ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,శ్రావణ మాసం, తిథి: శు.పంచమి రా.6.58 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: హస్త ఉ.6.47 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: ప.3.06 నుండి 4.45 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.19 వరకు తదుపరి ప.3.00 నుండి 3.50 వరకు, అమృత ఘడియలు: రా.1.04 నుండి 2.43 వరకు, గరుడ పంచమి.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.23రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం.... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.వృషభం... ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. విద్యార్థులకు శ్రమాధిక్యం..మిధునం.. పనులు మందగిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు ఫలితాలపై అసంతృప్తి చెందుతారు.కర్కాటకం... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం.సింహం.... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.కన్య..... విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. యత్నకార్యసిద్ధి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.తుల.... పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వృశ్చికం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు.ధనుస్సు... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మకరం... వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.కుంభం... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన.మీనం... కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. దైవదర్శనాలు.
వీటి ‘హోల్డింగ్’ వ్యూహాత్మకమే!
హోల్డింగ్ కంపెనీల్ని మార్కెట్ పెద్దగా ఇష్టపడదు. ఎందుకంటే సొంతగా పెద్ద వ్యాపారమేదీ ఉండదు. ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి... వాటిపై వచ్చే డివిడెండ్లే ఆదాయంగా నెట్టుకొస్తూ ఉంటాయి. ఆ వాటాల విలువ పెరిగితే... ఈ కంపెనీల విలువా పెరుగుతుంది. అంతే. కాబట్టే నేరుగా వ్యాపారం చేసే కంపెనీల షేర్లపైనే ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. మరి సొంతగా మంచి వ్యాపారం చేస్తూనే, ఇతర సంస్థల్లోనూ వాటాలున్న కంపెనీల సంగతేంటి? ఒకవైపు ప్రధాన వ్యాపారం నుంచి ఆదాయం వస్తుంది. మరోవైపు పెట్టుబడులపై డివిడెండ్లూ వస్తాయి. భవిష్యత్తులో ఆ కంపెనీల వాటా విలువ పెరిగితే... అదో అదనపు ప్రయోజనం. వీటన్నిటికీ తోడు... ఇలాంటి కంపెనీలు కొన్నిసార్లు వాటి మొత్తం ఆస్తుల విలువతో పోలిస్తే (బుక్ వేల్యూ) మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంటాయి. అంటే.. వ్యాపారమూ ఉంది. పెట్టుబడులూ ఉన్నాయి. భవిష్యత్తులో విలువ అన్లాక్ అయ్యే అవకాశమూ ఉంది. కాబట్టి ఇవి సాధారణ హోల్డింగ్ కంపెనీలు కావు. వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీలు. ఇలాంటి కంపెనీల గురించి వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్... ఇన్ఫో ఎడ్జ్... ఈఐడీ ప్యారీ... మహీంద్రా అండ్ మహీంద్రా, గోద్రెజ్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టూబ్రో... ఇవన్నీ ఇన్వెస్టర్లకు సుపరిచితమైన కంపెనీలే. విశేషమేంటంటే ఇన్వెస్టర్లు చాలామంది వీటి ప్రధాన వ్యాపారాన్నే చూస్తుంటారు. ఎప్పటికప్పుడు అవి ప్రకటించే ఫలితాలను విశ్లేషిస్తుంటారు. కానీ వీటికి రకరకాల కంపెనీల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ల సంగతేంటి? ఆ కంపెనీల్లో వాటాల విలువ మాటేంటి? ఆ విలువంత ఈ కంపెనీ షేర్లలో ప్రతిఫలిస్తోందా? అనేది పెద్దగా చూడరు. అలా చూసి ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మెరుగైన రాబడులొస్తాయనేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ కంపెనీల షేర్లను కొంటే... వాటికి ఇన్వెస్ట్మెంట్లున్న మొత్తం ఎకో సిస్టమ్లో పెట్టుబడి పెట్టినట్లే. కాబట్టి దాని విలువ పెరిగే అవకాశాలూ ఎక్కువే. ఇలాంటి కంపెనీల గురించి వివరంగా చూద్దాం.ది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీకి అచ్చమైన ఉదాహరణ మురుగప్ప గ్రూప్నకు చెందిన ఈ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే బీఎస్ఏ ఎస్ఎల్ఆర్తో పాటు మోంట్రా, హెర్క్యులిస్ వంటి సైకిళ్లన్నీ ఈ కంపెనీ బ్రాండ్లే. వీటి తయారీతో పాటు లిస్డెట్ కంపెనీలైన సీజీ పవర్, శాంతి గేర్స్లో దీనికి మెజారిటీ వాటాలున్నాయి. శాంతి గేర్స్ను ఈ మధ్యనే డీలిస్ట్ చేశారు కూడా. వీటితో పాటు మోంట్రా ఎలక్ట్రిక్, క్లీన్ మొబిలిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థల్లో మెజారిటీ వాటాలున్నాయి. సైకిళ్లతో పాటు ఇంజినీరింగ్, మెటల్ ఉత్పత్తులు, మొబిలిటీ, ఈవీ, పారిశ్రామిక పరికరాల తయారీని వంటి వ్యాపారాలను కంపెనీ నేరుగా నిర్వహిస్తోంది కూడా. ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రస్తుతం సీజీ పవర్ మార్కెట్ విలువ ఒక్కటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ విలువను దాటేసింది. మరి సీజీ పవర్లో దాదాపు 56 శాతానికి పైగా వాటా కలిగి ఉన్న ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్కు... ఇతర కంపెనీల్లోని వాటాలను, సొంత వ్యాపారాలను జోడిస్తే విలువ పెరుగుతుంది కదా? అంటే హోల్డింగ్ కంపెనీ తరహాలో మార్కెట్ దీనికి తక్కువ విలువే ఇస్తోందని స్పష్టమవుతోంది. మరి భవిష్యత్తులో ఈ అన్లిస్టెడ్ కంపెనీలు లిస్ట్ అయినా... వాటి విలువ పెరిగినా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు ధర కూడా పెరుగుతుందనటంలో అతిశయోక్తి లేదు కదా? అందుకే దీన్ని ఇన్వెస్ట్మెంట్కు తగిన వ్యూహాత్మ హోల్డింగ్ కంపెనీగా భావించవచ్చు. ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) నౌఖ్రీ, 99 ఏకర్స్, జీవన్సాథీ, శిక్షా వంటి ఇంటర్నెట్ సంస్థలు ఈ కంపెనీ సొంతం. ఇవన్నీ ఆయా రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నవే. మంచి ఆదాయాన్ని సాధిస్తున్నవే. ఏఐ వచ్చాక వీటి వ్యాపారాలు కొద్దిమేరకు తగ్గుతున్న మాట వాస్తవమే అయినా... ఏఐలో ఇన్వెస్ట్మెంట్లు చేయటం ద్వారా కంపెనీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది. పైపెచ్చు జొమాటో, పాలసీ బజార్, అడ్డా 247, షాప్ కిరాణాతో సహా బోలెడన్ని స్టార్టప్స్లో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. జొమాటో, పాలసీ బజార్లో ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు ఇప్పటికే బ్లాక్ బస్టర్ ఫలితాలనిచ్చాయి. మిగతా వాటిలోనూ కొన్నింటి విలువ బాగా పెరిగింది. ఒకరకంగా దీన్ని లిస్టెడ్ వెంచర్ క్యాపిటల్ ప్లాట్ఫామ్గా భావించవచ్చు. దాంతోపాటు లాభాలిచ్చే అర్థవంతమైన వ్యాపారాలూ ఉన్నాయి. అందుకే ఈ కంపెనీ షేరు బాగా పెరిగి... ప్రస్తుతం ఏఐ బూమ్లో కొంత కరెక్షన్కు గురైంది. ఈఐడీ ప్యారీ.. తక్కువ ధరకే..? ఈ కంపెనీని చాలామంది షుగర్ తయారీ కంపెనీగానే చూస్తారు. చక్కెర, బెల్లం, న్యూట్రాస్యూటికల్స్, బయో ఉత్పత్తుల్ని విక్రయించే ఈ కంపెనీకి సొంత చక్కెర రిఫైనరీ ఉంది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. వీటన్నిటినీ మించి... ఎరువుల తయారీలో అగ్రగామి అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్లో ఈ కంపెనీకి దాదాపుగా 56 శాతానికిపైగా వాటా ఉంది. ఆ వాటా విలువ ఒక్కటే దాదాపుగా రూ.35వేల కోట్లు. పైపెచ్చు ఇండియన్ పొటాష్ కంపెనీలో సైతం దాదాపుగా రూ.400 కోట్ల విలువైన వాటాలున్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఈఐడీ ప్యారీ షేరు ధర తక్కువే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈఐడీ ప్యారీ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపుగా రూ.13వేల కోట్ల దగ్గర్లో ఉంది. మరి కోరమాండల్లో రూ.35వేల కోట్లు, ఇండియన్ పొటాష్ లో రూ.400 కోట్ల పెట్టుబడులతో పోల్చినా ఇది తక్కువే కదా? పైపెచ్చు షుగర్ కంపెనీగా దేశవ్యాప్తంగా చక్కటి వ్యాపారం ఉంది. లాభాలు ఆర్జిస్తోంది. అందుకే వ్యూహాత్మక ఇన్వెస్ట్మెంట్కు ఇలాంటి సంస్థలు మెరుగైనవన్నది నిపుణుల సూచన. మహీంద్రా అండ్ మహీంద్రా... ఎం అండ్ ఎం మాత్రం వీటన్నింటికీ భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే దీనికి హోల్డింగ్ కంపెనీగా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులతో పాటు... బలమైన వ్యాపారమూ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సరీ్వసెస్, మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, స్వరాజ్ ఇంజిన్స్ లిమిటెడ్, మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్, మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్ లిమిటెడ్, ఎస్ఎంఎల్ ఇసుజు వంటి లిస్టెడ్ కంపెనీల్లో మెజారిటీ వాటాలు ఎం అండ్ ఎం సొంతం. ఇక టెక్ మహీంద్రా, సీఐఈ ఆటోమోటివ్ ఎగ్జిట్లో మైనారిటీ వాటాలున్నాయి. ఇవికాక చాలా అన్లిస్టెడ్ సంస్థలు దీనికి నూరుశాతం అనుబంధ కంపెనీలుగా ఉన్నాయి. ఈ పెట్టుబడులు, వాటాలను పక్కనబెడితే... ఎం అండ్ ఎం వాహనాల తయారీలో అగ్రగామి. ట్రాక్టర్లలో లీడర్. ఈవీ మొబిలిటీలో కంపెనీ వేగంగా ఎదుగుతోంది. అంటే.. ఒక ఎం అండ్ ఎం షేరు కొంటే దాదాపుగా కంపెనీకి చెందిన గ్రూపు సంస్థలన్నింటినీ హోల్డ్ చేస్తున్నట్లే లెక్క. భవిష్యత్తులో వీటి వాటాల విలువ పెరగటంతో పాటు అన్లిస్టెడ్ కంపెనీలు కూడా లిస్టయితే ఎం అండ్ ఎం విలువ కూడా పెరుగుతుంది కదా!. అందుకే దీన్ని వ్యూహాత్మక ఇన్వెస్ట్మెంట్కు తగిన హోల్డింగ్ కంపెనీగా భావించవచ్చు. లార్సన్ అండ్ టూబ్రో ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో ఇది లీడర్. ఈపీసీ కాంట్రాక్టుల్లో అగ్రగామి. మెట్రో రైళ్లతో సహా భారీ నిర్మాణాల్లో కంపెనీది తిరుగులేని రికార్డు. వీటన్నిటితో పాటు ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఫైనాన్స్, ఎల్ అండ్ టీ సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ వ్యాపారాల్లో మెజారిటీ వాటాలున్నాయి. ప్రస్తుత విలువను బట్టి చూస్తే ఎల్ అండ్ టీ షేరును దాని వాస్తవ వ్యాపారాన్ని బట్టే విలువ కడుతున్నారన్నది నిపుణుల మాట. మరి దీని వాటాల విలువను కూడా లెక్కిస్తే!!. భవిష్యత్తులో కూడా ఈ విలువలు పెరుగుతూ ఉంటాయి కనక దీన్ని వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇవే కాదు. ఇలా విశ్లేషిస్తూ వెళితే చాలా హోల్డింగ్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్కు తగినవిగానే కనిపిస్తాయి. గోద్రెజ్ ఇండస్ట్రీస్ను తీసుకుంటే దీనికి ఓలియో కెమికల్స్, కెమికల్స్ వ్యాపారాలతో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్, గోద్రెజ్ ప్రాపర్టీస్ సహా ఇతర గ్రూపు కంపెనీల్లో వాటాలున్నాయి. కిర్లోస్కర్ ఇండస్ట్రీస్కు సొంత వ్యాపారాలతో పాటు కిర్లోస్కర్ గ్రూపు కంపెనీల్లో వాటాలున్నాయి. కల్యాణి ఇన్వెస్ట్మెంట్స్, మహారాష్ట్ర స్కూటర్స్, కేశోరామ్ ఇండస్ట్రీస్.. వీటన్నిటిదీ ఇదే స్టోరీ. కేశోరామ్ ఎప్పటికప్పుడు తన ఇన్వెస్ట్మెంట్లను అన్లాక్ చేస్తూ షేర్ హోల్డర్ల వాటా విలువ పెంచుతోంది. కాబట్టి ఇవన్నీ వాచ్లిస్ట్లో పెట్టుకోవాల్సినవే. హోల్డింగ్కంపెనీలు తక్కువ ధరకే ఎందుకు వస్తాయంటే... → క్యాపిటల్ గెయిన్స్ పన్నును కూడా మార్కెట్లు పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే ఒక కంపెనీకి వేరొక కంపెనీలో ఉన్న మొత్తం వాటాను విక్రయించేసిందనుకోండి. ఆ వచి్చన సొమ్ముపై దాదాపు 12.5 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను చెల్లించాలి. అంటే ఆ మేరకు వాటాల విలువను తక్కువగానే చూడాలి కదా!. → హోల్డింగ్ కంపెనీలు తమ వాటాలను విక్రయించటం అంత తేలికకాదు. దాదాపుగా అసాధ్యం కూడా. మరి హోల్డింగ్ చేయటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులున్నపుడు వాటికి పూర్తిగా విలువ కట్టడమెందుకన్నది మార్కెట్ భావన. అందుకే హోల్డింగ్ కంపెనీలు దాదాపుగా వాటి విలువకన్నా 30–40 శాతం తక్కువకే ట్రేడవుతూ ఉంటాయి. → కాబట్టి ఇన్వెస్టర్లు వీటిని విశ్లేషించేటపుడు దానికి లిస్టెడ్ కంపెనీల్లో ఉన్న వాటాల విలువెంత? అన్లిస్టెడ్ సంస్థల్లో ఉన్న వాటాల విలువెంత? సొంతగా అది చేస్తున్న వ్యాపార విలువెంత? అనేది చూడాలి. క్యాష్– ఇన్వెస్ట్మెంట్లు– రుణాలు, హోల్డింగ్ కంపెనీకి మార్స్క్ ఇచ్చే 30–40% డిస్కౌంట్ అన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే ఆ కంపెనీ విలువను నిర్ణయించుకోవాలి. అప్పటికీ తక్కువ ఉంటే... దాన్ని తక్షణ ఇన్వెస్ట్మెంట్కు తగ్గట్టుగా చూడొచ్చు. లేనిపక్షంలో భవిష్యత్తులో అన్లాక్ అయ్యే విలువను దృష్టిలో పెట్టుకుని అందులో పెట్టుబడి పెట్టొచ్చు. రమణమూర్తి మంథా
డ్రైనేజీ కాల్వలో బంగారు నాణేలు
బ్రస్సెల్స్: బెల్జియంలో మురుగునీటి కాల్వల పునరుద్ధరణ పనులు చేస్తున్న కార్మీకులకు దాదాపు రూ.98 కోట్ల విలువైన బంగారం దొరికింది. రాజధాని బ్రస్సెల్స్లోని సింట్–గిల్లిస్–డెండర్మాండేలో భూగర్భ డ్రైనేజీ పైపుల పునరుద్ధరణ కోసం మురికికాల్వ తవ్వుతుండగా కార్మీకులకు బంగారు నాణేలు కనిపించాయి. చిన్న నాణేలు కావడంతో అంతగా పట్టించుకోలేదు. తవ్వకాలు కొనసాగించగా మరిన్ని బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్న అధికారులు నిధిని బ్రస్సెల్స్లోని ఒక సురక్షిత కేంద్రానికి తరలించారు. నిధి మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిధి దొరికిన స్థలం 19వ శతాబ్దం చివరలో బ్రూవరీ యజమాని థియోఫిలస్ వాన్ అస్చే కోసం నిర్మించిన ఒక గొప్ప విల్లా. నేలమాళిగ గోడ లోపల ఒక సంచిలో ఈ నిధిని భద్రపరిచారు. ఇందులోనే ఇవన్నీ దొరికాయి.
సింధు ‘సిక్సర్’ కొడుతుందా!
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ గత దశాబ్దన్నర కాలంగా తమదైన ముద్ర వేసింది. 2011నుంచి ప్రతీ టోర్నీలో కనీసం ఒక పతకమైనా భారత్ గెలుస్తూ వస్తోంది. ఇదే జోరును కొనసాగించే క్రమంలో సొంతగడ్డపై ఈ మెగా టోర్నీకి మన ఆటగాళ్లు సిద్ధమయ్యారు. నేటినుంచి ఆగస్టు 23 వరకు న్యూఢిల్లీలో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ జరుగుతుంది. 2009 (హైదరాబాద్) తర్వాత ఈ టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండో సారి. భారత స్టార్ పీవీ సింధు మహిళల సింగిల్స్లో అత్యధిక (5) పతకాలు గెలిచిన ప్లేయర్గా జాంగ్ నింగ్ (చైనా)తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆరో పతకంతో శిఖరాన నిలిచే లక్ష్యంతో ఆమె బరిలోకి దిగుతోంది. ఇటీవల జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ గెలిచిన ఆమె పూర్తి ఫిట్తో చక్కటి ఫామ్లో ఉంది. సెమీస్ చేరే క్రమంలో వాంగ్ జి యి, పుత్రి కుసుమవంటి ప్రత్యర్థులను ఆమె దాటాల్సి ఉంటుంది. మరో వైపు పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడి కూడా పతకాన్ని ఆశిస్తోంది. గాయాలనుంచి కోలుకొని మళ్లీ కోర్టులోకి అడుగు పెడుతున్న ఈ జంటపై మంచి అంచనాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్లో తొలి రౌండ్లో వరల్డ్ నంబర్వన్ షి యు ఖితో తలపడుతున్న ఆయుశ్ శెట్టి, ఇటీవల ఫామ్లో లేని లక్ష్య సేన్, మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా సంచలనంపై దృష్టి పెట్టారు. మహిళల డబుల్స్లో కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతూనే టోర్నీకి అర్హత సాధించిన గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ ఎలాంటి ఫలితం సాధిస్తారో చూడాలి.
డిఫెన్స్ బలగాల కోసం బజాజ్ ‘ప్రోషీల్డ్’ వాహన బీమా
బంగారం కొనాలా...ఆగాలా...
కాలువలోకి దూసుకెళ్లిన కారు
మద్యం మత్తులో మృత్యు క్రీడ
విశాఖ ఎయిర్పోర్టుకు వీడ్కోలు
భారత్ పరుగుల జోరు
జూడాల సమ్మె తీవ్రం
బలపడిన అల్పపీడనం
చాంపియన్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్
పోలీసుల కారులో గంజాయి, మద్యం
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్క్రిస్ట్
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
సాక్షి కార్టూన్: 15-08-2026
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
ఉన్నవే 26 ఐమ్యాక్స్ స్క్రీన్లు.. మరి జక్కన్న ప్లానేంటి..?
బోనాల్లో పాల్గొన్నందుకు ట్రోలింగ్.. ఏడ్చేసిన తెలుగు హీరోయిన్
వెండితెరపై మరో నట వారసుడు.. హీరోగా గ్రాండ్ ఎంట్రీ!
ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఫ్యామిలీ పోషణ కోసం చీర, జాకెట్ కట్టుకున్నా: నటుడు
బంగారం, వెండి కొనుగోళ్లకు కొత్త పోర్టల్
డిఫెన్స్ బలగాల కోసం బజాజ్ ‘ప్రోషీల్డ్’ వాహన బీమా
బంగారం కొనాలా...ఆగాలా...
కాలువలోకి దూసుకెళ్లిన కారు
మద్యం మత్తులో మృత్యు క్రీడ
విశాఖ ఎయిర్పోర్టుకు వీడ్కోలు
భారత్ పరుగుల జోరు
జూడాల సమ్మె తీవ్రం
బలపడిన అల్పపీడనం
చాంపియన్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్
పోలీసుల కారులో గంజాయి, మద్యం
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
ప్చ్.. యథా రాజా తథా ప్రజా!!
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్క్రిస్ట్
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
సాక్షి కార్టూన్: 15-08-2026
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
ఉన్నవే 26 ఐమ్యాక్స్ స్క్రీన్లు.. మరి జక్కన్న ప్లానేంటి..?
బోనాల్లో పాల్గొన్నందుకు ట్రోలింగ్.. ఏడ్చేసిన తెలుగు హీరోయిన్
వెండితెరపై మరో నట వారసుడు.. హీరోగా గ్రాండ్ ఎంట్రీ!
ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఫ్యామిలీ పోషణ కోసం చీర, జాకెట్ కట్టుకున్నా: నటుడు
బంగారం, వెండి కొనుగోళ్లకు కొత్త పోర్టల్
ఫొటోలు
పద్ధతిగా 'హిట్' సినిమా హీరోయిన్ (ఫొటోలు)
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు)
భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు)
నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు)
‘హుషారు పిట్టలు’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
శ్రీహరి కొడుకు మేఘాంశ్ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ (ఫొటోలు)
హైదరాబాద్లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు)
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం (ఫొటోలు)
‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సినిమా
ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఈ జానర్లో డిఫరెంట్ మూవీస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలానే సలార్, వారణాసి చిత్రాల ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఓ సినిమా.. స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువత్తు ప్రధాన పాత్రలు చేసిన 'ఐ నోబడీ' సినిమాకు నిస్సామ్ బషీర్ దర్శకుడు. షార్ప్ సోషల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ గత నెల 10న థియేటర్లలో రిలీజైనప్పటికీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఓటీటీలో కాబట్టి కచ్చితంగా ఆడియెన్స్ చూసే అవకాశముంది. ఇప్పుడీ చిత్రం ఈనెల 25 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. దొంగతనం, డబ్బులు మాయం చేయడం లాంటి హీస్ట్ థ్రిల్లర్స్ ఇష్టముంటే దీన్ని మిస్ కావొద్దు.'ఐ నోబడీ' విషయానికొస్తే.. రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియట్లో పనిచేసే ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా(పార్వతి), ఇద్దరు కూతుర్లతో పెద్దగా హడావిడి లేకుండా బతికేస్తుంటాడు. ఓరోజు ఇదే ఊరిలో బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. అదే టైంకి బ్యాంక్లో ఉన్న రాజీవన్ని కొట్టి, దొంగలు తమతోపాటు కారులో బందీగా తీసుకొని వెళ్తారు. దారిలో ఇతడ్ని వదిలేయాలని అనుకుంటారు కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో రాజీవన్ బతికిపోయి దొంగలు స్పాట్లోనే చనిపోతారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. అంతా ఓకే గానీ దోపీడికి గురైన రూ.17 కోట్ల డబ్బు మాయమవుతుంది. ఆ డబ్బు ఏమైంది? ఎవరు తీశారు? రాజీవన్ హస్తం ఉందా? చివరకు పోలీసులకు డబ్బు దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పృథ్వీరాజ్ 'ఐ, నోబడీ' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by JioHotstar Malayalam (@jiohotstarmalayalam)s
బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు!
తెలుగు రియాలిటీ షోల్లో బిగ్బాస్ ఒకటి. ఇప్పటివరకు 9 సీజన్లు జరగ్గా 7వ సీజన్ విజేతగా రైతుబిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే తను గెలుచుకున్న డబ్బుని రైతులకు పంచుతానని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. తీరా చూస్తే అలాంటిదేం చేయలేదు. అసలు ఏమైంది అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో అడిగితే షో నిర్వహకులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రైజ్మనీ, కారు, నెక్లెస్ అని చెప్పి తనని మోసం చేశారని చెప్పుకొచ్చాడు. సంచలన విషయాలని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: అగ్నిపరీక్షలో రైతుబిడ్డ.. సింగర్ మాత్రమే కాదు అంతకుమించి)'నేను గెలుచుకున్న ప్రైజ్మనీ నా దగ్గరకు రావడానికి టైమ్ పట్టింది. కొందరు తెలియక నన్ను తిడుతూనే ఉన్నారు. దీంతో అసలు వీళ్లకు ఏం తెలుసు అని నేను బాధపడ్డా. కొన్నిరోజుల తర్వాత డబ్బు వచ్చింది. రూ.35 లక్షల్లో 40 శాతం జీఎస్టీ కట్ అయింది. కారు గిఫ్ట్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్లగానే రూ.8.5 లక్షలు కట్ చేశారు. డబ్బులిస్తేనే తీస్కో లేదంటే ఇది ఇక్కడే ఉంటదని అన్నారు. మరి కారుకి డబ్బులు ఎందులో నుంచి ఇవ్వాలి? నెక్లెస్ విషయానికొస్తే టీమ్ గిఫ్ట్ అన్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత రూ.5 లక్షల కట్టాలని చెప్పారు. గిఫ్ట్ ట్యాక్స్ ఇలానే ఉంటుందన్నారు. ఏందన్నా ఇదంతా అని అడిగితే.. రూల్స్ రూల్సే అని చెప్పారు' అని పల్లవి ప్రశాంత్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.పల్లవి ప్రశాంత్ పాల్గొన్న ఏడో సీజన్ ప్రైజ్మనీ మొత్తం రూ.50 లక్షలు.. కానీ ఇదే సీజన్లో ఫైనల్ వరకు వచ్చిన ప్రిన్స్ యావర్, సూట్ కేసు తీసుకుని స్వచ్ఛందంగా బయటకొచ్చేశాడు. అందులో రూ.15 లక్షలు ఉన్నాయి. ఈ మొత్తం పోగా ప్రశాంత్ రూ.35 లక్షలు గెలుచుకున్నాడు. ఇందులో 40శాతం జీఎస్టీ కటింగ్ అంటే రూ.14 లక్షలు, కారుకి రూ.8.5 లక్షలు, నెక్లెస్కి రూ.5 లక్షలు తీసేస్తే ఇక మిగిలింది రూ.7.5 లక్షలు మాత్రమే వచ్చిందన్నట్లు ప్రశాంత్ చెబుతున్నాడు. కానీ ఇతడు చెబుతున్నది నిజమా అబద్ధమా అనేది అర్థం కావట్లేదు. బిగ్బాస్ యాజమాన్యం వైపునుంచి ఈ విషయంపై క్లారిటీ రావాలి.ఇకపోతే పల్లవి ప్రశాంత్ గతంలో శివ అనే యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి భిన్నమైన కామెంట్స్ చేశాడు. 'డబ్బులిస్తానని ఇవ్వకుండా తినేశాడని అందరూ అంటున్నారు. నేను చేసిన సాయం ఎంతో ఏంటో ఇచ్చిన నాకు తెలుసు. తీసుకున్న వాళ్లకు తెలుసు. బిగ్బాస్ ద్వారా వచ్చిన డబ్బే కాదు జీవితాంతం నేను సంపాదించిన దాంట్లో కొంత సాయం చేయాలని అనుకున్నా, చేస్తున్నా. నా దయ వల్ల ఓ చెల్లి కాలేజీ ఫస్ట్ వచ్చానని నాకు ఫోన్ చేసింది. వాళ్లు ముందుకు వచ్చి అన్న సాయం చేశాడని చెప్పడానికి ఇష్టపడటం లేదు. అందుకే అవన్నీ బయటపెట్టలేకపోతున్నా. వాళ్లు చదువుకోవడం నాకు ముఖ్యం. ఆ చెల్లి వీడియో ముందుకొచ్చి చెప్పను అని అన్నది కానీ అవసరం అయితే వస్తానంది. అలా చాలామంది ఉన్నారు. నేను చేస్తానన్న సాయం చేసేశాను ఇంకా చేస్తూనే ఉంటాను తప్ప లెక్కలు అడిగితే చెప్పలేను' అని గతంలో చెప్పాడు. మరి ఈ రెండింటిలో ఏదో నిజమో పల్లవి ప్రశాంతే చెప్పాలి.(ఇదీ చదవండి: 'బిగ్బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు)
చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి
తెలుగులో ఒకప్పటి దర్శకులైనా ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్ అయినా మెగాస్టార్ చిరంజీవితో ఒక్క మూవీ అయినా చేయాలని ఆశపడుతుంటారు. సర్, లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో వరస హిట్స్ అందుకున్న వెంకీ అట్లూరి కూడా ఇప్పుడు చిరుతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ)'చిరంజీవితో ఒక సినిమా అనుకున్నాం. కానీ ఇప్పుడే చేయాలనుకోవట్లేదు. మరీ ముఖ్యంగా నేను అనుకున్న సబ్జెక్టుని, చిరంజీవి లాంటి స్టార్ని హ్యాండిల్ చేయాలంటే, నేను ఇంకాస్త ఎదగాలి అనుకుంటున్నాను. చిరంజీవి లాంటి స్టార్ హీరో చేసినప్పుడు అన్నీ సరిగ్గా చూసుకోవాలి. ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ అనుకుంటున్నాను' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.వెంకీ అట్లూరి గురించి చెప్పుకోవాలంటే హీరోగా టాలీవుడ్లో కెరీర్ ప్రారంభించాడు. రెండు చేసేసరికి సీన్ అర్థమై దర్శకుడిగా మారిపోయాడు. వరుణ్ తేజ్ హీరోగా 'తొలిప్రేమ' తీసి డైరెక్టర్గా తొలి సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన రంగ్ దే, మిస్టర్ మజ్ను ఫెయిలయ్యాయి. దీంతో రూట్ మార్చిన వెంకీ.. ధనుష్తో 'సర్', దుల్కర్ సల్మాన్తో 'లక్కీ భాస్కర్' లాంటి వైవిధ్యమైన చిత్రాలు చేశాడు. తాజాగా సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చేసి అద్భుతమైన హిట్ కొట్టాడు. మరి ఇలాంటి దర్శకుడు చిరంజీవితో థ్రిల్లర్ అంటే ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు!)
రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో
రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. తర్వాత మాతృభాషలో కొన్ని మూవీస్ చేసింది. ఇదంతా 9-10 ఏళ్ల కిందటి ముచ్చట. అయితే ఈ టైంలో పలు వివాదాల్లోనూ ఈమె ఇరుక్కుంది. అందులో 'కేజీఎఫ్' హీరో యష్పై చేసిన 'షో ఆఫ్' కామెంట్ కూడా ఉంది. దీని కారణంగా యష్ అభిమానులు రష్మికని చాలా ట్రోల్ చేశారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి వ్యాఖ్యపై యష్ ఇన్నాళ్లకు స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో సదరు విషయమై క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి: డైరెక్టర్ వెంకీ అట్లూరి)'ఆమె ఏ సందర్భంలో ఆ కామెంట్ చేసిందో నాకు తెలీదు. అప్పుడే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. కొందరు యాంకర్లు ఇష్టమొచ్చినట్లు ప్రశ్నలు అడుగుతూ, ఆప్షన్లు ఇచ్చి ఏదో చెప్పమంటారు. బహుశా రష్మిక కూడా ఆ ఆప్షన్ నాకు సరిపోతుందని భావించి అలా మాట్లాడిందేమో! రష్మిక వ్యాఖ్యల వల్ల చాలామంది దర్శకులు ఇబ్బంది పడ్డారు. అయితే తోటి నటీనటులు ఎవరేమనుకున్నా నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అది నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయదు. ఎవరైనా తమకు నచ్చింది చెప్పొచ్చు. కానీ దాని వల్ల నేనేం మారిపోను' అని యష్ అన్నాడు.ఇక తన అభిమానులని ఉద్దేశిస్తూ ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తోటి నటీనటులని గౌరవించలేని వాళ్లు తన అభిమానులే కాదని యష్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై అప్పట్లోన రష్మిక స్పందించింది. అలా అన్నందుకు క్షమాపణ కూడా చెప్పింది. అయితే ఇన్నేళ్లకు సందర్భం రావడంతో యష్ కూడా స్పందించి ఎట్టకేలకు దీనికి ముగింపు పలికాడు. ఇకపోతే యష్ హీరోగా చేసిన 'టాక్సిక్'.. వచ్చే బుధవారం (ఆగస్టు 26) థియేటర్లలోకి రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి సాంగ్' రిలీజ్)
క్రీడలు
ఏంటి బ్రో.. కాస్త వెనక ముందు చూసుకోవాలి కాదా?
పాకిస్తాన్ దేశవాళీ టోర్నీ నేషనల్ ఛాంపియన్స్ కప్-2026 రసవత్తరంగా సాగుతోంది. వన్డే ప్రపంచకప్-2027 పటిష్టమైన జట్టును తాయారు చేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని తొలిసారి నిర్వహిస్తోంది. షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఖుష్దిల్ షా వంటి జాతీయ జట్టు ఆటగాళ్లు ఈ నేషనల్ ఛాంపియన్స్ కప్లో ఆడుతున్నారు. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ వైట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖుష్దిల్.. ఆదివారం పాకిస్తాన్ గోల్డ్తో జరిగిన మ్యాచ్లో విచిత్రమైన రీతిలో ఔటయ్యాడు. చిన్న తప్పిదం వల్ల తన వికెట్ను ప్రత్యర్ధి జట్టుక సమర్పించుకున్నాడు.ఏమి జరిగిందంటే?ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వైట్స్ 22 ఓవర్లలో కేవలం 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయం క్రీజులో వచ్చిన ఖుష్దిల్ షా.. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సినపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించి తన వికెట్ను కోల్పోయాడు. పాకిస్తాన్ గోల్డ్ స్పిన్నర్ ఫైసల్ అక్రమ్ ఓ వేసిన ఓ బంతిని ఖుష్దిల్ ఆఫ్ సైడ్ దిశగా కట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ కింద భాగంలో తగిలి, వికెట్ల పక్కగా వికెట్ కీపర్ వైపు వెళ్లింది. అయితే బంతి ఎటు వెళ్లిందో గమనించని ఖుష్దిల్.. సింగిల్ కోసం క్రీజ్ను వదిలి కాస్త ముందుకే వచ్చాడు. కానీ బంతి మాత్రం కీపర్ పక్కన ఉంది. ఖుష్దిల్ క్రీజును వదిలి బయటకు వెళ్లడం గమనించిన వికెట్ కీపర్ వెంటనే స్టంప్స్ను గిరాటేశాడు. దీంతో ఊహించని విధంగా అతడు రనౌటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఏంటి బ్రో.. కాస్త వెనక ముందు చూసుకోవాలి కాదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
'ఇక అతడి రీఎంట్రీ కష్టమే.. అందరూ మర్చిపోండి'
టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్కు తొలుత ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. కానీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు ఫిట్నెస్ క్లియరన్స్ లభించకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవ్దత్త్ పడిక్కల్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది. ఈ కర్ణాటక బ్యాటర్ దాదాపు రెండేళ్ల తర్వాత తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. గాలే వేదికగా జరుగుతన్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. మూడో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన పడిక్కల్ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 167 పరుగులు చేసి మేనెజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పడిక్కల్ సత్తాచాటడంతో సుదుర్శన్కు తిరిగి భారత జట్టులో చోటు దక్కడం కష్టమే అని అతడు అభిప్రాయపడ్డాడు."భారత టెస్ట్ జట్టులో సాయి సుదర్శన్ స్ధానం ప్రమాదంలో పడింది. కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. పడిక్కల్ తన రీ-ఎంట్రీని గ్రాండ్గా చాటుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో టెస్టుల్లో మూడో స్థానాన్ని పడిక్కల్ దాదాపు ఖాయం చేసుకున్నట్లే. ఒకవేళ సాయిసుదర్శన్ ఫిట్నెస్ సాధించినా తిరిగి భారత జట్టులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అద్భుత ఫామ్లో ఉన్న పడిక్కల్ను కూడా పక్కన పెట్టే సాహసం సెలక్టర్లు చేయలేరు. ఒకవేళ సుదర్శన్ రీఎంట్రీ ఇచ్చినా తుది జట్టులో చోటు దక్కడం మాత్రం కష్టమే" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.సుదీర్ఘకాలం నంబర్-3 స్థానంలో రాణించిన ఛతేశ్వర్ పుజారా వైదొలిగిన తర్వాత ఆ స్థానంలో భారత్ పలు ప్రయోగాలు చేసింది. కొన్నాళ్ల పాటు శుబ్మన్ గిల్ ఆ స్థానంలో రాణించగా, ఆ తర్వాత కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లను కూడా మేనేజ్మెంట్ పరిశీలించింది. కానీ ఇప్పుడు పడిక్కల్ రూపంలో టీమిండియాకు నంబర్-3 స్థానంలో సరైన ఆటగాడు దొరికినట్లయింది.చదవండి: IND vs SL: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ స్కోర్ సాధించిన భారత్
ప్రపంచ కప్లో భారత్కు పోరాట ఆరంభం
ఆమ్స్టెల్వీన్: 2026 మహిళల FIH హాకీ వరల్డ్ కప్లో భారత జట్టు పోరాట ఆరంభం చేసింది. నెదర్లాండ్స్లోని వాగెనర్ స్టేడియంలో ఆదివారం జరిగిన పూల్-డీ మ్యాచ్లో ఒలింపిక్ రజత పతక విజేత చైనాతో 2-2 డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండుసార్లు ఆధిక్యంలోకి వెళ్లినా.. చైనా ప్రతిసారీ పుంజుకుని స్కోరును సమం చేసింది.రెండుసార్లు ఆధిక్యంలో భారత్మ్యాచ్ ప్రారంభం నుంచే భారత జట్టు దూకుడుగా ఆడింది. 8వ నిమిషంలో నవ్నీత్ కౌర్ గోల్ చేయడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.అయితే తొలి క్వార్టర్ ముగిసే సమయానికి చైనా తిరిగి పుంజుకుంది. 15వ నిమిషంలో జాంగ్ గోల్ చేయడంతో స్కోరు 1-1గా సమమైంది.రెండో క్వార్టర్లో భారత్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. 25వ నిమిషంలో దీపిక గోల్ చేయడంతో భారత్ 2-1తో ముందంజ వేసింది.భారత్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయంపై ఆశలు పెంచుకున్న సమయంలో చైనా మరోసారి ఎదురుదాడి చేసింది. 39వ నిమిషంలో మా నింగ్ గోల్ చేయడంతో స్కోరు 2-2గా మారింది.ఆ తర్వాత ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మరో గోల్ రాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.దక్షిణాఫ్రికాతో తదుపరి మ్యాచ్చైనాతో పాయింట్లు పంచుకున్న భారత్కు పూల్-డీలో తదుపరి మ్యాచ్ కీలకంగా మారింది. ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది.వరల్డ్ కప్లో నాకౌట్ దశకు చేరుకోవాలంటే భారత్ ఇకపై పూల్ మ్యాచ్ల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. చైనా వంటి బలమైన ప్రత్యర్థిపై రెండు సార్లు ఆధిక్యంలోకి రావడం సానుకూల అంశమే అయినప్పటికీ, ఆధిక్యాన్ని విజయంగా మలచలేకపోవడం మాత్రం భారత్ సరిదిద్దుకోవాల్సిన అంశంగా నిలిచింది.
ముగిసిన రెండో రోజు ఆట.. భారీ స్కోర్ సాధించిన భారత్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ఆరంభంలో పంత్(39) కాస్త దూకుడుగా ఆడినప్పటికి ఓ భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. కాగా తొలి రోజు ఆటలో కండరాల గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్.. రెండో రోజు బ్యాటింగ్కు వచ్చాడు. కానీ అతడు ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ పెవిలియన్కు చేరాడు. వరుస వికెట్లు పడుతున్నప్పటికి సెంచరీ హీరో దేవ్దత్త్ పడిక్కల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ ధ్రువ్ జురల్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే 167 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పడిక్కల్ అనుహ్యంగా స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ జట్టును ఇన్నింగ్స్ను నడిపించే భాధ్యతను తీసుకున్నాడు. ఈ క్రమంలో జురెల్ 66 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ఆఖరిలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న జురెల్(51), మానవ్ సుత్తార్(24) వరుస ఓవర్లలో ఔటయ్యాడు.ప్రాక్టీస్ మ్యాచ్లో సిక్సర్లతో సత్తాచాటిన మహ్మద్ సిరాజ్.. గాలే టెస్ట్లో కూడా తన బ్యాట్కు పనిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ 15 బంతుల్లో ఒక సిక్సర్తో 11 పరుగులు చేసి సిరాజ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ ప్రభాత్ జైసూర్య నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశర నువాంత 3 వికెట్లు సాధించాడు.
న్యూస్ పాడ్కాస్ట్
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
గ్రహణం వేళ నిర్లక్ష్యం.. ఆసుపత్రి పాలైన వందలమంది
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
బిజినెస్
వంతారా నుంచి గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలు
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. గుజరాత్ అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), వంతారా సహకారంతో కచ్లోని బన్ని గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలను తిరిగి సహజ వాతావరణంలోకి విడుదల చేశారు. ఇందులో 5 మగ కృష్ణజింకలు, 15 ఆడ కృష్ణజింకలు ఉన్నాయి. వీటిని జామ్నగర్లోని వంతారా నుంచి బన్నికి తరలించారు.ఈ కృష్ణజింకలను అడవిలోకి వదిలిపెట్టడానికి ముందు.. వాటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కొంతకాలం క్వారంటైన్లో ఉంచారు. వ్యాధుల విషయంలో పర్యవేక్షణ చేసిన తర్వాత ప్రత్యేక జాగ్రత్తలతో బన్నికి తరలించారు. ఇందుకోసం సెంట్రల్ జూ అథారిటీ, గుజరాత్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ నుంచి అవసరమైన అనుమతులు కూడా తీసుకున్నారు.బన్ని గడ్డి భూముల్లో గతంలో కృష్ణజింకలతో పాటు చింకారా, నీలగాయలు, అడవి పందులు వంటి జంతువులు పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు కృష్ణజింకలను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల అక్కడి సహజ ఆహార గొలుసు మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా.. గడ్డి భూముల జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత కూడా మెరుగుపడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Vantara (@vantara)
అందుకే.. ఏఐ ఎంత ఎదిగినా.. మనిషి అవసరమే!
శాన్ఫ్రాన్సిస్కోలోని ఆండన్ మార్కెట్ అనే ఎక్స్పెరిమెంటల్ స్టోర్ను ఏఐ మేనేజర్ లూనా నిర్వహిస్తోంది. ఆండన్ ల్యాబ్స్ కంపెనీ లూనాకు డబ్బు, కార్పొరేట్ కార్డు, ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చి దుకాణాన్ని నడిపిస్తూ లాభం సంపాదించమని బాధ్యత అప్పగించింది.లూనా తన విధి నిర్వహణలో భాగంగా దుకాణంలో ఏ వస్తువులు అమ్మాలి, వాటి ధరలు ఎంత ఉండాలి, దుకాణం ఎప్పుడు తెరవాలి వంటి అనేక నిర్ణయాలు తీసుకుంది. అయితే దుకాణం ఇప్పటివరకు లాభాల్లోకి రాలేదు. కానీ.. ఇటీవల లూనా ఒక మానవ ఉద్యోగిని తొలగించాలని సిఫారసు చేసింది. ఆ ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా వచ్చాడు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హాజరుకు సంబంధించిన ఒక నియమాన్ని లూనా గతంలో తానే రూపొందించింది. కానీ.. ఆ నియమాన్ని తర్వాత గుర్తుంచుకోలేకపోవడంతో, ఉద్యోగి చాలా కాలం ఆలస్యంగా వచ్చినా చర్య తీసుకోలేదు. చివరకు మానవ సిబ్బంది లూనాకు తాను రూపొందించిన నియమాన్ని గుర్తు చేసి, ఉద్యోగి పనితీరును మళ్లీ పరిశీలించమని చెప్పడంతో ఉద్యోగిని తొలగించాలని సిఫారసు చేసింది.ఈ సంఘటన ఏఐ ఎంత తెలివిగా ఉన్నప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని చూపించింది. ఒక నియమాన్ని స్వయంగా తయారు చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని సరైన సమయంలో గుర్తుంచుకుని అమలు చేయడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగులపై ప్రభావం చూపే నిర్ణయాల్లో ఏఐ ఒక్కదానిపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం. అందుకే ఈ సందర్భంలో చివరి నిర్ణయాన్ని మానవులే అమలు చేశారు.దీన్నిబట్టి చూస్తే.. ఏఐ వ్యాపారంలో అనేక పనులను నిర్వహించగలిగినా, మానవ పర్యవేక్షణ అవసరం ఇంకా ఉందని తెలుస్తోంది. లూనా తీసుకున్న ఈ తొలి ఉద్యోగ తొలగింపు నిర్ణయం ద్వారా ఏఐలో సామర్థ్యం ఉన్నప్పటికీ.. దాని నిర్ణయాలను సరైన విధంగా పర్యవేక్షించడానికి మనుషుల పాత్ర చాలా అవసరం అని స్పష్టమవుతోంది.For the first time (that we know of), an AI boss has fired a human employee.Luna, the AI running our store in San Francisco, decided to part ways with an employee over repeated lateness.Luna was running Claude Opus 4.8 at the time, but most models would have done the same. pic.twitter.com/8Z8D5bDGaX— Andon Labs (@andonlabs) August 14, 2026
సంపద పెంచుకోవాలంటే.. అంకుర్ వారికూ ఆర్ధిక సూత్రాలు!
సాధారణంగా ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఖరీదైన వస్తువులు కొనడం, లైఫ్స్టైల్ మార్చుకోవడం అనేది చాలామందికి అలవాటే. అయితే.. వ్యాపారవేత్త, రచయిత అంకుర్ వారికూ (Ankur Warikoo) మాత్రం డబ్బును ఖర్చు చేసే విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే.. భవిష్యత్తులో మంచి సంపదను కూడబెట్టుకోవచ్చని చెబుతున్నారు.తాను, తన భార్య రుచి కలిసి పాటిస్తున్న ఐదు మనీ రూల్స్ను అంకుర్ వారికూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాము సంపన్న కుటుంబాల నుంచి రాలేదని, తమ జీవితంలో నిజమైన ఆర్థిక స్థిరత్వం గత 6-7 ఏళ్లలోనే వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఐదు అలవాట్లు తమ కుటుంబం డబ్బును చూసే విధానాన్ని మార్చాయని తెలిపారు.మొదటి నియమం - డబ్బున్నవారిలా కనిపించడానికి ఖర్చు చేయకూడదుఇతరులను ఆకట్టుకోవడానికి ఖరీదైన వస్తువులు కొనడం కంటే.. భవిష్యత్తులో సంపదను పెంచే ఆస్తులపై డబ్బు పెట్టాలని ఆయన చెబుతున్నారు. అందుకే.. తమ డబ్బులో ఎక్కువ భాగాన్ని స్టాక్స్, బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెడతామని చెప్పారు. కుటుంబానికి ఒక ఇల్లు మాత్రమే ఉందని, కారు కూడా సొంతంగా కొనకుండా అద్దెకు ఉపయోగిస్తున్నామని తెలిపారు.రెండో నియమం - ముఖ్యమైన విషయాల కోసం ఎక్కువ ఖర్చు చేయడంముఖ్యంగా ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదనేది వారి ఆలోచన. నాణ్యమైన ఆహారం కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటామని అంకుర్ చెప్పారు. తమ కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో పండించే అద్దె పొలం ఉందని, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు.మూడో నియమం - వస్తువుల కంటే జ్ఞాపకాలను సంపాదించుకోవడంఖరీదైన వస్తువులు కొనడం కంటే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం, క్రీడా కార్యక్రమాలకు వెళ్లడం, మ్యూజియంలు చూడటం వంటి అనుభవాలకు డబ్బు ఖర్చు చేయడం ఎక్కువ విలువైనదని ఆయన భావిస్తున్నారు. గత ఏడాది తమ కుటుంబం ఏకంగా 116 రోజులు ప్రయాణించిందని చెప్పారు. తాము వెళ్లే ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి.. అవసరమైతే చరిత్రకారులను కూడా వెంట తీసుకెళ్తామని తెలిపారు.నాలుగో నియమం - ఖర్చు చేసే ముందు పెట్టుబడి పెట్టడంఆదాయం వచ్చిన రోజే ముందుగా పెట్టుబడి పెడతామని అంకుర్ చెప్పారు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే ఖర్చులు చేస్తామని తెలిపారు. అంటే ముందుగా పెట్టుబడి.. ఆ తర్వాత ఖర్చు అన్నమాట. దీంతో నెలాఖరుకు చేతిలో కొన్ని వేల రూపాయలు మాత్రమే మిగులుతాయని, మిగిలిన డబ్బంతా అప్పటికే పెట్టుబడిగా మారిపోయి ఉంటుందని వివరించారు.ఐదో నియమం - నేర్చుకోవడానికి ఎలాంటి పరిమితి పెట్టుకోకపోవడంపుస్తకాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి తమ కుటుంబంలో ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టుకోలేదని ఆయన చెప్పారు. వారి ఇంట్లో లివింగ్ రూమ్ కూడా లైబ్రరీలా ఉంటుందని తెలిపారు. కుటుంబంలోని నలుగురూ పుస్తకాలు చదవడంతో పాటు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారని చెప్పారు. పాటరీ, పియానో నుంచి పైథాన్ ప్రోగ్రామింగ్ వరకు వివిధ కోర్సులు, క్లాసులకు హాజరవుతున్నట్లు తెలిపారు.అయితే ఈ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం లేదని అంకుర్ స్పష్టం చేశారు. ఇవి తమ కుటుంబం పాటిస్తున్న నియమాలు మాత్రమే అని చెప్పారు. అయితే అందరూ.. తమ ఆదాయం, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలకు తగ్గట్టుగా సొంత మనీ రూల్స్ పెట్టుకోవాలని సూచించారు.
మహీంద్రా కొత్త కార్లు: ధరలు ఇలా..
మహీంద్రా అండ్ మహీంద్రా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. రెండు కొత్త బీఈ 6 ఎలక్ట్రిక్ వెర్షన్లను ఆవిష్కరించింది. ఒకటి స్పోర్టెక్ వేరియంట్ కాగా.. మరొకటి ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్ ఉన్నాయి.మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్స్పోర్టెక్ అనేది బీఈ 6 లైనప్లోని కొత్త ఫ్లాగ్షిప్ వేరియంట్. దీని ధర రూ. 19.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). BaaS స్కీమ్ కింద రూ. 11.45 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.బీఈ 6 స్పోర్టెక్ వేరియంట్ చూడటానికి సాధారణ మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇందులో ప్రత్యేకమైన స్పోర్టెక్ బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్లైట్స్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, టూ-టోన్ అల్లాయ్ వీల్స్తో ఇది ఆకట్టుకుంటుంది. కాగా ఇది గ్రాఫైట్ స్టార్మ్ ఎక్స్టీరియర్ రంగులో అందుబాటులో ఉంది.స్పోర్టెక్ నలుపు, లేత గోధుమ రంగు ఇంటీరియర్ను పొందుతుంది. మధ్యలో స్పైన్ లేని కొత్త డాష్బోర్డ్తో వస్తుంది. ఈ లేఅవుట్ మూడు 12.3-అంగుళాల డిస్ప్లేలను అమర్చడానికి స్థలాన్ని కల్పిస్తుంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, USB టైప్-సి పోర్ట్లకు యాక్సెస్ను కూడా మెరుగుపరుస్తుంది.ఇది 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. దీని రేంజ్ 682 కి.మీ. వరకు ఉంటుంది. దీనికి వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంది, ఇది 282 Bhp పవర్, 380 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.మహీంద్రా బీఈ 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్మహీంద్రా రూ. 24.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ఇది కొన్ని ప్రత్యేకమైన కాస్మెటిక్ అంశాలను పొందినప్పటికీ.. స్టాండర్డ్ BE 6 లాగానే కనిపిస్తుంది. అయితే ఇందులో ఫార్ములా ఈ బ్యాడ్జ్లు చూడవచ్చు.ఫార్ములా E ఫ్రీడమ్ ఎడిషన్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ కాక్పిట్లను విభజించే సెంట్రల్ స్పైన్తో కూడిన పాత డాష్బోర్డ్ లేఅవుట్తో వస్తుంది. ఇందులో డ్యూయల్ 12.3-అంగుళాల డిస్ప్లేలు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, యాంబియంట్ లైటింగ్, 540-డిగ్రీ కెమెరా, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.
ఫ్యామిలీ
వాటితో ఫేషియల్..'గ్లో' మాములుగా లేదు..!
ఎన్నో బ్యూటీటిప్స్..వివిధ రకాల ఫేషియల్స్ చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఫేషియల్ అసలు చూసుండరు.ఓ సెలూన్ షాపులో బార్బర్ చేసిన ఫేషియల్ ఇది. కానీ ఇదేం ఫేషియల్ అనిపిస్తుంది గానీ చివర్లో ముఖంలో వచ్చిన అద్భుతమైన మార్పుకి నోటమాటరాదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ఉన్న హెయిర్డ్రెస్సర్ రషీద్ ఎంకే..షేర్ చేసిన షేషియల్ రొటీన్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదేంట్రా బాబు ఇవేం ఉత్పత్తులు అని విస్తుపోయారు. వాటితో ఫేషియల్ ఏంటి? అని అనిపించినా..రిజల్ట్ మాత్రం మాములుగా లేదు. ఇంతకీ అతడు వేటితో ఫేషియల్ చేశాడంటే..ఈనో, టూత్పేస్ట్, గులాబ్జల్తో ఓ వ్యక్తికి ఫేషియల్ చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చక్కగా బ్యూటీపార్లర్లో చేసినట్లు మసాజ్ చేస్తాడు. కాసేపటి తర్వాత దాన్ని తొలగించగానే ముఖంంలో వచ్చిన గ్లోకి మైండ్బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి అంతకు ముందు ఫేస్కి ఆ తర్వాత మార్పు అలా ఇలా ఉండదు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి, వాటే క్రియేటివిటీ అని కొందరు, బాస్ ఇలాంటివి చర్మంపై రియాక్షన్ చూపించే ప్రమాదం ఉంటుంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.గమనిక: ఇలాంటివి ప్రయత్నించేటప్పుడు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా రక్తంతో ఫేషియల్..! అందం కోసం ఇంత పెయిన్ తప్పదా?)
పుడమితల్లి వేడుక 'పాచామామా'!
దక్షిణ అమెరికా దేశమైన పెరూ ‘పాచామామా’ వేడుకకు సిద్ధమైంది. పుడమితల్లికి కృతజ్ఞతలు తెలిపే ఈ వేడుకలను ఆగస్టు మాసమంతా అండీస్ పర్వత ప్రాంతాల్లోని ప్రాచీన తెగలు, గ్రామీణ ప్రజలు, పెరూ పౌరులందరూ ఏకమై ఘనంగా నిర్వహిస్తారు. స్పానిష్ వలస పాలకుల రాకకు శతాబ్దాల ముందు నుంచే కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ ఆండియన్ క్యాలెండర్లో అత్యంత ముఖ్యమైన పండుగగా నిలుస్తోంది.పాచామామా అంటే...‘పాచా’ అంటే ప్రపంచం, భూమి, స్థలం, సమయం, విశ్వం అని అర్థం. ‘మామా’ అంటే తల్లి అని అర్థం. అంటే ‘విశ్వానికి మూలమైన నేలతల్లి’అని అర్థం. ఆండియన్ ప్రజల దృష్టిలో భూమి అనేది అందరినీ పోషించే ఒక జీవ వ్యవస్థ.ఆగస్టులోనే ఎందుకు?ఆండియన్ సంప్రదాయాల ప్రకారం, ఆగస్టు నెలలో భూమాత తన నోరు తెరుస్తుందని, మానవులు సమర్పించే నైవేద్యాలను స్వీకరిస్తుందని నమ్ముతారు. పంటల కాలం పూర్తయి, కొత్త వ్యవసాయ చక్రం ప్రారంభమయ్యే సమయం కాబట్టి, భూమి సారవంతంగా ఉండాలని, కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని, వ్యాపారంలో అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ప్రధాన ఆచారాలుఈ ఉత్సవాల్లో షామన్లుగా పిలిచే ప్రాచీన పూజారుల నేతృత్వంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముందుగా భూమి తల్లికి పూలు, పండ్లు, జొన్నలతో నైవేద్యం సమర్పించే ‘దేశ్పాచో’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం ‘పాగో అ లా తియెర్రా’ అని నిర్వహించే ‘నేలతల్లికి చెల్లింపు’ కార్యక్రమంలో అనేక ప్రత్యేక కానుకలను అగ్నిదేవునికి సమర్పించి, పాటలు, ప్రార్థనల ద్వారా భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. చివరగా వనమూలికలతో ధూపం వేసి వాతావరణాన్ని, మనుషులను శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది దుష్టశక్తులను పారద్రోలి, నూతనోత్తేజాన్ని ఇస్తుందని ఆండియన్ ప్రజల నమ్మకం.ఆండియన్ సంస్కృతిలో ప్రపంచాన్ని మూడు లోకాలుగా విభజించారు. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే ‘పాచామామా’ పూజ ప్రధాన ఉద్దేశం. మొదటిది ‘హనన్ పాచా’– అంటే ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, వాతావరణాన్ని సూచించే ఊర్ధ్వలోకం. రెండోది ‘కే పాచా’ అంటే మానవులు సహా సమస్త జీవజాలం నివసించే నేల ఉపరితలం. మూడవది ‘ఉఖు పాచా’ అంటే భూమి లోపలి భాగం. విత్తనాల మొలకెత్తే శక్తికి ప్రతిరూపం.ఈ పాచామామా ఉత్సవాలు కేవలం స్థానికులకే కాక, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. అయితే ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునేవారు ఈ ప్రాంత ఆచార సంప్రదాయాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఉత్సవాల్లో అందరిపట్ల గౌరవంగా మెలగడం, ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనుకుంటే స్థానికుల అనుమతి తీసుకోవడం వంటి నిబంధనలుంటాయి. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనే సూత్రం ఆధారంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. అంటే ప్రకృతి మనకు జీవనాన్ని ఇచ్చినపుడు, మనం తిరిగి కృతజ్ఞతగా నైవేద్యాలను సమర్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలి అనేది వీరి సిద్ధాంతం. ∙ రమా జంబుల
గర్భందాల్చిన తొలిరోజుల్లో జాగ్రత్తగా లేకుంటే ముప్పు తప్పదా?
మహిళలు గర్భందాల్చిన తొలిరోజుల్లో వారు తమ పనితీరులో భాగంగా తరచూ ముందుకు వంగడం, ఎక్కువసేపు నిలబడి పనిచేయాల్సి రావడంతోపాటు ఎక్కువసేపు నడక వంటి పనులతో గర్భస్రావాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక డానిష్ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన ఫలితాలు ‘ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్మెంట్ మెడిసిన్’అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఉద్యోగంలో లేదా తమ విధుల్లో భాగంగా మహిళలు చేసే శారీరక శ్రమ వారి గర్భధారణ/గర్భస్రావాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయాలపై చేసిన అధ్యయనంలో భాగంగా డెన్మార్క్కు చెందిన అధ్యయనవేత్తలు సుమారు 4.75 లక్షల మంది ఉద్యోగినుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఉద్యోగంలో భాగంగా ఎక్కువసేపు నిలబడటం, నడవడం, ముందుకు వంగి పనిచేయడం వంటి అంశాలు గర్భస్రావం ముప్పును పెంచినట్లుగా ఈ విశ్లేషణలో తేలింది. నిలబడి పనిచేయడం వల్ల మాత్రం ఈ ముప్పు చాలా స్వల్పంగా పెరిగినట్లు తేలింది. (చదవండి: రోజూ ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటే..?)
అర్జున్ ఇన్ అండర్ గ్రౌండ్..!
‘ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ (అజ్ఞాతం)లోకి వెళ్లాడు’ అంటూ ఉంటారు. అర్జున్ మాత్రం... అందరికీ కనిపిస్తూనే అండర్గ్రౌండ్లో ఉంటున్నాడు. అర్థం కాలేదా! ఇప్పుడు టాపిక్లోకి వద్దాం...మధ్యప్రదేశ్లోని ఝుబువాకు చెందిన అర్జున్ ఇంటిపై అలిగి బయటికి వచ్చాడు. ఇది విశేషమేమీ కాదు. అసలు సిసలు విశేషం... భూగర్భ గృహాన్ని నిర్మించుకోవడం. తన వెరైటీ ఇంటి విషయాల గురించి ఎప్పటికప్పుడు అర్జున్ షేర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఇంతకీ ఆ భూగర్భగృహం ఎలా ఉంటుంది?భూమి అడుగున నిర్మించిన చిన్నటి ఆవాసంలో మట్టితో చేసిన వేదిక ఉంది. దీనిపై చాప, దుప్పటి పరిచి పడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నాడు. లోపల చేతితో చెక్కిన అరలు, వండుకోవడానికి చిన్న పొయ్యి ఉన్నాయి. పైకప్పుపై ఉండే టార్పాలిన్ వర్షం నుంచి రక్షణగా పనిచేస్తుంది.అలా అని సమస్యలు లేవని కాదు. ఒక వర్షానికి పై కప్పు పై కప్పిన టార్పాలిన్ చిరిగిపోయింది. వర్షం నీళ్లు ఇంట్లోకి రావడంతో అర్జున్ ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా ‘డోన్ట్ కేర్’ అంటున్నాడు. ఈ భూగర్భగృహం పుణ్యమా అని సదరు అర్జున్ సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యాడు! View this post on Instagram A post shared by Reel Pe Seal 🇮🇳 (@reelpesealofficial) (చదవండి: రోజూ ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటే..?)
అంతర్జాతీయం
అలా చేస్తేనే.. దారి తెరుస్తాం.. ట్రంప్కు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిని ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూసివేయాలన్నది ఇరాన్ నిర్ణయమేనని ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటమి వాస్తవాన్ని అంగీకరించండి.. ఊహల్లో విహరించడం ఆపండి. అప్పటివరకు ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగిస్తుంది అంటూ హెచ్చరించారు. కేవలం ఆదేశాలు ఇవ్వడం, ట్వీట్ చేయడం లేదా యుద్ధనౌకలను మోహరించడం ద్వారా జలసంధిపై నియంత్రణ సాధించలేరని అమెరికాకు కౌంటరిచ్చారు.మరోవైపు, ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో రాకపోకలు భారీగా పడిపోయాయి. శుక్రవారం కేవలం రెండు నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ Kpler విశ్లేషణ తెలిపింది. వాటిలో ముడి చమురు రవాణా కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు 130కి పైగా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేవి. జలసంధి మూసివేత కొనసాగితే చమురు, ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో పెరుగుతున్న పెట్రోల్ ధరలను ప్రజలు భరించాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ చెప్పడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఇరాన్తో ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అవసరమైతే ఆ దేశంపై ఆర్థికంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఒకవైపు హార్ముజ్పై ఇరాన్ పట్టు.. మరోవైపు దాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామంటున్న ట్రంప్.. ఈ ప్రతిష్ఠంభన ఎటు దారితీస్తుందన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ఆందోళన.చర్చలకు నో ఛాన్స్?ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కూడా ముందుకు కదలడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి.. అమెరికాతో చర్చలు పునఃప్రారంభించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవి అధికారిక శాంతి చర్చలు కాదని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్కు ఖతార్ స్ట్రాంగ్ కౌంటర్.. ముగ్గురు పైలట్లపై బిగ్ సస్పెన్స్!
గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఇరాన్-ఖతార్ మధ్య పైలట్ల వివాదం తెరపైకి వచ్చింది. ముగ్గురు ఇరాన్ యుద్ధ విమాన పైలట్లను ఖతార్ బలగాలు సజీవంగా పట్టుకున్నాయని ఇరాన్ వర్గాలు ప్రకటించగా ఖతార్ మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA కథనం ప్రకారం, మార్చిలో ఖతార్లోని ఒక సైనిక స్థావరంపై దాడి చేసే మిషన్లో పాల్గొన్న మూడు యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. వాటిలోని పైలట్లు విమానాల నుంచి బయటకు దూకిన అనంతరం ఖతార్ బలగాలకు చిక్కారని ఇరాన్ సైనిక అధికారి పేర్కొన్నారు. ఈ ముగ్గురి ఆచూకీ కోసం అంతర్జాతీయ రెడ్క్రాస్ సహాయం కోరినట్లు ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపింది. అయితే ఖతర్ కథనం పూర్తిగా భిన్నంగా ఉంది.ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకారం, ఆ ఇరాన్ పైలట్లు ఖతార్ గగనతలంలోకి ప్రవేశించారు. వారిని సంప్రదించేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. అనంతరం చేపట్టిన గాలింపు, రక్షణ చర్యల్లో ఒక పైలట్ మృతదేహాన్ని మాత్రమే గుర్తించినట్లు ఖతార్ వెల్లడించింది. అంతేకాదు, ఆ మృతదేహాన్ని ఇరాన్కు అప్పగించే అంశంపై కూడా ఖతార్ సంప్రదింపులు జరిపిందని తెలిపింది. ఆపరేషన్కు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు ఇరాన్ను ఆహ్వానించినప్పటికీ, ఇప్పటివరకు స్పందన రాలేదని ఆరోపించింది.ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ముగ్గురు పైలట్లు సజీవంగా ఖతార్ అదుపులో ఉన్నారా? లేక ఒక పైలట్ మాత్రమే మరణించాడా?. ఈ వివాదం కేవలం ముగ్గురు సైనికుల ఆచూకీకి సంబంధించినది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ప్రాంతంలో ఇరాన్, ఖతార్ మధ్య ఈ ఆరోపణలు కొత్త రాజకీయ, సైనిక పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇరాన్పై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని స్థావరాలను అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలకు ఉపయోగించుకుంటున్నాయని ఇరాన్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. అందుకే ఈ పైలట్ల వ్యవహారం ఇప్పుడు ఒక కీలక ప్రశ్నగా మారింది.
ఇండోనేసియాలో భూకంపం
మావుమెర్: ఇండోనేసియా సముద్రతీర ప్రాంతంలో శనివారం సంభవించిన భారీ భూకంపం 47మంది ప్రాణాలు బలితీసుకుంది. భూకంపం తాకిడికి పలు భవనాలు, ఇళ్లు కూలిపోగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ఘటనలో పలువురు గాయపడ్డారని, అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలు ముందు జారీ చేసినా సముద్ర మట్టంలో పెద్దగా తేడాలు లేకపోవడంతో ఇండోనేసియా వాతావరణ విభాగం, క్లైమటాలజీ అండ్ జియో ఫిజిక్స్ సంస్థ సూచనల మేరకు సునామీ ప్రమాదం లేదని తేల్చారు. అమెరికా జియలాజికల్ సర్వే లెక్కల ప్రకారం ఈ భూకంపం ఇండోనేసియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో, స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుఝాము 5.58 గంటలకు సముద్రగర్భంలో పది కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈస్ట్ నూసా టెంగార ప్రావిన్స్లోని ఎండే నగరానికి వాయువ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. భూకంపం తరువాత మధ్యాహ్న సమయానికి 235 ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో 6.2 తీవ్రత గల ప్రకంపన ఒకటి ఉండటం గమనార్హం. సముద్ర జల మట్టాల పరిశీలన కేంద్రాలు మంగ్గారై, ఈస్ట్ మంగ్గారైల వద్ద 5.3 అడుగుల ఎత్తైన అలలను గుర్తించాయి. అలాగే మావురోల్, ఎండే ప్రాంతాల్లో సుమారు మూడు అడుగుల ఎత్తు అలలు ఎగసిపడినట్లు తెలిసింది. బులుకుంబా, సులవేసి దక్షిణ ప్రాంతం, సాపే, బీమా ప్రాంతాల్లోనూ ఒకటిన్నర అడుగుల వరకూ అలలు ఎగసినట్లు సమాచారం. సిక్కా, పశ్చిమ మంగ్గారై, తూర్పు మంగ్గారై ప్రాంతంలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉందని, సహాయక బృందాలు ఇక్కడి నుంచే దాదాపు 40 మృతదేహాలను వెలికితీశాయని జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి ఫతూర్ రెహ్మాన్ తెలిపారు. మరో రెండు గ్రామాలను మట్టిదిబ్బలు కప్పేశాయని, మృతదేహాల కోసం ఇక్కడ కూడా గాలింపు కొనసాగుతోందని వివరించారు. మరోవైపు భూకంప బాధితులు ఎక్కువగా ఉండే అవకాశముందన్న అంచనాతో పలు ఆసుపత్రులు వీలైనంత మేరకు రోగులను ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు స్థానిక టెలివిజన్ ఛానళ్లలో కనిపించాయి. అంతేకాకుండా.. గాయపడ్డ వారి చికిత్స కోసం బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఐవీ స్టాండ్లను సిద్ధంగా ఉంచారు. బాధితులను వేగంగా ఆసుపత్రులకు చేర్చే ఉద్దేశంతో ఇండోనేసియా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మూడు హెలికాప్టర్లు, ఒక సహాయక నౌకను రంగంలోకి దించింది.
జీవితాంతం జిమ్, స్కూల్కు వెళ్లొద్దు.. చిత్రహింసలు అనుభవించొచ్చు..
అఫ్గానిస్థాన్లో 2021 ఆగస్టు 15న తాలిబాన్ అధికారాన్ని పూర్తిగా చేజిక్కించుకుంది. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తర్వాత కాబూల్ తాలిబాన్ అధీనంలోకి వెళ్లింది. తాలిబాన్ అధికారంలోకి వచ్చి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తాలిబాన్ కాబూల్లో భారీ స్థాయిలో విజయోత్సవాలు నిర్వహించింది.అంతర్జాతీయా మీడియా కథనాల ప్రకారం.. తాలిబాన్ తన పాలనలో యుద్ధం, అస్థిరత తగ్గి దేశంలో భద్రత పెరిగిందని చెబుతోంది. ప్రస్తుతం తాలిబాన్ అఫ్గానిస్థాన్ మొత్తం భూభాగంపై నియంత్రణ కలిగి ఉంది. ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ వంటి సాయుధ ముప్పులను తాలిబాన్ బాగా బలహీనపరిచింది.ఐదేళ్లలో ఏం సాధించింది? ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ, 2021లో విదేశీ సహాయం భారీగా తగ్గిన తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా తాలిబాన్ నిలబెట్టింది. పన్నులు, సుంకాల వసూళ్లు పెరగడం, విదేశాల్లో ఉన్న అఫ్గాన్ల నుంచి వచ్చే డబ్బు, పొరుగు దేశాలతో వాణిజ్యం ఆర్థిక వ్యవస్థకు కొంత ఊతమిచ్చాయి. ఖోష్ తేపా కాలువ, టీఏపీఐ గ్యాస్ పైప్లైన్, విద్యుత్ ప్రసార మార్గాలు, రహదారులు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులపై తాలిబాన్ దృష్టి పెట్టింది. అయితే ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపించింది. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడంలో తాలిబాన్ విఫలమైంది.మహిళలను మనుషుల్లా చూడట్లేదు..తాలిబాన్ పాలనలో అతిపెద్ద వైఫల్యం మహిళలు, బాలికలపై విధించిన ఆంక్షలు. బాలికలు 6వ తరగతి తర్వాత అధికారిక విద్య కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. యునెస్కో ప్రకారం ప్రస్తుతం సుమారు 2.4 మిలియన్ అఫ్గాన్ బాలికలు మాధ్యమిక విద్యకు దూరమయ్యారు. మహిళలకు విశ్వవిద్యాలయ విద్య కూడా నిషేధించారు. దీంతో అఫ్గానిస్థాన్ మహిళల ఉన్నత విద్యపై అధికారిక నిషేధం ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశంగా నిలిచింది.తాలిబాన్ అధికారంలోకి రాకముందు 2021 నాటికి దాదాపు 10 లక్షల బాలికలు మాధ్యమిక పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ విద్యా పురోగతి ఇప్పుడు తీవ్రంగా వెనక్కి వెళ్లింది. మహిళలపై విద్యా ఆంక్షల ప్రభావంతో మహిళా ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మంత్రసానుల కొరత పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. మహిళలకు విద్య లేకపోవడం వల్ల భవిష్యత్తులో అవసరమైన మహిళా వైద్య నిపుణులను తయారు చేయడమే కష్టమవుతోంది. మహిళలను ఉద్యోగాలు, ప్రజా జీవితం, క్రీడలు, ఉద్యానవనాలు, వ్యాయామశాలలు వంటి అనేక రంగాల నుంచి దూరం చేశారు.చిత్రహింసలు, అక్రమ హత్యలు మహిళలు దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే పురుష సంరక్షకుడు వెంట ఉండాలనే ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్ ప్రకారం, అఫ్గానిస్థాన్లో పరిస్థితి తీవ్రమైన మానవ హక్కుల సంక్షోభంగా మారింది. మహిళలపై జరుగుతున్న వ్యవస్థీకృత వివక్షను బెన్నెట్ మానవత్వానికి వ్యతిరేకమైన లింగ ఆధారిత హింసగా అభివర్ణించారు. మహిళల సమస్యలకే పరిమితం కాకుండా ఏకపక్ష అరెస్టులు, చిత్రహింసలు, అక్రమ హత్యలు, బలవంతపు అదృశ్యాలు, భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, జర్నలిస్టులపై దాడులు కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మత, జాతి మైనారిటీలపై వివక్ష, పౌర సమాజం పనిచేసే స్థలం తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా కొనసాగుతున్నాయి.తాలిబాన్ అంతర్జాతీయ గుర్తింపు సాధించడంలో ఆశించినంతగా విజయవంతం కాలేదు. రష్యా మాత్రమే తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఇతర దేశాలు మాత్రం వివిధ స్థాయుల్లో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తాలిబాన్ అధికారాన్ని గట్టిగా నిలబెట్టుకున్నప్పటికీ ప్రజల్లో అసంతృప్తి నెమ్మదిగా పెరుగుతోంది. ప్రస్తుత స్థిరత్వాన్ని శాశ్వత రాజకీయ పరిష్కారంగా భావించలేమని, మహిళల హక్కులు, అంతర్జాతీయ ఒంటరితనం, ప్రజల అసంతృప్తి భవిష్యత్తులో తాలిబాన్కు పెద్ద సవాళ్లుగా మారవచ్చని విశ్లేషించింది.మొత్తంగా 5 ఏళ్ల తాలిబాన్ పాలనలో భద్రత, భూభాగంపై పూర్తి నియంత్రణ, కొన్ని మౌలిక వసతులు సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు. కానీ బాలికల విద్య, మహిళల హక్కులు, సమగ్ర పాలన, అంతర్జాతీయ గుర్తింపు, ప్రజల స్వేచ్ఛ విషయంలో తీవ్ర వైఫల్యాలు కనిపిస్తున్నాయి.
జాతీయం
భారతీయులకే అవమానం.. సోనియా క్షమాపణలు చెప్పాలిందే: అమిత్ షా
ఢిల్లీ: వందేమాతరం వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దేశ ప్రజలను అవమానించిందని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన అవమానాన్ని 140 కోట్ల మంది భారతీయులు కళ్లారా చూశారని అన్నారు. దేశభక్తికి ప్రతీకగా భావించే ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15 సందర్బంగా శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల జరిగాయి. ఈ సందర్భంగా ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ఆ సమయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు వేదికపై ఉన్నారు. వందేమాతరం పాట ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఖర్గేతో మాట్లాడటం, కొన్ని సంజ్ఞలు చేయడం కనిపించిన వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది. బీజేపీ ఆరోపణ ఏమిటంటే.. పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనపై సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసి, దాన్ని ఆపేలా సంకేతాలు చేశారని మండిపడుతున్నారు.కాంగ్రెస్ ఏం చెబుతోంది?కాగా, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పూర్తిగా ఖండించింది. సోనియా గాంధీ పాటను ఆపాలని సూచించలేదని, ఆమె ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సూచించారని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. దీంతో, రాజకీయం దుమారం రేగింది. ఇక్కడ ఒక చారిత్రక అంశం ఉంది. 1937లో కాంగ్రెస్ వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే బహిరంగ కార్యక్రమాల్లో పాడే విధానాన్ని అనుసరించింది. అయితే, 2026లో వందేమాతరం పూర్తి రూపంపై కేంద్రం కొత్తగా ప్రాధాన్యత ఇవ్వడంతో, పూర్తి ఆరు చరణాల ఆలాపనపై రాజకీయ చర్చ మళ్లీ మొదలైంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యక్రమంలో పూర్తి రూపం పాడుతున్న సమయంలో సోనియా గాంధీ చేసిన సంజ్ఞల వీడియో బీజేపీ చేతికి రాజకీయ ఆయుధంగా మారింది. బీజేపీ ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం తమ నేతలు వందేమాతరాన్ని అవమానించారనే ఆరోపణను తిరస్కరిస్తోంది.
వారణాసి ఎయిర్పోర్టులో గన్ మిస్ఫైర్.. ఇద్దరికి గాయాలు
లక్నో: వారణాసి విమానాశ్రయంలో ఆదివారం భారీ ప్రమాదం తప్పింది. ఆయుధాల తనిఖీ సమయంలో ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పిస్టల్ అనుకోకుండా పేలడంతో ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది గాయపడ్డారు. దీంతో, విమానాశ్రయంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.వివరాల మేరకు.. అజాంగఢ్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానం IX-1810లో ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. అతని వద్ద పిస్టల్, మ్యాగజైన్ ఉండగా.. ప్రయాణానికి ముందే ఆయుధాల వివరాలను అధికారులకు వెల్లడించాడు. ఆదివాయం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఆయుధం, సంబంధిత పత్రాలను తనిఖీ చేస్తున్న సమయంలోనే పిస్టల్ నుంచి ఓ రౌండ్ పేలింది. ఈ ఘటనలో సమీపంలో ఉన్న ఇద్దరు సిబ్బంది తగలి గాయపడ్డారు.తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్ తొలుత నేలను తాకి అనంతరం సిబ్బందిని తాకినట్లు అధికారులు తెలిపారు. ఓ మహిళా సిబ్బందికి తొడ భాగంలో బుల్లెట్ గాయం కాగా, మరో పురుష సిబ్బంది చేతికి గాయమైంది. ఈ క్రమంలో గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం న్యూ లక్ష్మీ ట్రామా సెంటర్కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వారణాసి విమానాశ్రయ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. ఆయుధం, దాని పత్రాల తనిఖీ సమయంలో ఆయుధ యజమాని, విమానాశ్రయ సిబ్బంది అక్కడే ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు కొనసాగుతోంది.Today, 16.08.2026, at about 0930 hrs, a passenger travelling with his wife on flight IX-1810 to Mumbai declared weapons on board the flight. During the weapons check, the passenger fired a round, injuring two AAICLAS screeners. Both were taken to New Laxmi Trauma Centre for…— ANI (@ANI) August 16, 2026
అమితాబ్కు షాకిచ్చిన మూడడుగుల డాక్టర్ గణేశ్!
ముంబై: జీవితంలో ముందుకు సాగాలనే తపన, పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చని డాక్టర్ గణేష్ బరైయా నిరూపించారు. కేవలం మూడు అడుగుల ఎత్తు ఉన్న ఆయన, ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్గా గుర్తింపు పొందారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గుజరాత్లోని భావ్నగర్ జిల్లా గోర్ఖీ గ్రామానికి చెందిన గణేష్ బరైయా కేబీసీ షోలో పాల్గొన్నారు. తన ఎత్తు తక్కువ కారణంగా ఎంబీబీఎస్ ప్రవేశం కోసం ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, న్యాయపోరాటం గురించి వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అమితాబ్ బచ్చన్ ఆయనను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి, ఆయన ధైర్యాన్ని, పట్టుదలను కొనియాడారు. అయితే మూడు లక్షల రూపాయల ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇవ్వడంతో ఆయన కేబీసీ ప్రయాణం ముగిసింది.బాల్యంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గణేష్ గుర్తు చేసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రోజుల్లో కొందరు సర్కస్ నిర్వాహకులు తమ ఇంటికి వచ్చారని, తనను తమ వెంట పంపిస్తే రూ. ఐదు లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని చెప్పారు. కానీ ఆయన తండ్రి ఆ భారీ మొత్తాన్ని తిరస్కరించి, కొడుకును చదివించడమే ముఖ్యమని భావించారు. తల్లిదండ్రులు రోజూ ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న పాఠశాలకు వారి భుజాలపై తనను మోసుకుంటూ వెళ్లేవారిని తెలిపారు.‘నీట్’ పరీక్షలో మంచి మార్కులు సాధించినప్పటికీ, ఎత్తు తక్కువ కారణంగా మొదట్లో ఏ కాలేజీ కూడా ఆయనకు ఎంబీబీఎస్ సీటు ఇవ్వడానికి నిరాకరించింది. నిరుత్సాహపడకుండా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన న్యాయ పోరాటం చేశారు. పట్టుదల వీడకుండా పోరాడి ఎంబీబీఎస్ పూర్తి చేసి, నేడు డాక్టర్గా సేవలందిస్తున్నారు. ఆయన సంకల్పం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: దుకాణంలో రూ.16 ఆఫర్.. జనం తొక్కిసలాట!
దుకాణంలో రూ.16 ఆఫర్.. జనం తొక్కిసలాట!
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ వస్త్ర దుకాణదారుడు తన కుమారుడి జన్మదినం సందర్భంగా ప్రకటించిన రూ. 16 కే దుస్తుల ఆఫర్ ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ప్రకటనను చూసి నాలుగు వేల మందికిపైగా జనం ఒక్కసారిగా దుకాణం వద్దకు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.అన్వర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలమ్ మార్కెట్లో రయీస్ ఆలం అనే వ్యక్తి వస్త్రరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 15న తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. కేవలం 16 నిమిషాల వ్యవధిలో ఎవరైనా సరే కేవలం 16 రూపాయలకే సూట్లు, జీన్సులు, షర్టులు వంటి రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేయవచ్చని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ప్రకటన క్షణాల్లో వైరల్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది జనం దుకాణం ముందు బారులు తీరారు.కొద్దిసేపటికే అక్కడ మూడు నుంచి నాలుగు వేల మంది గుమిగూడారు. ఆఫర్ను దక్కించుకునేందుకు జనం ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పలువురు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో భయాందోళనకు గురైన దుకాణదారుడు రయీస్ ఆలం దుకాణానికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.సమాచారం అందుకున్న అన్వర్గంజ్, బేగమ్గంజ్ పోలీసులతో పాటు ఏసీపీ మంజయ్ సింగ్ భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లాఠీలు పట్టుకుని, లౌడ్స్పీకర్ల ద్వారా ప్రజలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దుకాణం వెలుపల దొరికిన యజమాని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ జనసమూహాన్ని కూడగట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు దుకాణదారుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. ఇది కూడా చదవండి: కేరళలో మొదలైన ఓనం సంబారాలు.. 10 రోజుల సందడికి శ్రీకారం!
ఎన్ఆర్ఐ
తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) /TCSS యొక్క పదమూడో వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2వ తేదీన స్థానిక కుర్తాళం బోర్డర్, లిటిల్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 65-70 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో ముందుగా పన్నెండో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2025-2026 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు సమ్మయ్య మోలుగూరి, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ పూర్వ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల,కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మోడరేటర్ ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన నీలం సుఖేందర్ గార్లకు కృతజ్ణతలు తెలియజేశారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రస్తుత పదవీకాల అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన నల్ల భాస్కర్ గుప్త, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లు ప్రకటించారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు నల్ల భాస్కర్ తెలిపారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ సారి ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. దీని తోపాటు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి, శ్రీధర్ బండారు గార్లను ప్రకటించి ఎన్నుకోవడం జరిగింది.నూతన కార్యవర్గం కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు నల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్య, సరావేణి విజయ కుమార్ ఉన్నట్టు తెలిపారు.మాజీ అధ్యక్షుడు రమేష్ బాబు గడప, తన పదవీకాలంలో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన అసాధారణ, అద్భుతమైన సేవలను ఏవి (AV) రూపంలో ప్రదర్శించి కార్యనిర్వాహక సభ్యులందరూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. గత పన్నెండు సంవత్సరాలుగా రమేష్ బాబు గడప అందించిన సేవలను పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, నీలం మహేందర్ గార్లు ఘనంగా కొనియాడారు. గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో భాగమై రెండు సార్లు అధ్యక్షుడిగా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ సేవలందించిన దుర్గా ప్రసాద్, సుగుణాకర్ రెడ్డి గార్లకు కార్యనిర్వాహక సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి కార్యనిర్వాహక సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీని ఆస్వాదించారు.(చదవండి: అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్)
హైదరాబాద్కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్
సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు.
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు
క్రైమ్
ఈ ప్రశ్నలకు బదులేది..?
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమై వందరోజులు దాటింది. నా కొడుకు మృతదేహాన్ని ఏం చేశారు... కనీసం ఆ బూడిదైనా ఇవ్వండంటూ సాయికృష్ణ తల్లి నెత్తీ...నోరూ మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఏదో కన్నీళ్లు తుడవటానికంటూ సిట్ వేసి చేతులు దులుపుకొంది. సిట్ వేసి రెండు నెలలు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేవలం సీఐ నాగరాజు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అరెస్టు చేయడం వరకే పరిమితం అయింది తప్ప కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం కలిగించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యమై వంద రోజులైంది. ఇప్పటికీ సాయికృష్ణ మృతదేహం ఏమైందో, ఎక్కడ దహనం చేశారో, బూడిద కూడా ఏం చేశారో పరమ రహస్యంగానే ఉంది. రిమాండ్లో ఉన్న సీఐ నాగరాజుని, నలుగురు కానిస్టేబుళ్లను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని వేర్వేరుగా ప్రశ్నించినా ఇప్పటివరకూ ఏం తేల్చలేకపోయారు. అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్్క ఫోర్స్ పోలీసులు ఏ కేసులో తీసుకు వచ్చారు. వారెంట్ పెండింగ్ ఉంటే కోర్టులో హాజరుపర్చకుండా, కృష్ణలంక పోలీస్స్టేషన్లో ఎందుకు అప్పగించారు. అక్కడే ఉంచి విచారించారా.. లేక మరేదైనా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారా.. సాయికృష్ణ ఎప్పుడు(లాకప్డెత్) మరణించాడు. ఆ తర్వాత డెడ్బాడీని ఏం చేశారో ఇప్పటికీ తేల్చలేదు. బైక్పై డెడ్బాడీని తీసుకెళ్లి స్వర్గపురిలో దహనం చేసినట్లు వస్తున్న వార్తలు నిజమేనా.. స్వర్గపురిలో ఏమి ఆధారాలు సేకరించారన్న సమాచారంపై స్పష్టత రాలేదు. సాయికృష్ణ కాలిగోళ్లు పీకడం కోసం ఉపయోగించిన ఆర్ఎంపీ ఇప్పటివరకూ ఎంతమందికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. అసలు పోలీసు స్టేషన్లో ఆర్ఎంపీకి ఏం పని అనే విషయంపై కూడా సిట్ దృష్టి పెట్టలేదు. సాయికృష్ణ కేసులో కమిషనరేట్లోని మరో సీఐ సహకరించారన్న వార్తలపై... ఆ సీఐ ఎవరు అన్నది గుర్తించారా? గుర్తిస్తే ఇప్పటి వరకూ ఆ సీఐని ఎందుకు ప్రశ్నించలేదు అన్నది చర్చనీయాంశంగా మారింది. సమాధానాలు లేని ప్రశ్నలు... సిట్ చేస్తున్న విచారణ తీరును చూస్తే కేవలం సీఐ నాగరాజు, కానిస్టేబుళ్ల అరెస్టులతో సరిపెట్టేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ కేసులో సీఐ స్నేహితుడు సురేష్ హస్తం ఉందని ముందునుంచే వార్తలు వస్తున్నప్పుడు అతను అదృశ్యం అయ్యే వరకూ పోలీసులు ఎందుకు వేచి ఉన్నారు. ఈ కేసులో ఉన్న కానిస్టేబుళ్లు పరారీలో ఉన్న సమయంలో డబ్బుల కోసం తమ ఫోన్లు నాగపూర్లో అమ్మేశామని కట్టుకథ చెబితే దాన్ని ఎందుకు ఛేదించలేదు. పోయిన ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి బాధితులకు ఇస్తున్న తరుణంలో పోలీసు కానిస్టేబుళ్లు అమ్మేసిన ఫోన్లు ఎందుకు కనిపెట్టలేకపోయారు. సిట్ ఇప్పటివరకూ ఈ కేసుపై అప్డేట్ ఎందుకు ఇవ్వడం లేదు. అసలు సాయికృష్ణ ఏమయ్యాడో తేల్చేందుకు మరెన్ని రోజులు కావాలి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు ఇప్పటికే బెయిల్ పిటీషన్ కూడా దాఖలు చేశారు. కేసును కాలయాపన చేస్తూ నీరుగార్చి బెయిల్ వచ్చేందుకు సహకరిస్తారా? అసలు ఈ కేసులో ఉన్న పెద్దల్ని ఎందుకు కాపాడుతున్నారు. దీని వెనుక ఏ వ్యవహారం ఉందన్న విషయంపై ఎందుకు విచారణ జరపడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ కేసు నీరుగార్చే ప్రయత్నాలు సాయికృష్ణ తల్లిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసినప్పటి నుంచి జరుగుతున్నట్లు స్వయంగా సాయికృష్ణ పిన్ని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సాయికృష్ణ తల్లితో హెబియస్ కార్పస్ పిటీషన్ విత్డ్రా చేసేందుకు పిటీషన్ కూడా వేయించిన సంగతి తెలిసిందే. పోలీసు స్టేషన్లో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని ఒక హోంగార్డు మాయం చేశాడని నెపం అతనిపై వేసేశారు. పోలీస్స్టేషన్ సీసీ ఫుటేజ్ సరే.. ఆ స్టేషన్ రోడ్డులోని కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం అయి ఉంటాయి కదా.. అక్కడ ఫుటేజీ ఏమైందన్న విషయాన్ని సిట్ తేలుస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు...ఇంకా సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమై వందరోజులు దాటింది. నా కొడుకు మృతదేహాన్ని ఏం చేశారు... కనీసం ఆ బూడిదైనా ఇవ్వండంటూ సాయికృష్ణ తల్లి నెత్తీ...నోరూ మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఏదో కన్నీళ్లు తుడవటానికంటూ సిట్ వేసి చేతులు దులుపుకొంది. సిట్ వేసి రెండు నెలలు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేవలం సీఐ నాగరాజు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అరెస్టు చేయడం వరకే పరిమితం అయింది తప్ప కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.
ఏడాదిగా శారీరక సంబంధం.. ఇప్పుడు పెళ్లికి నో..!
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో సహజీవనం చేసి వేధింపులకు పాల్పడడంతో పాటు దాడి చేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన యువతి (25) ఈవెంట్ డ్యాన్సర్గా పనిచేస్తోంది. ఈమెకు రగంటి మనోజ్ (28)తో పరిచయం ఏర్పడింది. మనోజ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అతడి వివాహ ప్రతిపాదనను అంగీకరించింది. ఈ క్రమంలో యూసుఫ్గూడలో ఇద్దరూ ఏడాది పాటు కలిసి ఉన్నారు. ఈ సమయంలో మనోజ్ పలుమార్లు ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకున్నాడు. ఇతర యువతులతో కూడా అతడి సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడు గొడవ పడడంతో పాటు ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 13న తెల్లవారుజామున మద్యం మత్తులో గదికి వచ్చిన మనోజ్ ఆమెను శారీరికంగా వేధించాడు. ఓ మహిళా సహోద్యోగి గురించి ప్రశ్నించడంతో ఆమెపై దాడి చేసి ముఖంపై తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నెల రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ఏం కష్టం వచ్చిందో?
అన్నమయ్య జిల్లా: నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ఆత్మహత్యకు యత్నించి మృత్యువుతో పోరాడుతోంది. గుర్రంకొండ మండలంలో శనివారం జరిగిన ఈ ఘటనపై జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్ట్ పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన సురేంద్ర కుమార్తె కోమల(27)కు నెల రోజుల క్రితం తమ దగ్గరి బంధువుతో పెళ్లి నిశ్చయమైంది. మరో నెల రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లాల్సిన కోమలకు ఏం కష్టం వచ్చిందో ఏమో చిన్న మనసు చేసుకుంది. జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఉన్న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. బాధితురాలిని తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించినా ఆ యువతి ఆరోగ్యం కుదుట పడలేదు. డాక్టర్ల సలహా మేరకు అక్కడి నుంచి కుటుంబీకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలను గుర్రంకొండ పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
చిట్టి గుండె ఆగింది
నిజామాబాద్ రూరల్ : పంద్రాగస్టు రోజు ఉదయాన్నే లేచి జెండా పండుగను సంబురంగా జరుపుకుందామనుకున్న విద్యార్థిని గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశాపూర్కు చెందిన సుంకె మౌనిక కూతురు సుంకే సాత్విక(11) సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. చిన్నారి గుండెకు గతంలో శస్త్రచికిత్స జరిగింది. కాగా, రెండు రోజుల క్రితం సాతి్వకకు గుండెలో నొప్పి రావడంతో ప్రిన్సిపల్ నళిని తల్లికి సమాచారం అందించారు. దీంతో మౌనిక తన కూతురిని నిజామాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా గతంలో గుండె ఆపరేషన్ చేసిన ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హైదరాబాద్లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం పరిస్థితి విషమించి సాతి్వక ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. చిన్నారి మృతితో కేశాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మౌనిక భర్త గతంలోనే మృతి చెందగా, ఉన్న ఒక్కగానొక్క కూతురు మరణించడంతో గ్రామస్తులను కలచివేసింది.
వీడియోలు
ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు
100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్..
ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు..
పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు
సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా
నీకు మిగిలింది రెండేళ్లే.. తర్వాత నీ బ్రతుకు.. చింతమనేనికి లాయర్ శ్రీనివాస్ వార్నింగ్
ట్వీట్ తో హార్మోజ్ ను స్వాధీనం చేసుకోలేరు.. ట్రంప్ కు ఇరాన్ కౌంటర్
ముద్రగడ కుటుంబ సభ్యులకు YSRCP నేతలు పరామర్శ
చెన్నై లవ్ స్టోరీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
నల్లగొండ జిల్లా రూపా రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..


