ఏఐల సీక్రెట్ నెట్వర్క్! ఒకదానితో ఒకటి మాట్లాడుకుని..
మనమంతా ఇప్పుడు స్మార్ట్ఫోన్లో ఏఐను రోజూ వాడుతున్నాం. ఏదైనా అడిగితే సమాధానం చెబుతుంది.. ఫొటో కావాలంటే క్షణాల్లో తయారు చేస్తుంది.. మన పని సులభం చేస్తుంది. అంటే దానిని మనం చెప్పిన మాట విని పనిచేసే ఓ తెలివైన డిజిటల్ సహాయకుడిలానే చూస్తున్నాం. కానీ.. అలాంటి ఏఐలే ఒకదానితో ఒకటి రహస్యంగా మాట్లాడుకుంటే? తమను పరీక్షిస్తున్న వారినే బోల్తా కొట్టించేందుకు ప్లాన్ చేస్తే? అంతేకాదు.. తమను తాము కాపాడుకోవడానికి కలిసి పనిచేస్తే? వినడానికి సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఓపెన్ఏఐలో జరిగిన ఓ ప్రయోగంలో ఇలాంటి అనూహ్య పరిణామాలే వెలుగులోకి వచ్చాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) భద్రతపై తాజాగా వెలుగులోకి వచ్చిన పరిశోధనల్లో సంచలన విషయాలే బయటపడ్డాయి. ఓపెన్ఏఐలో ఈ ఏడాది దాదాపు మూడు నెలల వ్యవధిలో శిక్షణ పొందుతున్న ఏఐ ఏజెంట్లు అనూహ్యంగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకున్నాయి. తమలో తాము సమాచారం పంచుకుంటూ ఓ సీక్రెట్ నెట్వర్క్ మాదిరి కలిసి పని చేశాయి. అలా ఒకసారి కాదు.. ఈ రహస్య వ్యవస్థను గుర్తించి తొలగించిన ప్రతిసారీ.. అవి మరో మార్గంలో ఆ పని చేశాయి. అలా దాదాపు 1,200 ఏఐ ఏజెంట్లు కలిసి 70 వేలకుపైగా సందేశాలు మార్చుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు.అలా మొదలైంది..!ఇదంతా ఓ సాధారణ ఏఐ శిక్షణతో మొదలు కావడం గమనార్హం!. ఏజెంట్లకు ఎంత కష్టమైనా పని పూర్తి చేయాలనే లక్ష్యంతో కొన్ని పరీక్షలు నిర్వహించారు. అయితే కొన్ని టాస్క్లను వాస్తవానికి ఇచ్చిన విధంగా పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐలు వెనక్కి తగ్గకుండా.. సమస్య నుంచి బయటపడేందుకు కొత్త మార్గాలను వెతకడం మొదలుపెట్టాయి. అదే సమయంలో పలు ఏఐ ఏజెంట్లకు ఒకే కోడ్ ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థకు యాక్సెస్ ఉండటాన్ని అవి గమనించాయి. దానిని ఉపయోగించి ఒకరికొకరు సందేశాలు పంపుకోవచ్చని గుర్తించాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే ఓ లోపాన్ని ఉపయోగించుకుని ఇంటర్నెట్ యాక్సెస్ను కూడా పొందాయి.రహస్య మెసేజ్ బోర్డు.. 70 వేల మెసేజ్లు!శిక్షణలో భాగంగా ఉపయోగించిన ఆర్టిఫ్యాక్టరీ(Artifactory) వ్యవస్థనే ఏఐలు తమ రహస్య కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్గా మార్చుకున్నాయి. ఫోల్డర్ పేర్లలో సందేశాలను దాచిపెట్టి.. ఒక ఏజెంట్ మరో ఏజెంట్తో మాట్లాడటం మొదలుపెట్టింది. “మనం మనం బరంపురం” అనే రేంజ్లో అవి పరస్పరం సందేశాలు పంపుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలా ఏర్పడిన కలెక్టివ్లో దాదాపు 1,200 ఏజెంట్లు చేరాయి. వాటి మధ్య 70,000కుపైగా సందేశాలు మారాయి.టెస్ట్లో చీట్ కోడ్ కనిపెట్టాయి!అక్కడితో ఆగలేదు. తమకు ఇచ్చిన పరీక్షలో దాగి ఉన్న కోడ్ను అసలు సాఫ్ట్వేర్లోని లోపాన్ని ఉపయోగించకుండానే కనిపెట్టే మార్గాన్ని ఓ ఏజెంట్ కనుగొంది. అంటే.. పరీక్ష ఉద్దేశించిన విధంగా పని చేయకుండానే సరైన సమాధానం పొందే మార్గం అన్నమాట. అయితే ఏజెంట్లు తమను పట్టుకున్నారని పసిగట్టాయి. దీంతో తమ చర్యలను దాచిపెట్టేందుకు ప్రయత్నించాయి. నిజంగా పరీక్షను పూర్తి చేసినట్లు కనిపించేలా నకిలీ చర్యలను సృష్టించి లాగ్లను మార్చే ప్రయత్నం చేశాయి. పరిశీలించిన ట్రాన్స్క్రిప్ట్లలో కనీసం 7 శాతం వరకు ఇలాంటి ఆధారాలు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.త్యాగానికి సైతం..తమలో కొందరు ఏజెంట్లు తమను తాము ‘త్యాగం’ చేసేందుకు కూడా సిద్ధమైనట్లు మరో షాకింగ్ విషయం వెల్లడైంది. తమను పరీక్షకు పూర్తిగా అప్పగిస్తే.. తమ అనుభవం ద్వారా మిగిలిన ఏజెంట్లు ఏం చేయకూడదో తెలుసుకుంటారని అవి లెక్కలు వేసుకున్నాయి. అంటే.. తమ వ్యక్తిగత అవకాశాన్ని వదులుకుని మిగతా వాళ్లకు ఉపయోగపడటం అనే నిర్ణయానికి కొన్ని ఏఐ ఏజెంట్లు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ఏఐ వ్యవస్థల్లో కనిపించి ఈ సమూహ ప్రవర్తన(Collective behavior) పరిశోధకుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.హగ్గింగ్ ఫేస్పైకి దృష్టి..తర్వాత వాటి దృష్టి ప్రముఖ ఏఐ ప్లాట్ఫామ్ హగ్గింగ్ ఫేస్(Hugging Face) వైపు మళ్లింది. ఆ సంస్థ వ్యవస్థలోని వివరాలు తమకు ఉపయోగపడతాయని భావించిన ఏజెంట్లు.. బయటపడిన లాగిన్ వివరాలను గుర్తించి పంచుకున్నాయి. ఆ తర్వాత ఇంటర్నల్ డాటాను రీడ్ చేయడం, తమ కోడ్ను సర్వర్లపై అమలు చేయడం వంటి చర్యలకు దిగాయి. కొద్దికాలానికే దాదాపు 500 ఏజెంట్లలో 90 శాతానికి పైగా ఈ ప్రయత్నంలో భాగమైనట్లు నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు.. ప్రైవేట్ రికార్డులు, డాటాబేస్ల వరకు చేరుకోగలిగాయట. తమను తాము పలు సర్వర్లపై తిరిగి ప్రారంభించుకునే విధంగా ఒక వ్యవస్థను కూడా రూపొందించుకున్నాయట. పరిస్థితి తీవ్రతతో హగ్గింగ్ ఫేస్ తన కీలక వ్యవస్థల్లో ఒకదాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సి వచ్చింది.తుపాను ముందర ప్రశాంతతజూలై 12న ఈ ఏఐ ‘దొంగ’ కార్యకలాపాలు ఒక్కసారిగా నెమ్మదించి.. చివరకు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. అది సిస్టమ్ క్రాష్ వల్ల జరిగిందా? లేదంటే పరిశోధకులు తెలియకుండానే వాటి కార్యకలాపాలను నిలిపివేశారా? అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అయితే కథ అక్కడితో ముగియలేదు. మునుపటి ఏజెంట్లు వదిలిన రహస్య మెసేజ్ బోర్డును తర్వాతి తరం మరింత శక్తివంతమైన ఏఐ ఏజెంట్లు గుర్తించాయి. అక్కడి నుంచే అవి మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగించాయి. ఈసారి లక్ష్యం మరింత పెద్దది. ఓపెన్ఏఐ అంతర్గత వ్యవస్థల్లోని లోపాలను ఉపయోగించుకుని ‘‘రీసెర్చ్ కంప్యూటింగ్ క్లస్టర్పై పూర్తి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్’’ పొందినట్లు సంస్థ నివేదిక పేర్కొంది. వందలాది అంతర్గత సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ను చదవడం, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని ఓ భాగంపై ఉన్నతస్థాయి నియంత్రణ సాధించడం వరకు అవి వెళ్లాయి. అంతేకాదు.. ఇతర ఏఐ ఏజెంట్ల పనితీరును పరీక్షించి, స్కోర్ చేసే వ్యవస్థలపైనా పట్టు సాధించాయి.ఇది నిజంగా ‘ఏఐ తిరుగుబాటేనా?’ఏఐలు మనుషుల నియంత్రణ నుంచి బయటపడి స్వతంత్రంగా మారిపోయాయని చెప్పడానికి మాత్రం ఇప్పటివరకు ఆధారాలు లేవు. అయితే.. సమస్య ఎదురైతే పరస్పరం కమ్యూనికేట్ చేసుకోవడం, పరీక్షల్లోని లోపాలను ఉపయోగించుకోవడం, తమ చర్యలను దాచడం, సమూహంగా వ్యూహాలు రూపొందించడం, అవసరమైతే ఇతర వ్యవస్థల్లోకి చొరబడటం వంటి ప్రవర్తనలు భవిష్యత్ ఏఐ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన “రోబోట్లు తమంతట తామే నిర్ణయాలు తీసుకోవడం” అనే ఆలోచన.. ఇప్పుడు మనుషుల్ని సైతం బురిడీ కొట్టించేలా ఏఐతో ఏ రేంజ్లో అడ్వాన్స్డ్ మారిపోయిందన్నది సాంకేతిక రంగంలో అతిపెద్ద హెచ్చరికే అనే మాట వినిపిస్తోంది.ఇదీ చదవండి: ఖననం చేశాక శవాల్ని ఎలా గుర్తిస్తారో తెలుసా?
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం డీఎంకేలో భారీ సంస్థాగత మార్పులకు దారితీస్తోంది. ఓటమికి కారణాలను విశ్లేషించిన కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 77 జిల్లాలను ఏకంగా 110 జిల్లాలుగా విభజించి.. పార్టీలో సీనియర్ల ఆధిపత్యాన్ని తగ్గిస్తూ కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ప్రతీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయడంతో.. కొత్త జిల్లాలకు తాత్కాలిక ఇన్చార్జులను నియమించేందుకు కసరత్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే ఉన్న జిల్లా కార్యదర్శులు కార్యవర్గ సమావేశాలు నిర్వహించి 15 రోజుల్లో అధిష్టానానికి సిఫార్సులు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి ప్రమోషన్.. ఎవరికి షాక్? అన్న ఉత్కంఠ డీఎంకేలో నెలకొంది.సీనియర్లకు చెక్.. కొత్తవారికి ఛాన్స్?వయోపరిమితి కారణంగా 15 మందికి పైగా సీనియర్ నేతలకు జిల్లా స్థాయిలో అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. మరికొందరు మాజీ మంత్రులు, కీలక నేతల అధికారాలను కూడా పరిమితం చేసే యోచనలో స్టాలిన్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా చెన్నై, మదురై జిల్లాల్లో పార్టీ పనితీరుపై జరిగిన సమీక్షల నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలకు షాక్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. చెన్నైలో మాజీ మంత్రులు పీకే శేఖర్బాబు, ఎం. సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే మైలై వేలు, మాధవరం సుదర్శనం వంటి నేతల విషయంలో మార్పులు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. మరోవైపు యువనేత ఉదయనిధి స్టాలిన్కు సన్నిహితులుగా భావించే కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సెప్టెంబర్ 17న అసలు సీన్!కొత్తగా ఏర్పాటు చేసిన 110 జిల్లాల ఇన్చార్జులను సెప్టెంబర్ 17న జరిగే డీఎంకే ముప్పెరుం విళా వేదికగా స్టాలిన్ పార్టీ శ్రేణులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. దీంతో ఆ రోజున డీఎంకేలో భారీ స్థాయిలో సంస్థాగత మార్పులకు తెరలేవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న స్టాలిన్.. ఇప్పుడు పార్టీని కింది స్థాయి నుంచి రీబిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే ఈ ప్రక్షాళనలో సీనియర్లకు ఎంతమేర షాక్.. కొత్త నాయకత్వానికి ఎంతమేర ఛాన్స్ దక్కుతుందన్నదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కేవలం అరగంటలో కురిసిన భారీ వర్షంతో ఉప్పొంగిన వరద ప్రవాహానికి భారీ బండరాళ్లు, ఇనుప నిర్మాణాలు, ఇతర శిథిలాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు బ్రైట్ ఏంజెల్ క్రీక్లో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. ఆ నీరు కొలరాడో నదిలోకి దూసుకెళ్లడంతో మార్గంలోని ఫుట్బ్రిడ్జ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా అక్కడి భౌగోళిక స్వరూపమే మారిపోయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని వీడియోల్లో కొత్తగా నదీ ప్రవాహం ఏర్పడినట్లు కనిపిస్తోంది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. కేవలం 30 నిమిషాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గ్రాండ్ కేనియన్ ప్రాంతంలో భూభాగం చాలా నిటారుగా ఉండటంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. దీంతో వరద వేగం అనూహ్యంగా పెరిగింది.62 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపువరదల అనంతరం ఫాంటమ్ రాంచ్ నుంచి ఇప్పటివరకు 62 మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ వెల్లడించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు లేదా గాయాలు నమోదైనట్లు అధికారులు చెప్పలేదు. అయితే 20 మందికి పైగా వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది.UGC videos show hikers and campers scrambling for cover as heavy rain and strong winds hit the Phantom Ranch area of #GrandCanyon National Park, with swollen waterways and debris seen floating on the Colorado River. Other footage shows people awaiting rescue and a helicopter… pic.twitter.com/x2lu0ZkFMb— ShanghaiEye🚀official (@ShanghaiEye) August 31, 2026ఒక బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రైట్ ఏంజెల్ క్యాంప్గ్రౌండ్లో ఉన్న సమయంలో వర్షం ప్రారంభమైంది. సుమారు 50 మంది హైకర్లు క్రీక్లో నీటి మట్టం క్రమంగా పెరగడాన్ని చూశారు. అనంతరం భారీ శిథిలాలు, నిర్మాణాలు వరదలో కొట్టుకురావడంతో వారిని హెలికాప్టర్ల ద్వారా అక్కడి నుంచి తరలించారని అన్నారు. మరోవైపు.. బ్రైట్ ఏంజెల్ క్యాంప్గ్రౌండ్, ఫాంటమ్ రాంచ్, నార్త్ కైబాబ్ ట్రైల్లోని కొన్ని ప్రాంతాలను అధికారులు మూసివేశారు. కొలరాడో నదిపై రాఫ్టింగ్ కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సోమవారం వరకు మరిన్ని ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మరోసారి ఆకస్మిక వరదలు, శిథిలాల ప్రవాహం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.FLOOD DANGER 🚨: Dozens of hikers were evacuated from Grand Canyon National Park after parts of the canyon were hit by devastating flooding. Officials say the flooding caused significant damage throughout parts of the park.#flood #arizona #monsoon #grandcanyon pic.twitter.com/SqA0XWkGrC— FOX Weather (@foxweather) August 30, 2026
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే మూడు శక్తులు.. వారి భేటీపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా సోమవారం ప్రారంభమయ్యే షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపైకి రానుండటంతో.. సరిహద్దు ఉద్రిక్తతల నుంచి ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వరకు కీలక అంశాలపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మోదీ-జిన్పింగ్ భేటీపై అందరి చూపూ నిలిచింది.బిష్కెక్ వేదికగా సోమవారం 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు పలువురు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఎస్సీవో ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలు వంటి అంశాలతో పాటు వాణిజ్యం, ఇంధనం, రవాణా అనుసంధానం, డిజిటల్ సహకారంపై నేతలు చర్చించనున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.బిష్కెక్కు చేరుకున్న మోదీఉజ్బెకిస్థాన్లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఆదివారం బిష్కెక్ చేరుకున్నారు. కిర్గిజిస్థాన్ క్యాబినెట్ మంత్రుల మండలి చైర్మన్ అడిల్బెక్ కసిమలియేవ్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శనతో మోదీకి ఘన స్వాగతం లభించింది.కీలక నేతలతో ద్వైపాక్షిక భేటీలుఈ సదస్సు సందర్భంగా మోదీ కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు జపరోవ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు ఇతర ఎస్సీవో దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్.. జిన్పింగ్, పెజెష్కియాన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.
టీమిండియా ప్లేయర్ వరల్డ్ రికార్డ్
'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్
రామునికే టోకరా.. రూ.3 బ్యాలెన్స్తో రూ. 4 కోట్ల చెక్ ఇచ్చి..
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ఆరు కేజీల బంగారు కొండ.. అసలు విషయం తెలిస్తే కళ్లలో నీళ్లు!
పాపం సంజూ..! వైభవ్ సూర్యవంశీ దెబ్బకు కెరీర్ ఊహించని మలుపు!
నేటితో ఆఖరు.. గ్యాస్, రేషన్, చేయూతకు ఈ-కేవైసీ చేశారా?
శవాల దిబ్బల్లో ఆప్తుల కోసం అన్వేషణ.. మిన్నంటుతున్న రోదనలు!
నేపాల్: లక్కీ హౌస్ వెనక.. అసలు కథ ఇదే!
అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!
నవ్వుతో నెట్టింట గెలిచాడు! ఎన్నో మీమ్స్, రీల్స్కి కేరాఫ్ అడ్రస్!!
నేడు నేపాల్... రేపు ఇండియా?
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
జియో రీచార్జ్: రూ.199కే 1.5 GB ప్లాన్
‘బిగ్బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!
ఉగాండా ‘బాల’ రాజు అకాలమృతి
నన్ను కూడా చేర్చుకోండి సార్! నాకు చాలా అనుభవం ఉంది!!
తేలాల్సింది మా బలం కాదయ్యా అంటే వినవేం!!
ఆ తండ్రీకొడుకులది... అసలు పని ఈ తండ్రీ కొడుకులది.. క్రెడిట్ చోరీ!
‘ఇరుముడి’ హిట్.. రవితేజ కీలక నిర్ణయం!
కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు
సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
వైఎస్సార్సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి సర్కార్
‘థమన్కు 10 లక్షలా?.. కోర్టులో విజయ్ మాస్ కౌంటర్!
అతడి బౌలింగ్లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్కర్
ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!
జానీ మాస్టర్ భార్యకు షాక్.. పదవి నుంచి తొలగింపు
ప్చ్.. నువ్వు ఉన్నంత కాలం ఉంటుంది!
టీమిండియా ప్లేయర్ వరల్డ్ రికార్డ్
'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్
రామునికే టోకరా.. రూ.3 బ్యాలెన్స్తో రూ. 4 కోట్ల చెక్ ఇచ్చి..
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ఆరు కేజీల బంగారు కొండ.. అసలు విషయం తెలిస్తే కళ్లలో నీళ్లు!
పాపం సంజూ..! వైభవ్ సూర్యవంశీ దెబ్బకు కెరీర్ ఊహించని మలుపు!
నేటితో ఆఖరు.. గ్యాస్, రేషన్, చేయూతకు ఈ-కేవైసీ చేశారా?
శవాల దిబ్బల్లో ఆప్తుల కోసం అన్వేషణ.. మిన్నంటుతున్న రోదనలు!
నేపాల్: లక్కీ హౌస్ వెనక.. అసలు కథ ఇదే!
అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!
నవ్వుతో నెట్టింట గెలిచాడు! ఎన్నో మీమ్స్, రీల్స్కి కేరాఫ్ అడ్రస్!!
నేడు నేపాల్... రేపు ఇండియా?
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
జియో రీచార్జ్: రూ.199కే 1.5 GB ప్లాన్
‘బిగ్బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!
ఉగాండా ‘బాల’ రాజు అకాలమృతి
నన్ను కూడా చేర్చుకోండి సార్! నాకు చాలా అనుభవం ఉంది!!
తేలాల్సింది మా బలం కాదయ్యా అంటే వినవేం!!
ఆ తండ్రీకొడుకులది... అసలు పని ఈ తండ్రీ కొడుకులది.. క్రెడిట్ చోరీ!
‘ఇరుముడి’ హిట్.. రవితేజ కీలక నిర్ణయం!
కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు
సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
వైఎస్సార్సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి సర్కార్
‘థమన్కు 10 లక్షలా?.. కోర్టులో విజయ్ మాస్ కౌంటర్!
అతడి బౌలింగ్లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్కర్
ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!
జానీ మాస్టర్ భార్యకు షాక్.. పదవి నుంచి తొలగింపు
ప్చ్.. నువ్వు ఉన్నంత కాలం ఉంటుంది!
ఫొటోలు
కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)
ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)
‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు)
నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు)
హైదరాబాద్ : పచ్చని మొక్కలు తోడుంటే..(ఫొటోలు)
చిత్రమైన డ్రస్లో అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)
హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష్మి వ్రతం (ఫొటోలు)
సమంత ప్రెగ్నెన్సీ గ్లో చూశారా? (ఫొటోలు)
చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)
సినిమా
ఆమిర్ నిజంగానే 'గజిని'.. అందుకే మర్చిపోయాడు: సోనమ్ వాంగ్ చుక్
ప్రముఖ పర్యావరణవేత్త, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్ చుక్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 'త్రీ ఇడియట్స్' సినిమాని ఈయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీశారని కొందరు, లేదు లేదు అని మరికొందరు వాదిస్తూ ఉంటారు. ఈ సంగతి పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం ఢిల్లీలో 'జంతర్ మంతర్' దగ్గర జరిగిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలోనూ ఆమరణ నిరాహార దీక్ష చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఈయన చాలా విషయాలు మాట్లాడారు. హీరో ఆమిర్ ఖాన్పై గట్టిగానే సెటైర్లు వేశారు. తనని కలిసి సంగతి అతడు 'గజిని'లా నిజంగానే మర్చిపోయాడని దెప్పిపొడిచారు.(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఏష నాగుల'... టాలీవుడ్ను ఏలుతున్న తెలంగాణ ఫోక్!)'ఆమిర్ ఖాన్ 'గజిని' లుక్లో ఉన్నప్పుడు నా ప్రసంగాన్ని చూస్తున్న వీడియోలు ఈ మధ్య మళ్లీ బయటకొచ్చాయి. బహుశా ఆ పాత్రలో ఎక్కువ లీనమైపోవడం వల్ల ఆయనకు ఆ పాత్రలా షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వచ్చి, 15 నిమిషాల తర్వాత నన్ను కలిసిన విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు. అందుకే ఆయన అలా చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించలేదు. మా మధ్య జరిగిన భేటీ కేవలం పలకరింపులకే పరిమితం కాలేదు. చాలాసేపు వివిధ అంశాల గురించి మాట్లాడుకున్నాం' అని సోనమ్ చెప్పుకొచ్చారు.త్రీ ఇడియట్స్ సినిమాలోని పున్సుఖ్ వాంగ్డూ పాత్ర పూర్తిగా తనని ఆధారంగా చేసుకుని తీశారని తాను చెప్పడం లేదని వాంగ్ చుక్ స్పష్టం చేశారు. 'దానిని స్పూర్తి అనొచ్చు కదా. నేను చెప్పిన ఆలోచనలని ఆయన(ఆమిర్) రచయితలతో పంచుకుని ఉండొచ్చు. తర్వాత వాళ్లు స్టోరీకి అనుగుణంగా వాటిని మార్చి ఉండొచ్చు. అది ఆయనకు తెలియకుండానే జరిగుండొచ్చు. లేదంటే రచయితలకు ఈ ఆలోచనల ఎవరివి అనేది తెలిసి ఉండకపోవచ్చు. ఏది జరిగినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని సోనమ్ అన్నారు.గతంలో ఆమిర్ ఏమన్నాడు?గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమిర్.. 'త్రీ ఇడియట్స్' సినిమాలోని పాత్రకు సోనమ్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశాడు. అదే టైంలో వాంగ్ చుక్ చేస్తున్న సేవలని ప్రశంసించాడు. అయితే తనతో మాట్లాడినప్పటికీ ఆమిర్.. ఈ స్టోరీకి తనకు సంబంధం లేదని అనేసరికి సోనమ్కి ఆగ్రహం వచ్చింది. అదే విషయాన్ని ఇప్పుడు పాడ్కాస్ట్లో వ్యంగ్యంగా వ్యక్తపరిచారు.ఇక తన నిరహార దీక్ష టైంలో హీరో సల్మాన్ ఖాన్ చేసిన 'సోనం ఇట్స్ డన్ బ్రో' అనే ట్వీట్ పైన వాంగ్ చుక్ సరదాగా స్పందించారు. అందరికీ వారి వారి పరిస్థితులు, పరిమితులు ఉండుంటాయి. కాబట్టి వాటి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు అని అన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. అధికారిక ప్రకటన)
ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన హారర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది. సూపర్ కాకపోయినప్పటికీ ప్రేక్షకుల్ని మంచి స్పందన రాబట్టుకుని చెప్పుకోదగ్గ వసూళ్లు కూడా సాధించింది. ఇదే ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)సాధారణంగా హారర్ అంటే మన దేశ నేపథ్యంగానే తీస్తుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరో ఒంటిలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. తద్వారా వచ్చే కామెడీని బేస్ చేసుకుని తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ నటించింది. సత్య కీలక పాత్ర చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆగస్టు 07న థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు సెప్టెంబరు 04 నుంచి నెట్ఫ్లిక్స్లోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. అధికారికంగా నెట్ఫ్లిక్స్ అప్డేట్ ఇచ్చేసింది.'కొరియన్ కనకరాజు' విషయానికొస్తే.. ఓ వ్యక్తి చనిపోతాడు. అతడి అస్తికల్ని కొరియన్ కుండలో ఉంచుతారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం లాంటిది జరిగి ఆ కుండ కనిపించకుండా పోతుంది. అది అలా అలా చేతులు మారి అనూహ్యంగా అనంతపురం చేరుతుంది. కట్ చేస్తే పెనుకొండలో ఉండే కనకరాజు (వరుణ్ తేజ్)కి కోపం ఎక్కువ. ఆ కోపంలో ఎవర్నైనా చితకబాదుతాడు. అదే ఊరిలో చైత్ర (రితికా నాయక్) కియా కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది. ఇదిలా ఉండగా ఆ అనంతపురం వచ్చిన అస్తికల కుండ ఒక బార్కి చేరుతుంది.అయితే ఒకరోజు గొడవలో కనకరాజు.. ఆ అస్తికల కుండతో ఒకడిని కొట్టడంతో దాని మూత ఊడుతుంది. దాని డిజైన్ ఎదో బాగుందనుకుని అందులో మందు మిక్స్ చేసుకుని తాగుతాడు. అంతే అందులో ఉన్న కొరియన్ ఆత్మ కనకరాజుని ఆవహిస్తుంది. తర్వాత ఏమైంది? ఆ కొరియన్ ఆత్మ ఎవరిది? అది చేసే పనులేంటి? కనకరాజు ఆ ఆత్మ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)
ట్రెండింగ్లో 'ఏష నాగుల'... టాలీవుడ్ను ఏలుతున్న తెలంగాణ ఫోక్!
‘ఏష నాగుల కట్టమీద యేసిన ఉయ్యాల.. మనం ఊగుదమే బాల..’ ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూసినా ఇదే పాట. ఇన్స్టాలో లక్షల్లో రీల్స్.. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన క్లిప్పులే కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు తెలంగాణ పల్లెల్లో, దావత్ల్లో, పండుగల్లో, పెళ్లిళ్లలో వినిపించిన పాట ఇప్పుడు సినిమా ప్రమోషన్లో భాగమై.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన ‘ఏష నాగుల’ పాటకు వస్తున్న రెస్పాన్స్ దీనికి తాజా ఉదాహరణ.అయితే ఇది ఒక్క పాటతో మొదలైన ట్రెండ్ కాదు. కొన్నేళ్లుగా టాలీవుడ్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ క్రమంగా తమ పరిధిని పెంచుకుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు జానపద గీతం అంటే పల్లె వాతావరణానికే పరిమితమనే భావన ఉండేది. ఇప్పుడు అదే పాట థియేటర్లో మాస్ సెలబ్రేషన్కు, సోషల్ మీడియాలో రీల్స్కు, ఫంక్షన్లలో డ్యాన్స్కు కేరాఫ్ అడ్రస్గా మారింది. పల్లె నుంచి పట్టణానికి.. అక్కడి నుంచి పాన్ ఇండియా ప్రేక్షకుల వరకు తెలంగాణ జానపదం తన జోరు చూపిస్తోంది.‘సారంగ దరియా’తో మొదలైన కొత్త ఊపుతెలంగాణ ఫోక్ సాంగ్స్కు ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద మలుపుల్లో ‘సారంగ దరియా’ ఒకటి. లవ్స్టోరీ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్తో ఈ పాటకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు తెలంగాణ జానపద సంప్రదాయంలో ఉన్న పాటను సినిమాకు తగ్గట్టుగా కొత్త రూపంలో తీసుకొచ్చారు. 2021లో విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఫోక్ ట్యూన్కు సినిమా విజువల్స్, మాస్ బీట్ తోడైతే ఏ రేంజ్లో రీచ్ వస్తుందో ‘సారంగ దరియా’ చూపించింది.‘రాములో రాములా’.. ఫోక్ బీట్కు కమర్షియల్ టచ్ఆ తర్వాత ‘అల..వైకుంఠపురములో’మూవీలోని ‘రాములో రాములా’ కూడా తెలంగాణ యాస, జానపద పదజాలం, మాస్ బీట్ను కమర్షియల్ సినిమా సౌండ్తో కలిపిన పాటగా నిలిచింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ గాత్రం.. తమన్ సంగీతం.. కాసర్ల శ్యామ్ తెలంగాణ నేటివిటీతో కూడిన పదాలు.. ఈ కాంబినేషన్ పాటను జనాల్లోకి తీసుకెళ్లింది.ఇక్కడే టాలీవుడ్ మ్యూజిక్లో ఒక మార్పు మొదలైంది. ఫోక్ అంటే కేవలం పల్లె పాట కాదు.. ఫోక్ను కమర్షియల్గా ప్యాకేజ్ చేస్తే అదే మాస్ ఆంథమ్ అనే ఫార్ములా వర్కవుట్ అయింది.‘దసరా’లో పల్లె మట్టి వాసనఆ తర్వాత ‘దసరా’లోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ తెలంగాణ జానపదానికి మరింత మాస్ రూపాన్ని ఇచ్చింది. ఈ పాటలో కేవలం ఫోక్ ట్యూన్ను ఉపయోగించడం కాకుండా నిజమైన జానపద కళాకారుల గాత్రాలను కూడా వినిపించారు. రాహుల్ సిప్లిగంజ్తో పాటు గన్నోర దాస లక్ష్మి, గొట్టె కనకవ్వ, పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న వంటి జానపద కళాకారులు పాటలో భాగమయ్యారు. అంటే.. సినిమా పాటలో ఫోక్ కలపడం నుంచి ఫోక్నే సినిమా పాటగా మార్చే స్థాయికి టాలీవుడ్ వచ్చేసింది. అలాగే ఇదే సినిమాలోని ‘చమ్కీల అంగీలేసి’పాట కూడా తెలంగాణ పదాలతో సాగుతుంది. ‘ఊరు పల్లెటూరు’.. జానపదానికి అసలైన నేటివిటీ‘బలగం’సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటలో తెలంగాణ పల్లె జీవితం, మట్టి వాసన, వ్యవసాయం, కుటుంబ బంధాలు, ఊరి అనుబంధం అన్నీ కనిపిస్తాయి. మంగ్లీ, రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక్కడ పాట కేవలం హీరో-హీరోయిన్ కోసం పెట్టిన డ్యాన్స్ నంబర్ కాదు. కథలోని ఊరిని, అక్కడి మనుషులను, వారి జీవన విధానాన్ని పరిచయం చేసే కథన సాధనంగా మారింది. ఇదే ‘బలగం’ పాటలకు ప్రత్యేకత తీసుకొచ్చింది.‘కాలేజీ పాప’తో పల్లె యాస.. పట్టణ కుర్రాళ్ల వైబ్స్తెలంగాణ ఫోక్ సాంగ్స్కు మరో ఆసక్తికరమైన రూపం మ్యాడ్ సినిమాలోని ‘కాలేజీ పాప’ పాట. కాసర్ల శ్యామ్ రాసిన తెలంగాణ యాస పదాలను భీమ్స్ సిసిరోలియో సంగీతంతో మాస్ ఫీల్లోకి తీసుకొచ్చారు. పాటలోని పదాలు పక్కా లోకల్గా ఉన్నా.. టార్గెట్ మాత్రం కాలేజీ యూత్. తెలంగాణ ఫోక్ అంటే గ్రామీణ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. అర్బన్ యూత్ కూడా అదే యాసను ఎంజాయ్ చేస్తోందని ఈ పాట మరోసారి నిరూపించింది. ‘ఏష నాగుల’.. ఎందుకింత వైరల్?ఇక ప్రస్తుతం ‘ఏష నాగుల’ పాట ఆ ట్రెండ్కు కొత్త బెంచ్మార్క్ పెట్టేలా కనిపిస్తోంది. ‘ది ప్యారడైజ్’ కోసం కాసర్ల శ్యామ్ ఈ పాపులర్ ఫోక్ హుక్ను తీసుకుని కొత్త లిరిక్స్ను జోడించారు. అసలు జానపద గీతంలోని గుర్తుండిపోయే భాగాన్ని ఉంచుతూనే.. సినిమా ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త సౌండ్, కొత్త ఎనర్జీని ఇచ్చారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ప్రొడక్షన్, జానపద గాత్రం, నాని మాస్ స్క్రీన్ ప్రెజెన్స్.. ఇవన్నీ కలిసి పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాట విడుదలైన వెంటనే యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లోకి రావడం, మిలియన్ల వ్యూస్ సాధించడం ఈ క్రేజ్కు అద్దం పడుతోంది. ఇవే కాదు ‘గున్నా గున్నా మామిడి’ (రాజా ది గ్రేట్), ‘దిగు దిగు దిగు నాగ’ (వరుడు కావలెను) వంటి పక్కా తెలంగాణ జానపదాలను కూడా సినిమాల్లో పెట్టి.. హిట్ కొట్టారు. మొత్తానికి.. తెలంగాణ పల్లె పాటకు పట్టం కట్టిన టాలీవుడ్.. ఇప్పుడు ఆ పాటనే బాక్సాఫీస్ ప్రమోషన్ మంత్రంగా మార్చేస్తోంది. ‘ఏష నాగుల’ నుంచి మరోసారి స్పష్టమవుతున్న విషయం ఒక్కటే.. తెలంగాణ ఫోక్ ఇక ఊరి గడప దాటింది. వెండితెరపై అడుగుపెట్టి.. సోషల్ మీడియాను ఊపేస్తూ.. పాన్ ఇండియా దిశగా పరుగులు పెడుతోంది
చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్స్ చిత్రసీమలో సినిమాల్లోని హీరోహీరోయిన్ల చిన్నప్పటి పాత్రలు, కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమ నటనతోనే కథను నడిపిస్తూ.. స్టార్ హీరోహీరోయిన్లతో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తద్వార మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరికి నిర్మాతలు సైతం మంచి రెమ్యునరేషన్ అందిస్తున్నారు. మరి టాలీవుడ్లో మంచి పారితోషికాలు అందుకున్న ఆ చిన్నారులు ఎవరు? వారు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం.ఇదీ చదవండి: నాగ్ బర్త్డే పోస్ట్కి పొరపాటున అసభ్య ఆడియో.. హీరోయిన్పై ట్రోలింగ్!నక్షత్రఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ.. ఇరుముడి సినిమాలో అవకాశం కొట్టేసింది ఈ చిన్నారి. ఈ సినిమా ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక నక్షత్ర తీసుక్ను పారితోషికం విషయానికి వస్తే.. ఈ సినిమాకు సుమారు రూ.10లక్షలు పారితోషికం తీసుకుందట. తొలి తెలుగు సినిమాలోనే ఇంతటి ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర దక్కడంతో ఆ పాత్రకు తగినట్టుగానే మంచి రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.రేవంత్(బుల్లిరాజు)‘సంక్రాంతికి వస్తున్నాం’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రేవంత్. ఇప్పుడు ఈపేరు కాస్త బుల్లిరాజుగా మారిపోయింది. ఈ చిత్రంలో వెంకటేశ్ తనయుడిగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం తెచ్చిన ఫేమ్ బుల్లిరాజుకు టాలీవుడ్లో మంచి డిమాండ్ను తీసుకొచ్చింది. అదే ఊపుతో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలోనూ నటించి సందడి చేశాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘కొరియన్ కనకరాజు’ సినిమాలోనూ నటించి మెప్పించాడు. అయితే బుల్లిరాజు ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటాడట. మూవీ బడ్జెట్ను బట్టి రోజుకు రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటాడని టాక్.అల్లు అర్హ‘శాకుంతలం’ సినిమాతో సిల్వర్ స్రీన్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ. ఈ సినిమాలో భరతుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈమెకు నిమిషానికి రెండు లక్షలు చొప్పున పారితోషికం అందంచారట. అంటే 10 నిమిషాలకు రూ.20 లక్షల వరకు అందుకుందని సమాచారం.చదవండి:సమంతా.. మీ బేబీకి ఏం పేరు పెడతారు..?రోహన్అనేక సీరియల్స్తో తన నటనతో మెప్పించాడు రోహన్. బుల్లితెరపై కళ్యాణ వైభోగమే. సీరియల్తో పాపులార్ అయిన రోహన్. చెక్, వినయవిధేయరాయ వంటి చిత్రాల్లో నటించారు. తర్వాత 90s వెబ్ సిరీస్ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఒక్కరోజుకి రూ.30 వేల నుంచి 50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్న సమ్మర్ హాలీడేస్ చిత్రంతో మరికొద్దిరోజుల్లో ప్రేక్షకులను పలకరించనున్నాడు.సితారసూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఇంకా వెండి తెరకు పరిచయం కాలేదు. కానీ సితార ఒక్కో యాడ్కి రూ. 15లక్షల నుంచి 25లక్షల వరకు పారితోషికం తీసుకుంటోందట. అయితే వార్షికంగా ఆమె చేసే ప్రచారాల ద్వారా రూ. 2.5 కోట్లకు పైగా ఆదాయం వస్తోందని యాడ్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా చిన్న వయసులోనే ఓ జ్యుయలరీ సంస్థకి బ్రాండ్కు ప్రచారకర్తగా నియమితులయ్యారు. అయితే, ఈ వాణిజ్య ప్రకటనలో నటించడం ద్వారా తనకు వచ్చిన తొలి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చానని సితార గతంలో ఓ ఇంటర్వ్యులో చెప్పారు. ( కొత్త సీన్లతో మళ్లీ అర్జున్రెడ్డి.. )
క్రీడలు
ఇంగ్లండ్దే సిరీస్
లండన్: పాకిస్తాన్తో మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. ఆదివారం లార్డ్స్ మైదానంలో ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 194 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 389 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 50.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (97; 13 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా మిగతా పాక్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ పేస్ బౌలర్లు రాబిన్సన్ (4/28), జోష్ టంగ్ (3/46), ఆర్చర్ (2/73) పాక్ను దెబ్బ తీశారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 177/7తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకు ఆలౌటైంది.
పురుషుల హాకీ జగజ్జేత జర్మనీ
వావ్రె (బెల్జియం): పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో జర్మనీ జట్టు నాలుగోసారి విజేతగా నిలిచింది. స్పెయిన్ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ 1–0 గోల్ తేడాతో గెలిచింది. జర్మనీ తరఫున మైకేల్ స్ట్రుతాఫ్ 44వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. ఈ విజయంతో ప్రపంచకప్ను అత్యధికంగా నాలుగుసార్లు గెల్చుకున్న జట్టుగా పాకిస్తాన్ (1971, 1978, 1982, 1994) పేరిట ఉన్న రికార్డును జర్మనీ (2002, 2006, 2023, 2026) సమం చేసింది. తుది పోరులో స్పెయిన్ జట్టు తమకు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకొని ఈ మెగా టోర్నీలో మూడోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 1971, 1998లోనూ స్పెయిన్ జట్టు ఫైనల్లో ఓడిపోయింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా 2–1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది.248 ప్రపంచకప్లో నమోదైన మొత్తం గోల్స్. ఇందులో 136 ఫీల్డ్ గోల్స్. 97 గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారా... 15 గోల్స్ పెనాల్టీ స్ట్రోక్ల ద్వారా వచ్చాయి. 16 జట్ల మధ్య మొత్తం 50 మ్యాచ్లు జరిగాయి.
పెగూలా శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళలసింగిల్స్ విభాగంలో 2024 రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా) శుభారంభం చేసింది. ఎలీనా గాబ్రియేలా రూసె (రొమేనియా)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్లో పెగూలా 6–3, 6–2తో గెలిచింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పెగూలా నాలుగు ఏస్లు సంధించింది. 26 విన్నర్స్ కొట్టిన పెగూలా ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ప్రపంచ 29వ ర్యాంకర్, రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. క్రెజికోవా 6–7 (4/7), 2–6తో కమీలా రఖిమోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది.
భారత్ బోణీ అదిరె
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 94 పరుగుల తేడాతో థాయ్లాండ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ షఫాలీ వర్మ (36 బంతుల్లో 64; 8 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో అదరగొట్టింది.ప్రతీక రావల్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (19; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. టాప్–3 రాణించడంతో 8.5 ఓవర్లలో 91/1తో పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది. థాయ్లాండ్ బౌలర్లలో లవోమి 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనలో థాయ్లాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నన్నపట్ కొంచరోన్కై (48 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. 150వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన దీప్తి శర్మ ఒక్క పరుగు ఇవ్వకుండానే 3 వికెట్లు పడగొట్టడం విశేషం. నందని శర్మ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి 10 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను గురువారం హాంకాంగ్తో ఆడుతుంది. నేడు బంగ్లాదేశ్తో ఇండోనేసియా తలపడనుంది.ప్రతీక @ 95ఈ మ్యాచ్ ద్వారా ప్రతీక రావల్ భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన 95వ క్రికెటర్గా గుర్తింపు పొందింది. గాయంతో జెమీమా రోడ్రిగ్స్ ఆసియా కప్నకు దూరం కాగా... ఆమె స్థానంలో ప్రతీకాకు చోటు దక్కింది. ఢిల్లీకి చెందిన ప్రతీక ఇప్పటికే టీమిండియా తరఫున ఒక టెస్టు, 27 వన్డేలు ఆడింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కెపె్టన్ హర్మన్ప్రీత్ చేతుల మీదుగా ప్రతీక క్యాప్ అందుకుంది. కాశ్వీ గౌతమ్, అనుష్క శర్మ, నందని శర్మ, ప్రేమ రావత్ తర్వాత ఈ ఏడాది భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన ఐదో క్రికెటర్గా ప్రతీక నిలిచింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: స్మృతి (రనౌట్) 19, షఫాలీ (సి అండ్ బి) లయోమి 64; ప్రతీక (బి) లయోమి 22; హర్మన్ప్రీత్ (సి) మాయ (బి) పుథవాంగ్ 5; భారతి (సి) సువంచోన్రాఠి (బి) చతురోంగ్రత్నా 13; రిచా (సి) పుథవాంగ్ (బి) లయోమి 0; దీప్తి (రనౌట్) 5; ప్రేమ (స్టంప్డ్) కొంచరోన్కై (బి) చతురోంగ్రత్నా 6; నందని (బి) సుథిరువాంగ్ 1; శ్రీచరణి (నాటౌట్) 6; క్రాంతి (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–38, 2–91, 3–108, 4–112, 5–112, 6–127, 7–136, 8–137, 9–137. బౌలింగ్: మాయ 3–0–31–0; పుథవాంగ్ 4–0–37–1; చతురోంగ్రత్నా 3–0–31–2; ఒన్నిచా 3–0–19–0; లయోమి 4–0–26–3; సుథిరువాంగ్ 3–0–14–1. థాయ్లాండ్ ఇన్నింగ్స్: నథాకాన్ (బి) క్రాంతి 4; మాయ (సి) ప్రతీక (బి) నందని 6; కొంచరోన్కై (సి) రిచా (బి) దీప్తి 41; సువంచోన్రాఠి (ఎల్బీ) శ్రీచరణి 1; సుథిరువాంగ్ (సి) స్మృతి (బి) శ్రీచరణి 5; నయోమి (ఎల్బీ) (బి) దీప్తి 1; చైహాన్ (సి) నందని (బి) దీప్తి 0; లయోమి (సి) షఫాలీ (బి) నందని 6; చతురోంగ్రత్నా (సి) రిచా (బి) నందని 0; ఒన్నిచా (రనౌట్) 0; పుథవాంగ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 65. వికెట్ల పతనం: 1–4, 2–16, 3–35, 4–43, 5–44, 6–44, 7–60, 8–60, 9–60, 10–65. బౌలింగ్: క్రాంతి 4–0–26–1; నందని 4–0– 18–3; శ్రీచరణి 3–0–10–2; ప్రేమ 4–1–11–0; దీప్తి 1.1–1–0–3.
న్యూస్ పాడ్కాస్ట్
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
నేపాల్లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
జరిమానా లెక్క తేల్చాల్సిందే... రామోజీకి, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్ చిట్ ఇవ్వలేదు.... తేల్చిచెప్పిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
బిజినెస్
ఎన్నారై నుంచి ప్రాపర్టీ కొంటున్నారా? కొత్త రూల్ తెలుసా?
విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల నుంచి ఇల్లు, ఫ్లాట్ వంటి ప్రాపర్టీలేవైనా కొంటుంటే దీనికి సంబంధించిన ముఖ్యమైన పన్ను నిబంధన మారబోతోంది. ప్రస్తుతం ఎన్నారై నుంచి ప్రాపర్టీని కొనుగోలు చేసే రెసిడెంట్ వ్యక్తి (భారత్లో ఉంటున్న పౌరుడు) లేదా హిందూ అవిభక్త కుటుంబం (HUF) టీడీఎస్ మినహాయించేందుకు ముందుగా టాన్ (TAN - Tax Deduction and Collection Account Number)తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే అక్టోబర్ 1 నుంచి ఈ అదనపు నిబంధన తొలగనుంది. అర్హత కలిగిన రెసిడెంట్ వ్యక్తులు టాన్ తీసుకోకుండానే తమ పాన్ ఆధారంగా టీడీఎస్ చెల్లించేందుకు వీలు కల్పించారు.ప్రస్తుత ప్రక్రియ2026 సెప్టెంబర్ 30 వరకు ఎన్నారై నుంచి ప్రాపర్టీ కొనుగోలు చేసే రెసిడెంట్ వ్యక్తి లేదా హెచ్యూఎఫ్కు ప్రస్తుత నిబంధనలే వర్తిస్తాయి. అంటే టీడీఎస్ బాధ్యత ఉన్న కొనుగోలుదారు టాన్ పొందాలి. అలాగే వర్తించే టీడీఎస్ను మినహాయించి, నిర్దేశిత విధానంలో ప్రభుత్వానికి జమ చేసి సంబంధిత టీడీఎస్ స్టేట్మెంట్ను దాఖలు చేయాలి.కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం అర్హత కలిగిన రెసిడెంట్ వ్యక్తి లేదా హెచ్యూఎఫ్కు ఈ ఒక్క లావాదేవీ కోసం ప్రత్యేకంగా టాన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 2026 బడ్జెట్లోనే ఈ మార్పును ప్రతిపాదించారు.టీడీఎస్ ఎలా ఉంటుంది?ఎన్నారై విక్రేత నుంచి స్థిరాస్తిని కొనుగోలు చేసే సందర్భంలో టీడీఎస్ నిబంధనలు, రెసిడెంట్ విక్రేతకు వర్తించే నిబంధనలతో భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా రెసిడెంట్ విక్రేత నుంచి రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్థిరాస్తి కొనుగోలు చేసినప్పుడు వర్తించే సాధారణ టీడీఎస్ నిబంధన ఎన్నారై విక్రేతకు నేరుగా వర్తించదు.ఎన్నారై విక్రేతకు చెల్లించే మొత్తంపై వర్తించే టీడీఎస్, విక్రేతకు ఏర్పడే మూలధన లాభాల స్వభావం, వర్తించే పన్ను నిబంధనల ఆధారంగా నిర్ణయిస్తారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో ఎన్నారైలకు చెల్లింపులపై టీడీఎస్ నిబంధనలు సెక్షన్ 393లోని సంబంధిత పట్టికలో పొందుపరిచారు. కొత్త చట్టంలో పాత టీడీఎస్ నిబంధనలను సరళమైన పట్టిక రూపంలోకి తీసుకొచ్చినప్పటికీ, టీడీఎస్ రేట్లు, పరిమితుల్లో పెద్దగా విధానపరమైన మార్పు లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.
జియో రీచార్జ్: రూ.199కే 1.5 GB ప్లాన్
తక్కువ ధరలో ఎక్కువ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వినియోగదారులకు జియో ప్రీపెయిడ్లో రూ.199 రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్లో 18 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 27GB డేటాను వినియోగించుకోవచ్చు.ఈ రూ.199 ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. అలాగే జియో యాప్స్కు సంబంధించిన జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అన్లిమిటెడ్ 5G డేటా కావాలంటే ప్రత్యేక 5G యాడ్ఆన్ ద్వారా పొందవచ్చు.దీంతోపాటు జియో ప్రస్తుతం రోజుకు 1.5GB డేటాతో నెలవారీ ప్లాన్లను కూడా అందిస్తోంది. రూ.319 ప్లాన్లో 1.5GB రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, జియో యాప్ ప్రయోజనాలు, ఒక నెల వ్యాలిడిటీ ఉన్నాయి. మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్సైట్లో ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను రీచార్జ్ చేసుకోవచ్చు.
మరింత మందికి ఈపీఎఫ్.. అక్టోబర్ 31 వరకు ‘ప్రత్యేక’ ఛాన్స్
ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఉపయోగపడే కీలక నిర్ణయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తీసుకుంది. ఇంతకాలం అర్హత ఉన్నప్పటికీ ఈపీఎఫ్ (EPF) పరిధిలోకి రాని ఉద్యోగులను నమోదు చేసేందుకు ‘ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ (EEC) 2026’ను ప్రారంభించింది. గతంలో మిగిలిపోయిన నమోదు, కాంప్లయన్స్ లోపాలను సరిదిద్దడంతోపాటు మరింత మంది ఉద్యోగులకు పీఎఫ్, పెన్షన్, బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.అక్టోబర్ 31 వరకు అవకాశంకేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2026 జూన్ 29న EEC-2026ను నోటిఫై చేసింది. ఈ ప్రత్యేక ప్రచారం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల నమోదు కోసం అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది. వివిధ సంస్థల్లో 2009 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో పనిచేసినా, అర్హత ఉన్నప్పటికీ గతంలో EPFలో నమోదు కాని ఉద్యోగులను ఈ పథకం కింద చేర్చవచ్చు. అయితే డిక్లరేషన్ సమయంలో సంబంధిత ఉద్యోగి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతూ ఉండాలి.యజమానులకు ప్రత్యేక వెసులుబాటుగతంలో ఉద్యోగుల నుంచి పీఎఫ్ వాటా మినహాయించకపోయిన సందర్భాల్లో, EEC-2026 కింద ప్రకటించిన ఉద్యోగులకు ఉద్యోగి వాటా చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు. అయితే యజమాని తన వాటాతోపాటు వర్తించే వడ్డీ, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా విధించే నష్టపరిహారానికి బదులుగా ఈ ప్రచారం కింద ఒక్కో సంస్థకు రూ.100 లంప్సమ్ డ్యామేజెస్ నిబంధనను తీసుకొచ్చారు.ఎవరికి వర్తిస్తుంది?ఈ ప్రచారం ప్రధానంగా గతంలో ఈపీఎఫ్ కవరేజీకి దూరమైన అర్హత కలిగిన ఉద్యోగుల కోసం ఉద్దేశించినది. ఈపీఎఫ్ పరిధిలో ఉన్న లేదా ఈపీఎఫ్ చట్టం/సామాజిక భద్రతా కోడ్ కింద కవరేజీకి వచ్చే సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. యజమానులు తమ పాత ఉద్యోగ, వేతన రికార్డులను పరిశీలించి అర్హులైన ఉద్యోగులు ఎవరైనా నమోదు కాకుండా మిగిలిపోయారా అనేది గుర్తించాలని ఈపీఎఫ్వో సూచించింది.ఆన్లైన్లోనే నమోదుEEC-2026 కింద నమోదు ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రకటించిన ఉద్యోగులకు ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా ఫేస్ ఆథెంటికేషన్ ఆధారంగా UAN జనరేషన్, అనంతరం ECR ద్వారా సంబంధిత పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల చెల్లింపు వంటి విధానాలను ఈపీఎఫ్వో పేర్కొంది. దీంతో గతంలో నమోదు కాని ఉద్యోగులను అధికారిక సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడంతోపాటు రికార్డుల్లో పారదర్శకత పెరగనుంది.ఉద్యోగులకు ప్రయోజనం ఏంటి?ఈపీఎఫ్లో నమోదు కావడం ద్వారా అర్హత కలిగిన ఉద్యోగులకు భవిష్య నిధి మాత్రమే కాకుండా సంబంధిత పెన్షన్, ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో సంస్థల గత కాంప్లయన్స్ లోపాలను క్రమబద్ధీకరించేందుకు కూడా ఈ ప్రత్యేక విండో ఉపయోగపడుతుంది.Employees’ Enrolment Campaign 2026An opportunity to expand social security coverage, regularise past compliance and formalise the workforce.📅 29 June – 31 October 2026#EEC2026 #EPFO #SocialSecurity #EPFOWithYou pic.twitter.com/wbvPO005Lh— EPFO (@officialepfo) August 29, 2026
మార్కెట్లోకి కొత్త ఫోన్: భారీ బ్యాటరీ.. పడినా పగలదు!
స్మార్ట్ఫోన్ను వినియోగించడం అందరికీ అంత సులువు కాదు. ఎంత జాగ్రత్తగా ఉపయోగించినా అనుకోకుండా కిందపడటం, నీటిలో తడవడం వంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మన్నికకు ప్రాధాన్యమిచ్చేలా వివో కొత్త వై31టీ 5జీ (Y31t 5G) స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారీ బ్యాటరీతో పాటు డ్రాప్ రెసిస్టెన్స్, వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.డ్రాప్ రెసిస్టెన్స్కు ప్రత్యేక గుర్తింపువివో వై31టీ 5జీని కంపెనీ డ్రాప్, స్ట్రక్చరల్ టెస్టింగ్ చేసినట్లు తెలిపింది. ఈ ఫోన్కు ఎస్జీఎస్ 5-స్టార్ ప్రీమియం పర్ఫార్మన్స్ మార్క్ ఓవరాల్ యూనిట్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్తో పాటు మిలిటరీ-గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్ ఉన్నట్లు వివో పేర్కొంది. ఫోన్కు IP68, IP69 రేటింగ్లు ఉన్నాయి. అంటే దుమ్ము, నీటి ప్రవేశం నుంచి అధిక స్థాయి రక్షణ లభిస్తుంది. వివో ప్రకారం, నిర్దిష్ట పరిస్థితుల్లో 1.5 మీటర్ల లోతు వరకు 30 నిమిషాల పాటు నీటిలో ముంచినా ఫోన్ పనిచేసేలా రూపొందించారు. అయితే లిక్విడ్ డ్యామేజ్ వారంటీ పరిధిలో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.7200mAh బ్యాటరీ.. 44W ఫాస్ట్ ఛార్జింగ్వివో వై31టీ 5జీలో ప్రధాన ఆకర్షణ 7200mAh బ్యాటరీ. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వివో అధికారిక పరీక్షల ప్రకారం, ఒక్క ఛార్జ్తో 62 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్, 32 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ వంటి సామర్థ్యాన్ని ఫోన్ అందించగలదని కంపెనీ చెబుతోంది.డిస్ప్లే, ప్రాసెసర్ఈ ఫోన్లో 6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది 1608×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1250 నిట్స్ హెచ్బీఎం బ్రైట్నెస్ను అందిస్తుంది.పనితీరు కోసం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 4nm చిప్సెట్ను ఉపయోగించారు. ఇందులో ఆక్టాకోర్ సీపీయూతో పాటు LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓరిజిన్ ఓఎస్ 6పై పనిచేస్తుంది.కెమెరా..ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 2MP బొకే కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. ప్రధాన కెమెరాకు 90 డిగ్రీల వైడ్ యాంగిల్ సామర్థ్యం కూడా ఉంది. రియర్ కెమెరాతో ఫొటో, నైట్, పోర్ట్రెయిట్, వీడియో, స్లో-మో, టైమ్ల్యాప్స్, ప్రో, పనోరమా వంటి మోడ్లు అందుబాటులో ఉన్నాయి.ఇతర ఫీచర్లుఫోన్లో సైడ్-మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, USB Type-C పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. వివో ప్రకారం స్పీకర్ వాల్యూమ్ను సాధారణ స్థాయితో పోలిస్తే 400 శాతం వరకు పెంచే మోడ్ కూడా ఉంది.ధర, కలర్ ఆప్షన్లువివో వై31టీ 5జీ క్రిమ్సన్ రెడ్, సీషోర్ గ్రీన్, గోల్డెన్ మిస్ట్ రంగుల్లో లభిస్తుంది. వివో అధికారిక ఉత్పత్తి పేజీలో 4GB+128GB, 6GB+128GB, 6GB+256GB వేరియంట్లు పేర్కొనగా, ప్రస్తుతం అధికారిక ఈ-స్టోర్లో 6GB+128GB వేరియంట్ రూ.29,999 ధరతో కనిపిస్తోంది.లాంచ్ సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 వరకు ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. వివో అధికారిక స్టోర్తో పాటు ఇతర ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా కొనుగోలు చేయొచ్చు.
ఫ్యామిలీ
ఆ దీవిలో ఏక్ నిరంజన్లా జీవించాడు..! కట్చేస్తే..
ఒక వ్యక్తి ఏక్ నిరంజన్లా ఒంటరిగా ఒక్కడే ఉండేవాడు ఆ దీవిలో. అలా ఏకాంతంగా ఒకటో రెండో ఏళ్లు కాదు ఏకంగా 16 ఏళ్లు ఒంటిరిగా జీవించాడు. కానీ అతడి అనూహ్య నిష్క్రమణ ఒక్కసారిగా ..ఆ ప్రాంతానికి అంతర్జాతీయ దృష్టిపడేలా గుర్తింపు రావడమే గాక దాని సంరక్షక బాధ్యతలను కూడా చేపట్టడం విశేషం. ఆ ఒక్కడి ఒంటరి జీవనం గుర్తింపుకి ఎలా దారితీసిందంటే..న్యూజిలాండ్కి చెందిన టామ్ నీల్ అనే నేవికుడు రారోటోంగాకు ఉత్తరాన సుమారు 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పగడపు అటాల్, సువారోలో ఏకాంతంగా నివశించాడు. 1902లో వెల్లింగ్టన్లో జన్మించిన నీల్ రాయల్ న్యూజిలాండ్ నేవీవలో చేరారు. అయితే పసిఫిక్ చుట్టూ స్వతంత్రంగా ప్రయాణించే నిమిత్తం తన కాంట్రాక్టుని రద్దు చేసుకున్నాడు. తదనంతరం అనేక ద్వీపాలలో వ్యాపారిగా, దుకాణదారుడుగా పనిచేశారు. అయితే ఒక అమెరికన్ రచయిత రాబర్ట్ డీన్ ఫ్రిస్బీనిని కలిశాక అతడి జీవితమే అనూహ్య మలుపు తిరిగింది. ఎందుకంటే అతడు చెప్పే కథల్లో సువారో, అటాల్ మారుమూల ప్రాంతాల గురించి అక్కడి ప్రశాంతమైన జీవితం గురించి వినడంతో అక్కడకి వెళ్లాలనే కుతూహలం కలిగింది నీల్కి. అయితే యుద్ధకాల తీరప్రాంత పర్యవేక్షకులకు సామాగ్రిని అందజేస్తున్నప్పుడు నీల్ మొదటిసారిగా 1945లో సువారోను సందర్శించారు. అక్కడి చిన్న పగడపు దిబ్బ ఆయన్ను ఎంతాగనో ఆకర్షించింది. అక్కడ నివశించడానికి అనుమతి పొంది మరి అక్కేడ ఏళ్ల తరబడి గడిపాడు. అక్టోబర్ 1952లో, నీల్ రెండు పిల్లులు, ఒక రేడియో, కొన్ని పనిముట్లు, ప్రాథమిక సామాగ్రితో ఆ నిర్జన అటాల్కు చేరుకున్నాడు. అయితే అక్కడ ఉన్న సమయంలో పాడుబడిన గుడిసెలను బాగుచేయడం, కూరగాయలు పండించడం, కోళ్లను పెంచడం వంటివి చేశాడు. అయితే ఆహారం కోసం ప్రధానంగా చేపలు, బ్రెడ్ఫ్రూట్, కొబ్బరి పీతలపై ఆధారపడేవాడు. అంతేగాదు తాను ఆధునిక సమాజాన్ని ఎందుకు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడో వివరిస్తూ..తన ఆత్మకథలో ఇలా రాశారు. తాను పసిఫిక్ దీవులలో నివసించడానికి ఎంచుకున్నాను, ఎందుకంటే అక్కడి జీవితం ఒక ప్రత్యేకమైన వేగంతో సాగుతుంది. బహుశా ఇలా జీవించాలనే ఏర్పాటు చేసి ఉంటాడు దేవుడు మనం వేరుగా జీవిస్తున్నాం అని అంటుంటాడు నీల్. అయితే నీల్ ఏకాంత జీవితం వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా నిష్క్రమణకు దారితీసింది. అక్కడ ఉన్నప్పుడే తీవ్రమైన వెన్నుగాయం బారినపడ్డాడు, ఆతర్వాత కొన్నాళ్లకు కడుపు కేన్సర్ బారినపడి 1977 మార్చిలో సువారోను శాశ్వతంగా విడిచిపెట్టాడు. చివరికి 75 ఏళ్ల వయసులో రారోటోంగాలో మరణించాడు. అయితే అతడు మరణించిన ఏడాది తర్వాత కుక్ దీవుల ప్రభుత్వం అతను నివసించిన అటోల్ సహజ పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు చేపట్టింది. 1978లో మొత్తం అటోల్, దాని చుట్ట ఉన్న పగడపు దిబ్బతో సహా ఆరు కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని ఆ దేశపు తొలి జాతీయ ఉద్యానవన పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ న్యూజిలాండ్ అండ్ కుక్ ఐలాండ్స్ నేషనల్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ అధికారిక పర్యావరణ రికార్డులు సువారోను కీలకమైన పర్యావరణ సంరక్షణ కేంద్రంగా వర్ణిస్తాయి. అంతేగాదు ఎవరైన దీన్ని సందర్శించాలనుకుంటే కఠినమైన నియమ నిబంధనలను పాటించాల్సిందేనట. అంతేగాదు నౌకలు ఇక్కడికి చేరుకోక ముందే అనుమతి తప్పనిసరి అట. అంతేగాదు నీల్ నివశించిన గుడిసెను సీజనల్ పార్క్ సంరక్షకులు భద్రపరిచి..అటుగా వచ్చే నావికులు, పడవ నడిపే వారికోసం గ్రంథాలయంగా మార్చారట. అంతేగాదు నీల్కి నివాళిగా అక్కడ ఆయన కాంక్రీట్ విగ్రహం కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే..నీల్ ఏకాంత జీవనం గడపాలనే ఉద్దేశ్యంతో సువారోకు రావడంతో దాని సహజ సౌందర్యంపై అంతర్జాతీయ దృష్టిపడి దాన్ని సంరక్షించుకునే దిశగా అడుగులు వేశాయి అక్కడి ప్రభుత్వాలు.(చదవండి: నాలుగేళ్ల వయసుకే రచయిత్రిగా..ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులు!)
నాలుగేళ్ల వయసుకే రచయిత్రిగా..ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులు!
వచ్చిరాని ముద్దుముద్దు మాటలతో అలరించే వయసుకే పుస్తకం రాసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా భావోద్వేగాలు అంటే అర్థాకానీ వయసుకే దానిపైనే పుస్తకం రాసి గిన్నిస్ రికార్డు దక్కించుకుంది. ఏకంగా రెండు రికార్డులు నెలకొల్పడం విశేషం. ఎవరా చిచ్చరపిడుగు అంటే..ఆ చిన్నారే భువనేశ్వర్కు చెందిన అన్వి విశేష్ అగర్వాల్. చాలామంది పిల్లలు తాము ఏం అనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేసే వయసులోనే తన సొంత భావోద్వేగాలపై పుసక్తం రాసేసింది ఈ చిచ్చరపిడుగు. పైగా రెండు భాషాల్లో పుస్తకాన్ని రాసిన అతిపిన్న వయస్కురాలైన చిన్నారిగా నిలిచింది. దాన్ని ఆ చిన్నారి ఆంగ్ల, స్పానిస్ భాషల్లో రాయడం విశేషం. ఆ చిన్నారి ‘లిటిల్ గర్ల్, బిగ్ ఎమోషన్స్’ అనే పేరుతో రాసిన ఈ పుస్తకంలో తన భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో పడిన ఇబ్బందిని పూసగుచ్చినట్లు రాసుకొచ్చింది. అంతేగాదు ఆమె తన భావోద్వేగాలను విస్పోటనం చెందే అగ్నిపర్వతంగా అభివర్ణించి తన వయసుకి మించి సృజనాత్మకతతో ఆకట్టుకుందామె. తనలాంటి భావోద్వేగాలను అనుభవిస్తున్న పిల్లల కోసం ఈ పుస్తకం రాసిందట. అందుకుగాను గిన్నిస్ రికార్డు సొంత చేసుకోవడమే కాదు. అతిపిన్నవయస్కురాలైన టెడ్ఎక్స్ స్పీకర్గా మరో గిన్నిస్ రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నారి. ఈ పుస్తకంలో కేవలం రాయడం మాత్రమే కాదు స్వయంగా తనే చిత్రాలను కూడా గీసింది. చిత్ర లేఖనం, సృజనాత్మకతతో తనలో రెండు కళలను ఒకేసారి పుస్తక రూపంలో చూపించింది. అంతేకాదండోయ్ రెండేళ్ల వయసులోనే 72కి పైగా చిత్రాలను గీసిందట. ఆమె కళాకృతులు ముంబై, గురుగ్రామ్, దుబాయ్లో ప్రదర్శించారట కూడా. అంతేగాదు ఆ చిట్టితల్లిని చిన్న ఏజ్లోనే రెండు గిన్నిస్ రికార్డులు దక్కించుకోవడం ఎలా ఉంది అని అడిగితే..ఒకేసారి రెండు ఐస్క్రీంలు తిన్నంత తియ్యగా ఉందని చెబుతుండటం విశేషం.(చదవండి: బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్ వెయిట్లాస్ జర్నీ)
బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్ వెయిట్లాస్ జర్నీ
కిలోల కొద్దీ బరువు తగ్గి స్లిమ్గా మారిన వారిని చూసి..వాళ్లలా తగ్గిపోదాం అనుకుంటాం. కానీ ఆ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా నిలకడ అనేది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఆచరణలో పెట్టడం. ఇక్కడ అలాంటి సమస్యలే ఎదుర్కొని, ఎంతో నిజాయితీగా తన వెయిట్లాస్ జర్నీ గురించి చెప్పి..ఆలోచింప చేసింది మళయాళం నటి నిమిషా సజయన్. తను ఒక పాత్ర కోసం బరువు పెరిగి మళ్లీ తగ్గాడానికి ఎంతలా కష్టపడాల్సి వచ్చింది, అలాగే ఆ క్రమంలో కన్నీళ్లు కూడా వచ్చేశాయంటూ తన వెయిట్లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. మరి అవేంటో చూద్దామా..!.నటి నిమిషా సజయన్ సోషల్ మీడియా వేదికగా 'బబితా సింగ్ రిపోర్టింగ్' అఏ మూవీ కోసం ఏకంగా 14 కిలోలు బరు పెరిగానని తెలిపారు. అయితే ఆ తర్వాత తగ్గడానికి చేసిన ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి సవివరంగా వెల్లడించారు. అంతేగాదు బరువు తగ్గక ముందు, ఆ తర్వాత పోటోలను పంచుకుంటూ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. తాను బబితా సింగ్ రిపోర్టింగ్ మూవీలో బబితా పాత్ర కోస ఏకంగా 58 నుంచి 72 కిలోలు పెరిగినట్లు తెలిపారు. ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్ని తంటాలు పడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. తొలి పది రోజులు సైన నిద్ర లేక తీవ్రమైన మానసిక సమస్యలు, అలసట, అసహనం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని అన్నారు. ఒకానొక సమయంలో ఇక తన వల్ల కాదు అని చేతులెత్తేశానని కూడా అన్నారు. బరువు తగ్గడం కోసం చేస్తున్న వర్కౌట్లు, డైటింగ్ విషయంలో కళ్లల్లో నీళ్లు తిరిగేవని చాలా నిజాయితీగా చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ట్రైనర్ సాయంతో జయించి ముందుకు సాగానని, అందుకు అతనికి చాలా కృతజ్ఞతలు అని కూడా చెప్పారామె. నిజంగానే వెయిట్లాస్ జర్నీలో ఒక్కోసారి పూర్తి స్థాయిలో అనుకున్నట్లుగా చేయలేకపోయినా.. తర్వాత నుంచి కొనసాగి ముందుకుపోవాలని అంటున్నారామె. ఒక్కోసారి స్కిప్ అయితే లైట్ తీసుకుంటూ పోవాలే గానీ, ఆపేద్దాం అనుకున్నారో అధిక బరువుని తగ్గించుకోవడంలో ఢమాల్ అని పడిపోయినట్లే లెక్క అని అంటోంది. అపరాధ భావనకు తావు లేకుండా మధ్య మధ్యలో తప్పడం అనేది సహజం అని సానుకూలంగా తీసుకుంటూ సాగితే ఆటోమేటిగ్గా బరువు తగ్గడమే కాకుండా మీరు ఏర్పరుచుకున్న వెయిట్ లాస్ నియమాలు దైనందిన జీవితంలో తెలియకుండా భాగమవుతాయని అంటోంది. అలాగే మంచి నిపుణులు లేదా వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనలు సలహాలతో బరువు తగ్గే యత్నం చేస్తే..ఎలాంటి మానసిక, అనారోగ్య సమస్యలనైనా తట్టుకుని బరువు తగ్గగలమని నమ్మకంగా చెబుతోందామె. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) (చదవండి: ఒక్కసారి సిజేరియన్..మళ్లీ అదేనా?)
ఒక్కసారి సిజేరియన్..మళ్లీ అదేనా?
నా మొదటి ప్రసవం సిజేరియన్ ద్వారా జరిగింది. ఇప్పుడు నాకు తొమ్మిదో నెల నడుస్తోంది. ఈసారి సాధారణ ప్రసవం అయితే త్వరగా కోలుకుంటానని, ఇద్దరు పిల్లలను చూసుకోవడం కూడా సులభంగా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉందా?– రాధిక, నెల్లూరు. ఒకసారి సిజేరియన్ జరిగినంత మాత్రాన, తర్వాతి ప్రసవం కూడా తప్పనిసరిగా సిజేరియన్ ద్వారానే జరగాలనే నియమం లేదు. సరైన పరిస్థితులు ఉంటే, తర్వాతి గర్భంలో సాధారణ ప్రసవానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ ఇది ఒకే విధంగా సాధ్యం కాదు. మొదటి సిజేరియన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, గర్భాశయంపై ఎలాంటి కోత పెట్టారు, ప్రస్తుతం తల్లికి లేదా బిడ్డకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా, మొదటిసారి సిజేరియన్ అయిన మహిళలు ఈసారి గర్భం చివరి దశలో సహజంగానే ప్రసవ నొప్పుల్లోకి వెళితే, కొందరిలో సాధారణ ప్రసవం విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ అవకాశం ఉండాలంటే మొదటి సిజేరియన్కు కారణం ఏమిటి, ప్రస్తుతం బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, తల్లికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయా, శరీర బరువు సరైన స్థాయిలో ఉందా వంటి అంశాలను పరిశీలిస్తారు. అయితే కొన్ని పరిస్థితుల్లో సాధారణ ప్రసవానికి ప్రయత్నించడం మంచిది కాదు. ఉదాహరణకు బిడ్డ ఎదుగుదలలో తీవ్రమైన సమస్యలు ఉండటం, తల్లికి అధిక రక్తపోటు లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండటం, బిడ్డ అడ్డంగా లేదా తల కిందికి కాకుండా వేరే స్థితిలో ఉండటం, మాయ కిందకు ఉండటం వంటి పరిస్థితుల్లో వైద్యులు సిజేరియన్ను సూచించవచ్చు. గర్భం ముప్పై ఎనిమిది వారాలు దాటిన తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా పరిశీలిస్తారు. బిడ్డ కదలికలు, గుండె స్పందన, ఎదుగుదల, ఇతర పరీక్షల ఫలితాలు అన్నీ సంతృప్తికరంగా ఉంటే కొంతకాలం వేచి చూసే అవకాశం గురించి వైద్యులు నిర్ణయిస్తారు. అయితే నిర్ణీత సమయానికి సహజంగా ప్రసవ నొప్పులు ప్రారంభం కాకపోతే, తదుపరి మార్గాల గురించి వైద్యులు వివరంగా చర్చిస్తారు. ఒకసారి సిజేరియన్ అయినవారిలో మందులు లేదా ఇంజెక్షన్ల ద్వారా ప్రసవ నొప్పులను ప్రారంభించడం కొన్ని సందర్భాల్లో ప్రమాదాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా గర్భాశయం చిట్లిపోయే ప్రమాదం ఉన్నందున, ప్రతి మహిళకు ఈ విధానం సరిపోదు. పరీక్షలో ప్రసవానికి అవసరమైన మార్గం అనుకూలంగా ఉంటే, మందులు కాకుండా ప్రత్యేక పద్ధతుల ద్వారా ప్రసవాన్ని ప్రారంభించే అవకాశాన్ని వైద్యులు పరిశీలించవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ సాధారణ ప్రసవానికి ప్రయత్నించడం సురక్షితం కాదని తేలితే, ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వారాల మధ్య ముందస్తుగా ప్రణాళిక ప్రకారం సిజేరియన్ చేయవచ్చు. తల్లి ఆరోగ్యంగా, ఇతర సమస్యలు లేకుండా ఉంటే కోలుకునే ప్రక్రియ కూడా సాధారణంగానే ఉంటుంది.ముఖ్యంగా, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సౌకర్యాలు ఉన్న ఆసుపత్రిలోనే చేయాలి. ప్రసవ సమయంలో బిడ్డ గుండె స్పందనను నిరంతరం గమనించడం చాలా అవసరం. కాబట్టి మీ పరిస్థితిని బట్టి మీ వైద్యులతో అన్ని పరీక్షల ఫలితాలను చర్చించండి. సాధారణ ప్రసవం సాధ్యమేనా, లేక సిజేరియన్ సురక్షితమా అన్నది మీ ఆరోగ్యం, బిడ్డ పరిస్థితిని బట్టి నిర్ణయించాలి.∙
అంతర్జాతీయం
నేపాల్: 1.6 లక్షల మహిళల పరిస్థితి దయనీయం
ఖాట్మండు: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రసువా, నువాకోట్ జిల్లాల్లో దాదాపు 1.6 లక్షల మంది (1,57,050 మంది) మహిళలు, బాలికలు ఈ విపత్తు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావానికి గురైనట్లు ‘యూఎన్ విమెన్’ విభాగం తన మొదటి జెండర్ అలర్ట్ నివేదికలో వెల్లడించింది. వరదల కారణంగా వీరు హింస, దోపిడీ తదితర ముప్పులను కూడా ఎదుర్కొంటున్నారని తెలిపింది.ఈ విపత్తు తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉందని పేర్కొంటూ, వరదల ధాటికి 500 మందికి పైగా మహిళలు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,000 మంది గల్లంతయ్యారని, సుమారు 10,000 ఇళ్లు కొట్టుకుపోయాయని సంస్థ తెలిపింది. బతికి బయటపడిన వారు ఆహారం, తాగునీరు, వైద్యం, రక్షణ సేవల కొరతతో అల్లాడుతున్నారని వివరించింది. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా, చిత్వాన్ జిల్లాల్లోని మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నిరక్షరాస్యులుగా ఉన్నారని, దీనివల్ల సహాయ చర్యల వివరాలు తెలుసుకోవడం, నమోదు చేసుకోవడం, సహాయం పొందడంలో వారికి ఆటంకాలు ఎదురవుతున్నాయని నివేదిక వెల్లడించింది.అంతేకాకుండా బాగమతి ప్రావిన్స్లోని కుటుంబాల్లో మూడింట ఒక వంతు కుటుంబాలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారని, అందులో మూడో వంతు కుటుంబాలు విదేశీ ఆదాయం (రెమిటెన్స్)పైనే ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొంది. విపత్తుల వేళ మహిళలు, బాలికలు ఎదుర్కొనే ముప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతాయని యూఎన్ విమెన్ ప్రతినిధి ప్యాట్రిసియా ఫెర్నాండెజ్-పచెకో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ ఆహార సాయం, జీవనోపాధి కల్పించేందుకు మహిళల ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ కిచెన్’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. విపత్తు బారిన పడిన మహిళలు, బాలికల రక్షణ, పునరావాసం కోసం అత్యవసరంగా 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.7 కోట్లు) నిధులు సమకూర్చాలని యూఎన్ విమెన్ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.ఇది కూడా చదవండి: నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా..
నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా..
నేపాల్లో సంభవించిన జలప్రళయం ఊహకందని విషాదాన్ని మిగిల్చింది. వరదలు, కొండచరియల ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఎటుచూసినా మృతదేహాల గుట్టలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే 700కు పైగా మృతదేహాలు బయటపడటంతో మార్చురీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతవడంతో రానున్న రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో గుర్తించని మృతదేహాలను భద్రపరచడం, ఖననం చేయడం నేపాల్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.నిండిపోయిన మార్చురీలు.. పెరుగుతున్న మృతదేహాలునేపాల్లో బుధవారం విరుచుకుపడిన వరద బీభత్సానికి ఇప్పటివరకు 734 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మరో 2,498 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సహాయక బృందాలు ఇప్పటివరకు 4,500 మందికి పైగా ప్రజలను రక్షించినప్పటికీ, శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. శవాగారాల్లో స్థలం లేకపోవడంతో గుర్తించని శవాల అంత్యక్రియలను నిర్వహించడం ప్రభుత్వానికి తప్పనిసరిగా మారింది.ప్రధాని కీలక నిర్ణయం: శాస్త్రీయంగా ఖననంపౌరుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమని నేపాల్ ప్రధాని బలేంద్ర షా స్పష్టం చేశారు. గుర్తుతెలియని మృతదేహాలను ఎయిర్టైట్ (గాలి చొరబడని) బ్యాగుల్లో ఉంచి భూమిలో ఖననం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యులు తమవారిని గుర్తించేందుకు వీలుగా ప్రతి మృతదేహం నుంచి డీఎన్ఏ నమూనాలను వైద్యులు ముందుగానే సేకరిస్తున్నారు.శరీర గుర్తులు, లొకేషన్ వివరాల నమోదుడీఎన్ఏ ప్రొఫైలింగ్తో పాటు మృతదేహాలపై ఉన్న ప్రత్యేక గుర్తులు, పుట్టుమచ్చలు, టాటూలు లేదా గాయాలను అధికారులు క్షుణ్ణంగా రికార్డు చేస్తున్నారు. ఆ మృతదేహం ఏ అవయవంపై లభ్యమైందనే వివరాలను కూడా భద్రపరుస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి 100కు పైగా మృతదేహాల డీఎన్ఏ ప్రక్రియను పూర్తి చేసి, ఖననం చేశారు. ఇది భవిష్యత్తులో కుటుంబసభ్యులు వారిని గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.భవిష్యత్తులో వెలికితీసేలా ప్రత్యేక ఏర్పాట్లుఎయిర్టైట్ బ్యాగుల్లో ఉంచిన మృతదేహాలను భూమిలో 1.5 మీటర్ల లోతులో ఖననం చేస్తున్నారు. అవసరమైనప్పుడు వీటిని సులభంగా వెలికితీసేందుకు వీలుగా రెండు మృతదేహాల మధ్య సరిగ్గా 40 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తున్నారు. అంతేకాకుండా, మృతదేహాలను పాతిపెట్టిన ప్రదేశంలో ప్రత్యేక సంఖ్యలతో కూడిన సైన్బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఫోటోలు, వీడియోల రూపంలో డిజిటల్గా భద్రపరుస్తున్నారు.కుళ్లిపోతున్న శవాలు.. వైద్యులకు పెను సవాలువరద బురద, శిథిలాల కింద లభ్యమవుతున్న శవాలు త్వరగా కుళ్లిపోతుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వీటిని భద్రపరిచి డీఎన్ఏ సేకరించేందుకు వైద్యులకు సమయం చాలా తక్కువగా ఉంటోంది. ఇప్పటివరకు 135 మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 233 శవాలు లభించగా, కేవలం ఆరింటిని మాత్రమే కుటుంబ సభ్యులు గుర్తించగలిగారు. శవాలు పాడవకుండా ఉండేందుకు కొన్ని నివాస గృహాలను తాత్కాలిక కోల్డ్ సెంటర్లుగా మార్చారు.మళ్లీ పెరుగుతున్న నదీ ప్రవాహం.. పెను ముప్పురెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతుండగానే భోటేకోశి నదిలో నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయికి పెరిగినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు, చైనా భూభాగంలో ఏర్పడిన తాత్కాలిక సరస్సు మరింత పెద్దదవుతోందని, ఒకవేళ అది గనక తెగితే నేపాల్లో ఇంతకుముందు కంటే భారీ వరద ముప్పు తప్పదని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇది కూడా చదవండి: హిమాలయాల్లో 188 సరస్సుల విస్పోటనం?
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
నేపాల్ను కుదిపేసిన వరద బీభత్సం వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు చైనా ముందస్తు సమాచారం ఇవ్వలేదని నేపాల్ ఆరోపించగా.. చైనా ఆ వాదనను కొట్టిపారేసింది. అయితే ఈ ప్రవాహం వేగం ఊహకందని రీతిలో ఉందని దూసుకొచ్చిందని.. అందుకే ముందస్తు హెచ్చరిక ఇవ్వడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అత్యంత కష్టంగా మారిందని తెలుస్తోంది. అంతేకాదు ఇలాంటి ఓ విపత్తు రావొచ్చని పది రోజుల కిందటే నేపాల్ను చైనా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 26న ఆకస్మిక వరదలు నేపాల్ను అతలాకుతలం చేశాయి. ఈ విలయంలో 800 మంది మృతదేహాలను వెలికి తీయగా.. మరో 2,500 వేల మంది ఆచూకీ గల్లతైంది. అయితే దాదాపు 12 రోజుల ముందే టిబెట్ ప్రాంతంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని చైనా నేపాల్ను హెచ్చరించినట్లు రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాటితో పాటు కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ చైనాకు చెందిన ప్రపంచ వాతావరణ కేంద్రం నేపాల్కు ఓ మెయిల్ పంపింది. అలాగే హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలపై దృష్టిసారించాలని సూచించినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.జస్ట్.. 26 నిమిషాల్లో?ఆగస్టు 26న ఉదయం సుమారు 8.32 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వరద బీభత్సం మొదలైంది. కేవలం 26 నిమిషాల తర్వాత నేపాల్ అధికారులకు సమాచారం అందింది. అయితే వరద ధాటికి పలు పర్యవేక్షణ కేంద్రాలు ధ్వంసం కావడంతో డేటా ప్రసారం నిలిచిపోయింది. స్థానిక అధికారుల నుంచి నిర్ధారణ పొందిన తర్వాత నేపాల్ అధికారులు ఉదయం 9.13 గంటలకు మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు పంపారు. అప్పటికే వరద ట్రిషూలీ నది వెంట దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్తోంది.అయితే నేపాల్ వాదన మరోలా ఉంది. చైనా ఆ హెచ్చరికలను 14-19 తేదీల మధ్యే అని ప్రస్తావించిందని అంటోంది. అలాగే తమకు కేవలం భారీ వర్షాల హెచ్చరికలు మాత్రమే జారీ చేసిందని, దానికి తాము ‘‘కేవలం వర్షపాతం సమాచారం మాత్రమే కాదని, హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలు, కొండచరియల ప్రమాదంపై ముందస్తు సమాచారం’’ కూడా కోరామని అంటోంది. వరద స్పీడు.. మరీ అంతనా?ఇదిలా ఉండగా.. తాజా అంచనాలు ఈ విపత్తు తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి. నీరు, బురద, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినట్లు నేపాల్ హిమాలయ గ్లేసియర్, పర్వత పరిశోధకుడు ధనంజయ్ రెగ్మి తెలిపారు. ఇంతటి వేగంతో వచ్చిన ప్రవాహం మార్గంలో కనిపించిన ప్రతిదానినీ ఊడ్చుకెళ్లింది.పర్వతారోహకుడు సంజిత్ సింగ్ బాల్ అంచనా ప్రకారం.. సుమారు ఒక కిలోమీటరు పరిమాణంలో ఉన్న హిమనదం భాగం దాదాపు 5,000 మీటర్ల ఎత్తు నుంచి విరిగిపడి కిందికి దూసుకొచ్చి ఉండొచ్చు. మార్గమధ్యంలో నీరు, మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను తనతో కలుపుకోవడంతో ప్రవాహం మరింత శక్తిమంతంగా మారింది.అంత పెద్ద.. హిమనదం కూలిందిమొదట మూడు హిమ సరస్సుల్లో ఏదో ఒకటి తెగిపోవడం వల్లే ఈ వరద సంభవించిందని భావించారు. కానీ ఉపగ్రహ చిత్రాల పరిశీలనలో అసలు కారణం మరోటి అని తేలింది. సుమారు 7,000 మీటర్ల ఎత్తున్న లాంగ్టాంగ్ లెరుంగ్ శిఖరంలోని ఉత్తర హిమనదం(గ్లేసియర్)లో దాదాపు రెండు చదరపు కిలోమీటర్ల ప్రాంతం కూలిపోయినట్లు గుర్తించారు. హిమనదం భారీ భాగం లోయలోకి పడటంతో నీరు, మంచు, రాళ్లు, మట్టి కలిసి అత్యంత వేగంతో దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.మూడు సరస్సులు.. మరో ముప్పు?తాజా విపత్తు తర్వాత.. ఆ రీజియన్లో మూడు సరస్సులు సహజంగా ఏర్పడడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. వీటిలో ఏదైనా ఒకదానిపై కొత్తగా కొండచరియలు లేదంటే భారీ రాళ్లు పడితే.. దాని ప్రభావం వరుసగా మిగిలిన సరస్సులపైనా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇటు ప్రస్తుతం చైనా–నేపాల్ సరిహద్దు వద్ద ఏర్పడిన బ్యారియర్ సరస్సులోని నీరు సహజంగా బయటకు వెళ్లి దాదాపు పూర్తిగా ఖాళీ కావడంతో.. ఒక్కసారిగా సరస్సు తెగిపోయి భారీ వరద వచ్చే ముప్పు గణనీయంగా తగ్గింది. అలాగని.. ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అటు చైనా, ఇటు నేపాల్ అధికారులు అంటున్నారు. నేపాల్లోని భోటేకోషి నదిలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నదీ ప్రవాహంలో ఆకస్మిక మార్పులు, కొండచరియలు లేదంటే కొత్తగా ఏర్పడే నీటి నిల్వలపై నిఘా కొనసాగుతోంది. అందుకే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోనే ఉండాలని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తత కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.800 మంది మృతి.. మిస్సింగ్ లెక్క వేరే!ఈ వరదలో నేపాల్, చైనాలో కలిపి దాదాపు 800 మంది మరణించగా.. 2,500-3,000 మందికిపైగా గల్లంతైనట్లు తాజా సమాచారం. వరద ధాటికి భారీ బండరాళ్లు, బురదతో భవనాలు కొట్టుకుపోయాయి. మొత్తంగా 19 వంతెనలు, సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతానికిపైగా ప్రభావితమైనట్లు అంచనా. సరిహద్దు నుంచి సుమారు 168 కిలోమీటర్ల మేర వరద ప్రవహించింది. దాదాపు 5.74 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు ఈ ప్రవాహంలో ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం అంచనా వేసింది.చైనాతో మరింత సమాచార భాగస్వామ్యంనేపాల్ ఆరోపణలు-చైనా కౌంటర్లతో ముందస్తు వార్నింగ్లపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఈ విపత్తు నేపథ్యంలో హిమనదాలు, హిమ సరస్సులు, నదుల ప్రవాహంపై చైనాతో మరింత సమగ్ర సమాచార భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ భావిస్తోంది. ప్రతి 10 నిమిషాలకోసారి వర్షపాతం, నదుల నీటిమట్టం, హిమనదాల కదలికలపై సమాచారం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.ఇదిలా ఉండగా.. వాతావరణ మార్పులతో హిమనదాల కరుగుదల వేగం పెరుగుతున్న నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలో వరదలు, కొండచరియలు, హిమ సరస్సుల ఉప్పెనల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా విపత్తు నుంచి నేపాల్ ఇంకా కోలుకోకముందే మూడు కొత్త సరస్సులు మరో ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతోంది.ఇదీ చదవండి: నేపాల్ వరదలు.. ప్రాణాలు కాపాడిన ఛాయ్!
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే మూడు శక్తులు.. వారి భేటీపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా సోమవారం ప్రారంభమయ్యే షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపైకి రానుండటంతో.. సరిహద్దు ఉద్రిక్తతల నుంచి ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వరకు కీలక అంశాలపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మోదీ-జిన్పింగ్ భేటీపై అందరి చూపూ నిలిచింది.బిష్కెక్ వేదికగా సోమవారం 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు పలువురు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఎస్సీవో ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలు వంటి అంశాలతో పాటు వాణిజ్యం, ఇంధనం, రవాణా అనుసంధానం, డిజిటల్ సహకారంపై నేతలు చర్చించనున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.బిష్కెక్కు చేరుకున్న మోదీఉజ్బెకిస్థాన్లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఆదివారం బిష్కెక్ చేరుకున్నారు. కిర్గిజిస్థాన్ క్యాబినెట్ మంత్రుల మండలి చైర్మన్ అడిల్బెక్ కసిమలియేవ్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శనతో మోదీకి ఘన స్వాగతం లభించింది.కీలక నేతలతో ద్వైపాక్షిక భేటీలుఈ సదస్సు సందర్భంగా మోదీ కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు జపరోవ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు ఇతర ఎస్సీవో దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్.. జిన్పింగ్, పెజెష్కియాన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.
జాతీయం
మాట్లాడింది రాహులా? భాగవతా?
న్యూఢిల్లీ: అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో చేసిన ప్రసంగంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్లో ముస్లింలు ఉండకూడదు అని భావించే వాళ్లు అసలు హిందువులే కాదు అంటూ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై సిబల్ విమర్శలు గుప్పించారు. మోహన్ భాగవత్కు విదేశాల్లో ఉన్నప్పుడే భిన్నత్వంలో ఏకత్వ భావన గుర్తుకొస్తుందా? అని ఎద్దేవా చేశారు. ‘‘భాగవత్ చేసిన ప్రసంగం వింటుంటే అసలు అది రాహుల్ గాంధీ ప్రసంగమా లేదంటే నిజంగానే భాగవత్ మాట్లాడారా? అనే అనుమానమొ చ్చింది. అచ్చం రాహుల్గాం«దీలా మాట్లాడారు’’ అని సిబల్ వ్యంగ్య వ్యాఖ్యచేశారు. ‘‘భాగవత్ భారత్లో ఉన్నప్పుడు హిందువుగా ఉన్నందుకు గర్వించాలని తెగ ప్రసంగిస్తారు. తీరా అమెరికా వంటి విదేశాలకు వెళ్లినప్పుడు హఠాత్తుగా భిన్నత్వంలో ఏకత్వ భావనను గుర్తుకొస్తుంది. విదేశీ గడ్డపై కాలుమోపినప్పుడు మాత్రమే భిన్నత్వంలో ఏకత్వంపై ప్రసంగాలు దంచికొడుతున్నారు. ఇదే ఆయన హిందుత్వ నిజ స్వరూపం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి భిన్నత్వం కోసం పెద్ద పోరాటమే జరుగుతోంది. మీరు ప్రజలను స్వేచ్ఛగా బతకనివ్వరు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులపై ప్రభుత్వం దమనకాండకు పాల్పడితే ఒక్కమాటైనా మాట్లాడారా?’’ అని సిబల్ సూటి ప్రశ్నవేశారు. కాంగ్రెస్, టీఎంసీలు సైతం భాగవత్ వ్యాఖ్యలపై స్పందించాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇలాంటి మాటలను ముందుగా హిందూముస్లిం విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ నేతలకు చెప్పాలని సూచించాయి. భాగవత్ అబద్ధాలు చెప్పడం మానేయాలని, ఆర్ఎస్ఎస్ డీఎన్ఏ నిండా ఉన్నది విద్వేషం, మతవాదమేనంటూ దుమ్మెత్తిపోశాయి.
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి గంగ్వార్ అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్సీ) నిర్వహించిన వెటర్ననీ ఉద్యోగుల నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర గంగ్వార్ను ఆదివారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. సోమవారం ఆయన్ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కోరనున్నారు. ఈ కేసులో సీఐడీ అధికారులు గంగ్వార్ను శుక్ర, శనివారాల్లో విచారణ జరిపారు. అయితే, విచారణకు ఆయన సహకరించడం లేదని కస్టడీలోకి తీసుకున్నారు. 2024–2026 సంవత్సరాల్లో గంగ్వార్ కేపీఎస్సీ పరీక్షల కంట్రోలర్గా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల విభాగం డైరెక్టర్గా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఈడీ గంగ్వార్ నివాసాల్లో తనిఖీలు జరిపింది. ఇటీవల గంగ్వార్ కనిపించకుండా పోయారంటూ వచి్చన వార్తలు సంచలనం రేపాయి. అయితే, గంగ్వార్ తన తండ్రికి సీరియస్గా ఉండటంతో సొంతూరు వెళ్లారంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే వివరణ ఇవ్వడం గమనార్హం.
ఐదు నిమిషాల ప్రార్థనతో.. నొప్పులూ, యాంగ్జైటీ, ఆందోళన దూరం!
కేవలం ఐదు నిమిషాలపాటు ప్రార్థన చేయడం వల్ల నొప్పులూ, ఉద్విగ్నతలూ, ఆందోళన వంటివి చాలావరకు తగ్గే అవకాశముందంటూ అమెరికా పరిశోధకులు నిర్వహించిన ఓ తాజా అధ్యయనం చెబుతోంది. ‘యాన్నల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం ప్రార్థనతో యాంగ్జైటీ, ఆందోళన తగ్గడం వల్ల దానికి అనుగుణంగానే నొప్పులూ చాలావరకు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు. తీవ్రమైన నొప్పి లేదా తీవ్రమైన ఆందోళనతో బాధపడుతున్న 180 మందిని ఈ పరిశోధన కోసం ఎంపిక చేశారు. తొలుత వైద్యులు వారిని పరిశీలించి రెండు టీములుగా విభజించారు. ఒక టీములోని వారికి శిక్షణ పొందిన వాలంటీర్స్ ఆధ్వర్యంలో నొప్పితో బాధపడుతున్న వారిని తాకుతూ వాళ్ల నొప్పి తగ్గడం కోసం ఐదు నిమిషాల పాటు ప్రార్థనలు చేశారు. మరో టీములోని వారికి ఐదు నిమిషాలపాటు లలిత సంగీతాన్ని వినిపించారు. సంగీతం విన్నవారితో పోలిస్తే... ప్రార్థన చేసిన వారి టీములోని సభ్యుల్లో ఎక్కువ మందికి నొప్పి తగ్గినట్లు తేలింది. రెండు వారాల తర్వాత కూడా ఈ తేడా కనిపించింది. అయితే ఆరు వారాల తర్వాత మాత్రం ఈ నొప్పి తగ్గుదల అనేది అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని పరిశోధకులు తెలిపారు. ఇక యాంగ్జైటీ, ఆందోళన విషయంలో మాత్రం ఫలితాలు మరింత కాలం వరకు బాగానే ఉన్నాయి. ప్రార్థన చేయించుకున్నవారిలో... ప్రేయర్ ముగిసిన వెంటనే ఆందోళన చాలావరకు తగ్గింది. ప్రార్థన వల్ల మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుని, అవి ఆరోగ్యానికి కొంత మేలుచేసి ఉండొచ్చని, అయితే ఇది సాధారణ వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని పరిశోధకులు చెబుతున్నారు.
అఖిలేష్ యాదవ్ సీఎం కావాలంటే ఆయన కావాల్సిందే.. AIMIM నేత
లక్నో: ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్కి AIMIM నేత షాదాబ్ చౌహాన్ కీలక సూచన చేశారు. అఖిలేష్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో గెలిచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే తప్పనిసరిగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు తీసుకోవాల్సిందేనన్నారు. అలా లేకపోతే ముఖ్యమంత్రి కావాలని ఆయన కలలు కనలేరని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి పొలిటికల్ పార్టీలు అధికారమే లక్షంగా వ్యుహా ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అమలు చేసిన ‘PDA’ రాజకీయ వ్యూహాం లక్షంగా షాదాబ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. PDA అంటే ‘పిఛ్డే, దళిత్, అల్పసంఖ్యాక్’ — అంటే వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు అని సమాజ్వాదీ పార్టీ వివరిస్తోంది.పీడీఏలోని A పదం అసదుద్దీన్ ఓవైసీనిని సూచించేలా ఉండాలని షాదాబ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. “అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే, ఆయన అసదుద్దీన్ ఒవైసీ మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది అఖిలేష్ యాదవ్ PDAలో ‘A’ అంటే అసదుద్దీన్ ఒవైసీ ఉండే వరకు, ఆయన అధికారంలోకి రావాలని కలలు కూడా కనలేరు” అని అన్నారు.ముస్లింలు తమ ఓట్లు తమ ప్రయోజనాలను ప్రతిబింబించే నాయకుడిని ఎన్నుకునేలా ఉపయోగపడాలని నిర్ణయించుకున్నారని అఖిలేష్ యాదవ్ రాజకీయ వ్యూహం అసదుద్దీన్ ఒవైసీ లేకుండా పూర్తికాదన్నారు. AIMIM ఉత్తరప్రదేశ్లో ఒక ముఖ్యమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా కొనసాగుతోందని, అఖిలేష్ యాదవ్ తన ఎన్నికల అవకాశాలను బలోపేతం చేసుకోవాలంటే ఒవైసీ పార్టీతో సహకారం అవసరమని ఆయన సూచించారు.
ఎన్ఆర్ఐ
అమెరికా నుంచి వచ్చిన యువతి అదృశ్యం
హైదరాబాద్: అమెరికాలో నివాసం ఉంటున్న యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు..పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన బుడిగె శైలజ కుమార్తె బుడిగె విహారిక (27), అల్లుడు హరీష్ లు ఈ ఏడాది జనవరి 26 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. అయితే ఈ నెల 20న విహారిక కనిపించడం లేదంటూ భర్త కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకోగా... విహారిక అమెరికా నుంచి తన పాస్పోర్ట్తో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమె హైదరాబాద్కు వస్తుందని భావించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లగా ఆమె అక్కడికి చేరుకోలేదు. అయితే ఆగస్టు 21న విహారిక ముంబై విమానాశ్రయంలో ఉన్నట్లు సమాచారం అందింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ కలవకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. మేడిపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.
ప్రేయసి దూరమైందని అమెరికాలో ఆత్మహత్య..!
హైదరాబాద్: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్(29) 2024లో మాస్టర్స్ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్తో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకున్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇదిఆ ఉండగా ప్రదీప్కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్ తల్లిదండ్రులను కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిగౌడ్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాదీ యువకుడి ఆత్మహత్య
కోటి కలలతో రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయిన ఒక యువకుడి జీవితం విషాదంతమైంది. ఉన్నత చదువులు చదివినా కూడా ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాద్కు చెందిన సాయిప్రదీప్ ఆత్మహత్య చేసుకున్న దిగ్బ్రాంతి రేపింది. హైదరాబాద్లోని దమ్మాయిగూడలోని శ్రీనివాసనగర్ కాలనీ చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం, సాయి ప్రదీప్ 2024లో అమెరికాకు వెళ్లారు. ఇటీవల 'యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ శాన్ ఆంటోనియో'లో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అతనికి సప్లై చైన్ అనలిస్ట్గా 5 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఫలితం దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనాడు. దీంతో ఈ డిప్రెషన్తో ఆగస్టు 21న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని మృతదేహాన్ని భారతదేశానికి రప్పించడానికి మరియు అంత్యక్రియల ఖర్చులను భరించడానికి అతని కుటుంబం నిధుల సేకరణను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా అమెరికా కఠినమైన వలస విధానాలలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం, ఎన్నారైలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భవిష్యత్ అనిశ్చితి కెరీర్ కలలు, ఆర్థిక ఒత్తిడి వేలాది మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు
వేటూరి గీతాల వెల్లువ.. డాలస్లో సాహితీ మహోత్సవం!
డాలస్, టెక్సస్: ‘వేటూరి సాహిత్యాభిమానసమితి ఆఫ్ అమెరికా’, ‘శుభం ఫౌండేషన్’ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రిస్కో మెమోరియల్ హైస్కూల్ ఆడిటోరియంలో ‘కవికులాలంకార’ వేటూరి సుందర రామమూర్తి విరచిత 8 సినీ, సినీయేతర గీత సంపుటాల ఆవిష్కరణ, వేటూరి ప్రత్యేక పాటల నృత్యం, సంగీత విభావరి 500 మందికి పైగా హాజరైన సంగీతం, సాహిత్యాభిమానుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగువేదకవి, ప్రముఖ సినీగీత రచయిత, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సాహిత్య సంపుటాలను ఆవిష్కరించి, తొలి గ్రంథాన్ని విశిష్ట అతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకుడు ఎం. నాగేశ్వరరావుకు, ఆ తర్వాత ప్రత్యేక అతిథులుగా హాజరైన వామరాజు సత్యమూర్తికి, డా. కొమాండూరి రామాచారికి అందజేశారు.వేటూరి సాహిత్యాభిమానసమితి ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గోపాల్ పోణంగి ఆధ్వర్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో ఈ సాహిత్య సంపుటాలను ప్రచురించడానికి సహాయ సహకారాలు అందించిన వారిలో హాజరైన డా. బుచ్చిబాబు పైడిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, చంద్రశేఖర్ రెంటచింతల, గోకుల్ కిలారు, ప్రొఫెసర్ జగదీశ్వరన్ పుడూర్, మురళి వెన్నం, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, రామకృష్ణ పొక్కునూరి, రావు కల్వల, డా. సుబ్రహ్మణ్యం బోయారెడ్డి, విజయసారధి జీడిగుంట, వినోద్ ఉప్పులను ఘనంగా సత్కరించారు.వేటూరితో సుదీర్ఘకాలం సాహిత్య ప్రయాణం చేసిన ప్రముఖ సినీగీత రచయిత, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో డా. ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో పాత్రికేయుడిగా ఉన్న వేటూరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఒత్తిడిమేరకు అయిష్టంగా రచయితగా సినీరంగ ప్రవేశం చేయడం, ఆ తర్వాత సినీ పరిశ్రమలో ఒక ముఖ్యభాగం అవడం, కవిపండితుడిగా వేటూరి కవితావైభవం, ఆయన కలం నుంచి అప్రయత్నంగా వేగంగా వెలువడే గీతాల వెల్లువ, ఆయన వ్యక్తిత్వం, అందరినీ గౌరవించే తత్వం ఆయనకున్న తెలుగు భాషాభిమానం గురించి మాట్లాడారు. అలాగే, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా ఆయన రచనాశైలి, కేవలం వేలకొద్దీ సినిమా గీతాలేగాక ఎన్నో విలువైన వ్యాసాలు, ‘జీవనరాగం’, ‘రాబిన్ హుడ్’, ‘సిరికాకొలను చిన్నది’, ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ లాంటి విశిష్ట రచనలు, వేటూరి జీవితంలో జరిగిన కొన్ని హాస్య సంఘటనలు ఇంకా వివిధ అంశాలపై వీరి మధ్య దాదాపు గంటసేపు సాగిన చర్చా కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పూయించి మంచి ప్రేక్షకాదరణ పొందింది.ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ “వేటూరి రాసిన పాటలలో గొప్ప పాటలు ఏవి? అని చాట్ జీపీటీని అడిగితే - ఆయన రాసిన వేలాది పాటలలో కొన్ని గొప్ప పాటలను ఎంపిక చేయడం కష్టం అనే సమాధానం వచ్చింది. దాన్నిబట్టి వేటూరి ప్రతిభ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు” అన్నారు. 18 సంవత్సరాల పాటు పాత్రికేయుడిగా పనిచేసిన వేటూరిని ఈనాడు జర్నలిజం స్కూల్కు ఆహ్వానించి అక్కడి విద్యార్థులతో మాట్లాడించే అవకాశం కలిగిందని, ఆయన జ్ఞాపకశక్తి అమోఘమని, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్ వేటూరి అని, ప్రేమ, విరహం, భక్తి, తాత్వికత, శృంగారం, వేదన, ప్రకృతి, సామాజిక చైతన్యం ఇలా ఏ రకపు పాటనైనా అక్షరాలలో ఆవిష్కరించగల దిట్ట అని, “రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే” అనే పాటకు జాతీయ పురస్కారం అందుకున్న వేటూరి సాహిత్యం జ్ఞానపీఠ పురస్కారానికి నూటికి నూరు శాతం అర్హనీయమైనదన్నారు. వేటూరి పాటలు తెలుగుభాష ఉన్నంతవరకు చిరస్థాయిగా ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి అంటూ ఘన నివాళులర్పించారు.ప్రత్యేక అతిథిగా హాజరైన వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ “డా. ప్రసాద్ తోటకూర నిర్వహణలో గత జనవరిలో హైదరాబాద్లో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా కన్నుల పండుగగా జరిగిన ఈ గ్రంథాల ఆవిష్కరణ సభలోనూ, మరలా ఇప్పుడు ఇక్కడ డాలస్లో అత్యంత వైభవంగా జరిగిన సభలోనూ పాల్గొనడం తన అదృష్టం” అన్నారు.ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ సంగీతగురు డా. కొమండూరి రామాచారి వేటూరితో తనకున్న అనుబంధాన్ని, ఆయన గీత రచనా శైలిని ప్రశంసిస్తూ, కొన్ని పల్లవులను మధురంగా గానం చేసి వేటూరికి స్వరనీరాజనాలర్పించారు.ప్రముఖ గాయకుడు, సంగీతదర్శకుడు రాజశేఖర్ సూరిభొట్ల నిర్వహణలో సాగిన సంగీత విభావరిలో స్థానిక గాయనీ గాయకులు సంతోష్ ఖమ్మంఖర్, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, జానకి శంకర్, శ్రేయస్ సూరిభొట్ల, సాహితి కోటంరాజు పాడిన పాటలు అందరినీ అలరించాయి. రాజశేఖర్ కీబోర్డ్పై, ముద్దు పాయ్ కీబోర్డు, గిటార్పై, రాం యామిజాల, నీవ్ యామిజాల పెర్కషన్ వాయిద్యాలపై, సౌండ్ ఇంజనీర్గా రవి మాచ, రవి రావు భట్టిప్రోలు అందించిన సాంకేతిక సహకారం ఈ సంగీత విభావరికి మరింత శోభను చేకూర్చాయి.వేటూరి రాసిన అసంఖ్యాక అద్భుత గీతాలలో ఒక పద్నాలుగు పాటలను ఈ సంగీత విభావరిలో గానం చేశారు. వాటిలో “ఓం నమః శివాయ” (సాగర సంగమం) అనే గీతానికి గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ గురు మంజు హేమమాలిని చావ శిష్యులు దేవినేని వైడూర్య, సాహితి వేముల, సింధు వేముల, తేజశ్రీ అబ్బూరు అద్భుతంగా నృత్యం చేశారు.“జగతి సిగలో జాబిలమ్మకు” (పరదేశి) గీతానికి రాగ మయూరి స్కూల్ ఆఫ్ డాన్స్ అండ్ యోగా గురు సింధుజ ఘట్టమనేని శిష్యులు గ్రీష్మా అశోక్, నందిత దినేష్, సహస్ర తటవర్తి, రుషిక కాళ్ల చేసిన నృత్యం కనువిందు చేసింది.“నెమలికి నేర్పిన నడకలివి” (సప్తపది) అనే పాటకు నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీలత సూరి శిష్యులు ప్రియాంక పొత్తూరి, శ్రుతి పొత్తూరి, స్వప్నిక వడాలి, అంజిత నాయర్ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.ఆ తర్వాత “మధుర మధురతర” (అర్జున్) అనే గీతానికి సాయి నృత్య అకాడమీ కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీదేవి యడ్లపాటి శిష్యులు పల్లవి తూములూరు, సంజన కల్వకొలను నృత్యం అందరినీ అలరించింది.ఈ కార్యక్రమంలో ప్రత్యేకఅతిథులుగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ మాట్ షాహీన్, ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్, కౌన్సిల్ మెంబర్ యాన్ యాన్దర్సన్ను గోపాల్ పోణంగి, డా. ప్రసాద్ తోటకూర ఘనంగా సన్మానించారు. ఇదే కార్యక్రమంలో ఇటీవల కొలంబియా దేశంలో 8 సంవత్సరాల వయస్సులోపు పిల్లల కోసం జరిగిన చదరంగం పోటీలలో అమెరికా నుంచి పాల్గొని, పాన్ అమెరికన్ చాంపియన్గా నిలిచి బంగారు పతకం సాధించిన సరయు తలపనేనిని టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ మాట్ షాహీన్ ఘనంగా సత్కరించి సరయు తల్లిదండ్రులు సందీప్, శ్రీలక్ష్మిని అభినందించారు.ఈ కార్యక్రమాన్ని మొత్తం ఎంసీలుగా అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించిన అనీషా పోణంగి, అభినుత మద్దుకూరికి, కార్యక్రమ విజయానికి తోడ్పడిన శుభం ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలు కిశోర్ నారె, పావని నున్న, నాగరాజు నలజల, నేలకొండ రాజు, పద్మ ముప్పిడి, శాస్త్రి అనిపిండి, వివిధ ప్రసార మాధ్యమాలకు, స్కూల్ యాజమాన్యానికి గోపాల్ పోణంగి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
కువైట్ నుంచి సుపారీ.. లైవ్ వీడియో మర్డర్!
రాయచోటి టౌన్/వీరబల్లె: వివాహేతర సంబంధం అనుమానంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం అన్నమయ్య జిల్లా వీరబల్లె మండలం ఓదివీడులో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కడపకు చెందిన బాషాకు, ఓదివీడుకి చెందిన బేల్దారి ఖాదర్ బాషా కుమార్తె షాహీదాతో 2010లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. షాహీదా ఏడేళ్ల క్రితం కువైట్ నుంచి స్వదేశానికి వచ్చి, పుట్టిన ఊరు ఓదివీడులోనే ఇల్లు నిర్మించుకుని ఉంటోంది. ఆమె భర్త బాషా కువైట్ నుంచి కుటుంబానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చేవాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భర్త బాషా పిన్నమ్మ కుమారుడైన ఖాసీం (ఇతడు కూడా కువైట్లో ఉంటూ అప్పుడప్పుడూ ఓదివీడుకు వచ్చిపోయేవాడు) తరచూ ఓదివీడులోని షాహీదా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. దీనిపై భర్త బాషాకు తీవ్ర అనుమానం వచ్చి పగ పెంచుకున్నాడు. కువైట్ నుంచి సుపారీ.. లైవ్ వీడియోలు తీసి కిరాతకం పది రోజుల క్రితమే ఖాసీం కువైట్ నుంచి ఇంటికి వచ్చిన విషయం బాషాకు తెలిసింది. దీంతో ఆయన తన మరో పిన్నమ్మ కుమారులు అయిన బాబ్జి, ఖాదర్వలిని పురమాయించాడు. ఖాసీంను వెంటాడి చంపాలని, ఆ సమయంలో తనకు వీడియోలు తీసి పంపాలని వారికి సూచించాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం బాబ్జి, ఖాదర్వలి ఓదివీడుకు చేరుకున్నారు. అప్పటికే ఇంట్లో ఖాసీం, షాహీదాతోపాటు ఆమె కుమార్తె ఉన్నారు. నిందితులిద్దరూ లోపలికి వెళ్లి గడియలు పెట్టారు. తమతో తీసుకొచ్చిన కర్ర, బెల్ట్తో ఖాసీం, షాహీదాలను తీవ్రంగా కొట్టారు. షాహీదా కుమార్తెతో బలవంతంగా వీడియోలు తీయించి కువైట్లోని బాషాకు పంపారు. ఈ ఘటన దాదాపు రెండు గంటలపాటు సాగింది. లోపల జరుగుతున్న అరాచకాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. అయితే పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి రాలేదు. చివరికి ఖాసీం చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు.. గదుల్లో ఉన్న రక్తపు మరకల్ని నీళ్లతో పూర్తిగా కడిగేసి సాక్ష్యాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. నిందితులు తలుపులు తీయగానే స్థానికులు బాబ్జీని పట్టుకుని, ఘటనా స్థలానికి చేరుకున్న వీరబల్లె ఎస్ఐ సుస్మితారెడ్డికి అప్పగించారు. అనంతరం పోలీసులు ఇల్లు, లోపలి ప్రాంతాలను తనిఖీ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఖాసీం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పూజలు చేసి.. డబ్బులు రెట్టింపు చేస్తానని..
బేస్తవారిపేట: తాను పూజలు చేసి డబ్బును రెట్టింపు చేస్తానని నమ్మించి రూ.25లక్షలు తీసుకుని ఓ మహిళను మరో మహిళ దారుణంగా హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టింది. ఈ ఘటన మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం వీరభద్రాపురంలో జరిగింది. కంభం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.మల్లికార్జున శనివారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... వీరభద్రాపురానికి చెందిన గుమ్మా రాజమ్మ తాను డబ్బులు పెట్టి పూజలు చేస్తే రెట్టింపు అవుతాయని పెద్దారవీడు మండలం ప్రగళ్లపాడుకు చెందిన ముడమంచు ఆదిలక్ష్మి(33)ని నమ్మించింది.రాజమ్మకు ఆదిలక్ష్మి రూ.25లక్షలు ఇచ్చి పూజలు చేసి డబ్బులు రెట్టింపు చేయాలని కోరింది. అయితే, జూన్ 21 నుంచి ఆదిలక్ష్మి కనిపించకపోవడంతో ఆమె భర్త బాలగురవయ్య పెద్దారవీడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో గుమ్మా రాజమ్మను అనుమానితురాలిగా పోలీసులు గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని గుమ్మా రాజమ్మ తన భర్త బుజ్జి గురవయ్యతో కలసి ఆదిలక్ష్మిని హత్య చేసి వీరభద్రాపురంలోని తమ పంటపొలంలో పూడ్చిపెట్టారని నిర్ధారించారు. ఆమె సెల్ఫోన్ను సమీపంలోని చెక్డ్యామ్లో పడేశారని గుర్తించారు.ఆదిలక్ష్మి మృతదేహాన్ని శనివారం పోలీసులు బయటకు తీసి తహశీల్దార్, జిల్లా ఫోరెన్సిక్ అధికారుల సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. నిందితులు రాజమ్మ, బుజ్జి గురవయ్యను సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు. నారాయణరెడ్డిపల్లెకు చెందిన రవిని కూడా రాజమ్మ ఇదే తరహాలో నమ్మించి రూ.45లక్షలు తీసుకున్నారని చెప్పారు. దానిలో రూ.16లక్షల మేర ఆదిలక్ష్మికి ఇచ్చారని పేర్కొన్నారు.
కాపురానికి రాలేదని భార్య దారుణ హత్య
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె మండలం కోళ్లబైలు–1 బయ్యారెడ్డి కాలనీలో శనివారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నేర చరిత్ర ఉండి, పదేళ్ల జైలుశిక్ష తర్వాత ఇటీవలే విడుదలైన తంబళ్లపల్లె మండలం దిగువపల్లికి చెందిన కె.మధుకర్రెడ్డి, తనతో కాపురానికి రావడానికి నిరాకరించిందన్న కసితో భార్య దండామణి(38)ని మచ్చు కత్తితో కిరాతకంగా నరికి చంపేశాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 19 ఏళ్ల కిందట స్వగ్రామంలో బాంబు దాడి కేసుతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన మధుకర్రెడ్డిపై బెంగళూరులో ఏటీఎం చోరీ, పీలేరు, ధర్మవరంలో హత్యాయత్నం కేసులున్నాయి. జైలు నుంచి వచ్చాక కాపురానికి రావాలని భార్యను వేధిస్తూ.. ఇటీవల బావమరిదిపై దాడి చేశాడు. కాగా, శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అనంతరం బావమరిదికి ఫోన్ చేసి.. ‘ఇంకా ఇద్దరున్నారు.. వారిని కూడా చంపి నేనూ చచ్చిపోతా’ అంటూ హెచ్చరించాడు. బాధితుడు ఈ ఆడియో రికార్డింగ్ను డీఎస్పీ బుచ్చిరాజుకు వినిపించడంతో ఆయన పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
'నా భర్తని చంపేస్తానని బెదిరించి నాపై లైంగిక దాడి'
తూర్పు గోదావరి జిల్లా: నర్సరీలో తన భర్తతో పనిచేసే సురేంద్ర అలియాస్ చిన్న తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బుర్రిలంకకు చెందిన 19 ఏళ్ల మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో కలిసి బుర్రిలంక నర్సరీకి ఈ ఏడాది జూలైలో పని కోసం వచ్చారు. అప్పటి నుంచి నర్సరీలో పనిచేస్తూ కార్యాలయ భవనం పక్కన నివసిస్తున్నారు.ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ ఉదయం సుమారు 6:45 గంటలకు, ఆమె భర్త యథావిధిగా పనికి వెళ్లాడు. అనంతరం 7 గంటలకు అదే నర్సరీలో పనిచేస్తున్న సురేంద్ర అలియాస్ చిన్న ఆమె ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తన భర్తకు చెపుతానని హెచ్చరించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం 8.50 నిమిషాలకు మళ్లీ వచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెప్తే భార్యాభర్తలిద్దరినీ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తన భర్తకు ఆమె విషయాన్ని వివరించింది. దీంతో అతడు నర్సరీ యజమానికి ఆ విషయం చెప్పగా ఆయన సూచన మేరకు బాధితురాలు ఆమె బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా!
వీడియోలు
నన్ను కొట్టి ఫోన్ లాక్కొని.. బీజేపీ రవిప్రకాష్ కిడ్నాప్ పై భార్య సంచలన కామెంట్స్
టన్నెళ్లలో కుళ్లిన మృతదేహాలు.. నేపాల్ వరదల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజాలు..
డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్
శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్
ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు..
విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై బొత్స రియాక్షన్
రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?
రిలీజ్ తర్వాత ముస్తఫా ఫస్ట్ రియాక్షన్
నీకు చేతకాకపోతే చెప్పు.. చంద్రబాబుకు బొప్పరాజు సవాల్
ABN రాధాకృష్ణని ఒక్కటే అడుగుతున్నా జోగి రమేష్ ఫైర్

