వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
సాక్షి, శ్రీ సత్యసాయి: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం హిందూపురం నంది సర్కిల్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆమె జెండా ఎగురవేశారు. అయితే వసుంధరకు ప్రొటోకాల్ మర్యాదలు కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యం, శస్త్రచికిత్స కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని వసుంధర తెలిపారు. ఆయన తరఫునే తాను కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. అయితే ఎలాంటి అధికారిక పదవి లేని వ్యక్తికి అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్ కల్పించడం, అధికారులు–పోలీసులు గౌరవాలు ఇవ్వడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.పదవి లేకుండానే ప్రొటోకాల్ ఎందుకు? అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అధికారిక కార్యక్రమాల నిర్వహణలో నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం హిందూపురం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
48 గంటల మిస్టరీకి తెర.. బీజేపీ నేత దారుణ హత్యతో ఉద్రిక్తత
గుహవటి: అసోంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు 48 గంటలుగా కనిపించకుండా పోయిన 52 ఏళ్ల బీజేపీ బూత్ అధ్యక్షుడు బికాష్ రంజన్ ధర్ చివరకు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అసోంలోని శ్రీభూమి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ బూత్ అధ్యక్షుడు బికాష్ రంజన్ ధర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. చాగల్మోవా గ్రామానికి చెందిన ధర్ ఆగస్టు 12న తన మోటార్సైకిల్పై ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆయన కాల్ రికార్డులను పరిశీలిస్తూ నిందితుల వరకు చేరుకున్నారు.శుక్రవారం ఉదయం అసోం-త్రిపుర సరిహద్దుకు సమీపంలోని జోగిచ్ఛరా ప్రాంతంలో ఓ చెరువు వద్ద ధర్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు ఈ హత్యలో నేరుగా పాల్గొన్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ప్రకారం, విచారణలో ఒక నిందితుడు ధర్ను మాచెటీతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యకు రాజకీయ కారణం ఉందా, లేక వ్యక్తిగత కక్షే కారణమా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం వ్యక్తిగత వైరం కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం..దర్యాప్తు సమయంలో మరో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. నిందితుల్లో ఒకరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పాటు ఓ కానిస్టేబుల్పై పదునైన వస్తువుతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా, నిందితుడి ఎడమ కాలికి బుల్లెట్ గాయం అయింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఆందోళనలు, ఉద్రికత్త..ధర్ మృతదేహం లభ్యమైన వార్తతో చాగల్మోవా, బజారిచెర్రా, పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలుచోట్ల విధ్వంసం, నిప్పంటించే ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని దుకాణాలకు కూడా నిప్పంటించినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా జిల్లా యంత్రాంగం BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో అసలు హత్యకు కారణం ఏమిటి? ఆరుగురు నిందితుల పాత్ర ఎంతవరకు ఉంది? రాజకీయ కోణం ఏమైనా ఉందా? అన్న ప్రశ్నలకు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమైన సమాధానం లభించనుంది.
అగార్కర్ పదవి ఉంటుందా? ఊడుతుందా? డెడ్లైన్ అప్పుడే!
శ్రీలంకతో టెస్టు సిరీస్ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్తో అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలోనే అతడిని కొనసాగించాలా లేక వేరేవారికి అవకాశమివ్వాలా అనే దానిపై బీసీసీఐ ఒక నిర్ణయానికి రానుంది. అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకు అగార్కర్ను కొనసాగించాలనే అంశం కూడా బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 2023లో అగార్కర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అతడిని వివాదంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తొలగించడంలో అగార్కర్ తెర వెనుక ప్రధాన పాత్ర పోషించాడనే వార్త అప్పట్లో బాగా వైరలయ్యింది. అంతేకాదు ఇంగ్లండ్తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవీకాలం పొడిగింపు సందర్భాలు చాలా తక్కువ. గతంలో శివసుందర్ దాస్, ఎస్. శరత్, సుబ్రోతో బెనర్జీ, అజయ్ రాత్రా సహా మిగిలినవాళ్లంతా తన పదవీ కాలం ముగియగానే బయటికి వెళ్లిపోయారు. కానీ అగర్కార్ సెలెక్టర్గా వచ్చిన తర్వాత అతడు మంచి ఫలితాలు సాధించాడు. అతడి సెలెక్షన్ పర్యవేక్షణలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ చేరడంతో పాటు వాటిలో మూడు టైటిల్స్ను అందుకుంది. జట్టులో మార్పులు కూడా ఫలితాలు ఇవ్వడంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అగార్కర్కు మద్దతు ఇచ్చింది. మధ్యలో రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐతో అభిప్రాయబేధాలు వచ్చినప్పటికీ, ఇవేవీ పట్టించుకోకుండా అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించే యోచనలో ఉంది. అంతకముందు 2022 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్గా ఉన్న చేతన్ శర్మపై విమర్శలు వచ్చాయి. ఇక 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ భారత్ ఫైనల్ చేరడంలో విఫలం కావడంతో అప్పటి సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్పై అటు బీసీసీఐ, ఇటు అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి అగార్కర్పై విశ్వాసముంచి బీసీసీఐ అతడి పదవిని పొడిగిస్తుందా? తొలగిస్తుందా అనేది వచ్చే నెలతో తేలిపోనుంది.Read: సైక్లింగ్లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త!
ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో వీడని మిస్టరీ..!
నల్లగొండ: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్యకు సంబంధించి మృతురాలి ఇంటి పక్కన గత కొన్నిరోజులుగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను కూడా విచారిస్తున్న ట్లు సమాచారం. కాగా శుక్రవారం రూపారెడ్డి అంత్యక్రియలను హైదరాబాద్లోని గుర్రంగూడలో ఆమె స్వగృహం సమీపంలోని సాహెబ్నగర్ హిందూ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు పూర్తిచేశారు. పలు కోణాల్లో దర్యాప్తు..రూపారెడ్డి హత్య వెలుగులోకి వచ్చిన బుధవారం నుంచి ఇప్పటి వరకు పోలీసులు మృతురాలి బంధువులతో కలుపుకొని 50 మందిని విచారించినట్లు సమాచారం. పోలీసులకు లభించిన సీసీ పుటేజీ ద్వారా సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సున్న ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన వ్యక్తి గురించి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా మృతురాలి కాల్ డేటాతో పాటు ఆమె భర్త రాజేంందర్రెడ్డి కాల్ డేటాను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.
రెనాల్ట్ కార్ల డీలర్ మోసం.. ఎస్బీఐకి రూ.3.23 కోట్ల నష్టం
మెగాస్టార్తో బుచ్చిబాబు మూవీ.. వర్కవుట్ అయ్యేనా?
మార్కెట్లోకి మహీంద్రా కొత్త ట్రక్కు
ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు పాక్కు భారీ షాక్
శోభా రెడ్డి – ప్రసాద్ రెడ్డి దంపతుల నిస్వార్థ సేవా..
సీఎం విజయ్ స్పీచ్.. జెన్జీ, కులం, మతంపై కీలక వ్యాఖ్యలు..
చాక్లెట్లు, బిస్కెట్ల ఎర.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు!
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
అటు షెల్టన్ ఇటు స్వియాటెక్
‘ముంబైలో కంటే గోవాలోనే ప్రశాంతత దొరుకుతుంది’
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
అబ్బే! ఆయన అడిగేది క్రికెట్ స్కోరు కాద్సార్.. మన రోజువారీ అప్పు
చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు - టీడీపీ నేత జేసీ
ఫోన్కు బానిసై, ఆస్పత్రిలో చేరిన షకీలా.. నరకయాతన!
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్!
విమానం కాదు! మన సారే సీక్రెట్గా వెళ్తున్నారు!
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్
'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్పై ఫైర్
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
విశ్వనాథ్ అండ్ సన్స్.. ఎవరికెంత రెమ్యునరేషన్?
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
బీజేపీకి వార్నింగ్ బెల్స్.. సీఎం కుర్చీకే ముప్పు?
ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!
రెనాల్ట్ కార్ల డీలర్ మోసం.. ఎస్బీఐకి రూ.3.23 కోట్ల నష్టం
మెగాస్టార్తో బుచ్చిబాబు మూవీ.. వర్కవుట్ అయ్యేనా?
మార్కెట్లోకి మహీంద్రా కొత్త ట్రక్కు
ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు పాక్కు భారీ షాక్
శోభా రెడ్డి – ప్రసాద్ రెడ్డి దంపతుల నిస్వార్థ సేవా..
సీఎం విజయ్ స్పీచ్.. జెన్జీ, కులం, మతంపై కీలక వ్యాఖ్యలు..
చాక్లెట్లు, బిస్కెట్ల ఎర.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు!
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
అటు షెల్టన్ ఇటు స్వియాటెక్
‘ముంబైలో కంటే గోవాలోనే ప్రశాంతత దొరుకుతుంది’
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
అబ్బే! ఆయన అడిగేది క్రికెట్ స్కోరు కాద్సార్.. మన రోజువారీ అప్పు
చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు - టీడీపీ నేత జేసీ
ఫోన్కు బానిసై, ఆస్పత్రిలో చేరిన షకీలా.. నరకయాతన!
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్!
విమానం కాదు! మన సారే సీక్రెట్గా వెళ్తున్నారు!
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్
'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్పై ఫైర్
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
విశ్వనాథ్ అండ్ సన్స్.. ఎవరికెంత రెమ్యునరేషన్?
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
బీజేపీకి వార్నింగ్ బెల్స్.. సీఎం కుర్చీకే ముప్పు?
ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!
ఫొటోలు
బాక్ల్ డ్రెస్లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
విలన్ నుంచి రియల్ స్టార్గా.. శ్రీహరి అరుదైన (ఫోటోలు)
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం రద్దీ (ఫొటోలు)
'సురక్ష కా తిరంగా' అవగాహన కార్యక్రమంలో హీరో నాగార్జున (ఫొటోలు)
జెన్జీతో మోదీ కనెక్ట్.. వందేమాతరం హైలైట్.. ఎర్రకోటపై కొత్త సందేశం (చిత్రాలు)
అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
వెకేషన్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)
'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)
మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)
హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)
సినిమా
‘రాముడి పాత్రలో సుశాంత్ను చూడాలని ఉండేది’
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి ఆరేళ్లు గడుస్తున్నా.. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాముడి పాత్రను పోషించడానికి సుశాంత్ కంటే సరైన వ్యక్తి మరొకరు లేరని ఆమె అభిప్రాయపడ్డారు.ఓ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్వేత మాట్లాడుతూ.. 'రాముడి విలువలను సుశాంత్ ఎంతో అందంగా ప్రతిబింబించాడు. అతడి కళ్లలోని నిర్మలత్వం, చిరునవ్వు, వ్యక్తిత్వం రాముడిని గుర్తు చేసేవి. అందుకే చాలామంది అతడిని రాముడితో పోల్చేవారు' అని చెప్పారు.సుశాంత్ గురించి తలచుకుంటే ఇప్పటికీ అతడు మన మధ్యే ఉండాలని అనిపిస్తుందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'అన్నయ్యకు పేరు, ప్రతిష్ఠపై ఎప్పుడూ ఆసక్తి ఉండేది కాదు. సమాజానికి మంచి సందేశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన సినిమాలు చేసేవారు. కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ప్రేమగా, రక్షణగా ఉండేవారు' అని తెలిపారు.ఇటీవల శ్వేత సుశాంత్ను రాముడి రూపంలో చూపిస్తూ కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాముడు అంటే కేవలం ఒక పాత్ర కాదని, మర్యాద, కరుణ, ధైర్యం, నిజాయితీ వంటి విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. అలాంటి విలువలు సుశాంత్ వ్యక్తిత్వంలో కనిపించేవని ఆమె వివరించారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020 జూన్ 14న ముంబైలోని తన నివాసంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంపై ఇప్పటికీ అనేక చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. View this post on Instagram A post shared by Supertalks (@supertalks.co)
ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష.. వీడియో వైరల్
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హీరోయిన్ త్రిష పేరు నెట్టింట తరచూ వైరల్గా మారుతోంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష పాల్గొనడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం విజయ్ తల్లిదండ్రులతో కలిసి ఆమె మొదటి వరుసలో కూర్చుని కార్యక్రమాలను వీక్షించారు. వేడుకలకు హాజరైన అధికారులను చిరునవ్వుతో పలకరిస్తూ.. వారికి అభివాదం చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లోకి త్రిష వస్తారంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇటీవల త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ కొన్ని పోస్టర్లు కూడా వెలిశాయి. మరోవైపు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. అలాగే త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి.ఉదయకుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ మదురై వ్యాప్తంగా త్రిష వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు, అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా త్రిష స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వీడియో వైరల్ కావడంతో.. ఆమె రాజకీయ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది.అయితే త్రిష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై ఆమె నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆమె తాజా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం అభిమానుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. Actor Trisha joins Independence Day function in Chennai. sits with Tamil Nadu CM Vijay's parents https://t.co/hHnqpS0xgx pic.twitter.com/czmejTY5W3— Vignesh Theni (@Vignesh_twitz) August 15, 2026#WATCH | சுதந்திர விழா அணிவகுப்பின்போது சல்யூட் அடித்த முதலமைச்சர் விஜய்க்கு சல்யூட் அடித்த த்ரிஷா!#SunNews | #Trisha | #Vijay | #IndependenceDay pic.twitter.com/YRCmkpBl3E— Sun News (@sunnewstamil) August 15, 2026Actress Trisha, who joyfully recorded a video on her phone as soon as Chief Minister Vijay arrived inside the fort premises where the national flag was hoisted..! pic.twitter.com/5F5oTOap1i— Global Box Office (@IndianBOReport) August 15, 2026
వెండితెరపై మరో నట వారసుడు.. హీరోగా గ్రాండ్ ఎంట్రీ!
నడిగర్ తిలకం అని కొనియాడబడిన నటుడు శివాజీ గణేషన్. ఆయన నట వారసుడిగా ప్రభు తొలుత సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం ప్రభు వారసుడిగా విక్రమ్ ప్రభు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా శివాజీ గణేషన్ కుటుంబం నుంచి మరో వర్ధమాన నటుడు తెరంగేట్రం చేశారు. శివాజీ గణేషన్ మనవడు అయిన దర్శన్ గణేశన్ తొలిసారిగా లెనిన్ పాండియన్ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నటుడు దర్శన్ గణేశన్ పేర్కొంటూ ‘‘లెనిన్ పాండియన్ చిత్రంలో నేను పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తున్నాను. ఇది నాకు చాలా ముఖ్యమైన చిత్రం. ఈ చిత్రం ద్వారా నేనేమిటో నిరూపించుకోవాలి. అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నాను. మహా నటుడు శివాజీ గణేషన్ మనవడు అనే బ్రాండ్ ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నేనెప్పుడూ మరచిపోను. అయితే ఆ గుర్తింపు తోనే ఉండదలచుకోలేదు. మా తాత పేరును మోయడం కంటే ఆయన గౌరవాన్ని కాపాడే విధంగా నా కంటూ సొంత పేరును సంపాదించుకోవాలి. ఐదే నా లక్ష్యం. తాత మొదట్లో రంగస్థలంపై రాణించారు.ఆయన వీధి భాగవతుల కళలో శిక్షణ పొందారు.అదే విధంగా నేను ఆ కళలో శిక్షణ పొందాను. ఇకపోతే లెనిన్ పాండియన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. నేను నగరంలో పుట్టి పెరిగాను. దీంతో గ్రామీణ ప్రాంత యువకుడిగా నటించడం ఒక చాలెంజే. అందువల్ల ఇది మానామదురై లో సాగే కథ కావడంతో నేను ఆ గ్రామానికి వెళ్లి ఒక నెల రోజుల పాటు ఉండి ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని, వారి ప్రవర్తనను తెలుసుకున్నాను. అక్కడ వ్యవసాయదారులతో గడిపాను. వారి గురించి చాలా చదివాను.అదే విధంగా ఒక పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ రెండు రోజులు ఉన్నాను. నేను చేసే పనిలో నూరు శాతం శ్రమిస్తే ఈ కుర్రాడు పలానా కుటుంబానికి చెందిన వాడు అనే కాకుండా తన పని సక్రమంగా చేస్తున్నాడు అని ఆదరిస్తారు ‘‘ అని నటుడు దర్శన్ గణేశన్ వివరించారు.
‘కొత్త దర్శక,నిర్మాతలకు ఇంకా స్వాతంత్య్రం రాలేదు’!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకులు, నిర్మాతలు, చిన్న బడ్జెట్ సినిమాలు స్వేచ్ఛగా ఎదిగే అవకాశం లేకుండా పోతోందని సినీ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ ఆరోపించారు. చిన్న సినిమాల విషయంలో థియేటర్ల కేటాయింపు నుంచి ఓటీటీ, ఆడియో, శాటిలైట్, ఇతర భాషల హక్కుల వరకు అనేక సమస్యలున్నాయని, వీటిపై పరిశ్రమలోని పెద్దలు, స్టార్ హీరోలు స్పందించాలన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త దర్శకనిర్మాతలకు ఇంకా స్వాతంత్య్రం కాలేదన్నారు. ఈ సమస్యలను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్న ఏషియన్ థియేటర్స్కు చెందిన సునీల్తో పాటు పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు.
క్రీడలు
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనూహ్య రీతిలో అవుటయ్యాడు. నిలకడగా ఆడుతున్న అతడు.. తప్పుడు నిర్ణయం కారణంగా రనౌట్గా వెనుదిరిగాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు భారత్ శ్రీలంకకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా శనివారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కాస్త వేగంగా ఆడగా.. కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేశాడు.Off the Mark! 💥 Yashasvi Jaiswal gets going with a sweetly timed boundary. 👊Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/EYTG3ht7CY— Sony Sports Network (@SonySportsNetwk) August 15, 2026దూకుడుగా జైసూ..ఇక 37 బంతుల్లోనే 32 పరుగులతో జైస్వాల్ జోరు మీదున్న సమయంలో.. దురదృష్టం అతడిని వెంటాడింది. భారత ఇన్నింగ్స్ 11వ ఓవర్లో లంక అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ కేశారా నువాంత బంతితో రంగంలోకి దిగాడు.ఈ క్రమంలో కేశారా వేసిన ఆఖరి బంతిని రాహుల్ మిడాన్ దిశగా బాదాడు. అయితే, కేశారా బంతిని ఆపే క్రమంలో జైసూ కాళ్లకు అడ్డుగా వచ్చాడు. దీంతో అదుపుతప్పిన జైసూ నేలమీద పడిపోయాడు. ఈలోపే కేఎల్ రాహుల్ సింగిల్ కోసం రాగా.. కిందపడి లేచిన తర్వాత కూడా జైసూ పరుగుకు సిద్ధంగా ఉన్నానన్నట్లుగా ముందుకు ఉరికాడు.జైసూను రనౌట్ చేయనా?.. కానీ ఇంతలోనే లంక ఫీల్డర్ బంతిని అందుకుని వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా వైపు విసిరాడు. అప్పటికి రాహుల్, జైస్వాల్.. ఇద్దరూ బౌలర్ ఎండ్లోనే ఉన్నారు. వీరిలో ముందుగా రాహుల్ తన బ్యాట్ను నేలమీద పెట్టి సేఫ్ అయ్యాడు. అయితే, బంతిని అందుకున్నప్పటికీ డిక్వెల్లా వెంటనే బెయిల్స్ను పడగొట్టలేదు.Yashasvi Jaiswal was looking so good and his timing today was brilliant, but this unfortunate run-out spoiled the day for himHe scored 32 at a strike rate of 88, but this run out....... #INDvsSL pic.twitter.com/lUtlbsBXpZ— Ajay Jadeja (@AjayJadeja171) August 15, 2026ఇందులో తప్పేముంది?.. కానివ్వు!రనౌట్ చేయనా అన్నట్లుగా కెప్టెన్ ధనంజయ డి సిల్వను అడిగాడు. ఇందుకు ధనంజయ.. ‘ఇందులో తప్పేముంది? కానివ్వు’ అన్నట్లుగా సైగ చేయడంతో డిక్వెల్లా బెయిల్స్ను పడగొట్టాడు. ఫలితంగా జైస్వాల్ రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. ఏదేమైనా అటు కేశారా.. ఇటు రాహుల్తో పాటు జైసూ తొందరపాటు కారణంగా టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.ఈ దారుణమైన మిక్సప్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కొంతమంది రాహుల్ను.. మరికొందను జైస్వాల్ను విమర్శిస్తున్నారు. ఇంకొందరు మాత్రం తప్పంతా కేశారాదేనని తిట్టిపోస్తున్నారు. కాగా జైసూ రనౌట్ కాగానే రాహుల్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ఇక జైస్వాల్ 32 పరుగుల వద్ద అవుట్ కాగా.. అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు.చదవండి: లంచ్బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరెంతంటే?చదవండి: సన్రైజర్స్ కొంపముంచిన క్లాసెన్!
అగార్కర్ పదవి ఉంటుందా? ఊడుతుందా? డెడ్లైన్ అప్పుడే!
శ్రీలంకతో టెస్టు సిరీస్ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్తో అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలోనే అతడిని కొనసాగించాలా లేక వేరేవారికి అవకాశమివ్వాలా అనే దానిపై బీసీసీఐ ఒక నిర్ణయానికి రానుంది. అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకు అగార్కర్ను కొనసాగించాలనే అంశం కూడా బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 2023లో అగార్కర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అతడిని వివాదంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తొలగించడంలో అగార్కర్ తెర వెనుక ప్రధాన పాత్ర పోషించాడనే వార్త అప్పట్లో బాగా వైరలయ్యింది. అంతేకాదు ఇంగ్లండ్తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవీకాలం పొడిగింపు సందర్భాలు చాలా తక్కువ. గతంలో శివసుందర్ దాస్, ఎస్. శరత్, సుబ్రోతో బెనర్జీ, అజయ్ రాత్రా సహా మిగిలినవాళ్లంతా తన పదవీ కాలం ముగియగానే బయటికి వెళ్లిపోయారు. కానీ అగర్కార్ సెలెక్టర్గా వచ్చిన తర్వాత అతడు మంచి ఫలితాలు సాధించాడు. అతడి సెలెక్షన్ పర్యవేక్షణలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ చేరడంతో పాటు వాటిలో మూడు టైటిల్స్ను అందుకుంది. జట్టులో మార్పులు కూడా ఫలితాలు ఇవ్వడంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అగార్కర్కు మద్దతు ఇచ్చింది. మధ్యలో రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐతో అభిప్రాయబేధాలు వచ్చినప్పటికీ, ఇవేవీ పట్టించుకోకుండా అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించే యోచనలో ఉంది. అంతకముందు 2022 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్గా ఉన్న చేతన్ శర్మపై విమర్శలు వచ్చాయి. ఇక 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ భారత్ ఫైనల్ చేరడంలో విఫలం కావడంతో అప్పటి సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్పై అటు బీసీసీఐ, ఇటు అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి అగార్కర్పై విశ్వాసముంచి బీసీసీఐ అతడి పదవిని పొడిగిస్తుందా? తొలగిస్తుందా అనేది వచ్చే నెలతో తేలిపోనుంది.Read: సైక్లింగ్లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త!
సైక్లింగ్లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త!
సైక్లింగ్లో విషాదం నెలకొంది. బ్రిటన్ సైక్లిస్ట్ 19 ఏళ్ల ఫిన్లే టార్లింగ్ పోర్చుగల్లో నిర్వహిస్తున్న సైక్లింగ్ టూర్లో పాల్గొన్నాడు. వోల్టా పోర్చుగల్ టూర్లో భాగంగా ఎనిమిదో దశలో సంభవించిన ఘోర ప్రమాదంలో గాయపడిన ఫిన్లే శుక్రవారం ప్రాణాలు విడిచాడు. మెల్గాకో నుండి ఫాఫే వరకు ఉన్న 166.8 కిలోమీటర్ల మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన వాహనం అతడిని ఢీకొట్టడంతో కింద పడిన టార్లింగ్కు తీవ్ర గాయాలయ్యాయి.Photo Credit: Twitterకాగా ఫిన్లే టార్లింగ్ ప్రస్తుతం ఎన్ఎస్ఎన్ డెవలప్మెంట్ టీమ్ తరఫున పోటీ పడుతున్నాడు. టైమ్ ట్రయల్స్లో నిపుణుడైన టార్లింగ్ గతేడాదే ఎన్ఎస్ఎన్ డెవలప్మెంట్ టీమ్లో చేరాడు. రోడ్ అండ్ ట్రాక్ సైక్లింగ్లోనూ బ్రిటన్కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా ఫిన్లే మరణవార్తను ఎన్ఎస్ఎన్ ఎక్స్ వేదికగా ధృవీకరించింది. "ఈరోజు వోల్టా ఎ పోర్చుగల్లో ఫిన్లే టార్లింగ్ ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ విషయం మమ్నల్ని చాలా బాధించింది. మా కుటుంబంలో ఒకడైన ఫిన్లే కుటుంబానికి ఇదే మా ప్రగాడ సానుభూతి. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా." అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రమాదం తర్వాత రేసును నిలిపిపేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా 19 ఏళ్ల ఫిన్లే మృతిపై బ్రిటీష్, పోర్చుగీస్ సైక్లింగ్ సమాఖ్య నివాళి అర్పించింది.🇵🇹 | Acabam de ser reveladas imagens que demonstram a brutalidade do embate fatal que vitimou Finlay Tarling.O jovem de 19 anos não terá resistido aos ferimento e faleceu no local. pic.twitter.com/YuXcZY8koR— Questiona-te (@questiona_te) August 14, 2026Read: లైవ్ మ్యాచ్లో ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్.. లక్ష జరిమానా!
భారత్- శ్రీలంక తొలి టెస్టు.. మొదలైన వాన!
Sri Lanka Vs India 1st Test Live Updates:మొదలైన జల్లులు!12.38 PM: గాలెలో చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ సిబ్బంది వచ్చి పిచ్ను కవర్లతో కప్పుతున్నట్లు సమాచారం. వాన వల్ల ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.లంచ్ బ్రేక్: టీమిండియా స్కోరు 101/1లంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్లో జైస్వాల్ రనౌట్ మినహా భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. Lunch on Day 1 of the First #SLvIND Test.A solid morning session as #TeamIndia move to 101/1 👌👌Stay tuned for the second session of the day. Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y pic.twitter.com/ru1NamfAn4— BCCI (@BCCI) August 15, 2026జైసూ స్థానంలోక్రీజులోకి పడిక్కల్👉18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (22), పడిక్కల్ (20) పరుగులతో ఆడుతున్నారు.👉 లంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్తో జరిగిన సమన్వయ లోపంతో ఇద్దరు ఒకే ఎండ్కు రావడంతో జైస్వాల్ (32) రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.👉 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. జైస్వాల్ (23), కేఎల్ రాహుల్ (10) పరుగులతో ఆడుతున్నారు.రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గాలే వేదికగా శనివారం శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతాడని అంతా భావించినప్పటికీ గిల్ మాత్రం ధ్రువ్ జురెల్వైపే మొగ్గుచూపాడు. ఇక ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్తో బరిలోకి దిగింది.తుది జట్లు:టీమిండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంక: లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్లో విజయం సాధించాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజ్ఞులు కరువయ్యారు. Captain Shubman Gill wins the toss and elects to bat first at Galle.A look at our Playing XI for the game.Live - https://t.co/bg2q0J2x1f #SLvIND pic.twitter.com/ll2Xa9sTm3— BCCI (@BCCI) August 15, 2026
న్యూస్ పాడ్కాస్ట్
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్య
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బిజినెస్
అప్పర్ లేయర్లోనే టాటా సన్స్
ముంబై: ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన అప్పర్లేయర్ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్బీఎఫ్సీలు)ల జాబితాలో టాటా సన్స్కు మరోసారి చోటిచ్చింది. ఎన్బీఎఫ్సీ రిజి్రస్టేషన్ను వొదులుకునేందుకు టాటా సన్స్ చేసుకున్న దరఖాస్తు పరిశీలనలో ఉన్నప్పటికీ అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీ హోదాను కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే ఈ అంశం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ డీరిజిస్ట్రేషన్కు అడ్డంకికాబోదని స్పష్టం చేసింది. నిజానికి 2022లో టాటా సన్స్ అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందింది. దీంతో మరింత కఠిన నియంత్రణా సంబంధ నిబంధనలను కంపెనీ పాటించవలసి ఉంటుంది. నియమిత కాలంలో స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్సహా.. కార్పొరేట్ గవర్నెన్స్, కనీస మూలధనం, రిస్కుల నిర్వహణ తదితర అంశాలలో నిబంధనలు అమలు చేయవలసి ఉంటుంది. అయితే కంపెనీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టడంతో ఆర్బీఐ గుర్తింపునుంచి మినహాయింపును కోరుతోంది. దీనిలో భాగంగా ఇన్వెస్ట్మెంట్ కార్యకలాపాలను విడదీయడం, రుణాలను తగ్గించుకోవడం, ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్ విభాగాలను పునర్వ్యవస్థీకరించడం తదితరాలను చేపట్టింది. ఇతర ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే కంపెనీ ప్రధానంగా టాటా గ్రూప్లో పెట్టుబడుల నిర్వహణతో హోల్డింగ్ దిగ్గజంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తాజా జాబితా ఇదీ.. ఆర్బీఐ 17 కంపెలతో తాజా జాబితాను విడుదల చేసింది. టాటా సన్స్సహా.. పీఎస్యూలు ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ, హడ్కో చేరాయి. ఇంకా ఈ జాబితాలో డిపాజిట్లు స్వీకరించే ఎన్బీఎఫ్సీలు.. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ హౌసింగ్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. డిపాజిట్లు స్వీకరించని ఎన్బీఎఫ్సీ జాబితాలో టాటా క్యాపిటల్, చోళమండలం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఏబీ క్యాపిటల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్, పిరమల్ ఫైనాన్స్కు చోటు లభించింది. కాగా.. ఇంతక్రితం ప్రకటించిన జాబితాలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, సమ్మాన్ క్యాపిటల్కు అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీ గుర్తింపు ఇచ్చినప్పటికీ నిబంధనలు పాటించలేదని ఆర్బీఐ పేర్కొంది. అయితే వీటిని ఈ జాబితాలో కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.
టోకు ద్రవ్యోల్బణం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన, ఆహారోత్పత్తుల రేట్లు కొంత నెమ్మదించడంతో తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) స్వల్పంగా తగ్గింది. 9.78 శాతంగా నమోదైంది. జూన్లో ఇది 9.87 శాతంగా ఉంది. 2025 అక్టోబర్ తర్వాత నెలవారీగా చూసినప్పుడు డబ్ల్యూపీఐ తగ్గడం ఇదే తొలిసారి. తయారీ ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగినప్పటికీ ఇంధనం, విద్యుత్ ధరల పెరుగుదల నెమ్మదించడం ఇందుకు కారణమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఇంధన ద్రవ్యోల్బణం జూన్లో 27.41 శాతంగా ఉండగా జూలైలో 20.05 శాతానికి దిగి వచి్చంది. అలాగే, ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.49 శాతం నుంచి స్వల్పంగా 5.44 శాతానికి తగ్గింది. అయితే, తయారీ ఉత్పత్తుల ధరలు మాత్రం 7.48 శాతం నుంచి 8.29 శాతానికి పెరిగాయి. అంతర్జాతీయంగా రేట్లు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరినందున రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఇకపై క్రమంగా తగ్గు ముఖం పట్టొచ్చని బార్క్లేస్ ఒక నివేదికలో తెలిపింది. ఆగస్టులో ఇది 9.5 శాతానికి దిగి రావొచ్చని, అయితే, 2027 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద డబ్ల్యూపీఐ సగటున 8.5 శాతంగా ఉండొచ్చని ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ రాహుల్ అగ్రవాల్ పేర్కొన్నారు.రిటైల్ ధరలు అక్కడక్కడే వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గత నెల(జూలై)లో స్వల్పంగా పెరిగి 4.45 శాతానికి చేరింది. ఉల్లిపాయలు, అల్లం తదితరాల ధరలు పెరిగినప్పటికీ జూన్లో నమోదైన 4.38 శాతంతో పోలిస్తే నామమాత్రంగా బలపడింది. దీంతో ప్రభుత్వ గణాంకాల ప్రకారం వరుసగా రెండో నెలలోనూ ఆర్బీఐ పరపతి విధానాల లక్ష్యానికి ఎగువన నిలిచింది. 2024 ఏడాది(బేస్ ఇయర్) ఆధారం చేసుకుని జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త సిరీస్లో జూలై గణాంకాలే అత్యధికంకావడం గమనార్హం! గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతం నుంచి 5.52 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఉల్లి ధరల పెరుగుదల జూన్లో నమోదైన 4.73 శాతం నుంచి జూలైలో 22.54 శాతానికి, అల్లం ధర దాదాపు 84 శాతానికి ఎగసింది. అయితే మరోపక్క బంగళా దుంపలు, బెండకాయలు, టొమాటోలు, బఠాణీల ధరలు వెనకడుగు వేయడంతో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది.
జీసీసీలపై రాష్ట్రాల ఫోకస్
న్యూఢిల్లీ: దేశీయంగా భారీ స్థాయిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటవుతున్నాయి. ఏడు రాష్ట్రాలు 2031 నాటికి 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన లక్ష్యంతో 1,380 జీసీసీల ఏర్పాటుకు దోహపడేలా ప్రత్యేక విధానాలను రూపొందించాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు.. విశిష్ట జీసీసీ పాలసీలను రూపొందించడంలో భారతీయ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అత్యంత అసాధారణమైన వేగాన్ని ప్రదర్శించాయని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. భారతీయ సరీ్వసుల వ్యవస్థకు జీసీసీలు ప్రధాన కేంద్రాలుగా మారుతుండటాన్ని ఇది తెలియజేస్తోందని వివరించారు. రాష్ట్రాలు నిర్దిష్ట ప్రోత్సాహకాలు, వేగవంతంగా అనుమతులు, దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాలను కల్పించే హామీలు మొదలైనవి కల్పించడం ద్వారా జీసీసీలను స్వాగతించేందుకు పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → కర్ణాటక 3.5 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే యోచనతో 500 జీసీసీలను టార్గెట్గా పెట్టుకుంది. మహారాష్ట్ర 4 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడేలా 200 జీసీసీలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. గుజరాత్ 50,000 ఉద్యోగావకాశాల కల్పనతో 250 జీసీసీలను, కేరళ 1.6 లక్షల కొలువు లక్ష్యంతో 80 జీసీసీలను టార్గెట్గా పెట్టుకుంది. అలాగే మధ్యప్రదేశ్ 37,000 ఉద్యోగాల కల్పన కోసం 50 జీసీసీలను సాధించాలని నిర్దేశించుకుంది. → జీసీసీ ఉద్యోగుల కోసం తమిళనాడు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. → తెలంగాణ, ఢిల్లీ కూడా జీసీసీ వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రోత్సహించే విధానాలను అమలు చేస్తున్నాయి. → ఈ పరిశ్రమ కోసం నిర్దిష్ట విధానాలను రూపొందించడంపై ఇతరత్రా పలు రాష్ట్రాలు దృష్టి పెడుతున్నాయి. కేరళ ముసాయిదా జీసీసీ పాలసీలను ప్రతిపాదించింది. → 2022 నుంచి 2026 తొలి ఆరు నెలల వ్యవధి మధ్య భారత్లోని టాప్ 9 నగరాల్లో జీసీసీలు 12.3 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి.
రిలయన్స్, రోల్స్ రాయిస్ జట్టు
న్యూఢిల్లీ: అధునాతన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం స్వదేశీ ఇంజిన్ను రూపొందించే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్–రాయిస్ చేతులు కలిపాయి. ఇందుకోసం భారత్లో ప్రత్యేకంగా ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించనున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇది కంబాట్ ఇంజిన్ల డిజైనింగ్, అభివృద్ధి, తయారీ, టెస్టింగ్తో పాటు ప్రొపల్షన్ టెక్నాలజీకి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా నిలుస్తుందని పేర్కొన్నాయి. అత్యంత కీలకమైన సాంకేతిక సామర్థ్యాలను భారత్ సొంతంగా సాధించుకోవడం ముఖ్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు. రక్షణ, పౌర విమానయానం తదితర రంగాలు, ప్రొపల్షన్ సిస్టమ్స్ మొదలైన విభాగాల్లో విస్తృత భాగస్వామ్యానికి ఈ ఒప్పందం తోడ్పడగలదని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. భారత్లో పటిష్టమైన ఏరోస్పేస్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఇదొక కీలక మైలురాయని రోల్స్ రాయిస్ సీఈవో ట్యుఫాన్ ఎర్గిన్బిల్జిక్ తెలిపారు.
ఫ్యామిలీ
బ్రిటిష్ వారు మొత్తం ఎన్ని దేశాలు పాలించారు?
పిల్లలూ... ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం...ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు కేవలం ఇండియాను మాత్రమే కాదు... ప్రపంచంలోని చాలా దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. నిజం చె΄్పాలంటే ప్రస్తుతం ఉన్న దేశాల లెక్కల ప్రకారం సుమారు 65కి పైగా దేశాలు ఏదో ఒక సమయంలో బ్రిటిష్ వారి పాలన కింద ఉన్నాయి! 1920ల నాటికి ప్రపంచంలోని దాదాపు నాలుగో వంతు భూభాగం వారి అధీనంలోనే ఉండేది. అందుకే ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ‘సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం’ అని పిలిచేవారు. అంటే, ప్రపంచంలో ఎక్కడో ఒకచోట వారి పాలనలో ఉన్న దేశంలో పగలు ఉంటూనే ఉండేదన్నమాట!మనకు స్వాతంత్య్రం వచ్చినట్టే, వారి నుంచి విముక్తి పొందిన కొన్ని ముఖ్యమైన దేశాలు ఇవే:మన పొరుగు దేశాలు: పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ (బర్మా), మలేషియా.పెద్ద దేశాలు: ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్.ఆఫ్రికా దేశాలు: దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, కెన్యా, నైజీరియా.ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారి కిందే ఉండేది! వాళ్లు మన కంటే చాలా ముందే (1776లో) బ్రిటిష్ వారిని తరిమికొట్టి స్వాతంత్య్రం తెచ్చుకున్నారు. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన ఈ దేశాలన్నీ కలిసి తర్వాత ‘కామన్వెల్త్’ అనే ఒక పెద్ద గ్రూప్గా ఏర్పడ్డాయి. ఇందులో మన ఇండియాతో కలిపి మొత్తం 56 దేశాలు ఉన్నాయి. చూశారా... ఎంతమందిని ఇబ్బంది పెట్టిన పరాయి పాలన అయినా ప్రజలంతా కలిసికట్టుగా పోరాడితే ఒకరోజు లొంగిపోక తప్పదు. అదే స్వాతంత్య్రం మనకు నేర్పిన గొప్ప పాఠం!
ఒకనాటి జెండా పండగ మువ్వన్నెలూ పిల్లల ముఖాల్లోనే...
ఆగస్టు పదిహేనంటే ముందు దేశభక్తి గీతాల అడావిడి. క్లాసులో ఎవరికీ సరిగా పాడటం రాదు. కాని అందరూ చేతులెత్తేవారే. ఊరి హైస్కూల్లో... ఏ హైస్కూల్లో అయినా నలుగురైదుగురు టీచరమ్మలు ఉంటారు. ఒక ఐవోరుకి పాటల గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. అంతో ఇంతో పాడేవాడై కూడా ఉంటాడు. వీళ్లకు హెడ్మాస్టర్ పుణ్యమా అని ఈ దేశభక్తి పాటల డ్యూటీ. ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ వాళ్లను వెతికి గ్రూపులు చేసి పాడించడం. మరి టెన్త్క్లాస్ వాళ్లో? వాళ్లకు పబ్లిక్ ఎగ్జామ్స్ కదా. చదువుకోవాలి. ఈ ఆపరేషన్కు దూరంగా ఉంచాలి. అయితే ఒక సర్దా ఉందండోయ్. రిహార్సల్స్ పేరు చెప్పి పీరియడ్స్ ఎగ్గొట్టొచ్చు. ఐవోర్ల స్టాఫ్రూమ్లో రిహార్సల్స్. ప్రతిసారీ అవే పాటలు. బ్యాచ్లు మారతాయంతే.‘వందేమాతరం.. సుజలాం.. సుఫలాం.. మలయజశీతలాం’..‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’...‘పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి విజయగీతికా’...‘సారే జహాసే అచ్ఛా హిందూసితా హమారా’...‘జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’...‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’....అదేంటోగాని ఆగస్టు పదిహేనుకు ఫండు పిల్లలే తేవాలి. రంగు కాగితాలకీ, చార్ట్లకీ, పురికొసలకీ. ఇంట్లో అడగాలి. ఎంత? పావలా... అర్ధరూపాయి... అమ్మో అన్ని డబ్బులే. మరి 1985–86ల్లో అవి పెద్ద డబ్బులే. కొందరు తెచ్చేవారు. కొందరు మెదలకుండా ఉండేవాళ్లు. క్లాసులో ఎవడైతే పరమ బేవార్సు స్టూడెంట్గా ఉంటాడో వాడికి రంగు కాగితాలు కట్ చేయడంలో, రంగురంగుల త్రికోణాలు పురికొసకు అంటించి వేళ్లాడగట్టడంలో తోట తరణి అంత అనుభవం ఉంటుంది. వాడికి సేకరించి ఐదురూపాయల పావలా ఇస్తే తుర్రున బుక్స్టోర్కు పరిగెత్తి రంగు కాగితాలూ కత్తెర కొని ఒక టీమ్తో మైదా పిండి ఉడకబెట్టించి ఆ పనిలో ఉంటాడు. బోర్డును నీటుగా కడిగి, తడిపిన రంగు చాక్పీస్లతో ‘స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని అందంగా రాసే స్టూడెంట్లు ప్రతి క్లాస్లో ఒకరో ఇద్దరో ఉంటారు. వీరు మ్యాథ్స్లో వీక్... డ్రాయింగ్లో ఫస్ట్. ఈ డ్యూటీ వారిది.అయితే ప్రతి సెక్షన్ వారికీ ఈ ఆగస్టు 15న కాస్త కుళ్లు ఉండేది ఒకే ఒక వ్యక్తి మీద. వాడు ఎస్.పి.ఎల్. ఆ రోజు వాడి డాబు, దర్పాన్ని ఆపేవాడుండదు. అందరూ యూనిఫామ్ వేసుకుంటే వాడు ఎన్సిసి డ్రస్సు లాంటిది వేసుకొని ఎర్రబంతి వేళ్లాడే ఖాకీ క్యాప్ పెట్టుకొని ఏ పోలీస్ ఆఫీసరులానో ఉంటాడు. వాడు ‘అటెన్షన్’ అంటే అటెన్షన్. వాడు ‘స్టాండ్ ఎట్ ఈజ్’... అంటే తెరిపి. జెండా ఎగరేయడానికి వీడు మార్చింగ్ చేస్తూ హెడ్మాస్టర్ని, చీఫ్గెస్టునీ తీసుకొస్తాడు. జెండా ఎగరేశాక వీడు సెల్యూట్ కొడితే హెడ్మాస్టర్ వీడికి సెల్యూట్ కొడతారు. మిగిలిన పిల్లలకి ఈ చాన్స్ ఎక్కడా? అందుకే వాడంటే కొంచెం ఇది.ఆగస్టు పదిహేనుకు పూలు తెచ్చి జెండాలో పెట్టే పని టీచరమ్మలది. పూలున్న జెండాను పొట్లంలా చుట్టి జెండాకర్ర కొసాకు పంపించడం, తాడు లాగినప్పుడు జెండా విడివడి పూలు అందరి మీద పడేలా కట్టడం అందరికీ వచ్చనుకుంటున్నారా? రాదు. దానికి పీఈటీ వోరు ఎక్స్పర్ట్. ఆయనే అది చేయాలి. మనం చేస్తే తాడు లాగితే జెండా ఊడదు. పరువు పోతుంది. అందుకని ప్రతి ఆగస్టు 15న తాడు లాగితే జెండా ఎగరుతుందా లేదా అని అదో టెన్షన్.ప్రతి స్టూడెంట్ బాగా ఉతికిన యూనిఫామ్ ఇస్త్రీ చేయించుకొని మరీ ఆ రోజున వేసుకోవాలి. చెంబిస్త్రీ, చేటిస్త్రీ తప్పదు. పాపం హాస్టల్ పిల్లలు శుభ్రమైన బట్టలు వేసుకొచ్చినా వారికి ఇస్త్రీ వీలు లేకపోవడంతో చిన్నబుచ్చుకునేవారు. ఫ్రెండ్సు వారితో చేరి ‘ఏం పర్లేదు లేరా. మీ చొక్కాలే మా చొక్కాల కంటే తెల్లగా ఉన్నాయి’ అని ఉత్సాహపరిచేవారు. వారు నూనె రాసుకున్న తలలతో తెల్లగా నవ్వేవారు.రోజూ స్కూలు ఉదయం తొమ్మిదికైతే ఆ రోజున ఎనిమిదికే సిద్ధం. గ్రౌండ్లో సుద్దపొడి వేసి లైన్లు కొట్టి ఒక్కో సెక్షన్ ఒక్కో లైన్లో నిలబడేలా చేసేవారు. జెండా కర్ర దగ్గర స్టేజ్. ఊరి ఆర్డివోనో తాసిల్దారో రిటైరై వెళ్లిపోయిన హెడ్మాస్టరో చీఫ్ గెస్టు. టిఫిన్ చేసొచ్చిన పిల్లలూ... చేయకుండా వచ్చిన పిల్లలూ... చాక్లెట్లు ఎన్ని పంచొచ్చో ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న పిల్లలూ... వీళ్లు మళ్లీ ఇంట్లో తోబుట్టువులకు హామీ ఇచ్చి వచ్చి ఉంటారు... చాక్లెట్లు తెచ్చిస్తా అని. అదొక టెన్షన్. హెడ్మాస్టర్ మూడ్ బాగుంటే రెండు పెద్ద పెద్ద పళ్లేలు తెప్పించి మూడు నాలుగు రకాల చాక్లెట్లు పోయించి, నయాపైసాకు ఒకటి వచ్చే బ్రిటానియా రౌండ్ బిస్కెట్లు వాటిలో కలిపి, మిశ్రీ ముక్కలు కూడా మిక్స్ చేసి గుప్పెడు గుప్పెడు పంచితే అదీ కిక్కు. పాపం కొన్ని వీధి బడుల్లో బొరుగుల్లో బెల్లం ముక్కలు కలిపి పంచేవారు. ఆ స్కూళ్ల ఆగస్టు 15కు పిల్లలు వెళ్లేవాళ్లు కాదు.అయితే చాక్లెట్లు, బిస్కెట్లు అంత సులువుగా రావు. ఎండ వాయకొడుతున్నా లెక్కచేయకుండా జెండా వందనం చేయించి, దేశభక్తి గీతాలు పాడించి, గెస్టు స్పీచు, హెడ్మాస్టరు స్పెషలు స్పీచు ఇచ్చి... దేశం తాలుకు బాధ్యతలన్నీ ఆ పూట ఎదురుగా నిలుచున్న పిట్ల ప్రాణాలకే అప్పజెప్పేసేవారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేసేవారు. ఆ బాలలేమో స్కూల్లేదు కదా... మధ్యాహ్నం మేట్నీకి డబ్బులెలా అనే మనాదిలో ఉంటారు.ఇన్నింటి మధ్య కూడా ఆగస్టు పదిహేను బాగుండేది. స్కూల్లోని ప్రతి క్లాసు రంగు కాగితాలతో రెపరెపలాడేది. ప్రతి గుండె మీద త్రివర్ణపతాకం గుండు పిన్నుతో అంటుకుపోయేది. ప్రతి పెదవి మీద గాంధీ నెహ్రూ సుభాసుబోసు భగత్సింగుల పేరు పలికేది. ‘హమ్ బుల్బులేహై ఇస్కే ఏ గుల్సితా హమారా’... ఈ దేశపు గువ్వపిట్టలం... రెక్కలు సాచి ఎగురతాం అని పాడుతూ ప్రతి చిన్నారి హృదయం ఆకాంక్ష చేసేది. పొందికైన బట్టల్లో టీచర్లు, ఉపాధ్యాయులు హుందాగా కనిపించేవారు. ప్రతి పీరియడ్కూ బెల్లు కొట్టే ప్యూన్ ఆ రోజు చాక్లెట్లు పంచుతూ చక్కగా నవ్వేవాడు. క్లాసులు చిమ్మే ఆయమ్మ కొప్పులో చామంతులు పెట్టుకొని కొత్తగా కనిపించేది. అందరం పెద్దయ్యి దేశం కోసం ఏదో ఒకటి చేయాలని కాసేపైనా గట్టిగా అనిపించేది. ఇక రోజూ చేసే ప్రతిజ్ఞ ఆ రోజు మరింత ప్రత్యేకంగా ఉండేది. ‘నేను నా సహోదరులను ప్రేమించుచున్నాను’.... ఈ ఒక్కలైను భవిష్యత్తు సమాజాన్ని నిర్మించేది. ‘ఈ దేశ సంపదకు అర్హుడనవ్వడానికి సదా కృషి చేస్తాను’ ఈ లైనూ ముఖ్యమే.మనం అర్హులమై ఉండాలి. మనం మన సమాజాన్ని ప్రేమించడానికి. మనల్ని మన దేశం ప్రేమించడానికి. పాఠశాల మరో తల్లి గర్భం. అక్కడ పొందే జవసత్వాలు, బుద్ధి కుశలతలు, చదువూ సంస్కారాలు... ఇవే నిజమైన దేశభక్తి. ఇవే నిజమైన ఆగస్టు 15. ప్రతి తరాన్ని ‘అర్హులైన తరం’గా మలచగలినంత కాలం మన దేశ ఖ్యాతికీ, దీప్తికీ ఢోకా లేదు. అలా జరిగినంత కాలం విశ్వానికి మనమే ‘భాగ్య విధాతలం’. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి... భరతమాతకు ప్రతిరూపమే. ఏ తల్లిబిడ్డలైనా అందరూ భరతమాత బిడ్డలే.జెండా ఊంచా రహేగా హమారా.భారతమాతాకీ జై. జైహింద్!విదేశీ గడ్డపై మన జెండా!జర్మనీలోని స్టట్గార్డ్లో 1907లో జరిగిన ఒక విప్లవ సమావేశంలో భారతదేశ స్వాతంత్య్ర ఆకాంక్షలను చాటి చెప్పేలా డిజైన్ చేసిన ఒక జెండా (ఇప్పటి జాతీయ జెండా కాదు)ను ఎగరేశారు భికాజీ కామా. విదేశీ గడ్డపై మన జెండా ఎగరేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.గాంధీ గారి రేడియోనానిక్ మోత్వానీ అనే వ్యాపారవేత్త అమెరికా, ఇంగ్లాండ్ల నుంచి రివర్స్–ఇంజినీర్ యాంప్లిఫయర్స్, మైక్రోఫోన్స్, లౌడ్స్పీకర్లను దిగుమతి చేసుకొని ‘చికాగో రేడియో’ ప్రారంభించారు. ఈ రేడియో మహాత్మాగాంధీ ప్రసంగాలను విస్తృతంగా ప్రసారం చేసేది. స్వాతంత్య్ర సమరయోధులు రహస్య, భూగర్భ నెట్వర్క్లను నడపడంలో మోత్వానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సాంకేతిక పరికరాలు ఉపయోగపడ్డాయి.క్యాట్ ఆర్మీస్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారిపై నిరసన కార్యక్రమాలు సృజనాత్మకంగా, ఆకట్టుకునేలా రూపొందించేవారు. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో సూరత్లో క్యాట్ ఆర్మీ(మంజరి సేన) అనే సంఘంలోని మహిళలు జాతీయజెండా రంగులలో ముంచిన ఖాదీ వస్త్రాలు ధరించి బ్రిటిష్ అధికారులను ధిక్కరించారు. ∙సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసనలు జరిగినప్పుడు లక్నోలాంటి నగరాల్లో ‘సైమన్ గో బ్యాక్’ అని రాసి ఉన్న గాలిపటాలను ఎగరేశారు.అసామాన్య మహిళలుకొత్తగా వెలుగులోకి వచ్చిన బీబీసి వారి ఫొటో ఆర్కైవ్లో.... ఉప్పు సత్యాగ్రహంలో సామాన్య మహిళలు ఎంత ధైర్యసాహసాలు, అంకితభావంతో పాల్గొన్నారో, శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎలా నడిపించారో కళ్లకు కట్టే ఫొటోలు ఉన్నాయి. పోలీసులను బహిరంగంగా సవాలు చేశారు, మాటకు మాట బదులిచ్చారు మహిళా స్వాతంత్య్ర సమరయోధులు.నివేదిత వజ్ర ఫ్లాగ్సిస్టర్ నివేదిత 1904లో భారత జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. ‘నివేదిత వజ్ర ఫ్లాగ్’ అని పిలిచే ఈ జెండాలో ఎరుపు, పసుపు రంగుల నేపథ్యం, తెల్లని తామరపువ్వుతో కూడిన వజ్రం చిహ్నం, వందేమాతరం నినాదం కనిపిస్తాయి.దండి యాత్రలో అతి పిన్న వయస్కుడుఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ సబర్మతి ఆశ్రమం నుండి ‘దండి యాత్ర’ ప్రారంభించారు గాంధీజీ. భారతదేశంలో వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ మార్చ్లో పాల్గొన్న వారిలో అత్యంత పిన్న వయస్కుడు పదహారేళ్ల విఠల్ లీలాధర్ ఠక్కర్.
భార్య కోసం అతిపెద్ద పూల తోట..!
ఇటీవల కాలంలో భార్యభర్తల బంధాలు ఎంత ఘోరంగా మారిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. అలాంటి తరుణంలో నెట్టింట వైరల్ అవుతున్న కథ నెటిజన్ల మనసుని అమితంగా ఆకర్షిస్తోంది. వారి 35 ఏళ్ల అనురాగ దాంపత్యానికి ముచ్చటపడి అభినందనలు చెబుతుండటం విశేషం. ఇంతకీ అసలేం జరిగిందంటే..చైనాకి చెందిన జౌజియావోలిన్, తన భార్య యిన్ జీ కోసం భారీ తోటను నిర్మించాడు. అది ఎంత పెద్దదంటే..ప్రపంచంలో అతిపెద్ద ఉద్యానవన తోట. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో అతిపెద్ద రంగరంగు పూల తోట కనువిందు చేస్తోంది. ఆ దంపతులే ఈ భారీ తోటను స్వయంగా చూసుకుంటున్నారు. ఒక టెలివిజన్ షోలో ఈ దంపతులు కనిపించడంతో వారి కథ వెలుగులోకి వచ్చింది. ఆ షో వారిని ఆదర్శ జంటగా అభివర్ణించడం విశేషం.ఇంతకీ జౌజియావోలిన్ ఎందుకు ఈ తోటను నిర్మించాడంటే..2013లో తన భార్య యిన్ బీజింగ్లో పెరిగే హాలీహాక్లుగా పిలిచే ఆ పువ్వులంటే తనకెంత ఇష్టమో చెప్పింది. ఆ నేపథ్యంలోనే జౌ ఆమె కోసం ఒక తోటను నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతనికి తోటపని చేసిన అనుభవం లేదు. అయినా తన సొంత ఇంటిని అమ్మి..ఝువాన్లాంగ్ టౌన్లో సుమారు 80 హెక్టార్ల లోయను కొని, హాలీహాక్ మొక్కలను పెంచడం గురించి నేర్చుకున్నాడు. అలా పదేళ్లకు పైగా దేశ విదేశాల నుంచి విత్తనాలను సేకరించి ఒక పెద్ద తోటనే నిర్మించాడు. అదికాస్తా ఇప్పుడు అతి పెద్ద వైవిధ్యమైన హాలీహాక్ తోటగా ప్రసిద్ధి చెందింది. 35 ఏళ్ల వైవాహిక బంధం వారిది. పిల్లలు లేని ఆ దంపతులు తమ విశ్రాంత జీవితాన్ని పెంపుడు జంతువులు, పూల మొక్కల మధ్య గడుపుతున్నారు. సంప్రదాయబద్ధంగా సంపద లేదా కుటుంబంతో కాకుండా ప్రకృతిలో తమ ఆనందాన్ని వెతుక్కుంటున్న ఈ జంట నిజంగానే ఆదర్శ దంపతులు కదూ..!. నెటిజన్లు కూడా డబ్బు సంపాదించడం, పిల్లలను పెంచడం కంటే జీవితంలో ఇంకా చాలానే ఉందని నిరూపించారు ఈ దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..)
ఆనాడు అర్థరాత్రి వందేమాతరం ఆలపించింది ఆ మహిళే..!
ఆగస్టు 14, 1947 అర్థ రాత్రి స్వాతంత్ర్య వచ్చిందని అందరికి తెలుసు. కానీ ఆ రోజు అర్థరాత్రి స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తున్న తరుణంలో 'విధితో ఒప్పందం' అనే జవహర్లాల్ నెహ్రూ ప్రసంగమే హైలెట్గా నిలిచింది. కానీ ఆ రాత్రి ఆయన మాటల కంటే ఒక మహిళా గాత్రం అందరి చెవుల్లో పడింది. నెహ్రూ ప్రసంగంలోని ఒక్క వాక్యం కూడా వినిపించక మునుపే అంతా ఊపిరి బిగబెట్టుకుని ఆసక్తితో ఎదురుచూస్తున్న సభలో ఒక మహిళ లేచి 'వందేమాతరం'లోని తొలి చరణాన్ని ఆలపించారు. ఆ వనిత ఎవరంటే..ఆమెనే సుచేతా కృపలానీ. ఆ ఒక్క క్షణం పాటు, ఆ నవభారతదేశపు స్వరం ఆమెదే అయ్యిందిపోరాట మార్గాన్ని ఎంచుకున్న ఉపాధ్యాయినికృపలానీ మొదట విప్లవకారిణిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించలేదు. 1908లో జన్మించిన ఆమె, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్రను అభ్యసించి, ఆ తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ చరిత్రను బోధించేవారు . అక్కడే ఆమెకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆచార్య జె.బి. కృపలానీతో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహానికి దారితీసింది. అయితే ఆ వివాహం కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా జరిగింది. ఆ తర్వాత స్వాతంత్ర్య ఉద్యమం ఆమెను క్రమంగా బోధనా వృత్తికి దూరం చేసింది. 1942 నాటి 'క్విట్ ఇండియా' ఉద్యమ సమయంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లి రహస్యంగా ప్రతిఘటనను నిర్వహించారు. అరుణా అసఫ్ అలీ, రామ్ మనోహర్ లోహియా వంటి ప్రముఖులతో కలిసి పనిచేసిన ఆమెను 1944లో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. పోరాటంలో మహిళలు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకూడదని దృఢ సంకల్పంతో, 1940లోనే ఆమె కాంగ్రెస్ మహిళా విభాగాన్ని స్థాపించారు.పదిహేను మందిలో ఒకరుఇంకా స్వాతంత్ర్యం రాని దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించడానికి 1946లో రాజ్యాంగ పరిషత్ (Constituent Assembly) ఏర్పాటైనప్పుడు, కృపలానీ అందులో సభ్యురాలిగా ఎంపికయ్యారు. దాదాపు మూడు వందల మంది సభ్యులున్న ఆ సభలో ఉన్న పదిహేను మంది మహిళల్లో ఆమె ఒకరు. సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్ వంటి ప్రముఖులతో కలిసి ఆమె ఆ సభలో కూర్చున్నారు. చర్చలలో, ఆమె ఆర్భాటంగా కాకుండా ఆచరణాత్మకంగా వ్యవహరించారు. మహిళల హక్కులు, సమానత్వం కొత్త ప్రభుత్వం ఏ రూపంలో ఉండాలనే విషయాలపై మాట్లాడారు. 1947లో, దేశ విభజన బెంగాల్ను అట్టుడికిస్తున్నప్పుడు, ఆమె గాంధీతో కలిసి నోవాఖలీకి ప్రయాణించి, అల్లర్ల బాధితుల మధ్య పనిచేశారు. ఆనాడు స్వాతంత్య్రాన్ని కమ్ముకున్న ఆ హింస నడిబొడ్డులోకి ఆమె అడుగుపెట్టారు.అర్ధరాత్రి గీతంఆమె జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం స్వాతంత్య్రానికి ముందు రోజు వచ్చింది. రాజ్యాంగ సభ అధికారిక రికార్డు ఆ క్రమాన్ని యథాతథంగా భద్రపరుస్తుంది. అజెండాలోని మొదటి అంశం వందేమాతరం మొదటి చరణాన్ని ఆలపించడం అని రాష్ట్రపతి ప్రకటించగా, సుచేతా కృపలాని దానిని ఆలపిస్తుండగా సభ వినడానికి లేచి నిలబడింది. ఆ తర్వాత సమావేశంలో ఆమె 'సారే జహాన్ సే అచ్చా' ప్రారంభ పంక్తులు, 'జన గణ మన' మొదటి చరణాన్ని ఆలపించారు. అప్పుడే నెహ్రూ మాట్లాడటానికి లేచారు. 'వందేమాతరం' అనే నినాదం దశాబ్దాలుగా స్వాతంత్ర్య పోరాటానికి యుద్ధ నినాదంగా నిలిచింది. ఆ స్వాతంత్య్రాన్ని సాధించిన స్త్రీపురుషుల ముందు, తన స్వంత స్వరంతో ఆ నినాదాన్ని స్వేచ్ఛా భారతదేశంలోకి తీసుకువెళ్లే బాధ్యత ఆమెపై పడింది.ఆమె స్వరం ఇప్పటికీ మోస్తున్నదిఆమె మిగిలిన జీవితం ఆ ప్రారంభానికి అనుగుణంగానే సాగింది. ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1963లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే భారతదేశ రాష్ట్రానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారామె. ఆమె హాయంలో ఉన్న తీవ్రమైన ఉద్యోగుల సమ్మె, ఆహార సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి, ఆ తర్వాత పదవి నుంచి వైదొలిగారు. అయినప్పటికీ, ఆమె గానమే నిలిచి ఉంది. తరచుగా కొద్దిమంది మహనీయుల మాటల ద్వారా తన స్వేచ్ఛను గుర్తుచేసుకునే దేశం. వాస్తవానికి ఒక మహిళ మాటలు వింటూ స్వేచ్ఛవాయువులను పీల్చుకుంది దేశం. అప్పటి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం నాడు వందేమాతరం గీతం ఆలపించిన ప్రతిసారీ, ఆనాడు స్వతంత్ర నవ భారతదేశంలో ఆమె ఆలపించిన తొలి గీతమే ప్రతిధ్వనిస్తుంటుంది కదూ..!.
అంతర్జాతీయం
చైనా గేమ్లో పావుగా భారత్?.. అమెరికా షాకింగ్ ఆరోపణలు
అమెరికా–చైనా వాణిజ్య పోరు మరో కీలక మలుపు తిరిగింది. చైనాపై అమెరికా విధించిన భారీ టారిఫ్లను తప్పించుకునేందుకు.. భారత్ సహా 40కిపైగా దేశాల మీదుగా చైనా తన వస్తువులను అమెరికా మార్కెట్లోకి పంపుతోందని అమెరికా ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ‘షాడో ట్రాన్స్షిప్మెంట్ నెట్వర్క్’గా అభివర్ణించారు. అంతేకాదు.. ఇక ఇలాంటి సరుకులను గుర్తించేందుకు అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను రంగంలోకి దింపబోతోంది. దీంతో అసలు చైనా ఏం చేస్తోంది? భారత్ పేరు ఈ వ్యవహారంలో ఎందుకు వచ్చింది? అమెరికా చెప్పే ‘ట్రాన్స్షిప్మెంట్’ అంటే ఏమిటి? అన్న ఆసక్తి మొదలైంది.‘ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్’ పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనాలో తయారైన వస్తువులు నేరుగా అమెరికాకు వెళ్తే భారీ టారిఫ్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొన్ని సరుకులను మూడో దేశాల మీదుగా అమెరికాకు పంపుతున్నారని ఆరోపించింది. ఈ క్రమంలో వస్తువులను మరో దేశానికి పంపించి అక్కడ రీప్యాకేజింగ్, రీలేబెలింగ్, స్వల్ప స్థాయి ప్రాసెసింగ్, ఇన్వాయిస్ లేదా షిప్పింగ్ మార్గంలో మార్పులు చేస్తున్నారని అమెరికా పేర్కొంది. దీంతో అసలు వస్తువు చైనాలో తయారైనప్పటికీ.. పత్రాల్లో అది మరో దేశం నుంచి వచ్చినట్లుగా కనిపించే అవకాశం ఉంటుందని తెలిపింది.అంటే.. చైనా సరుకు.. మధ్యలో మరో దేశం.. చివరికి అమెరికా మార్కెట్! ఇదే అమెరికా ఆరోపిస్తున్న ట్రాన్స్షిప్మెంట్ విధానం. ఈ నెట్వర్క్లో భారత్తో పాటు మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల పేర్లను కూడా నవారో ప్రస్తావించారు. ఈ మార్గంలో అక్రమంగా మళ్లుతున్న వస్తువుల విలువ ఏటా 40 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అమెరికా నివేదిక అంచనా వేసింది. అయితే ఈ అంచనా ఉపయోగించిన పద్ధతి, ట్రాన్స్షిప్మెంట్కు ఇచ్చే నిర్వచనాన్ని బట్టి మారుతుందని స్పష్టం చేసింది.టార్గెట్ భారత్..ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికా నివేదికలో పుణే,గుజరాత్,చెన్నై ఉత్పత్తి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనా తయారు చేసిన పంపులు, కంప్రెషర్లు భారత్ మీదుగా అమెరికాకు చేరుతున్నాయని నవారో ఉదాహరణగా చెప్పారు. ఇక్కడే ఒక కీలక విషయాన్ని గమనించాలి. అమెరికా నివేదికలో భారత్ పేరు రావడం అంటే భారతదేశం మొత్తం అక్రమంగా చైనాకు సహకరిస్తోందని అర్థం కాదు. నిజమైన భారతీయ తయారీ, చట్టబద్ధమైన ప్రాసెసింగ్, విదేశీ పెట్టుబడులు, సరఫరా గొలుసుల మార్పులను కూడా అక్రమ ట్రాన్స్షిప్మెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అందుకే అమెరికా ఇప్పుడు తన తదుపరి ఆయుధంగా AIని ఉపయోగించబోతోంది.‘డిటెక్టివ్ బోర్డర్’గా పేర్కొన్న AI ఆధారిత వ్యవస్థ ద్వారా అమెరికా అధికారులు షిప్మెంట్లకు సంబంధించిన భారీ డేటాను విశ్లేషించనున్నారు. సరుకు ఎక్కడి నుంచి బయలుదేరింది? దాని గత రూట్ ఏంటి? తయారీదారు ఎవరు? కంపెనీల యాజమాన్య సంబంధాలు ఏంటి? ఒక దేశానికి అంత భారీగా ఆ వస్తువులను తయారు చేసే సామర్థ్యం ఉందా? ఉత్పత్తి వర్గీకరణలో ఏమైనా అనుమానాలున్నాయా? వంటి అంశాలను పరిశీలించనున్నారు. అనుమానం బలపడితే.. సరుకును అడ్డుకోవడం, అదనపు సుంకాలు వసూలు చేయడం, జరిమానాలు విధించడం లేదా అమెరికా మార్కెట్లోకి ప్రవేశాన్ని నిరోధించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదంతా ఎందుకు?2018లో చైనాపై అమెరికా సెక్షన్ 301 కింద టారిఫ్లు విధించిన తర్వాత.. చైనా ఎగుమతులు మూడో దేశాల ద్వారా మళ్లించే విధానం పెరిగిందని అమెరికా ఆరోపిస్తోంది. భారీ సుంకాల నుంచి తప్పించుకునేందుకు మూడో దేశాలను మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారని వాషింగ్టన్ వాదిస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా వ్యూహం మారుతోంది. గతంలో ‘చైనా నుంచి నేరుగా వస్తోందా?’ అని చూసే స్థాయి నుంచి.. ఇక ‘చైనా నుంచి వచ్చి మధ్యలో ఏ దేశాల మీదుగా తిరిగి వచ్చింది?’ అనే స్థాయికి తనిఖీలు వెళ్లబోతున్నాయి.భారత్పై ఎఫెక్ట్?భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు విస్తరిస్తున్న సమయంలో.. భారతదేశాన్ని చైనా టారిఫ్లను తప్పించుకునే మార్గంగా ఉపయోగిస్తున్నారన్న అనుమానాలు పెరిగితే, కొన్ని భారతీయ ఎగుమతులపై అదనపు తనిఖీలు లేదా చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు.. అమెరికా ఆరోపణలకు తగిన ఆధారాలు, నిర్దిష్ట కేసులు, అధికారిక దర్యాప్తు ఫలితాలు బయటకు రావాల్సి ఉంది. కేవలం ఒక నివేదికలో దేశం పేరు ప్రస్తావించబడటాన్ని బట్టి మొత్తం భారత ఎగుమతి రంగంపై తీర్పు ఇవ్వడం సరికాదు.
ఇరాన్ నెత్తిన అమెరికా మరో పిడుగు! అవసరమైతే..
తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని.. అవసరమైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కుండబద్ధలు కొట్టేసింది. ఈ తరుణంలో అమెరికా ఒత్తిడి మరింత పెంచింది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ‘ నో ఎండ్ ప్లాన్’తో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జలసంధిలో నౌకా దిగ్బంధాన్ని (బ్లాకేడ్) కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. అవసరమైతే నిరవధికగా ఆ పని చేయాలని భావిస్తోంది. అంటే నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ లేకుండా ఇరాన్ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై నిఘా కొనసాగించడం(అవసరమైతే దాడులు జరపడం) అన్నమాట.కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడం, ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని చెప్పారు. అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మార్చుతూ హర్ముజ్ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని తెలిపారు.ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలునౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్ను చర్చల బల్లపైకి తీసుకురావడమేనని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.హర్ముజ్ జలసంధే కేంద్రంగా పోరుఅణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇప్పుడు హర్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరిగేది. తమపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఈ వ్యూహాత్మక మార్గంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు హర్ముజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ చెబుతోంది.రెండు చమురు నౌకలపై దాడిహర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడి జరిగినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు ఇరాన్ కారణమని యూఏఈ ఆరోపించింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. నౌకల రాకపోకలు కూడా భారీగా తగ్గిపోయాయి.నౌకల రాకపోకలకు బ్రేక్యుద్ధానికి ముందు హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 130 నుంచి 140 వరకు నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక దశలో రోజుకు కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు సమాచారం. అమెరికా గతంలో ఇరాన్ నౌకలు, పోర్టులపై ఉన్న దిగ్బంధాన్ని కొంతకాలం సడలించినప్పటికీ.. తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. దీనివల్ల ఇరాన్కు కీలకమైన విదేశీ మారక ఆదాయంపై ప్రభావం పడుతోంది.ప్రపంచ చమురు మార్కెట్లో కలవరంఇరాన్ సంక్షోభం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 43 లక్షల బ్యారెళ్ల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది దాదాపు 4 శాతానికి సమానం. అయితే మరోవైపు డిమాండ్ తగ్గడం, అమెరికా ముడిచమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు కొంత తగ్గాయి. గురువారం ధరలు 2 శాతానికి పైగా పడిపోయాయి.ట్రంప్పై దేశీయ ఒత్తిడిఇరాన్తో యుద్ధం ముగించాలని అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది. పెరిగిన ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారింది. ట్రంప్ ఈ మధ్య హర్ముజ్పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ దీనిని ఖండిస్తూ.. ఆంక్షలు ఎత్తివేయడం, తమ నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు నెరవేరే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని స్పష్టం చేసింది.యుద్ధం కంటే ఆర్థిక దెబ్బే వ్యూహమా?ఇరాన్పై సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ గతంలో హెచ్చరించినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్కు ఆయుధాల సరఫరాకు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హెగ్సెత్ తెలిపారు.అబ్రహం లింకన్ నౌకపై వదంతులుహర్ముజ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకపై సిబ్బంది మరణించారన్న వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. ఈ యుద్ధం ఆగదని.. తమ జీవితాలు ఇంతేనన్న వైరాగ్యంతో ఏడుగురు నేవీ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నది ఇరాన్ మీడియా కథనాల సారాంశం. అయితే అది తప్పు సమాచారమని అమెరికా తెలిపింది. 260 రోజులకు పైగా సముద్రంలో ఉన్నప్పటికీ అబ్రహం లింకన్ క్యారియర్ గ్రూప్ సిబ్బంది ధైర్యంగా ఉన్నారని CENTCOM పేర్కొంది. ఆగస్టు 3న సముద్రంలో పడిపోయిన ఒక నావికుడిని కూడా సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఈ తరుణంలో.. లింకన్ నౌకను ఒడ్డుకు రప్పించి జార్జ్ వాషింగ్టన్ నౌకతో రిప్లేస్ చేశామని, ఇది సాధారణ చర్యేనని ప్రకటించుకుంది.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు ఇప్పుడు అమెరికా–ఇరాన్ ఘర్షణలో కీలక అంశంగా మారింది. ఒకవైపు అమెరికా నిరవధిక బ్లాకేడ్, ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు ఇరాన్ వ్యూహాత్మక మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోరు ఎంతకాలం కొనసాగుతుందన్నది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది.
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు.. రంగంలోకి జార్జ్ వాషింగ్టన్ నౌక
టెహ్రాన్: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎంతో కాలంగా సముద్రంలోనే ఉండి అమెరికాకు సేవలంధిస్తున్న అబ్రహం లింకన్ యుద్ధ నౌక స్థానంలో యుఎస్ మరో వార్షిప్ను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరొక శక్తివంతమైన నౌక యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ను మధ్యప్రాచ్యానికి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనని, లింకన్ నౌక సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలకు దీనికి సంబంధం లేదని అధికారులు తెలిపారు.ఎంతోకాలంగా అరేబియా సముద్రంలో మోహరించిన అబ్రహం లింకన్ నౌకలో సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వహిస్తున్నారు. గత నవంబర్ 21న శాన్ డియాగో నుంచి పసిఫిక్ ప్రాంతం కోసం బయలుదేరిన ఈ నౌక, ఫిబ్రవరి 28న ఇరాన్తో యుద్ధం ప్రారంభం కావడంతో మధ్యప్రాచ్యానికి దారి మళ్లించబడింది. ఎలాంటి పోర్ట్ కాల్ (ఓడరేవు సందర్శన) లేకుండానే ఈ నౌక ఏకంగా 200 రోజులకు పైగా సముద్రంలోనే గడపడం సిబ్బందికి అత్యంత క్లిష్టమైన పరీక్షగా మారింది. గత 250 రోజులకు పైగా సాగుతున్న ఈ ప్రయాణంతో నావికుల్లో తీవ్రమైన అలసట, మానసిక క్షోభ నెలకొన్నాయి.సిబ్బంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆత్మహత్య ఆలోచనలు మరియు కొందరు సిబ్బంది ఓడ నుంచి దూకే ప్రయత్నాలు చేశారన్న వార్తలు కుటుంబ సభ్యులు, చట్టసభ సభ్యుల్లో ఆందోళన రేకెత్తించాయి. మరోవైపు, ఆహార కొరత, నీటి కాలుష్యం, మరుగుదొడ్ల సమస్యలు, బూజు పట్టడం, మెయిల్ వ్యవస్థ దెబ్బతినడం వంటి దుర్భర పరిస్థితులను కుటుంబ సభ్యులు ఎత్తిచూపారు. శాన్ డియాగోలో జరిగిన సమావేశంలో బాధ్యుల తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ ఆరోపణలను అమెరికా నావికాదళం రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తోసిపుచ్చారు. ఆత్మహత్యాయత్నాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సిబ్బందికి కౌన్సెలర్లు, శుద్ధి చేసిన నీరు, భోజనం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే, యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా కేంద్రాలు దెబ్బతినడం వల్ల ఆహారం, పరిశుభ్రతా వస్తువుల అందజేతలో కొన్ని అంతరాయాలు ఏర్పడినట్లు నావీ అంగీకరించింది. ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే స్పష్టత లేకపోవడం, నావికులు మానసికంగా మరింత కుంగిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం లింకన్కు విధుల నుంచి విరామం ఇవ్వడానికి జార్జ్ వాషింగ్టన్ను పంపుతున్నట్లు తెలుస్తోంది. జార్జ్ వాషింగ్టన్ ప్రస్తుతం వియత్నాంలోని డానాంగ్ నుంచి బయలుదేరిన ఈ నౌక సింగపూర్ జలసంధి మీదుగా హిందూ మహాసముద్రం వైపు ప్రయాణిస్తున్నట్లు యూఎస్ నావీ అధికారులు తెలిపారు.
అమెరికాకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్
వాషింగ్టన్ డీసీ: అమెరికా ఆయుధ సంపత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక దళంతో పాటు ఆధునిక యుద్ధ నౌకలు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల సైనిక స్థావరాలతో ఆ దేశం ఎంతో స్ట్రాంగ్గా ఉంది. అయితే శత్రుదుర్బేద్యంగా కనిపించే వాషింగ్టన్.. ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం చేతిలో చతికిలపడాల్సి వచ్చింది. అవును ఇది అక్షరాల నిజం ఇటీవల జర్మనీలో జరిగిన "కంబైన్డ్ రిజాల్వ్" సైనిక విన్యాసంలో ఉక్రెయిన్ డ్రోన్లు అమెరికా దళాలను ముప్పుతిప్పలు పెట్టాయి. వాల్ స్ట్రీట్ జనరల్ కథనం ప్రకారం.. జర్మనీలో జరిగిన 'కంబైన్డ్ రిజాల్వ్' సైనిక విన్యాసాలలో ఉక్రెయిన్ డ్రోన్ ఆపరేటర్లు అమెరికా బలగాలను, వారి సాయుధ వాహనాలను పదేపదే గుర్తించి మరీ 'నాశనం' చేశారని తెలిపింది. ఒక దశలో ఉక్రెయిన్ డ్రోన్ బృందాలు ఏకంగా ఒక పూర్తి అమెరికన్ ఆర్మర్డ్ బ్రిగేడ్ (సాయుధ దళాన్ని) తుడిచిపెట్టేశాయని అమెరికా అధికారులే స్వయంగా వెల్లడించినట్లు పేర్కొంది. రష్యాతో గత నాలుగున్నర ఏళ్లుగా సాగుతున్న యుద్ధ అనుభవం ఉక్రెయిన్కు డ్రోన్ల వినియోగంలో అపారమైన నైపుణ్యాన్ని ఇచ్చింది. ఈ రకమైన ఆధునిక యుద్ధ పద్ధతులను నేర్చుకోవడానికి అమెరికా సైన్యం ఇంకా ప్రయత్నిస్తూనే ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిపింది.అయితే ఈ విన్యాసంలో నేరుగా మందుగుండు సామాగ్రి ఉపయోగించరు. డ్రోన్లు వాహనాలపై నుండి లేదా వాటికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు, పరిశీలకులు ఆ వాహనం వర్చువల్గా 'నాశనమైంది' అని ప్రకటిస్తారు. ఉక్రెయిన్ దళాలు ఎంత వేగంగా అమెరికా వాహనాలను కూల్చేసాయంటే, కొన్ని వాహనాలను నాశనమైనట్లు ప్రకటించి మళ్లీ బతికించి కొత్త యూనిట్లుగా విన్యాసాల్లోకి పంపాల్సి వచ్చింది. అయితే రెండు వారాల పాటు సాగిన ఈ డ్రిల్ తర్వాత అమెరికా సైనికులు క్రమంగా పరిస్థితులకు అలవాటు పడ్డారు. వారు తమ దళాలను విడదీయడం, కదలికలను దాచడం మరియు శత్రువుల కంటికి పడకుండా ఉండటానికి 'ఎలక్ట్రానిక్ వార్ఫేర్' పద్ధతులను ఉపయోగించడం నేర్చుకున్నట్లు అధికారులు ప్రకటించారు.అనంతరం ఉక్రెయిన్ దళాలు అమెరికన్లకు డ్రోన్లను ఆఫెన్సివ్గా (దాడి చేయడానికి) ఎలా వాడాలో శిక్షణ కూడా ఇచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విధమైన శిక్షణ అమెరికాలో దొరకదని '"ఇలాంటి అద్భుతమైన శిక్షణ అమెరికాలో దొరకడం అసాధ్యం" అని నాటో సైనికదళం నాయకుడు ఎయిర్ ఫోర్స్ జనరల్ అలెక్సస్ గ్రింకెవిచ్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ దళాలతో శిక్షణ పొందిన తర్వాత నాటో సైన్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్ల వినియోగంలో ఉక్రెయిన్ ముందంజఉక్రెయిన్ కేవలం డ్రోన్లను ఎగరేయడమే కాకుండా, యుద్ధ రంగంలో అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవడం, వాటిని రిపేర్ చేయడం మరియు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయడంలో నైపుణ్యం సాధించింది. కానీ, అమెరికా సైనికులకు యుద్ధ రంగంలో దాడి జరుగుతున్నప్పుడు డ్రోన్లను రిపేర్ చేయడం లేదా ఆయుధాలను అమర్చడంలో అనుభవం చాలా తక్కువగా ఉంది. డ్రోన్ల కోసం అమెరికా బిలియన్ల ఖర్చు.. కానీ మారిన వ్యూహంసుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రోన్ల సాంకేతికతను ఆధునిక యుద్ధాలలో చేర్చడంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాయి.పెంటగాన్ కొత్త డ్రోన్లు మరియు కౌంటర్-డ్రోన్ వ్యవస్థల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేసింది. కానీ ప్రస్తుతం యుద్ధ రంగం మారిపోయింది. ఇప్పుడు సమస్యలు సృష్టిస్తోంది అమెరికా తయారు చేసిన ఖరీదైన, అధునాతన లాంగ్-రేంజ్ డ్రోన్లు కావు. చిన్నవి, చౌకైన ఫ్రంట్లైన్ డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతూ, యుద్ధ నిఘా సమాచారంతో కలిపితే ఎంతటి విధ్వంసం సృష్టించవచ్చో ఉక్రెయిన్ నిరూపించింది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ డ్రోన్ల దాడులను తిప్పికొట్టడానికి అమెరికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ దాడుల్లో అమెరికా సైనికులు మరణించడమే కాకుండా, ఆయుధాలు, విమానాలు కూడా ధ్వంసమయ్యాయి.కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. గత ఆరు నెలలుగా అమెరికా ఇరాన్పై దాడి చేస్తున్నా యుద్ధం కొలిక్కి రాలేదు. వారంలోనే యుద్ధాన్ని ముగిస్తానని బింకాలు పలికిన ట్రంప్ యుద్ధం ఎలా ముగించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా ఆధునాతన డ్రోన్ల వినియోగంలో అమెరికా వైఫల్యం మరోసారి తేటతెల్లమైంది. ఈ ఆపరేషన్ ఏంటి?అమెరికా వాహనాలను ముప్పతిప్పలు పెట్టిన డ్రోన్లు'కంబైన్డ్ రిజాల్వ్' అనేది మైదాన ప్రాంత యుద్ధాలపై ఆధారపడిన భారీ స్థాయి ఆర్మీ విన్యాసం. ఇందులో అమెరికా దళాలు సాయుధ వాహనాలు, పదాతి దళం, హెలికాప్టర్లు మరియు డ్రోన్లతో పాల్గొంటాయి. అయితే, ఉక్రెయిన్ డ్రోన్ బృందాలు చాలా వేగంగా వీటిని ముక్కలు ముక్కలుగా చేసి పారేశాయి. ఇలాంటి విన్యాసాల్లో నిజమైన మందుగుండు సామగ్రిని ఉపయోగించరు. ఈ విన్యాసాలు వాస్తవ యుద్ధ పరిస్థితులలో లోపాలను గుర్తించడానికి నిర్వహించబడ్డాయి.
జాతీయం
80 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా.. ఎర్రకోటపై సరికొత్త చరిత్ర
ఢిల్లీ: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా జాతీయ గేయం ‘వందే మాతరం’ను పూర్తిస్థాయిలో ఆలపించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’ 150 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వందేమాతరంపై ప్రత్యేక చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘వందే మాతరం’కు అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించే మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న (శుక్రవారం) స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ముందు, ముగింపులోనూ ‘వందే మాతరాన్ని గేయాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వదేశీ ఉద్యమ కాలంలో ‘వందే మాతరం’ ప్రజల గీతంగా మారిందని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ‘వందే మాతరం’ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ఏకం చేసిన ప్రధాన దేశభక్తి గీతాల్లో దీని ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దేశభక్తి, మాతృభూమిపై గౌరవం, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా ఈ గీతం ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. 2026లో 150 ఏళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో దీని చారిత్రక ప్రాధాన్యాన్ని దేశవ్యాప్తంగా గుర్తుచేస్తున్నారు. ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ‘వందే మాతరం’కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
ఆటోపై కుక్క మూత్రం పోసిందని..
ఖమ్మం క్రైం: ఆటోపై కుక్క మూత్ర విసర్జన చేసిందనే కారణంతో మొదలైన వివాదం తీవ్రరూపం దాల్చగా ఓ యువకుడి మృతికి దారి తీసింది. అయితే, ఘర్షణ పడిన ఇద్దరి మధ్య పాత ఘర్షణలు ఉండడం గొడవ పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలో ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన కుటుంబాలుఖమ్మం రూరల్ మండలం పోలేపల్లికి చెందిన ఉండేటి ఏసు – నాగమణి దంపతులకు కుమారుడు శ్రీనాధ్ అలియాస్ పండు(24), కుమార్తె ఉన్నారు. శ్రీనాధ్ చిన్నప్పటి నుంచి త్రీటౌన్ ప్రాంతంలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలో అమ్మమ్మ వెంకటమ్మ, మేనమామ రాజు వద్ద ఉంటూ ఫ్లెక్సీ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆయన తల్లిదండ్రులు టేకులపల్లిలోని డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్నారు. ఇక రంగనాయకుల గుట్ట వద్దే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన వేముల యల్లమ్మ తన కుమారుడైన మధుతో కలిసి కూలీ పనులు చేస్తూ అద్దె ఇంట్లో జీవిస్తోంది. కాగా, శ్రీనాధ్ – మధుకు మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈక్రమాన గురువారం రాత్రి 11గంటలు దాటాక మ«ధు తన పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లగా శ్రీనాధ్, ఆయన స్నేహితుడు వీరేశ్తో కలిసి ఆటోలో కూర్చున్నారు. ఈమేరకు కుక్క వారు కూర్చున్న ఆటోపై మూత్రవిసర్జన చేయడమే కాక చీకట్లో ఉన్న శ్రీనాధ్, ఆయన స్నేహితుడిని చూసి మొరిగింది. దీంతో కావాలనే మధు తమపై కుక్కను ఉసిగొల్పాడని భావించి వాగ్వావాదానికి దిగారు. ఈక్రమాన ‘కుక్కను కట్టేసి వచ్చి సంగతి చూస్తా’ అంటూ మధు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి శ్రీనాధ్, వీరేశ్ ఆయన ఇంటికి వెళ్లి గొడవ పడుతూ కర్రలతో కొట్టుకున్నారు. దీంతో క్షణికావేశంతో మధు ఇంట్లోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకొచ్చి శ్రీనాధ్ను పలుమార్లు పొడవగా తీవ్ర రక్తస్రావంతో ఆయన సమీపంలోని డ్రెయినేజీలో పడి అపస్మారక స్థితికి చేరాడు. ఈలోగా శ్రీనాధ్ అమ్మమ్మ, మేనమామ చేరుకుని పెద్దాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.పోలీసుల అదుపులో నిందితుడు?ఘటన సమాచారం అందుకున్న నగర ఏసీపీ రమణమూర్తి, త్రీటౌన్ సీఐ మోహన్బాబు, సిబ్బంది వచ్చేసరికి మధు పారిపోయాడు. కాగా, శ్రీనాధ్ మృతదేహంపై ఏడు కత్తిపోట్లు ఉండగా, పేగులు సైతం బయటకు రావడంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని మార్చురీకి తరలించగా స్నేహితులు భారీగా తరలివచ్చారు. అలాగే, కాంగ్రెస్ నాయకులు రుద్రగాని ఉపేందర్, నల్లపు శ్రీను ఆయన కుటుంబీకులను పరామర్శించారు. మూడేళ్ల పంపింగ్ వెల్రోడ్డులో జరిగిన ఘర్షణలో సాయి అనే వ్యక్తి కత్తిపోట్లతో మృతి చెందా డు. మళ్లీ ఇప్పుడు తరహా గొడవ జరగడం గమనార్హం. కాగా, పరారీలో ఉన్న మధును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క పోసుమార్టం అనంతరం శ్రీనాధ్ మృతదేహాన్ని రంగనాయకుల గుట్ట వద్ద ఇంటికి తీసుకొచ్చాక స్వగ్రామమైన పోలేపల్లికి తీసుకెళ్లారు. ఈక్రమాన పోలీసులు బందోబస్తు చేపట్టారు.
సమయం.. అవసరం.. సంకల్పం మనది: ఎర్రకోటపై ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: మన దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని.. ఆ అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రక ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఎగరేసిన అనంతరం.. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది వేడుకల్లో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వారసత్వం, ‘యువశక్తి–వికసిత్ భారత్ 2047’ అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని.. వారి కలలు, ఆశయాల స్ఫూర్తితో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఇవాళ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని.. ప్రతీ భారతీయుడి గుండెలో వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని, పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘సమయం.. అవసరం.. సంకల్పం మనది. సామర్థ్యం పెంచుకుని విజయం సాధిద్దాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.వికసిత్ భారత్ కోసం సప్తధార ప్రణాళికతయారీ శక్తిఫుడ్ ప్రొడక్షన్టెక్నాలజీగతిశక్తిరక్షణ రంగంగ్రీన్ ఎకానమీ.. బ్లూ ఎకానమీయువశక్తి25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారుతమ హయాంలో దేశ వికాసం కోసం కృషి చేశామని.. వివిధ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారని ప్రధాని తెలిపారు. రక్షణ ఉత్పత్తులు పెరిగాయని, అనేక రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కరోనా నుంచి యుద్ధాల వరకు సవాళ్లు ఎదుర్కొన్నాంగత 12 ఏళ్లలో భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ప్రధాని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల మధ్య కూడా దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగిందన్నారు. యూపీఏ హయాంలో ప్రజలు భయాందోళనతో గడిపారని.. ఆ తర్వాత కూడా ప్రజల్ని భయపెట్టడమే పనిగా కొందరు పెట్టుకున్నారని అన్నారు. యుద్ధాలతో పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్లు దొరకవని జనాలకు భయపెట్టారని.. కానీ, అడ్డంకులు అధిగమించామని ప్రధాని అన్నారు. దేశ ప్రగతిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు.సంస్కరణలు మరింత వేగంగా..ఇక ఆగేదే లేదని.. తగ్గేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్ధికి ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తామని ప్రధాని తెలిపారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక రంగంలో ముందంజ వేయడమే లక్ష్యమన్నారు. రైల్వే విద్యుద్దీకరణ, మెట్రో విస్తరణ, హైడ్రోజన్ రైలు, సెమీకండక్టర్ రంగం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంధన భద్రతను అత్యవసర అంశంగా పరిగణించి.. దాని కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించాలని అభిప్రాయపడ్డారు.ఆత్మనిర్భర్ భారత్.. మేడిన్ ఇండియానే లక్ష్యంభారత్ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో భారత్ ప్రపంచానికి కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘‘మన ఉత్పత్తుల ఆధారంగానే ప్రపంచంలో మనకు గుర్తింపు రావాలి. ప్రతి మార్కెట్కు భారత ఉత్పత్తులు చేరాలి’’ అని అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భారత కంపెనీల సంఖ్య పెరగాలని, ప్రపంచ స్థాయి ఫార్మా సంస్థలు భారత్ నుంచి రావాలని లక్ష్యాలను వివరించారు.ఉగ్రవాదం, నక్సలిజంపై పోరాటం కొనసాగుతుందిదేశ భద్రతపై మాట్లాడుతూ.. సరిహద్దుల అవతల, ఇవతల భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం అనేక కుటుంబాలను నాశనం చేసిందని, నక్సలిజం వల్ల కూడా ఎంతో నష్టం జరిగిందని పేర్కొన్నారు. దేశాన్ని మావోయిజం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.యువత తోడుంటేనే..దేశం ముందున్న అతిపెద్ద లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని స్పష్టం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలబెట్టాలంటే యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. యువతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్న ప్రధాని.. ఏఐ, సాంకేతికత, క్రీడలు, ఆవిష్కరణల రంగాల్లో యువత సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువశక్తితోనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందని చెప్పారు. అందుకోసం యువత తనకు మద్దతు నిలవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే మాటే వినిపించడం లేదని.. ప్రతీ దేశం దాని సంక్షోభాల మీదే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో భారత్ గ్లోబల్ లీడర్షిప్, సప్లై చైన్గా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందని అన్నారాయన. మహిళా బిల్లుకు ముందుకు రండిమహిళా సాధికారతపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వారి హక్కు అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయాలను పక్కన పెట్టి మహిళల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే క్రెడిట్ వారే తీసుకోవాలంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను ‘లక్పతి దీదీ’లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.తొలిసారి ఎర్రకోటపై వందేమాతరంఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ప్రత్యేకంగా నిలిచింది. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ తొలిసారి ఎర్రకోట అధికారిక కార్యక్రమంలో ఆలపించారు. ప్రతి భారతీయుడి హృదయం వందేమాతరం నినాదంతో మారుమోగుతోందని ప్రధాని అన్నారు. వేడుకలు ఇలా.. స్వాతంత్య్ర వేడుకలకు ముందు ప్రధాని మోదీ రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం 21 గన్ సెల్యూట్, సైనిక గౌరవ కార్యక్రమాలు జరిగాయి. ఎర్రకోట ప్రాంగణంలో పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళలు, స్వయం సమృద్ధి, ఆవిష్కరణలే కీలకమని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా దేశానికి సందేశం ఇచ్చారు.
అప్పట్లో మోదీ ఉండి ఉంటేనా...!!!
లక్నో: భారతదేశ విభజనకు బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, అప్పట్లో దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ఉండి ఉంటే దేశానికి ఎలాంటి నష్టమూ జరిగేది కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సర్దార్ వల్లభ్భాయ్పటేల్ లాంటి వ్యక్తి దేశ ప్రధానిగా ఉన్నా దేశం ముక్కలయ్యేది కాదని స్పష్టం చేశారు. 1948 నాటి దేశ విభజనపై శుక్రవారం లక్నోలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ విభజనతోపాటు తదనంతరం చెలరేగిన హింసకూ అసలు బాధ్యత కాంగ్రెస్దేనని పునరుద్ఘాటించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పుడు నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయిఉంటే భారత్కు ఎవరూ ఇసుమంత నష్టమూ చేయగలిగి ఉండేవారు కాదు’’అని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుల పిరికితనానికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్భంగానూ కాంగ్రెస్ అలాంటి వ్యక్తిత్వాన్నే చూపిందని వ్యాఖ్యానించారు. విభజన, ఇతర చారిత్రక తప్పులకు భారతదేశం ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిజం, ఇతర అతివాద రూపాల రూపంలో ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని ఆదిత్యనాథ్ అన్నారు. విభజనను ‘‘మానవాళి చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం’’గా ఆయన అభివరి్ణంచారు.
ఎన్ఆర్ఐ
తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) /TCSS యొక్క పదమూడో వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2వ తేదీన స్థానిక కుర్తాళం బోర్డర్, లిటిల్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 65-70 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో ముందుగా పన్నెండో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2025-2026 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు సమ్మయ్య మోలుగూరి, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ పూర్వ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల,కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మోడరేటర్ ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన నీలం సుఖేందర్ గార్లకు కృతజ్ణతలు తెలియజేశారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రస్తుత పదవీకాల అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన నల్ల భాస్కర్ గుప్త, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లు ప్రకటించారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు నల్ల భాస్కర్ తెలిపారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ సారి ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. దీని తోపాటు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి, శ్రీధర్ బండారు గార్లను ప్రకటించి ఎన్నుకోవడం జరిగింది.నూతన కార్యవర్గం కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు నల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్య, సరావేణి విజయ కుమార్ ఉన్నట్టు తెలిపారు.మాజీ అధ్యక్షుడు రమేష్ బాబు గడప, తన పదవీకాలంలో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన అసాధారణ, అద్భుతమైన సేవలను ఏవి (AV) రూపంలో ప్రదర్శించి కార్యనిర్వాహక సభ్యులందరూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. గత పన్నెండు సంవత్సరాలుగా రమేష్ బాబు గడప అందించిన సేవలను పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, నీలం మహేందర్ గార్లు ఘనంగా కొనియాడారు. గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో భాగమై రెండు సార్లు అధ్యక్షుడిగా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ సేవలందించిన దుర్గా ప్రసాద్, సుగుణాకర్ రెడ్డి గార్లకు కార్యనిర్వాహక సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి కార్యనిర్వాహక సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీని ఆస్వాదించారు.(చదవండి: అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్)
హైదరాబాద్కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
అటా మహాసభలు.. జర్నలిజంలో రవికాంత్రెడ్డికి అవార్డ్
సాక్షి,హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహసభలు శనివారం అమెరికాలోని బాల్టిమోర్లో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ల నుండి భారీ ఎత్తున వివిధ రంగాల ప్రముఖులు తొలి రోజు ఆరంభవేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎంఎల్ఎలు సినీ,సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరైయ్యారు.దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు సంస్కృతిని చాటిచెప్పే కళాప్రదర్శనలు నిర్వహించారు.వివిధ రంగాల్లో విశేషసేవ చేసిన 15 మంది ప్రముఖులను ఆటా అవార్డులతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఆర్.రవికాంత్రెడ్డి(జర్నలిజం) డాక్టర్ రవీందర్(వైద్యం), కిరణ్ చుక్కపల్లి(ఇండస్ట్రీ) తదితరులను ఆటా మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి సత్కరించారు.
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు
క్రైమ్
ఈ వయసులో ఇలాంటి డ్రామా చేయడం సిగ్గుచేటు!
సంచలనాలకు కేరాఫ్ నటి త్రిష అంటే అతిశయోక్తి కాదు. మోడలింగ్ రంగం నుంచి సినీ రంగంలోకి ఎంట్రి ఇచ్చిన ఈ మిస్ చెన్నై.. జోడి అనే చిత్రంలో నటి సిమ్రాన్కు స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో మెరిసి మాయమైయ్యారు. అలాంటి త్రిష ఇండియన్ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికిగా వెలిగి పోతాలని బహుశా ఆమే ఊహించి ఉండరు. ఆ తర్వాత తమిళం,తెలుగు చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. కెరీర్ పరంగా రెండు దశాబ్దాలను అధిగమించినా ఇప్పటికీ ఎవర్గ్రీన్ హీరోయిన్గా సత్తా చాటుతున్నారు. తాజాగా సూర్య సరసన నటించిన కరుప్పు చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలోనే కార్తీకి జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇటీవల సినీ, రాజకీయ వర్గాల్లో పలు వివాదాల్లో చిక్కుకుని త్రిష వార్తల్లో నానుతున్నారు. అయినా తగ్గేదేలేదు అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె ఏమన్నారంటే ‘‘ ఈ వయసులోనూ ఇంత నాటకం సిగ్గు చేటు. పోయి డబ్బు సంపాదించి ప్రశాంతంగా జీవించండి’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. త్రిష మాటల్లో అర్థం ఏంటి? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? అనే ప్రశ్నలను సంధిస్తున్నారు నెటిజన్లు.
ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో వీడని మిస్టరీ..!
నల్లగొండ: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్యకు సంబంధించి మృతురాలి ఇంటి పక్కన గత కొన్నిరోజులుగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను కూడా విచారిస్తున్న ట్లు సమాచారం. కాగా శుక్రవారం రూపారెడ్డి అంత్యక్రియలను హైదరాబాద్లోని గుర్రంగూడలో ఆమె స్వగృహం సమీపంలోని సాహెబ్నగర్ హిందూ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు పూర్తిచేశారు. పలు కోణాల్లో దర్యాప్తు..రూపారెడ్డి హత్య వెలుగులోకి వచ్చిన బుధవారం నుంచి ఇప్పటి వరకు పోలీసులు మృతురాలి బంధువులతో కలుపుకొని 50 మందిని విచారించినట్లు సమాచారం. పోలీసులకు లభించిన సీసీ పుటేజీ ద్వారా సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సున్న ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన వ్యక్తి గురించి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా మృతురాలి కాల్ డేటాతో పాటు ఆమె భర్త రాజేంందర్రెడ్డి కాల్ డేటాను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.
ఆటోపై కుక్క మూత్రం పోసిందని..
ఖమ్మం క్రైం: ఆటోపై కుక్క మూత్ర విసర్జన చేసిందనే కారణంతో మొదలైన వివాదం తీవ్రరూపం దాల్చగా ఓ యువకుడి మృతికి దారి తీసింది. అయితే, ఘర్షణ పడిన ఇద్దరి మధ్య పాత ఘర్షణలు ఉండడం గొడవ పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలో ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన కుటుంబాలుఖమ్మం రూరల్ మండలం పోలేపల్లికి చెందిన ఉండేటి ఏసు – నాగమణి దంపతులకు కుమారుడు శ్రీనాధ్ అలియాస్ పండు(24), కుమార్తె ఉన్నారు. శ్రీనాధ్ చిన్నప్పటి నుంచి త్రీటౌన్ ప్రాంతంలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలో అమ్మమ్మ వెంకటమ్మ, మేనమామ రాజు వద్ద ఉంటూ ఫ్లెక్సీ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆయన తల్లిదండ్రులు టేకులపల్లిలోని డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్నారు. ఇక రంగనాయకుల గుట్ట వద్దే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన వేముల యల్లమ్మ తన కుమారుడైన మధుతో కలిసి కూలీ పనులు చేస్తూ అద్దె ఇంట్లో జీవిస్తోంది. కాగా, శ్రీనాధ్ – మధుకు మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈక్రమాన గురువారం రాత్రి 11గంటలు దాటాక మ«ధు తన పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లగా శ్రీనాధ్, ఆయన స్నేహితుడు వీరేశ్తో కలిసి ఆటోలో కూర్చున్నారు. ఈమేరకు కుక్క వారు కూర్చున్న ఆటోపై మూత్రవిసర్జన చేయడమే కాక చీకట్లో ఉన్న శ్రీనాధ్, ఆయన స్నేహితుడిని చూసి మొరిగింది. దీంతో కావాలనే మధు తమపై కుక్కను ఉసిగొల్పాడని భావించి వాగ్వావాదానికి దిగారు. ఈక్రమాన ‘కుక్కను కట్టేసి వచ్చి సంగతి చూస్తా’ అంటూ మధు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి శ్రీనాధ్, వీరేశ్ ఆయన ఇంటికి వెళ్లి గొడవ పడుతూ కర్రలతో కొట్టుకున్నారు. దీంతో క్షణికావేశంతో మధు ఇంట్లోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకొచ్చి శ్రీనాధ్ను పలుమార్లు పొడవగా తీవ్ర రక్తస్రావంతో ఆయన సమీపంలోని డ్రెయినేజీలో పడి అపస్మారక స్థితికి చేరాడు. ఈలోగా శ్రీనాధ్ అమ్మమ్మ, మేనమామ చేరుకుని పెద్దాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.పోలీసుల అదుపులో నిందితుడు?ఘటన సమాచారం అందుకున్న నగర ఏసీపీ రమణమూర్తి, త్రీటౌన్ సీఐ మోహన్బాబు, సిబ్బంది వచ్చేసరికి మధు పారిపోయాడు. కాగా, శ్రీనాధ్ మృతదేహంపై ఏడు కత్తిపోట్లు ఉండగా, పేగులు సైతం బయటకు రావడంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని మార్చురీకి తరలించగా స్నేహితులు భారీగా తరలివచ్చారు. అలాగే, కాంగ్రెస్ నాయకులు రుద్రగాని ఉపేందర్, నల్లపు శ్రీను ఆయన కుటుంబీకులను పరామర్శించారు. మూడేళ్ల పంపింగ్ వెల్రోడ్డులో జరిగిన ఘర్షణలో సాయి అనే వ్యక్తి కత్తిపోట్లతో మృతి చెందా డు. మళ్లీ ఇప్పుడు తరహా గొడవ జరగడం గమనార్హం. కాగా, పరారీలో ఉన్న మధును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క పోసుమార్టం అనంతరం శ్రీనాధ్ మృతదేహాన్ని రంగనాయకుల గుట్ట వద్ద ఇంటికి తీసుకొచ్చాక స్వగ్రామమైన పోలేపల్లికి తీసుకెళ్లారు. ఈక్రమాన పోలీసులు బందోబస్తు చేపట్టారు.
గుప్తనిధులకై తండ్రికి వల.. బాలికతో నగ్న పూజలు!
ఆంధ్రప్రదేశ్, కడప: క్షుద్ర పూజలకు అడ్డుపడుతున్నాడనే వల్లూరులో బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యాయత్నానికి నిందితులు ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను వల్లూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన కారు, వేటకత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, కమలాపురం సీఐ మోహన్, వల్లూరు ఎస్సై శివనాగిరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారి కథనం ప్రకారం..డబ్బు ఆశ చూపి బాలికతో నగ్న పూజలుచిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన కాణిపాకం విజయ్కుమార్ అలియాస్ విజయ్, చిత్తూరు టౌన్ దుర్గానగర్కు చెందిన కర్ణం బాల హేమనాథ్ అలియాస్ హేమంత్, అదే ప్రాంతానికి చెందిన కర్ణం హేమనాథ్ బాల సుబ్రహ్మణ్యం ఒక ముఠాగా ఏర్పడ్డారు. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేయాలని నిర్ణయించారు. వీరు అనంతపురం జిల్లా శెట్టూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక తండ్రితో పరిచయం చేసుకుని డబ్బు ఆశ చూపి నగ్న క్షుద్ర పూజలు నిర్వహించారు.అనంతరం గుప్తనిధుల విషయమై కడపకు చెందిన వెంకటేష్ యాదవ్ను సంప్రదించగా, మరోసారి పూజలు చేయాలని బాలికను కడపకు తీసుకురావాలని సూచించాడు. ఈ క్రమంలో ఈ నెల 9న కారులో బాలికను, ఆమె తల్లిని కడపకు తీసుకొచ్చారు. అయితే వెంకటేష్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో బాలికను, ఆమె తల్లిని వల్లూరులోని విజయ్కుమార్ స్నేహితురాలు భాగ్యలక్ష్మి ఇంటికి తీసుకెళ్లారు. అయితే భాగ్యలక్ష్మి కొడుకు నాగ సాయి ప్రణవ్కు వీరిపై అనుమానం వచ్చింది. తన తల్లితో విజయ్కుమార్ సన్నిహితంగా ఉండటంతో అసలు వచ్చినవారెవరని ఆరా తీశాడు.దీంతో క్షుద్రపూజలకు ప్రణవ్ అడ్డుగా ఉన్నాడని నిందితులు ఈ నెల 10న అతడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో హతమార్చేందుకు దాడి చేశారు. అయితే ప్రణవ్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. నిందితులు పరారయ్యారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులు విజయ్కుమార్, హేమంత్, సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే అనంతపురంలో నిర్వహించిన క్షుద్రపూజలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కేసును అనంతపురానికి బదిలీ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈ కేసులో భాగ్యలక్ష్మి, వెంకటేష్ యాదవ్ పాత్రలపై లోతుగా దర్యాప్తు సాగిస్తున్నట్టు పేర్కొన్నారు.
వీడియోలు
ఆంక్షల మధ్య జగన్ పర్యటన.. పొలాల్లోంచి కూడా తరలివచ్చిన జనం
విశ్వనాథ్ & సన్స్ హిట్టా..? ఫట్టా..?
స్వాతంత్య్ర వేడుకల్లో షాక్.. స్టేజ్ పైనే కుప్పకూలిన మంత్రి ఆనం
అనంతపురంలో హైటెన్షన్.. 15 గంటల పాటు హైడ్రామా.. లాయర్ గౌతంరాజుకి సీఐ క్షమాపణ
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
సీఎం విజయకు త్రిష సెల్యూట్
కెవ్వు కేక... ఈ సారి అమిత్ షా కాళ్ళు పట్టుకున్న సరే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు
YSRCP కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మేకప్ అంటే ఊగిపోయారు.. ఒక అమ్మాయి మెడపై కారు ఎక్కిస్తే ఏం పీకారు
ఎవరిని కాపాడటం కోసం చూస్తున్నారు! ఏపీ ప్రభుత్వం పై ప్రియాంక తండ్రి సంచలన కామెంట్స్


