క్రేజీ కాంబో ఫిక్స్.. సూర్యతో పూరి జగన్నాధ్..!
తమిళ స్టార్ హీరో సూర్యతో దర్శకుడు పూరి జగన్నాధ్ కొత్త సినిమా ఫైనల్ అయింది. ప్రస్తుతం సూర్య సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పూరి దర్శకత్వంలో సూర్య చేయబోయే సినిమా ఉండే అవకాశం ఉంది. అసలు ముందుగా వెంకీ అట్లూరి సినిమా తరువాత సూర్య మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దాంతో ఆ స్థానంలో పూరి జగన్నాధ్కు అవకాశం దక్కింది. అయితే సూర్యతో సినిమా చేయడానికి దర్శకుడు చందు మొండేటి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తండేల్ సినిమా ముందు నుంచే ఆయన ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. దాంతో ప్రస్తుతం ఆయన కార్తికేయ 3 ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. హీరోల డేట్స్ సంపాదించడం పూరి జగన్నాధ్ కు పెద్ద సమస్య కాదు. పూరి-విజయ్ సేతుపతితో చేసిన సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్ని ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి.
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ను పేలవంగా ముగించింది. సూపర్-8లో తప్పక భారీ విజయం సాధించాల్సిన మ్యాచ్లో నామమాత్రపు గెలుపుతో సరిపెట్టుకుంది. ఫలితంగా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.గుర్రుగా ఉన్న పీసీబీఐసీసీ ఈవెంట్లో పాక్ సెమీ ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో ఇంటా బయటా పాక్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సైతం సల్మాన్ ఆఘా (Salman Agha) బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లకు జరిమానా రూపంలో శిక్ష విధించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.సెలక్టర్ పదవికి రాజీనామాఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్లో వైఫల్యం తర్వాత పాక్ బోర్డులో తొలి వికెట్ పడింది. అలీం దర్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు. సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు, హెడ్కోచ్ మైక్ హసన్ తీరుకు నిరసనగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంపైర్గా పేరుప్రఖ్యాతులు పొందిన అలీం దర్ అక్టోబరు 11, 2024లో పాక్ జట్టు సెలక్టర్గా నియమితుడయ్యాడు.ఆకిబ్ జావేద్, అజర్ అలీ, అనలిస్టు హసన్ చీమాతో కలిసి సెలక్టర్ పదవి చేపట్టాడు. అయితే, టీ20 ప్రపంచకప్ టోర్నీకి జట్టును ఎంపిక చేసే సమయంలో మైక్ హసన్ అతి జోక్యం వల్ల అలీం దర్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.బాబర్ ఆజం వద్దు అన్నందుకేనా?బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వంటి సీనియర్లను ఎంపిక చేయవద్దని దర్ భావించగా.. ఆకిబ్ జావేద్ మద్దతుతో హసన్ ఈ ముగ్గురిని జట్టులో చేర్చినట్లు సమాచారం. అదే విధంగా మహ్మద్ రిజ్వాన్ను ఆరో స్థానానికి ఎంపిక చేస్తే బాగుంటుందనే అలీం దర్ అభిప్రాయాన్ని కూడా వీరు కొట్టివేసినట్లు తెలుస్తోంది.అంతేకాదు ఆకిబ్ జావేద్ కోచ్ హసన్కే మద్దతు పలుకుతూ.. ఇతర సభ్యుల నిర్ణయాలను ప్రభావితం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో విసిగిపోయిన అలీం దర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా మంగళవారమే అతడు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు పాక్ స్థానిక మీడియా పేర్కొంది. కాగా అలీం దర్ వద్దన్నా.. హసన్, జావేద్ పట్టుబట్టి జట్టులో చేర్చిన బాబర్ ఆజం, షాదాబ్, ఉస్మాన్ ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!
మండలిలో ఉద్రికత్త.. టీడీపీ సభ్యుల జులం
అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..మీడియా పాయింట్:లడ్డూపై చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రులు యత్నించారు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులులడ్డూపై చర్చ జరపాలని మండలి మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాంశాసనమండలిలో లడ్డు పై చర్చ కోసం పదిరోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాంఈరోజు చర్చకు ఒప్పుపుకుని నిజాలు బయట పడుతుంటే తట్టుకోలేకపోతున్నారుసభలో లేని వైఎస్ జగన్ గురించి మాట్లాడారువైఎస్ జగన్ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారునిన్నకాక మొన్న నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారుతిరుమలకు ఏడుకొండలు ఉండాలని జీవో ఇచ్చింది వైఎస్సార్వైఎస్సార్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబువెంకటేశ్వరస్వామిపై ఎనలేని భక్తి ఉందని చంద్రబాబు చెప్పుకుంటాడుఒక్కసారైనా తిరుపతిలో తలనీలాలు ఇచ్చారా?లడ్డూపై నిందలు వేసి చర్చకు తెచ్చింది ఎవరు?వైఎస్ జగన్కి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలిలడ్డూపై చర్చ జరగకుండా పదేపదే అడ్డుపడ్డ మంత్రులుటీడీపీ ఎమ్మెల్సీల తీరుపై వైఎస్సార్సీపీ ఆందోళనఅచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ పట్టుఏపీ శాసనమండలి రేపటికి వాయిదానెయ్యికి పూతపూసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా: తూమాటి మాధవరావుజంతు కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్ షీట్ 209 పేజీలో చాలా క్లియర్గా చెప్పింది2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమల వెళ్లుంటారు కదాఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారుమీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయటపెట్టే ధైర్యం ఉందా?తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారుటెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సప్లై చేశారులడ్డూపై ఆరోపణలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారుహెరిటేజ్ పేరు తూమాటి ప్రస్తావించగానే ఉలిక్కిపడ్డ మంత్రులుతూమాటి ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ మంత్రి పయ్యావుల అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిందే..మండలి ఛైర్మన్పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు మీరు క్రిస్టియన్ అనుకున్నా. కానీ కాదని మీరు చెప్పారు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టిన ఎమ్మెల్సీలు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం మండలి ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలుతాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ తనను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరని అచ్చెన్నాయుడికి ప్రశ్నతాను హిందువునని క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుఅచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: తూమాటితూమాటి మాధవరావు ప్రసంగాన్ని అడ్డుకుంటున్న మంత్రులు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..1998లో హెరిటేజ్ టీటీడీకి మిల్క్ పౌడర్ సప్లై చేసింది. అడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఇవ్వొద్దని ఆదేశించింది.అయినప్పటికీ టీటీడీ ద్వారా బిల్లు పాస్ చేసుకున్నారునెయ్యికి పూత రాసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా.ఫిర్యాదుకు, సీబీఐ రిపోర్టుకు తేడా తెలియకుండా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చార్జ్షీట్ 209 పేజీలో చాలా క్లియర్గా చెప్పారు.2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమలకు వెళ్లుంటారు కదా.ఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారు.మీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయట పెట్టే ధైర్యం ఉందా?.తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారు.టెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సరఫరా చేశారు.బిల్లులు ఆలస్యమైతే బోర్డు ముందుకు తెచ్చి మరీ బిల్లులు తెచ్చుకున్నారు.2024-26 వరకు తిరుమలలో ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా?.మండలిలో సంచలన విషయాలను బయటపెట్టిన తూమాటి. టీడీపీ ఎమ్మెల్సీపై చైర్మన్ ఆగ్రహం..టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధపై మండలి చైర్మన్ ఆగ్రహంసభలో వైఎస్సార్సీపీ నేతలను నిందితులుగా చదివిన అనురాధఈ క్రమంలో మీరు ఏమైనా.. పోలీసా, సీబీఐ అధికారా అంటూ చైర్మన్ ఆగ్రహంమండలిలో ఉద్రిక్తత.. ఏపీ శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుల రచ్చ..లడ్డూపై చర్చ జరగకుండా అధికార పార్టీ సభ్యుల జులుం.పోడియం దగ్గర అధికార పార్టీ సభ్యుల రచ్చ. మండలి చైర్మన్ ఆగ్రహం..తన మైక్ కట్ చేస్తున్నారంటూ చైర్మన్ ఆవేదన.మండలి ప్రతిష్ట నిలబడేలా చర్చ జరగాలన్న చైర్మన్.చర్చ ప్రారంభమైన 20 నిమిషాల్లో 17 సార్లు అడ్డుపడిన మంత్రులు.పర్వతనేని మాట్లాడుతుండగా నిమిషానికోసారి అడ్డుకున్న మంత్రులు.రూల్స్ మాట్లాడుతున్నామంటూనే వాస్తవాలు బయటకు రాకుండా మంత్రుల అరుపులు. మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్సీపీ లడ్డూపై చర్చను పదేపదే అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు.హెరిటేజ్, ఇందాపూర్ బంధంపై చర్చకు టీడీపీ సభ్యుల అభ్యంతరం.వైఎస్సార్సీపీ సభ్యులు ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటున్న పయ్యావుల.హెరిటేజ్ ప్రస్తావన రాకుండా పదేపదే అడ్డుకుంటున్న మంత్రులు.వాస్తవాలు బయటకు రాకుండా మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్సీపీ భోలే బాబా డెయిరీ ఎక్స్లెంట్ అంటూ పర్మిషన్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే.అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.ఫ్లెక్సీలు వేసి దేవుడిని రోడ్డుపైకి తెచ్చారు.2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హెరిటేజ్ దగ్గర మజ్జిగ కొనుగోలు చేసింది.ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ పాల్గొనలేదని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. మంత్రుల అత్యుత్సాహం..లడ్డూపై వాస్తవాలు బయటకు రాకుండా పదేపదే మంత్రులు అడ్డుకుంటున్నారు.హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారం బయటకు రాకుండా మంత్రుల అడ్డగింత.సంఘం డెయిరీ, వైష్ణవీ డెయిరీ వ్యవహారం ప్రస్తావనకు రాగానే మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు అడ్డగింత.లడ్డూపై మండలిలో చర్చ.. మంత్రుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కామెంట్స్..ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ యూనిట్.ఈ అంశంలో పెద్ద ఆర్ధిక కుట్ర దాగి ఉంది.ఆర్థిక కుంభకోణం బయటకు రాగానే హెరిటేజ్ వైబ్సైట్ నుంచి ఇందాపూర్ డెయిరీని కోమ్యానుఫ్యాక్చరింగ్గా మార్చేశారు.ప్రతీ మాట, ప్రతీ పదం ఆధారాలతోనే మాట్లాడుతున్నాను.కల్తీ నెయ్యి సరఫరా చేయడం వల్లే ఇందాపూర్ డెయిరీ తిరస్కరణకు గురైంది.టీడీపీ ప్రభుత్వంలోనే ఏఆర్ డెయిరీ నుంచి నాలుగు ట్యాంకర్లు వచ్చాయి.ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది.లడ్డూ ప్రసాదంపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది.స్వయంగా సీఎం చంద్రబాబే అబద్ధాలు చెప్పారు.టీడీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగితే వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చేస్తున్నారు.రాజకీయ లబ్ధిగా మొదలైన కుట్ర.. ఆర్థిక కుంభకోణంగా బయటకు వచ్చింది.నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యితో లడ్డూలు చేసింది కూటమి ప్రభుత్వంలోనే.మంత్రి గారు పదేపదే మా గొంతు నొక్కుతున్నారు.ఏఆర్ డెయిరీ ట్యాంకర్లను వైష్ణవి డెయిరీ పేరుతో టీటీడీకి పంపారు.సంగం డెయిరీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లది.కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి?.తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను ఎవరి ఒత్తిడితో అనుమతించారు?.సీబీఐ చార్జ్షీట్లో క్లియర్గా ఎటువంటి జంతు కొవ్వు లేదని చెప్పింది.ఫిర్యాదును పట్టుకుని సీబీఐ రిపోర్టు అంటూ ప్రచారం చేస్తున్నారు. చర్చ ప్రారంభించిన వెంటనే పర్వతరెడ్డిని అడ్డుకున్న మంత్రి అచ్చెన్నాయుడు.చంద్రబాబు అనలేదంటూ మండలి సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు.పర్వతరెడ్డి ప్రసంగానికి పదేపదే అడ్డుతగులుతున్న మంత్రులు.పర్వతరెడ్డి చర్చ మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోనే ఐదు సార్లు అడ్డుకున్న మంత్రులు.పర్వతరెడ్డి ప్రసంగాన్ని పదే పదే అడ్డుకుంటున్న మంత్రి పయ్యావుల. మంత్రి అచ్చెన్నాయుడు ఓవరాక్షన్..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి అచ్చెన్నాయుడు నోటి దురుసుఓపిక లేకపోతే పో.. అంటూ దురుసు వ్యాఖ్యలుఅచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీల ఆగ్రహం లడ్డూపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్సార్సీపీప్రభుత్వం భయంతోనే సభలో గందరగోళం సృష్టించాలని చూస్తోంది.చైర్మన్ సీరియస్.. మంత్రుల వాదనలతో నేను ఏకీభవించడం లేదు: చైర్మన్తిరుమల లడ్డూ విషయం చాలా సున్నితమైనది.లడ్డూ ప్రసాదంపై చర్చ చాలా మర్యాదగా, గౌరవప్రదంగా జరగాలి. మండలిలో మంత్రుల రగడ.. చర్చ కంటే ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని మంత్రి పయ్యావుల మెలిక.చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేయవచ్చన్న చైర్మన్.చైర్మన్తో మంత్రుల వాగ్వాదం.మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: చైర్మన్నేను తప్పు చేస్తున్నా అనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.కొత్త సాంప్రదాయం తీసుకు రావద్దన్న మండలి చైర్మన్. చైర్మన్ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అధికార సభ్యుల గందరగోళం. తిరుమల లడ్డు ప్రసాదంపై మండలిలో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర.ముందుగా స్టేట్మెంట్ ఇస్తామని ప్రభుత్వం పట్టు.స్వల్పకాలిక చర్చలో స్టేట్మెంట్ అనేది ఉండదు: చైర్మన్మండలి నిబంధనలపై చైర్మన్ మాట్లాడుతుండగా అడ్డుకుంటున్న మంత్రులు. మండలిలో తిరుమల లడ్డుపై చర్చ.. మండలిలో లడ్డుపై చర్చకు చైర్మన్ అనుమతి. మండలి చైర్మన్తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల భేటీ..శాసనమండలి చైర్మన్తో భేటీ అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుతిరుమల లడ్డుపై మండలిలో చర్చకు మండలి చైర్మన్ అనుమతిప్రశ్నోత్తరాలు ముగిసిన తరవాత తిరుమల లడ్డుపై చర్చముందుగా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత.. ప్రభుత్వం స్టేట్మెంట్ పాస్ చేసేలా నిర్ణయంగతవారం లడ్డుపై చర్చ సందర్భంగా ప్రభుత్వం ముందు స్టేట్మెంట్ పాస్ చేయడంపై అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలునేడు తిరుమల లడ్డుపై చర్చకు ఆమోదం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై అరుణ్ కుమార్ ప్రశ్న..అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై రైతుల అభ్యంతరాలను సభలో ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..భూసేకరణపై అభ్యంతరాలకు తక్కువ సమయం ఇచ్చారుగ్రామసభలు, ప్రజాభిప్రాయసేకరణ పెట్టకుండానే భూ సేకరణపై ముందుకు వెళ్లారుభూ యజమానిని సంప్రదించకుండా భూములు తీసుకోవడం సరికాదుగెజిట్లో 140 మీటర్ల రోడ్డును 250 మీటర్లు చేశారుబఫర్ జోన్ను 500 మీటర్లు చేశారుదేశంలో ఎక్కడా ఔటర్ రింగ్ రోడ్డుకి ఇలా చేయలేదుమార్కెట్ రేట్ ప్రకారం గత మూడేళ్లలో ఎంత ఎక్కువ ఉంటే అంత ఇవ్వాలికానీ అలా ఫాలో అవ్వడం లేదుసేకరించిన భూమిని వినియోగించకపోతే తిరిగి వెనక్కి ఇచ్చేయాలి..ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదుఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను రద్దుచేయాలి2013 భూ సేకరణ చట్టం ప్రకారం కొత్త గెజిట్ ను విడుదల చేయాలి.. రైతులను ఆదుకోవాలిమండలి సమావేశాలు ప్రారంభం..ప్రారంభమైన శాసన మండలి సమావేశాలుప్రశ్నోత్తరాలు ప్రారంభం
భారత్ గ్లోబల్ పవర్గా ఎదగకుండా చేయడానికే..: ఖమేనీ ప్రతినిధి
న్యూఢిల్లీ: భారత్తో పాటు చైనాను గ్లోబల్ పవర్స్గా ఎదగకుండా చేయడానికే తమ దేశంతో అమెరికా ఘర్షణలకు దిగుతోందని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి (ఖమేనీ ప్రతినిధి) అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అబ్దుల్ మజీద్ ఇవాళ ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం నుంచి భారత్కు ప్రత్యేక ప్రతినిధిగా అబ్దుల్ మజీద్ ఉన్నారు.అమెరికా అగ్రరాజ్య హోదాను నిలుపుకోవడానికి ప్రపంచ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని అబ్దుల్ మజీద్ ఆరోపించారు. “సమీప భవిష్యత్తులో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా భారత్, చైనా, రష్యా, అమెరికా ఉంటాయి. అయితే, భారత్ లేదా చైనా తనతో పాటు సమాన శక్తులుగా ఎదగడాన్ని అమెరికా జీర్ణించుకోదు. అందుకే దీన్ని అడ్డుకోవడానికి ఈ యుద్ధాలను ప్రేరేపించి అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది” అని అబ్దుల్ మజీద్ చెప్పారు.అమెరికా ప్రారంభించిన యుద్ధమిది..ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ అని, ఇరాన్ కాదని అబ్దుల్ మజీద్ తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ దేశం తనను తాను రక్షించుకుంటోందని ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజానీ కూడా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. “మాపై దాడి చేసి మా పౌరులపై బాంబులు వేస్తున్నారు. మేము కేవలం మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాం” అని చెప్పారు. యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానే కాబట్టి దానిని ముగించాల్సింది కూడా ఆ దేశమేనని అబ్దుల్ మజీద్ తెలిపారు. వారు ఆపితే తాము కూడా ఆపుతామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత్కు మరో ఐదు ఎస్-400లు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..ఇరాన్ రెండు యుద్ధాలు ఎదుర్కొంటోందని అబ్దుల్ మజీద్ తెలిపారు. ఒకటి అమెరికా, ఇజ్రాయెల్తో సైనిక ఘర్షణ, మరొకటి నకిలీ వార్తల యుద్ధం అని అన్నారు. “అమెరికా, ఇజ్రాయెల్పై సైనిక యుద్ధాన్ని మేము ఎదుర్కోగలం. అయితే దీనికంటే పెద్ద మరో యుద్ధం జరుగుతోంది. అదే నకిలీ కథనాల యుద్ధం. ఈ యుద్ధంలో వారు నకిలీ వార్తలు సృష్టిస్తారు. ఇరాన్ ప్రజలు పాలన మార్పు కోరుకుంటున్నారని చెబుతారు” అని ఆయన అన్నారు. మొత్తానికి ఇతర దేశాల ఎదుగుదలను అడ్డుకోవడమే అమెరికా లక్ష్యమని, తద్వారా వాషింగ్టన్కు తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్పారు.
అదనంగా ఐపీఎస్లను కేటాయించండి
సేవల్లో పనితీరు.. ఫ్లాట్
మళ్లీ బలపడిన బంధం
వాయుసేనలో అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
నెల రోజుల్లో కొత్త విద్యా విధానం
ప్రభుత్వ కాలేజీల్లో నిర్లక్ష్యం... ప్రైవేటులో ఒత్తిడి
గ్యాస్కు యుద్ధం సెగ
వార్.. బేర్!
గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
సుదీర్ఘ యుద్ధానికి సన్నద్ధం!
ఫిట్నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘జెఫింగ్’
బోయపాటి శ్రీను కొత్త సినిమా.. స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్
ఎన్నో యుద్ధాలు ఆపానని అన్నారు.. ఇది కూడా ఆపండి సార్!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే
ఇప్పుడే పెళ్లొద్దమ్మా.. నేను ఇంకా చదువుకుంటా
బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!
పాక్ ప్రపంచకప్ హీరోకు ఘోర అవమానం
యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే
దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!
అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు
బాబర్ ఆజమ్కు కెప్టెన్సీ పగ్గాలు
టీ20 ప్రపంచకప్పై యుద్ద ప్రభావం
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
పశ్చిమ బెంగాల్లో బీజేపీని గెలిపిస్తే.. 45 రోజుల్లో..
విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. గృహ, వాహనయోగాలు
ఫైనల్గా మృణాల్ ఠాకూర్కు జత కుదిరింది
అదనంగా ఐపీఎస్లను కేటాయించండి
సేవల్లో పనితీరు.. ఫ్లాట్
మళ్లీ బలపడిన బంధం
వాయుసేనలో అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
నెల రోజుల్లో కొత్త విద్యా విధానం
ప్రభుత్వ కాలేజీల్లో నిర్లక్ష్యం... ప్రైవేటులో ఒత్తిడి
గ్యాస్కు యుద్ధం సెగ
వార్.. బేర్!
గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
సుదీర్ఘ యుద్ధానికి సన్నద్ధం!
ఫిట్నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘జెఫింగ్’
బోయపాటి శ్రీను కొత్త సినిమా.. స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్
ఎన్నో యుద్ధాలు ఆపానని అన్నారు.. ఇది కూడా ఆపండి సార్!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే
ఇప్పుడే పెళ్లొద్దమ్మా.. నేను ఇంకా చదువుకుంటా
బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!
పాక్ ప్రపంచకప్ హీరోకు ఘోర అవమానం
యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే
దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!
అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు
బాబర్ ఆజమ్కు కెప్టెన్సీ పగ్గాలు
టీ20 ప్రపంచకప్పై యుద్ద ప్రభావం
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
పశ్చిమ బెంగాల్లో బీజేపీని గెలిపిస్తే.. 45 రోజుల్లో..
విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. గృహ, వాహనయోగాలు
ఫైనల్గా మృణాల్ ఠాకూర్కు జత కుదిరింది
ఫొటోలు
విరోష్ జంట రిసెప్షన్లో ప్రముఖుల సందడి (ఫోటోలు)
#Virosh Reception: ఘనంగా విజయ్- రష్మిక రిసెప్షన్ (ఫోటోలు)
'పీలింగ్స్..' పాటకు స్టెప్పులేసిన అనసూయ (ఫోటోలు)
హైదరాబాద్ లో ఘనంగా హోలీ సంబరాలు (ఫొటోలు)
అభిమానులతో 'విరోష్' జోడీ బంతి భోజనాలు (ఫొటోలు)
వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
ఆకుపచ్చ చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియమణి (ఫొటోలు)
ఇది నా జర్నీ కాదు మనది.. మంచు మనోజ్-మౌనిక పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)
‘సాంప్రదాయని సుప్పినీ శుద్ధపూసనీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సినిమా
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
దాదాపు 40 సినిమాలు చేసిన కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధి 2023లో మరణించాడు. అతడి మరణంతో ఎంతగానో కుంగిపోయింది కమెడియన్ రెండో భార్య, నటి రేణు సుధి. అయితే రానురానూ ఆ బాధ నుంచి తేరుకుంటూ తనకిష్టమైన వ్యాపకాలపై శ్రద్ధ పెట్టింది. రీల్స్ చేయడం, సాంగ్స్లో యాక్ట్ చేయడం, రకరకాలుగా ఫోటోషూట్స్ చేయడంతో సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోయేది. బిగ్బాస్ షోతో గుర్తింపుకొందరైతే వితంతువై ఉండి ఈ పిచ్చి చేష్టలేంటి? సుధికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావ్ అని విమర్శించారు కూడా! అలా ట్రోలింగ్ బారిన పడ్డ సమయంలో మలయాళ బిగ్బాస్ ఏడో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ వచ్చిన క్రేజ్తో రెండు, మూడు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తాజాగా రేణు సుధికి భాగస్వామి కావాలనిపిస్తోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. తోడు కావాలిఒంటరితనం భరించలేకపోతున్నాను. నాకు ఒక పార్ట్నర్ కావాలనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకుని, నా బాగోగులతో పాటు పిల్లల్ని చూసుకునే తోడు కావాలనిపిస్తోంది అని రాసుకొచ్చింది. గతంలో కూడా రేణు మళ్లీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటానంది. అప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు వదిలేసి అతడితో మరో ఇంట్లో స్థిరపడతానంది. అలాగే తన పేరు పక్కన ఉన్న సుధిని చెరిపేస్తానంది.రెండో పెళ్లిమిమిక్రీ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న కొల్లం సుధిని మొదటి భార్య వదిలేసింది. అప్పటికే వీరికి కుమారుడు రాహుల్ సంతానం. భార్య వదిలేశాక సింగిల్ పేరెంట్గా చాలా ఇబ్బందులు పడ్డాడు సుధి. కొన్నేళ్ల తర్వాత అతడికి రేణుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు రితుల్ సంతానం. రేణుకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం!
పావలా శ్యామలకు అల్లు అర్జున్ సాయం
ఒకప్పుడు తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వృద్ధాప్య సమస్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో తల దాచుకుంటోంది. అయితే శ్యామల ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, కనీస మందుల కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి స్టార్ హీరో అల్లు అర్జున్ స్పందించాడు.ఒక అడుగు ముందుకేసి..శ్యామల, ఆమె కూతురి నిత్యావసరాలు, వైద్యఖర్చుల నిమిత్తం నెలకు రూ.10 వేలప్పున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. క్రమం తప్పకుండా ప్రతి నెల ఈ డబ్బు ఆమెకు అందేలా శాశ్వత ఏర్పాట్లు చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. గతంలో పలువురు సెలబ్రిటీలు పావలా శ్యామలకు సాయం చేశారు. అయితే బన్నీ ఒక అడుగు ముందుకేసి తాత్కాలిక సాయం కాకుండా శాశ్వతంగా ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ పంపేందుకు చర్యలు తీసుకోవడం విశేషం!
రష్మిక కోసం విజయ్ చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా?
డెస్టినీ(విధి) అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడదే విజయ్ దేవరకొండ-రష్మికని ఒక్కటి చేసింది. అప్పుడెప్పుడో సినిమా నటులుగా మొదలైన వీళ్ల ప్రయాణం.. ఇప్పుడు భార్యభర్తలుగా మారేందుకు కారణమైంది. ఈ సందర్భంగా వీళ్ల గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దానికి తోడు పెళ్లి ఫొటోలు, సొంతూరిలో విజయ్ సత్యనారాయణ వ్రతం చేయడం, ఊరి వాళ్లందరికీ భోజనాలు పెట్టించడం లాంటి విషయాలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు రష్మిక గురించి విజయ్ చేసిన తొలి ట్వీట్ కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: కొత్త కోడలొచ్చింది.. మంచిగా చూసుకోండి: విజయ్ దేవరకొండ)తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ.. సహాయ నటుడిగా పలు సినిమాలు చేసి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి తదితర చిత్రాలతో హీరోగా మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 'గీతగోవిందం' అయితే విజయ్ని ఫ్యామిలీ ఆడియెన్స్కి దగ్గర చేసింది. ఇందులో రష్మిక హీరోయిన్. ఈ మూవీలోనే విజయ్-రష్మిక కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అదే సినిమాకు చాలా ప్లస్ అయింది కూడా. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగానే రష్మిక పాత్ర గురించి 2018 జూన్ 23న ట్వీట్ చేసిన విజయ్.. ఇప్పుడు దాన్ని నిజం చేశాడు.'నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా నడుము నొప్పి లేచినా మీ బరువు బాధ్యత ఎప్పుడు నాదే మేడమ్' అని సదరు ట్వీట్లో విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు. ఇక్కడున్నది సినిమాలో రష్మిక పాత్ర గురించే కావొచ్చు. కానీ ఆరేళ్ల తర్వాత తన ట్వీట్ నిజమవుతుంది, రష్మిక తన భార్య అవుతుందని విజయ్ కూడా ఊహించి ఉండడు. విధి వీళ్లిద్దరిని కలిపింది. ఈ క్రమంలోనే విజయ్ చేసిన పాత ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)
కొత్త కోడలొచ్చింది.. మంచిగా చూసుకోండి: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ నేడు(మార్చి 4) హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. అయితే ఈ విందు కంటే ముందే..తెలుగు మీడియాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన సతీమణి రష్మికతో కలిసి మీడియా ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా విజయ్ మట్లాడుతూ.. తన కెరీర్లో మీడియా సహాకారం ఎంతో ఉందన్నారు.‘కెరీర్ ప్రారంభంలో నాకు మీడియా చాలా సపోర్ట్ చేసింది. నన్ను ప్రజల దగ్గరకు చేర్చేలా చేసింది మీడియాను. నా ప్రతి ఇంటర్వ్యూను తిరిగి చూసుకునేవాడిని. ఎలా మాట్లాడాను? ఇంకా ఎలా మట్లాడాలి?అనేది తెలుసుకునేవాడిని. ఇప్పుడు పెళ్లి చేసుకొని రష్మికతో కలిసి జంటగా మీ దగ్గరకు రావడం ఆనందంగా ఉంది. ఇదో విభిన్న అనుభూతి. కాలం గడిచిపోతోంది. మనం పెద్దవాళ్లం అయిపోతున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ, మిమ్మల్ని మర్చిపోం. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. తెలుగు మీడియా అనేది మా సొంత మీడియా. మీ ఆశీస్సులు మాకు కావాలి. తెలుగు రాష్ట్రాలకు ఒక కొత్త కోడలు వచ్చింది. మంచిగా చూసుకోండి’ అంటూ విజయ్ నవ్వులు పూయించాడు. కాగా, ఇప్పటికే విజయ్-రష్మిక జంట అభిమానుల కోసం ఓ ప్రత్యేక విందును ఇచ్చింది. అలాగే మార్చి 1న హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్ బాక్స్లు పంపిణీ చేశారు.కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ వంటివి ఉన్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం జరగనున్న రిసెప్షన్ పార్టీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
క్రీడలు
సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లోరెండో రోజు భారత షట్లర్లకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్గా బరిలోకి దిగిన నాలుగో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 33వ స్థానంలో ఉన్న కాంగ్ ఖాయ్ జింగ్–ఆరోన్ తాయ్ (మలేసియా) జంట 23–21, 21–12తో ప్రపంచ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీని బోల్తా కొట్టించింది. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత జంట తొలి గేమ్లో గట్టిపోటీనిచి్చనా... రెండో గేమ్లో తేలిపోయింది. ఏడోసారి ఈ టోర్నీలో పోటీపడ్డ సాత్విక్–చిరాగ్ తొలి రౌండ్లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. 2022లో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత జంట 2018, 2021, 2023, 2024, 2025లలో ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 42 నిమిషాల్లో 12–21, 15–21తో ఐదో సీడ్ థోమ్ గికెల్–డెల్పైన్ డెల్ర్యూ (ఫ్రాన్స్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 22వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి (భారత్) 75 నిమిషాల్లో 21–19, 9–21, 17–21తో ప్రపంచ 14వ ర్యాంకర్ అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
T20 WC: అలెన్ విధ్వంసకర శతకం.. వరల్డ్కప్ ఫైనల్లో న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో న్యూజిలాండ్ ఫైనల్కు దూసుకువెళ్లింది. కోల్కతాలో జరిగిన తొలి సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్లో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్.. సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ న్యూజిలాండ్ బౌలర్లు ఆది నుంచే నిప్పులు చెరిగారు. క్వింటన్ డికాక్ (10)ను అవుట్ చేసి కివీస్ వికెట్ల వేట మొదలుపెట్టిన కోల్ మెకాంచీ.. వన్డౌన్లో వచ్చిన ర్యాన్ రికెల్టన్ (0)ను డకౌట్గా వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (18)ను రచిన్ రవీంద్ర పెవిలియన్కు చేర్చాడు.యాన్సెన్ హాఫ్ సెంచరీఅదే విధంగా డారిల్ మిచెల్ (6)ను కూడా అవుట్ చేసిన రచిన్ కివీస్ శిబిరంలో జోష్ నింపాడు. ఇక డెవాల్డ్ బ్రెవిస్ (34)ను జేమ్స్ నీషమ్ అవుట్ చేయగా.. ట్రిస్టన్ స్టబ్స్ (29)ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్కు పంపించాడు. అయితే, మార్కో యాన్సెన్ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 55) నాటౌట్గా నిలవడంతో సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ నష్టపోయి 173 పరుగులు సాధించింది. ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు సాధించగా.. ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం బాదాడు. Everything is flying to the boundary tonight! 🫣ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/1kQbb9uF6n— Star Sports (@StarSportsIndia) March 4, 2026ఫాస్టెస్ట్ సెంచరీకేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్ బాది కివీస్ గెలుపును ఖరారు చేశాడు. రచిన్ రవీంద్ర 11 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా అలెన్ చరిత్ర సృష్టించాడు.
పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు: టీమిండియాకు హ్యారీ బ్రూక్ వార్నింగ్
టీమిండియాతో సెమీ ఫైనల్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో తాము ఇంత వరకు పరిపూర్ణమైన మ్యాచ్ ఆడలేదని.. అయినప్పటికీ సమిష్టిగా రాణించి విజయం సాధించామని పేర్కొన్నాడు. కాబట్టి టీమిండియాతో మ్యాచ్ గురించి తాము చెందాల్సిన అవసరం లేదన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 లీగ్ దశలో నేపాల్ వంటి పసికూన చేతిలో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లండ్.. ఆ తర్వాత సూపర్-8లో మాత్రం అదరగొట్టింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద విజయాలు సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మూడు మ్యాచ్లలో కూడా ఆఖరి వరకు పోరాడి ఇంగ్లండ్ గెలిచింది.కల నిజమైన తరుణం ఇదిఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) మాట్లాడుతూ.. ‘‘ఆతిథ్య జట్టు (టీమిండియా)తో సెమీ ఫైనల్ ఆడటం విశేషం. మా జట్టులోని చాలా మంది కల నిజమైన తరుణం ఇది. ఈ మ్యాచ్ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు.. అయినాపూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో పరిపూర్ణంగా ఆడలేదు. ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరు కీలకంగా వ్యవహరించారు. టీమిండియాతో మ్యాచ్లో సైతం పూర్తి స్వేచ్ఛగా.. ధైర్యంగా ఆడతాం.ఈ టోర్నీలో కొన్ని ఉత్కంఠ మ్యాచ్లలో మేము గెలిచాము. మా బ్యాటర్లు స్పిన్ను ఎదర్కోవడంలో ఇబ్బంది పడతారని అంతా అనుకుంటున్నారు. కానీ మేము చక్కగా స్పిన్ ఆడగలము.వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అతడి బౌలింగ్లో అత్యుత్తమంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా టీమిండియాకు కఠిన సవాలు తప్పదని సంకేతాలు ఇచ్చాడు. తాము ఇప్పటివరకు పర్ఫెక్ట్గా ఆడకపోయినా ఎవరో ఒకరు జట్టును ఆదుకుంటారని.. గతంలో మాదిరే ఈసారి అదే పునరావృతం కావొచ్చని బ్రూక్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ముంబై వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం సెమీ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లు
న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ అద్బుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కివీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలైన వేళ తాను ఉన్నానంటూ ముందుకు వచ్చాడు.చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లుకేవలం 77 పరుగులే చేసి సగం వికెట్లు కోల్పోయిన తరుణంలో యాన్సెన్ (Marco Jansen) .. ట్రిస్టన్ స్టబ్స్ (Trisran Stubss)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్కు 47 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా ఈ జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది.సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. టీ20 ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు యాభైకి పైగా పరుగులు జోడించిన రెండో జంటగా యాన్సెన్- స్టబ్స్ నిలిచారు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026టీ20 ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు 50 ప్లస్ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీలు👉మార్కస్ స్టొయినిస్- మాథ్యూవేడ్ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్ మీద 2021 సెమీ ఫైనల్లో 81*👉మార్కో యాన్సెన్- ట్రిస్టన్ స్టబ్స్ (సౌతాఫ్రికా) న్యూజిలాండ్ మీద 2026 సెమీ ఫైనల్లో 73👉ఏంజెలో మాథ్యూస్- కుమార్ సంగక్కర (శ్రీలంక) పాకిస్తాన్ మీద 2009 ఫైనల్లో 68*👉జార్జ్ బెయిలీ- ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) వెస్టిండీస్ మీద 2012 సెమీ ఫైనల్లో 68👉కార్లోస్ బ్రాత్వైట్- మార్లన్ సామ్యూల్స్ (వెసిండీస్) ఇంగ్లండ్ మీద 2016 ఫైనల్లో 54*👉మైకేల్ హస్సీ- మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్ మీద 2010 సెమీ ఫైనల్లో 53*169 పరుగులుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. మార్కో యాన్సెన్ 55 పరుగులతో అజేయంగా నిలవగా.. స్టబ్స్ 29 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 34 పరుగులతో రాణించాడు. చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా
న్యూస్ పాడ్కాస్ట్
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
తీవ్రరూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం... ఇరాన్కు అండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
భగ్గుమన్న పశ్చిమాసియా... ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు... భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు క్లీన్చిట్... కవిత, సిసోడియా సహా 23 మందీ నిర్దోషులే... ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
తిరుమల లడ్డూ ప్రసాదం, రాయలసీమ లిఫ్ట్పై ఏపీ శాసన మండలిలో చర్చించకుండా పలాయనం చిత్తగంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం... చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల హెచ్చరిక
మహాపచారం మీదే చంద్రబాబూ..! కల్తీనెయ్యి వివాదంలో చంద్రబాబు పాత నిర్ణయాలు వెలుగులోకి
ఏపీలో మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
బిజినెస్
స్టాక్ మార్కెట్ క్రాష్.. 1122 పాయింట్లు కూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మధ్యప్రాచ్యంలో ఏర్పడుతున్న పరిస్థితి గురించి మదుపరులు ఆందోళన చెందడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడవ సెషన్లోనూ క్షీణించాయి. సెన్సెక్స్ 10 నెలల కనిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 1.6 శాతం లేదా 385.2 పాయింట్ల నష్టంతో 24,480.5 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 1.40 శాతం లేదా 1,122.66 పాయింట్లు నష్టపోయి 79,116.19 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్లో ఎన్బీ ట్రేడ్& ఫైనాన్స్, సికాల్ లాజిస్టిక్స్, సాధన నైట్రో కెమ్, పాదం కాటన్ యార్న్స్, ఎఫ్ మెక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్, రూబీ మిల్స్, మార్గ్ టెక్నో ప్రాజెక్ట్స్, పిక్చర్హౌస్ మీడియా, శ్రీ హవిషా హాస్పెటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను మించి పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.2 శాతం, 2.1 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బుధవారం సెషన్ ను లాభాలతో ముగించిన ఏకైక సెక్టోరల్ సూచీ నిఫ్టీ ఐటీ.
ఎక్కువ ఈఎంఐతో ఇల్లు కొంటున్నారా? ఎంత రిస్కో చూడండి..
సొంతిల్లు ప్రతి ఒక్కరికీ జీవిత కల. చాలా మంది హోమ్ లోన్ తీసుకుని తమ సొంతింటి ప్రయాణాన్ని మొదలు పెడుతుంటారు. అయితే సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఎంత పడితే అంత ఈఎంఐ (నెలసరి వాయిదా) పెట్టుకుని ఇల్లు కొనుక్కోవడం ఎంత రిస్కో ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సోషల్ మీడియా ముందుకు తీసుకొచ్చారు.బెంగళూరులో ఒక వ్యక్తి కేవలం మూడు హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లించకపోవడంతో తన రూ.1.2 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కోల్పోయిన సంఘటన చర్చనీయాంశమైంది. గృహ రుణాల్లో దాగి ఉన్న ఆర్థిక ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.గోయెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె పొరుగువారు స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన ఆదాయం కలిగి ఉండి ప్రముఖ ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే అక్టోబర్లో ఉద్యోగం కోల్పోవడంతో ఆర్థిక ఒత్తిడి మొదలైంది. జనవరి నాటికి వరుసగా మూడు ఈఎంఐలు చెల్లించలేకపోయారు. దీంతో బ్యాంకు సర్ఫాసి యాక్ట్ (SARFAESI Act) కింద రికవరీ చర్యలు ప్రారంభించింది.సర్ఫాసి చట్టం ప్రకారం బ్యాంకులు.. కోర్టు జోక్యం లేకుండానే బకాయిలను వసూలు చేసుకునే అధికారం కలిగి ఉంటాయి. నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపే ఆస్తిని రూ.95 లక్షలకు వేలం వేశారు. ఆ మొత్తంలో రూ.80 లక్షలు బకాయిలకు సర్దుబాటు కాగా, ఎనిమిదేళ్ల పాటు ఈఎంఐలు చెల్లించిన రుణగ్రహీత చేతికి కేవలం రూ.15 లక్షలు మాత్రమే మిగిలాయి.తుది ఈఎంఐ పూర్తయ్యే వరకు తనఖా పెట్టిన ఆస్తిపై పూర్తి హక్కులు రుణగ్రహీతకు ఉండవని గోయెల్ హెచ్చరించారు. ఆకస్మికంగా ఆదాయం ఆగిపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ముందుగానే బ్యాంకును సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బలమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి రుణ పునర్వ్యవస్థీకరణ, కాలపరిమితి పొడిగింపు వంటి అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ నష్టం లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.ఫైనాన్షియల్ ప్లానర్లు సాధారణంగా నెలవారీ ఈఎంఐలు ఆదాయంలో 40 శాతం మించకూడదని సూచిస్తున్నారు. అదనంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రావిడెంట్ ఫండ్ నిధులను వినియోగించుకోవడం వంటి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించవచ్చు.
ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!
పశ్చిమాసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా తన వ్యూహాన్ని మార్చుకుంది. సౌదీ ఆరామ్కో మద్దతు ఉన్న చైనాలోని చమురు రిఫైనరీలు తమ కార్యకలాపాలను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి.హార్ముజ్ జలసంధి దిగ్బంధం.. క్రూడ్ సరఫరాకు బ్రేక్ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి ద్వారా ప్రస్తుతం సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ క్రూడాయిల్ అవసరాల్లో 20 శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. యుద్ధ వాతావరణం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ సరఫరా ఒత్తిడి ఇతర దేశాల రిఫైనర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రంగంలోకి చైనా రిఫైనరీ దిగ్గజాలుసౌదీ ఆరామ్కో భాగస్వామ్యం కలిగిన చైనా ప్రధాన రిఫైనరీ జెజియాంగ్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీపీసీ) రోజుకు 2 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న తన యూనిట్ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన ప్లాంట్ నిర్వహణ పనులను ప్రస్తుత సరఫరా సంక్షోభం దృష్ట్యా ముందే చేపడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు రాయిటర్స్కు తెలిపారు.రోజుకు 8 లక్షల బ్యారెళ్ల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీ చైనాలోనే అతిపెద్దది. తాజా నిర్ణయంతో మార్చి నెలలో ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, ఫుజియాన్ రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ కో (ఫ్రెప్) కూడా తన 80,000 బీపీడీ సామర్థ్యం గల చిన్న ముడి చమురు యూనిట్ను తాత్కాలికంగా మూసివేసింది.ఇదీ చదవండి: ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!
ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!
భారత టెలికాం రంగంలో మార్పులు చోటుచేసుకునేలా ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెలికాం స్పెక్ట్రం అనేది ప్రజా ఆస్తి అని, ఇది ప్రభుత్వ సార్వభౌమత్వ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 13, 2026న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాంతో దివాలా తీసిన సంస్థల బకాయిల వసూలు ప్రక్రియ చిక్కుల్లో పడినట్టయిందని కొందరు భావిస్తున్నారు.ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), ఎయిర్ సెల్ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల ఏజీఆర్ బకాయిలను(స్పెక్ట్రం వినియోగానికి బదులుగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు) ఎలా రాబట్టాలనే అంశంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఇప్పుడు అటార్నీ జనరల్ నుంచి అత్యవసర న్యాయ సలహాను కోరింది.స్పెక్ట్రం ప్రభుత్వ ఆస్తి.. ఐబీసీ పరిధిలోకి రాదుసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. టెలికాం స్పెక్ట్రం అనేది ఒక పరిమిత సహజ వనరు. దీనిపై పూర్తి హక్కులు భారత ప్రభుత్వానికే ఉంటాయి. టెలికాం ఆపరేటర్లకు కేవలం షరతులతో కూడిన వినియోగ హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, అది వారి సొంత ఆస్తి కాదు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద స్పెక్ట్రంను విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ఆర్కామ్, ఎయిర్ సెల్ వంటి సంస్థల ఆస్తులను విక్రయించి తమ అప్పులు తీర్చుకోవాలని భావించిన బ్యాంకులు (రుణదాతలు) ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.రుణదాతల ఆందోళనఈ తీర్పుతో సుమారు రూ.37,588 కోట్ల ఏజీఆర్ బకాయిల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆర్కామ్ బకాయిలు సుమారు రూ.25,199.3 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ సెల్ బకాయిలు సుమారు రూ.12,389 కోట్లుగా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీ దివాలా తీస్తే దాని ఆస్తులను అమ్మి ‘వాటర్ఫాల్ మెకానిజం’(ఒక కంపెనీ దివాలా తీసినప్పుడు దాని ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి అని నిర్ణయించే క్రమం) ద్వారా రుణదాతలకు పంచుతారు. కానీ, ఇప్పుడు స్పెక్ట్రం ఐబీసీ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వ బకాయిలు అలాగే ఉండిపోవడమే కాకుండా, ఇతర ఆర్థిక సంస్థల అప్పు రికవరీ కూడా నామమాత్రంగానే మిగిలే ప్రమాదం ఉంది.టెలికాం రంగంపై ఒత్తిడిభారత టెలికాం రంగం ఇప్పటికే భారీ అప్పులతో సతమతమవుతోంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి ప్రధాన ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4.09 లక్షల కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ బలోపేతం కోసం నిధులు సేకరించినప్పటికీ స్పెక్ట్రం ఫీజులు, అప్పుల నిర్వహణ సవాలుగా మారింది. భారతీ ఎయిర్ టెల్ 75.6% డెట్-టు-ఈక్విటీ నిష్పత్తితో బ్యాలెన్స్ షీట్ను నెట్టుకొస్తోంది. టెలికాం కంపెనీలు 5జీ సేవలకు మారుతున్న తరుణంలో భారీ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నియంత్రణ సంస్థల స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.బ్యాంకులు టెలికాం రంగానికి రుణాలు ఇచ్చేటప్పుడు ఇకపై చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటార్నీ జనరల్ ఇచ్చే వివరణ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి అడుగు వేయనుంది. ఒకవేళ స్పెక్ట్రంను వేలం వేయడానికి వీలు లేకపోతే ప్రభుత్వం ఈ బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుందనేది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
ఫ్యామిలీ
93 ఏళ్ల వయసులోనూ చలాకీగా విదేశీ బామ్మ..! ఆమె హెల్త్ సీక్రెట్ ఇదే..
ఆ బామ్మ చూస్తే తొమ్మిది పదుల వయసు అనిపించదు. వృద్ధాప్యాన్నే తిప్పికొట్టేలా ఆరోగ్యంగా,చలాకీగా ఉంటుందా బామ్మ. స్వతహాగా అమెరికన్ అయినా ఆమె మన భారత్ని మెచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంది. పైగా మన ఆధ్యాత్మికతకు ఫిదా అయ్యి..మన భారతీయత ఉట్టిపడేలా ఆహార్యం, సంస్కృతిని మార్చేస్తుకుందామె. పైగా ఈ గడ్డపైనే ఓ సామాన్య భక్తురాలిలా జీవిస్తోందామె. ఎవరామె అంటే..ఆ బామ్మే అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాకు చెందిన సుషుమ్న. దీర్ఘాయువు అనేది ఎక్కడ నుంచో కాదని, మన సంతోషం, జీవనవిధానం నుంచే వస్తుందని చెప్పలా జీవిస్తోంది ఈ బామ్మ. యాంటీ ఏజింగ్ ట్రెండ్కి సరిగ్గా సరిపోతుంది ఆమె జీవన విధానం. ఇప్పటికీ రెండు పూటల సైక్లింగ్ చేస్తుందట. తనకు ఎలాంటి వైద్య మస్యలు లేవని అంటోంది. బుద్దిపూర్వకంగా తినడం, శరీరానికి సరిపడ వ్యాయామాలు, స్నేహితులతో కలివిడిగా ఉండటం ఇవే తనను ఆరోగ్యంగా ఉంచుతున్నాయని చెబుతోంది. తొంభైఏళ్ల వయసులో కూడా తన పనులు తానే చలాకీగా చేసుకుంటానని అంటోంది. తనకు ఆర్థరైటిస్ తప్ప మరే సమస్యలు లేవని చెబుతోంది. వ్యవస్థాపకురాలు కమెల్ జాబర్ ఈ విదేశీ బామ్మ హెల్దీ లైఫ్ సీక్రెట్ గురించి నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆమె ప్రతి విషయాన్ని సానుకూలత దృక్పథంతో చూసే తీరే ఆమె దీర్ఘాయువుకి కారణం అంటూ ఆమె జీవిన విధానం గురించి పోస్ట్లో తెలిపారు. పైగా ఈ బామ్మ తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం మెడిసిన్స్ మానేయడమేనని హాస్యస్పదంగా చెబుతుంటుందని అన్నారు. ఆమె ఇప్పుడు కాలిఫోర్నియా, తమిళనాడులలోని ఆధ్యాత్మిక కమ్యునిటీలో సభ్యురాలు కూడా. 2001 నుంచి ఈ కమ్యూనిటిలో సభ్యురాలిగా అంకితభావంతో సేవలందిస్తోంది. ఒకప్పుడు ప్రముఖ సంస్థలో విజయవంతమైన సేల్స్ మేనేజర్ పనిచేసిన తదనంతరం ఈ జీవనశైలికి మారిపోయిందని చెప్పుకొచ్చారు పోస్ట్లో. నెటిజన్లు కూడా ఈ బామ్మ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టిన సూపర్బామ్మ అంటూ పోస్టులు పెట్టారు. విదేశాల్లో హైఫై లైఫ్ని పక్కన పెట్టి మన సంస్కృతి, వేషధారణను నేర్చుకుని ఆధ్యాత్మికవేత్తగా జీవించడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం అంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Kamel Jaber (@i__kamel) (చదవండి: నడక చాలు...జిమ్కు వీడ్కోలు...!)
నడక చాలు...జిమ్కు వీడ్కోలు...!
‘‘నడక చాలు, మీకు జిమ్ అవసరం లేదు’’ అని ఎవరైనా చెప్పడం మనలో చాలా మంది విని ఉండొచ్చు. సాధారణంగా జిమ్కు వెళ్లలేకపోతున్న వారికి ఇది ఓదార్పుగా అనిపించవచ్చు. జిమ్కు డుమ్మా కొట్టడం దానికి బదులుగా నడకను ఎంచుకోవడం అంటే అది అంత సులువైన విషయం కాదు అలాగని అసాధ్యం కూడా కాదు. జిమ్ మానడం వల్ల కలిగే నష్టాలను నడకతో భర్తీ చేయడం సాధ్యమే అంటున్నారు వ్యాయామ నిపుణులు. వారు చెబుతున్న ప్రకారం...అలా చేస్తే లాభం లేదు...కారు దిగి ఆఫీసు వరకు నడవడం, షాపింగ్ మాల్లో తిరగడం, ఫోన్లో మాట్లాడుతూనో, చాట్ చేస్తూనో నడవడం, పార్క్లో రిలాక్స్డ్గా నెమ్మదిగా వాక్ చేయడం... వంటి వాటివల్ల జిమ్ సెషన్ను భర్తీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అవి వ్యక్తి శరీరంపై నిర్మాణాత్మక ఒత్తిడిని కలిగించవు. కార్డియో పేరిట ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్...వగైరాలు జిమ్లో అందుబాటులో ఉంటాయి. అటువంటి వ్యాయామాలతో కూడిన జిమ్ సెషన్ వదిలేస్తూ, ఆ నష్టం భర్తీ కావాలంటే ఏదో ఒక పని మీద కాకుండా నడవడం అనే పని మీద బయటకు వెళ్లాలి. అప్పుడే మన చేతులు సరిగ్గా కదులుతాయి. చూపు ముందుకు ఉంటుంది. ఒక్కో అడుగు సాధారణం కంటే ఎక్కువ దూరం పడుతుంటుంది. ఇలా నడిస్తే...భళా...స్మార్ట్వాచ్ లేదా ఫోన్ ఉంటే, ఒక సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. స్థిరమైన రీతిలో గంటకు 5 కి.మీ వేగంతో 30 నిమిషాల పాటు నిర్విరామంగా నడవాలి. అంటే దాని ద్వారా మనం 2.50 కి.మీ నడుస్తామన్నమాట. ఆ వేగంతో, చాలా మంది సాధారణ నడక నుంచి బయటపడి తేలికపాటి కార్డియో శైలిలోకి వెళతారు. శ్వాస కొంచెం లోతుగా మారుతుంది. కండరాలు సాధారణ ప్రయాణ వేగం కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేయడానికి తగ్గట్టుగా వేడెక్కుతాయి. అలా 30 నిమిషాలు నాన్–స్టాప్ గా నడిస్తే గుండె, ఊపిరితిత్తులు రక్త నాళాలు గట్టి ప్రభావాన్ని ఎదుర్కొంటాయి.దీనికి రోజువారీ తప్పక చేయాల్సిన అవసరం కూడా లేదు. వారంలో నాలుగు రోజులు సరిపోతుంది. ‘‘దానిని ఒకేలా పరిగణించినప్పుడు మాత్రమే. నడక ఒక వ్యాయామం అవుతుంది. తొలుత 5 నిమిషాల పాటు సున్నితమైన వేగంతో ప్రారంభించి ఆపై తగిన వేగంలో స్థిరంగా నడవడం అలవాటు చేసుకోవాలి. అంతే కాకుండా చేతులను వెనక్కి కట్టేయడం లాంటివి చేయకూడదు. చేతులను దాదాపు 90 డిగ్రీల వద్ద వంచి సహజంగా ఊగుతూ ఉండేలాచూడాలి. చదునైన నేలపై 30 నిమిషాల్లో 2.3–2.7 కి.మీ. లక్ష్యంగా పెట్టుకోవాలి. వేగాన్ని తగ్గించకుండా ఉండటానికి అవసరమయితే సంగీతం లేదా పాడ్కాస్ట్లను ఉపయోగించవచ్చు. వాక్ ముగిసే సమయంలో హృదయ స్పందన రేటు తగ్గడానికి 2–3 నిమిషాల పాటు నెమ్మదించిన నడకతో ముగించాలి.(చదవండి: The Biology of Behavior: మీ హార్మోన్లు మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తున్నాయి?)
హర్మోన్లు ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయంటే..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కేవలం ఆలోచనలు, అలవాట్లు మాత్రమే కాదు. అది మీ శరీరంలో జరిగే Chemistry కూడా. చాలామంది తమ కోపానికి, బద్ధకానికి, ఆందోళనకు కారణం 'చేతకానితనం' అనుకుంటారు. కానీ, అది కేవలం కొన్ని హార్మోన్ల హెచ్చుతగ్గులు మాత్రమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.మనం ఒక వ్యక్తిని "కోపిష్టి" అంటాం, లేదా "చాలా ప్రశాంతమైన వ్యక్తి" అంటాం. కానీ ఒక వ్యక్తి మెదడులో నిరంతరం జరిగే రసాయన చర్యలే ఆ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. మీ హార్మోన్లు మీ కళ్ళకు కనిపించవు కానీ, మీరు ఎలా ప్రవర్తించాలో, మీరు ఎలా ఆలోచించాలో అవే నిర్ణయిస్తాయి.1. The Fantastic Four...మన ప్రవర్తనను ప్రధానంగా నాలుగు హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. వీటిని మనం 'హ్యాపీ హార్మోన్లు' అని పిలుస్తాం.Dopamine - The Reward Molecule: మీరు ఒక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు లేదా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు విడుదలవుతుంది. ఇది లేకపోతే మీరు బద్ధకంగా ఉంటారు, ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు.Serotonin - The Mood Stabilizer: ఇది మనలోని ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక హోదాను నియంత్రిస్తుంది. ఇది తక్కువైతే వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్లడం, విపరీతమైన ఆందోళన చెందడం జరుగుతుంది.Oxytocin - The Bonding Hormone: ఇది మనుషులతో మనల్ని కలిపి ఉంచుతుంది. ఇది ఎక్కువ ఉంటే మీరు నలుగురితో కలిసిపోయి ఉంటారు, తక్కువ ఉంటే ఒంటరితనం (Loneliness) ఫీలవుతారు.Endorphins - The Pain Killer: ఇవి ఒత్తిడిని, శారీరక నొప్పిని తగ్గిస్తాయి. వ్యాయామం చేసినప్పుడు ఇవి ఎక్కువగా విడుదలవుతాయి.2. కార్టిసాల్: మీ పర్సనాలిటీకి శత్రువుమీరు ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ (Cortisol) విడుదలవుతుంది. ఇది ఎక్కువ కాలం ఉంటే, మీ మెదడులోని 'హిప్పోకాంపస్' (జ్ఞాపకశక్తికి సంబంధించింది) బలహీనపడుతుంది. దీనివల్ల మీరు త్వరగా మర్చిపోవడం, కోపపడటం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం జరుగుతుంది. మీరు చేస్తున్న 'ట్రిగ్గర్' పనులన్నీ ఈ కార్టిసాల్ ని పెంచేవే!3. మోటివేషన్ vs బయోలాజికల్ ఫ్యాక్ట్స్సో-కాల్డ్ ట్రైనర్లు "నీ మైండ్ సెట్ మార్చుకో, అంతా మారుతుంది" అని చెప్తారు. అది నిజమే, కానీ ఆ మైండ్ సెట్ మారాలంటే మీ శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండాలి.మీరు రోజుకు 30 నిమిషాలు ఎండలో తిరగకపోతే, లేదా వ్యాయామం చేయకపోతే.. మీ మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచించాలనుకున్నా, మీ బయోలజీ మీకు సహకరించదు.4. బయోలాజికల్ రీ-ప్రోగ్రామింగ్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ హార్మోన్లను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు?Step 1: శారీరక అడ్డంకులను బ్రేక్ చేయండిమీరు బద్ధకంతో ఉన్నప్పుడు "నేను సోమరిపోతుని" అని అనుకోవద్దు. మీ శరీరానికి కావాల్సిన పోషకాలు, నిద్ర లేవేమో అని విశ్లేషించండి. మీ బయోలాజికల్ సైకిల్ ని 'Break' చేసి, సరైన నిద్ర, ఆహారం వైపు అడుగు వేయండి.Step 2: హార్మోనల్ హ్యాకింగ్Dopamine Detox: సోషల్ మీడియా లైకుల ద్వారా వచ్చే తక్షణ డోపమైన్ని ఆపేసి, కష్టపడి ఏదైనా పని చేయడం ద్వారా వచ్చే డోపమైన్ని అలవాటు చేసుకోండి.Oxytocin Boost: తోటి మనుషులతో కనెక్ట్ అవ్వండి, ఇది మీ స్ట్రెస్ ని తగ్గిస్తుంది.Step 3: బయో-మాస్టరీఒక్కసారి మీ శరీరంలోని రసాయన శాస్త్రం మీకు అర్థమైతే, మీరు ఒక మాస్టర్ లా ఉంటారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉండాలో, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలో మీ హార్మోన్ల ద్వారానే మీరు కంట్రోల్ చేసుకోగలరు.5. మీ హార్మోన్ల చెకప్ఈ రోజు మీరు ఈ చిన్న గమనికను గమనించండి.ఉదయం లేచినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? (ఉత్సాహమా లేక బద్ధకమా?) - ఇది మీ నిద్ర నాణ్యత మరియు డోపమైన్ లెవెల్స్ ని చెప్తుంది.సాయంత్రం వేళల్లో మీకు ఒత్తిడిగా అనిపిస్తుందా? - ఇది మీ కార్టిసాల్ లెవెల్స్ ని చూపిస్తుంది.మీరు ఫిజికల్ యాక్టివిటీ (వ్యాయామం) చేస్తున్నారా? - లేకపోతే మీ ఎండార్ఫిన్లు పని చేయడం లేదని అర్థం.మీ శరీరం మీ దేవాలయం!బ్రో, వ్యక్తిత్వం అంటే కేవలం మీ ఆలోచనలే కాదు, మీ శరీరం కూడా. మీరు మీ హార్మోన్లను పట్టించుకోకుండా, కేవలం మైండ్సెట్ మీద పనిచేస్తే అది పక్షవాతం ఉన్న వ్యక్తికి పరిగెత్తమని చెప్పినట్లే ఉంటుంది. మీ శరీరాన్ని సరిగ్గా చూసుకోండి, అప్పుడు మీ మైండ్ మీకు మద్దతు ఇస్తుంది."A healthy mind needs a healthy chemistry."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com
ఎవుసానికి ఏఐ ఊపు!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ఏ రంగం చూసినా దీని ప్రభావానికి ఆవల లేదు. అందుకు వ్యవసాయ రంగం కూడా మినహాయింపు కాదు. ‘అందరి సంక్షేమం–అందరి సంతోషం’ కోసం ఏఐని వినియోగించుకునే కృషి ఊపందుకుంది. ఈ దిశగా జరిగే కృషిలో ‘ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 135 దేశాల ఏఐ నిపుణులు, ఆవిష్కర్తలు, సీఈవోలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక ఏఐ శిఖరాగ్రసభ వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐ సాంకేతికతలను వెలుగులోకి తెచ్చింది. మన రైతులకు ఉపయోగపడే 26 ఉత్తమ కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయ ఆవిష్కరణలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఎంపిక చేసి, సంకలనాన్ని వెలువరించింది. రైతులోకం ఆదరణ పొందుతున్న మహిళల సార«థ్యంలోని ఏఐ వ్యవసాయ సంబంధ ఆవిష్కరణలపై ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ స్పెషల్ ఫోకస్...కార్బన్ డేటాకు ఏఐ సొబగుఆర్మ్స్4 ఏఐ... వరి సాగులో వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తడి పొడి నీటిపారుదల (ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయ్యింగ్– ఎ.డబ్ల్యూ.డి.) పద్ధతి ఉపయోగపడుతుంది. నీటిని నిరంతరాయంగా నిల్వగట్టకుండా వరి పంటకు అవసరమైనప్పుడు తగినంతగా నీరు అందిస్తూ ఉండే పద్ధతి ఇది. హరిత గృహ వాయువు అయిన మీథేన్ వాయువు తీవ్రతతో పాటు ఎరువులు, సాగునీరు వినియోగం ఎ.డబ్ల్యూ.డి. పద్ధతి వరి సాగులో తక్కువగా ఉంటుంది. దిగుబడుల్లో రాజీ పడకుండా ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిలో వరి సాగు చేసే రైతులకు కర్బన ఉద్గారాలను తగ్గించినందుకు ‘కార్బన్ క్రెడిట్లు’ ఇస్తారు. ఈ కార్బన్ క్రెడిట్లను వాతావరణాన్ని కలుషితం చెయ్యక తప్పని పరిశ్రమల యజమానులు కొనుగోలు చేస్తారు. ఆ విధంగా ఈ రైతులకు కొంత ఆదాయం కూడా వస్తుంది. అయితే, ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిని పాటించే ప్రతి పొలంలో క్రమం తప్పకుండా అన్ని వివరాలను, గణాంకాలను ఆధార సహితంగా నమోదు చెయ్యాల్సి ఉంటుంది. ఆ డేటాను థర్డ్పార్టీ వెరిఫికేషన్ తర్వాత కార్బన్ క్రెడిట్స్ మంజూరు చేస్తారు. అయితే, ఇక్కడే చిక్కంతా ఉంది. మన దేశంలో వరి రైతుల్లో కూడా అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే. 'క్షేత్రస్థాయిలో సెన్సార్లు ఏర్పాటు చేసి, (వారానికి/ నెలకోసారి) తరచూ గణాంకాలను ప్రతి పొలంలోనూ నమోదు చేసే ప్రక్రియ (దీన్ని మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్– ఎం.ఆర్.వి. అంటారు) అత్యంత కష్టతరమైనది, వ్యయప్రయాసలతో కూడినది కూడా! ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీకి చెందిన ‘ఆర్మ్స్ 4 ఏఐ’ అనే స్టార్టప్ నూటికి నూరుశాతం ఉపగ్రహాలను ఉపయోగించి అత్యంత విశ్వసనీయమైన, ఆధారపడదగిన, సరిచూడదగిన డేటాను సేకరించే కృత్రిమ మేధతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ‘జియో ఏఐ – ఆధారిత డిజిటల్ ఎంఆర్వీ’ అని దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతిలో వరి పొలంలో నీటి తేమ, మీథేన్ స్థాయి వంటి వివరాల సేకరణకు ఎటువంటి సెన్సార్లను పెట్టాల్సిన పని లేదు. ఒక రైతు పొలం చిన్నదైనా, పెద్దదైనా, ఎన్ని పొలాల్లో అయినా ప్రతి రోజూ అధిక రెజొల్యూషన్తో కూడిన ఎర్త్ అబ్జర్వేషన్ చిత్రాలను సేకరించి, విశ్లేషించటం ద్వారా నమ్మదగిన డేటాను సేకరిస్తోంది. ఆర్మ్స్ 4 ఏఐ మొదట్లో 200 హెక్టార్ల వరి పొలాలతో ప్రారంభించి ఇప్పటికే 40 వేల హెక్టార్లలోని ఎ.డబ్ల్యూ.డి. వరి పొలాల్లో సేవలందిస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగృతి దబస్ తెలిపారు. నెలకోసారి క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించే పాత పద్ధతికి బదులు కొన్ని నిమిషాలకోసారి డేటాను తక్కువ ఖర్చుతోనే నమోదు చేసే అవకాశం తమ ఏఐ ఆధారిత సాంకేతికత వల్ల సాధ్యమైందని ఆమె తెలిపారు. ఆపరేషనల్ రిలయబిలిటీ అధికం కాబట్టి ఆడిటర్లు, కార్బన్ క్రెడిట్ల బయ్యర్లకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని జాగృతి వివరించారు.ఏఐ ఆధారిత డిజిటల్ బిడ్డింగ్అ΄్జావో ఆగ్రోటెక్... వరి ధాన్యం నుంచి పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వరకు అమ్ముకునే సమయంలో రైతులు నానా కష్టాలు పడుతుంటారు. గుజరాత్కు చెందిన అ΄్జావో ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యాల నాణ్యతా నిర్ధారణను ఆధునీకరించేందుకు కృత్రిమ మేధ ఆధారిత యంత్రాలను, వీటికి అనుసంధానంగా డిజిటల్ బిడ్డింగ్ సదుపాయాలను కూడా రూపొందించింది. వరి, పప్పుధాన్యాల నాణ్యతను కేవలం నిమిషంలో పది కోణాల్లో నిర్ధారించి, నివేదికలను డిజిటల్ ΄్లాట్ఫామ్లో ఈ యంత్రాలు నిమిషంలో నమోదు చేస్తాయి. చెయ్యటంతోపాటు ఎక్కడ, ఏ రైతు వాటిని పండించారనే కచ్చితమైన ట్రేసబిలిటీ సమాచారాన్ని అందిస్తాయి. ఏఐ ఆధారిత సాంకేతికతలకు గాను ఈ సంస్థకు రెండు పేటెంట్లు లభించాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఈ సాంకేతికతలకు ఆమోదం తెలిపింది. ఈ ఏఐ–ఆధారిత ధాన్యం విశ్లేషణా యంత్రం తేమ, శిలీంధ్రాలు, మచ్చలు తదితర పది అంశాలకు సంబంధించి ధాన్యాల నాణ్యతను నిష్పాక్షికంగా అంచనా వేస్తుంది. నాణ్యత గ్రేడ్ల ఆధారంగా ధర నిర్ణయానికి తోడ్పడుతూ బయ్యర్లను, రైతులను నేరుగా అనుసంధానిస్తుంది. ధాన్యాల నాణ్యతా విశ్లేషణ, ట్రేసబిలిటీ ద్వారా కోత అనంతర విలువ గొలుసు వాణిజ్య లావాదేవీలను కృత్రిమ మేధతో ఆధునీకరించిన ఘనత తమదని అ΄్జావో ఆగ్రోటెక్ సహ వ్యవస్థాపకురాలు నీరజా మెహతా చె΄్పారు. డిజిటల్ ఓపెన్–మార్కెట్ ట్రేడింగ్ ΄్లాట్ఫామ్ను కూడా అ΄్జావో సంస్థ ఏర్పాటు చేసింది. డిజిటల్ బిడ్డింగ్ ద్వారా రైతులు ఏ సమయంలోనైనా ఏ నమోదిత వ్యాపారికైనా ఉత్పత్తులను విక్రయించడానికి వీలవుతుంది. రైతు మెరుగైన ధరకు అమ్ముకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది. పరాఖ్ ΄్లాట్ఫామ్ ద్వారా ఓపెన్ డిజిటల్ ట్రేడింగ్ను మొట్టమొదటిగా వరి, సజ్జ ధాన్యాలను 300 మందికి పైగా గుజరాత్ రైతులు సుమారు రూ. 5 కోట్ల మేర అమ్మకాలు చేశారు. డిజిటల్ ట్రేడ్లో ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు పోటీ పడతారు. ధర విషయంలో పారదర్శకత ఏర్పడుతుంది. స్థానిక బ్రోకర్లు మోసం చెయ్యలేరు. తత్ఫలితంగా రైతులు 7% అధిక ధర పొందగలిగారు. గుజరాత్ సహకార శాఖ ధాన్యం కొనుగోళ్లలో కూడా ఈ ఏఐ ఆధారిత గ్రెయిన్ క్వాలిటీ అసెస్మెంట్ మిషన్లను వాడారు. సుమారు 500 మంది రైతులకు చెందిన 32 వేల పైచిలుకు ధాన్యపు బస్తాలను దాదాపు రూ. పది కోట్లకు విక్రయించారు. రైతులకు 5% అదనపు ఆదాయం వచ్చిందని నీరజా మెహతా వివరించారు.లక్షలాది రైతుల చేతుల్లో ‘ఫార్మర్చాట్’డిజిటల్ గ్రీన్ ట్రస్ట్.. లాభాపేక్షలేని అంతర్జాతీయ సాంకేతిక స్వచ్ఛంద సంస్థ. 17 ఏళ్ల అనుభవం గల ఈ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వయిజరీ ΄్లాట్ఫామ్ ‘ఫార్మర్చాట్’. 4 లక్షల భారతీయ రైతులతో పాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్లో దాదాపు 10 లక్షల మంది వ్యవసాయదారులు, పశుపోషకులు, విస్తరణ సిబ్బంది, ఎఫ్పీఓలు, స్వయం సహాయక బృందాల సభ్యులు ఇప్పటికే దీని ద్వారా సలహాలు, సూచనలు పొందుతున్నారు. తమ పంటలు, పశువులకు సంబంధించిన ఫొటోలను రైతులు అప్లోడ్ చేసి స్థానిక భాషలో ప్రశ్నలు అడిగితే.. రైతులకు స్థానిక భాషలోనే వాయిస్, టెక్ట్స్ మెసేజ్ల ద్వారా, వారికి అత్యంత అవసరమైన సమయంలో మార్గదర్శనం చెయ్యటం ఈ మొబైల్ యాప్ ప్రత్యేకత. తాజా వాతావరణ స్థితిగతులతో పాటు, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన చర్యలపై ‘ఫార్మర్చాట్’ సమాచారాన్నిస్తోంది. చిన్న, సన్నకారు రైతుల అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఫార్మర్చాట్’ డిజిటల్ విప్లవపు కొత్త శకానికి నిదర్శనమని డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ఇండియా సీఈఓ నిధి భాసిన్ తెలిపారు. మన దేశంలో 15 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలుంటే వారిలో 58%కి సరైన విస్తరణ సేవలందటం లేదన్నారు. ఈ కొరత తీర్చటానికి కృషి చేస్తున్నామన్నారు. ఫార్మర్చాట్ జెనెరిక్ ఏఐ అవుట్పుట్స్పై యాంత్రికంగా ఆధారపడదని, అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణుల అనుభవాలపై ఆధారపడి సూచనలు ఇస్తుందన్నారు. సంప్రదాయ విస్తరణ వ్యవస్థలో ఒక్కో రైతుపై 35 డాలర్లు ఖర్చు చేస్తుండగా, తాము కేవలం ఒక డాలర్ ఖర్చుతోనే సేవలందిస్తున్నామన్నారు. ఒక సర్వే ప్రకారం.. 74% మంది రైతులు ఫార్మర్చాట్ సూచనలు చాలా బాగా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. 83%మంది సులువుగా సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. 80% మంది సమగ్రంగా ఉన్నాయన్నారు. ఎరువులు, చీడపీడలు, పశుపోషణ సూచనలను 60%మంది రైతులు ఆచరిస్తున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
అంతర్జాతీయం
భీకర యుద్ధం దిశగా పాక్-అఫ్గాన్?.. లక్షలాది మంది విలవిల
కాబూల్/ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్- పాకిస్తాన్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య మొదలైన ఈ భీకర పోరు వేలాది కుటుంబాలను రోడ్డున పడేయడమే కాకుండా, పదుల సంఖ్యలో పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. గత గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఘర్షణలు దారుణమైన సైనిక చర్యలకు దారితీశాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అఫ్గానిస్థాన్లోని పలు ప్రాంతాల నుండి సుమారు 20,000 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు కనీసం 42 మంది పౌరులు మరణించగా, 104 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు సైతం ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.ఇప్పటికే తీవ్ర పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంతాల్లో అత్యవసర ఆహార పంపిణీ నిలిచిపోవడంతో సుమారు 1.6 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) హెచ్చరించింది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిచర్యగా తాము సరిహద్దు వెంబడి దాడులు ప్రారంభించినట్లు అఫ్గాన్ ప్రకటించడంతో ఈ పోరు మరింతగా ముదిరింది. ఇస్లామాబాద్ సైతం వెనక్కి తగ్గకుండా కాబూల్, కందహార్ నగరాలతో పాటు వ్యూహాత్మకమైన బాగ్రామ్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది.సరిహద్దులోని కునార్ ప్రాంతంలో క్షిపణి దాడులు, భారీ ఆయుధాల మోతతో ప్రజలు భీతావహ స్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కునార్లోని సిర్కానీ గ్రామంలోని వేలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇళ్లను వదిలి వెళ్ళగా, ఆస్తులను కాపాడుకునేందుకు ఇంటికి ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైనిక పరంగా ఇరు దేశాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు పరస్పర ప్రకటనలు చేసుకున్నాయి. అఫ్గాన్ సైన్యం తమ వైపు 25 మంది సైనికులు వీరమరణం పొందారని చెబుతూనే, సుమారు 150 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు పేర్కొంది.ఇది కూడా చదవండి: కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం
టెక్సాస్ ఘటనలో భారత సంతతి విద్యార్థిని మృతి
ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో గల యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందిన నలుగురిలో సవితా షణ్ముగసుందరం(21) అనే భారత సంతతి విద్యార్థి కూడా ఉన్నారు. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, 14 మంది గాయాలపాలయ్యారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాగా, సవితా షణ్ముగసుందరం మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎకనామిక్స్లో డ్యూయెల్ డిగ్రీ చేస్తున్నారు. వచ్చే మే నెలలో ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి కానుండగా ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఆస్టిన్లోని పేరున్న బ్యూఫోర్డ్లోని ఓ బార్ వెలుపల మిత్రులతో కలిసి ఉండగా కారులో వచి్చన దుండగుడు వారిపైకి కాల్పులకు దిగాడు. సమాచారం అందుకున్న నిమిషానికే అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. మృతులను సవితా షణ్ముగసుందరం, రైడర్ హారింగ్టన్, జోర్జ్ పెడెర్సన్లుగా, దుండగుడిని సెనెగల్లో జని్మంచిన 53 ఏళ్ల ఎన్డిగా డియాగ్నెగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఒక భారతీయ విద్యార్థి కూడా ఉన్నాడు. మొత్తమ్మీద ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇరాన్పై దాడుల నేపథ్యం.. 2000వ సంవత్సరంలో టూరిస్టు వీసాపై వచి్చన ఎన్డిగా డియాగ్నెగా 2006లో అమెరికా పౌరురాలిని వివాహమాడాడు. దీంతో 2013లో ఇతడికి పౌరసత్వం కూడా వచి్చందని హోం ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఇతడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఇరాన్ జాతీయ పతాకం, ఇరాన్ నేతల ఫొటోలు కొన్ని లభించాయి. అతడు ధరించిన టీ షర్టుపై ఇరాన్ జెండా డిజైన్, ‘ప్రాపర్టీ ఆఫ్ అల్లాహ్’అని రాసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడటానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ఎఫ్బీఐ శాన్ ఆంటోనియో విభాగం అధికారి అలెక్స్ డోరన్ మాత్రం ఘటనకు ఉగ్రవాదంతో సంబంధం ఉండే అవకాశం ఉన్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఎన్డిగా డియయాగ్నా ఈ ఘటనకు ప్రేరేపించిన కారణాలపై ముందుగానే ఒక నిర్ణయానికి రాలేమని ఎఫ్బీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాల వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అలీ ఖొమైనీ, ఇతర ఉన్నతాధికారులు మరణించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆమె సూపర్ స్టార్.. సవితా షణ్ముగ సుందరం మృతిపై టెక్సాస్ వర్సిటీ అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమెది కష్టించేతత్వమని, అందరితో కలిసిపోయే విద్యార్థి అని గుర్తు చేసుకుంటున్నారు. మెక్కాంబ్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రుస్ ఫిన్నే ‘ఎక్స్’లో..‘మా సూపర్స్టార్ విద్యార్థుల్లో షణ్ముగసుందరం ఒకరు. ఆమెను కోల్పోవడం నిజంగా బాధాకరం’అని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆమె ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగ జీవితం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. సవితా షణ్ముగసుందరం ఇక లేరనే విషయాన్ని తాము ఇప్పటికీ నమ్మలేకున్నామని తోటి విద్యార్థి ఒకరన్నారు. ‘తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించే కుమార్తె. ఎందరికో మంచి స్నేహితురాలు. ఈ ప్రపంచంలో తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యారి్థని’అంటూ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ప్రెసిడెంట్ జిమ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మరణం వార్త తమను ఎంతగానో కలిచి వేసిందని, ఆమెను మర్చిపోలేమని పేర్కొన్నారు.
రేపే నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు
కఠ్మాండు: నేపాల్ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. గురువారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో మూడేళ్ల క్రితమే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. రాజకీయ అనిశి్చతి, జెన్ జీ యువత పోరాటం వల్ల ప్రభుత్వం గత ఏడాది కూలిపోయింది. సుశీల కర్కీ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. నేపాల్ ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో 1.90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2022 నవంబర్లో జరిగిన పార్లమెంల్ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 10 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా చాలావరకు యువతే కావడం విశేషం. నేపాల్లో 18 ఏళ్ల వయసు రాగానే ఓటు వేసే హక్కు లభిస్తుంది. యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పారీ్టలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అవినీతిని అంతం చేస్తామని, సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. రాజకీయ అస్థిరతకు మారుపేరు నేపాల్ పార్లమెంట్లో మొత్తం 275 స్థానాలున్నాయి. దిగువ సభ అయిన ‘ప్రతినిధుల సభ’లో 165 స్థానాలుండగా, వీరిని ఎన్నికల ద్వారా ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగతా 110 మంది ఎంపీలను రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమకు లభించిన ఓట్ల శాతం ఆధారంగా నామినేట్ చేస్తాయి. నేపాల్ పార్లమెంట్లో ఏకైక పార్టీ అధికారం చెలాయించిన సందర్భాలు అరుదే. ఎక్కువగా కూటమి ప్రభుత్వాలే ఏర్పాటయ్యాయి. రెండు లేదా మూడు పారీ్టలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. రాజకీయ అస్థిరతకు మారుపేరు నేపాల్. గత రెండు దశాబ్దాల్లో 15 ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బాలేంద్ర షా పారీ్టకి విజయావకాశాలు నేపాల్లో ప్రధానంగా నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్దే ఆధిపత్యం. ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడిన సందర్భాలున్నాయి. ప్రజాగ్రహం వల్ల గత ఏడాది పతనమైన ప్రభుత్వం ఈ రెండు పారీ్టల కలయికతో ఏర్పడినదే. 2022లో స్థాపించిన నేషనల్ ఇండిపెండెంట్ పార్టీకి ఈసారి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ ప్రచార సభలకు జనం పోటెత్తారు. ఖాట్మాండు మాజీ మేయర్, నేషనల్ ఇండిపెండెంట్ పార్టీ ముఖ్యనేత బాలేంద్ర షా ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యరి్థగా తెరపైకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ ఇండిపెండెంట్ పార్టీ విజయం సాధిస్తే బాలేంద్ర షా ప్రధానమంత్రి కావడం తథ్యమని చెబుతున్నారు.
ఇక్కడికొచ్చేదాకా వణికిపోయాం
ఢిల్లీ/ముంబై/చెన్నై/బెంగళూరు: పశ్చిమాసియాలో మూడ్రోజులుగా చిక్కుకుపోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయుల్లో కొందరు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ క్షణమొక యుగంలా గడిచిందని, తిరిగొస్తామా అన్న భయంతో గడిపామని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఎయిర్పోర్ట్లకు చేరుకోగానే పశి్చమాసియాలో తాము అనుభవించిన భయాందోళనలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇప్పటిదాకా నా మనసు స్థిమితపడలేదు. విమానం ఎక్కాక కూడా అదే ఆందోళన. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాతే కుదుటపడ్డా’’అని సునీల్ గుప్తా అనే ప్రయాణికుడు చెప్పారు. ‘‘బుక్ చేసిన విమానం రద్దవడంతో నాలుగు రోజులు దుబాయ్లోనే ఉండాల్సి వచి్చంది. దూసుకొస్తున్న క్షిపణులను గగనతల రక్షణవ్యవస్థలు పేల్చేయడం కళ్లారాచూశా. దీంతో భయం ఒక్కసారిగా పెరిగింది. హోటల్ ఖర్చుల ఆర్థికభారం పెనుసమస్యగా మారింది’’ అని దుబాయ్ నుంచి వచి్చన నోయిడా వాసి అరవింద్ చెప్పారు. ‘‘ఇరాన్లో చదువుతున్న నా కూతురు హాస్టల్లో ఉంటోంది. వాళ్లకు సమీపంలో క్షిపణి పడటంతో హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది’’ అని కున్వర్ షకీల్ అహ్మద్ చెప్పారు. ‘‘న్యూయార్క్ నుంచి వస్తూ శనివారం దుబాయ్ చేరుకున్నా. మధ్యాహ్నం గగనతలం మూసేశారు. మమ్మల్ని హోటల్కు తరలించారు. బాంబులు, క్షిపణుల మోత చూసి వణికిపోయా’’ అని శుభా అనే మహిళ చెప్పారు. క్యూల్లో వేల మంది.. ‘‘విమానాలు రద్దయ్యాయని తెలియగానే దుబాయ్ ఎయిర్పోర్టులో చిన్నారులు ఏడుపు మొదలెట్టారు. అప్పటికే ఎయిర్పోర్ట్లో వేలాదిమంది పోగుబడ్డారు. క్యూ వరసల్లో దాదాపు 20,000 మంది నిలబడ్డారు. అందర్నీ తర్వాత వేర్వేరు హోటళ్లకు తరలించారు. స్వదేశానికి తిరిగొచ్చామంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చలువే’’ అని తమిళనాడులోని నాగూర్కు చెందిన సయ్యద్ అలీ చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేరుకున్న భారతీయుల ముఖాల్లో అమితానందం కని్పంచింది. ‘‘అబూదాబిలో చమురుశుద్ధి కంపెనీలో పనిచేస్తా. భారత్కు వచ్చేందుకు అక్కడి ఎయిర్పోర్టకు రాగానే అలర్ట్ ప్రకటించారు. కిటికీల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు. కింద కూర్చోమన్నారు. క్షిపణి దూసుకొస్తోందని చెప్పగానే ప్రాణం పోయినంత పనైంది. మీకు సమీపంలో క్షిపణి వచ్చిందంటే ఎలా ఉంటుంది?’’అని మంగళూరుకు చెందిన సౌరభ్ చెప్పారు.
జాతీయం
‘రాజ్యసభ’ బరిలో హేమాహేమీలు.. ఖరారు చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తోంది. మహారాష్ట్ర నుంచి ఖాళీ అవుతున్న ఏడు స్థానాలకు గాను నలుగురు కీలక నేతలను బరిలోకి దించుతున్నట్లు బుధవారం పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, ప్రముఖ నేతలు మాయా చింతామన్ ఇవ్నతే, రాంరావు వాడ్కుటేలకు చోటు దక్కింది. మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తన పట్టును నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తోంది.మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా బీజేపీ తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. బీహార్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్తో పాటు శివేష్ కుమార్లను బరిలోకి దించారు. నితిన్ నబిన్ నియామకం పార్టీలో సరికొత్త చర్చకు దారితీసింది. గత జనవరిలో జె.పి. నడ్డా స్థానంలో బాధ్యతలు చేపట్టిన 45 ఏళ్ల నబిన్, బీజేపీలో మూడవ తరం నాయకత్వ ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచారు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్.కె. అద్వానీ వంటి దిగ్గజాల మార్గదర్శకత్వంలో ఎదిగి, నేడు ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన నబిన్, ప్రస్తుతం బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.హర్యానాలో రాజ్యసభ అభ్యర్థిగా కర్నాల్ మాజీ ఎంపీ సంజయ్ భాటియాను పార్టీ ఎంపిక చేసింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు అత్యంత సన్నిహితునిగా పేరున్న భాటియా, తనలాంటి సాధారణ కార్యకర్తకు ఈ అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో భాటియా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక అస్సాం నుంచి తెరష్ గోవాలా, జోగెన్ మోహన్; ఛత్తీస్గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, ఒడిశా నుంచి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, సుజిత్ కుమార్లను బీజేపీ అధిష్టానం నామినేట్ చేసింది.ఇది కూడా చదవండి: ‘ఇది రంగుల పండుగ మాత్రమే కాదు’..’ .. సీఎం హోలీ సందేశం
మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్ డీల్ హాట్ టాపిక్
ముంబైలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గోరేగావ్ ఒకటి. ఆధునిక హై-రైజ్అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండటంతో ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి సుష్మితా సేన్ (Sushmita Sen), ఆమె తల్లి సుబ్రా సేన్ ముంబైలో తమ అపార్ట్మెంట్ను అద్దెకు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. దీని నెలవారీ అద్దె రూ. 1.95 లక్షలతో 36 నెలల (3 ఏళ్లు) లీజ్ కిచ్చారు. అంటే ఈ ప్రాపర్టీ ద్వారా మొత్తం మూడేళ్లకు గాను సుమారు 74 లక్షలు (73.76 లక్షలు) ఆదాయం సమకూరనుందిఈ లగ్జరీ ఫ్లాట్ గోరేగావ్లోని ప్రముఖ 'ఓబెరాయ్ ఎక్స్క్విజిట్' (Oberoi Exquisite) ప్రాజెక్ట్లో ఉంది. లీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్సైట్లో స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం. ఈ ఒప్పందం అధికారికంగా ఫిబ్రవరి 2026లో నమోదు చేయబడింది. దీని ప్రకాం సెక్యూరిటీ డిపాజిట్ కింద 6 లక్షలు కాగా, స్టాంప్ డ్యూటీ కింద రూ.18,900, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 1,000 చెల్లించారు. ప్రతి ఏటా 5శాతం మేర అద్దె పెరుగుతుంది.ఈ ప్రాపర్టీ ప్రత్యేకతలు విషయానికి వస్తే కార్పెట్ ఏరియా 996 చదరపు అడుగులతో కలిపి మొత్తం ఏరియా 1,241 చదరపు అడుగులు. ఇందులో రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియోసుస్మితా సేన్ గుర్తించి సంక్షిప్తంగా1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా సుస్మితా సేన్ చరిత్ర సృష్టించారు. 'బీవీ నంబర్ 1', 'మై హూ నా' వంటి సినిమాలతో మెప్పించిన సుస్మితా సేన్ ఇటీవల 'ఆర్య', 'తాళి' వంటి వెబ్ సిరీస్లతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్)
భారత్ గ్లోబల్ పవర్గా ఎదగకుండా చేయడానికే..: ఖమేనీ ప్రతినిధి
న్యూఢిల్లీ: భారత్తో పాటు చైనాను గ్లోబల్ పవర్స్గా ఎదగకుండా చేయడానికే తమ దేశంతో అమెరికా ఘర్షణలకు దిగుతోందని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి (ఖమేనీ ప్రతినిధి) అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అబ్దుల్ మజీద్ ఇవాళ ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం నుంచి భారత్కు ప్రత్యేక ప్రతినిధిగా అబ్దుల్ మజీద్ ఉన్నారు.అమెరికా అగ్రరాజ్య హోదాను నిలుపుకోవడానికి ప్రపంచ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని అబ్దుల్ మజీద్ ఆరోపించారు. “సమీప భవిష్యత్తులో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా భారత్, చైనా, రష్యా, అమెరికా ఉంటాయి. అయితే, భారత్ లేదా చైనా తనతో పాటు సమాన శక్తులుగా ఎదగడాన్ని అమెరికా జీర్ణించుకోదు. అందుకే దీన్ని అడ్డుకోవడానికి ఈ యుద్ధాలను ప్రేరేపించి అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది” అని అబ్దుల్ మజీద్ చెప్పారు.అమెరికా ప్రారంభించిన యుద్ధమిది..ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ అని, ఇరాన్ కాదని అబ్దుల్ మజీద్ తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ దేశం తనను తాను రక్షించుకుంటోందని ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజానీ కూడా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. “మాపై దాడి చేసి మా పౌరులపై బాంబులు వేస్తున్నారు. మేము కేవలం మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాం” అని చెప్పారు. యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానే కాబట్టి దానిని ముగించాల్సింది కూడా ఆ దేశమేనని అబ్దుల్ మజీద్ తెలిపారు. వారు ఆపితే తాము కూడా ఆపుతామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత్కు మరో ఐదు ఎస్-400లు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..ఇరాన్ రెండు యుద్ధాలు ఎదుర్కొంటోందని అబ్దుల్ మజీద్ తెలిపారు. ఒకటి అమెరికా, ఇజ్రాయెల్తో సైనిక ఘర్షణ, మరొకటి నకిలీ వార్తల యుద్ధం అని అన్నారు. “అమెరికా, ఇజ్రాయెల్పై సైనిక యుద్ధాన్ని మేము ఎదుర్కోగలం. అయితే దీనికంటే పెద్ద మరో యుద్ధం జరుగుతోంది. అదే నకిలీ కథనాల యుద్ధం. ఈ యుద్ధంలో వారు నకిలీ వార్తలు సృష్టిస్తారు. ఇరాన్ ప్రజలు పాలన మార్పు కోరుకుంటున్నారని చెబుతారు” అని ఆయన అన్నారు. మొత్తానికి ఇతర దేశాల ఎదుగుదలను అడ్డుకోవడమే అమెరికా లక్ష్యమని, తద్వారా వాషింగ్టన్కు తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్పారు.
‘ఇది రంగుల పండుగ మాత్రమే కాదు’..’ .. సీఎం హోలీ సందేశం
గోరఖ్పూర్: సమాజంలో శాంతి, భద్రత, పరస్పర నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఉత్సాహపూరితమైన పండుగలను జరుపుకోగలమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుధవారం గోరఖ్నాథ్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదని, అది సామాజిక సామరస్యానికి, సమిష్టి ఆనందానికి ప్రతీక అని అభివర్ణించారు.వేల ఏళ్ల నాటి భారతీయ సంప్రదాయాలను, పూర్వీకులు అందించిన వారసత్వాన్ని ప్రస్తుత తరం అంతే ఉత్సాహంతో కొనసాగించడం అభినందనీయమన్నారు. కులమతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ‘హోలీ’ వేడుకల్లో భాగస్వామ్యం కావడం ద్వారా సామాజిక విభేదాలను రూపుమాపి, సామరస్య పూర్వక వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది హోలీ వేడుకలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో 1.61 లక్షలకు పైగా ప్రాంతాలలో హోలికా దహనం కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. హోలికా దహనం అనేది భగవంతుని నరసింహ అవతారాన్ని స్మరించుకునే పవిత్ర సందర్భమని, సమాజంలోని అశాంతిని తొలగించి, దుష్ట శక్తులపై సచ్ఛీలత సాధించిన విజయానికి ఇది నిదర్శనమని గుర్తుచేశారు.ప్రహ్లాదుడు, శబరి లేదా అర్జునుడి వంటి పౌరాణిక పాత్రల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తే, సానుకూల శక్తులు బలోపేతమై ప్రతికూల శక్తులు వాటంతట అవే పతనమవుతాయని యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘నవ భారతం’ ఆవిర్భవిస్తోందని, దేశం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అనంతరం గోరఖ్పూర్లో నిర్వహించిన 'భగవాన్ నరసింహ శోభా యాత్ర'లో పాల్గొన్న ముఖ్యమంత్రి భక్తులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: ‘పాట వినపడలే..’.. ప్రముఖ సింగర్ షోలో ఫ్యాన్స్ కన్నీళ్లు!
ఎన్ఆర్ఐ
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది.
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
అమెరికాలోని జార్జియాలో ఉండే భారతీయ అమెరికన్కి చేదు అనుభవం ఎదురైంది. చేయని నేరానికి ఆరు వారాల జైలు శిక్ష అనుభవించారు. కానీ విచారణలో కోర్టు ఈ కేసు కొట్టి వేసింది. దీంతో ఆయన న్యాయాపోరాటానికి సిద్ధపడ్డారు. జార్జియాలోని వాల్మార్ట్ స్టోర్లో ఒక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణతో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించిన భారతీయ అమెరికన్ 57 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.జార్జియాలోని అక్వర్త్లోని వాల్మార్ట్లోతన కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించా డని రెండేళ్ల బాలుడి తల్లి కరోలిన్ మిల్లర్ ఆరోపించింది. ఈ సంఘటనను వాల్మార్ట్ ఉద్యోగికి, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల మహేంద్ర పటేల్ను 2025, మార్చి 24న అరెస్టు చేశారు. ఈ విషయంలో తనకి, పటేల్కి మధ్య బాబు కోసం "టగ్ ఆఫ్ వార్" జరిగిందని కూడా పేర్కొంది. అయితే తాను నిరపరాధి నని మొదటినుంచి గట్టిగా వాదించారు మహేంద్ర పటేల్. 2025 మార్చి 18న, తాను వాల్మార్ట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు, టైలెనాల్ (టాబ్లెట్స్) ఎక్కడ ఉన్నాయోమిల్లర్ను దిశానిర్దేశం చేయమని అడిగానని పటేల్ చెప్పాడు. అప్పుడు ఆమె కొడుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడని గమనించి, అతను పడిపోకుండా ఉండటానికి చేయి చాచానని చెప్పుకొచ్చాడు.SHOCKING & SAD !! Mahendra Patel has filed a federal civil rights lawsuit after being jailed for 47 days over a Walmart incident.He was arrested after a shopper accused him of trying to kidnap her child. Police video later showed no force, no injury, and no kidnapping… pic.twitter.com/cRlPZfwvEH— M9 USA🇺🇸 (@M9USA_) February 11, 2026 తప్పుడు ఆరోపణల వల్ల పటేల్ 46 రోజుల పాటు కాబ్ కౌంటీ జైలులో గడపాల్సి వచ్చింది. ఆరు వారాల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. చివరికి ఆగస్టు 2025లో జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసును కొట్టివేసింది. రెండు పార్టీలు ఒక పరిష్కారానికి వచ్చాయని కోబ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ చెప్పింది.నిజం నిరూపించిన సీసీటీవీ ఫుటేజ్అతను బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపితమైంది.పటేల్ చాలా ప్రశాంతంగా ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లడం, ఆమె అతనికి 'థంబ్స్ అప్' చూపించడం స్పష్టంగా కనిపించింది. అలాగే మిల్లర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి పెనుగులాట జరగలేదు. ఇదీ చదవండి: రైల్లో శాండ్విచ్...నెటిజన్ల రియాక్షన్స్ వైరల్ వీడియో మానసిక వేదన, వ్యాపార నష్టం ఈ అనుభవాన్ని "పీడకల"గా అభివర్ణించారు. ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగ దీసిందనీ, ఆర్థికంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "టైలెనాల్ కోసం వెళ్తే, నా జీవితంలోనే అతిపెద్ద తలనొప్పి ఎదురైంది" అని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబం కూడా నరకం చూసిందన్నారు. ఒకవేళ వాల్మార్ట్ వీడియో లేకపోయి ఉంటే. ఆమె మాట వర్సెస్ నా మాటగా మారింది. నేనిక జైల్లో మగ్గిపోవాల్సి వచ్చేదన్నారు. ఆ ఫుటేజ్అక్షరాలా తన ప్రాణాన్ని కాపాడిందన్నారు.సుమారు రూ. 210 కోట్లుతాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆయన దావా వేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆక్వర్త్ నగరంపై, తప్పుడు ఫిర్యాదు చేసిన మిల్లర్పై , పోలీసులపై 25 మిలియన్ల డాలర్లు ( సుమారు (రూ.210 కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతంసీసీటీవీ ఫుటేజ్లో ఎలాంటి తప్పు కనిపించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగమేనని పటేల్ తరపు న్యాయవాది మార్క్ గ్రాస్మన్ అన్నారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో
క్రైమ్
భర్తను హత్య చేసిన భార్యకు పదేళ్ల జైలు
రంగారెడ్డి జిల్లా: భర్తను హత్య చేసిన భార్యకు ఎల్బీనగర్ కోర్డు పది సంత్సరాల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది. మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పద్మశాలిపురంలో నివాసం ఉండే ప్రభుగౌడ్, భార్య లక్ష్మి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. భార్య లక్ష్మి కల్లు తాగి వస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. 2017 ఏప్రిల్ 6వ తేదీన సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం రవి వంట చేయాలని భార్యను కోరాడు. ఇందుకు నిరాకరించిన ఆమె తాను పుట్టింటికి వెళ్లిపోతానని బట్టలను సిద్ధం చేసుకొని బయలుదేరింది. అదే సమయంలో మళ్లీ గొడవ పడ్డారు. దీంతో లక్ష్మి కోపంతో రగిలిపోయి రవిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. కేకలు పెడుతూ మంటలతో బయటకు పరుగులు తీసిన రవిని స్థానికులు రక్షించారు. మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్లో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న అతడు చనిపోయాడు. ఇప్పటి మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టగర్ పి.జగదీశ్వర్ ఆదారాలను ఎల్బీనగర్లోని కోర్టుకు సమరి్పంచారు. విచారణ అనంతరం లక్ష్మికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వై.సత్యేంద్ర తీర్పునిచ్చారు. గృహ హింస కేసులో ఏడాది.. సిటీ కోర్టులు: గృహహింస కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి మనోరంజన్లోని 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు న్యాయమూర్తి డి.అజయ్ కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు.. మలక్పేట్కు చెందిన తౌఫిక్ ఖాన్ అదే ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ బేగంను 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ మద్యం తాగి ఇంటికి వచ్చి విపరీతంగా కొడుతున్నాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని 2018లో సీసీఎస్ ఉమెన్ పోలీస్స్టేషన్లో ఇర్ఫాన్ బేగం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చార్జిషీట్తో పాటు మనోరంజన్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డి.అజయ్ కుమార్ తీర్పు వెల్లడించారు.
నటిపై అసభ్య పోస్టులు పెట్టిన నటుడి అరెస్టు
హైదరాబాద్: సోషల్ మీడియాలో బోగస్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రముఖ నటిపై అసభ్య పదజాలంతో కామెంట్ పెట్టిన నటుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. వరంగల్కు చెందిన సినీ నటుడు రుషిత్(26) రీల్ మాయ–1 పేరుతో మూడు వారాల క్రితం ఓ బోగస్ అకౌంట్ను క్రియేట్ చేసి ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్లలో ఓ నటి మీద అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టాడు. సదరు నటికి ఓ దర్శకుడితో లింక్ ఉందంటూ ఫేక్ ప్రచారం చేశాడు. దీంతో బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు రుషిత్ బోగస్ అకౌంట్లపై లోతుగా దర్యాప్తు చేశారు. సదరు సోషల్ మీడియా సంస్థలకు కూడా లేఖలు రాసి ఆరా తీయగా నిందితుడి గుట్టు బయటపడింది. అమీర్పేటలోని ఓ హాస్టల్లో ఉంటూ సినిమాల్లో వేషాలు వేసుకుంటూ కాలం గడుపుతున్న రుషిత్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బొబ్బిల్లంకలో మాజీ భార్య, అత్త హత్య
సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక సుబ్బారావుపేటలో మాజీ భార్య, అత్త దారుణ హత్య సంచలనం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుబ్బారావుపేటకు చెందిన సోడదాసి సీతారామరాజు (పండు), అదే వీధిలో ఉంటున్న లత (30)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సీతారామరాజు ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవాడు. గతంలో పోక్సో కేసులో కొన్నాళ్లు రిమాండ్లో ఉన్నాడు. అతడి బెయిల్ కోసం లత ఫైనాన్స్ వ్యాపార లావాదేవీలు చూసుకునేది. బెయిల్పై వచి్చన సీతారామరాజు భార్య లతపై అనుమానం పెంచుకున్నాడు. ఒకసారి మద్యం మత్తులో ఆమెను తీవ్రంగా కొట్టాడు. భర్తపై అప్పట్లో సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మనస్పర్థలు పెరగడంతో ఏడాదిన్నర కిందట విడిపోయారు. పిల్లలు ముగ్గురూ తండ్రి సీతారామరాజు వద్దే ఉంటున్నారు. రెండో పెళ్లి చేసుకున్న సీతారామరాజు సీతారామరాజు తన ఇంటి ఎదురుగా ఉంటున్న కుమారిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె గర్భిణి అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలోని తన చెల్లి, బంధువుల ఇంట్లో ఉంటున్న లత ఇటీవల బొబ్బిల్లంకలోని తల్లి గుమ్మడి లక్ష్మి (50) వద్దకు వచ్చింది. ఆమెను సీతారామరాజు గమనించాడు. తనను వదిలేసిన మొదటి భార్య లత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోందని, పిల్లల ఆలనా పాలనా తానే చూసుకోవాల్సి వస్తోందని, ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కత్తులు తీసుకుని ముగ్గురు స్నేహితులతో కలిసి మాజీ అత్త లక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు స్నేహితులు గేటు బయట ఉండగా, మరో స్నేహితుడు గుమ్మం వద్ద నిలబడ్డాడు. ఇంట్లోకి వెళ్లిన సీతారామరాజు నిద్రిస్తున్న తన మొదటి భార్య లత చేతులు, భుజాలు, మెడ, ముఖంపై కత్తితో నరికాడు. ఆమె భయంతో కేకలు వేసింది. అది గమనించిన అత్త లక్ష్మి గట్టిగా అరుస్తూ అతడికి అడ్డం వచ్చింది. ఆమెను కూడా సీతారామరాజు కత్తితో నరికి హతమార్చాడు. కత్తిని గోదావరిలోకి విసిరేసి, నేరుగా సీతానగరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల విచారణ.. సంఘటన స్థలాన్ని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి మంగళవారం సందర్శించారు. నిందితుడు సీతారామరాజుకు నేర చరిత్ర ఉందని తెలిపారు. పన్నెండేళ్ల కిందట రోడ్డుపై ఓ వ్యక్తిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడని, అటువంటి వాడు బతకకూడదదని కుటుంబ సభ్యులు పోలీసుల వద్ద రోదించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యల్లో సీతారామరాజుకు సహకరించిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సీఐ మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పండుగ వేళ విషాదం
సుభాష్నగర్/బోధన్/ఆర్మూర్టౌన్/హాలియా: హోలీ వేడుకలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. తెలంగాణ, ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. హోలీ సంబరాలను ముగించుకొని నది/చెరువులోకి స్నానాలకని వెళ్లిన వారు మృతి చెందారు. మరో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. విగత జీవులైన పిల్లలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సూరారంలో... పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన సాగర్, అజయ్, ఛత్రపతి, కృష్ణనగర్కు చెందిన అభిషేక్, శ్రీరామ్నగర్కు చెందిన విగ్నేష్ స్నేహితులు. వీరు బహదూర్పల్లిలోని తాము చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విశ్వకర్మ కాలనీని ఆనుకొని ఉన్న రామన్ చెరువులో స్నానానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అజయ్, విగ్నేష్, ఛత్రపతి.. షాపులో షాంపూలు కొనితెస్తామని చెప్పగా.. సాగర్, అభిషేక్ చెరువు వద్దకు వెళ్లి లోపలికి దిగారు. అంతలోనే మిగతా ముగ్గురు స్నేహితులు అక్కడికి రాగా ఆ ఇద్దరు చెరువులో మునిగిపోతూ చేతులు ఊపారు. దీంతో బయట ఉన్న ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నీళ్లలోకి దిగారు. అయితే, అక్కడ లోతుగా ఉండటంతో సాగర్, అభిషేక్ మునిగిపోయారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం తొగుట గ్రామానికి చెందిన ఏసు, జ్యోతిల కుమారుడు అభిషేక్. విశ్వకర్మ కాలనీకి చెందిన సంతోష్ కుమార్, రేఖ దంపతుల చిన్న కుమారుడు సాగర్. మంజీరలో మునిగి... స్నేహితులతో హోలీ సంబరాలు జరుపుకుని మంజీరనదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఒకటో వార్డు పరిధిలోని ఆచన్పల్లికి చెందిన సాయికుమార్ (20), రోని చౌదరి (18) మంగళవారం సాలూర సమీపంలోని మంజీర నదికి వెళ్లారు. స్నానాలు చేస్తూ నీటిలో గల్లంతై మృతి చెందారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు నదికి చేరుకుని మృత దేహాలను బయటకు తీయించారు. సాయికుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రోని చౌదరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్మూర్లో విషాదం : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో స్థానిక గోల్ బంగ్లా ప్రాంతానికి చెందిన బోగడ నరేష్ పెద్ద కుమారుడు హర్షిత్ (15) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. హర్షిత్ మంగళవారం స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నాడు. అనంతరం గుండ్ల చెరువు వద్ద ఉన్న ట్యాంక్బండ్కు వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో హర్షిత్ నీటిలో మునిగిపోయి మరణించాడు. సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్(14), అదే మండలం శాఖాపురం గ్రామానికి చెందిన పోలేపల్లి నాని స్నేహితులు. వీరు హాలియాలో నివాసముంటున్నారు. బబ్లూచారి బైక్ వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. కార్తీక్ 9వ తరగతి చదువుతున్నాడు. నాని ఆటోలకు రెగ్జిన్ పనిచేస్తున్నాడు. ముగ్గురు కలిసి బిర్యానీ పార్సిల్తో మంగళవారం సాయంత్రం హాలియాలోని అక్విడెక్ట్ వద్దకు వెళ్లారు. బిర్యానీ తిన్న అనంతరం కార్తీక్ చేతులు కడుక్కోవడానికి సాగర్ ఎడమ కాల్వలోకి దిగుతుండగా కాలుజారి అందులో పడిపోయాడు. కార్తీక్ను రక్షించేందుకు బబ్లూచారి కాల్వలోకి దిగుతుండగా.. అతడు కూడా కాలుజారి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. నాని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిగా ఉండటంతో వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఏపీలో... గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారు కండ్రిగలో ముగ్గురు స్నేహితులు చెరువులోకి దిగి మృతిచెందారు. బోళ్ల సాయి (15), ముచ్చు వెంకట జోసఫ్ (15), దుప్పుల వినయ్కుమార్(12) హోలీ పండుగ జరుపుకొని అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. కాలుజారి సాయి, వెంకట జోసఫ్, వినయ్కుమార్ చెరువులో పడి మృతిచెందారు. వీరు గొల్లనపల్లి జెడ్పీ హైసూ్కల్లో చదువుతున్నారు.
వీడియోలు
విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై దాడి
ఒక పశువులాగా.. క్లాస్ రూమ్ లోనే..! న్యూడ్ వీడియోలు తీసి..!
మషాద్ నగరంలో ఖమేనీ అంత్యక్రియలు
ఇరాన్ తో యుద్ధం.. బెడిసికొట్టిన అమెరికా ప్లాన్ పెంటగాన్ సంచలన రిపోర్ట్
BJP చేతికి బీహార్ సీఎం పోస్ట్ నితీష్ కుమార్ గుడ్ బై!
యుద్ధం దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
పీఎం రాహత్ స్కీమ్... ఆసుపత్రి బిల్లు ప్రభుత్వం కడుతుంది
జయలలితే నాకు ఇన్స్పిరేషన్.. స్త్రీ గొప్పతనం చాటేలా “సరస్వతి" సినిమా
ఇరాన్ తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం

