ఏళ్ల వయసులోనూ ఈ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ జట్టుతో కొనసాగుతూ బ్రాండ్ వాల్యూ పెరగటంలో దోహదం చేస్తున్నాడు.హెడ్కోచ్గా?అయితే, ఈ ఏడాది మాత్రం గాయం వల్ల సీజన్ మొత్తంలో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో తలా ఐపీఎల్ రిటైర్మెంట్ ఖాయమనే వార్తలు వినిపిస్తుండగా.. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఖాళీ చేసిన హెడ్కోచ్ స్థానాన్ని ధోని భర్తీ చేస్తాడనే ఊహాగానాలూ వస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.ఏకంగా 25 శాతం వాటా అడిగిన ధోని?‘‘ఆర్సీబీ 1.7- 1.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 వేల కోట్లకు పైగానే)కు అమ్ముడుపోయిందనే ప్రచారం జరిగింది. సీఎస్కే కూడా ఆర్సీబీ లాంటి అభిమానగణం ఉన్న ఫ్రాంఛైజీ. ఈ జట్టు ఇప్పటికే ఐదు ట్రోఫీలు గెలిచింది.విదేశాల్లో కూడా పలు లీగ్లలో ఫ్రాంఛైజీలు కలిగి ఉంది. కాబట్టి దీని విలువ ఎంత ఉంటుందో అంచనా వేయడం కష్టమే. మన ఊహకు కూడా అందనంత ఉండొచ్చు. సీఎస్కే ఒక గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తోంది.సీఎస్కే ఒక గొప్ప బ్రాండ్. దీని విలువ 1.8 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చు. ఇందులో ధోని 25 శాతం వాటా అడిగాడు అనేది నిజంగా సత్యదూరమనే అనిపిస్తోంది. ఇది అసాధ్యం కూడా!.. ఏ ఫ్రాంఛైజీ కూడా ఒకరికి 400 మిలియన్ డాలర్ల మేర వాటా ఇవ్వదు.ఇదంతా ఓ కట్టకథలేదంటే ఏ వ్యక్తి కూడా ఇప్పుడు ఈ మేర పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు. ఆ తర్వాత ధోని 20 శాతం అడిగాడని.. అప్పుడు 3.5- 5.5 శాతం వాటా కోసం బేరసారాలు సాగాయని.. ఆఖరికి రెండు లేదా మూడు శాతం కూడా చర్చ జరిగిందట. నాకైతే ఇదంతా ఓ కట్టకథలా అనిపిస్తోంది. దీనిని ఎవరు సృష్టించారో నాకైతే తెలియదు. నిజంగా ఇది అతిశయోక్తి కంటే ఎక్కువే. ఇది ఎంతమాత్రం నిజం కాదని నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.చదవండి: జట్టు మారనున్న జైస్వాల్?.. స్పందించిన ఫ్రాంఛైజీ
నేపాల్ జల ప్రళయం: ‘ఈషా’ బృందం గల్లంతు.. రంగంలోకి సద్గురు
ప్రపంచంలో రెండో క్రికెటర్గా.. టీ20లలో అరుదైన ఘనత
పెళ్లి తర్వాత తొలి చిత్రం.. అప్డేట్ వచ్చేసింది..
రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రిని చూసి వస్తూ...
యువత దేశానికి వెన్నెముక: ప్రధాని మోదీ
అన్నయ్యకు రాఖీ కట్టాలని ఆశపడిన చెల్లెలు... ప్రయాణంలో విషాదం!
సరే.. మమ్మీ నువ్వే కాల్ చెయ్
నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్
సన్నీ లియోన్పై కేసు.. కొట్టేసిన కోర్టు
స్కాలర్కు జైలు.. రేపిస్టుకు బెయిలా?: మహువా మోయిత్రా
రూ.999కే ఇంటిపై సోలార్.. టాటా పవర్ కొత్త స్కీమ్
అనవసరంగా జనానికి ‘ఓటుకు నోటు’ గుర్తు చేస్తున్నామేమోననిపిస్తోంది సార్!
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా
8 ఏళ్ల తర్వాత ఒకేసారి 4 తుపానులు.. ప్రభావం ఎంతంటే..
ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా
'మోహన్లాల్తో పెళ్లి.. నాన్న ముందే వార్నింగ్ ఇచ్చారు'
రాష్ట్రానికి కరువు కానీ మీ అప్పులకేమీ ఉండదేమిటి సార్!
‘టాక్సిక్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. స్థిరాస్తి వృద్ధి
మరో ఆరు రోజుల్లో చౌకగా విమాన ప్రయాణం
‘టాక్సిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ పక్కా?
‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ
విలన్గా మెప్పించిన జబర్దస్త్ నటుడు
ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు: శోభిత
‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
నేపాల్ జల ప్రళయం: ‘ఈషా’ బృందం గల్లంతు.. రంగంలోకి సద్గురు
ప్రపంచంలో రెండో క్రికెటర్గా.. టీ20లలో అరుదైన ఘనత
పెళ్లి తర్వాత తొలి చిత్రం.. అప్డేట్ వచ్చేసింది..
రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రిని చూసి వస్తూ...
యువత దేశానికి వెన్నెముక: ప్రధాని మోదీ
అన్నయ్యకు రాఖీ కట్టాలని ఆశపడిన చెల్లెలు... ప్రయాణంలో విషాదం!
సరే.. మమ్మీ నువ్వే కాల్ చెయ్
నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్
సన్నీ లియోన్పై కేసు.. కొట్టేసిన కోర్టు
స్కాలర్కు జైలు.. రేపిస్టుకు బెయిలా?: మహువా మోయిత్రా
రూ.999కే ఇంటిపై సోలార్.. టాటా పవర్ కొత్త స్కీమ్
అనవసరంగా జనానికి ‘ఓటుకు నోటు’ గుర్తు చేస్తున్నామేమోననిపిస్తోంది సార్!
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా
8 ఏళ్ల తర్వాత ఒకేసారి 4 తుపానులు.. ప్రభావం ఎంతంటే..
ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా
'మోహన్లాల్తో పెళ్లి.. నాన్న ముందే వార్నింగ్ ఇచ్చారు'
రాష్ట్రానికి కరువు కానీ మీ అప్పులకేమీ ఉండదేమిటి సార్!
‘టాక్సిక్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. స్థిరాస్తి వృద్ధి
మరో ఆరు రోజుల్లో చౌకగా విమాన ప్రయాణం
‘టాక్సిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ పక్కా?
‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ
విలన్గా మెప్పించిన జబర్దస్త్ నటుడు
ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు: శోభిత
‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
ఫొటోలు
ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)
ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)
రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)
'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)
దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)
నేపాల్లో వరద బీభత్సం... (ఫొటోలు)
'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
LCUని పక్కన పెట్టి.. అల్లు అర్జున్తో లోకేష్ ప్రయోగం ఎందుకు?
లోకేష్ కనగరాజ్ పేరు వినగానే LCU గుర్తుకు వస్తుంది. ఈ దర్శకుడు తీసిన ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ వంటి సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఆయన ఆ సినిమాలను పక్కన పెట్టి మరీ ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. దానికి కారణం.. దాదాపు ఆరేళ్ల క్రితమే మైత్రీ మూవీ మేకర్స్ లోకేష్కు అడ్వాన్స్ ఇచ్చిందట. మరోవైపు అల్లు అర్జున్తో సినిమా చేయాలనే ఆలోచన కూడా కొంతకాలంగా ఉందని లోకేష్ ఓ సందర్భంలో వెల్లడించాడు. ఈ రెండు కమిట్మెంట్లు ఇప్పుడు కలవడంతో AA23 పట్టాలెక్కింది.ఇక ఖైదీ 2 ఆలస్యానికి ఆ సినిమా హీరో కార్తి షెడ్యూల్స్ కూడా కారణమయ్యాయి. రజినీకాంత్–కమల్ హాసన్ కాంబినేషన్ కోసం లోకేష్ కొంతకాలం పనిచేశారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. అదే సమయానికి కార్తి కూడా మరో సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. దీంతో లోకేష్కు వచ్చిన గ్యాప్లో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. మైత్రీ నిర్మిస్తున్న AA23 సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన అనౌన్స్మెంట్ వీడియోలో అడవి, గుర్రం, జంతువుల నేపథ్యంలో ఆసక్తికరమైన ప్రపంచాన్ని హింట్ చేశారు. అయితే ఆ సినిమా కథపై మాత్రం ఎలాంటి ఇంకా క్లారిటీ లేదు.LCUతో కనెక్షన్లు లేకుండా లోకేష్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. అల్లు అర్జున్ సినిమా తర్వాత తన తదుపరి సినిమా ఖైదీ 2నే అని లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అంటే ఇది LCUకి బ్రేక్ మాత్రమే.. ముగింపు కాదు!
ఇరుముడి మ్యూజిక్ డైరెక్టర్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్కుమార్, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఇమ్మార్షల్. ఈ మూవీకి మరియప్పన్ చిన్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో అరుణ్కుమార్ ధనశేఖరన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. కేవలం తమిళ వర్షన్ మాత్రమే విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్లో సీన్స్ కథపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ సినిమాకు సామ్ సీఎం సంగీతమందించారు. ఈ చిత్రంలో టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, సభ మారన్, ఆదిత్య కతిర్, అర్షు మహర్జన్, సునీతా శ్రేష్ఠ కీలక పాత్రల్లో నటించారు.
టాక్సిక్పై తప్పుడు ప్రచారం.. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్
టాక్సిక్ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని బెంగళూరు కోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై స్పందించింది. టాక్సిక్ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్పై బెంగళూరు కోర్ట్ విచారణ చేపట్టింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆంక్షలు విధించింది. టాక్సిక్కు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు సృష్టించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ సినిమాను కించపరిచేలా మీడియాలోనూ పోస్ట్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేయకూడదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసులు లేకుండానే వీటిని రద్దు చేస్తామని న్యాయస్థానం పేర్కొంది.
బిగ్ స్క్రీన్పై మరోసారి అవెంజర్స్.. తెలుగు ట్రైలర్ రిలీజ్
అవెంజర్స్ ఎండ్గేమ్: ఎంకోర్తో మరోసారి థియేటర్లలోకి సందడి చేయనుంది. అభిమానులకు మరోసారి బిగ్ స్క్రీన్పై అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది. అవెంజర్స్: ఎండ్గేమ్కు ప్రత్యేకమైన ఎంకోర్ ప్రదర్శనగా మరో మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ ఐమాక్స్ స్క్రీన్స్తో పాటు మార్వల్ స్టూడియోస్ ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్లోనూ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ అందుబాటులో ఉండనుంది. పెద్ద స్క్రీన్స్, మరింత ప్రకాశవంతమైన విజువల్స్, అత్యుత్తమ సౌండ్తో ప్రేక్షకులకు మరింత గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోని ఇన్ఫినిటీ సాగాకు మహత్తర ముగింపుగా నిలిచిన ‘అవెంజర్స్: ఎండ్గేమ్’ను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం అభిమానులకు లభించనుంది.అవెంజర్స్ ఎండ్గేమ్: ఎంకోర్లో థానోస్ కారణంగా ప్రపంచ జనాభాలో సగం మంది కనుమరుగైన తర్వాత మిగిలిన సూపర్హీరోలు ఎదుర్కొనే పరిస్థితులు, తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడానికి వారు చేసే పోరాటం ప్రధానంగా సాగుతుంది. విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు అవెంజర్స్ మరోసారి ఏకమై థానోస్తో తలపడే మహా సంగ్రామం ప్రేక్షకులకు మరోసారి అద్భుతమైన అనుభూతిని అందించనుంది.కాగా.. ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజీ నిర్మించగా.. ఆంథనీ, జో రూసో దర్శకత్వం వహించారు. లూయిస్ డి ఎస్పొసిటో, విక్టోరియా అలోన్సో, మైఖేల్ గ్రిల్లో, ట్రిన్ ట్రాన్, జాన్ ఫావ్రూ, జేమ్స్ గన్, స్టాన్ లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఈ అవెంజర్స్ ఎండ్గేమ్: ఎంకోర్ సెప్టెంబర్ 25, 2026 ఇండియాలో గ్రాండ్గా విడుదల కానుంది.
క్రీడలు
విజయానికి చేరువలో...
కొలంబో: శ్రీలంక పర్యటన ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లు సాధించాలని పట్టుదలగా బరిలోకి దిగిన భారత జట్టు దాదాపుగా ఆ లక్ష్యాన్ని అందుకోవడం ఖాయమైంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టులో కూడా విజయానికి చేరువైంది. మొదటి ఇన్నింగ్స్లో 213 పరుగుల ఆధిక్యం కోల్పోయి ‘ఫాలోఆన్’ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో కొంత పట్టుదల కనబర్చింది. మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 72.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. పసిందు సూర్యబండారా (173 బంతుల్లో 92; 10 ఫోర్లు, 1 సిక్స్), కమిందు మెండిస్ (92 బంతుల్లో 55; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్కు 115 పరుగులు జోడించారు.ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ భాగస్వామ్యాలతో లంక కోలుకున్నట్లు కనిపించినా... కీలక సమయాల్లో భారత్ ఈ జోడీలను విడదీసి పట్టు సాధించింది. ప్రస్తుతం లంక 16 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. చివరి రోజు భారత బౌలర్లు చకచకా మిగిలిన నాలుగు వికెట్లు తీస్తే స్వల్ప లక్ష్య ఛేదన భారత్ ధనాధన్గా ముగించడం ఖాయం. వర్షం పడే అవకాశం ఉన్నా... గురువారం మొత్తం ఆ ప్రభావం ఉండకపోవచ్చు. దినూషా సెంచరీ... అంతకుముందు మరో 39 పరుగులు చేసి ఫాలోఆన్ తప్పించుకునే లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఆ ప్రయత్నంలో సఫలం కాలేకపోయింది. ఓవర్నైట్ స్కోరు 265/8తో ఆట కొనసాగించిన లంక తమ తొలి ఇన్నింగ్స్లో 89.4 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. మొత్తం 6 ఓవర్లు ఎదుర్కొన్న జట్టు 25 పరుగులు జోడించి మిగిలిన 2 వికెట్లు కోల్పోయింది. సోనాల్ దినూషా (162 బంతుల్లో 103; 8 ఫోర్లు, 3 సిక్స్లు) సిరీస్లో వరుసగా రెండో సెంచరీని పూర్తి చేసుకోగా... ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. 213 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్...ఆతిథ్య జట్టును ఫాలోఆన్ ఆడించింది. వర్షం ఇబ్బంది కలిగించడంతో నాలుగో రోజు మొత్తం 78.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. కీలక భాగస్వామ్యాలు... శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కూడా తడబడుతూనే మొదలైంది. సిరాజ్ తన రెండో ఓవర్లోనే ఉడారా (3)ను అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు. అయితే సూర్యబండార, కామిల్ మిషారా (39 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా స్వీప్, రివర్స్ స్వీప్లతో భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు రెండో వికెట్కు 68 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. 17 పరుగుల వద్ద సూర్యబండారా ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్ను సిరాజ్ వదిలేయడం కూడా లంకకు కొంత కలిసొచ్చింది. మరోసారి స్వీప్ షాట్కు యత్నించి జడేజా బౌలింగ్లో మిషారా అవుట్ కాగా... కమిందు సహచరుడికి అండగా నిలిచాడు. 78 బంతుల్లో బండారా హాఫ్ సెంచరీ పూర్తయింది. సుతార్ బౌలింగ్లో రెండు భారీ సిక్స్లు బాదిన కమిందు... ప్రసిధ్ ఓవర్లోనూ ఫోర్, సిక్స్ కొట్టి దూకుడు ప్రదర్శించాడు. 87 బంతుల్లో అతను అర్ధ సెంచరీను అందుకున్నాడు. ఎట్టకేలకు ప్రసిధ్ బౌలింగ్లోనే గిల్ అద్భుత క్యాచ్తో కమిందు వెనుదిరగడంతో ఈ శతక భాగస్వామ్యం ముగిసింది. టీ విరామానికి లంక 199/3తో మెరుగైన స్థితిలోనే కనిపించింది. అయితే మూడో సెషన్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 9 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది. సుతార్ తన వరుస ఓవర్లలో కెపె్టన్ ధనంజయ (23), సూర్యబండారాలను అవుట్ చేసి దెబ్బ కొట్టగా, డిక్వెలా (6)ను సారాంశ్ జైన్ పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత వర్షం కూడా ఆదుకోవడంతో లంక జాగ్రత్తగా మరో 8.2 ఓవర్లు ఆడి వికెట్ కోల్పోకుండా రోజును ముగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: ఉడారా (సి) సారాంశ్ (బి) సిరాజ్ 3; మిషారా (ఎల్బీ) (బి) జడేజా 32; సూర్యబండారా (స్టంప్డ్) పంత్ (బి) సుతార్ 92; కమిందు (సి) గిల్ (బి) ప్రసిధ్ 55; ధనంజయ (సి) పడిక్కల్ (బి) సుతార్ 23; దినూషా (బ్యాటింగ్) 7; డిక్వెలా (ఎల్బీ) (బి) సారాంశ్ 6; నువాంతా (బ్యాటింగ్) 3; ఎక్స్ట్రాలు 8; మొత్తం (72.4 ఓవర్లలో 6 వికెట్లకు) 229. వికెట్ల పతనం: 1–5, 2–63, 3–178, 4–209, 5–212, 6–218. బౌలింగ్: ప్రసిధ్ 10–1–31–1, సిరాజ్ 9–4–11–1, సుతార్ 18–2–81–2, సారాంశ్ 17.4–3–55–1, జడేజా 18–2–48–1.
ఐదో స్థానం కోసం...నేడు జర్మనీతో భారత మహిళల హాకీ జట్టు పోరు
ఆమ్స్టెల్వీన్: మహిళల హాకీ ప్రపంచకప్లో సెమీఫైనల్కు చేరడంలో విఫలమైన భారత జట్టు ఇప్పుడు ఐదో స్థానం కోసం జర్మనీతో పోరుకు సిద్ధమైంది. సాయంత్రం గం. 6:30 నుంచి జరిగే ఈ మ్యాచ్ను జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ మెగా టోర్నీలో పూల్ ‘డి’ నుంచి బరిలోకి దిగిన సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు... ఒక మ్యాచ్లో గెలిచి మరో రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. అనంతరం రెండో దశ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ్రస్టేలియాతో చివరి మ్యాచ్లో గెలిస్తేనే సెమీస్కు అర్హత సాధించే దశలో టీమిండియా ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్కు దూరమైంది. గతంలో రెండుసార్లు వరల్డ్కప్ నెగ్గిన జర్మనీ ప్రస్తుతం ఐదో ర్యాంక్లో ఉండగా... భారత్ 9వ స్థానంలో ఉంది. 1974లో జరిగిన తొలి మహిళల హాకీ ప్రపంచకప్లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచిన భారత్...ఆ తర్వాత ఎప్పుడూ సెమీస్కు చేరలేకపోయింది.
తొలి గేమ్లో ప్రజ్ఞానంద ఓటమి
సెయింట్ లూయిస్: గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ తొలి క్లాసికల్ గేమ్లో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. అమెరికా గ్రాండ్మాస్టర్ కరువానా 48 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలిచి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. వీరిద్దరి మధ్య మరో క్లాసికల్ గేమ్, రెండు ర్యాపిడ్ గేమ్లు, నాలుగు బ్లిట్జ్ గేమ్లు జరగాల్సి ఉన్నాయి. క్లాసికల్ గేమ్లో గెలిస్తే ఆరు పాయింట్లు లభిస్తాయి. ర్యాపిడ్ గేమ్లో గెలిస్తే నాలుగు పాయింట్లు, బ్లిట్జ్ గేమ్లో గెలిస్తే రెండు పాయింట్లు దక్కుతాయి.
నగాల్కు నిరాశ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత నంబర్వన్ ర్యాంకర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 86వ ర్యాంకర్, క్వాలిఫయింగ్ ‘డ్రా’లో టాప్ సీడ్ ప్లేయర్ ఆర్థర్ గియా (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్లో సుమిత్ నగాల్ 3–6, 6–7 (4/7)తో ఓడిపోయాడు. 1 గంట 49 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో నగాల్ 12 విన్నర్స్ కొట్టి, 27 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశాడు. తాజా ఓటమితో 29 ఏళ్ల నగాల్ ఈ ఏడాది ఒక్క గ్రాండ్స్లామ్ టోర్నీలోనూ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. గత ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్లో ఓడిన నగాల్ కెరీర్ మొత్తంలో ఎనిమిదిసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగాడు.
న్యూస్ పాడ్కాస్ట్
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
బిజినెస్
భవిష్యత్తులో మరింత బలమైన వృద్ధికి సిద్ధం
ముంబై: భవిష్యత్తులో మరింత బలమైన వృద్ధిని నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నామని దేశీయ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం ‘ఇమామి’ వ్యవస్థాపకుడు, నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్ గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ మార్కెట్లలో వినియోగం మళ్లీ ఊపందుకోవడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉత్పత్తులకు డిమాండ్ (ప్రీమియమైజేషన్) పెరుగుతుండటం కంపెనీకి కలిసివస్తుందన్నారు. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గ్రామీణ రికవరీతో అధిక లబ్ధి అనుకూలమైన వర్షపాతం, మెరుగైన వ్యవసాయ రాబడులు, పెరుగుతున్న కొనుగోలు శక్తి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మళ్లీ వేగం పుంజుకుంటోందని గోయెంకా పేర్కొన్నారు. ‘‘ఇమామి వ్యాపారంలో అత్యధిక భాగం గ్రామీణ భారతంతోనే ముడిపడి ఉంది. అక్కడ మా బ్రాండ్లకు దశాబ్దాల నమ్మకం ఉంది. జీఎస్టీ సవరణల వల్ల సంఘటిత రంగానికి చెందిన ఉత్పత్తులు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రికవరీ ద్వారా అత్యధిక లబ్ధి పొందేందుకు ఇమామి వ్యూహాత్మకంగా సిద్ధంగా ఉందనే నమ్మకం ఉంది’’ అని వివరించారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగం పెరగడం, ఆరోగ్యం–వెల్నెస్పై అవగాహన పెరగడం తమకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని వివరించారు. నాన్–సీజనల్ ఉత్పత్తులను బలోపేతం చేయడం, కొత్త తరం కన్జూమర్ ప్లాట్ఫారమ్లలోకి విస్తరించడం ద్వారా కంపెనీని మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు. వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామ్యం హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ ‘యాక్సియమ్ ఆయుర్వేద’తో పాటు ‘ఇంక్నట్ డిజిటల్’కు చెందిన డిజిటల్–ఫస్ట్ బ్రాండ్లు ‘వేదిక్స్’, ‘స్కిన్క్రాఫ్ట్’లలో సాధించిన వాటాలు కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గోయెంకా తెలిపారు. తమ వ్యూహాత్మక పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై26) కన్సాలిడేటెడ్ టర్నోవర్లో దాదాపు ఆరు శాతం వాటాను అందించాయని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై27)లో ఈ వాటా 16 శాతానికి, ఎఫ్వై30 నాటికి 25 శాతానికి (నాలుగో వంతు) చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ వ్యాపార విస్తరణ ప్రపంచవ్యాప్తంగా అనిశి్చతులు ఉన్నప్పటికీ స్వదేశీ వినియోగం, మౌలిక సదుపాయాల కల్పన, విధానపరమైన స్థిరత్వంతో భారత్ స్థిరమైన వృద్ధిని సాధిస్తోందన్నారు. బంగ్లాదేశ్, పశి్చమాసియా, ఆఫ్రికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఉత్పత్తులకు మంచి భవిష్యత్తు ఉందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక తయారీ సామర్థ్యం, వినియోగదారుల కేంద్రీకృత వ్యూహాలతో ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొంటూ బ్రాండ్ల బలం, కస్టమర్ల నమ్మకంతో ఇమామి ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు.
కార్పొరేట్ కొనుగోళ్లు రెట్టింపు
ముంబై: ఇతర కంపెనీల కొనుగోళ్లలో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ ఆసక్తి చూపుతున్నట్లు దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే కొనుగోళ్లు రెట్టింపైనట్లు వెల్లడించింది. అయితే వీటిలో మూడోవంతు అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినట్లు తెలియజేసింది. విభిన్న కారణాలతో కంపెనీలు ఇతర సంస్థల కొనుగోళ్లను చేపడుతున్నట్లు క్రిసిల్ ఎండీ సుబోధ్ రాయ్ తెలియజేశారు. వృద్ధిని పెంచుకోవడంలో వేగం, మార్కెట్లలో మరింత విస్తరించడం, కొనుగోళ్ల సామర్థ్యాలకు పదును పెట్టుకోవడం తదితరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. నివేదిక విశ్లేషణ ప్రకారం 2017 నుంచి డీల్స్ సంఖ్య రెట్టింపైంది. 20 రంగాల నుంచి విడిగా రూ. 500 కోట్లకుపైగా విలువైన 600 డీల్స్ను నివేదిక విశ్లేషించింది. అయితే విశ్లేషణలో ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరీ్వసుల రంగాలలోని లావాదేవీలను మినహాయించింది. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజాలు దేశీయంగా చేపట్టే డీల్స్కు సైతం చోటివ్వలేదు. కారణాలు వేరువేరు.. క్రిసిల్ నివేదిక ప్రకారం ఫార్మాస్యూటికల్స్, హెల్త్కేర్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్జూమర్ బిజినెస్లు టెక్నాలజీల అనుసంధానం, నైపుణ్యాలు, మేథోసంపత్తిని సమకూర్చుకోవడం తదితరాల కోసం కొనుగోళ్లను చేపడుతున్నాయి. సిమెంట్, మెటల్స్ రంగాలలోని పరిశ్రమలు.. కన్సాలిడేషన్, ప్లాంట్ల నిర్మాణ సమయాన్ని తగ్గించుకోవడం తదితరాలపై దృష్టితో కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. తద్వారా 4–6 ఏళ్ల కాలాన్ని ఏడాది నుంచి మూడేళ్లకు తగ్గించుకుంటున్నాయి. రుణ సమీకరణతో చేపట్టిన 100కుపైగా భారీ డీల్స్ మూడింటిలో రెండు అంచనాలను అందుకున్నట్లు రాయ్ పేర్కొన్నారు. కొన్ని డీల్స్ ఏకీకృతంకావడంలో విఫలంకాగా.. నియంత్రణ సంస్థల ఆలస్యాలు, దేశ సరిహద్దులనుదాటి(క్రాస్బోర్డర్) చేపట్టే కొనుగోళ్లు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించారు. కొనుగోళ్లు, విలీనాలనేవి వ్యూహాత్మక నిర్ణయాలతోనే విజయవంతంకాబోవని, క్రమశిక్షణాయుత ఏకీకృత చర్యలు, సమయానుగుణంగా సొంతం చేసుకోవడం, వనరుల సమర్థవంత వినియోగం తదితరాలు ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు.
ఎంజీ హెక్టార్ ‘తొమాహాక్’ వచ్చేసింది
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ ‘జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారత మార్కెట్లోకి నూతన మల్టీ–ఎనర్జీ వెహికల్ ‘హెక్టార్ తొమాహాక్’ ను అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన ‘అడ్వాన్స్డ్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ (ఏడీఏపీటీ)’ పై రూపొందిన తొలి మోడల్ ఇదేనని తెలిపింది. అలాగే, భారత్లో న్యూ ఎనర్జీ వెహికల్ ప్లాట్ఫామ్పై రూపొందిన తొలి ఉత్పత్తిగా కూడా పేర్కొంది. ఎక్స్ షోరూం వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) వెర్షన్ ప్రారంభ ధర రూ.19.49 లక్షలుగా ఉంది. ప్లగ్–ఇన్ హైబ్రిడ్ (పీహెచ్ఈవీ) వెర్షన్ ధర రూ. 25.70 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. కారు ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్ మాట్లాడుతూ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు. ‘‘దేశంలో తమ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు కంపెనీ, దాని భాగస్వామ్య వెండర్లు కలిసి రూ.6,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నాము’’ అని తెలిపారు. ఇందులో కంపెనీ వాటా రూ.3,500 కోట్లు కాగా, వెండర్లు దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత విస్తరణ ప్రణాళికకు అవసరమైన నిధులు కంపెనీ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హలోల్ ప్లాంట్ విస్తరణకు భారీ ప్రణాళిక మొత్తం రూ.6 వేల కోట్ల పెట్టుబడిలో కొంత భాగాన్ని గుజరాత్లోని హలోల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హలోల్ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.10 లక్షల యూనిట్లుగా ఉందని, వచ్చే ఏడాది మార్చి నాటికి దీనిని 1.60 లక్షల యూనిట్లకు, 2028 జనవరి నాటికి 2.20 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు వివరించారు. రాబోయే 3–4 ఏళ్లలో కొత్త ప్రాంతంలో మరో ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న హలోల్ ప్లాంట్లోనే వార్షిక సామర్థ్యాన్ని 4 లక్షల యూనిట్ల వరకు పెంచుకునే అవకాశం ఉందన్నారు. భారీ వృద్ధి లక్ష్యాలు కంపెనీ ఏటా 35–40 శాతం వార్షిక వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుందని పార్థ్ జిందాల్ చెప్పారు. మార్కెట్లో డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండటమే ప్రధాన సవాలు అన్నారు. గతేడాది 71,000 కార్లను విక్రయించగా, ఈ ఏడాది 1,00,000 కార్ల విక్రయాల మార్కును దాటతామనే ధీమా వ్యక్తం చేశారు. భారత్లో బ్యాటరీ సెల్స్ తయారీపై కంపెనీ ఆసక్తి చూపుతున్నప్పటికీ, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) టెక్నాలజీ చైనా వెలుపల పరిమితంగా అందుబాటులో ఉందన్నారు. అయితే బ్యాటరీ స్టోరేజ్ కోసం జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి, ఎంజీ వాహనాల కోసం సెల్–టు–ప్యాక్ సదుపాయాలను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. వాటా కొనుగోలుపై చర్చలు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాలో అదనపు వాటా కొనుగోలుపై జేఎస్డబ్ల్యూ గ్రూప్, ఎస్ఏఐసీ మోటార్ మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ అంశంపై ఇప్పటివరకు ఎ లాంటి నిర్ణయం తీసుకోలేదని పార్థ్ జిందాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపెనీలో ఎస్ఏఐసీ మోటార్కు 49%, జేఎస్డబ్ల్యూ గ్రూప్కు 35% వాటా ఉండగా, మిగిలిన వాటాను ఇతర భారతీయ పెట్టుబడిదారులు, డీలర్లు, ఉద్యోగులు కలి గి ఉన్నారు. భారత్ను తమ తదుపరి కీలక వృద్ధి మార్కెట్గా ఎస్ఏఐసీ మోటార్ చూస్తోందన్నారు.
చిన్న బ్యాంకుల విలీనం.. పెద్ద బ్యాంకుల ఏర్పాటు!
పలు చిన్న బ్యాంకులను విలీనం చేసి కొన్ని భారీ బ్యాంకులను ఏర్పాటు చేయడంపై భారత్ దృష్టి పెట్టాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) ఒక చర్చాపత్రంలో ప్రతిపాదించింది. అదే సమయంలో మార్కెట్లో పోటీ తగ్గిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 2017లో ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులను, 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడా-విజయ బ్యాంక్-దేనా బ్యాంకులను, 2020లో 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కన్సాలిడేట్ చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి తగ్గిందని వివరించింది.కన్సాలిడేషన్ వల్ల స్థాయి, కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాలు పెరిగాయని ఈఏసీ–పీఎం తెలిపింది. దేశీ బ్యాంకింగ్ రంగంలో సమర్ధత, ఉత్పాదకతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయని పేర్కొంది. భవిష్యత్తులో కృత్రిమ మేథ (ఏఐ), బ్యాంక్ డిజిటైజేషన్ కూడా కలిస్తే సమర్ధత మరింతగా పెరుగుతుందని వివరించింది. 2015–2026 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో (12 ఏళ్లు) 47 బ్యాంకులను అధ్యయనం చేసిన మీదట ఈఏసీ-పీఎం ఈ పత్రాన్ని రూపొందించింది.
ఫ్యామిలీ
స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు
ప్రపంచ రికార్డు సాధించడమే జీవితాశయంగా పెట్టుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన పుష్పజ్యోతి రవికుమార్ (29). రికార్డులోకెక్కడానికి ఒక చిన్న స్టిక్కీ నోట్పై ఏకంగా 150 పదాలను స్పష్టంగా రాసి, గిన్నిస్బుక్లోకెక్కింది. మొదటి ప్రయత్నంలోనే పుష్పజ్యోతి ఈ రికార్డుని సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మనలో చాలామంది స్టిక్కీ నోట్ను కేవలం షాపింగ్ జాబితాలకో లేదా చిన్న విషయాలు గుర్తుంచుకోవడానికో వాడతాం. కానీ, దుబాయ్లో సీనియర్ క్లౌడ్ ఇంజనీర్గా పనిచేస్తున్న పుష్పజ్యోతికి మాత్రం అది ఒక ప్రపంచ వేదికగా కనిపించింది. అదే చిన్న కాగితం ముక్కపై ఏకంగా 150 పదాలను అత్యంత స్పష్టంగా రాసి, ఒకే స్టిక్కీ నోట్పై అత్యధిక పదాలు రాసిన రికార్డును తన పేరుపై లిఖించుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే..ఈ సవాలులో కేవలం పదాలను ఇరికించి రాయడం మాత్రమే కాదు, అవి చదవడానికి వీలుగా ఉండడం కూడా ముఖ్యం. తక్కువ స్థలంలో ఎక్కువ పదాలను పట్టించడానికి ఆమె జాగ్రత్తగా చిన్న చిన్న పదాలను ఎంచుకున్నారు. అందులోనూ ఎక్కువ శాతం కేవలం మూడు అక్షరాలు ఉన్న పదాలనే ఉపయోగించారు. వేర్వేరు చేతిరాత శైలులలో ప్రయోగాలు చేయడం పుష్పజ్యోతికి అలవాటు. అందువల్ల తక్కువ స్థలంలో స్పష్టంగా రాయడం ఆమెకు సులువైంది. బాల్యం నుంచే గిన్నిస్ బుక్లో రికార్డు సాధించాలని పుష్పజ్యోతి ఆకాంక్ష. అలా ఆమె తన తొలి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించింది.ప్రశంసల జల్లులుపుష్పజ్యోతి తన విజయానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోగానే ఆమెపై ప్రశంసల జల్లులు కురిసాయి. సుమారుగా పది లక్షల వ్యూస్ వచ్చాయి. ఆశయానికి అంకితభావం తోడైతే, సాధించలేనిది ఏదీ లేదని పుష్పజ్యోతి నిరూపించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డు విజేతగా మారడం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత గానో పెంచింది. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుంది. దానిని వెలికితీసి ప్రపంచానికి ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలు దోహదపడతాయి. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించడమే నా లక్ష్యం. View this post on Instagram A post shared by Varnam MY (@varnammalaysia)– పుష్యజ్యోతి రవికుమార్ (చదవండి: కంటతడి పెట్టించే ప్రేమకథ..! ఆఖరికి విధి సైతం..)
బహూకరించిన ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు తండ్రికి ఉందా?
కొన్ని సంవత్సరాల క్రితం మా తండ్రి తన స్వార్జిత ఆస్తులతో పాటు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను కూడా నాకు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా బహూకరించారు. అనంతరం మా తల్లి మరణించడంతో మా తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. తన రెండోభార్య ప్రభావంతో ఇటీవల ఆ గిఫ్ట్డీడ్ను రద్దు చేస్తానని నన్ను బెదిరిస్తున్నారు. తండ్రికి ఇష్టమొచ్చినప్పుడు ఇలాంటి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసే అధికారం ఉంటుంది అని అంటున్నారు. ఆయన అలాంటి చర్య తీసుకోకుండా కోర్టు ద్వారా రక్షణ పొందగలనా?– విశ్వసాగర్, మహబూబ్ నగర్చట్టపరంగా ఒకసారి చెల్లుబాటయ్యే విధంగా బహుమతి పూర్తయి, దానిని స్వీకరించిన అనంతరం, కేవలం దాత మనసు మార్చుకున్నందుకు లేదా కుటుంబ పరిస్థితులు మారాయనే కారణంతో ఆ బహుమతిని ఏకపక్షంగా రద్దు చేయడం అంత సులువేం కాదు.ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882లోని సెక్షన్ 122 ప్రకారం, బహుమతి అంటే ప్రతిఫలం లేకుండా స్వచ్ఛందంగా ఆస్తిని బదిలీ చేయడం; అదే చట్టంలోని సెక్షన్ 126 ప్రకారం గిఫ్ట్ను రద్దు చేసే అవకాశం చాలా పరిమితమైన సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, గిఫ్ట్ డీడ్లోనే దాత ఇష్టానుసారం కాకుండా, ఒక నిర్దిష్ట సంఘటన సంభవించినప్పుడు బహుమతి రద్దు కావచ్చని చట్టబద్ధంగా అంగీకరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. అయితే ‘‘నాకు నచ్చినప్పుడు గిఫ్ట్ను రద్దు చేసుకుంటాను’’ అంటే కుదరదు. అలా రాసుకున్నా చట్టం ఒప్పుకోదు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే సూత్రాన్ని పునరుద్ఘాటించాయి.మీ తండ్రిగారు ఏం చేస్తారో చెప్పలేదు. ఆయనకు ఆస్తులు ఉన్నాయా? ఉద్యోగస్తుడా? ఎందుకంటే, ఒకవేళ గిఫ్ట్ డీడ్లో తండ్రిని జీవితాంతం పోషించాలి, నివాసం కల్పించాలి లేదా ఇతర థమిక అవసరాలు తీర్చాలి అనే షరతు స్పష్టంగా ఉన్నదా లేదా అన్నది పరిశీలించాలి. తండ్రి సీనియర్ సిటిజెన్ అయితే, మెయింటెనెన్స్ అండ్ వెల్పేర్ ఆఫ్ సీనియర్ సిటిజెన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్, 2007లోని కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఆస్తి బదిలీని రద్దు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. బదిలీ గ్రహీత తల్లిదండ్రికి ప్రాథమిక అవసరాలు, భౌతిక అవసరాలు తీర్చాలనే షరతు ఉన్నప్పుడు, ఆ బాధ్యతను నిర్వర్తించనప్పుడు ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు. కాబట్టి ఆయనకు వాస్తవంగా మెయింటెనెన్స్ అవసరమా లేదా, ఆయన ఆదాయం ఎంత, గిఫ్ట్ డీడ్లో ఏమైనా మెయింటెనెన్స్ ఉందా వంటి అంశాలను వాస్తవాల ఆధారంగా పరిశీలించాలి. అలాగని కేవలం మెయింటెనెన్స్ కోరే హక్కు ఉండటం వల్లనే ఇప్పటికే పూర్తయిన గిఫ్ట్ డీడ్ను స్వయంచాలకంగా రద్దు చేసే హక్కు దాతకు ఏర్పడదు. సెక్షన్ 126 లేదా సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ లోని వర్తించే నిబంధనల కింద చట్టపరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే బహుమతి రద్దుచేసే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.అదలా ఉంటే కోర్టులో ఇంజక్షన్ సూట్ వేసే అవకాశం ఉన్నప్పటికీ మీ తండ్రిగారు బెదిరిస్తున్నారనే కారణంతో మీరు వెంటనే కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ముందుగా గిఫ్ట్ డీడ్ను న్యాయపరంగా పరిశీలించి, అందులో రివోకన్స్, మెయింటెనెన్స్, లైఫ్ ఇంటరెస్ట్ లేదా ఇతర షరతులు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలి. బెదిరింపులకు భయపడటం కంటే ముందుగా గిఫ్ట్ డీడ్ పూర్తి కాపీని న్యాయ నిపుణుడితో పరిశీలించి, అవసరమైతే ముందస్తు న్యాయపరమైన రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. దగ్గరలోని మంచి లాయరు గారిని కలవండి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.
సమానత్వానికి ఉపాధే మార్గం
ఆగస్టు 26... మహిళా సమానత్వ దినోత్సవం. ఓటు హక్కు కోసం మొదలైన పోరాటం నేడు అంతరిక్షం వరకు సాగింది. కానీ ప్రశ్న మిగిలే ఉంది.నిజంగానే ఆమెకు సమాన గుర్తింపు, భద్రత, స్వేచ్ఛ దక్కాయా? జవాబు... ఇంకా లేదు. ఒకవైపు ఆమె ముందుకు దూసుకెళుతోంది. మరోవైపు సామాజిక ఆంక్షలు, గృహహింస, వివక్ష ఆమె రెక్కలను కత్తిరిస్తూనే ఉన్నాయి. సమానత్వం అంటే ‘పురుషులతో పోటీ కాదు’... ‘పురుషులతో సమానంగా బతికే హక్కు’. ఆఫీస్లో సమాన అవకాశం, ఇంట్లో సమాన గౌరవం దక్కినప్పుడే ‘విమెన్స్ ఈక్వాలిటీ డే’కు అర్థం. ఆమెను కేవలం బాధ్యతగల గృహిణిగా, సమర్థురాలైన ఉద్యోగిగా మాత్రమే కాదు.. ఒక మనిషిగా, నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వంగా గౌరవించినప్పుడే అది సిసలైన సమానత్వం. అందుకై మార్పు అనివార్యం.మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి, సాధికారతకు, సమానత్వానికి.. ఉద్యోగం అనేది అత్యంత కీలకం. ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు,ఎన్నో అద్భుతాలు చేస్తారని ఆశలు పెట్టుకున్న వాళ్లు, ఒకే ఒక మాటతో ఉసూరుమనిపిస్తారు. ‘ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకోవడం, ఇంటిపనులు చేసుకోవడం కష్టంగా ఉంది. అందుకే ఉద్యోగం మానేశాను’ గ్లోబల్ ఆన్లైన్ ఎంప్లాయిమెంట్ వెబ్సైట్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఇండీడ్ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతదేశంలో ప్రతి పదిమంది మహిళల్లో ఎనిమిది మందికి పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం లేదు. ఇంటి సంరక్షణ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కష్టం అని భావించడం వల్ల చాలామంది మహిళలు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం లేదు....మహిళలు తమ కెరీర్ను ఎంచుకునే విధానాన్ని కుటుంబ బా«ధ్యతలు ప్రభావితం చేస్తున్నాయని, కెరీర్ను ఎంచుకోవడంలో సౌలభ్యం అనేది కీలక విషయంగా మారిందని చెబుతోంది ఇండీడ్ సర్వే. మరి కొన్ని విషయాలు... ⇒ ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు సౌకర్యవంతమైన పనిగంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.⇒ 48 శాతం మంది హైబ్రిడ్ లేదా రిమోట్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.⇒ కుటుంబ జీవితం–వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కోసం పది మందిలో ఎనిమిది మంది తక్కువ జీతానికైనా సరే ఉద్యోగాల్లో చేరుతున్నారు.⇒ ఆఫీసుకు హాజరు కావాల్సిన నిబంధనల కారణంగా 51 శాతం మంది ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కావడం లేదు.⇒ పూర్తి సమయం ఆఫీసులో ఉండాలనే నిబంధనను 37 శాతం మంది ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఉద్యోగ విధులలో సౌలభ్యం లేకపోవడాన్ని 34 శాతం మంది ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఉద్యోగం చేసే తల్లులు హైబ్రిడ్, రిమోట్ వర్క్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.‘ఉద్యోగాలకు సంబంధించి మహిళలకు కలలు ఉన్నప్పటికీ, గృహ సంరక్షణ బాధ్యతలకే చాలామంది మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటున్నారు ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్.ఉద్యోగం డబ్బుల కోసం మాత్రమే కాదు...‘ఉద్యోగం అనేది కేవలం డబ్బు సం పాదించే మార్గం మాత్రమే కాదు. ఆర్థికంగానే కాదు మాససికంగా కూడా ఉపయోగపడుతుంది. వృత్తి జీవితమే వ్యక్తిగత జీవితంలో సంతృప్తిని, స్ఫూర్తిని ఇస్తుంది. పని– వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయం సాధించాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూనే వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలి’ అంటున్నారు లైఫ్స్టైల్ అండ్ ఫర్నీచర్ బ్రాండ్ ‘బెంట్చైర్’ సీఈవో, కో–ఫౌండర్ నటషా జైన్.ఆ లక్ష్యాలనే ఎంచుకుంటాను‘వ్యా పారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న ఈరోజుల్లో ఎంతోమంది మహిళలు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాలను చక్కగా సమన్వయం చేసుకుంటున్నారు. నా విషయానికి వస్తే...అసాధారణమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకపోవడమే పని–జీవిత సమతుల్యతకు ఒక మార్గం. నా మానసిక ప్రశాంతతకు భంగం కలగకుండా సాధించగలిగే లక్ష్యాలనే నా వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో ఎంచుకుంటాను. నేను ఉత్తమ తల్లి లేదా ఉత్తమ ఉద్యోగి అని నిరూపించుకోవడానికి నన్ను నేను అతిగా ఒత్తిడికి గురిచేసుకోను’ అంటుంది దీక్ష చాబ్ర ఫిట్నెస్ కన్సల్టేషన్ ఫౌండర్ దీక్ష చాబ్ర.లక్ష్యాల దిశగా...‘ఇంట్లో బిడ్డను చూసుకోవాల్సిన బా«ధ్యతల వల్ల మొదట్లో నా వ్యా పారప్రయాణం భారంగా అనిపించింది. పని–జీవిత సమతుల్యతను కా పాడుకోవడానికి ప్రతి ఒక్కరికీ మార్గం ఉంటుంది. లక్ష్యాల దిశగా ప్రణాళిక వేసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి రోజులో కొంత సమయాన్ని నా కోసం కేటాయించుకుంటాను’ అంటున్నారు గిఫ్టింగ్ కంపెనీ జిఫ్టర్ కో–ఫౌండర్ పూజా పుంజ్.పనిని ఆస్వాదించండి‘మొదటగా మీ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టండి. చేసే పనిని ఆస్వాదించండి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్పై కృషి చేయండి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్కు ఒక మార్గం కనుగొన్న తరువాత ఉద్యోగ జీవితంలో లభించే సంతృప్తి, ఆనందం సాటిలేనివి. కెరీర్లో మీరు ఎదిగే కొద్ది పని–వ్యక్తిగత జీవిత సమతుల్యత గురించి మార్గాలు మరిన్ని కనబడతాయని గుర్తుంచుకోవాలి. ఒక్కమాటలో చె΄్పాలంటే సమతుల్యత అనేది ఎక్కడో ఉండదు. అది మనం సృష్టించుకోవాలి’ అంటున్నారు ప్రమేయ హెల్త్ ఫౌండర్ డాక్టర్ సంధ్యా రవి.నిరాసక్తత ఎందుకంటే..?ఉద్యోగాల కొరత, పని ప్రదేశంలో కార్మిక చట్టాలు వర్తించకపోవడం, సరైన మౌలిక సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాల వల్లే మహిళలు ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. భారతీయ మహిళలు మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండడం, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడం కుటుంబ నేపధ్యం ఇందుకు ప్రధాన కారణాలు.n భారతదేశంలో పని చేసే వయసు ఉండి ఉద్యోగం చేస్తున్న మహిళల శాతం కేవలం 35 మాత్రమే.భారత్ కూడా ఉన్నత ఆదాయ దేశాల స్థాయికి చేరాలంటే మరో 9 కోట్ల మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారుగా రూ. 116 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. వస్త్ర పరిశ్రమ ద్వారా బంగ్లాదేశ్ మహిళలకు భారీగా ఉ పాధి కల్పించింది. భారత్ కూడా అదే స్థాయిలో శ్రామిక ఆధారిత రంగాలను ప్రోత్సహిస్తే, మూడు రెట్లు వేగంగా మహిళా ఉ పాధి పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి.ఇంకా అక్కడే..మహిళా సాధికారతను కొన్నేళ్లుగా విద్య, ఉద్యోగం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదు పాయాల ఆధారంగానే కొలుస్తూ వస్తున్నారు. ఈ ప్రాథమిక ప్రమాణాలన్నింటిలోనూ భారతదేశం గణనీయమైన ప్రగతిని సాధించినప్పటికీ ఎన్ఎఫ్హెచ్ సర్వే–6 (జాతీయ, కుటుంబ, ఆరోగ్య సర్వే) ఫలితాలు కనిపించని కోణాన్ని మన ముందుకు తెచ్చాయి. ⇒ 22.3 శాతం మంది 18 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న వివాహితలు తమ భర్త నుంచి భౌతిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గతంలో చేసిన ఎన్ఎఫ్హెచ్ –5 (2019–21) సర్వేలోని 29.2 శాతంతో పోలిస్తే ఈ సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ తరహా వైవాహిక హింసను ఎదుర్కొంటున్నారనేది ఆందోళన కలిగించే అంశం. ⇒ కేరళలో 87 శాతం మంది బాలికలు పదో తరగతి కంటే ఎక్కువ చదువుకున్నారని ఎన్ఎఫ్హెచ్–6 చెబుతోంది. అయినప్పటికీ, భర్త చేతిలో వేధింపులకు గురవుతున్న వివాహితల శాతం 9.8 నుంచి ఏకంగా 17.7 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్య, వికాసాలు ఉన్నచోట కూడా గృహహింస తీవ్ర రూపంలోనే ఉందనడానికి ఈ గణాంకాలు నిదర్శనం.⇒ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముందే వారి జీవితాలను దెబ్బతీస్తున్న మరో ప్రధాన సమస్య బాల్య వివాహాలు. ఆంధ్రప్రదేశ్ (25%), జార్ఖండ్ (28.1%), బీహార్ (34.6%), పశ్చిమ బెంగాల్ (36.4%) లతో బాల్య వివాహాలు ఇప్పటికీ పెద్ద సమస్యగా ఉన్నాయి. చిన్న వయసులోనే వివాహాలు కావడం వల్ల మహిళలు మానసిక, ఆర్థిక, సామాజిక సాధికారతను సాధించలేకపోతున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు, ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడిపోతున్నారు.వర్క్–లైఫ్ బాలెన్స్ కోసం...వర్క్–లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడంలో భాగంగా ప్రతి ఉదయం మెంటల్ నోట్ క్రియేట్ చేసుకుంటాను. మెంటల్ నోట్ ద్వారా ఆరోజు నేను పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులను దృష్టిలో పెట్టుకుంటాను. నా పని ముగించేలోపు వాటిని పూర్తి చేయడంపై దృష్టి పెడతాను. మీరు తీరికలేని జీవితాన్ని గడిపే ఉద్యోగి అయితే మీ కోరికల జాబితాలోని ప్రతిదాన్ని సాధించడం కష్టం. దీని వల్ల మనం పూర్తిగా అలసిపోతాం. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతాం. వృత్తి–కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి మన ఆరోగ్యం, లైఫ్స్టైల్పై దృష్టి పెట్టాలి. ఎంటర్ప్రెన్యూర్స్గా మనం చాలా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతాం. అది అనారోగ్యానికి, డిప్రెషన్కు దారి తీయవచ్చు. పని నుండి పూర్తిగా విరామం తీసుకోవడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు, మూడు రోజులు సెలవు తీసుకుంటాను.– రాశీ జైన్, ఆన్కో.కామ్ సీయివో, కో–ఫాండర్
కంటతడి పెట్టించే ప్రేమకథ..! ఆఖరికి విధి సైతం..
అందర్నీ ఎదిరించి ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటల వరుక తెచ్చుకున్నారు. ఆనందంగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంతా హాయిగా సాగిపోతుందన్న తరుణంలో విధికే కన్ను కుట్టిందో, పరీక్షే పెట్టాలనుకుందో..ఒక్క క్షణంలో వాళ్ల జీవితాలు అగాథంలో పడేలా భయానక యాక్సిడెంట్ ఒక్క కుదుపు కుదిపేసింది. నిజానికి మరొకరేవరైనా ఆ సమయంలో ఎవరి జీవితం వారు అనుకునేవారేమో..కానీ ఆమె అనలేదు. ఎవ్వరేమి చెప్పినా..అతడే తన సర్వస్వం అంటూ చూపిన తెగువకు చేతులెత్తి నమస్కరించాల్సిందే. అసలేం జరిగిందంటే..గుజరాత్కి సంబంధించిన దీప్తి, జయ్లు చదువుకునే రోజుల నుంచే మంచి స్నేహితులు. సాధారణ స్నేహంగా మొదలైన వారి బంధం..కాస్త ప్రేమగా మారింది. చదువులు పెరుగుతూ వస్తున్నా.. వారి మధ్య దూరం, సంభాషణలు తగ్గలేదు. చివరికి పెద్దయ్యాక కూడా కలిసే ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించకున్నారు. కానీ ఇరు కుటుంబసభ్యులు వారి పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. ఏళ్ల తరబడి నిరీక్షించినా..ఫలితం కనిపించక..చేసేదిలేక..జయ్ పేరెంట్స్ని కాదని దీప్తిని పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపాడు. అలా వారి పెళ్లిలో దీప్తి తరుఫు పెద్దవాళ్లున్న, జయ్ తరుఫున ఎవ్వరూ లేరు. అలా 2024లో ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. ఇక నుంచి తమ జీవితాలు ఆనందంగా సాగిపోతాయి అని భావించారు ఇరువురు. అంతలోనే తమ జీవితాలు తలకిందులైపోతాయని అస్సలు ఊహించలేదు. ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్లిన జయ్ ఆరోజు ఇంటికి రాలేదు..అతడి ఆఫీసు ఇన్ఛార్జ్ రావడంతో దీప్తిలో కంగారు, ఆందోళన మొదలయ్యాయి. అతడు వచ్చి జయ్కు చిన్న యాక్సిడెంట అయ్యిందనగానే చిన్న గాయాలే అనుకుని ధైర్యంగా బయలుదేరబోతుండగా..ఇద్దరి బట్టలు తెచ్చుకోవాల్సిందిగా చెప్పడంతో విస్తుపోతుంది. అయోమయంగా ..కంగారు కంగారుగా ఆస్పత్రికి వెళ్లిన దీప్తికి అక్కడ జయ్ని చూశాకగానీ అర్థం కాలేదు..అతడికి అయ్యింది భారీ యాక్సిడెంట్ అని. పైభాగం తప్పించి మొత్తం కింద భాగం 40% మేర కాలిపోయింది, అస్సలు స్పృహలో లేడు జయ్. ఆ దృశ్యాలను చూసి తట్టుకోలేక దీప్తి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఆ పరిస్థతిని అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందామెకు. ఒక పక్క వైద్యులు ప్రాణాంతకమని చెప్పి.. హుటాహుటినా అహ్మదాబాద్కు తరలించారు. ఏడు గంటల ప్రయాణం తర్వాత అతనికి చికిత్స మొదలైంది. ఇందులో నాలుగు ప్లాస్టిక్ సర్జరీలు, చర్మ మార్పిడి తదితరాలు ఉన్నాయి. ఇక్కడ దీప్తికి ఆస్ప్రతి భయం, ఆర్థిక భయం వెంటాడుతూనే ఉన్నాయి. కానీ జయ్ని బతికించుకోవాలంటే తాను ధైర్యంగా ఉండాల్సిందే. అంతటి పరిస్థితిని ఒక్కత్తే చక్కబెట్టుకుంటూ..తన వద్ద ఉన్న సొమ్ము, బంగారు తాకట్టు పెట్టి కొంత, స్నేహితుల వద్ద అప్పుగా కొంత ఇలా వచ్చిన సొమ్ముతో అతడికి విజయవంతంగా చికిత్స అందేలా చేసింది. అయితే ఆ ప్రమాదం జయ్ని శారీరకం, మానసికంగా చాలా బలహీనంగా మార్చేసింది. అతడిలో ఇదివరకటి వ్యక్తిలాంటి చురుకుదనం కోసం మళ్లీ చాలా గట్టిగా పోరాడాల్సి వచ్చింది. తన ముఖంలో నవ్వులు విరబూసిలే తను చేయగలిగిందంతా చేసి, మాములు మనిషిగా చేసింది. జయ్ రోజువారీ పనుల చేసుకోలేకపోయినా..ప్రాణాలతో మాత్రం దక్కించుకుంది. అయితే చుట్టు పక్కల వాళ్లు వయసు చిన్నదే కదా..అతడితో ఎందుకు మరో పెళ్లిచేసుకోమని చెబుతుండేవారు. పెళ్లి రెండేళ్ల కిందటే అయ్యిందేమో..మాది 14 ఏళ్లప్రేమ బంధం అని, అతడి చేతిని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలేది లేదని తెగేసి చెప్పింది దీప్తి. మరికొందరు జయ్ పరిస్థితికి దీప్తినే కారణమని నిందించేవారు కూడా. అయినా అవేమి లెక్కచేయక అతడిని ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటూ అసలైన దాంపత్యానికి నిలువెత్తు అర్థంలా మారిందామె. అంతేగాదు ఈ ప్రమాదం తర్వాతే తాము జీవించడం గురించి నేర్చుకున్నామని చెబుతోంది దీప్తి. ఇంతకముందు తామిద్దరం భవిష్యత్తు గురించి తపన పడి సంపాదన వైపు పరుగులు తీస్తే..ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి ఈ రోజు గురించి ఆలోచించలే చేసిందని చెబుతోంది. అంతేగాదు రేపే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చిన్న చిన్న ఆనందాలను సెలబ్రేట్ చేసుకోవడం ఎలాగో తెలిసింది, అలాగే తమకు బతుకు విలువ నేర్పిందని అంటోంది దీప్తి. నిజానికి అంతటి కష్టపరిస్థితుల్లో ఒకరికొకరుగా తోడుగా నిలిచి, ఆలుమగల బంధానికి అసలైన అర్థం ఏంటో చాటిచెప్పారు. కనీసం ఈ దంపతుల అన్యోన్యతకైనా ..ఆ విధి కరిగి మళ్లీ వాళ్ల జీవితాల్లో ఆనందం విరబూసేలా చేయాలని మనసారా కోరుకుందామా.!. View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) (చదవండి: తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..! కుమార్తె భావోద్వేగ పోస్ట్)
అంతర్జాతీయం
సముద్రమార్గాల భద్రతకు అంతర్జాతీయ కృషి
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పనిచేసి సముద్రమార్గాల భద్రతను కాపాడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఇంధనంతోపాటు ఆహారం, ఎరువుల రవాణా సాఫీగా జరిగేందుకు ఇది అత్యవసరమని ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని స్పష్టం చేశారు. ‘‘సాయుధ ఘర్షణల అత్యంత తీవ్రమైన మానవతా పరిణామాల్లో ఆహార కొరత ఒకటి. ఈనాటి ఘర్షణల ప్రభావం యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు మించి దూర ప్రాంతాలపైనా పడుతోంది’’అని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన ఉన్నతస్థాయి చర్చలో ఆయన మాట్లాడుతూ యుద్ధాల వల్ల ఇంధన మార్కెట్లు దెబ్బ తింటున్నాయి. ఎరువుల సరఫరా ప్రభావితమవుతోంది. సముద్ర రవాణా, మానవతా సహాయం, వ్యవసాయ వాణిజ్యానికి అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాంతంలో జరిగే ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పుగా మారుతున్నాయన్నారు. ఈ ప్రభావం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా ఉంటుందన్నారు. సాయుధ ఘర్షణల వల్ల జరుగుతున్న మానవీయ నష్టాన్ని తగ్గించడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తొలి ప్రాథమ్యం కావాలని కోరారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వాణిజ్య నౌకల రాకపోకలకు భద్రత, స్వేచ్ఛ కల్పించాలని చెప్పారు. కీలక సముద్ర మార్గాలు, మౌలిక సదుపాయాల రక్షణకు అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సాయుధ ఘర్షణలు చోటు చేసుకున్నది గత ఏడాదేనని, అదే సమయంలో ఆకలి సమస్య కూడా పెచ్చరిల్లిందని తెలిపారు. గత ఏడాది ఒకేసారి సూడాన్, గాజాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని ఐక్యరాజ్యసమితి తాజా ‘హంగర్ హాట్స్పాట్స్’నివేదిక ప్రస్తావిస్తూ చెప్పారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ –ఇరాన్ల యుద్ధం కొనసాగుతూండటం వల్ల హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు, ఘర్షణల కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని చెప్పారు.
హాలీవుడ్ స్టైల్లో రష్యా, అమెరికా సీక్రెట్ చర్చలు
ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా రష్యాల మధ్య తాజా పరిణామాలు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. వేర్వేరు వార్తా సంస్థలు, అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చీఫ్ తాజాగా మాస్కో వెళ్లి రష్యన్ ఇంటెలిజెన్స్ విభాగం క్రెమ్లిన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఇటీవలి కాలంలో అమెరికా – రష్యా దౌత్య సంబంధాలు కనిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ పర్యటన చోటు చేసుకోవడం.. అది కూడా అత్యంత రహస్యంగా జరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ రష్యా వచ్చారని, అధ్యక్షుడు పుతిన్ను కలవకపోయినప్పటికీ చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. ఏ ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం చెప్పలేదు. మరోవైపు ఈ చర్చలపై కానీ, డైరెక్టర్ రష్యా పర్యటనపై కానీ సీఐఏ కూడా నోరు మెదపడం లేదు. వైట్హౌస్ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అమెరికా మిలిటరీ విమానం మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో మంగళవారం ల్యాండ్ అయిందని, అదే రోజు తిరిగి వెళ్లిపోయిందని రష్యా అధికార వార్తా సంస్థలు తెలిపాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ‘‘ప్రతినిధి బృందం ఒకటి రష్య రాజధానికి వెళుతోంది. ఆ బృందం రష్యా నుంచి వెళ్లిపోయేదాకా దాడులకు విరామం ఇవ్వాలి’’అంటూ వాషింగ్టన్ నుంచి ఉక్రెయిన్కు ఆదేశాలు వెళ్లినట్లు ఉక్రెయిన్ అధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపారని సమాచారం. రష్యా మొత్తమ్మీద దాడులు ఆపాల్సిందిగా చెప్పలేదని, మాస్కో, సెయింట్ పీటర్స్బెర్గ్, రష్యా ఉత్తర ప్రాంతాల్లో మాత్రం జరక్కూడదని అమెరికా స్పష్టంగా చెప్పిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. సీఐఏ డైరెక్టర్ రష్యా పర్యటన వివరాలను మొట్టమొదట సీబీఎస్ ఛానెల్ బయటపెట్టింది. సంక్షోభంలోనే దౌత్య సంబంధాలు... నిఘా వర్గాల స్థాయిలో ఇరు దేశాల మధ్య కొన్ని సంబంధాలు ఉన్నప్పటికీ రష్యా, అమెరికా మధ్య దౌత్య సంబంధాల్లో మాత్రం సంక్షోభం కొనసాగుతోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ చెబుతున్నారు. సీఐఏ డైరెక్టర్ పర్యటన ప్రభావం ఇరుదేశాల సంబంధాలపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. అయితే సీఐఏ డైరెక్టర్ రష్యా రావడం చాలా అరుదైన విషయమని రష్యా భద్రతాదళాల విషయంలో నిపుణుడైన అండ్రే సోల్డటోవ్ చెబుతున్నారు. సాధారణంగా ఈ స్థాయి సమావేశాలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఏదైనా దెబ్బ తగులుతోందన్న సందర్భంలోనే జరుగుతాయని చెప్పారు.
నేపాల్లో భూకంపం.. వరద విలయం.. 157 మందికిపైగా జలసమాధి!
కఠ్మాండు/బీజింగ్/న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపం ధాటికి నేపాల్ చివురుటాకులా వణికిపోయింది. రాజధాని కఠ్మాండు సమీపంలోని రాసువా, దాడింగ్ జిల్లాల ఎగువ ప్రాంతంలో బుధవారం ఉదయం సంభవించిన భూకంపం తర్వాత పెను ఉపద్రవాన్ని మోసుకొచ్చింది. ఉదయం 8.37 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కొడారీ అనే చోట భూమికి 77 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి హిమాలయ పర్వతప్రాంతంలోని కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండల మీది గ్లేసియర్(హిమానీనదాలు)లోని భారీ స్థాయిలో మంచు ఒక్కసారిగా దిగువన ఉన్న భోటె కోశీ నదిలో పడింది. దీంతో మంచు కరిగి అనూహ్య రీతిలో నదీ ప్రవాహం, నీటి మట్టం పెరిగాయి. దీంతో మెరుపు వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చి దిగువన ఉన్న రాసువా, ధాడింగ్ జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు, డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, దుకాణ సముదాయాలను సర్వనాశనం చేసింది. 42 కి.మీ.ల పొడవైన కీలక బేద్రావతి–రసువాగఢి రోడ్డు కొట్టుకుపోయింది. నేపాల్ పర్వతప్రాంత రమణీయతను చూసేందుకు దేశవిదేశాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు ఈ మెరుపు వరదల్లో జలసమాధి అయ్యారు. 157 మందికిపైగా చనిపోయారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 750 మందికిపైగా పర్యాటకులు, స్థానికుల జాడ గల్లంతైంది. జాడ తెలీకుండా పోయిన వారిలో 133 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు టూరిస్ట్ కంపెనీలు, స్థానిక యంత్రాంగం గణాంకాలను బట్టి తెలుస్తోంది. నువాకోట్, ఛిటావన్ జిల్లాల్లోనూ మెరుపు వరదల భీభత్సం ఎక్కువగాఉంది. వరద ఉధృతికి సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు పేకమేడల్లా కూలాయి. కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అసలేం జరుగుతుందో తెలిసేలోపే అమాంతం వరద ముంచెత్తి జనం జలసమాధి అయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నేపాల్–చైనా సరిహద్దులోని రసువాగఢి చెక్పోస్ట్లో రెండంతస్తుల భవంతిని వరదనీరు రెప్పపాటులో సర్వనాశనం చేసిన వీడియో సోషల్మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వరదధాటికి ఇక్కడ నేపాల్–చైనా భూతల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉధృతికి నామరూపాలు కోల్పోయి, బురదలో కూరుకుపోయి ఆ ప్రాంతాలన్నీ భీతావహంగా మారాయి. ఎటు చూసినా అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, సాయం కోసం అరి్థస్తున్న జనం హాహాకారాలతో ఆ ప్రాంతాల్లో విషాద వాతావరణం రాజ్యమేలుతోంది. భోటె కోశీ నదీజలాలు తర్వాత తిబూరే ప్రాంతంలో త్రిశూలి నదిలోకి రావడంతో దాని కారణంగానూ ఒకింత విధ్వంసం పెరిగింది. బుధవారం రాత్రినాటికి ఏడు జిల్లాల్లో 95 మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నారు. బిహార్, యూపీలో అలర్ట్ నేపాల్ వరద నీటితో గండక్ నదిలో నీటి మట్టం పెరిగే ఆస్కారం ఉండటంతో బిహార్, ఉత్తర ప్రదేశ్లో స్థానికయంత్రాంగాలు నదీపరీవాహక ప్రాంతాలోని ప్రజలను అప్రమత్తంచేశాయి. దిగువ ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు. అవసరమైతే తగు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. గండక్ నదిపై ఒక బరాజ్లో 36 గేట్లను ఎత్తి నీళ్లను కిందకు వదిలేస్తున్నారు. వరదనీటి ముప్పు ఉండే ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సహాయక బృందాలకు యూపీ సీఎం యోగి సూచించారు. చైనా ఆపన్న హస్తంతమ అధీనంలోని టిబెట్లోని సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ వరద విలయం ఎక్కువగా ఉండటంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విస్తృతస్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టాలని ఆర్మీకి ఆదేశాలిచ్చారు.మానస సరోవర్ యాత్రికులు సైతంఅమెరికా, మలేసియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, దక్షిణకొరియా పర్యాటకుల జాడ తెలీడంలేదని నేపాల్ టూరిజం బోర్డ్ తెలిపింది. టిబెట్లోని కైలాస్ మానస సరోవర్ను దర్శించుకునేందుకు యాత్రకు వచ్చిన 77 మంది భారతీయుల జాడ సైతం తెలీడంలేదని సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ వెల్లడించింది. దీంతో భారతీయుల జాడ కనిపెట్టి ఎలాగైనా క్షేమంతా స్వదేశానికి తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం భరోసా ఇచ్చింది. 341 మంది పర్యాటకులు, 291 మంది విదేశీయులు, 62 మంది నేపాలీల జాడ తెలీడంలేదని నేపాల్ టూరిజం బోర్డ్ ప్రకటించింది. 24న నేపాల్ పర్యటనకు వెళ్లిన పశ్చిమబెంగాల్లోని ఆరామ్బాగ్కు చెందిన 65 మంది పర్యాటకులు సైతం వరద ప్రాంతంలో చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.పూర్తి సాయం చేస్తాం: ప్రధాని మోదీ వరద విలయం వార్త తెలియగానే నేపాల్ ప్రధాని బాలేంద్రకు భారత ప్రధాని మోదీ ఫోన్చేసి మాట్లాడారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నట్లు ఆయనతో మోదీ చెప్పారు. మిత్రదేశమైన నేపాల్కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సదాసిద్ధంగా ఉన్నట్లు మోదీ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటికే భారత వాయుసేన విమానాల్లో అత్యవసర ఉపకరణాలు, ఔషధాలు, ఆహారం, ఇతర సామగ్రిని నేపాల్కు తరలిస్తున్నారు. కష్టకాలంలో నేపాలీ సోదర, సోదరీమణులకు అండగా ఉంటామని తర్వాత మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు సైతం నేపాల్కు తరలివెళ్లే ఆస్కారముంది. అదనపు సాయం కోసం సీ–17 గ్లోబ్మాస్టర్, లాక్హీడ్ సీ–130 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు భారీ సంఖ్యలో భారతీయులు నేపాల్లో గల్లంతుకావడం, వరద ప్రాంతాల్లో చిక్కుకోవడంతో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని మోదీ సర్కార్కు విపక్ష కాంగ్రెస్ సూచించింది.రంగంలోకి నేపాల్ ఆర్మీ... విషయం తెల్సి నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ బలగాలు, నేపాల్ పోలీసులు, జాతీయ విపత్తు స్పందన బలగాలు, అగ్నిమాపక సిబ్బంది, డ్రోన్లు మెరుపు వేగంతో రంగంలోకి దిగి బాధితులను కాపాడేందుకు అన్వేషణ, సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నాయి. వీళ్లను కాపాడే క్రమంలో ఇప్పటికే 80 మంది భద్రతా బలగాలు, 44 నేపాల్ సైనికులు సైతం గల్లంతైనట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించారు. త్రిశూలి ప్రాంతంలో 80 మందిని ఆర్మీ హెలికాప్టర్లు కాపాడాయి. ఇప్పటిదాకా 300 మందిని కాపాడినట్లు ప్రధాని బాలేంద్ర తెలిపారు. గాయపడిన వారిని సమీప ఎగువ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాలు పర్వతసానువుల వద్ద ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. రాసువా ప్రాంతంలో కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు వచ్చాయన్న వార్తల్లో నిజం లేదని మంత్రి శిశిర్ స్పష్టంచేశారు. పరిస్థితిని దేశ ప్రధాని బాలేంద్ర షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఎలాన్ మస్క్కు ఉక్రెయిన్ అత్యున్నత పురస్కారం!
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ను ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్’ పురస్కారంతో సత్కరించారు. మనుషుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడటంలో చేసిన సేవలు, అలాగే ఉక్రెయిన్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందించారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మస్క్ అందించిన స్టార్లింక్ సేవలు ఉక్రెయిన్కు ఎంతో ఉపయోగపడ్డాయి.2022లో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్లో అనేక కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉక్రెయిన్ సైనికులు, కమాండర్లు, పౌరులకు కీలక కమ్యూనికేషన్ మార్గంగా మారింది. సైనిక కార్యకలాపాల్లో కూడా స్టార్లింక్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్లను నియంత్రించడం, దూర ప్రాంతాల్లో వాటితో కనెక్షన్ కొనసాగించడం వంటి కార్యకలాపాలకు ఇది సహాయపడుతోంది. దీంతో రష్యా సైనిక సరఫరా, లాజిస్టిక్స్పై ఉక్రెయిన్ ఒత్తిడి పెంచగలిగింది.అయితే.. మస్క్ పాత్ర ఉక్రెయిన్కు ప్రయోజనంతో పాటు కొన్ని సమస్యలను కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తన భూభాగంలో స్టార్లింక్ను ఉపయోగించగలుగుతున్నప్పటికీ, రష్యా భూభాగంలో దాని వినియోగంపై పరిమితులు ఉన్నాయి. రష్యాపై దూరప్రాంత డ్రోన్ దాడులకు కూడా స్టార్లింక్ ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. కానీ.. మస్క్ మాత్రం అలా చేయడం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా.. రష్యా దళాలు అనధికారికంగా ఉపయోగిస్తున్న కొన్ని స్టార్లింక్ టెర్మినల్స్ను బ్లాక్ చేయడానికి స్పేస్ఎక్స్ చర్యలు తీసుకుంది.
జాతీయం
నీలి రంగుతో యాడ్... లైసెన్సులు ఔట్!
జైపూర్: లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ ప్రభుత్వం తొమ్మిది ఏఆర్టీ/ఐవీఎఫ్ కేంద్రాల లైసెన్సులు రద్దు చేసింది. ఈ కేంద్రాలన్నీ ఒకే ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇటీవల ఈ ఆసుపత్రి ఇచ్చిన ఒక పత్రికా ప్రకటనలో నీలిరంగు లో ఉన్న శిశువుల ఫొటోలు ఉండటంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. నీలి రంగు అనేది మగ శిశువులను ఉద్దేశించిందని, ఆ రంగుతో కూడిన పిల్లల ఫొటోలు పెట్టడం ద్వారా ఆ ఆసుపత్రి పరోక్షంగా లింగనిర్ధారణ చేస్తామని సూచించినట్లు అయ్యిందని అధికారులు వివరిస్తున్నారు.ఈ వ్యవహారం గురించి తెలిసిన వెంటనే సోమవారం తాము చర్యలు తీసుకున్నామని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిమ్సర్ తెఇపారు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరొగసి సరీ్వసుల నిబంధనలను ఉల్లంఘించినట్ల ప్రాథమికంగా నిర్ధారణ అవడం ఇందుకు కారణమని తెఇలపారు. నీల్కాంత్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ కేర్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ తొమ్మిది కేంద్రాలను నడుపుతున్నట్లు తెలిసింది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ నియంత్రణ చట్టం 2021 కింద కేంద్రాలపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ గాయత్రీ రాథోర్ తెలిపారు. ఐవీఎఫ్, ఫెర్టిలిటీ, టెస్ట్ట్యూబ్ సరీ్వసులపై ఆ ఆసుపత్రి ఒక ఇంగ్లీషు పత్రిక జైపూర్ ఎడిషన్లో ప్రకటన ఇచ్చిందని, ఇందులో నీలిరంగు పిరుదులున్న శిశువుల ఫొటోలు ఉన్నాయని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రకారం... ఈ నీలి రంగు మగ శిశువును సూచిస్తుంది. ఈ ప్రకటన ద్వారా ఆసుపత్రి లింగ నిర్ధారణ పరీక్షలపై పరోక్ష సంకేతాలిచ్చిందని వివరించారు. చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు సరికాదన్నది తెలిసిందే. సస్పెన్షన్కు గురైన కేంద్రాల్లో భిల్వారాలోని లెవల్–1 ఏఆర్టీ క్లినిక్, కోట, ఉదయ్పూర్, అజీ్మర్, జోధ్పూర్లలో ఒకొక్కటి చొప్పున లెవెల్–2 ఏఆర్టీ క్లినిక్లు ఉన్నాయి. వీటితోపాటు జైపూర్లోని మరో ఏఆర్టీ లెవెల్–2 క్లినిక్, సరొగసి క్లినిక్, ఏఆర్టీ బ్యాంకుల లైసెన్సులు కూడా రద్దయ్యాయి.
రాజస్తాన్ ఏసీజేపై సుప్రీం జడ్జి ఫిర్యాదు
న్యూఢిల్లీ: రాజస్తాన్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆరోపణలు గుప్పించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ సంజీవ్ అధికార దురి్వనియోగానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు మూడు సార్లు లేఖలు రాశారు. జస్టిస్ సంజీవ్ కోర్టు పరిపాలనా వ్యవహారాల్లో పూర్తిగా విఫలమయ్యారని, బంధు ప్రీతి చూపిస్తున్నారని, తప్పుడు తీర్పులు ఇస్తున్నారని ఆగస్ట్ 2, 10, 17 తేదీల్లో రాసిన లేఖల్లో ఆరోపించారు. సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల, సంపన్నుల జోక్యమున్న కేసులనే తాను విచారణకు తీసుకుంటూ మిగతా కేసులను ఇతర ధర్మాసనాలకు సిఫార్సుచేస్తూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆ లేఖల్లో పేర్కొన్నారు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హోదాలో కేసులను ఏఏ జడ్జీలకు కేటాయించాలనే మాస్టర్ ఆఫ్ రోస్టర్ నిబంధనను ఈయన యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, తక్షణం శాశ్వత ప్రాతిపదికన వేరే రాష్ట్రానికి చెందిన జడ్జీని రాజస్తాన్ హైకోర్టుకు సీజేగా నియమించాలని లేఖల్లో జస్టిస్ మెహతా కోరారు. దీనిపై తగు బలమైన సాక్ష్యాధారాలు ఉంటే సమర్పించాలని ఈయనకు సీజేఐ సూర్యకాంత్ సూచించారు. జస్టిస్ మెహతా గతంలో ఇదే రాజస్థాన్ హైకోర్టులో జడ్జిగా సేవలందించి పదోన్నతితో సుప్రీంకోర్టులో జడ్జి అయ్యారు. పదేళ్ల క్రితం జస్టిస్ సంజీవ్ రాజస్తాన్ హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత పట్నా హైకోర్టుకు, తర్వాత పంజాబ్, హరియాణా హైకోర్టుకు బదిలీ అయి మళ్లీ చివరకు రాజస్తాన్ హైకోర్టుకే వచ్చారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. మొత్తం 12 మంది సభ్యులుండే ఈ బోర్డును ఆగస్టు 30 నాటికి పునర్ వ్యవస్థీకరించే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. యువ నాయకులతో పాటు ముగ్గరు లేక నలుగురు ప్రస్తుత ముఖ్యమంత్రులకు ఇందులో చోటు కల్పించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 మంది సభ్యుల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మరో 8 మంది ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టి పెట్టుకొని పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త బోర్డులో మార్పులు చేపట్టనున్నారు. బోర్డు లో అవకాశం దక్కనున్న వారిలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన కు ఆర్ఎస్ఎస్తో ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు ఒక కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా జాతీయ రాజకీయాల్లో ఫడ్నవీస్ పాత్ర మరింత పెరిగే అవకాశం ఉంది. ఈయనతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, బెంగాల్ సీఎం సువేందు అధికారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ముగ్గురు లేక నలుగురు సీఎంలను బోర్డులోకి తీసుకుంటే ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను తప్పించే అవకాశం ఉందంటున్నారు. పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణలో ప్రాంతాలు, వివిధ సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిథ్యం కల్పించడంపైనా దృష్టి పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన ఇద్దరు నేతలు బీఎస్ యడ్యూరప్ప, తెలంగాణకు చెందిన ఎంపీ కె.లక్ష్మణ్ ప్రస్తుతం బోర్డులో సభ్యులుగా ఉన్నారు. వీరిలో తిరిగి ఒక్కరికే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మొన్నటి బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఎవరికీ ప్రాతినిథ్యం దక్కని దృష్ట్యా లక్ష్మణ్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. బోర్డు తర్వాత సీఈసీ.. బోర్డు పునర్వ్యవస్థీకరణ తర్వాత బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీలో పార్లమెంటరీ బోర్డు సభ్యులందరితో పాటు ఇతర ముఖ్య నా యకులు కూడా ఉంటారు. ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్, మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న రూప్ కుమారి చౌదరి, కేంద్ర ఎన్నికల కమిటీలో పదవీ రీత్యా సభ్యురాలిగా మారనున్నారు. నితిన్ గడ్కరీ ఫడ్నవిస్, యాదవ్లను సభ్యులుగా కొనసాగిస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.
లంచాలను సమానంగా పంచుకుందామంటూ ప్రమాణం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలువురు కౌన్సిలర్లు లంచాల ద్వారా వచ్చిన డబ్బును తమలో తాము నిజాయితీగా పంచుకుంటామని ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో మున్సిపల్ సంస్థ విచారణకు ఆదేశించింది.వీడియోలో ఒక మున్సిపల్ కౌన్సిలర్ గంగాజలం ఉన్న పాత్రను పట్టుకుని, లంచాల ద్వారా వచ్చిన డబ్బును 60 మందికి సమానంగా పంచుకుంటామని ప్రమాణం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి ప్రమాణం చేయిస్తుండగా.. చేతుల్లో నీటితో కొంతమంది నిలబడి ఆయన చెప్పిన మాటలను పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వారిని మున్సిపల్ కౌన్సిలర్లుగా గుర్తించారు. అయితే వీడియో నిజమైనదా, అందులో కనిపిస్తున్న వ్యక్తులు ఎవరు అనే విషయాలను స్వతంత్రంగా ఏ వార్తా సంస్థా ధ్రువీకరించలేదు.ఆ వీడియోలో ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చిన డబ్బును 60 మంది కౌన్సిలర్లకు సమానంగా పంచుకోవాలని పేర్కొన్నారు. తమలో ఎవరైనా ఇబ్బందుల్లో పడితే అందరూ ఐక్యంగా నిలబడతామని కూడా ఆ బృందం ప్రమాణం చేసినట్లు చెబుతున్నారు. ప్రమాణాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని ద్రోహిగా పేర్కొంటూ వీడియోలో అభ్యంతరకరమైన వ్యాఖ్య కూడా ఉంది.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో కౌన్సిలర్లపై అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఒక కౌన్సిలర్ ఆస్తులు పెరిగినట్లు కొంతమంది వినియోగదారులు చెప్పారు. 3 ఏళ్ల క్రితం ఆ వ్యక్తికి ఒక ఇల్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు అనేక ఇళ్లు, విలాసవంతమైన వాహనాలు సంపాదించారని వారు ఆరోపించారు.మున్సిపల్ కమిషనర్ సౌమ్య గురురాణి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వీడియోను 2025 నవంబర్లో, మరో మున్సిపల్ కమిషనర్ బాధ్యతల్లో ఉన్న సమయంలో చిత్రీకరించినట్లు సమాచారం అందిందని తెలిపారు. “అయినప్పటికీ, మేము విచారణకు ఆదేశించాం” అని ఆమె చెప్పారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.UP councillors in Shahjahanpur reportedly took a Gangajal oath to equally share the municipal corporation’s earnings, sparking allegations of corruption and questions over public money. pic.twitter.com/P4dt07sFw4— Ground Eye 🇮🇳 (@TapasyaYaa83081) August 25, 2026
ఎన్ఆర్ఐ
27 ఏళ్లుగా అమెరికాలోనే.. ICE అదుపులో ఎన్నారై మహిళ!
అమెరికాలో 27 ఏళ్లుగా నివసిస్తున్న ఓ భారత సంతతి మహిళకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా (గ్రీన్కార్డ్) ఉన్నప్పటికీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆమెను అదుపులోకి తీసుకుంది. అంతేకాదు.. ఆమెపై గతంలో కొనసాగిన డిపోర్టేషన్ కేసును ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఇప్పటికే కొట్టివేసినప్పటికీ ఈ అరెస్టు జరగడం చర్చనీయాంశంగా మారింది.వెంకట నరసమాంబ వాసంశెట్టి అనే మహిళను ఆగస్టు 11న సాధారణ చెక్-ఇన్కు హాజరైన సమయంలో ICE అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను జార్జియాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచినట్లు సమాచారం. 2013 నుంచి ఆమెకు అమెరికాలో లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ (LPR) హోదా ఉంది.క్రిమినల్ రికార్డ్ లేదు..వాసంశెట్టి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడింది. నార్త్ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా ఆమె పనిచేసినట్లు ఆమె కుటుంబ న్యాయవాది వెల్లడించారు. ఆమెకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, ఇద్దరు అమెరికా పౌరులైన పిల్లలు, ఇద్దరు అమెరికా పౌరులైన మనవళ్లు ఉన్నారని తెలిపారు.ఆమె ఇల్లు, ఉద్యోగం, కుటుంబం మొత్తం అమెరికాలోనే ఉన్నాయని.. గ్రీన్కార్డ్ను వదులుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతున్నారు.ఏడు నెలలు భారత్లో ఉన్నందుకేనా?వాసంశెట్టి 2022 జూలైలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆమెకు కోవిడ్ సోకడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని న్యాయవాదులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో దాదాపు రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. దీంతో ఆమె అమెరికాకు తిరిగి రావడం ఆలస్యమైంది. చివరకు 2023 ఫిబ్రవరిలో రాలీ-డర్హామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అమెరికాకు చేరుకున్నారు. మొత్తం మీద ఆమె సుమారు ఏడు నెలలు భారత్లో ఉన్నారు. అయితే.. ఈ వ్యవధినే అమెరికా ప్రభుత్వం ఆమె గ్రీన్కార్డ్ హోదాను ప్రశ్నించడానికి ప్రధాన కారణంగా చూపినట్లు సమాచారం. అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం వల్ల శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే ఉద్దేశం ఉందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలించవచ్చు.‘అమెరికాను వదిలే ఉద్దేశమే లేదు’అయితే వాసంశెట్టి మాత్రం అమెరికాలో తన జీవితాన్ని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు సమర్పించారు. భారత్కు వెళ్లిన సమయంలోనూ అమెరికాలో తన ఉద్యోగం, కుటుంబం, ఇల్లు వంటి సంబంధాలను కొనసాగించారని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాదు.. భారత్లో ఉన్న సమయంలోనే నార్త్ కరోలినాలో తన ప్రధాన నివాసంగా ఉపయోగించుకునే ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. తల్లిదండ్రుల అనారోగ్యం, తన ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన తాత్కాలిక ప్రయాణాన్ని అమెరికా శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే నిర్ణయంగా చూడలేమని వాదించారు.కోర్టు కేసు కొట్టేసినా.. మళ్లీ అరెస్టువాసంశెట్టిపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) డిపోర్టేషన్ చర్యలు ప్రారంభించింది. అయితే కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించేందుకు కోర్టు విధించిన గడువులో DHS విఫలమైందని ఆమె న్యాయవాది తెలిపారు. దీంతో 2026 మే 19న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఆమెపై కొనసాగుతున్న డిపోర్టేషన్ ప్రక్రియను ముగించారు. ఆ తర్వాత కూడా ఆమెకు విధించిన ICE చెక్-ఇన్లకు క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చారు. అలా ఆగస్టు 11న చెక్-ఇన్కు వెళ్లిన సమయంలోనే ICE అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.‘ఆమె గ్రీన్కార్డ్ హోల్డర్ కాదు’వాసంశెట్టిని అదుపులోకి తీసుకున్న తర్వాత ICE మాత్రం ఆమె గ్రీన్కార్డ్ హోల్డర్ కాదని వాదిస్తున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆగస్టు 13న ఆమె తరఫు న్యాయ బృందం అత్యవసర హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఫెడరల్ న్యాయమూర్తి.. ఆమెను నిర్బంధించడానికి ఉన్న చట్టపరమైన ఆధారాలను మూడు రోజుల్లో వివరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించారు.తర్వాత ఏం జరగొచ్చు?తాజా కోర్టు పరిణామాల ప్రకారం.. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశం వెలువడలేదు. అయితే కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, వాసంశెట్టికి బెయిల్పై విడుదల కావచ్చా? అనే అంశాన్ని పరిశీలించేందుకు ఇమ్మిగ్రేషన్ జడ్జి ఎదుట బాండ్ హియరింగ్ జరిగే అవకాశం ఉంది.27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ.. గ్రీన్కార్డ్ ఆధారంగా జీవనం సాగిస్తున్న ఓ భారత సంతతి మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు అమెరికాలోనే కాకుండా భారతీయ సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తాత్కాలికంగా విదేశాల్లో ఎక్కువకాలం ఉండటం వల్ల గ్రీన్కార్డ్ హోదాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది.
నాట్స్ వినూత్న సేవ కార్యక్రమం
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ చాప్టర్ సభ్యులు వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సెయింట్ లూయిస్ ప్రాంతీయ ఫుడ్ బ్యాంకాక్లో జరిగిన ప్రత్యేక ఆహార సేకరణ, ప్యాకేజింగ్ కార్యక్రమంలో నాట్స్ టీమ్ చురుగ్గా పాల్గొని సేవలు అందించింది. పేదలు, నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ వాలంటీర్లు, తెలుగు కుటుంబాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ నార్త్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాలలతో పాటు చాప్టర్ ప్రతినిధులు మధుసూధన్ దడ్డాల, నరేష్ రాయంకుల తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు. తెలుగు సమాజానికి, అలాగే స్థానిక అమెరికన్ సమాజానికి సహాయం చేయడంలో నాట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాట్స్ నాయకులులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆకలితో ఉన్నవారికి బాసటగా నిలవడం ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాట్స్ వాలంటీర్లకు, నాట్స్ సభ్యులకు నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం)
డాలస్లో ‘హర్ ఘర్ తిరంగా’.. మార్మోగిన దేశభక్తి గీతాలు
డాలస్, టెక్సస్: డాలస్ పరిసర ప్రాంతం ఇర్వింగ్ నగరంలో నెలకొనియున్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకం వద్ద “హర్ ఘరంగ్ తిరంగా” అనే నినాదంతో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల స్వాగత శుభాకాంక్షలతో భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ముందుగా సంగీత గురు సమీరా శ్రీపాద దర్శకత్వంలో వారి శిష్యులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక భారతదేశభక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి “భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సర్వం త్యాగం చేసిన అనేకమంది అమరవీరులకు మహాత్మాగాంధీ, నెహ్రు, వల్లభభాయి పటేల్, నేతాజీ, వీర సావర్కార్, భగత్ సింగ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి నేతలు చేసిన త్యాగాలు మరువలేనివి అంటూ ప్రవాస భారతీయలగా అమెరికా దేశ చట్టాలను గౌరవిస్తూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. “ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యల్ జపంటా మాట్లాడుతూ “రెండు ప్రముఖ ప్రజాసామ్య దేశాలైన అమెరికా, భారత్ల మధ్య ధృడమైన సంబంధాలు నెలకొల్పడంలో ప్రవాస భారతీయలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని, ఈ రోజు భారత జాతీయగీతంతో పాటు, అమెరికా జాతీయగీతం కూడా ఆలపించడం సబబుగా ఉందంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు.”ప్రత్యేకఅతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ “ప్రవాస భారతీయలు మాతృభూమికి వేల మైళ్ళ దూరంలో ఉన్నా వారి హృదయాలకు భారతదేశం ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటుందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరదేశంలో విస్తరిస్తూ, భారతదేశ ప్రగతికి తోడ్పడుతున్న వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. భారతదేశ విముక్తి కోసం సర్వం త్యాగం చేసిన వేలాదిమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వారికి ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు.గత 79 సంవత్సరాలలో భారతదేశంలో అక్షరాస్యత 12 శాతంనుండి 81 శాతానికి పెరిగిందని, ఒకప్పుడు ఆహార కొరతతో బాధపడిన దేశం ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తి దారులలో ఒకటిగా మారిందని, విశ్వవిద్యాలయాల సంఖ్య 20 నుంచి 1, 200కు పైగా పెరిగిందని, విమానాశ్రయాల సంఖ్య 12 నుంచి 166 కు పెరిగిందని, ఫార్మసీ రంగంలో ఎంతో ప్రగతి సాధించి కోవిడ్ సమయంలో ఎన్నో దేశాలకు సైతం కోవిడ్ టీకాలను అందించే స్థాయికి చేరామని అన్నారు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు అని మరో వైపు రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, మెరుగైన వైద్య సేవల కొరత, అవినీతి, నల్లధనం లాంటి సమస్యలతో దేశం సతమతమవుతుందని అన్నారు. భారతదేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ముఖ్యమని, ఎవరికి తోచిన విధంగా వారు వేర్వేరు రంగాలలో సహకారం అందించాలని కోరారు.”ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ కవి, సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు త్రివర్ణ పతాకంపై ఒక పద్యాన్ని శ్రావ్యంగా గానం చేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు వామరాజు సత్యమూర్తి ప్రవాస భారతీయులందరికి 80వ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలలో భారతదేశ రక్షణలో సైనికులగా సేవలందించి అమెరికాలో స్థిరపడిన కల్నల్ రాకేష్ శర్మ, కల్నల్ హరవిందర్ బింద్రాలను, అలాగే 8 సంవత్సరాలలోపు పిల్లలకు కొలంబియా దేశంలో నిర్వహించిన చెస్ పోటీలలో అమెరికా దేశంనుండి పాల్గొని పాన్ అమెరికన్ చాంపియన్ గా నిల్చి, సువర్ణ పతకం సాధించిన సరయు తలపనేని ని ఇర్వింగ్ మేయర్ అల్ జపంటా, డా. ప్రసాద్ తోటకూర ఇతర అతిథులు ఘనంగా సన్మానించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కో ఛైర్మన్ తాయబ్ కుండావాలా తన వందన సమర్పణలో ఈ కార్యక్రమం విజయవంతంగావడానికి సహకరించిన సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.బోర్డు సభ్యులు కలై, మురళి వెన్నం, ముర్తుజా, రాజేంద్ర వంకావాలా, తిరుమల్ రెడ్డి, అనంత్ మల్లవరపుతో సహా ఎం.వి.ఎల్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పూర్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా. కె. అరవిందరావు, వందలాది ప్రవాస భారతీయులు ఈ స్వాతంత్రదినోత్సవ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం “ఇండియా టుడే” రెస్టారెంట్ వారు అందరికీ రుచికరమైన అల్పాహారం అందజేశారు.
బెర్లిన్లో ఘనంగా భారత్ దివస్ వేడుకలు
బెర్లిన్: జర్మనీలోని భారతీయ ప్రవాసులు ఆగస్టు 16న బెర్లిన్లోని చారిత్రక బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద భారత్ దివస్ను ఘనంగా నిర్వహించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్మనీ నలుమూలల నుంచి భారతీయ సంఘాలు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భారతదేశ ఐక్యత, వైవిధ్యం, గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. తెలంగాణ అసోసియేషన్ చైర్పర్సన్, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చెల్లిగంటి, యూపీ అసోసియేషన్కు చెందిన డాక్టర్ అఖిల్ అగర్వాల్, కాశ్మీరీ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన వీణా చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జర్మనీలోని పలు భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సంస్థలు చురుకైన సహకారం అందించాయి.ఈ వేడుకలకు జర్మనీలో భారత రాయబారి అజిత్ గుప్తా తన సతీమణితో కలిసి హాజరయ్యారు. భారత రాయబార కార్యాలయానికి చెందిన కాన్సులర్ మంత్రి స్టాలిన్ బాబు చీకట్ల, పర్సనల్ మంత్రి డాక్టర్ మందీప్ సింగ్ తులితో పాటు పలువురు ప్రముఖ అధికారులు, అతిథులు పాల్గొన్నారు.బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద వందలాది మంది భారతీయ ప్రవాసులు ఒకచోట చేరడంతో దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో కూడిన ప్రత్యేక వాతావరణం నెలకొంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశంలోని భిన్నత్వాన్ని చాటుతూ, అందరినీ త్రివర్ణ పతాకం కింద ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి.అనంతరం బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి శాంతి స్తూపం వరకు యూనిటీ వాక్ నిర్వహించారు. శాంతి, స్నేహం, ఐక్యత, పరస్పర సహకారం అనే సందేశాన్ని ఈ వాక్ ద్వారా చాటారు.జర్మనీలోని భారతీయ సమాజానికి ఈ వేడుక ఒక గర్వించదగిన, చిరస్మరణీయమైన సందర్భంగా నిలిచింది. భారతదేశం పట్ల తమ అనుబంధాన్ని, ఉమ్మడి వారసత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని ప్రవాస భారతీయులు ఘనంగా చాటుకున్నారు.చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం
క్రైమ్
ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...
పటమట(విజయవాడతూర్పు): బీటెక్ చదివిన సూరవరపు షకీనా(24) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమవారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు. భీమవరానికి చెందిన షకీనాకు రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం
తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ జయప్రకాష్ నగర్కు చెందిన పడికిటి లక్ష్మీతేజ(30) హైదరాబాద్లో అమెజాన్ కంపెనీలో ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆమెకు తండ్రి రామ్ప్రసాద్, తల్లి కవిత, తమ్ముడు దేవివరప్రసాద్ ఉన్నారు. మిలాద్ ఉన్నబీ, రాఖీ, వీకెండ్ వరుస సెలవులు కావడంతో ఆమె తమ్ముడికి రాఖీ కట్టేందుకు విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆనందంగా బయలుదేరారు. మంగళవారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి బుధవారం ఉదయం ఆరు గంటలకల్లా విజయవాడలో ఉంటానని సంతోషంగా చెప్పింది. కూతురి కోసం ఏడు గంటల వరకు వేచి చూసిన తల్లిదండ్రులు కూతురుకు ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో ఏం జరిగిందో తెలీక కంగారు పడ్డారు. ఇంతలో కోదాడ సమీపంలో ప్రమాదం జరిగిందని టీవీలో వార్తలు ప్రసారం కావడం, మృతుల జాబితాలో లక్ష్మీతేజ పేరు ఉండడంతో తండ్రి రాంప్రసాద్ హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే లక్ష్మితేజ మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురిలో ఉంచారు. రాత్రి ఫోన్ చేసి ఉదయానికి వస్తాను నాన్న అని చెప్పిన నా కూతురిని ఇలా చూస్తానని అనుకోలేదని రాంప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి తీసుకొచ్చిన కూతురు మృతదేహంపై పడి తల్లి కవిత విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇంటికి వచ్చినప్పుడల్లా నీ కాళ్ల పట్టీలు కావాలమ్మా.. అని అడిగేదానివి కదా.. లే అమ్మా పట్టీలు ఇస్తాను. తమ్ముడికి రాఖీ కడుదువుగానీ అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. గత రెండేళ్ల నుంచి లక్ష్మితేజకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని, ఈ ఏడాది ఎలాగైనా కల్యాణం జరిపించాలని అనుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.చదవండి: ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...
నోటరీ కోసం వెళితే.. చంపేసి బంగారం దోపిడీ
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఓ మహిళా న్యాయవాది ఇంటికి ఫ్యామిలీ సర్టిఫికెట్ నోటరీ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈనెల 17న జరిగిన ఈ దురాగతానికి సంబంధించిన వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం వెల్లడించారు. ఆ వివరాలు.. జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన వృద్ధురాలు చింతు చిన్నమ్మడు (74) ఒంటినిండా బంగారం ధరించి ఈనెల 17న నరసన్నపేటలోని మహిళా న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్లింది. ఆమె నుంచి బంగారం దోచుకోవాలనే అత్యా శతో ధనలక్ష్మి తన సోదరుడు బెండి అచ్యుతరావు (స్టాంపు వెండర్), పెద్ద కుమారుడు గణేష్ (న్యాయవాది)తో కలిసి హత్యకు పథకరచన చేసింది. వృద్ధురాలిని వాష్రూమ్లోకి తీసుకెళ్లి సుత్తితో తలపై మోది చంపేసిన అనం తరం మరో ఇద్దరి సాయంతో శవాన్ని గోనె సంచిలో పెట్టి అద్దె కారులో హిర మండలం పిండ్రువాడ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి తంపర కాలువలో పడేశారు. ధనలక్ష్మి రెండో కుమారుడు మణికంఠ (సాఫ్ట్వేర్ ఇంజినీర్), అచ్యుతరావు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. ఘాతుకం బయటపడిందిలాహతురాలు చిన్నమ్మడు కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. ఈనెల 11న స్వగ్రామైన అల్లాడపేటకు వచ్చిన ఆమె 17న అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్రామంలో బంధువుల ఇంట్లో పెళ్లి రాటవేసే కార్యక్రమం ఉండటంతో నగలు ధరించి వెళ్లిందని, ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫి కెట్ నిమిత్తం నోటరీ చేసేందుకు ఈ ఏడాది మేలో పరిచయమైన న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్తానని కుటుంబీకులకు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ దిశగా జలుమూరు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. ఈ నెల 17న ఉదయం 11.30 గంటలకు నరసన్నపేట పోలీస్స్టేషన్ మీదుగా ఆ వృద్ధురాలు నడుచుకుంటూ సమీపంలోనే ఉన్న న్యాయవాది ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లింది. ఆ ఫుటేజీలో వృద్ధురాలు తిరిగి రావడం కనిపించలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో న్యాయవాది ఇంటికి ఓ కారు వచ్చింది. సీడీఆర్ విశ్లేషణతో పాటు డాగ్స్కా్వడ్ బృందంతో తనిఖీలు చేయగా న్యాయవాది ఇంటి పరిసరాల్లోనే తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. కారు ట్రాకింగ్ హిస్టరీ బట్టి పోలీసులు నిందితులను విచారించగా హత్యోదంతం బయటపడింది. న్యాయవాదులు కావడంతో చేసిన నేరాలనుంచి ఎలా తప్పించుకోవాలో ప్రణాళిక రచించి కారును కెమికల్ లిక్విడ్తో శుభ్రపరిచారు. రక్తపు ఆధారాలు, ఇతర కీలకమైనవి చెరిపేశారు. ఆ న్యాయవాది జంట హత్యల కేసులో నిందితురాలునిందితుల్లో ఒకరైన ధనలక్ష్మి 2008లో జరిగిన జంట హత్యల కేసులో నిందితురాలని, అప్పుడు కూడా బంగారం కోసం హత్య చేశారని ఎస్పీ చెప్పారు. నిందితుల నుంచి రూ.38 లక్షల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఘోర రోడ్డు ప్రమాదం
కోదాడ, కోదాడ రూరల్/సాక్షిప్రతినిధి, విజయవాడ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై సగం రోడ్డుమీద, సగం డివైడర్పై ఆగిపోయిన ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్డ్రైవర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (టీఎస్ 08యుఎల్ 5112) 42 మంది ప్రయాణికులతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూర్యాపేట సమీపంలోని చార్జింగ్ స్టేషన్ వద్ద ఆపి బస్సు చార్జింగ్ పెట్టుకున్నారు. ఈ సమయంలో మొదటి డ్రైవర్ డ్యూటీ దిగి రెండో డ్రైవర్కు బస్సు అప్పగించాడు. హైదరాబాద్ నుంచి విజయవాడవైపు ఐరన్ పిల్లర్లలోడ్తో వెళ్తున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కోదాడ శివారులో అదుపుతప్పి డివైడర్పైకి సగం వెళ్లి ఆగింది. ఆ తర్వాత 48 నిమిషాలకు కోదాడ శివారుకు చేరుకున్న బస్సు డ్రైవర్ ట్రాలీ లారీని గమనించకుండా వెనుకవైపు నుంచి వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాలీ లారీలో ఉన్న ఐరన్ పిల్లర్లు బస్సులోకి చొచ్చుకురావడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ సీటు వెనుక సీట్లలో ఉన్న యాసారపు చిన్ని(32), బొల్లిపోగు మేరీ జ్యోత్స్న (29), సూరవరపు షకీనా(24), చెన్నకేశవుల నాగేంద్రబాబు(31), పడికిటి లక్ష్మీతేజ (30), కొండూరు భావన వర్ష(23) అక్కడిక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ రూరల్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణారెడ్డి, పలువురు ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ ఘటనాస్ధలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాలీ లారీతోనే..కోదాడ దాటిన తరువాత కిలోమీటరు దూరంలో ఇనుప పిల్లర్ల లోడ్తో వెళుతున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదానికి గురై డివైడర్మీదకు దూసుకెళ్లింది. సగం టైర్లు రోడ్డుమీద, సగంటైర్లు డివైడర్పై ఉన్నాయి. లారీ డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక బోర్డులూ పెట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి అరగంట ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా ట్రాలీ లారీని ఢీకొట్టబోయి తృటిలో తప్పించుకుంది. ఆ బస్సుకు స్వల్పంగా గీతలు పడ్డాయి.ఆ బస్సు డ్రైవర్ తన బస్సును పక్కకు ఆపి ట్రాలీ లారీ వద్దకు వచ్చి డ్రైవర్ను తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు పెట్టాలని గట్టిగా చెప్పి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ బస్సు వెళ్లిన 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టంమీద వెలికితీశారు. కోదాడ వైద్యశాలకు తరలించారు. పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.మృతుల్లో ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులే..మృతి చెందిన ఆరుగురిది ఉమ్మడి కృష్ణా జిల్లా. వీరిలో యాసరపు చిన్ని, భావనవర్ష, షకీనా మినహా మిగిలిన ముగ్గురూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. షకీనా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి చేరారు.క్షతగాత్రుల వివరాలు» విజయవాడకు చెందిన యాసరపు సుధాకర్, కేతు రమణమ్మ, ఆదిలాబాద్కు చెందిన రాథోడ్ విశాల్లకు గాయాలు కావడంతో వారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, ఉన్నం యశ్వంత్ సూర్యాపేట ఏరియా వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు.» తాడేపల్లిగూడెంకు చెందిన పెద్దోజు భవానీకి తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. » విజయవాడకు చెందిన గరికపాటి మనోహర్, ఏలూరుకు చెందిన బండి చందన, సాయిల అనిల్కుమార్, సుంకర విజయలక్ష్మి, కరిషపోగు వంశీ, ఆకుల నవీన్కుమార్, జి.వి. ధృవకుమార్, ఎం.జేసన్కుమార్ విజయవాడలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రేపల్లి వేదవ్యాస్ ఏలూరు ఆంధ్ర వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. గాయపడిన వారిలో వరంగల్కు చెందిన జి.అవినాష్ ఉండగా.. ఆయన ఎక్కడ చికిత్సపొందుతున్నాడన్న వివరాలు తెలియరాలేదు.అన్నయ్యకు రాఖీకట్టాలని... మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రమాదంలో మరణించిన కొండూరు భావన వర్ష(23)ది విజయవాడ. హైదరాబాద్లో హెచ్ఆర్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు తండ్రి కృష్ణారావు, తల్లి సుభాíÙణి ఉన్నారు. వీరు అజిత్సింగ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో జ్యూయలరీ వర్క్షాపు ఉంది. దీంతో మంగళవారం మకాం అడవినెక్కలంకు మార్చారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్ సౌదీలో పనిచేస్తున్నారు. ఆయన రాఖీ పండగ కోసం వస్తుండడంతోపాటు తనకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉండాలని భావించిన భావన వర్ష చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడకు బయలుదేరారు. ముందు వేరే బస్సుకు టికెట్ బుక్ చేసుకున్న ఆమె ఆ బస్సు వెళ్లిపోవడంతో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కారు. రూమ్మేట్స్ బుధవారం వెళ్లొచ్చుకదా అన్నా.. సోదరుడికి రాఖీ కట్టాలని, అన్నయ్య వచ్చేటప్పటికే తాను అక్కడ ఉండాలని ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్సులో విజయవాడ మధురానగర్లోని తాతయ్య బ్రహ్మయ్య ఇంటి వద్దకు తీసుకురావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అమ్ములూ ఒక్కసారి కళ్లుతెరువమ్మా అంటూ ఆమె తల్లి, పెద్దమ్మలు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. సోదరుడు రెశ్వంత్ సౌదీ నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.చేతికందివచ్చిన కొడుకు అనంతలోకాలకు...పమిడిముక్కల: చెన్నకేశవుల నాగేంద్రబాబు(31)ది కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి. హైదరాబాద్లో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఈయన తండ్రి నరసింహారావు, తల్లి విజయలక్ష్మి. నాగేంద్రబాబుకు ఓ సోదరి ఉంది. ఆమెకు ఇటీవలే వివాహం చేశారు. ప్రస్తుతం బాబాయి కొడుకు(తమ్ముడు) పెళ్లికని హైదరాబాద్ నుంచి ప్రైవేటు బస్సులో ఉత్సాహంగా బయలుదేరిన నాగేంద్రబాబు మార్గమధ్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అసువులుబాశాడు. లంకపల్లికి తీసుకొచ్చిన నాగేంద్రబాబు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. చేతికందివచ్చిన కొడుకు అండగా ఉన్నాడనుకుంటున్న సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని, ఇక తమను ఎవరు పట్టించుకుంటారంటూ కన్నీరుమున్నీరయ్యారు. చిన్న రైతు కుటుంబమైనా బాగా చదివించుకున్నామని, రోజూ ఫోన్ చేసి తమ ఆరోగ్య వివరాలు అడిగేవాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని రోదించారు.ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి... పటమట(విజయవాడతూర్పు): బీటెక్ చదివిన సూరవరపు షకీనా(24) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమవారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు. భీమవరానికి చెందిన షకీనాకు రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు.రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రిని చూసి వస్తూ...గన్నవరం: రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రిని చూసేందుకు హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తున్న ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని(32) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తేలప్రోలు గ్రామంలోని సుందరయ్యనగర్లో కుటుంబంతోపాటు చిన్ని నివసిస్తుంది. ఆమె భర్త సుధాకర్ తేలప్రోలు సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్. వీరికి ఇద్దరు కుమారులు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. భర్త, పిల్లలతో ఆనందంగా జీవిస్తున్న ఆమె తండ్రి హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. తండ్రిని చూసేందుకు పదిహేను రోజుల క్రితం చిన్ని హైదరాబాద్ వెళ్లారు. ఆమెను తీసుకువచ్చేందుకు భర్త సుధాకర్ సోమవారం వెళ్లారు. ఇద్దరూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గ్రామానికి బయలుదేరారు. కోదాడ సమీపంలో జరిగిన ప్రమాదంలో చిన్ని అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త సుధాకర్ గాయాలతో బయటపడ్డాడు. చిన్ని మృతితో సుందరయ్యకాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నతల్లి మృతి చెందిన విషయం తెలుసుకుని ఇద్దరు చిన్నారులు బోరున విలపించారు. వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు.తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువుమొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ జయప్రకాష్ నగర్కు చెందిన పడికిటి లక్ష్మీతేజ(30) హైదరాబాద్లో అమెజాన్ కంపెనీలో ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆమెకు తండ్రి రామ్ప్రసాద్, తల్లి కవిత, తమ్ముడు దేవివరప్రసాద్ ఉన్నారు. మిలాద్ ఉన్నబీ, రాఖీ, వీకెండ్ వరుస సెలవులు కావడంతో ఆమె తమ్ముడికి రాఖీ కట్టేందుకు విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆనందంగా బయలుదేరారు. మంగళవారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి బుధవారం ఉదయం ఆరు గంటలకల్లా విజయవాడలో ఉంటానని సంతోషంగా చెప్పింది. కూతురి కోసం ఏడు గంటల వరకు వేచి చూసిన తల్లిదండ్రులు కూతురుకు ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో ఏం జరిగిందో తెలీక కంగారు పడ్డారు. ఇంతలో కోదాడ సమీపంలో ప్రమాదం జరిగిందని టీవీలో వార్తలు ప్రసారం కావడం, మృతుల జాబితాలో లక్ష్మీతేజ పేరు ఉండడంతో తండ్రి రాంప్రసాద్ హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే లక్ష్మితేజ మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురిలో ఉంచారు. రాత్రి ఫోన్ చేసి ఉదయానికి వస్తాను నాన్న అని చెప్పిన నా కూతురిని ఇలా చూస్తానని అనుకోలేదని రాంప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి తీసుకొచ్చిన కూతురు మృతదేహంపై పడి తల్లి కవిత విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇంటికి వచ్చినప్పుడల్లా నీ కాళ్ల పట్టీలు కావాలమ్మా.. అని అడిగేదానివి కదా.. లే అమ్మా పట్టీలు ఇస్తాను. తమ్ముడికి రాఖీ కడుదువుగానీ అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. గత రెండేళ్ల నుంచి లక్ష్మితేజకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని, ఈ ఏడాది ఎలాగైనా కల్యాణం జరిపించాలని అనుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.ఏడాదిన్నర బిడ్డను చూసేందుకు వస్తూ..గుణదల(విజయవాడ తూర్పు)/పెనమలూరు: విజయవాడ అరుళ్నగర్కు చెందిన బొల్లిపోగు మేరీజ్యోత్స్న (29) తండ్రి సాల్మన్ రాజు విజయవాడ లో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి, తల్లి నిర్మలా కుమారి గృహిణి. రెండేళ్ల క్రితమే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వంశీతో పెళ్లయింది. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఇవాన్ ఉన్నాడు. బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, దీనికోసం తానూ కష్టపడతానని జ్యోత్స్న భర్తకు చెప్పారు. దీంతో హైదరాబాద్లోనే కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరారు. బిడ్డను విజయవాడ కానూరు తులసీనగర్లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దే ఉంచారు. ఆమెకు తమ్ముడు రాహుల్ కూడా ఉన్నాడు ఇటీవల వర్క్ఫ్రం హోం చేస్తున్న జ్యోత్స్న అప్పుడప్పుడు హైదరాబాద్లోని కార్యాలయానికి వెళ్లివస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఆమె మంగళవారం రాత్రి తిరిగి విజయవాడ కానూరుకు ట్రావెల్ బస్సులో బయలుదేరారు. బిడ్డను చూడాలని బయలుదేరే ముందు భర్తతో చెప్పారు. అయితే మార్గమధ్యంలోనే కోదాడ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డను చూడాలని ఆశగా బయలుదేరిందని, అతడి భవిష్యత్తు కోసం తానూ కష్టపడతానని చెప్పిందని, సాఫీగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా తల్లకిందులైందని ఆమె భర్త వంశీ, తల్లిదండ్రులు విలపించారు. విజయవాడ అరుళ్ నగర్కు తరలించి అంతిమ సంస్కారాలు చేశారు. ఇదిలా ఉంటే తెల్లవారు జామున 4.48 గంటలకు ఫోన్ మెసేజ్ అలర్ట్తో కోదాడ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైందని తెలిసిందని, వెంటనే ట్రావెల్స్ సంస్థ టోల్ఫ్రీకి ఫోన్ చేస్తే స్పందించలేదని జ్యోత్స్న సోదరుడు రాహుల్ విమర్శించాడు.తీవ్ర విషాదకరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్సాక్షి, అమరావతి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, విషమ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
వీడియోలు
IRUMUDI పై డిస్ట్రిబ్యూటర్స్ కుట్ర..? మండిపడుతున్న Fans
హిమాలయాల్లో జలప్రళయం.. 160 మందికి పైగా మృతి
చిలకలూరిపేట బస్సు యాక్సిడెంట్.. బాధితులకు విడదల రజిని పరామర్శ
నువ్వు అసలు మనిషివేనా.. జగన్ రాఖీ పౌర్ణమి ABN వార్త
ఐఏఎస్ ల మధ్య నువ్వా.. నేనా? ఏపీలో ముదిరిన విభేదాలు
పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖ రేవ్ పార్టీలో టీడీపీ నేతలు రచ్చ.. నాగార్జున యాదవ్ స్టాంగ్ రియాక్షన్
కైలాస యాత్రికులపై ప్రకృతి పగ.. భారతీయ యాత్రికుల జాడెక్కడ ?
23 రోజుల తర్వాత జాడ లభ్యం.. 7 మంది మత్స్యకారులు సేఫ్..!
Shocking Video: ప్రాణాల కోసం పరుగులు.. నేపాల్ లో భయానక దృశ్యాలు..

