విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం
చెన్నై: విజయ్ ప్రభుత్వం కీలక చట్టం చేసింది. అసెంబ్లీతో పాటు ఇతర ఏ ప్రభుత్వ కార్యక్రమాలలోనైనా రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను తప్పనిసరిగా ముందుగా ఆలపించాలని నిబంధనలు చేస్తూ చట్టం చేసింది. ఈ తీర్మానాన్ని డీఎంకే, ఏఐడీఎంకేతో పాటు ఇతర పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇటీవలే వందేమాతరంపై ప్రత్యేక చట్టం తీసుకవచ్చిన నేపథ్యంలో ఈ చట్టం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశమై తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మాట్లాడుతూ తీర్మానం ఆమోదించబడిందని తెలిపారు. దీని అమలుకు ఇక ఎలాంటి అదనపు అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ తీర్మానం ప్రకారం విద్యాసంస్థలు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు వంటి అనేక చోట్ల జరిగే అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో తమిళ్ తాయ్ వాజ్త్తును మొదటగా ఆలపించాలి.సీఎం విజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమిళ గీతానికే తొలి ప్రాధాన్యత ఉండాలని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర భాషా హక్కులు, సాంస్కృతిక హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీకి వెళ్లబోదన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఉద్వేగభరితంగా ప్రసంగించిస్తూ " తమిళం ఒక భాష మాత్రమే కాదు.. మా జీవనాడి మా భావోద్వేగం. మాతృభాష ఎంత పవిత్రమో, తల్లి ఎంత పవిత్రమో తమిళం కూడా అంతే పవిత్రమైనది తమిళం అంటే గర్వం. తమిళం అంటే శక్తి. ‘తమిళం’ అనే మాట వినగానే తమిళనాడు మొత్తం ఒక్కటై నిలబడుతుంది. తమిళ్ తాయ్ వాజ్తుకు తమిళనాడులో మొదటి స్థానం ఉండాలి. తమిళ్ తాయ్ వాజ్తుకు తొలి స్థానం ఇవ్వడం మా హక్కు” అని విజయ్ పేర్కొన్నారు.కాగా ఇటీవల తమిళ రాష్ట్ర గీతం అధికారిక కార్యక్రమాల్లో చివరగా పాడడంతో వివాదం చెలరేగింది. ఈ ఏడాది మేలో ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో తొలుత జాతీయ గీతం, ఆ తర్వాత జాతీయ జాతీయ గీతం ఆలపించి, చివరగా తమిళ్ తాయ్ వాజ్తును ఆలపించారు. దీంతో వివాదం చెలరేగింది.అనంతరం కొన్ని వారాల తర్వాత విజయ్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా తమిళ్ తాయ్ వాజ్తు మూడో స్థానానికి వెళ్లింది. దీంతో దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగింది. దీనిపై గవర్నర్కు 21 మంది ఎంపీల లేఖఅధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాజ్తును మొదటగా, జాతీయ గీతాన్ని కార్యక్రమం చివరలో ఆలపించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు గవర్నర్ను కోరారు.ఈ పరిణామాలన్నింటి మధ్య ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ తమిళ్ తాయ్ వాజ్త్తుకు రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం పొలిటికల్ హీట్గా మారింది.
2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు!
ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం భారతదేశంలో రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. దీంతో.. ఈవీ పరిశ్రమలు, అనుబంధ సంస్థలు కూడా విస్తరిస్తున్నాయి. వాహనాల తయారీ, బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు, సర్వీసింగ్, సాఫ్ట్వేర్, ఫ్లీట్ మేనేజ్మెంట్, బ్యాటరీ రీసైక్లింగ్ వంటి అనేక రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని 'అడెక్కో ఇండియా' తన నివేదికలో వెల్లడించింది.అడెక్కో ఇండియా డేటా ప్రకారం.. 2030 నాటికి భారతదేశ ఈవీ రంగం 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. అయితే.. ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం నేరుగా వాహనాల తయారీకి సంబంధించినవి కాకపోవడం గమనార్హం. ఇందులో కేవలం 10-15 శాతం మాత్రమే ప్రత్యక్ష ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది.అంటే.. ఒక వ్యక్తి కార్లు లేదా బైకులు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేయకపోయినా ఈవీ రంగంలో ఉద్యోగం పొందవచ్చు. ఛార్జింగ్ స్టేషన్ నిర్వహణ, బ్యాటరీ సర్వీసింగ్, డ్రైవర్ ట్రైనింగ్, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్, లాజిస్టిక్స్, రీసైక్లింగ్ వంటి రంగాల్లో కూడా మంచి అవకాశాలు రావచ్చు. తయారీ రంగం మాత్రం ఈవీ ఉద్యోగాల్లో ప్రధాన పాత్ర పోషించనుంది. కాబట్టి మొత్తం ఈవీ ఉద్యోగ డిమాండ్లో సుమారు 50-55 శాతం తయారీ రంగం నుంచి ఉండవచ్చని ఒక అంచనా.ఈవీ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి భవిష్యత్తులో మంచి జీతాలు కూడా లభించే అవకాశం ఉంది. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, ఛార్జింగ్ సిస్టమ్స్, టెలిమాటిక్స్ వంటి కొత్త నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. అడెక్కో ఇండియా ప్రకారం, ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారు సాధారణ ఉద్యోగుల కంటే కూడా 45 శాతం ఎక్కువ జీతం పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత ఆటోమొబైల్ కార్మికులు కూడా కొత్త ఈవీ టెక్నాలజీలను నేర్చుకోవడం చాలా ముఖ్యం.ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలతో.. కమర్షియల్ ఫ్లీట్లు, టాక్సీలు, డెలివరీ వాహనాలు వంటి రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. వాహనాల బ్యాటరీ పనితీరును గమనించడం, ఛార్జింగ్ సమయాలను నిర్వహించడం, రూట్లను ప్లాన్ చేయడం, వాహనాలను సర్వీస్ చేయడం వంటి పనులకు ప్రత్యేక సిబ్బంది అవసరం అవుతారు. అయితే.. ఈ ఉద్యోగాల్లో కొన్ని మొదట కాంట్రాక్ట్ లేదా ఫ్లెక్సీ ఉద్యోగాలుగా రావచ్చు.
'టాక్సిక్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?
న్యూఢిల్లీ: రాబోయే ఆగస్టు 15(2026)న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. అయితే, ఈ ఏడాది అంటే 2026లో దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోందా లేక 80వదా అనే అంశంపై ప్రజల్లో కొంత సందిగ్ధత నెలకొంది.ఈ గందరగోళానికి ప్రధాన కారణం లెక్కింపు విధానమే. చాలామంది స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయనే కోణంలో లెక్కిస్తున్నారు. దీని ప్రకారం, 2026 నుండి 1947ని తీసివేయగా 79 సంవత్సరాలు వస్తుంది. అంటే ఆగస్టు 15, 2026 నాటికి భారత్ స్వాతంత్ర్యం పొంది 79 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అయితే 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు మనం జరుపుకున్న మొత్తం స్వాతంత్ర్య దినోత్సవాల సంఖ్యను లెక్కిస్తే వేరే లెక్క వస్తుంది.1947లో మొదటి స్వాతంత్ర్య దినోత్సవం జరుగగా, 1948లో రెండవది, ఇలా ప్రతి ఏటా కలుపుకుంటూ వస్తే 2026 నాటికి ఇది 80వ స్వాతంత్ర్య దినోత్సవం వస్తుంది. దీనిని లెక్కించేందుకు 2026 - 1947 + 1 సూత్రాన్ని ఉపయోగిస్తారు. దీనిని బట్టి స్పష్టత ఏమిటంటే, ఆగస్టు 15, 2026న మనం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే భారత్ స్వాతంత్య్రం సాధించి, 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నదన్నమాట.ఇది కూడా చదవండి: గర్భస్థ పిండం నోటిలో మరో పిండం.. షాక్లో వైద్యులు!
బాలకృష్ణ స్టెప్.. పశ్చాత్తాపడుతున్న శేఖర్ మాస్టర్
చరిత్ర సృష్టించనున్న టీమిండియా
పరిచయం లేని క్రీడలో భారత్కు కాంస్యం.. ఏమిటీ సెపక్ టక్రా?
తెలంగాణ గొప్పతనం గురించి చెబుతూ హీరోయిన్ ఎమోషనల్
జియో రీచార్జ్: ఇవి టెన్షన్ లేని మంత్లీ ప్లాన్లు!
అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: సారా టెండుల్కర్
విపక్షాల ఒత్తిళ్లతో దిగొచ్చిన కేంద్రం!
బాల్టిమోర్లో 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం
ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. వీరి రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా!
12న స్టాక్ ట్రేడింగ్ బంద్! కొత్త రూల్పై ఆగ్రహం
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
హెరిటేజ్ - విజయ డెయిరీ
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సాక్షి కార్టూన్ : 08-08-2026
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
ఉద్యోగుల సెలవుల్లో మార్పులు చేసిన యాక్సెంచర్
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
‘యముడు’ మూవీ రివ్యూ
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?
బాలకృష్ణ స్టెప్.. పశ్చాత్తాపడుతున్న శేఖర్ మాస్టర్
చరిత్ర సృష్టించనున్న టీమిండియా
పరిచయం లేని క్రీడలో భారత్కు కాంస్యం.. ఏమిటీ సెపక్ టక్రా?
తెలంగాణ గొప్పతనం గురించి చెబుతూ హీరోయిన్ ఎమోషనల్
జియో రీచార్జ్: ఇవి టెన్షన్ లేని మంత్లీ ప్లాన్లు!
అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: సారా టెండుల్కర్
విపక్షాల ఒత్తిళ్లతో దిగొచ్చిన కేంద్రం!
బాల్టిమోర్లో 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం
ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. వీరి రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా!
12న స్టాక్ ట్రేడింగ్ బంద్! కొత్త రూల్పై ఆగ్రహం
చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి..! ఆఖరికి స్వలింగ సంపర్కుడైన కుమారుడి కోసం..
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
హెరిటేజ్ - విజయ డెయిరీ
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
పరిపాలన ప్రైవేట్కు ఇవ్వడం కుదర్దు వెళ్లవయ్యా.. వెళ్లు!
సాక్షి కార్టూన్ : 08-08-2026
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
ఏదడిగినా.. అలా ఖాళీ జేబులు చూపిస్తున్నారు!!
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
‘వెండి’ మండిపోతుంది: కియోసాకి భారీ అంచనా
ఉద్యోగుల సెలవుల్లో మార్పులు చేసిన యాక్సెంచర్
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
‘యముడు’ మూవీ రివ్యూ
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?
ఫొటోలు
'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'గజ'మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు)
లంగా ఓణీలో టాలీవుడ్ ముద్దుగుమ్మ (ఫొటోలు)
హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
'టాక్సిక్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
హైదరాబాద్ లో ఘనంగా బోనాల పండుగ (ఫొటోలు)
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సారె సంబరం (ఫొటోలు)
విశాఖపట్నంలో అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
సినిమా
తెలంగాణ గొప్పతనం గురించి చెబుతూ హీరోయిన్ ఎమోషనల్
ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుక సందడిగా జరిగింది. పలు దేవాలయాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలైన విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా తదితరులు కనిపించారు. ఇక మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో 'జాతిరత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొంది. తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించింది. అలానే తెలంగాణ కల్చర్ గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: 'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం)'చాలా కొత్తగా ఉంది. తెలంగాణ కల్చర్ అంటే ఇలానే ఉంటది. అందరినీ అంగీకరిస్తారు. అందరితో కలిసి ఉంటారు. అది బెస్ట్' అని ఫరియా భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే పోతురాజులతో కలిసి ఆకట్టుకునే డ్యాన్స్ కూడా చేసింది. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.వేరే మతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ బోనాల్లో పాల్గొని ఫరియా మతసామరస్యం చాటుకుంది. కెరీర్ విషయానికొస్తే.. జాతిరత్నాలు తర్వాత బంగార్రాజు, లైక్ షేర్ సబ్స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి, గాయపడ్డ సింహం చిత్రాల్లో నటించింది.(ఇదీ చదవండి: నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా': హీరోయిన్ దుషార)తెలంగాణ కల్చర్ గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఫరియా అబ్దుల్లా..,❤️🥹🙌🏻తెలంగాణ వాళ్ళు అందరినీ ఆక్సెప్ట్ చేస్తారు..అందరితో కలిసి ఉంటారు ఇది నిజంగా బెస్ట్…🙌🏻_ @fariaabdullah2 pic.twitter.com/Lt1muoc6VF— ChAnduBRS✊🏻 (@IamPRVChAnduBRS) August 10, 2026Unmatched Energy And Full-On Bonalu Vibes! ❤️🔥🔥@FariaAbdullah Bringing Her Own Spark To The #Bonalu Festival In Hyderabad. Absolutely Love The Energy! 💃#Bonalu2026 #FariaAbdullah pic.twitter.com/SwrZYJBzR5— Hari SaaHo (@HariSaaho19) August 9, 2026
‘కిరాయి కోటిగాడు’గా మహేశ్.. వీడియో అదిరింది!
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు నిన్న (ఆగస్టు 9) సోషల్మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ప్రత్యేక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సందీప్ ఏఐ వీడియోతో శుభాకాంక్షలు చెప్పగా.. మహేశ్ ఫిదా అయ్యాడు. లెంజడరీ నటుడు కృష్ణ నటించిన ‘కిరాయి కోటిగాడు’ సినిమాలో చెప్పిన ఓ డైలాగ్ను ఏఐతో రీక్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. భద్రకాళి పిక్చర్, టి. సిరీస్ బ్యానర్స్పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. త్రిప్తి దిమ్రి హీరోయిన్. మహేశ్ బాబు విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంతో 2027లో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga)
అమితాబ్తో నటించాలనే కోరిక.. కోమాలో పాత్ర
బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, నటనలతో అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ 18వ సీజన్ తొలి ఎపిసోడ్లో అమిర్ఖాన్, సన్నీడియోల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బచ్చన్ కుటుంబంతో కలిసి పనిచేసిన జ్ఞాపకాల్లో తనకు అత్యంత ఇష్టమైనది ఏంటని ప్రీతిని అడగ్గా.. ఓ సరదా సంఘటన గుర్తుచేసుకుంది.‘బచ్చన్ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తా, గౌరవిస్తా. అమిత్జీతో కలిసి నటించాలని చాలా రోజులుగా ఎదురుచూశాను. అందుకోసం చాలా ప్రయత్నించాను. చివరకు 2003లో వచ్చిన ‘అర్మాన్’లో ఆయనతో నటించే అవకాశం వచ్చింది. దర్శకురాలు హనీ ఇరానీతో ఈ సినిమాలో అమిత్జీతో నాకు ఒక్క సీన్ అయినా ఉండాలని అడిగాను. అందుకు హనీ ఇరానీ సరదాగా.. ‘‘అమిత్జీతో నటించాలని అంతగా కోరుకుంటున్నావా? అయితే ఆ సీన్లో నువ్వు చనిపోవాల్సిందే’’ అన్నారు. దీంతో మూవీ నా పాత్రని కోమాలో ఉండేలా పెట్టారు. నేను కోమాలో ఉన్నట్లు నటించాలి. అమిత్జీ నా దగ్గరకు వచ్చారు. ఆయన ఎదురుగా ఉండటంతో తెగ భయపడిపోయాను. చనిపోయినట్లు నటించడం ఎంత కష్టమో అప్పుడే తెలిసింది. నేను కదులుతుండటంతో.. ‘ప్రీతి సీన్ పాడుచేస్తున్నారు.. మీరు కదులుతున్నారు’ అని టీమ్ వాళ్లు నాపై కోపంగా అరిచేవాళ్లు’ అని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది.2003లో రిలీజైన ‘అర్మాన్’లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలు చేశారు. ప్రీతి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. వెంకటేశ్ సరసన ‘ ప్రేమంటే ఇదేరా’, మహేశ్ రాజకుమారుడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. వీరి రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా!
తమిళ హీరో అధర్వ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇదయం మురళి’. థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ నెట్ఫ్లిక్స్లో రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కనిపించడంతో వాళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్స్ ఎంతన్నదానిపై ఆసక్తి నెలకొంది. మరి ఎంత తీసుకున్నారంటే..ధర్వ మురళి: ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు టాక్. ప్రీతి ముకుందన్: ఈ సినిమాకు సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు తీసుకుందట.కయాదు లోహర్: ఈ బ్యూటీ రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.నిహారిక ఎన్ఎం: ఆమెకు ఈ సినిమాకు సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పారితోషికం అందినట్లు తెలుస్తోంది.నట్టి నటరాజ్: ఈ సినిమాకు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందుకున్నట్లు సమాచారం. తమన్: ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్. ఈయన యాక్టర్గానూ ఈ సినిమాలో కనిపించారు. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.మాళవిక మోహనన్: ఆమె సుమారు రూ.3 కోట్ల వరకు తీసుకున్నారని సమాచారం.ఫహాద్ ఫాజిల్: సాధారణంగా ఒక్కో సినిమాకు ఫహాద్ రూ.7 కోట్ల వరకు తీసుకుంటారట.మొత్తంగా ‘ఇదయం మురళి’లో అధర్వ మురళితో పాటు ఫహాద్ ఫాజిల్, మాళవిక మోహనన్, కయాదు లోహర్, తమన్ వంటి పలువురు ప్రముఖులు కనిపించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
క్రీడలు
అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: సారా టెండుల్కర్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తి తారసపడేంత వరకు పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. తన తల్లిదండ్రుల మధ్య బలమైన స్నేహ బంధం ఉందని.. అదే వారి అన్యోన్య దాంపత్యానికి పునాది అని పేర్కొంది.కాగా సచిన్ టెండుల్కర్ కెరీర్ తొలి నాళ్లలోనే డాక్టర్ అంజలితో ప్రేమలో పడ్డాడు. క్రికెటర్గా నిలదొక్కుకున్న తర్వాత ఇరుకుటుంబాలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వయసులో సచిన్ కంటే అంజలి ఆరేళ్లు పెద్ద. అయితే, ఇదేమీ వారి ప్రేమకు అడ్డంకి కాలేదు.అక్క కంటే ముందే తమ్ముడి పెళ్లిముప్పై ఏళ్లకు పైగా వివాహ బంధంలో కొనసాగుతున్న సచిన్- అంజలి నేటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా తొలుత కుమార్తె సారా.. ఆ తర్వాత అర్జున్ జన్మించారు. సారా న్యూట్రీషనిస్ట్. అదే విధంగా మెడల్, కంటెంట్ క్రియేటర్గా కొనసాగుతూ.. వెల్నెస్ బిజినెస్లోనూ అడుగుపెట్టింది.మరోవైపు.. అర్జున్ క్రికెటర్గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే, అక్క సారా కంటే ముందే అర్జున్ పెళ్లి పీటలెక్కాడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెప్పిన సానియా చందోక్తో ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. అయితే, 28 ఏళ్ల సారా ఇప్పటికీ సింగిల్గానే ఉంది.అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటాఈ నేపథ్యంలో తాజాగా వోగ్ ఇండియాతో మాట్లాడిన సారా టెండుల్కర్ తన కాబోయే భర్త ఎలా ఉండాలన్న అంశంపై స్పందించింది. ‘‘నా తల్లిదండ్రులు భార్యాభర్తలు అవడానికంటే ముందు మంచి స్నేహితులు. ఇంట్లో వాళ్లిద్దరి సరదాగా గొడవపడుతూ ఉంటారు. వారిద్దరిని చూస్తే ముచ్చటేస్తుంది.వారి బంధం అత్యద్భుతంగా అనిపిస్తుంది. నాకు కూడా అలా స్నేహంగా ఉండే భాగస్వామి రావాలని కోరుకుంటున్నా. నా ప్రాణ స్నేహితులంతా నా సోల్మేట్స్ అనే చెప్తాను. అయితే, నా పార్ట్నర్ను రొమాంటిక్ సోల్మేట్గా చూస్తాను’’ అని సారా పేర్కొంది.ఇక జెన్ జీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘చాలా మంది త్వరత్వరగా నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి సమయం దగ్గరపడినపుడు ఒకవేళ.. సదరు వ్యక్తి తనకు సరైన భాగస్వామి అని అనిపించకపోతే.. నిర్భయంగా ఆ బంధాన్ని రద్దు చేసుకుంటున్నారు.నచ్చకపోతే ఎంగేజ్మెంట్ కూడా రద్దుముందు తరాల వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు భయపడేవారు. కానీ జెన్ జీ నిక్కచ్చిగా తమ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. తమకు ఏదైనా విషయం లేదంటే వ్యక్తి నచ్చలేదు.. సదరు వ్యక్తిలో తప్పు ఉందని భావిస్తే వెంటనే ఆ బంధం నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు.జెన్ జీ ఆత్మవిశ్వాసం, సాధికారిత తమలో ఎక్కువని విశ్వసిస్తున్నారు’’ అని సారా పేర్కొంది. తాను కూడా తొందరపడి పెళ్లి బంధంలో అడుగుపెట్టబోనని.. సరైన పార్ట్నర్ దొరికినపుడే వివాహం చేసుకుంటానని కుండబద్దలు కొట్టింది. కాగా టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్తో సారా టెండుల్కర్ ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఇలాంటి వదంతులను పట్టించుకోనని సారా కొట్టిపారేసింది.చదవండి: ఆ పేరంటే ద్వేషం: ప్రధాని మోదీతో బాక్సర్
‘షమీ అదొక్కటి చెయ్యు.. నీ రీఎంట్రీ తథ్యం’
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తు ఏంటనేది బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందే చెప్పేశాడు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాము యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహించనున్నామని, షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లు గతంలో టీమిండియాకు విలువైన సేవలు అందించినప్పటికీ ఇప్పుడు అతడి సేవలు జట్టుకు అవసరం లేదని భావిస్తున్నట్లు అగార్కర్ పరోక్షంగా పేర్కొన్నాడు. దీంతో షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అనే వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందనే వార్తలు వినిపిస్తన్నాయి. అయితే బుమ్రా లాంటి టాప్ బౌలర్ తరచూ గాయాల బారిన పడుతుండడం ఇప్పుడు టీమిండియాను ఆందోళనలోకి నెట్టేస్తుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. షమీ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎంపిక కావడం లేదన్న నిరాశను పక్కనబెట్టి జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తూనే ఉండాలని, షమీకి తానిచ్చే సలహా అదొక్కటేనని జహీర్ పేర్కొన్నాడు.‘‘ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది షమీనే. మ్యాచ్లు ఆడుతూ బాగా రాణిస్తే జాతీయ జట్టుకు అందుబాటులో ఉన్నట్టే. ప్రస్తుతం జట్టు ఆలోచన మరోలా ఉండొచ్చు. కానీ ఆటగాడిగా మన ఆలోచన, మనం జట్టుకు ఎలా ఉపయోగపడగలమన్నది ముఖ్యం. షమీ ఇప్పుడు చేస్తున్నదే కొనసాగించాలి. మ్యాచ్లు ఆడటం, రాణించడమే చాలా ముఖ్యం’’ అని జహీర్ చెప్పాడు.ఇక జస్ప్రీత్ బుమ్రా వరుస సిరీస్లకు ఫిట్గా ఉండకపోవడం, సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లు ఫిట్నెస్ కాపాడుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జహీర్ టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడడంపై స్పందించాడు."గాయాలు ఆటలో సహజం. అవి ప్రతి వ్యక్తి ప్రయాణంలో అంతర్భాగం. ఆటగాళ్ల పని భారం తగ్గించడం అవసరమే అయినా.. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా పేసర్ గాయపడినప్పుడు లేదా కష్టమైన దశను ఎదుర్కొంటు న్నప్పుడు మన నియంత్రణలో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. గాయానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే వరకు ముందుకు సాగడం కష్టం" అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.Read: బాడీ షేమింగ్పై ట్రోల్స్.. కట్చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ!
ఆ పేరంటే ద్వేషం: బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్
కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ గెలిచిన 39 పతకాల్లో పది బాక్సింగ్లో వచ్చినవే. అంకుశ్ పంఘాల్, సచిన్ సివాచ్, జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, ప్రియా ఘంఘాస్ స్వర్ణాలతో సత్తా చాటారు.మరోవైపు.. నరేందర్ బెర్వాల్, లవ్లీనా బొర్గొహెన్, జాదుమణి సింగ్ రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కాగా కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాక్సర్ నరేందర్ బెర్వాల్.. పాకిస్తాన్ బాక్సర్తో తనకు జరిగిన సంభాషణ గురించి ప్రధానితో పంచుకున్నాడు.ఆరోజు నేనే గెలిచాను‘‘పాకిస్తాన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి.. నాకొక విషయం గుర్తుకువచ్చింది సర్. 2015 వరల్డ్ మిలిటరీ గేమ్స్.. నా తొలి రౌండ్ మ్యాచ్ పాకిస్తాన్తోనే. అప్పుడు మన మిలిటరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. పాకిస్తాన్ ప్రత్యర్థిపై అస్సలు ఓడిపోవద్దని చెప్పారు. ఆరోజు నేనే గెలిచాను. అయితే, నేను, నా ప్రత్యర్థి ఇద్దరం గాయాలపాలై ఆస్పత్రికి చేరుకున్నాం. ఇద్దరికీ కుట్లు పడ్డాయి. అప్పుడు ఆర్మీ కోచ్గా నరేందర్ రాణా ఉన్నారు. మీరు కూడా అప్పుడే తొలిసారి ప్రధాని అయ్యారు.ఈ పేరును ద్వేషించడం మొదలుపెట్టానుఆ సమయంలో ఆ పాక్ బాక్సర్ నాతో.. ‘సోదరా నీకో మాట చెప్పనా?’ అన్నాడు. సరే ఏమిటో చెప్పమన్నాను. అప్పుడు అతడు.. ‘నీ పేరు నరేందర్. మీ కోచ్ పేరు నరేందర్. మీ ప్రధాన మంత్రి పేరు నరేంద్ర. ఇప్పటి నుంచి ఈ పేరును నేను ద్వేషించడం మొదలుపెట్టాను’ అని అన్నాడు’’ అని నరేందర్ బెర్వాల్ ప్రధాని మోదీకి తెలిపాడు.మోదీ రియాక్షన్ వైరల్దీంతో ప్రధాని మోదీ నవ్వులు చిందించారు. బెర్వాల్తో పాటు అక్కడున్న అథ్లెట్లంతా కూడా నవ్వుకున్నారు. కాగా నరేందర్ బెర్వాల్ భారత సైన్యంలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్. ఆసియా చాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన అతడు.. ఆసియా క్రీడలు-2023లో కాంస్యం గెలిచాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు.ఇదిలా ఉంటే.. పతక విజేతలతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. వారందరినీ అభినందించారు. భారత క్రీడా ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేర్చారని.. క్రీడల పట్ల వారికున్న అంకిత భావాన్ని కొనియాడారు. కాగా గ్లాస్గోలో జరిగిన తాజా కామన్వెల్త్ గేమ్స్లో భారత్ మొత్తంగా 39 పతకాలు గెలిచింది. ఇందులో పదమూడు స్వర్ణాలు, పదిహేడు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. అహ్మదాబాద్ ఇందుకు వేదిక. చదవండి: స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్ యాదవ్కు నో ఛాన్స్?!#WATCH | "Pakistani boxer said to me 'Aapka naam Narender hai, aapke coach ka naam Narender hai, aapke Pradhan Mantri ka naam Narendra hai. Mujhe Narendra naam se nafrat ho gayi hai'..." says Heavyweight boxer and silver medallist Narender Berwal narrating his conversation with a… pic.twitter.com/qvmwO5D2sz— ANI (@ANI) August 10, 2026
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న భారత స్పిన్నర్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వన్డే కప్లో భారత లెగ్స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మరోసారి సత్తా చాటాడు. ఈ టోర్నీలో నార్తంప్టన్షైర్ తరఫున ఆడుతున్న అతడు.. ఆదివారం సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.సోమర్సెట్ బ్యాటర్లను చహల్ తన స్పిన్ మాయాజాలంతో కట్టడి చేశాడు. తొలుత ఆర్చీ వాన్ను ఔట్ చేసిన చహల్.. ఆ తర్వాత జాక్ లీచ్, జేక్ బాల్ వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులు మాత్రమే ఇచ్చి 3/35 గణాంకాలు నమోదు చేశాడు. చహల్ ధాటికి సోమర్సెట్ 47 ఓవర్లలో కేవలం 185 పరుగులకే ఆలౌటైంది.అనంతరం లూక్ పాక్టర్ (85), నాథన్ మెక్స్వీని (69 నాటౌట్) రాణించడంతో నార్తంప్టన్షైర్ 30 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.7 మ్యాచ్ల్లో 15 వికెట్లుఈ టోర్నీలో చహల్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.ప్రస్తుత వన్డే కప్లో చహల్ తీసిన వికెట్లు- తొలి మ్యాచ్లో 2 వికెట్లు- రెండో మ్యాచ్లో 2 వికెట్లు- మూడో మ్యాచ్లో 1 వికెట్- నాలుగగో మ్యాచ్లో 1 వికెట్- ఐదో మ్యాచ్లో 4 వికెట్లు- ఆరో మ్యాచ్లో 2 వికెట్లు- ఏడో మ్యాచ్లో 3 వికెట్లు
న్యూస్ పాడ్కాస్ట్
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం. విజయవాడలో కదంతొక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
అసత్య ప్రచారంలో ఆరితేరిన ఏపీ సీఎం చంద్రబాబు... రెండు మినహా హామీలన్నీ అమలు చేశానంటూ బుకాయింపు...
బీసీ నేతలపై రెడ్బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఏపీలో దగా డీఎస్సీపై దండయాత్ర... రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు విజయవంతం
బిజినెస్
పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్!
విమానాశ్రయాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, ముఖ్యంగా హోటళ్లలో లభించే పబ్లిక్ వైఫై నెట్వర్క్లను వినియోగిస్తున్నారా? అయితే మీ వ్యక్తిగత, అధికారిక డేటా ప్రమాదంలో ఉన్నట్లేనని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరిక జారీ చేసింది. ప్రయాణికులు, కార్పొరేట్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని 'స్టార్మ్-2945' (రష్యా ఆధారిత 'మిడ్నైట్ బ్లిజార్డ్' సమూహం) అనే హ్యాకర్ల ముఠా 'క్యాప్టివ్క్రంచ్' పేరిట ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విభాగం బహిర్గతం చేసింది.దాడి ఎలా జరుగుతుంది?మనం హోటల్ లేదా పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయ్యే సమయంలో కనిపించే 'క్యాప్టివ్ పోర్టల్' (లాగిన్ స్క్రీన్) ఆధారిత నెట్వర్క్ వ్యవస్థలను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. యూజర్లు నెట్వర్క్లో లాగిన్ కాగానే నకిలీ మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ పేజీలు లేదా విండోస్ అప్డేట్, డిఫెండర్ సెక్యూరిటీ స్కాన్, బ్రౌజర్ అప్డేట్ చేసుకోమంటూ నకిలీ పాప్అప్లను చూపిస్తున్నారు. యూజర్లు వీటిని నిజమైనవిగా భావించి క్లిక్ చేయగానే 'కార్న్ఫ్లేక్', 'చోకోషెల్' వంటి మాల్వేర్లు డివైజ్లోకి ప్రవేశిస్తాయి.వచ్చే ముప్పులు-నష్టాలుఈ మాల్వేర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల కంప్యూటర్లు, మొబైళ్లపై పూర్తి నియంత్రణ సాధిస్తారు. బ్రౌజర్లో సేవ్ చేసిన పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు, బ్రౌజర్ కుకీలు, మైక్రోసాఫ్ట్ 365 ఖాతాల యాక్సెస్ను దొంగలిస్తారు. దీనికితోడు పరికరం మైక్రోఫోన్, కెమెరాలను రహస్యంగా ఆన్ చేసి ఆడియో, వీడియోలను రికార్డ్ చేయడం, స్క్రీన్షాట్లు తీయడం వంటి అక్రమాలకు ఒడిగడుతున్నారు.పాటించాల్సిన సురక్షిత చర్యలుప్రయాణాల్లో ఉన్నప్పుడు నమ్మదగని, తెలియని హోటల్ వైఫై కంటే సొంత మొబైల్ డేటా/హాట్స్పాట్ లేదా ఎన్క్రిప్టెడ్ ప్రైవేట్ కనెక్షన్లను ఉపయోగించడమే అత్యంత సురక్షితం.వైఫై కనెక్ట్ అయ్యే సమయంలో సాఫ్ట్వేర్, బ్రౌజర్ లేదా సిస్టమ్ అప్డేట్ చేయమంటూ వచ్చే పాప్అప్లను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.సైబర్ ముప్పులను నివారించడానికి సురక్షిత వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్), మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) ఫీచర్లను ఆన్లో ఉంచుకోవాలి.పబ్లిక్ నెట్వర్క్లు ఏ క్షణమైనా ప్రమాదకరంగా మారవచ్చని, డిజిటల్ భద్రత పట్ల ప్రయాణికులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మహీంద్రా గ్రూప్నకు ఇక ఈమెదే ‘స్ట్రాటజీ’!
మహీంద్రా గ్రూప్ కీలక నాయకత్వ నియామకం చేపట్టింది. కమిన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న శ్వేతా ఆర్యను గ్రూప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ (Group Chief Strategy Officer)గా నియమించింది. ఆమె వచ్చే సెప్టెంబర్ 15 నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సీనియర్ మేనేజ్మెంట్లోనూ ఆమె భాగం కానున్నారు.కొత్త హోదాలో శ్వేతా ఆర్య మహీంద్రా గ్రూప్ స్ట్రాటజీ ఆఫీస్కు నాయకత్వం వహిస్తారు. గ్రూప్లోని వివిధ వ్యాపారాల్లో వృద్ధి అవకాశాలను గుర్తించడం, ఉన్న వ్యాపారాల్లో విలువను పెంచడం, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను సాధించడం వంటి అంశాలపై ఆమె దృష్టి సారించనున్నారు. ఆమె గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యురాలిగా ఉంటూ, గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షాకు రిపోర్ట్ చేస్తారు.23 ఏళ్లకు పైగా అనుభవంశ్వేతా ఆర్యకు ఆటోమోటివ్, ట్రావెల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం వంటి విభిన్న రంగాల్లో 23 ఏళ్లకు పైగా వ్యాపార, వ్యూహాత్మక నాయకత్వ అనుభవం ఉంది. కమిన్స్లో చేరకముందు ఆమె థామస్ కుక్ ఇండియాలో స్ట్రాటజీ, విలీనాలు-కొనుగోళ్ల (M&A) విభాగాలను నడిపించారు. అంతకుముందు కీర్నీ, ఇన్ఫోసిస్ సంస్థల్లోనూ వివిధ బాధ్యతలు నిర్వహించారు.కమిన్స్ ఇండియాలో ఆమె 2024 సెప్టెంబర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అంతకుముందు సంస్థలో స్ట్రాటజీ లీడర్గా, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లీడర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె కమిన్స్ ఇండియా పవర్ సిస్టమ్స్ బిజినెస్కు నాయకత్వం వహిస్తూ, పవర్ జనరేషన్, ఇండస్ట్రియల్ వ్యాపారాల్లో వృద్ధి, మార్కెట్ విస్తరణపై పనిచేస్తున్నారు.
ITR-4: లెక్కలు లేకున్నా.. సక్రమంగా రిటర్నులు
ఈ వారం ఫారం 4 గురించి తెలుసుకుందాం. ‘లెక్కలు’ అనగానే వ్యాపారం/వృత్తులకు వర్తిస్తాయి. జీతాలు, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతర ఆదాయాలు.. వీటిలో దేనికి దానికే ప్రత్యేకంగా, చట్టపరంగా బుక్స్ రాయాలి. ఆదాయం పన్ను చట్టంలో ‘అకౌంటు బుక్స్’.. అంటే, ఏమిటో నిర్వచనం ఇచ్చారు. దీని ప్రకారం బుక్స్ని నిర్వహించండి. కొంత టర్నోవరు, వసూళ్లు దాటితే ఆడిట్ చేయాలి. కానీ, ఒక మినహాయింపు ఇచ్చారు. మీరు అకౌంట్ బుక్స్ రాయనవసరం లేదు. ఆడిట్ వైపే వెళ్లక్కర్లేదు.ఫారం ఐటీఆర్ – 4 అంటే ఏమిటి.. 🔷 వ్యక్తులు/హిందూ ఉమ్మడి కుటుంబం, భాగస్వామ్య సంస్థలు 🔷 రెసిడెంట్లు అయి ఉండాలి 🔷 సంవత్సరంలో ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు 🔷 పాత చట్టం ప్రకారం 44 ఏడీ, 44ఏడీఏ, 44 ఏఈల వ్యాపారం ఉండాలి. 🔷 వ్యాపారం/వృత్తి ఆదాయంతో పాటు జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం, వ్యవసాయం ఆదాయం రూ. 5,000 లోపల, నిర్దేశించిన ఇతర ఆదాయాలు 🔷 నాన్–రెసిడెంట్లు, రూ. 50,00,000 ఆదాయం దాటినవారు, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ వారు, లాంగ్టర్మ్లో రూ. 1,25,000 దాటిన వారు, కంపెనీ డైరెక్టర్లు, రెండు ఇళ్ల మీద ఆదాయం ఉన్నవారు, లాటరీ ఆదాయం ఉన్నవారు.. వీళ్లంతా ఈ ఫారం వేయకూడదు.44ఏడీఏ అంటే ఎవరు.. వృత్తి నిపుణులు – లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్, అకౌంటింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డెకరేషన్.. వీరందరూ, వారి టర్నోవరు/వసూళ్లు.. సంవత్సరానికి రూ. 50,00,000 దాటకపోతే.. వ్యవహారాల్లో 5 శాతం లోపల నగదు లావాదేవీలు జరిపితే రూ. 75,00,000 దాటకపోతే, వీరు 50 శాతం ఆదాయంగా చూపించాలి.44 ఏడీ అంటే ఎవరు.. పై సెక్షన్ వృత్తి నిపుణులకు వర్తిస్తే, ఈ సెక్షన్ వ్యాపారస్తులకు, టర్నోవరు/వసూళ్లు రూ. 2 కోట్లు దాటకూడదు. 5 శాతం నగదు వ్యవహారాలు దాటకుండా ఉంటే రూ. 3 కోట్లు. వీరు ఈ టర్నోవరుపైన 6 శాతం చొప్పున లాభం ప్రకటించాలి. 6 శాతం దాటి చూపినా ఫర్వాలేదు. కానీ 6 శాతం కన్నా తక్కువ చూపిస్తే బుక్స్ రాసి ఆడిట్ చేయించాలి. ఇదంతా బ్యాంకింగ్ చానల్. నగదు వ్యవహారాలైతే 8 శాతం చొప్పున చూపించాలి.44ఏఈ ఎవరంటే.. ఇది కేవలం ట్రాన్స్పోర్ట్ వ్యాపారస్తులకే వర్తిస్తుంది. సొంతంగా గానీ.. అద్దెకు గానీ, లీజుగా గానీ కేవలం 10 వాహనాలు లేదా తక్కువ ఉండాలి. ప్యాసింజరు బళ్లకు వర్తించదు. హెవీ వెహికల్ అయితే, ఒక టన్నుకి రూ. 1,000. ఇతర వెహికల్ అయితే ఒక బండికి రూ. 7,500.పైన చెప్పిన మూడు రకాలవారికి 🔷 బుక్స్ అవసరం లేదు 🔷 ఆడిట్ అవసరం లేదు 🔷 వ్యాపార ఖర్చులు మినహాయింపు 🔷 పాత పద్ధతిలో అయితే 80సీ మొదలైన తగ్గింపులుంటాయిఅయితే ముఖ్యమైన విషయం 🔷 ఇతర రికార్డులు, వ్యాపారానికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్లు మొదలైనవన్నీ ఉండాలి. 🔷 జీఎస్టీ రికార్డులు ఉండాలి 🔷 బ్యాంకు అకౌంటు బుక్స్ ఉండాలి 🔷 బిల్లులు, ఇన్వాయిస్లు, వసూళ్లకు సంబంధించి రికార్డులు ఉండాలి 🔷 లాగ్ బుక్స్ ఉండాలికొన్ని పరిమితులు/ఆంక్షలు ఉన్నాయి. అవి దాటలేదని నిర్ధారించడానికి అవసరమైన రికార్డులుంటే లెక్కలు లేకుండానే, సక్రమంగా రిటర్నులు వేయొచ్చు.
బంగారం ధరల్లో మార్పు.. ఎట్టకేలకు గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు తగ్గాయి. ఐదు రోజుల క్రితం నుంచి నాన్ స్టాప్గా దూసుకెళ్లిన పసిడి ధరలు నేడు స్వల్పంగా దిగివచ్చాయి. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
ఫ్యామిలీ
లేత ఆకుపచ్చ బనారసీ చీరలో సచిన్ కూతురు..!
సారా టెండ్యూల్కర్ తన తాజా వోగ్ కవర్ షూట్ కోసం లేత ఆకుపచ్చ బనారసీ చీరలో తళుక్కుమన్నారు. ఆమె తన అందమైన రూపంతో భారతీయ గ్లామర్ సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఆమె సంప్రదాయానికి ఆధునికతను జోడించిన అందమైన బనారసీ చీరలో సరికొత్తగా కనిపించింది. ఆమె సంప్రదాయ చీరకు సొగసైన ఐవరీ కార్సెట్ బ్లౌజ్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫ్యాషన్-ఫార్వర్డ్ లుక్లో ఆఫ్-వైట్ స్వచ్ఛమైన శాటిన్ సిల్క్, ఆర్గాంజ సిల్క్ కార్సెట్ బ్లౌజ్ని జత చేశారు. సారా బ్లౌజ్ని ఇది స్ట్రక్చర్డ్, స్ట్రాప్లెస్ సిల్హౌట్, స స్వీట్హార్ట్ నెక్ లైన్తో డిజైన్ చేశారు. ఈ విధమైన డిజైన సాంప్రదాయ భారతీయ దుస్తులకు ఆధునిక సొబగులను జోడించినట్లుగా సరికొత్తగా ఉంది. ఆమెకు సున్నితమైన పాస్టెల్రంగు అందమైన లుక్ని ఇవ్వగా, దానిలో ఉన్న పూలనమునాలు ఆమెను మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఆమె ఈ అందమైన లుక్కి భారీ అలంకరణకు ఆస్కారం ఇవ్వడకుండా మెడచుట్టూ జాలువారే వజ్రాల నెక్లెస్ను, దానికి సరిపోయే వజ్రాల కఫ్తో పాటు ధరించింది. అందుకు తగ్గట్టుగా తన రూపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. ఇక కురులను చక్కగా ముడి వేసుకుంది. బిగుతైన కార్సెట్ బ్లౌజ్ విత్, సాంప్రదాయ కటన్ సిల్క్ బనారసి చీరల కలయికలో సారా అత్యంత సుందరంగా కనిపించింది. నిజానికి ఈ లుక్ సారాకి చక్కటి హుందాతనాన్ని ఇవ్వడమే ఆధునిక ఫాషన్కి ప్రతీకగా నిలిచింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) (చదవండి: అనేక భాషలు నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!)
గోరింట పూసింది..
ఆధ్యాత్మికత పరంగా సౌభాగ్యానికి గుర్తు. ఔషధ గుణాల పరంగా ఆరోగ్యకారిణిగా గుర్తింపు. అరచేతిలో పూసే గోరింటతో అందం, ఆరోగ్యం. ఆషాఢంలో వర్ష రుతువు ప్రారంభమవుతుంది. వాతావరణంలోని మార్పులను శరీరం తట్టుకునేందుకు చేతులు, కాళ్లకు మహిళలు గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మైదాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కుల మతాలతో సంబంధం లేకుండా శుభకార్యాల్లో మహిళల చేతికి గోరింటాకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. గోరింటాకు దొరకనప్పుడు మార్కెట్లో దొరికే మె హందీ అయినా పెట్టుకుంటారు. గోరింటాకు చేతికి అందాన్నివ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆషాఢంలో ముత్తయిదువలు చేతికి గోరింటాకు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కొత్తగా పెళ్లయిన మహిళలు ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తారు. వారు తమ కుటుంబసభ్యులతో కలిసి చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ వేడుకలను స్థానిక మహిళలు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకుంటారు. కాలనీలు, అపార్ట్మెంట్లలో సైతం ఆషాఢ మాసంలో మహిళలంతా గోరింటాకు సంబరాలు జరుపుకుంటారు. తద్వారా బంధాలు బలపడతాయి.వరంగల్లో వేడుకలు..వరంగల్ కాశిబుగ్గ తిలక్రోడ్డులో శ్రీజగన్మాత మహిళా పరపతి సంఘం సభ్యులు శనివారం గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సేకరించిన గోరింటాకుతో ఒక్క చోట చేరి రోలులో వేసి రుబ్బారు. రుబ్బుతున్న సమయంలో లయబద్ధంగా గౌరమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. వాయినాలు ఇచ్చుకున్నారు. తాంబూలాలు, స్వీట్లు పంచుకున్నారు. సంతోషంతో ఒకరికొకరు చేతులు, కాళ్లకు మైదాకు పెట్టుకున్నారు. ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రతీ సంవత్సరం ఇలాగే సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకుంటామని సంఘం సభ్యులు చెబుతున్నారు.– హన్మకొండ కల్చరల్
పెళ్లైన మహిళల్లో ఆ సమస్య ఎందుకు వస్తుంది?
నా వయసు ఇరవై ఆరు సంవత్సరాలు. పెళ్లై మూడేళ్లు అయింది. నాకు ప్రతి నెలా యోనిలో దురద వస్తోంది. కొన్నిసార్లు ఆ భాగం ఎర్రగా కూడా మారుతోంది. మందులు వాడినా మళ్లీ మళ్లీ వస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది?– రాజేశ్వరి, నంద్యాలమీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, మీకు యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ముఖ్యంగా పెళ్లైన మహిళల్లో, ప్రసవ వయసులో ఉన్నవారిలో ఈ సమస్య అప్పుడప్పుడు లేదా తరచుగా మళ్లీ మళ్లీ రావచ్చు. సాధారణంగా యోనిలో కొన్ని మేలు చేసే సూక్ష్మజీవులు సహజంగానే ఉంటాయి. ఇవి ఆ ప్రాంతాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని కారణాల వల్ల శిలీంద్రాల పెరుగుదల అధికమైతే ఈ సమతుల్యత దెబ్బతిని ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు యోని లోపల, బయట తీవ్రమైన దురద ఉంటుంది. ఆ భాగం ఎర్రగా మారుతుంది. మంటగా అనిపిస్తుంది. మూత్రం విసర్జించే సమయంలో మంట కలగవచ్చు. ఎక్కువగా గోకడం వల్ల గీతలు పడే అవకాశం ఉంటుంది. అలాగే చిక్కగా, తెల్లగా ఉండే స్రావం కూడా రావచ్చు.ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే...బిగుతుగా ఉండే దుస్తులు ధరించకండి.గాలి సులభంగా ఆడే కాటన్ లోదుస్తులు వాడండి. ∙లోదుస్తులు ఉతికేటప్పుడు బలమైన సువాసన కలిగిన ద్రావకాలు ఉపయోగించకండి.యోని భాగంలో సువాసన క్రీములు, సుగంధ ద్రవ్యాలు, స్నాన ద్రావకాలు వాడకండి.మృదువైన సబ్బులు మాత్రమే ఉపయోగించండి.వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్ మందులు తీసుకోవద్దు.ఆ భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి.కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోవచ్చు. అయితే చాలామందికి మాత్రం సరైన చికిత్స అవసరమవుతుంది. తరచుగా మళ్లీ మళ్లీ వస్తుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సందర్భాల్లో కారణాన్ని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. యోని నుంచి నమూనా తీసి పరీక్ష చేయడం ద్వారా ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందో, ఏ శిలీంద్రం కారణమైందో, దానికి ఏ మందు ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే మూత్ర పరీక్షలు, రక్తంలో చక్కెర స్థాయులు, శరీర రోగనిరోధక శక్తికి సంబంధించిన పరీక్షలు కూడా అవసరమవుతాయి. మధుమేహం ఉన్నవారిలో లేదా రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నవారిలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచు కనిపిస్తాయి.కొన్నిసార్లు ఇతర వైరస్ ఇన్ఫెక్షన్లు లేదా రోగనిరోధక శక్తి తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అందుకే, తరచుగా వచ్చే యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సాధారణంగా ఫ్లుకోనాజోల్ 150 మిల్లీగ్రాముల మాత్రను మూడు రోజులకోసారి చొప్పున మొత్తం మూడు మోతాదులు ఇవ్వవచ్చు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ మళ్లీ రాకుండా ఉండేందుకు నిర్వహణ చికిత్సలో భాగంగా వారానికి ఒక మాత్ర చొప్పున ఆరు నెలల పాటు వాడాలని వైద్యులు సూచిస్తారు. లేదా క్లోట్రిమాజోల్ 500 మిల్లీగ్రాముల మాత్రలను రెండు వారాల పాటు వాడమని చెప్తారు. అనంతరం ఆరు నెలల పాటు వారానికి ఒకసారి చొప్పున వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యోని నుంచి నమూనా సేకరించి పరీక్ష చేయించడం ద్వారా ఏ రకమైన శిలీంద్రం కారణమైందో గుర్తించి, దానికి తగిన చికిత్స అందిస్తారు. ఇలా పూర్తి చికిత్స తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గడమే కాకుండా, మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.మేనిమాట! మెదడులో చెత్తబండి!మనం దుప్పటి కప్పుకుని రాత్రిళ్లు ‘ఆఫ్’లో ఉంటే.. మెదడు మాత్రం ‘క్లీనింగ్ మోడ్ ఆన్ !’ చేసి, వ్యర్థాలను బయటకు పంపే పనిలో బిజీగా ఉంటుంది. అవును.. నిద్రలో ‘గ్లింపాటిక్ సిస్టమ్’ చురుగ్గా పనిచేసి, మెదడులో పేరుకునే కొన్ని వ్యర్థ పదార్థాలను ‘సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ’ ప్రవాహం ద్వారా తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా స్లో వేవ్ స్లీప్ సమయంలో ఈ ప్రక్రియ మరింత చురుగ్గా సాగుతుంది.- డా, భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్
తనలో తానే పాడుకున్న తత్త్వజ్ఞ!
‘మన మాటల్లో అత్యుత్తమమైనవి మనతో మనం చెప్పుకునేవే!’నన్నారు పోలిష్ రచయిత్రి ఓల్గ తొకార్చుక్. ‘మిగతా విషయాలెలా వున్నా, వాటిని ఎవరూ అపార్థం చేసుకోర’ని కూడా అన్నారామె. ఈ మాటలన్న మనిషి, ‘జైళ్ళు మన లోపలే వుంటాయి– బయట వుండవు; ఎటొచ్చీ మనలో చాలామందికి ఈ అంతర్గత కారాగారాల్లో ఎలావుండాలో తెలియదంతే!’ అనడంలో విడ్డూరమేముంది? అయినా, మానసిక చికిత్స పద్ధతుల్లో –క్లినికల్ సైకాలజీలో– పట్టా పొందిన ఓల్గా మాటతీరు మరోలా ఎందుకుంటుంది?ఆమె తల్లి వాండా, తండ్రి జోసెఫ్ ఇద్దరూ ‘పీపుల్స్ యూనివర్సిటీ’లో అధ్యాపకులే. వాస్తవానికి అది ఓ విశ్వవిద్యాలయం కాదు– హైస్కూల్ మాత్రమే. పోలండ్ వాయవ్య ప్రాంతంలోని శివారు నగరం మ్యేర్జిన్లో వుండే జానపద విజ్ఞాన కేంద్రాన్నే ‘పీపుల్స్ యూనివర్సిటీ’గా పిలుస్తారు. జెర్మన్ సరిహద్దులకు కొద్ది నిమిషాల దూరంలో ఉంటుంది మ్యేర్జిన్. పైగా, అప్పట్లో జోసెఫ్ ఆ స్కూల్ లైబ్రరీ కూడా నడిపేవాడు. అలా, చిన్న వయసు నుంచీ ఓల్గ ఆడుకున్నదీ– పాడుకున్నదీ పుస్తకాలతోనే!బాల్యంలో ఓల్గకు నచ్చిన పుస్తకం హెన్రిక్ సియెంకియేవిచ్ రాసిన ప్రేమకథ ‘క్వో–వాడిస్’. 1905లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న తొలినాటి రచయిత సియెంకియేవిచ్ రాసిన ఈ ప్రేమకథకే ‘ఎడారి–అడవి’ అనేది మరోపేరు. లాటిన్ భాషలో ఈ ప్రశ్నకు ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అనే అర్థం! నీరో చక్రవర్తి రోమ్ నగర రాజ్యాన్ని పాలించే రోజుల్లో జరిగిన ప్రేమకథగా ఈ నవలను రచించాడు సియెంకియేవిచ్. మరో 113 సంవత్సరాల తర్వాత ఓల్గ కూడా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడానికి వున్న చారిత్రక నేపథ్యం ఇదన్నమాట. ఈ పరిసరాలే, రచయిత్రిగా ఆమె సొంత గొంతు సవరించడానికి అవసరమైన స్వరాన్నిచ్చాయి.పదహారేళ్ళ ప్రాయంలోనే కలంపట్టి కథనరంగంలోకి దిగింది ఓల్గ! అయితే యువరచయితలకు సహజమైన బెరుకు కారణంగా ఆమె ‘నతాషా బరోదిన్’ అనే మారుపేరును ఆశ్రయించారు. యువ రచయితల కోసం ఉద్దేశించిన ‘కాలిబాట’ అనే చిన్నపత్రికలో అచ్చయిన మొదటి రెండు కథలనూ ఆ పేరుతోనే ప్రచురించారామె. దాదాపు దశాబ్దకాలం ఓల్గ కథలూ కాకరకాయలూ పక్కన పెట్టి సైకో థెరపిస్టుగా ఉద్యోగం చేసుకున్నారు. అప్పట్లో ఆమె విస్తృతంగా కవిత్వం రాశారు; అనేక పత్రికల్లో ప్రచురించారు; విస్తారమైన గుర్తింపు కూడా పొందారు. అప్పట్లోనే ఆమె ఓ కవితా సంపుటి కూడా అచ్చు వేసుకున్నారు. మూడు పదుల వయసు దాటిన తర్వాత, 1996లో ఓల్గ ‘ఆదిమ యుగం– ఇతర యుగాలు’ అనే ప్రయోగాత్మక నవల రాసి పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ నవలను ఓల్గ 60 ఖండికలుగా విభజించారు. ఈ ప్రయోగం జాతీయ స్థాయిలో కన్నా, అంతర్జాతీయ స్థాయిలో పెద్దపేరు తెచ్చుకుంది. ఈ పరిణామం వెనుక చిన్న నేపథ్యం లేకపోలేదు!ఇరవయ్యో శతాబ్ది చివర్లో పోలండ్ రాజకీయ– సామాజిక వ్యవస్థ సమూలమైన మార్పులకు గురైంది. అంతర్జాతీయంగా గొర్బచ్యేఫ్, జాతీయ స్థాయిలో పోలిష్ కార్మిక నేత వవుంజా (వలేజా) పరిచయం చేసిన భావాలే ఆ మార్పులకు ప్రాతిపదికలు. పోలండ్ సమాజంలో పడమటి గాలులు బలంగా వీస్తున్న పోకడ కనిపెట్టి ఎందరో సాహిత్యవేత్తలు తమ రంగు మార్చారు. ఎందుకైనా మంచిదని ఓల్గ తొకార్చుక్ కూడా వారిని అనుసరించారు. అలాంటి పెద్దల ప్రోత్సాహంతోనే ఆమె 1990 దశాబ్ది తొలినాళ్ళలో ఓల్గ కొన్నాళ్ళు ఇంగ్లండులో ఉండి, ఆంగ్లభాషా ప్రావీణ్యం సాధించారు. మరో అయిదేళ్ళ తర్వాత ఆమె రెండు స్కాలర్షిప్పులు సంపాదించి అమెరికాలోనూ– జెర్మనీ (బెర్లిన్)లోనూ రెండేళ్ళు గడిపి రావడం ఓల్గ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆనాటి నుంచీ ఆమెకి స్వదేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువ గుర్తింపు దక్కుతూ వచ్చింది. 1999లో ఓల్గ ‘పోలిష్ పెన్ క్లబ్’లో చేరడంతో ఈ మార్పు పరిపూర్ణమైంది. 2014లో ఓల్గ రాసిన ‘ద బుక్స్ ఆఫ్ జేకబ్’ అనే సుదీర్ఘ నవల ఆమె రచనలన్నింట్లోకీ ఉత్తమమని విమర్శకులు అంటారు. పదిహేడో శతాబ్దానికి చెందిన జేకబ్ ఫ్రాంక్ అనే ‘అవతార పురుషుడి’ జీవితకథ నేపథ్యంగా రాసినదీ 900 పేజీల నవల. ఈ నవల రాయడానికి ఓల్గ ఏడేళ్ళపాటు పరిశోధన చేశారట! ఈ నవల రాయడానికి ఏడేళ్ళ ముందు, ఓల్గ ‘దిమ్మరులు’ అనే చారిత్రక నవల పోలిష్ భాషలో వెలువరించారు. ‘ప్రాచీన విశ్వాసులు’గా ప్రసిద్ధులైన ఓ క్రై స్తవ శాఖకు చెందిన సంచారజీవన సమూహాల కథనే ఈ నవలకు ఇతివృత్తంగా తీసుకున్నారు ఓల్గ. 116 ఖండికలుగా ఈ నవలను నిర్మించి ఓల్గ తన ముద్ర గట్టిగానే వేశారు. చిత్రమేమిటంటే, కొన్ని ఖండికలు, ఏకవాక్య నిర్మాణాలే! 2008లో నైకీ సాహిత్య పురస్కారం ఓల్గ రచనకు తొలిసారి దక్కింది.అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ దాని ఆంగ్లానువాదం వెలువరించే వరకూ ఓల్గ రచనకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగుర్తింపు దక్కలేదు (2018 మే నెల్లో ఓల్గ తొకార్చుక్– అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ మ్యాన్ బుకర్ బహుమతి సొమ్మును పంచుకున్నారు– అది అలా వుంచండి!) అదే సంవత్సరం అక్టోబర్లో ఓల్గ నోబెల్ సాహిత్యపురస్కారం గెల్చుకోవడానికి మ్యాన్ బుకర్ పురస్కారం ఎంతగానో సహకరించింది. ఈ రెండూ పురస్కారాలు దక్కిన తర్వాతనే, ఓల్గ రచనలకు అనేక భాషల్లో అనువాదాలు వెలువడ్డాయి. అయినా, నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళ రచనలను సొమ్ముచేసుకునే సువర్ణావకాశాన్ని పెంగ్విన్ లాంటి వాణిజ్య ప్రచురణ సంస్థలు వదులుకుంటాయా?- మందలపర్తి కిషోర్
అంతర్జాతీయం
భారత యువతి హత్య: ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్!
టొరంటో: కెనడాలోని టొరంటోలో గత డిసెంబర్లో జరిగిన భారత సంతతికి చెందిన హిమాన్షీ ఖురానా (30) హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆమె భాగస్వామి అబ్దుల్ గఫూరీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 20, 2025న ఈ హత్య జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న గఫూరీని, ఆగస్టు 7న టొరంటో విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు టొరంటో పోలీసులు శనివారం ప్రకటించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది.నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతనికి పెరోల్ లేని జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. డిసెంబర్ 19న హిమాన్షీ కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా, మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం ఆమె ఇంట్లోనే లభ్యమైంది. టొరంటోలోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రకటించింది. నిందితుడు విదేశాలకు పారిపోయినప్పటికీ, అంతర్జాతీయ పోలీసు ఏజెన్సీల సహకారంతో అతడిని కెనడాకు రప్పించి, అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: బ్రెజిల్లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!
బ్రెజిల్లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!
రియో డి జెనెరో: బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానిక కొలంబియన్ కాన్సులేట్ తెలిపింది. మృతులలో ఒక పైలట్తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొలంబియన్ మహిళలు ఉన్నారు. వీరు నగరంలోని విస్టా చినెసా సమీపంలో గల టిజుకా నేషనల్ పార్కు వద్ద విహారయాత్ర చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.15 ఏళ్ల బాలిక పుట్టినరోజు వేడుకల కోసం వచ్చిన ఈ కుటుంబంలోని ఆరుగురిలో, హెలికాప్టర్ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో ముగ్గురు మాత్రమే ప్రయాణించి మృత్యువాత పడ్డారు. ప్రమాద ఘటనపై రియో డి జెనీరో మేయర్ ఎడ్వర్డో కావలియర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నగరంలో పర్యాటక ఆకర్షణగా మారిన హెలికాప్టర్ విహారయాత్రల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కొత్త భద్రతా ప్రమాణాలను అమలు చేసే వరకు ఈ విమాన సేవలను ఒకటి లేదా రెండు వారాల పాటు నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బ్రెజిల్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీని కోరినట్లు ఆయన తెలిపారు. గతంలో జూన్ 14న రిక్రియో డోస్ బాండీరాంటెస్ శివారులో రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు.ఇది కూడా చదవండి: క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్చల్!
హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా తన బుద్ధిని మార్చుకోనంత వరకు హార్మూజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బఘెర్ జొల్ఘాదర్ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనను ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.‘అమెరికా ఇకపై ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించే ప్రయత్నం చేయరాదు. ఇరాన్, ఈ ప్రాంతంలోని ఇరాన్ మిత్ర పక్షాలపై అమెరికా దాడులు మానుకోవాలి. ఇరాన్ నౌకాశ్రయాల నుంచి అమెరికా వైదొలగాలి. ఈ ప్రాంతం నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవాలి. ఇరాన్కు పూర్తి యుద్ధ పరిహారం చెల్లించాలి. ఆంక్షలను ఎత్తి వేయాలి. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలి..’వంటి డిమాండ్లు కూడా ఆ ప్రకటనలో ఉన్నాయి.శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్ విభాగానికి జొల్ఘాదర్ కమాండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించలేదు. తమ రెండు దేశాల మధ్య నుంచి వెళ్తున్న హార్మూజ్ జలసంధి ఉమ్మడి నిర్వహణపై ఒమన్తో ఒప్పందం తుది దశకు చేరుకుందని అంతకుముందు ఇరాన్ ప్రకటించింది.
క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్చల్!
టెహ్రాన్: ఇరాన్ సర్వోన్నత నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం, ఆచూకీపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఇరాన్క చెందిన సెమీ-అఫీషియల్ మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ వీడియో, ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందనే వదంతులను తిప్పికొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. Iran’s Mehr RELEASES VIDEO of Supreme Leader Mojtaba Khamenei for ‘FIRST TIME’ pic.twitter.com/v3Rp81VfLH— RT (@RT_com) August 8, 2026అయితే ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ చేసిందనే దానిపై స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులలో ఆయన తండ్రి అయతొల్లా అలి ఖమేనీ హత్య తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మొజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారాన్ని అందిస్తున్నారు. దాడుల సమయంలో ఆయన గాయపడ్డారని, ఆ తర్వాత రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని చెబుతున్నారు.జూలైలో సౌదీ వార్తా సంస్థ అల్-హదత్ ఇజ్రాయెల్.. ఖమేనీ ఇరాన్లో లేరని తెలిపింది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ, సర్వోన్నత నేతతో ప్రత్యక్ష సంబంధాలు ప్రస్తుతం చాలా కష్టంగా ఉన్నాయని అంగీకరించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగా లేదని ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు.ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ!
జాతీయం
రెబల్స్లో రెబల్స్.. బీజేపీతో బంధంపై చీలిక!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే అనామక పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాళ్లు ఎన్డీయే కూటమికి బయటి నుంచి మద్దతు ప్రకటించడం.. తాజాగా జరిగిన ఎన్డీయే ఎంపీల మీటింగ్లో ప్రధాని మోదీతో వాళ్లు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. బీజేపీతో సాన్నిహిత్యంపై ఆ వర్గంలోనూ కొందరు అసంతృప్తితో తిరుగుబాటు బాట పట్టినట్లు తెలుస్తోంది. తమ వర్గం ఓట్ల నేపథ్యం కారణంగా.. బీజేపీతో కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహ్మాన్, యూసుఫ్ పఠాన్(మాజీ క్రికెటర్)లు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో సన్నిహిత సంబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ముగ్గురు ఇటీవల ఎన్డీఏ ఎంపీల సమావేశానికి దూరంగా ఉండడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.‘బీజేపీతో వెళ్లం’.. ఎంపీల స్పష్టీకరణబీజేపీతో పొత్తు తమ రాజకీయ భవిష్యత్కు నష్టం కలిగిస్తుందని ఈ ఎంపీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో తమ సంప్రదాయ ఓటర్లకు దూరమవుతామనే భయం వారిలో ఉన్నట్లు సమాచారం. ‘‘మేము బీజేపీతో కలిసి వెళ్లబోమని ఇప్పటికే స్పష్టం చేశాం. ఎన్డీయేలో భాగస్వాములం కాబోం’’ అని ఎంపీ అబూ తాహెర్ ఖాన్ ప్రకటించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజా ప్రయోజనాల కోసం సహకరిస్తామని మాత్రం ఆయన తెలిపారు.అదంతా డ్రామా?: మమత వర్గం ఫైర్ఎన్సీపీఐలో కొనసాగుతున్న ఈ పరిణామాలపై మమతా బెనర్జీ వర్గం తీవ్రంగా స్పందించింది. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తిరుగుబాటు ఎంపీలపై విమర్శలు గుప్పించారు. ‘‘వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్సీపీఐ అనేది ఎన్డీయేకు మిత్రపక్షమని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆరోపించారు.మరో తృణమూల్ నేత కునాల్ ఘోష్ కూడా విమర్శలు చేశారు. ‘‘బీజేపీకి బీ టీమ్గా మారిన వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు గెలిచింది మమతా బెనర్జీ పేరుతో, వ్యతిరేక ఓట్లతో’’ అని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో మోదీ, షాతో భేటీలు.. మరోవైపు దూరంఆశ్చర్యకరంగా, బీజేపీతో దూరంగా ఉంటామని చెబుతున్న ఈ ముగ్గురు ఎంపీలు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధాని నివాసంలో జరిగిన అల్పాహార భేటీకి కూడా హాజరయ్యారు. అయితే ఎన్డీఏ ఎంపీల ‘మంగళ్ మిలన్’ సమావేశానికి మాత్రం గైర్హాజరయ్యారు. తిరిగి సొంత గూటికే?తిరుగుబాటు ఎంపీల్లో కొందరు తిరిగి మమతా బెనర్జీ వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారని తృణమూల్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్సీపీఐ నేతలు మాత్రం పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అభివృద్ధి అంశాలపై మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు.మొత్తానికి.. తృణమూల్ నుంచి వలసలతో బలపడిన ఎన్సీపీఐలోనే ఇప్పుడు అసంతృప్తి స్వరాలు వినిపించడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. బీజేపీతో సంబంధాలే ఈ సంక్షోభానికి కారణమా? లేదంటే ఎంపీల రాజకీయ పునరాలోచనా? అన్నది ఆసక్తికరంగా మారింది.
‘విరాళాల గోల్మాల్’ : ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్!
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాత విచారణ కోరుతూ దాదాపు 500 మంది సాధువులు, మతాచార్యులు సోమవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్నారు. ప్రకాశానంద గిరి మహారాజ్ నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శన జరుగుతోంది. మండి హౌస్ సమీపంలోని నేపాల్ రాయబార కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. విరాళాల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధానికి సాధువులు వినతిపత్రం సమర్పించనున్నారు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో పెద్దఎత్తున ఆర్థిక మోసాలు, నిధుల స్వాహా జరిగిందని నిర్వాహకులు ఆరోపించారు. సాధారణ సిబ్బందిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్న సిట్ విచారణ కేవలం కంటితుడుపు చర్యగా ఉందని, ఇందులో కీలక వ్యక్తులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మరోవైపు ఈరోజు రామమందిర విరాళాల గోల్మాల్పై సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించనుంది. అలాగే లోక్సభలో ఈ అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో అత్యున్నత స్థాయి స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
జార్ఖండ్: అసెంబ్లీ ముట్టడిలో ఉద్రిక్తత.. విద్యార్థులపై వాటర్ కెనాన్లు..
రాంచీ: ఝార్ఖండ్లో నియామక పరీక్షల అక్రమాలను నిరసిస్తూ సోమవారం వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర శాసనసభ ముట్టడికి యత్నించారు. పురాతన అసెంబ్లీ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శనను జగన్నాథ ఆలయం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. నిరసనకారులను నియంత్రించడానికి భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్లో వచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిరసన ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో ప్రభుత్వం దిగివచ్చి, 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షతో పాటు 2023, 2025లో నిర్వహించిన బ్యాక్లాగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. అయితే, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్పై విద్యార్థులు పట్టువీడలేదు.ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై జరుగుతున్న నిరసనల నడుమ సోమవారం రాంచీలో హైడ్రామా చోటుచేసుకుంది. పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపిన ఆదిత్య సాహు, బాబూలాల్ మరాండీతో సహా పలువురు ప్రముఖ బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆందోళనకారులు శాంతియుతంగా అసెంబ్లీని ముట్టడించేందుకు (ఘెరావ్) అసెంబ్లీ వైపు మార్చ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్లో వచ్చి జార్ఖండ్ అసెంబ్లీ వైపు సాగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా శాంతియుతంగా, రాజ్యాద్ధబద్ధంగా ఈ మార్చ్ కొనసాగుతుందని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో జార్ఖండ్ పోలీసులు నిషేధాజ్ఞలు (ప్రొహిబిటరీ ఆర్డర్లు) జారీ చేయడంతో పాటు, నగరవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆందోళనలో పాల్గొనే విద్యార్థులు ఎలాంటి హింసాత్మక ప్రదర్శనలకు పాల్పడవద్దని రాంచీ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. #WATCH | Ranchi, Jharkhand: BJP leaders, protesting outside the CM residence, detained by the Police. They are protesting over JPSC-JSSC alleged irregularities. pic.twitter.com/ziejwSNz4z— ANI (@ANI) August 10, 2026జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, సోమవారం రాంచీలో రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని, ఈ పరిణామాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పరీక్ష జరిగినందున సీబీఐ విచారణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. VIDEO | Ranchi, Jharkhand: Protesters leave Jaipal Singh Munda Stadium to march towards the 'Vidhan Sabha'.'Vidhan Sabha March' has been called by students who have been protesting for over two weeks against alleged irregularities in recruitment examinations in the state.… pic.twitter.com/gl3vyXt6Uf— Press Trust of India (@PTI_News) August 10, 2026విద్యాద్ధుల డిమాండ్లలో 98 శాతం ఆమోదించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, విద్యార్థులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము కోరిన 13 పరీక్షల్లో కేవలం మూడింటిని మాత్రమే ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. నిరసనల్లో భాగంగా ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహ్తో, సోమవారం నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.మరోవైపు, ఈ నిరసనల నేపథ్యంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) సభ్యులు అజీతా భట్టాచార్య, అనిమా హన్సా, జమాల్ అహ్మద్లు తమ పదవులకు రాజీనామా చేశారు. పేపర్ లీక్ ఆరోపణలపై సీఐడీ వీరిని విచారణకు పిలవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అసెంబ్లీ పరిసరాల్లో 750 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించడంతో పాటు, రాంచీ వ్యాప్తంగా భారీ పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య పట్టువీడని ధోరణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
డేట్ అయిపోయిందని పారేస్తే మీ జేబుకే నష్టం!
ప్యాకెట్పై ఉన్న తేదీ కనిపించగానే చాలామంది చేసే మొదటి పని.. ఆ ఆహారాన్ని చెత్తబుట్టలో పడేయడం. బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, సాస్లు, పాలు వంటి వాటిపై ఉన్న తేదీ దాటితే ఇక అవి పనికిరావని భావిస్తుంటారు. కానీ ప్రతి తేదీ వెనుక ఒకే అర్థం ఉండదు. కొన్ని సందర్భాల్లో తేదీ దాటినా ఆహారం సురక్షితంగా ఉండొచ్చు.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఆహార ప్యాకెట్పై ముద్రించిన తేదీని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చాలామంది అనవసరంగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో పొరపాటు నిర్ణయాలు ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు. బెస్ట్ బిఫోర్(Best Before), ఎక్స్పైరీ డేట్(Expiry Date) మధ్య ఉన్న చిన్న తేడా తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. అసలు ఏ ఆహారం తినొచ్చు? ఏది పారేయాలి? తెలుసుకుందాం..ఇలా అయితే ఫర్వాలేదుఆహార ప్యాకెట్లపై కనిపించే ‘Best Before’ తేదీ అంటే.. ఆ పదార్థం అత్యుత్తమ నాణ్యతతో ఉండే గడువు. అంటే ఆ తేదీ వరకు ఆహారం రుచి, వాసన, రంగు, ఆకృతి వంటి లక్షణాలు మెరుగ్గా ఉంటాయని తయారీదారు హామీ ఇస్తాడు. ఆ తేదీ దాటిన వెంటనే ఆహారం విషపూరితం అయిపోతుందని అర్థం కాదు. ఉదాహరణకు.. కొన్ని ప్యాక్ చేసిన పదార్థాలు సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ‘Best Before’ తేదీ తర్వాత కూడా కొంతకాలం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే అసలు జాగ్రత్త అవసరం. తేదీ ఒక్కటే ఆహారం సురక్షితమా? కాదా? అని నిర్ణయించదు.ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ఎక్స్పైరీ డేట్ Expiry Date లేదా యూజ్ బై డేట్ Use-by Date అనేది ఆహార భద్రతకు సంబంధించిన హెచ్చరిక. ఈ తేదీ దాటిన తర్వాత ఆ పదార్థంలో హానికరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాల విషయంలో ఈ తేదీని తప్పక పాటించాలి. అందుకే ‘Best Before’ అంటే నాణ్యతకు సంబంధించిన సూచన.. ‘Expiry Date’ అంటే భద్రతకు సంబంధించిన హెచ్చరిక అని గుర్తుంచుకోవాలి.వీటి విషయంలో జాగ్రత్తపాలు, పెరుగు, తాజా మాంసం, చేపలు వంటి పదార్థాలు చాలా త్వరగా పాడయ్యే ఆహారాలు. వీటిని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే.. ప్యాకెట్పై ఉన్న తేదీ రాకముందే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ఆహార పదార్థాలను తేదీ దాటిన తర్వాత తీసుకునే విషయంలో మరింత జాగ్రత్త అవసరం.ఆహారాన్ని ఉపయోగించే ముందు ఈ విషయాలను గమనించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే దూరంగా పెట్టండిప్యాకెట్ ఉబ్బిపోయిందా?లీక్ అవుతోందా?వింత వాసన వస్తుందా?రంగు మారిందా?ఫంగస్ కనిపిస్తుందా?ఆకృతి మారిందా?.. ఇలాంటి మార్పులు కనిపిస్తే.. తేదీ ఉన్నా, లేకపోయినా ఆహారాన్ని తినకపోవడమే మంచిది.వాసన బాగుందని నమ్మొద్దు!చాలామంది ఆహారం చెడిపోయిందో లేదో తెలుసుకోవడానికి వాసన చూస్తారు. వాసన బాగుంటే తినేస్తారు. కానీ ఇది ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. కొన్ని ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఆహారంలో ఉన్నా.. వాసన, రంగు, రుచిలో మార్పు కనిపించకపోవచ్చు. అందుకే అనుమానం ఉన్న ఆహారాన్ని రుచి చూసి పరీక్షించడం కూడా మంచిది కాదు.నిల్వ విధానమే కీలకంఆహారం ఎప్పుడు తయారైంది అన్నదే కాదు.. దాన్ని ఎలా నిల్వ చేశారన్నది కూడా చాలా ముఖ్యం. ఫ్రిజ్లో పెట్టాల్సిన పదార్థాలను బయట ఎక్కువసేపు ఉంచితే.. గడువు తేదీ లోపలే అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి ప్యాకెట్ తెరిచిన తర్వాత ఆహారం ఉపయోగించే గడువు తగ్గవచ్చు.తినే ముందు ఈ ఆరు విషయాలు చెక్ చేయండి✅ ప్యాకెట్ సురక్షితంగా ఉందా?✅ ఎప్పుడైనా తెరిచారా?✅ సరైన విధంగా నిల్వ చేశారా?✅ ఆహారంలో మార్పులు కనిపిస్తున్నాయా?✅ అది త్వరగా పాడయ్యే పదార్థమా?✅ తేదీ దాటిన సమయం ఎంతైంది?చివరగా.. ఆహారంపై ఉన్న తేదీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ‘Best Before’ దాటిందని ప్రతి పదార్థాన్ని పారేయాల్సిన అవసరం లేదు. అలాగే తేదీ దాటిందని ప్రతి ఆహారాన్ని తినడం కూడా సరికాదు. ఆహారం రకం, నిల్వ విధానం, ప్యాకింగ్ పరిస్థితులు, పాడైన లక్షణాలు.. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. డేట్ చూసి భయపడొద్దు.. కానీ జాగ్రత్తను మాత్రం మర్చిపోవద్దు!
ఎన్ఆర్ఐ
అట్లాంటా: విజయవంతంగా ‘వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్’
అట్లాంటాలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలను వివరించారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న Let’s Speak for Jagananna, Let’s Write for Jagananna, Let’s Post for Jagananna, Let’s Code for Jagananna’’ కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో Online Reputation Management-ORM ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు. కేవలం పోస్టులు చేయడం, కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా.. స్పష్టమైన లక్ష్యం, సమన్వయంతో ముందుకు సాగాలని ఎన్ఆర్ఐ కార్యకర్తలకు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు.వాస్తవాలను ప్రజలకు సమర్థంగా చేరవేయాలన్న సాంబశివారెడ్డి.. తప్పుడు ప్రచారాలను ఆధారాలతో ఎదుర్కోవాలని సూచించారు. YSRCP NRI Wing Portal, Jagan 2.0 Super యాప్ల కూడా అవగాహన కల్పించారు. మన గ్లోబల్ డిజిటల్, సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
న్యూయార్క్లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.
లండన్లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
క్రైమ్
అపార ప్రతిభ.. అకాల మరణం!
ఆంధ్రప్రదేశ్: టేబుల్ టెన్నిస్ బోర్డుపై ర్యాకెట్ పట్టి ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. రాష్ట్రస్థాయి పతకాలు సాధిస్తున్న ఆ చిరుచేతులు ఇక కదలవు. పట్టుదలతో కష్టపడి భవిష్యత్తులో దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదుగుతాడనుకున్న ఆ బాలుడి నవ్వులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఒక చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసుకుందామని ఆస్పత్రికి వెళ్తే.. విధి వెక్కిరించడంతో ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న కంటిపాప కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అంతటి తీరని దుఃఖంలోనూ కుమారుడి నేత్రాలను దానం చేసి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపారు.పతకాల రేసులో నిలిచి..బుచ్చిరాజుపాలెంలో నివాసముంటున్న తిరుమలరాజు హరిబాబు, భవానీ దంపతుల కుమారుడు హర్షవర్ధన్వర్మ (12) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పా టు ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండే హర్షవర్ధన్.. తనకు ఎంతో ఇష్టమైన టేబుల్ టెన్నిస్ను ఎంచుకున్నాడు. క్రమశిక్షణతో సాధన చేస్తూ అండర్–12 విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాడు. ఎన్నో పతకాలు సాధించాడు.లోపాన్ని సరి చేసుకోవాలనుకుంటే..బాలుడిలో ఉన్న చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసేందుకు ఇటీవల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. అయితే దురదృష్టవశాత్తు ఆరోగ్యం విషమించడంతో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం హర్షవర్ధన్ కన్నుమూశాడు. హర్షవర్ధన్ భౌతికకాయాన్ని తరలించేందుకు బంధువు అశోక్ పెందుర్తిలోని ‘సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ను సంప్రదించారు. ఆ సమయంలో శ్రీనివాస్ నేత్రదానం కోసం వివరించగా.. పుట్టెడు శోకంలో ఉన్న తల్లిదండ్రులు హరిబాబు, భవానీ ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించారు.
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎలా దాడి చేసి చంపారు?.. అనంతరం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు.. ఆపై తెరపైకి వచ్చిన కవర్అప్ కథను అందులో అతను ‘పూసగుచ్చినట్లు’ వివరించాడు. దీంతో నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది.సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రగౌడ, దర్శన్లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రదోష్ ఏ-14గా ఉన్నాడు. అప్రూవర్గా మారేందుకు 59వ సెషన్స్ కోర్టులో అతను వేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి.. తొలుత రేణుకాస్వామిని దర్శన్ మనుషులు కొందరు ఎత్తుకొచ్చారు. పవిత్ర గౌడకు పంపినట్లు చెబుతున్న సందేశాల విషయంలో దర్శన్ అతడిని ప్రశ్నించాడు. ఆ తర్వాతే తన మనుషుల్ని ఉసిగొల్పడంతో.. దాడి జరిగింది. కర్రలు, తాళ్లతో అతన్ని తీవ్రంగా గాయపరిచారు. రేణుకాస్వామి మరణించాడని నిర్ధారించుకున్నాక.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు.మృతదేహాన్ని తరలించి.. కథ మార్చే ప్రయత్నం?రేణుకాస్వామి మరణం తర్వాత ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రత్యామ్నాయ కథనం సిద్ధం చేసుకున్నారు. తొలుత శవాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. ఆ నేరం వాళ్ల మీద వేసుకునేందుకు దర్శన్ పవిత్రలు వాళ్లకు డబ్బులు ఆఫర్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది కూడా.అయితే ఈ కేసులో జరిగిదంతా నిజాయతీగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకే అప్రూవర్ హోదా ఇవ్వాలని ప్రదోష్ కోర్టును కోరాడు. జైల్లో తనకు భద్రత కల్పించాలని, ఇతర నిందితులతో కలిపి ఉంచొద్దని కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రదోష్ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు అతన్ని అప్రూవర్గా అంగీకరిస్తే.. ఆపై వాంగ్మూలం లభిస్తే.. దర్శన్, పవిత్ర గౌడ సహా ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్ కేసుకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్గా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాలు కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్కు వీరాభిమాని. అయితే నటి పవిత్రా గౌడ వల్ల దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని అతను కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు అసభ్యమైన సందేశాలు పంపాడు. ఈ విషయంలోనే ఆగ్రహించిన దర్శన్.. అతన్ని కిడ్నాప్ చేయించి తన మనుషులతో అతికిరాతకంగా హత్య చేయించాడన్నది అభియోగం. ఈ కేసులో అరెస్టైన దర్శన్కు తొలుత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. కేసు విచారణ త్వరగా ముగించాలని ట్రయల్ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దర్శన్, పవిత్రలు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
పెళ్లయి వారం రోజులు.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్!
హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్ అయిన ఘటన మంచాల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మధు కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్కు చెందిన ఏర్పుల ప్రవీణ్, నగరంలోని ఐఎస్ సదన్కు చెందిన కళ్యాణి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.వారం క్రితం భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అమ్మాయి తరఫున ఎవరూ రాలేదు. చిత్తాపూర్లో ఆ జంట నివాసం ఉంటున్న క్రమంలో శనివారంరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కళ్యాణిని కారులో ఎత్తుకెళ్లారు. తన భార్యను జ్యోతిబస్ అనే యువకుడితోపాటు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆదివారం ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
నర్సాపూర్ అర్బన్ పార్క్కు వెళ్లి వస్తుండగా.. విషాదం!
హైదరాబాద్: మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి దుర్మరణం చెందారని నర్సాపూర్ ఎస్సై రంజిత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్కు చెందిన షేక్ హసిన్ మెహతా(19) బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.స్నేహితులు వెంకటగిరీష్, చంద్ర, దేవ సునందన్ సాయితో కలిసి మియాపూర్ నుంచి ఆదివారం ఉదయం నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్ సందర్శనకు బైక్లపై వచ్చారు. అనంతరం తిరుగుప్రయాణంలో కొండాపూర్ సమీపంలోని టర్నింగ్ వద్ద బైక్ అతివేగంగా రెయిలింగ్ను ఢీకొట్టగా హసిన్ మెహతాకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వీడియోలు
దమ్ముంటే గుడివాడకు రా.. తొక్కి పెట్టాలని చూస్తే...
గర్ల్ఫ్రెండ్ను గొంతు నులిమి చంపాడని వరుణపై ఆరోపణలు
సుద్దపూస కబుర్లు వద్దు కూటమికి వల్లభనేని వార్నింగ్
అతని మీద ఎలాంటి కేసు పెట్టారంటే.. చింతాడ రవి అరెస్ట్ పై సంచలన నిజాలు
పేపర్ లీక్ కావడంతో మనస్థాపానికి గురై మేఘన ఆత్మహత్య
మా ఇంటి ఏకైక డాక్టర్.. చివరి ఫోన్కాల్ గుర్తుచేసుకుని కన్నీళ్లు
అంత మొగోడివా నువ్వు... దమ్ముంటే జైల్లో పెట్టించు చూస్తా..
బంగారం ధరలకు బ్రేక్.. వారం తరువాత భారీగా పతనం
యువగళంలో నీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చావంటే నీ నీచమైన బుద్ది ఇప్పుడే అర్థమైంది
పుష్ప శ్రీవాణిని అడ్డుకున్న పోలీసులు


