పిల్లల్ని ఎరగా వేసి తల్లులకు వల..!
కాకినాడ క్రైం: సౌజన్యను సాధిక్ ఖాన్ ట్రాప్ చేసి తన దారిలోకి తెచ్చుకుంది మొదలు, ఓ క్రైం థ్రిల్లర్ని తలపించేలా తన రాచకార్యాల్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించాడు. తన దారిలోకి తెచ్చుకోవడం, ఆమైపె ఇష్టాన్ని వ్యక్తం చేయడం, అక్రమ బంధాన్ని కొనసాగించడం, ఆమె భర్తను అడ్డు తొలగించుకునేందుకు కుయుక్తులు పన్నడం, ఆస్తి కాజేసేందుకు చేసిన కుట్ర, అంతకుముందు ఆమెను కొట్టడం, భర్తపై దాడి, బాధితురాలి కుటుంబసభ్యుల పైనా విరుచుకుపడడం, వారిని బ్లాక్మెయిల్ చేయడం ఇవేవీ థ్రిల్లర్కు తీసిపోని రీతిలో ఉన్నాయి. ఆత్మహత్య ఘటన తర్వాత తప్పించుకోవడానికి చేసిన విఫలయత్నాలు ఈ కోవకే చెంది పోలీసుల మతులనే పోగొట్టాయి. సౌజన్య లాంటి మరికొందరు సాధిక్ ఖాతాలో ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పిల్లల్ని అడ్డుపెట్టుకొని తల్లులకు వల వేసేవాడని వారి ప్రాథమిక విచారణలో తేలింది.ఆ ఒక్క క్లూతోనే...కేవలం ఒక్క క్లూతోనే సాధిక్ జాడ బట్టబయలైందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలు జరగడం, వాటికి తానే కారణం కావడంతో ఎవరూ అతడిపై ఆరోపణలు చేయకుండానే జాగ్రత్తపడి పరారయ్యాడు. అప్పటికి లేఖ దొరకలేదు, సాధిక్ ఖాన్ అనే వ్యక్తి పేరు కూడా ఎవరికీ తెలియదు. ఆ సమయంలో తాను వినియోగిస్తున్న ఒక్కొక్కటి రూ.1.5 లక్షలు విలువ చేసే రెండు ఖరీదైన ఫోన్లు వదిలేసి పరారయ్యాడు. వెళుతూ రైఫిల్ అసోసియేషన్లో ఉన్న ఓ ఆప్తమిత్రుడికి ఫోన్ చేసి ఆ నంబర్ డిలీట్ చేసేశాడు. కొందరి ఫోన్ నంబర్లు పాకెట్ బుక్లో రాసుకొని బయల్దేరాడు. కాల్ రికార్డ్స్ డేటాలో ఆ కాల్ జాడ లభ్యమైంది. ఇంటి నుంచి నేరుగా ద్విచక్రవాహనంపై సామర్లకోటకు వెళ్లిన సాధిక్ బైక్ను పార్కింగ్లో ఉంచి కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. పలువురి ప్రయాణికుల ఫోన్లతో తనకు కావలసిన వారికి ఫోన్లు చేశాడు. చివరికి మహారాష్ట్రకు వెళ్లి తన స్నేహితుడిని కలిశాడు. అక్కడ ఒక రోజు ఉన్నాడు. తర్వాత రోజు మీరట్కి బయల్దేరాడు. సరిగ్గా అదే సమయానికి కాకినాడ పోలీసులు సదరు మిత్రుడ్ని చేరారు, కొద్ది సేపటి ముందు సాధిక్ మీరట్కు అబ్బాస్ అనే మరో రైఫిల్ ట్రైనర్ను కలిసేందుకు వెళ్లాడని సమాచారం అందించాడు. అతడి కంటే ముందు అబ్బాస్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు సాధిక్ అబ్బాస్ ఇంటి వద్దకు సమీపిస్తుండగా పట్టుకున్నారు. అక్కడి నుంచి కేరళ వెళ్లాలని అనుకున్నాడని పోలీసులు తెలిపారు.కోడలిపై అనుమానం..కోడలి వ్యవహారశైలి ఆది నుంచీ అనుమానాస్పదంగానే తోచిందని సాధిక్ ఖాన్ చేతిలో హత్యకు గురయ్యాడని భావిస్తున్న జగదీశ్వర్రెడ్డి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అనూహ్య రీతిలో ఏ కారణం లేకుండానే జగదీష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని వాపోయారు. ఏడాది పాటు వాంతులు అయ్యాయని, కారణం తెలిసేది కాదని చెప్పుకొచ్చారు. మాట నెమ్మదించి, కాలు కూడా చచ్చుబడిందని అన్నారు. జీర్ణకోశ సమస్యతో బాధపడుతూ కాకినాడ సర్పవరంలో ఉన్న ఓ ఆసుపత్రిలో ఐదు రోజులు చికిత్స అనంతరం జగదీష్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లో ఉన్న ప్రముఖ ఆసుపత్రి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి వెళ్లి చికిత్స పొందినట్టు చెప్పారు. అక్కడ కాస్త కోలుకోగా, హైటెక్ సిటీలో ఉన్న ఓ ఫిజియోథెరపీ సెంటర్కు సౌజన్యతో పాటు ఆమె తల్లిదండ్రులు, అత్త, మామ తీసుకువెళ్లి చేర్చారు. కేవలం ఫిజియోథెరపీ చేస్తే చాలు కోలుకోవలసిన దశలో జగదీశ్వర్రెడ్డి హఠాత్తుగా మరణించాడు. ఫిజియోథెరపీ చేస్తుండగా తన భర్త స్పందించడం లేదని కోడలు సమాచారం ఇచ్చిందని జగదీశ్వర్రెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు. సౌజన్య ప్రవర్తన తీవ్ర అనుమానాలకు తావిచ్చిందని తెలిపారు. ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి తాను మాత్రమే ఉంటానని అందరూ వెళ్లిపోవాలని చెప్పేదన్నారు. చనిపోయే కొద్దిసేపటి ముందు కూడా తమను హోటల్ గదికి పంపేసిందని, తానే చూసుకుంటానని చెప్పిందని అంటున్నారు. సాధిక్ ఖాన్ ఆ సమయంలో వచ్చి సౌజన్యతో కలిసి జగదీష్ తాగే ప్రొటీన్ షేక్లో అంతకుముందు పట్టించిన స్లో పాయిజన్ గుణాలున్న రసాయనాన్ని మరోమారు కలిపి ఉంటాడని అనుమానిస్తున్నామని కుటుంబీకులు తెలిపారు.పిల్లలు ఎర.. తల్లులు సొరఖతర్నాక్ ఖాన్ వ్యవహార శైలిని తమ పిల్లల్ని కోచింగ్లో చేర్చిన పలువురు తల్లులు పూసగుచ్చినట్టు తమను సంప్రదించిన మీడియాకు తెలిపారు. పిల్లల్ని అడ్డుపెట్టుకొని తమతో మాటకలిపేందుకు యత్నించేవాడని, తమ స్టేటస్లు, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం పేజీలు ఫాలో అవుతూ లైక్స్ కొడుతూ ముగ్గులోకి దించేందుకు యత్నించేవాడన్నారు. ఈ కారణంతోనే తమ పిల్లల్ని అతడి అకాడమీలో మానిపించేశామని కొందరు చెప్పారు. క్లాస్ ఇన్ఫర్మేషన్ కోసం అంటూ కాల్స్ చేసి అక్కర్లేని విషయాలతో మాటలు పెంచేవాడన్నారు.
సేఫ్టీ టూల్స్ పేరుతో మెటా మోసం.. నిజం ఒప్పుకున్న ఇన్స్టా చీఫ్
కాలిఫోర్నియా: టీనేజర్ల భద్రతా ఫీచర్లను ఎంతమంది వినియోగిస్తున్నారనే వాస్తవాన్ని వెల్లడించకుండానే వాటిని ప్రచారం చేశామని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి కాలిఫోర్నియా న్యాయస్థానంలో అంగీకరించారు. పిల్లలను సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మార్చడంతో పాటు వారి వ్యక్తిగత డేటాను సేకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ మెటా సంస్థపై అమెరికాలోని 29 రాష్ట్రాలు దాఖలు చేసిన దావా విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగుచూసింది.టీనేజర్లు స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునేందుకు ప్రవేశపెట్టిన ‘టేక్ ఏ బ్రేక్’ (2021), ‘క్వైట్ మోడ్’ (2023) ఫీచర్లపై మొస్సేరిని న్యాయవాదులు ప్రశ్నించారు. మెటా అంతర్గత పత్రాల ప్రకారం ‘టేక్ ఏ బ్రేక్’ వినియోగం కేవలం 1.8 శాతంగా, ‘క్వైట్ మోడ్’ వినియోగం 8.7 శాతంగా నమోదైంది. ప్రారంభ దశలో మొత్తం ఖాతాల్లో 1 నుంచి 2 శాతం మాత్రమే వీటిని వినియోగించినప్పటికీ, ఆ వివరాలను బహిర్గతం చేయలేదని మొస్సేరి ఒప్పుకున్నారు. అయితే 2024లో తీసుకొచ్చిన ‘టీన్ అకౌంట్స్’ ద్వారా ఈ పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు.2021లో మొస్సేరి రాసిన బ్లాగ్లో ‘90 శాతానికి పైగా టీనేజర్లు రిమైండర్లను కొనసాగిస్తున్నారు’ అని పేర్కొనడంపై కోర్టులో చర్చ జరిగింది. ఈ ఫీచర్ను ఇప్పటికే యాక్టివేట్ చేసుకున్నవారికి మాత్రమే ఆ 90 శాతం వర్తిస్తుందని, మొత్తం టీనేజర్లలో 90 శాతం మంది వినియోగించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, మెటా మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టురో బెజార్ సాక్ష్యమిస్తూ.. ‘టేక్ ఏ బ్రేక్’ విఫలమయ్యేలా రూపొందించిన ఫీచర్ అని ఆరోపించారు. పిల్లల ఎంగేజ్మెంట్ తగ్గుతుందనే ఉద్దేశంతోనే ‘క్వైట్ మోడ్’ను డిఫాల్ట్గా ఉంచడానికి యాజమాన్యం నిరాకరించిందని మాజీ డేటా సైంటిస్ట్ జార్జ్ వోలిచెంకో తెలిపారు. ఈ కేసులో మెటాపై అభియోగాలు రుజువైతే సుమారు 200 బిలియన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశముంది.ఇది కూడా చదవండి: మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం!
అమెరికా ఆశలు తగ్గుముఖం!
వాషింగ్టన్: అమెరికా చదువుల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది. అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే 2025–26లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లలో 15 శాతం తగ్గుదల నమోదైనట్లు ‘కామన్ ఆప్’అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ద్వారా స్పష్టమైంది. ఈ సంస్థ సుమారు 1100 అమెరికన్ వర్శిటీల్లో అడ్మిషన్ల వ్యవహారాన్ని పరిశీలించిన తరువాత ఈ నివేదిక విడుదల చేసింది. 2026–27లో మాత్రం అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లలో పెరుగుదల నమోదైనట్లు ఈ నివేదిక తెలిపింది. ఇదే మయంలో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులు మార్చి ఒకటి తరువాత పది శాతం పడిపోయినట్లు తెలిసింది. భారత్ నుంచి చదువుల కోసం ఏటా అమెరికాకు వెళ్లే వారు లక్షల్లో ఉంటారన్నది మనకు తెలిసిన విషయమే. 2024–25లో ఈ సంఖ్య 3.63 లక్షలు. స్వచ్ఛంద సంస్థ కామన్ ఆప్ నివేదిక ప్రకారం 2025–26లో విదేశీ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందించిన తోడ్పాటు విలువ ఏకంగా 4177 కోట్ల డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 3837 కోట్ల డాలర్లకు పడిపోనుంది. వీసా నియమ నిబంధనలు కఠినతరం కావడం, ట్రంప్ ప్రభుత్వ విధానాల్లో అస్థిరతల కారణంగా ఈ ఏడాది అమెరికా చదువుల కోసం విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులు 1.1 లక్షలు తగ్గిపోతాయని అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్, జేబీ ఇంటర్నేషనల్లు ఇటీవలే ప్రకటించాయి. వీరి అంచనాల ప్రకారం 2025–26 ఫాల్ అడ్మిషన్లకు 11.69 లక్షల దరఖాస్తులు అందితే.. ఈ ఏడాది అది 10.57 లక్షలకు పడిపోనుంది. చదువు తరువాత అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పించిన విధానాలను అమెరికా ఈ ఏడాది జూలైలోనే సవరించింది. విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు గరిష్టంగా నాలుగేళ్ల గడువు విధించింది. అంతేకాకుండా.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) దరఖాస్తులపై లక్ష డాలర్ల ఫీజు వసూలు చేసేందుకు ప్రయత్నాలూ జరుగుతున్నాయి. విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చి గ్రాడ్యుయేషన్ తరువాత అక్కడే కొంతకాలం పనిచేసేందుకు ఓపీటీ అవకాశమిస్తుంది. ఓపీటీలో భాగంగా పన్నెండు నుంచి 24 నెలలపాటు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా.. కంపెనీలు విద్యార్థి వీసాలపై పనిచేస్తున్న వారి హెచ్1–బీ వీసాలకు స్పాన్సర్ చేయడం ద్వారా శాశ్వత ఉద్యోగులుగా మార్చుకునేందుకూ ఓపీటీ వీలు కల్పిస్తుంది. ఈ హెచ్1–బీ వీసాలపైనే భారతీయు టెకీలు చాలామంది తమ అమెరికా కలను నెరవేర్చుకుంటూంటారు.
ఇంటిని అమ్మి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య
వివాహేతర సంబంధం, డబ్బుల గొడవతో భార్యను భర్త హత్య చేసిన ఘటన తళి వద్ద జరిగింది. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని కర్ణాటక సరిహద్దు గ్రామమైన గుమ్మళాపురంలో నారాయణస్వామి (39), భార్య విద్య (30), ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నారు. విద్యకు మరో యువకునితో ఏడాదిగా అక్రమ సంబంధం ఉందని భర్తకు అనుమానంగా ఉంది. ఇలాంటివి వద్దని భార్యను మందలించాడు. దీంతో కొన్నివారాలుగా గొడవలు జరుగుతుంటే పెద్దలు పంచాయతీ చేశారు. పునీత్తో పరారీ నారాయణస్వామికి అప్పులు ఎక్కువ కావడంతో స్థలాన్ని రూ.22 లక్షలకు విక్రయించి అప్పు తీర్చేశాడు. మిగిలిన రూ.5 లక్షలను భార్య ఖాతాలో ఉంచాడు. కొన్నిరోజుల క్రితం విద్య, ప్రియుడు పునీత్తో పరారై బెంగళూరు దగ్గర ఆనేకల్లో మకాం వేసింది. ఇది తెలుసుకొన్న నారాయణస్వామి ఆనేకల్కు చేరుకొని తన డబ్బులు తిరిగి ఇవ్వాలని, తన వెంట రావాలని భార్యను కోరాడు. ఆమె తిరస్కరించడంతో గ్రామానికెళ్లిపోయాడు. ఊరికి బ్యాంకుకు రాగా.. సోమవారం బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసేందుకు విద్య గుమ్మళాపురానికి వచ్చినట్లు తెలుసుకొన్న భర్త అక్కడికెళ్లి డబ్బులు ఇవ్వు, నీ పేరు మీద ఉన్న ఆస్తిని పిల్లల పేరుమీద రాయాలంటూ గొడవ చేస్తూ బ్యాంకు నుంచి ఆమెను బయటకు లాక్కొచ్చి తలపై బండరాయితో బాది హత్య చేసి పారిపోయాడు. డెంకణీకోట డీఎస్పీ, తళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని ఆస్పత్రికి తరలించారు. నారాయణస్వామిని అరెస్ట్ చేయగా ఈ ఘటన తళి ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. తల్లీదండ్రి దూరమై ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. కర్ణాటక : ‘నిన్ను.. నీ ఇద్దరు పిల్లలను చూసుకుంటా లిల్లీ’
డేరింగ్ ప్రపోజల్ చేసిన నెట్ఫ్లిక్స్ జంటపై క్రిమినల్ కేసులు!
స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు
షాకింగ్ రిపోర్ట్: పాముకాటు కేసుల్లో టాప్లో భారత్!
భువీ విజృంభణ
నేను ఇలాంటి కథ రాయలేను.. 'స్పిరిట్'కి పక్కా 'ఏ' సర్టిఫికెట్
చనిపోని దేహంతో.. చెడిపోని ప్రాణంతో!
బహూకరించిన ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు తండ్రికి ఉందా?
‘జెజు’లో సీరియల్ కిల్లర్?.. 3 రోజుల్లో 4 మృతదేహాలు లభ్యం!
కొండా సురేఖపై వేటా? రాజీనామా చేయిస్తారా?.. ఢిల్లీలో హైఓల్టేజ్ పాలిటిక్స్
చేపల మార్కెట్కు మోదీ పేరు.. రచ్చరచ్చ!
తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
...అలా చేస్తే మనమెవరమూ మిగలం సార్!
రూ.999కే ఇంటిపై సోలార్.. టాటా పవర్ కొత్త స్కీమ్
అనవసరంగా జనానికి ‘ఓటుకు నోటు’ గుర్తు చేస్తున్నామేమోననిపిస్తోంది సార్!
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సర్దార్ సర్వాయ్ పాపన్న మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
దావూద్ నేర సామ్రాజ్యానికి పునాది.. ఈ మహిళనే!
దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్
పాండవుల ధనుస్సులు, శంఖాల పేర్లు
8 ఏళ్ల తర్వాత ఒకేసారి 4 తుపానులు.. ప్రభావం ఎంతంటే..
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. స్థిరాస్తి వృద్ధి
‘బాహుబలి’తో నిర్మాణం కూల్చివేత షురూ
‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్
విలన్గా మెప్పించిన జబర్దస్త్ నటుడు
‘టాక్సిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ పక్కా?
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్
ఈ రాశి వారికి భూలాభాలు.. పనుల్లో పురోగతి
డేరింగ్ ప్రపోజల్ చేసిన నెట్ఫ్లిక్స్ జంటపై క్రిమినల్ కేసులు!
స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు
షాకింగ్ రిపోర్ట్: పాముకాటు కేసుల్లో టాప్లో భారత్!
భువీ విజృంభణ
నేను ఇలాంటి కథ రాయలేను.. 'స్పిరిట్'కి పక్కా 'ఏ' సర్టిఫికెట్
చనిపోని దేహంతో.. చెడిపోని ప్రాణంతో!
బహూకరించిన ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు తండ్రికి ఉందా?
‘జెజు’లో సీరియల్ కిల్లర్?.. 3 రోజుల్లో 4 మృతదేహాలు లభ్యం!
కొండా సురేఖపై వేటా? రాజీనామా చేయిస్తారా?.. ఢిల్లీలో హైఓల్టేజ్ పాలిటిక్స్
చేపల మార్కెట్కు మోదీ పేరు.. రచ్చరచ్చ!
తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
...అలా చేస్తే మనమెవరమూ మిగలం సార్!
రూ.999కే ఇంటిపై సోలార్.. టాటా పవర్ కొత్త స్కీమ్
అనవసరంగా జనానికి ‘ఓటుకు నోటు’ గుర్తు చేస్తున్నామేమోననిపిస్తోంది సార్!
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సర్దార్ సర్వాయ్ పాపన్న మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
దావూద్ నేర సామ్రాజ్యానికి పునాది.. ఈ మహిళనే!
దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్
పాండవుల ధనుస్సులు, శంఖాల పేర్లు
8 ఏళ్ల తర్వాత ఒకేసారి 4 తుపానులు.. ప్రభావం ఎంతంటే..
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. స్థిరాస్తి వృద్ధి
‘బాహుబలి’తో నిర్మాణం కూల్చివేత షురూ
‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్
విలన్గా మెప్పించిన జబర్దస్త్ నటుడు
‘టాక్సిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ పక్కా?
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్
ఈ రాశి వారికి భూలాభాలు.. పనుల్లో పురోగతి
ఫొటోలు
ఓనం స్పెషల్.. మెరిసిపోతున్న మలయాళ బ్యూటీస్ (ఫొటోలు)
అందాల భామ అదిరిపోయే లుక్ మమితా బైజు..(ఫొటోలు)
సైమా 2026 నామినేషన్ వేడుకలో మెరిసిన పాయల్ రాజ్పుత్ (ఫొటోలు)
ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం (ఫొటోలు)
ఇరుముడిలో బేబీ నక్షత్ర హైలెట్.. మరి ఈ క్యూట్ అమ్మాయి ఎవరో తెలుసా? (ఫొటోలు)
‘టాక్సిక్’ మూవీ HD స్టిల్స్
ఓనం స్పెషల్.. నిఖిలా ఉంది ఇలా (ఫొటోలు)
ప్రియా వారియర్ క్యూట్ లుక్స్ (ఫొటోలు)
అందంలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ అనఘా మాయా రవి.. (ఫొటోలు)
న్యూజిలాండ్లో టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. (ఫోటోలు)
సినిమా
‘టాక్సిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ పక్కా?
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్దాస్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా మరికొద్ది గంటల్లో(ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఉన్నాయి. అయితే సినిమా ఫలితం ఎలా ఉంటుందో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ( చదవండి: అడ్వాన్స్ బుకింగ్స్కే 40+ కోట్లు.. ఫస్ట్డే 100 కోట్లు పక్కా!)ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారట. అయితే హింసాత్మక సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్లు కూడా ఎక్కువే ఉండడంతో ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా అన్నమాట. టాక్సిక్ స్టోరీ ఇదేనా?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, ట్రైలర్ బట్టి చూస్తే.. ఈ సినిమా కథనం ఇలా కొనసాగబోతుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా.. గోవా మాత్రం పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉంటుంది. అక్కడ చాలా ఇల్లీగల్ దందాలు జరుగుతుంటాయి. డ్రగ్స్,మాఫియా యదేచ్ఛగా కొనసాగేవి. ఆ చీకటి రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి కొన్ని గ్రూపులు పోరాడుతుంటాయి. ఈ నేపథ్యంలో గోవాలో హింస మితిమీరిపోతుంది. వెన్నుపోట్లు, ఆధిపత్య పోరు ఉన్న ఇలాంటి ప్రపంచంలో రాయ(యష్) ఎలా ఎదిగాడు? సొంత చెల్లి గంగ(నయనతార)తో ఎందుకు పోరాటం చేయల్సి వచ్చింది? నాడియా (కియారా)తో రాయ ప్రేమాయణం కొనసాగింది? ఎలిజబెత్ (హ్యుమా ఖురేషి), రెబెకా (తారా సుతారియా), మెలిసా (రుక్మిణి వసంత్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుకోవాల్సిందే.టాక్సిక్ హైలెట్స్..ఈ సినిమాలో హైలెట్ ఏంటంటే.. యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఇందులో రాయగా, రూమిగా కనిపించి అలరించాడట. మొత్తంగా మూడు డిఫరెంట్ గెటప్లో ఆయన కనిపించబోతున్నాడు. సినిమా విజువల్ ట్రీట్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు రవి బస్రూర్ అదిరిపోయే బీజీఎం ఇచ్చాడట. అలాగే యాక్షన్ సీన్లు కూడా అదిరిపోయాయట. ముఖ్యంగా యష్, నయనతారల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్గా నిలుస్తాయని సమాచారం. ఇక తెలుగులో దిల్రాజు అల్రెడీ కొంతమందికి సినిమా చూపించాడట. వారంతా సినిమా అదిరిపోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాలకే అంతా టాక్సిక్ ప్రపంచంలోకి వెళ్తారట. ఫస్టాఫ్లో వచ్చే బోల్డ్ సీన్లు, యాక్షన్ సీక్వెన్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని అంటున్నారు.రికార్డులు పక్కా.. అయితే సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఈ చిత్రం అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. అయితే వారిలో చాలా మంది సినిమా చూడకుండా 4 రేటింగ్లు ఇచ్చి ట్వీట్లు చేస్తున్నారు.బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెబుతున్నారు. ఇక సెన్సార్ మెంబర్ని అని తనకు తానుగా చెప్పుకునే ఉమైర్ సందు మాత్రం ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు. బీగ్రేడ్ సినిమా అని, యానిమల్ మూవీకి కాపీలా ఉందని ట్వీట్ చేశాడు. అయితే అతని పోస్టులను అంతగా నమ్మే పరిస్థితి లేదు. ప్రతి సినిమాకి ఇలా రిలీజ్కు ముందే ఇష్టం వచ్చినట్లుగా రివ్యూ ఇస్తుంటాడు. ఓవరాల్గా మాత్రం ఈ సినిమాకు నెట్టింట ఫుల్ క్రేజీ ఏర్పడింది. టాక్సిక్.బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. మరి నిజంగా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఒరిజినల్ రివ్యూ కోసం సాక్షి డాట్కామ్(sakshi.com)ని ఫాలో అవ్వండి.
సంక్రాంతికి సై
తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ అంటే చాలా ప్రత్యేకం అని చెప్పాలి. తెలుగు లోగిళ్లలో ముగ్గుల పండగ వేళ విందూ వినోదాల్లో కొత్త సినిమాలది కూడా ఒక భాగమే. ఇండస్ట్రీకే కాదు... తెలుగు ప్రేక్షకులకు కూడా ముఖ్యమైన పండగ అంటే సంక్రాంతి. ఆ సమయంలో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆడియన్స్. ఈ టైమ్లో వచ్చే మూవీస్లో చాలా వరకు కమర్షియల్ సక్సెస్లు అందుకుంటాయి. అందుకే హీరోలు, దర్శక– నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తుంటారు. పైగా ఈ సమయంలో విడుదలయ్యే చిత్రాలకు మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చన్నది మేకర్స్ ఆలోచన. పండగకి వచ్చే సినిమాల్లో ‘ఫలానా సినిమా’ బాగుందనే టాక్ వచ్చిందంటే ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనే. అందుకే స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ సంక్రాంతి పోటీకి సై అంటుంటారు. 2027 సంక్రాంతి మరో నాలుగు నెలలు ఉండగానే పలు చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి.మరికొన్ని ప్రాజెక్టులు కూడా సంక్రాంతి రేసులో ఉండేందుకు ముస్తాబవుతున్నాయి. చిరంజీవి, వెంకటేశ్–కల్యాణ్ రామ్, రవితేజ, శర్వానంద్, సాయిదుర్గా తేజ్ వంటి హీరోలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కర్చీఫ్ వేసేశారు. బాలకృష్ణ, నాగార్జున, రజనీకాంత్, సూర్య వంటి హీరోలు కూడా సంక్రాంతి పోటీలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. మరి... సంక్రాంతి బరిలో నిలిచిన, నిలవనున్న సినిమాలేంటో చూద్దాం. 13న కాకా రాక చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబోలో రూపొందుతున్న సినిమా ‘కాకా’. ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వరా రాజన్ , సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్కి మంచి స్పందన వచ్చినట్లు యూనిట్ పేర్కొంది.‘‘తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ‘కాకా’ కథనం సాగుతుంది. చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేస్తారు. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్లో ప్రజెంట్ చేస్తున్నారు బాబీ. మిడిల్ క్లాస్ అవతార్లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్తో, యంగ్ వెర్షన్ లో తన యాటిట్యూడ్, ఎనర్జీతో ఆకట్టుకుంటారు. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్తో గ్లింప్స్ను మరింత ఆసక్తికరంగా మలిచారు. ఎస్. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ఇంటెన్సిటీని మరింత పెంచింది. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్కు మరింత స్వాగ్ను జోడించింది. టైటిల్ గ్లింప్స్ తర్వాత ‘కాకా’ పై అంచనాలు పెరిగాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.జనవరి 12 విడుదల వెంకటేష్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి నటిస్తున్నారు. సురేష్ ప్రోడక్షన్స్ , జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గార పాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘జనవరి 12 విడుదల’ (బావ బామ్మర్ది సౌజన్యంతో అన్నది ట్యాగ్లైన్) అనే టైటిల్ను ఖరారు చేసి, సినిమాని కూడా జనవరి 12 విడుదల చేయనున్నట్లు ఓ ఫన్నీ వీడియోను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్ని కలిపి ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్ ఎంటర్టైనర్గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు అనిల్ రావిపూడి. అనిల్ ట్రేడ్ మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్్స, ఎంటర్టైన్మెంట్తో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉంటుంది.వెంకటేష్, కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. వెంకటేష్, కల్యాణ్ రామ్ మధ్య సినిమాలో ఉండే రిలేషన్ ను హైలెట్ చేస్తూ ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్లైన్ ని పెట్టడం జరిగింది. మా సినిమా 2027 సంక్రాంతికి ఫెస్టివ్ ట్రీట్గా నిలవనుంది. జీవీ ప్రకాష్కుమార్ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. దాగుడు మూతల దండాకోర్? ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న రవితేజ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్కు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా నటించనున్న ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్న ఈ 64వ సినిమాకి ‘ఎస్వీసీ 64’ అనే వర్కింగ్ టైటిల్ని ఖరారు చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్ని మంగళవారం ప్రకటించారు మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలి పారు.‘‘రవితేజ, హసిత్ గోలి కలిసి ఓ హార్డ్కోర్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్తో కమర్షియల్ ఎంటర్టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే... వైవిధ్యమైన కథలు, హ్యూమర్తో హసిత్ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. హసిత్ గోలి రూపొందించనున్న ఈ కామెడీ డ్రివెన్ కాన్సెప్ట్లో రవితేజ సరికొత్తగా కనిపిస్తారు. ఈ సంక్రాంతికి రవితేజ నుంచి రానున్న ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను, టైటిల్ని త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి ‘దాగుడు మూతల దండాకోర్’ అనే టైటిల్ని ఖరారు చేయనున్నారట మేకర్స్. 14న జార్జ్ క్రిష్ ‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న హీరో శర్వానంద్ తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఈ సినిమాకి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు జనవరి 14 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలి పారు. ‘‘పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’.‘శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా, నారి నారి నడుమ మురారి’ వంటి చిత్రాలతో పండుగ సీజన్ లో గుర్తుండిపోయే విజయాలను అందుకున్న శర్వాకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ప్రత్యేకమైనది. ఆ సెంటిమెంట్ను కొనసాగిస్తూ ‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదల చేస్తున్నాం. సంక్రాంతి సీజన్లో శర్వాకు ఉన్న విజయ వంతమైన ట్రాక్ రికార్డ్, కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలకు శ్రీను వైట్లకు ఉన్న పేరు, ఆసక్తిని రేకెత్తించేలా ఆకర్షణీయంగా రూపొందించిన టైటిల్... ఇలా వీటన్నింటితో ‘జార్జ్ క్రిష్’ పూర్తి స్థాయి పండగ వినోద చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు’’ అన్నారు మేకర్స్. 8న మహాకాళి ‘హను–మాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో (పీవీసీయూ) భాగంగా రూపొందిన ఫీమేల్ సూపర్ హీరో సినిమా ‘మహాకాళి’. భూమిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్, శ్రియా రెడ్డి, ఖుష్బూ సుందర్, రాకేష్ బేడీ, సముద్ర ఖని, జితిన్ గులాటి, రజత్ కపూర్, మురళీ శర్మ, నార్, బబ్లూ పృథ్వీరాజ్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు.ఈ మైథాలజీ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందించగా, పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ స్పెక్టకిల్ మూవీ ‘మహాకాళి’. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్పై ఏర్పడిన క్యూరియాసిటీని ఈ గ్లింప్స్ మరింత పెంచింది.ధర్మం, అధర్మం మధ్య జరిగే మహా సంగ్రామాన్ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేస్తోంది. ఇది కేవలం మంచి–చెడు మధ్య జరిగే పోరాటం కాదని, ఓ ప్రపంచ భవిష్యత్తునే నిర్ణయించే స్థాయిలో యుద్ధం ఉండబోతుందనే ఆసక్తిని కలిగిస్తోంది. శ్రియా రెడ్డి కూడా పవర్ఫుల్ లుక్లో కనిపిస్తారు. ‘హను–మాన్’ మూవీతో పీవీసీయూకు బలమైన పునాది వేసిన ప్రశాంత్ వర్మ భారతీయ ఇతిహాసాలను మోడరన్ విజువల్ ట్రీట్మెంట్తో తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని ‘మహాకాళి’తో మరింత భారీ స్థాయికి తీసుకెళ్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. 12న సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటించారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై ‘హను–మాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జనవరి 12 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు)’. ఇందులో సాయిదుర్గా తేజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు. బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దారు దర్శకుడు రోహిత్ కేపీ. ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. షూ టింగ్ విజయవంతంగా ముగియడంతో ఆడియన్స్కి గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించడానికి పోస్ట్ ప్రోడక్షన్పై దృష్టి పెట్టాం’’ అని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.⇒ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ మూవీని డిసెంబరులో విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిర్స్లో వినిపించింది. అయితే డిసెంబరులో తన తనయుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే... సంక్రాంతికి ‘కింగ్ 100’ని విడుదల చేయాలన్నది మేకర్స్ ఆలోచన అట. పైగా సంక్రాంతి పండగ అంటే నాగార్జునకు బాగా కలిసి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. జనవరి 14న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ⇒ బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ నటిస్తున్న ఈ 111వ సినిమాకి ‘ఎన్బీకే 111’ అనే వర్కింగ్ టైటిల్ని ఫిక్స్ చేశారు. ‘వీరసింహా రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఎన్బీకే 111’ చిత్రంలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అయితే బాలకృష్ణకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్. ⇒ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధర్మన్ ’. ‘ది డెడ్లీ డాక్టర్’ అనేది ఉప శీర్షిక. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, రాశీఖన్నా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘ధర్మన్’ పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా విడుదల కానుంది. 2027 పొంగల్కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రజనీకాంత్ సినిమా అంటే తెలుగులోనూ రిలీజ్ కావడం ఖాయం. ఈ రకంగా ‘ధర్మన్’ కూడా సంక్రాంతికి తెలుగు తెరపై సందడి చేయనుంది. ⇒ ‘వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి వరుస హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్నారు హీరో సూర్య. ఆయన హీరోగా నటించిన 47వ చిత్రానికి ‘ఆవేశం’ మూవీ ఫేమ్ జిత్తు మాధవ్ డైరెక్టర్. ‘సూర్య 47’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందిన ఈ చిత్రంలో నజ్రియా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక నిర్మించారు. ఈ సినిమాని పొంగల్కి (సంక్రాంతి) రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. సూర్య చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ రకంగా ఈ మూవీ టాలీవుడ్లోనూ విడుదలవుతుందని ఊహించవచ్చు. – డేరంగుల జగన్ మోహన్
గ్యారంటీ ఇచ్చేసి వెళ్లు నాన్నా
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన సినిమా ‘ఫాదర్’. ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, డార్లింగ్ కృష్ణ తండ్రీ కొడుకులుగా నటించగా, అమృత అయ్యంగార్ ప్రధాన పాత్రలో నటించారు. ఆర్సీ స్టూడియోస్ పతాకంపై ఆర్. చంద్రు, యమున చంద్రశేఖర్, ఆనంద్ పండిట్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్.‘కృష్ణా... మరొక జన్మనేది ఉంటే మళ్లీ నేను నీకు తండ్రిగానే పుడతాను’, ‘వచ్చే జన్మలో కలుస్తానని లెటర్లో రాశావు కదా... వచ్చే జన్మలోనూ నువ్వే నాన్నగా ఉంటావని గ్యారంటీ ఇచ్చేసి వెళ్లు నాన్నా..’ అన్న డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి. నాగభూషణ ఎస్ఎస్, రమేష్ ఇందిర, అవినాష్, హొన్నవల్లి కృష్ణ, గగన్ బీఏ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: నకుల్ అభ్యంకర్.
వదంతులు నమ్మకండి
‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు మహేశ్బాబు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో మహేశ్బాబు సినిమా చేస్తారనే వార్త మంగళవారం వైరల్గా మారింది. ఈ అంశంపై అదే రోజు సాయంత్రం తర్వాత అనిల్ రావిపూడి స్పందించారు. ‘‘మహేశ్బాబుగారంటే నాకు ఎంతో అభిమానం... గౌరవం. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదు. దయచేసి ఇలాంటి వదంతులు నమ్మకండి, వ్యాప్తి చేయకండి’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి. మరోవైపు వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం అనిల్ రావిపూడి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
క్రీడలు
శాసించేది మనమే!
కొలంబో: ఆహ్వానం లేని అతిథిగా వరుణుడు వస్తూ పోతున్నా... భారత బౌలర్లు సహనం కోల్పోకుండా సత్తా చాటారు. కీలకదశలో శ్రీలంక బ్యాటర్లను పెవిలియన్కు పంపించి రెండో టెస్టును శాసించే స్థితిలో టీమిండియాను నిలిపారు. వర్షం, వెలుతురు లేమి కారణంగా వరుసగా మూడో రోజు కూడా పూర్తి ఓవర్లు సాధ్యపడలేదు. ఓవర్నైట్ స్కోరు 8/2తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన శ్రీలంక జట్టు వర్షం కారణంగా ఆటను నిలిపి వేసే సమయానికి 83.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించింది. పసిందు సూరియబండారా (80; 9 ఫోర్లు), తొలి టెస్టు సెంచరీ హీరో సోనాల్ దినుషా (85 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలతో శ్రీలంక జట్టును ఆదుకున్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే శ్రీలంక మరో 39 పరుగులు సాధించాలి. దినుషాతో కలిసి లాహిరు (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. నాలుగో రోజు ఆరంభంలోనే శ్రీలంకను ఆలౌట్ చేస్తే భారత్ ఈ మ్యాచ్పై పూర్తి పట్టుబిగించవచ్చు. ఆ తర్వాత భారత్ చకచకా పరుగులు సాధించి లంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంటుంది.ధాటిగా ఆడి...మూడో రోజు తొలి సెషన్ ఆరంభంలోనే శ్రీలంకకు దెబ్బ పడింది. ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఓపెనర్ మిషారాను ప్రసిధ్ అవుట్ చేశాడు. 35/3తో ఎదురీదుతున్న లంకను పసిందు సూరియబండారా, కామిందు మెండిస్ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. వీరిద్దరు ధాటిగా ఆడుతూ నిలకడగా పరుగులు సాధించారు. నాలుగో వికెట్కు 87 పరుగులు జోడించారు. క్రీజులో నిలదొక్కుకుంటున్న కామిందును ప్రసిధ్ అవుట్ చేసి మళ్లీ లంకను కష్టాల్లోకి నెట్టాడు. గాయపడ్డ రిషబ్ పంత్ స్థానంలో సబ్స్టిట్యూట్గా వచ్చన సర్ఫరాజ్ ఖాన్, బౌలర్ సిరాజ్లతో శ్రీలంక బ్యాటర్లు వాగ్వాదం చేశారు. లంచ్ సెషన్లో 122 పరుగులు చేసిన శ్రీలంక రెండో సెషన్లో తడబడింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (8) విఫలంకాగా ... సెంచరీపై కన్నేసిన పసిందును జడేజా బౌల్డ్ చేశాడు. డిక్వెలాను సిరాజ్ ఖాతా తెరవనివ్వలేదు. దాంతో 122/3తో కోలుకున్నట్లు కనిపించిన శ్రీలంక 173/7తో మళ్లీ కష్టాల్లో పడింది. శ్రీలంక ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టదేమోనని అనుకున్నా... నువాంతా (74 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), దినుషా మొండిపట్టుదలతో ఆడారు. ఒకవైపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ మరోవైపు పరుగులు సాధించారు. ఈ క్రమంలో దినుషా 82 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ విరామానికి లంక స్కోరు 216/7. చివరి సెషన్లో నువాంతాను సుతార్ అవుట్ చేసినా... లాహిరు కుమారతో కలిసి దినుషా తొమ్మిదో వికెట్కు 35 పరుగులు జత చేసి శ్రీలంక స్కోరును 250 పరుగులు దాటించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: ఉడారా (సి) జైస్వాల్ (బి) ప్రసిధ్ కృష్ణ 1; కమిల్ (సి) జురేల్ (బి) ప్రసిధ్ కృష్ణ 19; ప్రభాత్ జయసూరియ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుతార్ 2; పసిందు సూరియబండారా (బి) జడేజా 80; కామిందు మెండిస్ (సి) జడేజా (బి) ప్రసిధ్ కృష్ణ 32; ధనంజయ డిసిల్వా (సి) కేఎల్ రాహుల్ (బి) మానవ్ సుతార్ 8; సోనాల్ దినుషా (బ్యాటింగ్) 85; డిక్వెల్లా (సి) జురేల్ (బి) సిరాజ్ 0; కేషారా నువాంతా (సి) సారాంశ్ జైన్ (బి) మానవ్ సుతార్ 18; లాహిరు కుమార (బ్యాటింగ్) 8; ఎక్స్ట్రాలు 12; మొత్తం (83.4 ఓవర్లలో 8 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–35, 4–122, 5–137, 6–171, 7–173, 8–230. బౌలింగ్: సిరాజ్ 11–0– 33–1, ప్రసిధ్ కృష్ణ 14–1–47–3, మానవ్ సుతార్ 21–1–83–3, సారాంశ్ జైన్ 18–5– 51–0, రవీంద్ర జడేజా 19.4–4–45–1.
గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి తెలంగాణ సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు ఏకైక పతకం అందించిన తెలంగాణ ప్లేయర్ పుల్లెల గాయత్రి,కేరళ క్రీడాకారిణి ట్రెసా జాలీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కలిసిన గాయత్రి–ట్రెసాలను సీఎం శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గాయత్రి తల్లిదండ్రులైన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, భారత బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ పీవీవీ లక్ష్మి కూడా పాల్గొన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో గాయత్రి–ట్రెసా ద్వయం మహిళల డబుల్స్లో కాంస్య పతకం గెలిచింది. ఇటీవల కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డుల్లో గాయత్రి–ట్రెసా జాలీలకు ‘అర్జున’ అవార్డు కూడా దక్కింది.
తొలి రౌండ్లోనే ఓడిన జొకోవిచ్–సబలెంకా జోడీ
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)–సబలెంకా (బెలారస్) జోడీ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సింగిల్స్లో మేటి క్రీడాకారులైన ఈ ఇద్దరు డబుల్స్లో సమన్వయంతో ఆడటంలో విఫలమయ్యారు. మహిళల డబుల్స్లో వరల్డ్ నంబర్వన్ సినియకోవా (చెక్ రిపబ్లిక్)... పురుషుల డబుల్స్లో ప్రపంచ నంబర్వన్ హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) జతగా మిక్స్డ్ డబుల్స్లో బరిలోకి దిగారు. తొలి రౌండ్లో సినియకోవా–ప్యాటెన్ ద్వయం 1–4, 4–2, 10–2తో జొకోవిచ్–సబలెంకా జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్లో పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్), దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (అమెరికా) జోడీ ఇరిన్ రూట్లిఫ్ (న్యూజిలాండ్)–లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్) జంటతో ఆడనుంది.
ఫైనల్లో ప్రజ్ఞానంద
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్ టోర్నీ ఫైనల్స్లో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమెర్తో జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రజ్ఞానంద 19–9 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. రెండు క్లాసికల్ గేమ్లు ముగిశాక 9–3తో ఆధిక్యంలో నిలిచిన ప్రజ్ఞానంద... తదుపరి ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్ గేమ్లలోనూ మెరిశాడు. తొలి ర్యాపిడ్ గేమ్లో 49 ఎత్తుల్లో... రెండో ర్యాపిడ్ గేమ్లో 27 ఎత్తుల్లో విజయం అందుకున్నాడు. ఒక్కో విజయానికి నాలుగు పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద 17–3తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. బ్లిట్జ్ ఫార్మాట్లో నాలుగు గేమ్లు జరిగాయి. తొలి గేమ్లోనే ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో నెగ్గి 19–3తో విజయంతోపాటు ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. ఫలితం తేలిపోయినా మిగిలిన మూడు బ్లిట్జ్ గేమ్లను కూడా ఆడించగా... ఈ మూడింటిలోనూ విన్సెంట్ కీమెర్ గెలిచి ఆధిక్యాన్ని 9–19కి తగ్గించాడు. ఫైనల్లో అమెరికా గ్రాండ్మాస్టర్ కరువానాతో ప్రజ్ఞానంద తలపడతాడు. రెండో సెమీఫైనల్లో కరువానా 18–9తో వెస్లీ సో (అమెరికా)పై గెలుపొందాడు. 3–4 స్థానాల కోసం కీమెర్, వెస్లీ సో పోటీపడతారు. టైటిల్ కోసం ప్రజ్ఞానంద, కరువానా మధ్య మొత్తం ఎనిమిది గేమ్లు (2 క్లాసికల్, 2 ర్యాపిడ్, 4 బ్లిట్జ్) జరుగుతాయి. గ్రాండ్ చెస్ ఫైనల్స్ టోర్నీని 4,50,000 డాలర్ల (రూ. 4 కోట్ల 29 లక్షలు) ప్రైజ్మనీతో నిర్వహిస్తున్నారు. విజేతకు 2 లక్షల డాలర్లు (రూ.1 కోటీ 90 లక్షలు), రన్నరప్కు 1,25,000 డాలర్లు (రూ. 1 కోటీ 19 లక్షలు) అందజేస్తారు. మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 75 వేల డాలర్లు (రూ. 71 లక్షల 50 వేలు), నాలుగో స్థానం పొందిన ప్లేయర్కు 50 వేల డాలర్లు (రూ. 47 లక్షల 67 వేలు) లభిస్తాయి.
న్యూస్ పాడ్కాస్ట్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
బిజినెస్
అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అమెరికా విధించిన భారీ టారిఫ్లకు కెనడా కూడా గట్టిగా స్పందించింది. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన 700 అమెరికా వస్తువులపై 15 నుంచి 50 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఈ టారిఫ్లు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.స్టీల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు..కెనడా విధించే కొత్త సుంకాల ప్రభావం అమెరికాకు చెందిన పలు కీలక రంగాలపై పడనుంది. ముఖ్యంగా స్టీల్, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఈ టారిఫ్ల పరిధిలోకి రానున్నాయి. అమెరికా ఏ స్థాయిలో సుంకాలు విధించిందో, దానికి అనుగుణంగానే తమ టారిఫ్లు ఉంటాయని కెనడా అధికారులు స్పష్టం చేశారు.కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ మాట్లాడుతూ.. తమ దేశానికి ఇది ఎన్నడూ ఎదురుకాని సవాలని, అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందని చెప్పారు. అమెరికా చర్యకు ప్రతిస్పందించే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని తెలిపారు.చర్చల నుంచి కెనడా వైదొలగింపుఅమెరికా, కెనడా మధ్య టారిఫ్లపై జరిగిన చర్చలు సఫలం కాలేదు. అమెరికా ప్రతిపాదించిన కొత్త వాణిజ్య నిబంధనలు కెనడాకు అనుకూలంగా లేవని ప్రధాని మార్క్ కార్నీ అభిప్రాయపడ్డారు.ఆ ప్రతిపాదనలు ఆర్థికంగా అన్యాయంగా ఉండటంతో పాటు కెనడాకు దక్కాల్సిన ప్రయోజనాలను తగ్గించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆటోమొబైల్, స్టీల్, అల్యూమినియం వంటి తమ ప్రధాన పరిశ్రమలను దెబ్బతీసే విధంగా అమెరికా ప్రతిపాదనలు ఉన్నాయని కార్నీ అన్నారు. అందుకే అమెరికా ఇచ్చిన ఒప్పందాన్ని అంగీకరించకుండా చర్చల నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు.ట్రంప్ హెచ్చరికమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కెనడాపై తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కెనడా అమెరికా నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాలని, లేకపోతే ఇప్పటికే విధించిన టారిఫ్ల కంటే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా.. కెనడా ఆటోమొబైల్ పరిశ్రమపై వచ్చే ఏడాది నుంచి మరిన్ని టారిఫ్లు విధించే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు.కెనడా ఎన్నో సంవత్సరాలుగా అమెరికాను వాణిజ్యపరంగా నష్టపరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. ముఖ్యంగా అమెరికా రైతుల ఉత్పత్తులపై కెనడా విధిస్తున్న అధిక సుంకాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒకదానిపై మరొకటి టారిఫ్లు విధించుకుంటుండటంతో స్టీల్, ఆటోమొబైల్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికా-కెనడా మధ్య టారిఫ్ల పోరు మరింత తీవ్రంగా మారింది. అమెరికా విధించిన సుంకాలకు కెనడా ప్రతీకార చర్యలు తీసుకోవడం, మరోవైపు ట్రంప్ మరిన్ని టారిఫ్ల హెచ్చరికలు చేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయా?, లేక టారిఫ్ల పోరు మరింత పెరుగుతుందా?, అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వాణిజ్య యుద్ధం కొనసాగితే చివరికి దాని ప్రభావం రెండు దేశాల పరిశ్రమలతో పాటు వినియోగదారులపైనా పడే అవకాశం ఉంది.
తెలంగాణలో పెట్టుబడులు.. జపాన్ కంపెనీలకు మంత్రి ఆహ్వానం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని శక్తి మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. జపాన్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తెలంగాణలో జపాన్ కంపెనీల పెట్టుబడులు సురక్షితంగా, లాభదాయకంగా ఉండేలా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.ఒసాకాలో Career Consultz వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ రావు నిర్వహించిన ‘Leveraging Indian Talent’ ఇండియా-జపాన్ వర్క్ఫోర్స్ రౌండ్టేబుల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జపాన్ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ, విద్యా సంస్థల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులు, నైపుణ్య మానవ వనరులు, ఉపాధి అవకాశాలు, టాలెంట్ మొబిలిటీపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలతో పాటు నైపుణ్యవంతులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఐటీ, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో రాష్ట్రానికి బలమైన టాలెంట్ పూల్ ఉందన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కోరారు. పెట్టుబడులకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం అందిస్తూ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.తెలంగాణలో సుమారు 600 ఎకరాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు జపాన్ సంస్థలు ఆసక్తి చూపుతున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇది తెలంగాణపై జపాన్ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మరిన్ని జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.పెట్టుబడులతో పాటు తెలంగాణ యువతకు జపాన్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జపాన్ సంస్థలతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. జపాన్లో పెరుగుతున్న నైపుణ్య మానవ వనరుల అవసరాలను తెలంగాణ టాలెంట్తో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.తెలంగాణ యువత కొత్త దేశాలకు, కొత్త వాతావరణాలకు త్వరగా అలవాటు పడే స్వభావం కలిగి ఉంటారని మంత్రి అన్నారు. కష్టపడి పనిచేయడం, కొత్త విషయాలను వేగంగా నేర్చుకోవడం, పనిచేసే సంస్థలు, దేశాల సంస్కృతికి అనుగుణంగా మారడం తెలంగాణ యువత ప్రత్యేకతలని తెలిపారు. జపాన్ కంపెనీల అభివృద్ధికి తెలంగాణ యువత గణనీయంగా దోహదపడగలరని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 120 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే యువతకు ఆయా దేశాల భాషపై పరిజ్ఞానం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అందుకే టామ్కామ్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు భాషా శిక్షణ, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు, పని సంస్కృతిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తద్వారా తెలంగాణ యువత అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లో సులభంగా ఉపాధి పొందేలా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జర్మనీతో నైపుణ్య మానవ వనరుల రంగంలో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుందని మంత్రి తెలిపారు. ఇటీవల జర్మనీ బృందం తెలంగాణలో పర్యటించినప్పుడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. తెలంగాణ చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారని తెలిపారు. జర్మనీలో నైపుణ్య మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణ యువతకు మరిన్ని అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.నైపుణ్య మానవ వనరుల నియామకం, శిక్షణ, ఉపాధి కల్పనలో జపాన్ సంస్థలతో మరింత బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. భారత్–జపాన్ సంబంధాల్లో వర్క్ఫోర్స్ మొబిలిటీ కీలక అంశంగా మారుతోందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో భారత్–జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రౌండ్టేబుల్ సమావేశం దోహదపడుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
మొదటిసారి ఇల్లు కొంటున్నారా?
ప్రతి ఒక్కరి జీవితంలో సొంతిల్లు అనేది ఒక అపురూపమైన స్వప్నం. అయితే, ఆకర్షణీయమైన బ్రోచర్లు, రంగురంగుల అడ్వర్టైజ్మెంట్లు చూసి తొందరపడి బిల్డర్ చేతిలో అడ్వాన్స్ పెడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే బిల్డర్కు డబ్బు చెల్లించే ముందే కొన్ని ప్రశ్నలు నిలదీయక తప్పదు.రేరా నమోదు ఉందా?ప్రాజెక్టుకు ‘రేరా’(భారత రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచడానికి, బిల్డర్ల మోసాల నుంచి ఇళ్లు కొనుగోలు చేసే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది) అనుమతి ఉందో లేదో కచ్చితంగా నిర్ధారించుకోవాలి. కేవలం మాటల గారడీకి మోసపోకుండా ప్రాజెక్ట్ రేరా రిజిస్ట్రేషన్ నంబర్, పురపాలక/పట్టణాభివృద్ధి సంస్థల ఆమోదిత ప్లాన్ను ప్రత్యక్షంగా పరిశీలించాలి.కార్పెట్ ఏరియా ఎంత?ఆస్తి విస్తీర్ణం లెక్కల్లో బిల్డర్లు చూపే సూపర్ బిల్టప్ ఏరియా మాయాజాలంలో పడకూడదు. అసలైన ‘కార్పెట్ ఏరియా’ (నివసించే స్థలం) ఎంత వస్తుందో తేల్చుకోవాలి. లేకపోతే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అవుతుంది.దాగి ఉన్న రుసుములుకేవలం బేస్ ప్రైస్ మాత్రమే కాకుండా కార్ పార్కింగ్, క్లబ్హౌస్, ప్లాన్ అప్రూవల్, ప్రీయారిటీ ల్యాండ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు రుసుముల వివరాలను పైసాతో సహా ముందే లిఖితపూర్వకంగా తీసుకోకపోతే బడ్జెట్ తలకిందులవుతుంది.చెల్లింపుల ప్రణాళికఒక్కసారే పెద్దమొత్తంలో చెల్లించకుండా నిర్మాణ పురోగతికి అనుగుణంగా చెల్లించే కన్స్ట్రక్షన్ లింక్డ్ ప్లాన్ ఎంచుకోవడమే క్షేమదాయకం.స్వాధీన తేదీ.. పరిహారంప్రాజెక్టు పూర్తి చేసి ఇల్లు అప్పగించే తేదీ, ఒకవేళ నిర్మాణంలో ఆలస్యమైతే బిల్డర్ చెల్లించే పరిహారంపై బయ్యర్-బిల్డర్ అగ్రిమెంట్ (బీబీఏ)లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయో లేదో చూసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
మరో ఆరు రోజుల్లో చౌకగా విమాన ప్రయాణం
నింగిలో విహరించాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రయాణికులకు విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) తీపి కబురు అందించింది. అందినంత పిండుకో అనే దోరణికి చెక్ పెడుతూ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి పయనమయ్యే ప్రయాణికులపై యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) భారాన్ని గణనీయంగా తగ్గించింది. సెప్టెంబరు 1, 2026 నుంచి ప్రారంభమయ్యే నాలుగో పర్యవేక్షణ కాలానికి (2026-2031) గాను ఈ సవరించిన టారిఫ్లు అమలులోకి రానున్నాయి.ఇప్పటివరకు దేశీయ విమాన ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న రూ.750 యూడీఎఫ్ను ఏఈఆర్ఏ రూ.515కు తగ్గించింది. విమానాశ్రయ నిర్వాహక సంస్థ జీఎంఆర్(బీహెచ్ఐఏఎల్) రూ.580 కోరినప్పటికీ ప్రయాణికుల ప్రయోజనాలే పరమావధిగా భావించి రూ.515 వద్దే నిర్ణయించడం విశేషం. అలాగే, అంతర్జాతీయ ప్రయాణికుల రుసుమును రూ.1,500 నుంచి రూ.1,030కి తగ్గించింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారిలో దాదాపు 82 శాతం మంది దేశీయ ప్రయాణికులే కావడంతో ఈ నిర్ణయం వారికి ఊరటనివ్వనుంది.ముందుగానే నియంత్రణ!బీహెచ్ఐఏఎల్ ఏకంగా రూ.27,851 కోట్ల ఆదాయ అవసరాలు ప్రతిపాదించగా ఏఈఆర్ఏ పక్కాగా సమీక్షించి రూ.11,683.49 కోట్లకు కుదించి ఆమోదముద్ర వేసింది. విమానాల ల్యాండింగ్ చార్జీలను టన్నుకు రూ.435 (దేశీయ), రూ.630 (అంతర్జాతీయ)గా నిర్ణయించింది. విమానయాన సంస్థలను ప్రోత్సహించేందుకు వేరియబుల్ టారిఫ్ ప్లాన్ (వీటీపీ) పేరుతో ల్యాండింగ్ ప్రోత్సాహకాలను సైతం తీసుకొచ్చింది. మొత్తానికి, విమాన ప్రయాణం కేవలం సంపన్నులకే కాకుండా సగటు మానవుడికి సైతం చేతికందే పండులా మారనుండటం హర్షణీయం.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
ఫ్యామిలీ
పర్యావరణ హిత జీవన సేద్యం
ఆధునిక సాంకేతికత సహాయంతో అటవీ విస్తీర్ణానికి, చెట్లను పరిరక్షించడానికి కృషి చేస్తోంది ఫార్మర్స్ ఫర్ ఫారెస్ట్స్ (ఎఫ్4ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ. కృతికా రవిశంకర్ ఈ సంస్థ కో–ఫాండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వ్యవసాయం, ఆహారభద్రత, ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన రంగాలలో కృతికకు దశాబ్దకాల అనుభవం ఉంది. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఎఫ్4ఎఫ్... వాతావరణం, జీవవైవిధ్యం, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచే జీవవైవిధ్య క్షేత్రాలు, అడవులను సృష్టించడం లక్ష్యాలుగా పనిచేస్తోంది.అద్భుత మార్పుకాలేజీ రోజుల్లో...రాలెగావ్ సిద్ధిలో అన్నాహజారే చేస్తున్న సామాజిక సేవకు సంబంధించిన విషయాలు వింటూ ఉండేది కృతిక. 25 సంవత్సరాల నిరంతర కృషితో నీటి పరీవాహక ప్రాంతాల నిర్వహణ, అటవీకరణ ద్వారా తన గ్రామం తలరాత మారేలా చేయగలిగారు హజారే.చెట్లు వాతావరణ పరిరక్షకులు. గాలిలోని కార్బన్ను గ్రహించడమే కాకుండా భూగర్భ జలాలు పెరిగేలా, నేల సారవంతం అయ్యేలా చేస్తాయి. నీటి మట్టాలు పెరగడంతో, పంటలకు ఎక్కువ నీరు, ఆవులకు ఎక్కువగా గ్రాసం దొరికింది. పంట దిగుబడులు, పాడి ఆదాయం పెరిగింది.ఒక గ్రామం పూర్తిగా మారిపోయింది!...ఇలాంటి విషయాలెన్నో విన్న కృతికా రవిశంకర్ పర్యావరణహిత మార్గం వైపు అడుగులు వేసింది.అసలైన బలం‘మార్పుతో ఏదైనా సాధ్యమే’ అనే మాట కాలేజీ రోజుల్లోనే కృతిక మదిలో బలంగా నాటుకుపోయింది.‘మనం ఆశించే ఫలితాలు వెంటనే రావు. చాలా ఓపిక కావాలి. ప్రకృతి చాలా సమయం తీసుకుంటుంది. ఈలోపు ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని దిద్దుకుంటూ ముందుకుసాగుతాం. ఇదొక నిరంతరప్రక్రియ’ ఎఫ్4ఎఫ్ను ఉద్దేశించి అంటుంది కృతిక.బీడుగా మారిన వ్యవసాయ భూములను జీవవైవిధ్యం గల భూములుగా మారుస్తోంది ఎఫ్4ఎఫ్. మొక్కలు నాటినందుకే కాకుండా వాటిని సంవత్సరాల తరబడి పోషించి కాపాడినందుకు ‘ఎఫ్4ఎఫ్’ ద్వారా రైతులకు ప్రతిఫలం కూడా లభిస్తుంది.‘మా అసలు సిసలు బలం ఆత్యాధునిక సాంకేతికత కాదు. రైతులు’ అంటుంది కృతిక రవిశంకర్.
డార్క్ లైట్ టు లైమ్లైట్
కాజియాకు నలుగురిలో కలవడం అంటే ఇష్టం. టీనేజీలోకి వచ్చిన తరువాత ఆ ఇష్టం వెనకడుగు వేసింది. ‘నల్లపిల్ల’ అని ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే భయం ఆమెలో ఉండేది. ఆ భయం కాస్తా ఆత్మన్యూనతగా మారింది. ఆత్మన్యూనత నుంచి ఆత్మవిశ్వాసంలోకి వచ్చిన తరువాత తనను తాను అద్భుతంగా తీర్చిదిద్దుకుంది కేరళలోని మావెళిక్కరకు చెందిన కాజియా లిజ్ మెజో.తాజాగా...ఈ నెల 23న జైపూర్లో జరిగిన ఫైనల్లో కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్ను గెలిచిన తొలి కేరళ మహిళగా చరిత్ర సృష్టించింది. నవంబర్లో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. 19 సంవత్సరాల కాజియా న్యాయశాస్త్ర విద్యార్థిని. దేశవ్యాప్తంగా 52 మంది మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు. వీరందరిలో కాజియా పిన్న వయస్కురాలు. వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్గా, అనుశీ సాత్వలేకర్ సెకండ్ రన్నరప్గా నిలిచారు.అబుదాబి (యూఏఈ)లో పెరిగిన కాజియా ‘బేబీ షో’లో పాల్గొనడం ద్వారా చిన్న వయసులోనే రంగస్థలంపై మెరిసింది. ఆ తరువాత కాలంలో శాస్త్రీయ నృత్యం వైపు అడుగులు వేసింది. అందరిలాగే బాల్యం అంటే కాజియాకు చాలా ఇష్టం. ‘చిన్నపిల్లగా ఉన్నప్పుడు భయమనేదే ఉండదు. సరదాగా గడపడం, అందమైన దుస్తులు ధరించడం, కార్టూన్ ప్రపంచంలోకి దూరడం..ఇలాంటి అద్భుతాలెన్నో బాల్యంలో ఉంటాయి’ అంటుంది కాజియా.అభద్రత... ఆత్మన్యూనత...టీనేజ్లోకి అడుగుపెట్టిన కాజియా బాల్యంలోని సంతోషానికి దూరం అయింది. డిజిటల్ ప్రపంచంలోని సోకాల్డ్ సౌందర్య ప్రమాణాల వైపు మొగ్గు చూపడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయింది.‘నేను నలుపుగా ఉండడం వల్ల విపరీతమైన అభద్రతాభావానికి గురయ్యేదాన్ని. రకరకాల ఫెయిర్ నెస్ క్రీమ్ల యాడ్స్ చూస్తుండేదాన్ని. వాటిని చూసిన తరువాత నా శరీరాకృతి సరిగ్గా లేదు అనిపించేది.నా ప్రతి ఫొటోకు ఫిల్టర్స్ ఉపయోగించేదాన్ని. కళ్లను పెద్దవిగా చేయడానికి, చర్మపు రంగులను మార్చేదాన్ని’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది కాజియా.మార్పు మొదలైంది...మొదట్లో నలుగురిలో కలవడానికి ఇష్టపడే కాజియా, ‘నేను నలుపుగా ఉంటాను’ అని అతిగా ఆలోచించడం వల్ల ఆత్మన్యూనతకు గురయ్యేది. నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడేది. అద్దంలో తన ముఖం తనకే నచ్చకపోయేది. అయితే, కొంతకాలం తరువాత తనను తాను సమీక్షించుకోవడం వల్ల ఆ తరువాత కాలంలో కాజియాలో చాలా మార్పు వచ్చింది. ‘బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది’ అనే విషయాన్ని తెలుసుకుంది. ఆత్మన్యూనత పోయింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.విజయ పరంపర...ఆత్మవిశ్వాసం దిశగా తనను తాను తీర్చిదిద్దుకున్న కాజియా 2024లో ‘మిస్ టీన్ దివా’ టైటిల్ గెలుచుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీలకు మార్గం సుగమం చేసుకుంది. 2025లో ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మొదటి రన్నరప్గా నిలిచింది. ఆ తరువాత ‘మిస్ యూనివర్స్ కేరళ’ విజేతగా నిలిచింది.అలా జరగకూడదు...‘సోషల్ మీడియా చాలా కృత్రిమమైనది. ఆ కృత్రిమత్వపు మాయలో పడిపోవద్దు. ఆత్మవిశ్వాసం లేని పిల్లలను విషపూరిత భావాలతో భయపెడితే సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్లు?’ అని ప్రశిస్తోంది కాజియా. తాను ఒకప్పుడు ఎదుర్కొన్న డిజిటల్ ఒత్తిడి ఎవరూ ఎదుర్కోవద్దు అంటుంది. పరిపూర్ణత (పర్ఫెక్షన్) కోసం పాకులాడే ధోరణిని ఆమె వ్యతిరేకిస్తోంది. పేజెంట్ పోటీదారులు అనుసరించే జీవనశైలిని అనుసరించడానికి కాజియా నిరాకరిస్తోంది.మల్టీ టాలెంట్...మోడల్, శాస్త్రీయ నృత్యకారిణి మాత్రమే కాదు కాజియా గాయని కూడా. డ్రమ్స్, వయోలిన్ వాయిస్తుంది. టెడెక్స్ వేదికలపై పర్యావరణ పరిరక్షణ నుంచి ఆత్మవిశ్వాసం వరకు రకరకాల అంశాలపై స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇస్తోంది. మాలీవుడ్ సినిమా ‘షైలాక్’తో నటిగా తొలి అడుగులు వేసింది.‘నీ లక్ష్యాలు ఏమిటో ఒక నోట్బుక్లో రాసుకో’ అని కజియాను తల్లి ప్రోత్సహించేది. ‘హాలివుడ్ వాక్ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించాలి’....ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో ఆ నోట్బుక్ నిండిపోయింది. పెద్ద కలలు కనే సాహసం ఆ రోజు నుంచే మొదలైంది.‘ఆ సాహమే నన్ను ఇక్కడికి వరకు తీసుకువచ్చింది’ అంటుంది కాజియా.నిశ్శబ్దమంటే...ఫైనల్ రౌండ్లో అడిగిన ‘మీ జీవితంలో నిశ్శబ్దానికున్న శబ్దాన్ని ఎలా వర్ణిస్తారు?’ అనే ప్రశ్నకు–‘‘నేను ఈ వేదిక పైకి వచ్చే ముందు వరకు ఇక్కడ అంతా నిశబ్దమే. నటిగా, డ్యాన్సర్గా, అందాల పోటీలపై ఆసక్తి ఉన్న అమ్మాయిగా ఇలాంటి వేదికపైనే ఎదిగాను. ఈ వేదిక పైకి వచ్చే ముందు నిశబ్దంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. అలాంటి ప్రదేశంలోనే నేను ఉన్నాను, నా దేశంలో ఉన్నాను’’ అంటూ జవాబు ఇచ్చింది కాజియా.దేవుడు ఇచ్చే తోట!విజేత అంటే ఎవరో కాదు, ఒకసారి ఓడిపోయి గెలుపు కోసం మరోసారి ప్రయత్నించిన వ్యక్తి మాత్రమే. మీరు దేవుడిని ఒక పువ్వు అడిగారు. అది వెంటనే మీకు దొరక్క పోవచ్చు. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే... ఒక పువ్వు కాదు, ఒక తోటే మీకు ఇవ్వడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తున్నాడని! అయితే దేవుడు ఆ తోట ఇచ్చే వరకు మనం ఓపికగా ఉండాలి. ఆశాభావంతో ఉండాలి. సోషల్ మీడియాలో కనిపించేవాటిని చూసి గుడ్డిగా నమ్మకూడదు. అనుసరించకూడదు.– కాజియా
పదేళ్ల తర్వాత యజమాని చెంతకే చేరిన చిలుక..!
ఈ రోజుల్లో ఏదైనా పోతే మళ్లీ మన చెంతకే చేరుతుందనేది చెప్పడం కష్టం. అది మనిషైనా.. పెంపుడు జంతువైనా.. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మనకు దూరమైనవి తిరిగి చెంతకు చేరితే ఆ ఆనందం మాటలకందనిది. అలాంటి భావోద్వేగ స్థితిని అనుభవిస్తున్నాడు ఈ వ్యక్తి.ఇంగ్లాండ్లోని వెస్ట్ యార్క్షైర్కు చెందిన రాబర్ట్ మోర్టిమర్ అనే వ్యక్తి, పెంపుడు చిలుక అపహరణకు గురైంది. దాదాపు పదేళ్ల తర్వాత అదే చిలుక అతడి చెంతకు చేరింది. నిజానికి అతడు అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందని అనుకున్నాడు. యాదృచ్ఛికంగా దాని ఆచూకి తెలియడం, తన చెంతకు చేరడం ఆ వ్యక్తిని ఆనందంలో ముంచెత్తింది. అదెలా అపహరణకు గురైందంటే..2017లో బ్రాడ్ఫోర్డ్ నగరంలోని తన ఇంటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నా బార్నీ అనే పెంపుడు చిలుక కనిపించకుండా పోయింది. యజమాని రాబర్ట్ దాన్ని ఎవరో ఎత్తుకుపోయారని చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో తన పక్షి ఆచూకీ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏళ్లు గడిచే కొద్దీ ఆ పెంపుడు పక్షి మళ్లీ కనిపించే అవకాశాలే అస్సలు కనిపించలేదు. కానీ ఇటీవల ఆ చిలుక యజమాని 56 ఏళ్ల రాబర్ట్కు స్థానిక పోలీసు అధికారి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బార్నీ అనే చిలుక సజీవంగా దొరికిందని, ఫోన్ చేసి చెప్పారు. అది నిజమా కల అని ఒక్కసారిగా విస్తుపోయాడు రాబర్ట్. అంతేగాదు ఆ చిలుక ఎక్కడైతే దొంగలింపబడిందో..అక్కడికి సుమారు 20 మైళ్ల దూరంలో ఐక్య(IKEA) పార్కింగ్ స్థలంలో దొరికింది. జంతు సంరక్షణ కార్యకర్త బార్నీకి అటాచ్ చేసి ఉన్న మైక్రోచిప్ని స్కాన్ చేయగా..దానికి అనుసంధానించి ఉన్న ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో యజమానిని గుర్తించలేకపోయినట్లు పోలీసులు చెప్పారు. అయితే చాలామంది అది మా చిలుక అంటూ వచ్చారు గానీ..వాళ్లెవరూ తమ వద్ద సరైన ఆధారాలను చూపించలేకపోయారు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ పక్షికి ఉన్న చిప్ ద్వారా దాని పేరు బార్నీ అని తెలిసింది. తాము మొదటిసారి దానిపేరుతో పిలవగానే నా పేరు వీళ్లకి ఎలా తెలుసు అన్నట్లుగా ఆశ్చర్యపోయిందన్నారు. ఆ తర్వాత తాము ఇంటర్నెట్లో దాని కోసం వెతకగా..తిరిగి దాని యజమాని చెంతకు చేర్చగలిగామని చెప్పారు. (చదవండి: వీల్చైర్లో మహిళ పుల్ అప్స్..! వీడియో వైరల్)
ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని వరించేలా చేసిన ప్రశ్న ఇదే..!
కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆదివారం జైపూర్లో జరిగిన అందాల పోటీల ఫైనల్లో 52 మంది అందగత్తెలను ఓడించి జాతీయ టైటిల్ను గెలుచుకున్నారు. కజియా లిజ్ మెజో కొత్త మిస్ యూనివర్స్ ఇండియా 2026గా నిలిచారు. అయితే ఆమె గెలుపుకి కారణమైన సన్నివేశంకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అదేంటంటే అందులో కజియాకే కిరీటాన్ని కట్టబెట్టేలా చేసిన ఆసక్తికర ప్రశ్న అందర్నీ ఈమితంగా ఆకర్షించింది. నిజానికి మిస్ యూనివర్స్ ఇండియా ప్రకారం, ఈ ఏడాది ఫైనలిస్టులకు 20 ప్రశ్నలు ఇచ్చి..వారికి సమాధానాలు రాయడానికి 90 నిమిషాల సమయం ఇచ్చారు. అయితే కజియా రెండుప్రశ్నలకు ఇచ్చిన సమాధానం న్యాయనిర్థేతల మనసునే గెలుచుకుంది. అవేంటో చూసేద్దామా.యాక్ట్ నౌ వ్యవస్థాపకుడు, గ్లామనంద్ గ్రూప్లో సోషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అయిన రాజీవ్ కె. శ్రీవాస్తవ మీ జీవితంలో నిశ్శబ్దం ధ్వనిని వర్ణించగలరా అని అడగగా..అందుకు కజియా ఇలా సమాధానం ఇచ్చింది. "నాకు, నిశ్శబ్దం అంటే, నేను కొద్ది నిమిషాల క్రితం ఈ వేదికపైకి ప్రవేశించే ముందు అనుభవించిన ప్రశాంతతనే నిశబ్దంగా విశ్వసిస్తా. ఎందుకంటే నేను ఒక శాస్త్రీయ నృత్యకారిణిగా, ఒక నటిగా, అందాల పోటీల ప్రేమికురాలిగా వేదికపైనే పుట్టి పెరిగాను. అందువల్ల ఈ వేదికపైకి అడుగు పెట్టే ముందు నిశ్శబ్దాన్ని, ప్రశాంతతను, అత్యంత ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తాను. ఎందుకంటే అది నాకు నా సొంత ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. నా దృష్టిలో, అదే నిశ్శబ్దం. అని ఆమె చాలా అద్భుతంగా చెప్పారామె. అలాగే కజియా తన తన దృష్టిలో అందం అంటే ఏంటో కూడా పంచుకున్నారు. ఆమె ఇలా అన్నారు, "నా దృష్టిలో, నిజమైన అందం అంటే దృఢ సంకల్పం; ధైర్యం, పదే పదే పైకి లేవాలనే నిశ్శబ్ద నిర్ణయం, ఏదైనా సాధించడానికి ముందే నమ్మకం ఉంచడం. అలాగే నా దృష్టిలో, అందమైన ఆత్మవిశ్వాసంతో ఉండటం అంటే సాహసంతో ఉండటమని అర్థం." అని సగర్వంగా చెప్పారామె. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Pageantomania | Beauty Pageant (@pageantomania)(చదవండి: ట్రావెల్ వీడియోల్లో ఇంత కిక్ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..)
అంతర్జాతీయం
అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అమెరికా విధించిన భారీ టారిఫ్లకు కెనడా కూడా గట్టిగా స్పందించింది. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన 700 అమెరికా వస్తువులపై 15 నుంచి 50 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఈ టారిఫ్లు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.స్టీల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు..కెనడా విధించే కొత్త సుంకాల ప్రభావం అమెరికాకు చెందిన పలు కీలక రంగాలపై పడనుంది. ముఖ్యంగా స్టీల్, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఈ టారిఫ్ల పరిధిలోకి రానున్నాయి. అమెరికా ఏ స్థాయిలో సుంకాలు విధించిందో, దానికి అనుగుణంగానే తమ టారిఫ్లు ఉంటాయని కెనడా అధికారులు స్పష్టం చేశారు.కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ మాట్లాడుతూ.. తమ దేశానికి ఇది ఎన్నడూ ఎదురుకాని సవాలని, అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందని చెప్పారు. అమెరికా చర్యకు ప్రతిస్పందించే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని తెలిపారు.చర్చల నుంచి కెనడా వైదొలగింపుఅమెరికా, కెనడా మధ్య టారిఫ్లపై జరిగిన చర్చలు సఫలం కాలేదు. అమెరికా ప్రతిపాదించిన కొత్త వాణిజ్య నిబంధనలు కెనడాకు అనుకూలంగా లేవని ప్రధాని మార్క్ కార్నీ అభిప్రాయపడ్డారు.ఆ ప్రతిపాదనలు ఆర్థికంగా అన్యాయంగా ఉండటంతో పాటు కెనడాకు దక్కాల్సిన ప్రయోజనాలను తగ్గించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆటోమొబైల్, స్టీల్, అల్యూమినియం వంటి తమ ప్రధాన పరిశ్రమలను దెబ్బతీసే విధంగా అమెరికా ప్రతిపాదనలు ఉన్నాయని కార్నీ అన్నారు. అందుకే అమెరికా ఇచ్చిన ఒప్పందాన్ని అంగీకరించకుండా చర్చల నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు.ట్రంప్ హెచ్చరికమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కెనడాపై తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కెనడా అమెరికా నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాలని, లేకపోతే ఇప్పటికే విధించిన టారిఫ్ల కంటే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా.. కెనడా ఆటోమొబైల్ పరిశ్రమపై వచ్చే ఏడాది నుంచి మరిన్ని టారిఫ్లు విధించే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు.కెనడా ఎన్నో సంవత్సరాలుగా అమెరికాను వాణిజ్యపరంగా నష్టపరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. ముఖ్యంగా అమెరికా రైతుల ఉత్పత్తులపై కెనడా విధిస్తున్న అధిక సుంకాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒకదానిపై మరొకటి టారిఫ్లు విధించుకుంటుండటంతో స్టీల్, ఆటోమొబైల్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికా-కెనడా మధ్య టారిఫ్ల పోరు మరింత తీవ్రంగా మారింది. అమెరికా విధించిన సుంకాలకు కెనడా ప్రతీకార చర్యలు తీసుకోవడం, మరోవైపు ట్రంప్ మరిన్ని టారిఫ్ల హెచ్చరికలు చేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయా?, లేక టారిఫ్ల పోరు మరింత పెరుగుతుందా?, అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వాణిజ్య యుద్ధం కొనసాగితే చివరికి దాని ప్రభావం రెండు దేశాల పరిశ్రమలతో పాటు వినియోగదారులపైనా పడే అవకాశం ఉంది.
టీవీకే మంత్రి కీర్తన పోలికలు.. ఆ యువతికి నరకం చూపించిన నెటిజన్లు!
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే నానుడిని నిజం చేస్తూ, అచ్చం తమలాగే ఉండే వ్యక్తుల కోసం నెటిజన్లు ఆన్లైన్లో వెతుకుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే సింగపూర్లో నివసిస్తున్న వినోషా రవి అనే యువతి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ముఖ కవళికలు తమిళనాడు మంత్రి కీర్తనను పోలి ఉండటంతో ఈ వివాదం చెలరేగింది.డీఎంకే శ్రేణులు, నెటిజన్లు, పొట్టి దుస్తులు ధరించిన ఒక మహిళ వీడియోను షేర్ చేస్తూ.. ఆ వీడియోలో ఉన్నది తమిళనాడు మంత్రియేనా అని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం మొదలైంది. నెటిజన్లు సైతం ఆ వీడియోలో ఉన్నది మంత్రేనని పొరపడి, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు. అయితే, ఆ వైరల్ వీడియోలో ఉన్నది తాను కాదని మంత్రి కీర్తన స్పష్టం చేశారు. కేవలం పోలికల కారణంగా ట్రోలింగ్కు గురైన సింగపూర్కు చెందిన వినోషా రవికి ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు.ఈ పరిణామాలపై వినోషా రవి మాట్లాడుతూ..‘తొలత నా సహోద్యోగి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఆ వీడియోను తీశారు. మొదట దానిని నేను ఒక జోక్గా తీసుకున్నాను. ఇటువంటి పరిణామాలకు దారి తీస్తుందని అనుకోలేదు. కానీ, నెటిజన్ల నుంచి వచ్చిన విమర్శలు నన్ను పూర్తిగా డిప్రెషన్కు గురిచేశాయి. కొందరు పెట్టిన కామెంట్లు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. నా ప్రమేయం లేకుండా, నేను ఏ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయని వీడియోను రికార్డ్ చేసి ఆన్లైన్లో తప్పుగా ప్రచారం చేశారు. ఈ సంఘటన తర్వాత నేను బయటకు వెళ్లడానికి, కనీసం ఆఫీస్కు వెళ్లడానికి కూడా భయపడుతున్నానని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.బెదిరింపులు, అసభ్యకర సందేశాలు రావడంతో ఆమె మలేషియా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ట్రోలింగ్ వల్ల కలత చెంది భయపడినప్పటికీ, తాను వెనక్కి తగ్గేది లేదని వినోషా రవి స్పష్టం చేశారు. కొంతమంది ఆన్లైన్లో ట్రోల్ చేశారనే కారణంతో తాను తన వస్త్రధారణ శైలిని మార్చుకోబోనని తేల్చిచెప్పారు. మహిళలకు నీతులు చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఏమి, ఎలా దుస్తులు ధరించాలో మాకు బాగా తెలుసు’అని ఆమె అన్నారు. ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు ఎదుటి వ్యక్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో నెటిజన్లు ఆలోచించాలని, కేవలం వ్యూస్ కోసం బాధ్యతారహితంగా ప్రవర్తించవద్దని ఆమె హితవు పలికారు.
యుద్ధం ముగింపు, హార్మూజ్ తెరవడంలో ‘అద్భుత పురోగతి’!
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యేలా చేసేందుకు పాకిస్థాన్ నేతలు టెహ్రాన్లో చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపేందుకు శాంతి దిశగా మార్గంపై జరిగిన చర్చల్లో పాకిస్థాన్, ఇరాన్ అద్భుతమైన రీతిలో పురోగతి సాధించాయని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మంగళవారం తెలిపారు. ఆయన టెహ్రాన్ పర్యటన ముగిసింది.మరింత ఉద్రిక్తత పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఘర్షణను వేగంగా ముగించే అంశాలపై ఇరు దేశాలు చర్చించాయని పాకిస్థాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఇరాన్ నేతల మధ్య జరిగిన సమావేశం గురించి ఈ ప్రకటన వెలువడింది. ప్రాంతీయ శాంతి, వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే మార్గంపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.“ఇరాన్ అధ్యక్షుడు తమ ప్రభుత్వ దృక్కోణాన్ని స్పష్టంగా వివరించారు. చర్చించిన అంశాలపై మేము ఎంతో నిర్మాణాత్మకంగా అభిప్రాయాలను పంచుకున్నాం” అని మునీర్తో కలిసి టెహ్రాన్ వెళ్లిన అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఎక్స్లో పోస్టు చేశారు.దీనిపై వైట్ హౌస్, విదేశాంగ శాఖ స్పందించలేదు. టెహ్రాన్ పర్యటనకు ముందు మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారని రాయిటర్స్ సోమవారం తెలిపింది. ఇరాన్ను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్న ట్రంప్, ఇరాన్కు “ఏ విధమైన సహాయ మార్గాన్నైనా” అందించే ఏ దేశమైనా ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గత వారం హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చింది.
భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళిక
భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. 2030 నాటికి ఫ్రాన్స్లో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్యను 30,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరంలో ఫ్రాన్స్లో 9,100 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు ఎక్కువగా వస్తున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో ఉంది.ఇప్పటివరకు విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రధాన ఆప్షన్లుగా ఉండేవి. అయితే ఇప్పుడు విద్యార్థులు కేవలం విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్నే కాకుండా చదువు ఖర్చు, ఉద్యోగ అవకాశాలు, వీసా నిబంధనలు, జీవన వ్యయం, చదువు పూర్తయ్యాక అవకాశాలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ మార్పు ఫ్రాన్స్కు అనుకూలంగా మారుతోంది.ఫ్రాన్స్ తనను తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉన్నత విద్య అందించే దేశంగా పరిచయం చేసుకుంటోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అర్హత ఉన్న యూరోపియన్ యూనియన్కు చెందని విద్యార్థులకు అనేక ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోని విశ్వవిద్యాలయాలతో పోలిస్తే తక్కువ ఫీజులు ఉండే అవకాశం ఉంది. ఉన్నత విద్యలో గణనీయమైన భాగాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం ఆర్థికంగా భరిస్తోంది. అయితే అన్ని విద్యాసంస్థలు తక్కువ ఖర్చుతో ఉండవు. ప్రైవేట్ బిజినెస్ స్కూళ్లు, ప్రత్యేక విద్యాసంస్థల్లో ఫీజులు ఎక్కువగా ఉండవచ్చు. పారిస్ వంటి నగరాల్లో జీవన వ్యయం కూడా అధికంగా ఉంటుంది.ఇంగ్లీషులో 1,500కు పైగా కోర్సులుఫ్రాన్స్లో ఇంగ్లీష్లో బోధించే కోర్సుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 1,500కు పైగా కోర్సులు ఇంగ్లీష్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్యా స్థాయిలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఫ్రెంచ్ భాషపై పూర్తి పట్టు లేకపోయినా భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్లో చదువుకునే అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం పూర్తిగా అనవసరం కాదు. ఫ్రాన్స్లో చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేయాలనుకునే వారికి ఫ్రెంచ్ భాష తెలిసి ఉండటం ఇంటర్న్షిప్లు, ఉద్యోగాల కోసం దరఖాస్తులు, రోజువారీ జీవితం వంటి విషయాల్లో ఎంతో ఉపయోగపడుతుంది.ఏఐ, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టిఫ్రాన్స్ ఇప్పుడు కేవలం డిగ్రీలను అందించే దేశంగా కాకుండా చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించే విద్యా గమ్యస్థానంగా తనను నిలబెట్టుకోవాలని చూస్తోంది. అంతరిక్ష, ఇంజినీరింగ్, విలాస వస్తువుల నిర్వహణ, వ్యాపారం, విజ్ఞానం, సాంకేతిక రంగాల్లో ఫ్రాన్స్కు బలమైన అవకాశాలు ఉన్నాయి.ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు, అత్యాధునిక సాంకేతిక రంగాలు భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో కీలకంగా మారుతున్నాయి. సాంకేతికత, ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్న భారతీయ విద్యార్థులకు ఇవి కొత్త అవకాశాలను అందిస్తాయి. ఫ్రాన్స్లో మాస్టర్స్ లేదా అంతకంటే ఉన్నత స్థాయి విద్య పూర్తి చేసిన అర్హత కలిగిన అంతర్జాతీయ విద్యార్థులకు చదువు తర్వాత ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా వ్యాపారం ప్రారంభించడానికి కొంతకాలం ఉండే అవకాశాలు ఉన్నాయి. స్కాలర్షిప్లు, పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానం, చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలు కలిసి ఫ్రాన్స్ను భారతీయ విద్యార్థులకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్లుగా మారుస్తున్నాయి.భారత్కు ఫ్రాన్స్లో పెరుగుతున్న ప్రాధాన్యంప్రధాని నరేంద్ర మోదీ జూన్లో ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఆవిష్కరణ రంగాలకు సంబంధించిన 19 ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ రోడ్మ్యాప్ 2030ను స్వీకరించాయి. కృత్రిమ మేధస్సుపై సంయుక్త భారత్-ఫ్రాన్స్ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశాయి. విద్యార్థుల రాకపోకలు కూడా ఈ విస్తృత భాగస్వామ్యంలో భాగంగా మారుతున్నాయి. భారతీయ విద్యార్థులను ఆకర్షించడం ద్వారా ఫ్రాన్స్ తన పరిశోధన, సాంకేతికత, వ్యాపార రంగాలకు ప్రతిభావంతులైన యువతను తీసుకురావాలని చూస్తోంది. భారత్ మాత్రం విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు నమ్మదగిన గమ్యస్థానాల సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. భారతీయ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఫ్రాన్స్లోని విద్యా అవకాశాలపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్లో ముంబై, పుణే, న్యూఢిల్లీ, బెంగళూరులో ‘చూస్ ఫ్రాన్స్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. 50కి పైగా ఫ్రెంచ్ విద్యాసంస్థలు ఇందులో పాల్గొని కోర్సులు, స్కాలర్షిప్లు, వీసాలు, విద్యార్థి జీవితం గురించి సమాచారం అందించనున్నాయి.విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశాలుఫ్రాన్స్లో చదువు తక్కువ ఖర్చుతో ఉండొచ్చనే కారణంతోనే నిర్ణయం తీసుకోవద్దు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల మధ్య ఫీజుల్లో భారీ తేడాలు ఉండవచ్చు. వసతి, జీవన వ్యయం, ఫ్రెంచ్ భాష అవసరం, వీసా నిబంధనలు, చదువు తర్వాత ఉద్యోగానికి సంబంధించిన నియమాలను ముందుగానే తెలుసుకోవాలి.ఇదీ చదవండి: ఇందుకేనేమో యువకులు పెళ్లి చేసుకోవాలంటే వణికిపోతున్నారు!
జాతీయం
కులగణనలో ఓపెన్ ఫార్మాట్ వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనాభా లెక్కల సేకరణలో కులాల వివరాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓపెన్ ఫార్మాట్ (స్వేచ్ఛగా కులం పేరును నమోదు చేసే) విధానంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పద్ధతి వల్ల కచ్చితమైన వివరాలు నమోదు కాకపోగా, కులగణన అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని రాజ్యసభ, లోక్సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రశ్నావళిని తక్షణమే రద్దు చేయాలని, రాజకీయ పక్షాలు, నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే కొత్త విధానాన్ని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఖర్గే, రాహుల్ సంయుక్తంగా లేఖ రాశారు. తప్పుడు డేటాకు ఆస్కారం జనాభా లెక్కల్లో కులాల నమోదు కోసం ఎలాంటి కచ్చితమైన ముందస్తు జాబితా లేకుండా ‘ఓపెన్–ఎండెడ్’ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిద్వారా పౌరులు తమ కులం పేరును ఇష్టం వచ్చిన రీతిలో చెప్పుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకే కులానికి వేర్వేరు పేర్లు, ఉప కులాలు, భిన్నమైన స్పెల్లింగ్లు వాడుకలో ఉన్నాయని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధానం వల్ల ఒకే కులం వేలాది వేర్వేరు పేర్లతో నమోదయ్యే ప్రమాదం ఉందని వివరించారు. దానివల్ల దేశంలో కులాల సంఖ్య లక్షల్లో ఉన్నట్లుగా తప్పుడు డేటా వస్తుందని, ఫలితంగా మొత్తం కులగణన ప్రక్రియే నిరుపయోగంగా మారుతుందని తేల్చిచెప్పారు. ‘డ్రాప్–డౌన్’ జాబితాయే పరిష్కారం ఈ గందరగోళాన్ని నివారించడానికి ఓపెన్ ఫార్మాట్ బదులుగా ‘డ్రాప్–డౌన్’జాబితా పద్ధతిని అమలు చేయాలని ఖర్గే, రాహుల్ సూచించారు. జనాభా లెక్కల సేకరణ సిబ్బంది వద్ద ముందుగానే పొందుపరిచిన కులాల జాబితా ఉంటే కచ్చితమైన సమాచారం నమోదు చేయడానికి వీలుంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల జన గణనకు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(ఎస్ఈబీసీ) జాబితా, ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ఆధారంగా ఈ డ్రాప్–డౌన్ జాబితాను సులభంగా తయారు చేయవచ్చని సూచించారు. తెలంగాణ (2024), బిహార్ (2022) రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనల్లో ఈ డ్రాప్–డౌన్ విధానాన్నే అనుసరించారని వెల్లడించారు. ఆయా రాష్ట్రాల కులాల జాబితా కాపీలను ప్రధానికి రాసిన లేఖకు జతచేశారు. ప్రశ్నావళిలో ‘వెనుకబడిన తరగతి’ పదం ఏదీ? కేంద్రం తీసుకొచ్చిన తాజా ప్రశ్నావళిలో కనీసం ’వెనుకబడిన తరగతి’అనే పదం కూడా లేకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణనలో సరైన గణాంకాలు రాకపోతే అత్యంత నష్టపోయేది ఓబీసీలు, ఇతర అట్టడుగు వర్గాలేనని స్పష్టం చేశారు. దీనివల్ల విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, ప్రభుత్వ పథకాల రూపకల్పన వంటి కీలక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. గణాంకాలు చెబుతున్న వాస్తవాలివే..కులగణన కచ్చితంగా జరగాల్సిన అవసరాన్ని పలు గణాంకాలతో సహా ఖర్గే, రాహుల్ వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ఓబీసీ జాబితాలో 2,479 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో మండల్ కమిషన్ దేశంలో 3,743 వర్గాలను ఓబీసీలుగా గుర్తించింది. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 9 శాతం, ఓబీసీలు 42 శాతం, ఇతరులు 27 శాతం ఉన్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్)–2025 అంచనాల ప్రకారం ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 9 శాతం, ఓబీసీలు 46 శాతం, ఇతరులు 24 శాతం వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఓపెన్ ఫార్మాట్’విధానాన్ని అమలు చేస్తే ఈ వాస్తవ గణాంకాలన్నీ తప్పులతడకగా మారిపోయే ముప్పు ఉందని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ఉద్ఘాటించారు. ఈ పరిస్థితిని నివారించి, కుల గణన ద్వారా కచ్చితమైన సమాచారం రాబట్టేలా పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో వైఎస్సార్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులను ఇష్టానుసారంగా తొలగిస్తున్న వ్యవహారంపై ముందుగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తోందంటూ వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఖాతాలైన ‘జగనన్న కనెక్ట్స్’ (ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్, యూట్యూబ్, ఎక్స్) నుంచి పోస్టులను పూర్తిగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ వేసిన రిట్ పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగుతో కూడిన ధర్మాసనం మంగళవారం నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగింది?: కర్నూలులో మద్యం బెల్టు షాపుల కారణంగా చోటుచేసుకున్న విషాదంపై 2025 అక్టోబర్ 26న వైఎస్సార్సీపీ తన అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతా వేదికగా పలు పోస్టులు పెట్టింది. ఆ పోస్టులు ఏపీ సీఎంని అవమానించే ఉద్దేశంతో, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా పార్టీ అదే అంశంపై పోస్టులు కొనసాగించగా పోలీసు స్టేషన్లలో వరుసగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. జనవరి 27న కర్నూలు రూరల్ సీఐ ట్విట్టర్కు నోటీసు ఇస్తూ వైఎస్సార్సీపీ చేసిన పోస్టుల యూఆర్ఎల్స్ను తొలగించాలని ఆదేశించారు. సేఫ్ హార్బర్ రద్దు హెచ్చరికలు రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉద్దేశపూర్వకంగా సెన్సార్షిప్ విధిస్తోందంటూ పార్టీ మరోసారి ట్వీట్ చేయగా.. ఐటీ చట్టం–2000లోని సెక్షన్ 79(3)(బి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్) రూల్స్ 2021లోని 3(1)(డి), (జి), (ఎఫ్) నిబంధనల కింద సీఐ మరో నోటీసు జారీ చేశారు. 36 గంటల్లోగా ఆ ఖాతాలను, సంబంధిత ట్విట్టర్ పోస్టులను తొలగించకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పొందే ‘సేఫ్ హార్బర్’ రక్షణను ఉపసంహరిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాజ్యాంగంలోని ఆర్టికల్–32 కింద సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) మహపూజ్ ఏ నజ్కీ ద్వారా ఈ పిటిషన్ దాఖలైంది. నిబంధనల ఉల్లంఘనే.. శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషన్లో వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఆ తీర్పు ప్రకారం ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కింద కేంద్ర ప్రభుత్వ నిర్ణీత అధికారి లేదా సమర్థవంతమైన న్యాయస్థానం ఆదేశాల మేరకు మాత్రమే సోషల్ మీడియాలోని కంటెంట్ను బ్లాక్ చేయాలి లేదా తొలగించాలి. కానీ, ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద గానీ, ఏ న్యాయస్థానం నుంచి గానీ తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పార్టీ స్పష్టం చేసింది. దీనికి పూర్తి విరుద్ధంగా వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐస్థాయి అధికారులు తమ పరిధిని దాటి ఐటీ చట్టం సెక్షన్ 79(3)(బి)ని ప్రయోగిస్తూ 36 గంటల్లోగా పోస్టులు, ఖాతాలను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. తాము నేరుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘనలపై ముందుగా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్కు వెసులుబాటు కల్పిస్తూ రిట్ పిటిషన్ను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచి్చంది.
భార్యంటే నౌకరు కాదు: కర్ణాటక హైకోర్టు
దొడ్డబళ్లాపురం: స్త్రీని ఆమె భర్త ఇంటి పని చేయాలని, అత్తమామలను చూసుకోవాలని బలవంతం చేయరాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్య, కుమార్తెకు నెలకు రూ.9వేలు భరణం ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. భర్త హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. ‘తల్లిదండ్రుల బాధ్యత వారి కుమారుడు లేదా కుమార్తెది మాత్రమే. కోడలిది కాదు’ స్త్రీ పుట్టింటికి వెళ్లడానికి భర్త ఇంట్లో అందరి అనుమతి తీసుకోవాలనుకోవడం అవివేకం. వివాహం పేరుతో స్త్రీ స్వాతంత్య్రాన్ని, ఇష్టాయిష్టాలను నియంత్రించడం, ఆమెపై హక్కులు చలాయించడానికి చట్టం ఒప్పుకోదు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. స్త్రీ పుట్టింటికి ఇష్టం వచ్చినప్పుడు వెళ్లవచ్చని, అందుకు భర్త ఇంట్లో ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. భార్యాభర్తల సంబంధం యజమాని, నౌకరు లాంటిది కాదని, భార్య, కుమార్తె జీవనానికి నెలకు రూ.9 వేలు భరణం కచ్చితంగా ఇవ్వాలని ఆదేశించింది.
ఏఐ నుంచి సైబర్ సేఫ్టీ వరకు.. మోదీ కీలక ఆదేశాలు!
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రగతి 53వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు కీలక ప్రాజెక్టులు, వాటి పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా.. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ రంగాలకు చెందిన ఆరు భారీ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. తొమ్మిది రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.30 వేల కోట్లకు పైగానే ఉంది.ఆలస్యం అయితే నష్టం ప్రజలకేప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల కేవలం ఖర్చు పెరగడం మాత్రమే కాదని ప్రధాని మోదీ అన్నారు. పనులు ఆలస్యం అయితే వాటి ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు అందాల్సిన ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని చెప్పారు. అందుకే ప్రతి ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.ఒక్కో రోడ్డు, ఒక్కో రైల్వే లైన్ లేదా ఒక్కో ప్యాకేజీ పనిని విడివిడిగా చూడకుండా.. మొత్తం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?, అనే కోణంలో పనులను పర్యవేక్షించాలని ప్రధాని స్పష్టం చేశారు.కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంపెద్ద ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కేంద్ర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని మోదీ అన్నారు. ఒక చిన్న సమస్య కూడా మొత్తం ప్రాజెక్టును ఆలస్యం చేసే పరిస్థితి రావచ్చు. కాబట్టి దాన్ని ముందుగానే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. ప్రాజెక్టుల అమలులో ప్రతి స్థాయిలో అధికారులు బాధ్యత తీసుకోవాలని, సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే వాటిని గుర్తించి పరిష్కరించే విధంగా పనిచేయాలని ప్రధాని సూచించారు.ఒకే కారిడార్లో అన్ని..భవిష్యత్లో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు కామన్ యుటిలిటీ కారిడార్ల ఏర్పాటుపై కూడా ఆలోచించాలని ప్రధాని సూచించారు. సాధ్యమైన చోట రోడ్లు, రవాణా ప్రాజెక్టులతో పాటు విద్యుత్, ఇతర యుటిలిటీ సదుపాయాలను సమగ్రంగా ప్లాన్ చేస్తే భవిష్యత్లో మళ్లీ మళ్లీ రోడ్లను తవ్వాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు. అయితే.. ఇలాంటి ప్రణాళికలను చేపట్టే ముందు సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమా లేదా అన్నది పరిశీలించాలని స్పష్టం చేశారు.వేగంతో పాటు.. నాణ్యత కూడాప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పనుల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు ప్రతి దశలో నాణ్యతను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తవ్వడం ఎంత ముఖ్యమో.. అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండటం కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.వ్యవసాయంలో ఏఐసమావేశంలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్ మీద కూడా ప్రధాని సమీక్షించారు. వ్యవసాయానికి సంబంధించిన డేటాను కేవలం సేకరించడానికే పరిమితం కాకుండా.. దాన్ని రైతులకు ఉపయోగపడేలా వినియోగించాలని సూచించారు.Rs. 30,000 crore worth of projects across 9 states covering railways, roads and power sectors…this is what we reviewed during today’s PRAGATI session. Focus areas remain - better connectivity, higher growth, better public services and lesser delays. Here are the details……— Narendra Modi (@narendramodi) August 25, 2026ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి వ్యవసాయ రంగంలో మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు. విత్తనాలు, ఎరువుల ప్రణాళిక నుంచి పంటల ప్రాసెసింగ్ వరకు మొత్తం వ్యవసాయ రంగంలో డేటాను సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దీంతో రైతులకు అవసరమైన సహాయం సరైన సమయంలో, సరైన వ్యక్తికి అందించడంతో పాటు వ్యవసాయ రంగంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.డిజిటల్ అరెస్టులపై అవగాహనసైబర్ మోసాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై కూడా ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. ఇలాంటి మోసాలను అరికట్టాలంటే ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరమని అన్నారు.వృద్ధులు, యువత, సైబర్ మోసాలకు సులభంగా టార్గెట్ అయ్యే వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మోసగాళ్లు ఎలా మాట్లాడతారు, ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. అదే సమయంలో సైబర్ నేరాలను ఎదుర్కొనే సిబ్బందికి కూడా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు. కొత్తగా వస్తున్న మోసాలను వేగంగా గుర్తించి, వెంటనే చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు.
ఎన్ఆర్ఐ
డాలస్లో ‘హర్ ఘర్ తిరంగా’.. మార్మోగిన దేశభక్తి గీతాలు
డాలస్, టెక్సస్: డాలస్ పరిసర ప్రాంతం ఇర్వింగ్ నగరంలో నెలకొనియున్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకం వద్ద “హర్ ఘరంగ్ తిరంగా” అనే నినాదంతో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల స్వాగత శుభాకాంక్షలతో భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ముందుగా సంగీత గురు సమీరా శ్రీపాద దర్శకత్వంలో వారి శిష్యులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక భారతదేశభక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి “భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సర్వం త్యాగం చేసిన అనేకమంది అమరవీరులకు మహాత్మాగాంధీ, నెహ్రు, వల్లభభాయి పటేల్, నేతాజీ, వీర సావర్కార్, భగత్ సింగ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి నేతలు చేసిన త్యాగాలు మరువలేనివి అంటూ ప్రవాస భారతీయలగా అమెరికా దేశ చట్టాలను గౌరవిస్తూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. “ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యల్ జపంటా మాట్లాడుతూ “రెండు ప్రముఖ ప్రజాసామ్య దేశాలైన అమెరికా, భారత్ల మధ్య ధృడమైన సంబంధాలు నెలకొల్పడంలో ప్రవాస భారతీయలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని, ఈ రోజు భారత జాతీయగీతంతో పాటు, అమెరికా జాతీయగీతం కూడా ఆలపించడం సబబుగా ఉందంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు.”ప్రత్యేకఅతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ “ప్రవాస భారతీయలు మాతృభూమికి వేల మైళ్ళ దూరంలో ఉన్నా వారి హృదయాలకు భారతదేశం ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటుందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరదేశంలో విస్తరిస్తూ, భారతదేశ ప్రగతికి తోడ్పడుతున్న వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. భారతదేశ విముక్తి కోసం సర్వం త్యాగం చేసిన వేలాదిమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వారికి ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు.గత 79 సంవత్సరాలలో భారతదేశంలో అక్షరాస్యత 12 శాతంనుండి 81 శాతానికి పెరిగిందని, ఒకప్పుడు ఆహార కొరతతో బాధపడిన దేశం ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తి దారులలో ఒకటిగా మారిందని, విశ్వవిద్యాలయాల సంఖ్య 20 నుంచి 1, 200కు పైగా పెరిగిందని, విమానాశ్రయాల సంఖ్య 12 నుంచి 166 కు పెరిగిందని, ఫార్మసీ రంగంలో ఎంతో ప్రగతి సాధించి కోవిడ్ సమయంలో ఎన్నో దేశాలకు సైతం కోవిడ్ టీకాలను అందించే స్థాయికి చేరామని అన్నారు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు అని మరో వైపు రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, మెరుగైన వైద్య సేవల కొరత, అవినీతి, నల్లధనం లాంటి సమస్యలతో దేశం సతమతమవుతుందని అన్నారు. భారతదేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ముఖ్యమని, ఎవరికి తోచిన విధంగా వారు వేర్వేరు రంగాలలో సహకారం అందించాలని కోరారు.”ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ కవి, సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు త్రివర్ణ పతాకంపై ఒక పద్యాన్ని శ్రావ్యంగా గానం చేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు వామరాజు సత్యమూర్తి ప్రవాస భారతీయులందరికి 80వ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలలో భారతదేశ రక్షణలో సైనికులగా సేవలందించి అమెరికాలో స్థిరపడిన కల్నల్ రాకేష్ శర్మ, కల్నల్ హరవిందర్ బింద్రాలను, అలాగే 8 సంవత్సరాలలోపు పిల్లలకు కొలంబియా దేశంలో నిర్వహించిన చెస్ పోటీలలో అమెరికా దేశంనుండి పాల్గొని పాన్ అమెరికన్ చాంపియన్ గా నిల్చి, సువర్ణ పతకం సాధించిన సరయు తలపనేని ని ఇర్వింగ్ మేయర్ అల్ జపంటా, డా. ప్రసాద్ తోటకూర ఇతర అతిథులు ఘనంగా సన్మానించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కో ఛైర్మన్ తాయబ్ కుండావాలా తన వందన సమర్పణలో ఈ కార్యక్రమం విజయవంతంగావడానికి సహకరించిన సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.బోర్డు సభ్యులు కలై, మురళి వెన్నం, ముర్తుజా, రాజేంద్ర వంకావాలా, తిరుమల్ రెడ్డి, అనంత్ మల్లవరపుతో సహా ఎం.వి.ఎల్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పూర్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా. కె. అరవిందరావు, వందలాది ప్రవాస భారతీయులు ఈ స్వాతంత్రదినోత్సవ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం “ఇండియా టుడే” రెస్టారెంట్ వారు అందరికీ రుచికరమైన అల్పాహారం అందజేశారు.
బెర్లిన్లో ఘనంగా భారత్ దివస్ వేడుకలు
బెర్లిన్: జర్మనీలోని భారతీయ ప్రవాసులు ఆగస్టు 16న బెర్లిన్లోని చారిత్రక బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద భారత్ దివస్ను ఘనంగా నిర్వహించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్మనీ నలుమూలల నుంచి భారతీయ సంఘాలు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భారతదేశ ఐక్యత, వైవిధ్యం, గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. తెలంగాణ అసోసియేషన్ చైర్పర్సన్, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చెల్లిగంటి, యూపీ అసోసియేషన్కు చెందిన డాక్టర్ అఖిల్ అగర్వాల్, కాశ్మీరీ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన వీణా చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జర్మనీలోని పలు భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సంస్థలు చురుకైన సహకారం అందించాయి.ఈ వేడుకలకు జర్మనీలో భారత రాయబారి అజిత్ గుప్తా తన సతీమణితో కలిసి హాజరయ్యారు. భారత రాయబార కార్యాలయానికి చెందిన కాన్సులర్ మంత్రి స్టాలిన్ బాబు చీకట్ల, పర్సనల్ మంత్రి డాక్టర్ మందీప్ సింగ్ తులితో పాటు పలువురు ప్రముఖ అధికారులు, అతిథులు పాల్గొన్నారు.బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద వందలాది మంది భారతీయ ప్రవాసులు ఒకచోట చేరడంతో దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో కూడిన ప్రత్యేక వాతావరణం నెలకొంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశంలోని భిన్నత్వాన్ని చాటుతూ, అందరినీ త్రివర్ణ పతాకం కింద ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి.అనంతరం బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి శాంతి స్తూపం వరకు యూనిటీ వాక్ నిర్వహించారు. శాంతి, స్నేహం, ఐక్యత, పరస్పర సహకారం అనే సందేశాన్ని ఈ వాక్ ద్వారా చాటారు.జర్మనీలోని భారతీయ సమాజానికి ఈ వేడుక ఒక గర్వించదగిన, చిరస్మరణీయమైన సందర్భంగా నిలిచింది. భారతదేశం పట్ల తమ అనుబంధాన్ని, ఉమ్మడి వారసత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని ప్రవాస భారతీయులు ఘనంగా చాటుకున్నారు.చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం
2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్లో
భారత సంతతికి చెందిన 28 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ అర్ష్దీప్ సింగ్ డాంగ్ (Arshdeep Singh Dang), బ్రిటన్ చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF)లో ఫైటర్ పైలట్గా పట్టా పొందిన తొలి సిక్కు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సిక్కు యోధుడు ఫైటర్ స్క్వాడ్రన్ నుండి 'వింగ్స్' (Wings) సాధించడం ఇదే తొలిసారి అని RAF తెలిపింది.నార్త్ వేల్స్లోని 'RAF వ్యాలీ'లో శుక్రవారం (ఆగస్టు 14న) జరిగిన వేడుకలో అర్ష్దీప్ సింగ్ పట్టభద్రుడయ్యారు. తన తండ్రిని పైలట్గా చూడాలనేది తాతగారైన సర్దార్ సంతోఖ్ సింగ్ డాంగ్ కల అని, అయితే ఆయన చిన్నతనంలోనే మరణించడంతో ఆ అవకాశం రాలేదని అర్ష్దీప్ తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాతగారి కలను తాను నిజం చేసినట్లు అర్ష్దీప్ వెల్లడించారు.రక్షణ రంగంలో ఫ్రంట్లైన్ ఫైటర్ విమానాలను నడిపేందుకు ఆయన మరో ఏడాది పాటు కఠినమైన శిక్షణ తీసుకోనున్నారు.ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!1998లో చండీగఢ్లో జన్మించిన అర్ష్దీప్, తన ఆరేళ్ల వయసులో కుటుంబంతో కలిసి యూకే (UK) వెళ్లారు. ప్రస్తుతం వారి కుటుంబం ఇంగ్లాండ్లోని సౌత్ ఆల్లో నివసిస్తోంది. ఆయన తండ్రి జగ్దీప్ సింగ్ డాంగ్ (లుధియానా), తల్లి గగన్దీప్ కౌర్ (అమృత్సర్). బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గణితం మరియు తత్వశాస్త్రం (Mathematics & Philosophy) అభ్యసించిన ఆయన, 2022లో ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. 2025లో ఫాస్ట్ జెట్ శిక్షణ ప్రారంభించి, అక్టోబర్ 2025లో టెక్సాస్లో సోలో ఫ్లైట్ పూర్తి చేశారు. జులై 2026లో 'వింగ్స్ టెస్ట్'లో ఉత్తీర్ణులయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ పైలట్ ఇంద్రలాల్ రాయ్, హర్దిత్ సింగ్ మాలిక్, స్క్వాడ్రన్ లీడర్ మోహిందర్ సింగ్ పూజ్జీ సహా, బ్రిటిష్ సైనిక విమానయానంలో సేవలందించిన భారతీయ సంతతికి చెందినఈ ఘనత సాధించి భారతీయుల సరసన అర్ష్దీప్ చేరారు.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం
సేవను జీవిత పరమార్థంగా, దాతృత్వాన్ని జీవన విధానంగా మలుచుకున్న శోభా రెడ్డి, ప్రసాద్ రెడ్డి దంపతులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. భారత్తో పాటు అమెరికాలోనూ చిన్నారులు, పేద కుటుంబాలు, వెనుకబడిన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.ఇటీవల కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఆహార రవాణా వాహనాల కొనుగోలుకు 25 వేల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. రోజూ సుమారు 15 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే లక్ష్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న వంటశాలకు 2.5 లక్షల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. నెల్లూరు సమీపంలోని వెంకటాచలం వద్ద ఐదు ఎకరాల భూమి సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత పాదరక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రథమ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రారంభించారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పది కేంద్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఆరోగ్య సేవల్లోనూ వారి సహకారం విశేషం.చెన్నైలోని శంకర నేత్రాలయ కోసం అత్యాధునిక మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటుకు 5.5 లక్షల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. దీంతో ఈ యూనిట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నేత్ర వైద్యం, శస్త్రచికిత్సలు అందించనున్నారు. ఇప్పటికే ఏపీలో ఎనిమిది నేత్ర శిబిరాలు నిర్వహించగా, తదుపరి శిబిరాన్ని తమిళనాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రసాద్ రెడ్డి శంకర నేత్రాలయ యూఎస్ఏకు బోర్డు సలహాదారుగా, బ్రాండ్ అంబాసిడర్గా సేవలందిస్తున్నారు. అలాగే, తన సంస్థ లాభాల్లో సుమారు 13 శాతాన్ని ప్రతి ఏడాది డల్లాస్ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా న్యూజెర్సీ సెనెట్, అసెంబ్లీ ఆయనను సత్కరించాయి. శంకర నేత్రాలయం ప్రతిష్ఠాత్మక ‘శంకర రత్న’ పురస్కారంతోనూ ఆయనను గౌరవించనుంది.ప్రసాద్ రెడ్డి సేవా ప్రస్థానంలో తన భార్య శోభా రెడ్డి ప్రోత్సాహం, సహకారం కీలకంగా నిలుస్తున్నాయి. చిన్నారుల సంక్షేమం, విద్య, పోషకాహారం, ఆరోగ్యం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ దంపతులు చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
క్రైమ్
శివ సన్నిధిలో ప్రాణాలొదిలారు
శ్రీశైలం టెంపుల్: కుటుంబ కష్టాలకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్ (36), అతడి పెద్దక్క గోగుల ఆదిలక్ష్మి (50), చిన్నక్క మల్లేశ్వరి (45), చెల్లెలు పల్లపు శ్రీదేవి (33), మల్లేశ్వరి కుమారుడు మణికంఠ విగత జీవులై కనిపించారు. సత్రంలోని రూమ్ నంబర్–11లో సుధాకర్, అతని మేనల్లుడు మణికంఠ గదిలోని హాల్లో ఫ్యాన్కు ఉరేసుకోగా, మిగిలిన ముగ్గురు మహిళలు స్నానాల గదిలో చీరతో ఉరేసుకున్నారు. మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. సత్రం గదినుంచి దుర్వాసన రావడంతో నిర్వాహకులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. 26 రోజుల నుంచి వీరంతా వడ్డెర సత్రంలో బస చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ మాట్లాడుతూ.. ‘గత నెల 28న సుధాకర్తో పాటు ఆయన ముగ్గురు తోబుట్టువులు, మేనల్లుడు శ్రీశైలం వచ్చారు. రోజుకు రూ.800 అద్దె చెల్లిస్తూ వడ్డెర సత్రం గదిలో ఉంటున్నారు. ఇన్ని రోజులు ఉండకూడదని చెప్పినా ఆరోగ్యం బాగాలేదంటూ కొనసాగారు. సుధాకర్కు ఇంకా వివాహం కాలేదు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేసినా భర్తలను వదిలేసి ఇంటివద్దే ఉంటున్నారు. వారంతా ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు. బత్తలపల్లిలోని వారి బంధువులకు సమాచారం ఇచ్చాం. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’ అని చెప్పారు. ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వసతి గదుల్లో భక్తుల బసకు 48 గంటలే అనుమతి ఉందన్నారు. కానీ, సత్రం నిర్వాహకులు నిబంధనల్ని ఉల్లంఘించి గదులు కేటాయించారన్నారు. ప్రైవేటు సత్రాలన్నీ నిబంధనల ప్రకారం గదులు కేటాయించాలని ఆదేశించారు.
భార్య హత్య కేసులో ట్విస్ట్.. స్క్రూ మేకుతో బయటపడ్డ భర్త బండారం!
ఏలూరు జిల్లా: ఎలాంటి ఆధారాలు దొరక్కుండా భార్యను హత్య చేసి, ఉప్పుటేరులో పడేసి చేతులు దులుపుకోవాలనుకున్న భర్త పన్నాగం పది రోజులకు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మెడికల్ స్క్రూ మేకు ఇచ్చిన కీలక ఆధారంతో పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. ఈ హత్యోదంతానికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఘటన వివరాలు ఇలా.. భీమవరం టూటౌన్లోని వంశీకృష్ణ అపార్ట్మెంట్లో ఉప్పాడ నారాయణరావు, దేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉండగా, ఆమె అమెరికాలో ఉంటున్నారు. చేపల కమిషన్ వ్యాపారం చేసే నారాయణరావు అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో పాటు అనుమానాలు పెరిగాయి. కుటుంబ సభ్యులను దూషించడం, శారీరకంగా దగ్గరకు రానివ్వకపోవడం వంటి విషయాలతో కక్ష పెంచుకున్న నారాయణరావు.. ఈ నెల 8న వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లి, 14న తిరిగి ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగగా, భార్యను నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి తన మారుతి కారు (ఏపీ 37 సీఎల్ 1499)లో మృతదేహాన్ని ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వంతెన వద్దకు తీసుకెళ్లాడు. మందపాడు వెళ్లే రోడ్డు వైపు వెళ్లి ఉప్పుటేరులో పడేసేందుకు ప్రయతి్నంచగా, మృతదేహం గట్టుపైనే పడిపోయింది. దీంతో కారును ముందుకు పోనిచ్చి, అక్కడి నుంచి తిరిగి భీమవరానికి వెళ్లిపోయాడు. విస్తృత దర్యాప్తు.. మహిళ మృతదేహంపై పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ నేరస్థలాన్ని పరిశీలించాయి. డాగ్ స్క్వాడ్ సమీపంలోని చెరువు గట్టు ప్రాంతం వరకు వెళ్లి ఆగిపోయింది. నిందితుడు ఆ ప్రాంతంలో కారును వెనక్కి తిప్పడంతో అక్కడివరకే జాగిలం వెళ్లినట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలకు ఆదేశించారు. ఆయా బృందాలు ఉభయగోదావరి, కృష్ణ, ఇతర ప్రాంతాల్లో పర్యటించి విచారణ చేశారు. స్క్రూ మేకుతో బయటపడిన నిజం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి రెండు రోజులు మార్చురీలో ఉంచారు. పోస్టుమార్టంలో ఆమె ఎడమ కాలుకు స్టీల్ రాడ్డు, సర్జికల్ స్రూ్కలు ఉండటాన్ని గుర్తించారు. వాటిని పరిశీలించగా.. ఇంప్లాంట్ తయారీ కంపెనీ ’దాల్ అండ్ సన్స్’గా తేలింది. ఆ స్టీల్ రాడ్, స్రూ్కలను హైదరాబాద్లోని సుశీల ఆసుపత్రికి పంపినట్లు నిర్ధారించుకుని ఆరా తీయగా.. 2023 జనవరిలో భీమవరానికి చెందిన ఉప్పాడ దేవికి వాటిని అమర్చినట్లు వెల్లడైంది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించగా తాళం వేసి ఉంది. దీంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. నిందితుడి అరెస్ట్ తరచూ గొడవలు పడటంతో పాటు కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించడం, శారీరకంగా దగ్గరకు రాకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు నారాయణరావు అంగీకరించాడని అదనపు ఎస్పీ తెలిపారు. ఈ నెల 23న రాత్రి 7:15 గంటలకు ఆకివీడు పోలీస్ స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆకివీడు సీఐ కాళీచరణ్, ఎస్సై కే శుభశేఖర్, కాళ్ల ఎస్సై ఏ గణేశ్కుమార్, ఉండి ఎస్సై మల్లికార్జునరావు తదితర సిబ్బందిని ఆయన అభినందించారు.
‘నిన్ను.. నీ ఇద్దరు పిల్లలను చూసుకుంటా లిల్లీ’
తిరుపతి: పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేసి తర్వాత వదిలివేయడంతో తిరుపతికి చెందిన లిల్లీ అనే యువతి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైలవరం ఎస్ఐ శ్యామ్సుందర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం నార్జాంపల్లెకు చెందిన సుధాకర్ యాదవ్ తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లెలో టిఫిన్ సెంటర్ నడుపుతున్న లిల్లీ వద్దకు వెళ్లేవాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం కావడంతో సుధాకర్ యాదవ్ తనకు వివాహం కాలేదని, నిన్ను నీ ఇద్దరు పిల్లలను నేను చూసుకుంటానని నమ్మించాడు. దీంతో లిల్లీ కూడా భర్త లేకపోవడంతో అంగీకరించింది. అయితే సుధాకర్ యాదవ్కు అప్పటికే వివాహమైందనే విషయం తెలుకుని లిల్లీ ప్రశ్నించింది. దీంతో సుధాకర్ యాదవ్ కూల్ డ్రింక్స్లో మద్యం కలిపి లిల్లీకి తాగించి ఆమె ఫోన్లో వివరాలను తొలగించేశాడు. సుధాకర్ యాదవ్ తరఫున బంధువులైన బాలయ్య, లక్ష్మీదేవి, పార్వతీ, శ్రీదేవి తమ పెళ్లి జరిపిస్తామని హమీ ఇచ్చారని బాధితురాలు తెలిపారు. చివరికి కులంపేరుతో దూషించి దాడి చేసి మోసం చేసి తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారంటూ ఆరోపించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం!
తల్లి చనిపోతే కీడు సోకుతుందని.. బావిలో పడేసిన కుమారులు
కరీంనగర్ జిల్లా: తల్లి ఇంట్లో చనిపోతే దోషం వల్ల ఇల్లు వదలాల్సి వస్తుందన్న మూఢనమ్మకంతో కొడుకులే ఆమెను బావిలో పడేసి హత్య చేశారు. కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై హుజూరాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ విలేకరులకు తెలిపిన వివరాలివి. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ (80)కు నలుగురు కుమారులు సమ్మయ్య, కుమారస్వామి, రవీందర్, శ్రీనివాస్. వెంకటమ్మ వయోభారం, అనారోగ్యంతో మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉండేది. ఇంట్లో చనిపోతే దోషం వల్ల ఇల్లు వదలాల్సి వస్తుందని, ఎవరి ఇంట్లో చనిపోయినా దోషం పట్టుకుంటుందని పెద్ద కుమారుడు నూనె సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్ భావించారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటమ్మను వ్యవసాయ బావిలో వేసి హత్య చేశారు. మర్నాడు తమ తల్లి కనిపించడం లేదని గ్రామంలో వెతికారు. కాగా, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు వ్యవసాయ బావి వద్దకు ఎలా వెళ్తుందన్న అనుమానంతో పాటు కొడుకుల ప్రవర్తనపై పోలీసులు విచారించారు. ఇంట్లో చనిపోతే కీడు సోకుతుందని మూఢనమ్మకంతో తల్లిని బావిలో వేసి హత్య చేసినట్లు సమ్మయ్య, శ్రీనివాస్ విచారణలో ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.
వీడియోలు
బికినీ ధరించి రాఖీ.. కృతిపై కంగనా రియాక్షన్
సీనియర్ టీచర్లకు టెట్ వద్దు
టాక్సిక్ హంగామా
TMCకి ఇది బిగ్ విక్టరీ
మోదీ న్యూ కేబినెట్.. BJP కొత్త టీమ్
సాదిక్ పై నూకరాజు మనవడు సంచలన వ్యాఖ్యలు
కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
గుర్తుపెట్టుకోండి.. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. స్థానిక ఎన్నికల్లో YSRCP కొట్టే దెబ్బకు...
చేతకాని లోకేష్.. ఎన్టీఆర్ మనవడా..?
సెల్ఫ్ ఫైనాన్స్ ముసుగులో లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్

