breaking news
Gossips
-
పాన్ ఇండియా దర్శకుడి కుమారుడు హీరోగా ఎంట్రీ
సినీ వారసులు ఎలాంటి విద్యను అభ్యసించినా వారి దృష్టి మాత్రం సినిమాపైనే ఉంటుందని చెప్పవచ్చు. అందరూ కాదుకానీ, ఎక్కువ భాగం ఇంతే. ఇంతకుముందు చాలా మంది సినీ సెలబ్రిటీల వారసులు హీరో, హీరోయిన్లుగానూ, దర్శకులు, నిర్మాతలుగానూ మారి రాణిస్తున్నారు. తాజాగా దర్శకుడు శంకర్ వారసుడు హీరోగా తెరంగేట్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. భారీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్–2, గేమ్చేంజర్ చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఈయన ఇండియన్–3 చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా వేల్పారి అనే చారిత్రక నవలను సినిమాగా రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే దర్శకుడు శంకర్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. అందులో అదితి శంకర్ ఇప్పటికే కథానాయకిగా రంగప్రవేశం చేసి వరుసగా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు కూడా. తాజాగా శంకర్ వారసుడు అర్జిత్ హీరోగా పరిచయానికి రంగం సిద్ధమైందని సమాచారం. ఈయన ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న మదరాసి చిత్రం కోసం అర్జిత్ పనిచేస్తున్నారు. త్వరలో ఈయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. దర్శకుడు అట్లీకి ఇష్టమైన తన శిష్యుడి దర్శకత్వంలో అర్జిత్ హీరోగా పరిచయమయ్యేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం అర్జిత్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్?
సినిమా బాలేకపోతే ఎంత ప్రచారం చేసినా జనాలు అస్సలు పట్టించుకోరు. అదే కంటెంట్ నచ్చితే మాత్రం భాషతో సంబంధం లేకుండా ఎగబడి చూస్తారు. 2022లో వచ్చిన కాంతార (Kantara Movie) అనే కన్నడ సినిమా ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. దాదాపు రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాంతార బ్లాక్బస్టర్ హిట్నిర్మాతలు సినిమా హిట్టని ఊహించుంటారు కానీ ఇలా వందల రెట్ల లాభాలు వస్తాయని మాత్రం కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడమే కాకుండా అందులో ప్రధాన పాత్రలో నటించాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబలే ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. ఈ బ్లాక్బస్టర్ హిట్ చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! కాంతార 3లో తారక్?ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. అంటే ఇది ఫస్ట్ పార్ట్ కాగా, ఇప్పటికే రిలీజైంది రెండో పార్ట్ అన్నమాట! తాజాగా ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రిషబ్ శెట్టి కాంతార 3 కూడా తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడని, అందులో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా భాగం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ రూమర్ కనక నిజమైతే అభిమానులకు మాత్రం పండగే! సినిమా..ప్రస్తుతం ఎన్టీఆర్.. వార్ 2 మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తారక్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ పౌరాణిక సినిమా కూడా చేయనున్నాడు. దేవర 2 కూడా లైన్లోనే ఉంది.చదవండి: AI క్లైమాక్స్.. ఆత్మను చంపేశారు: ధనుష్ ఆగ్రహం -
సూర్యకు హీరోయిన్గా సంగీత దర్శకుడి సోదరి!
సూర్య.. కొన్నాళ్ల క్రితమే 'రెట్రో'తో ప్రేక్షకుల్ని పలకరించాడు. తమిళంలో పర్లేదు గానీ తెలుగులో ఘోరమైన డిజాస్టర్ అయింది. ప్రస్తుతం 'కరుప్పు' అనే మూవీ చేస్తున్నాడు. దీనికి ఆర్జే బాలాజీ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితోనూ సూర్య ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులోనే ప్రముఖ సంగీత దర్శకుడి సోదరి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి భవాని శ్రీ.. సూర్య-వెంకీ అట్లూరి మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. భవాని శ్రీ ఇంతకుముందు పావ కథైగల్, కాపే రణసింగం సినిమాల్లో హీరోయిన్గా చేసింది. సూరికి జంటగా 'విడుదలై' చిత్రంలోనూ కథానాయికిగా నటించింది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో ఈమె పాత్ర ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు చేస్తోంది. మరి భవాని శ్రీ కూడా సూర్యకు హీరోయిన్ లేదా మరేదైనా పాత్ర అనేది తెలియాల్సి ఉంది. రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన 'బిగ్బాస్' ఫేమ్ గౌతమ్) -
కింగ్డమ్ తొలిరోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మాస్ కమ్బ్యాక్
హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కోటి ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ మూవీ (Kingdom Movie) జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొంత నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ పాజిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎంతన్నదానిపై అందరి దృష్టి పడింది. కానీ, ఎవరి లెక్కలకు అందనంతంగా భారీ కలెక్షన్స్ వచ్చాయి. కింగ్డమ్.. తొలి రోజు ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.హిట్టు కొట్టినంఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ను రౌడీ హీరో షేర్ చేస్తూ మనం (హిట్) కొట్టినం అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్..! ఇకపోతే కింగ్డమ్ వీకెండ్లో రాలేదు, అందులోనూ హాలీడే అసలే లేదు. అయినా ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైగర్ మూవీ వచ్చినప్పుడు ఎన్నెన్ని మాటలన్నారు.. అప్పుడు ఎత్తిన నోళ్లు దించుకునేలా మా హీరో కింగ్డమ్తో సమాధానం చెప్పాడని సంతోషపడుతున్నారు.ఆ సినిమాలతోనే పోటీఅయితే ఈ చిత్రానికి.. మహావతార్ నరసింహ, సయారా చిత్రాల నుంచి గట్టి పోటీనే ఉంది. హరిహర వీరమల్లును జనాలు ఎలాగో లైట్ తీసుకున్నారు కాబట్టి ఇదేమంత పోటీ కాదు. మున్ముందు కింగ్డమ్ ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి! కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్, వెంకటేశ్, కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. BOOM 💥🔥Manam Kottinam 🤗❤️ https://t.co/FOqpt7dxjK— Vijay Deverakonda (@TheDeverakonda) August 1, 2025చదవండి: రెమ్యునరేషన్ విషయంలో అజిత్ సరికొత్త ఢీల్ -
అనుష్కా శెట్టి ‘ఘాటి’ రిలీజ్ అప్పుడేనా?
అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఘాటి’. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. జూలైలో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను నవంబరులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. వీఎఫ్ఎక్స్ వర్క్స్పై మరింత శ్రద్ధ పెట్టి, మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది టీమ్ ప్లాన్. దీంతో ఓ దశలో సెప్టెంబరులో రిలీజ్ అనుకున్నప్పటికీ నవంబరులో అయితే మరిన్ని థియేటర్స్ కూడా దొరకుతాయని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు మరింత సమయం లభిస్తుందని కూడా చిత్రయూనిట్ ఆలోచిస్తోందట. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ‘ఘాటి’ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతో సహా పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్. -
'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?
'అర్జున్ రెడ్డి', 'గీతగీవిందం' సినిమాల తర్వాత విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'కింగ్డమ్' చేశాడు. దీనిపై బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నాడు. అందుకు తగ్గట్లే మూవీపై హైప్ రోజురోజుకీ బాగానే పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం టికెట్ బుకింగ్స్లోనూ అది క్లియర్గా కనిపిస్తోంది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ నడుస్తోంది.శ్రీలంక బ్యాక్ డ్రాప్లో తీసిన 'కింగ్డమ్' సినిమాలో అన్నదమ్ముల ఎమోషన్తోపాటు యాక్షన్ కూడా కాస్త ఎక్కువగానే ఉండబోతుందని ట్రైలర్తో క్లారిటీ ఇచ్చేశారు. అనిరుధ్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవి కూడా మూవీపై కాస్త అంచనాలు పెంచాయని చెప్పొచ్చు. ఇందులో విజయ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ కాగా, అన్న పాత్రలో సత్యదేవ్ నటించాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు)విజయ్ దేవరకొండ సూరి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కానిస్టేబుల్, అండర్ కవర్ ఏజెంట్, ఖైదీ.. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకుగానూ విజయ్ రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతడి తర్వాత అనిరుధ్కి రూ.10 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు గౌతమ్ రూ.7 కోట్లు వరకు అందుకున్నట్లు టాక్. అన్న పాత్ర చేసిన సత్యదేవ్ కి రూ.3 కోట్లు, హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీకి రూ.కోటి పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత నాగవంశీ.. 'కింగ్డమ్' చిత్రానికి మొత్తంగా రూ.130 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు చెప్పుకొచ్చారు. వీటిలో ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ మంచి రేటుకు కొనుగోలు చేసింది. థియేటర్లో హిట్ టాక్ వస్తే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశముంది. ఎందుకంటే ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో ఇదే పెద్ద చిత్రం. మరో రెండు వారాల తర్వాత గానీ కూలీ, వార్ 2 రావు. హిట్ టాక్ వస్తే అప్పటివరకు 'కింగ్డమ్'దే హవా.(ఇదీ చదవండి: 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమ?) -
'భోళా..' దెబ్బకొట్టినా మణిశర్మ కొడుక్కి బంపరాఫర్!
ప్రస్తుతం దర్శక నిర్మాతలందరూ పాన్ ఇండియా సినిమాలు వెంటపడుతున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అనిరుధ్, తమన్, దేవి శ్రీ ప్రసాద్ వైపే చూస్తున్నారు. దాదాపు వీళ్లలో ఎవరో ఒకరు కావాలని పట్టుబడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఓ క్రేజీ కాంబోలో తీస్తున్న ఓ పాన్ ఇండియా మూవీ కోసం మణిశర్మ కొడుక్కి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా?టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. అప్పట్లో చిరంజీవి, మహేశ్ బాబుతో పాటు స్టార్ హీరోల సినిమాలకు ఈయన మ్యూజిక్ ఇచ్చారు. కానీ ట్రెండ్ మారడంతో ఈయనకు అవకాశాలు తగ్గిపోయాయి. మణిశర్మ వారసుడు మహతి స్వరసాగర్ కూడా మ్యూజిక్ డైరెక్టరే. 2015 నుంచి ఆడపాదడపా దక్షిణాదిలో మూవీస్ చేస్తున్నారు. ఛలో, భీష్మ చిత్రాలు ఈయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అలా చిరంజీవితో 'భోళా శంకర్'కి మ్యూజిక్ ఇచ్చే అవకాశం దక్కింది.(ఇదీ చదవండి: డేవిడ్ వార్నర్కి రాజమౌళి స్పెషల్ గిఫ్ట్)కానీ 'భోళా..' పాటలు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ పెద్దగా ఇంప్రెసివ్గా లేకపోవడం, మూవీ కూడా ఫ్లాప్ కావడంతో మహతికి తర్వాత పెద్ద ప్రాజెక్టులేం రాలేదు. అలాంటిది ఇప్పుడు పూరీ-విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కోసం మహతి స్వరసాగర్ని తీసుకున్నారనే విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అధికారికంగా ఏం చెప్పలేదు గానీ త్వరలో దీనిపై క్లారిటీ రావొచ్చు. ఓ రకంగా చూస్తే మహతికి ఇది గోల్డెన్ ఛాన్సే. తన సంగీతంతో మెప్పిస్తే మాత్రం మంచి గుర్తింపు గ్యారంటీ.పూరీ-సేతుపతి ప్రాజెక్ట్ విషయానికొస్తే ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. సంయుక్త హీరోయిన్గా చేస్తోంది. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిల్యూర్స్తో డీలా పడిన పూరీ జగన్నాథ్.. వీలైనంత వేగంగా సేతుపతి మూవీని పూర్తి చేసి డైరెక్టర్గా కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అలానే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్) -
విశ్వంభర స్పెషల్ సాంగ్లో బుల్లితెర నటి.. రెమ్యునరేషన్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే డైరెక్టర్ సినిమా కథ కూడా బయటపెట్టేశాడు. 'మనకు తెలిసినవి 14 లోకాలే.. ఈ పద్నాలుగు లోకాలకు పైనున్న లోకమే సత్యలోకం. విశ్వంభర కోసం వీటన్నింటినీ దాటుకుని పైకి వెళ్లాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను హీరో వెతుక్కుంటూ వెళ్లి ఆమెను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు? అన్నదే సినిమా కథ' అని చెప్పాడు.తెలుగులో తొలిసారి..సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ కూడా రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. ఈ పాటలో బుల్లితెర సీరియల్స్లో విలనిజం పండించిన మౌనీ రాయ్ను సెలక్ట్ చేశారు. ఈమె చిరుతో కలిసి తొలిసారి చిందేసింది. అంతేకాదు, టాలీవుడ్లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి! ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. అయితే ఆమె ఈ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందన్న చర్చ మొదలైంది. నిమిషానికి లక్షల్లో..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. మౌనీ రాయ్ నాలుగైదు నిమిషాల పాటకుగానూ రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్.. నాగిణి సీరియల్తోనే చాలామందికి పరిచయం. ఈ పాటలో కూడా ఆమె నాగిణిగా కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమన్నది క్లారిటీ రావాల్సి ఉంది.విశ్వంభర ఆలస్యం?నిజానికి ఈ పాట కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను సంప్రదించారట! కానీ, ఆమె రూ.8 కోట్లు డిమాండ్ చేయడంతో తనను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. విశ్వంభర చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా మరింత వాయిదా పడే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.చదవండి: 10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు -
చిరంజీవి 'విశ్వంభర' ప్లాన్ ఛేంజ్!
రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన 'హరిహర వీరమల్లు' ఫలితం ఏంటో అందరికీ తెలుసు. ఈ సినిమా సంగతి కాసేపు పక్కనబెడితే చిరంజీవి 'విశ్వంభర' గురించి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవి వింటుంటే అభిమానులకు నిరాశ తప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అనుకున్న ప్లాన్లో మార్పులు జరుగుతున్నట్లు ఉన్నాయి. ఇంతకీ ఏంటి విషయం? 'విశ్వంభర' ఎప్పుడు థియేటర్లలోకి రావొచ్చు?కొన్నిరోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన వశిష్ఠ.. చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. స్టోరీ ఏంటో చెప్పేయడంతో పాటు గ్రాఫిక్స్ లాంటి వాటి గురించి కూడా మాట్లాడారు. అలానే ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజ్ ఉండొచ్చనట్లు హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ షూటింగ్ శనివారంతో పూర్తయింది. దీంతో ఫ్యాన్స్.. 'విశ్వంభర' త్వరలో రిలీజ్ అయిపోతుందేమోనని సంతోషపడుతున్నారు. కానీ ప్లాన్ మారినట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా'కి హిట్ టాక్.. కలెక్షన్ ఎంతంటే?)షూటింగ్ పూర్తయినా సరే వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అవన్నీ అయిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్లలో ఉన్న 'హరిహర వీరమల్లు' విషయంలో మేజర్ కంప్లైంట్ గ్రాఫిక్సే. మరీ నాసిరకంగా ఉండటంతో తొలిరోజు నుంచి ఇప్పటికీ దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇవన్నీ 'విశ్వంభర' టీమ్ చూస్తూనే ఉంటుంది. కాబట్టి కచ్చితంగా గ్రాఫిక్స్ విషయంలో అన్ని పనులు పూర్తయిన తర్వాత రిలీజ్ చేయడం బెటర్ అని అనుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మూవీ రిలీజ్ డిసెంబరులోనే!'విశ్వంభర' విషయానికొస్తే.. 14 లోకాలు అవతల ఉన్న హీరోయిన్ని తీసుకొచ్చేందుకు హీరో చేసే ప్రయత్నమే సినిమా స్టోరీ. ఇందులో చిరుకు జోడీగా త్రిష నటిస్తుండగా.. ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ లాంటి ముద్దుగుమ్మలు కూడా పలు పాత్రలు చేశారు. కీరవాణి సంగీత దర్శకుడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: బేబీ బంప్తో తొలిసారి కనిపించిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి) -
ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే 'దేవర' సినిమా దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ 'వార్ 2'. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం చిత్ర ట్రైలర్ని రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది. మరోవైపు హీరోలు చేసిన హృతిక్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువ అనేది కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్)పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత మన హీరోలు ఇక్కడే సినిమాలు చేస్తూ హిందీలో డబ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం యష్ రాజ్ స్పై యూనివర్స్లోని 'వార్ 2'లో భాగమయ్యాడు. అయితే తారక్ది విలన్ రోల్ అని టాక్ నడుస్తోంది. ట్రైలర్లోనూ నెగిటివ్ టచ్ ఉన్నట్లే చూపించారు. మరి అందరూ అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ విలన్ లేదా మరో హీరోనా అనేది మూవీ వస్తే గానీ తెలియదు. అయితే ప్రస్తుతం తారక్కి ఉన్న ఫేమ్ దృష్ట్యా అందరి కంటే ఇతడికే ఎక్కువగా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.'వార్ 2'లో నటించినందుకు గానూ ఎన్టీఆర్కు ఏకంగా రూ.60 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. హృతిక్ రోషన్కి రూ.45 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్గా చేసిన కియారా అడ్వాణీకి రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీకి రూ.32 కోట్లు అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిబట్టి చూస్తుంటే హృతిక్పై అటు ట్రైలర్లోనే కాదు రెమ్యునరేషన్ విషయంలోనూ తారక్ డామినేషన్ చూపించినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
బిగ్బాస్ కొత్త సీజన్.. సగానికి సగం పారితోషికం తగ్గించేసిన స్టార్ హీరో!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)ను విజయవంతంగా ముందుకు నడిపించడంలో హోస్ట్దే ప్రధాన పాత్ర! కంటెస్టెంట్లను వాయించడానికి, తప్పొప్పులు చెప్పడానికి, సరిదిద్దడానికి హోస్ట్ వీకెండ్లో రెండుసార్లు వస్తూ ఉంటాడు. షో చప్పగా ఉంటే దాన్ని రంజుగా మారుస్తాడు, ఊపు మీదంటే మరింత క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎటొచ్చీ గేమ్ను ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేలా ట్రై చేస్తాడు.15 ఏళ్లుగా హోస్టింగ్అయితే సినిమాలు చేసే స్టార్లు టీవీ షోలలో హోస్ట్గా కనిపించాలంటే అంత ఈజీ కాదు. వారు అడిగిన రేంజులో డబ్బు ఇచ్చుకుంటేనే బుల్లితెరపై కనిపించడానికి సిద్ధమవుతారు. తెలుగులో మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత నాని బిగ్బాస్ షోకి హోస్టింగ్ చేశారు. ఆ తర్వాత అంటే మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. హిందీలో మొదట అర్షద్ వార్సీ, శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు సెలబ్రిటీలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వచ్చే నెలలోనే ప్రారంభంనాలుగో సీజన్ నుంచి సల్మాన్ ఖాన్ (Salman Khan) ఈ షోను తన భుజాలపై ఎత్తుకుని నడిపిస్తున్నాడు. ఆగస్టు 30న హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సల్మాన్.. ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. అయితే హీరో ఈసారి తన రెమ్యునరేషన్ను భారీగా తగ్గించుకున్నాడట! కారణం గత సీజన్లతో పోలిస్తే బిగ్బాస్ 19వ సీజన్కు పెద్దగా బడ్జెట్ కేటాయించలేదని తెలుస్తోంది. పారితోషికంలో రూ.100 కోట్ల కోత!సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం సల్లూ భాయ్ వీకెండ్కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్బాస్ 17వ సీజన్కు రూ.200 కోట్లు, 18వ సీజన్కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం అందుకోవడం కొంత ఆశ్చర్యకరమనే చెప్పుకోవాలి!ఓటీటీకే ప్రాధాన్యతబిగ్బాస్ 19వ సీజన్లో ఓటీటీకే ప్రాధాన్యతనిస్తున్నారు. హాట్స్టార్లో ఎపిసోడ్ రిలీజ్ చేసిన గంట- గంటన్నర తర్వాతే టీవీలో ప్రసారం కానుందట! అలాగే ఈ సీజన్ ఐదు నెలలు కొనసాగుతుందని, మొదటి మూడు నెలలు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తే తర్వాత ఫరా ఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ వంటి వారు చివరి రెండు నెలలు షో బాధ్యతలు అందుకోనున్నారని భోగట్టా! మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ) -
ఓటీటీలోకి 'కన్నప్ప'.. డేట్ ఫిక్సయిందా?
మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన లేటెస్ట్ సినిమా 'కన్నప్ప'. రిలీజ్కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. అదే ఊపులో థియేటర్లలోకి రాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ వీకెండ్ అయ్యేసరికే సైలెంట్ అయిపోయింది. ఇదంతా జరిగి దాదాపు నెల కావొస్తుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? ఎప్పుడు రావొచ్చు?'కన్నప్ప'లో విష్ణు హీరోగా కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రలు పోషించారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితర ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇలా స్టార్ కాస్టింగ్ చాలామంది నటించిన ఈ సినిమాని 'భక్త కన్నప్ప' స్టోరీతోనే తీశారు. కాకపోతే కమర్షియల్ అంశాలు, యాక్షన్ కాస్త జోడించారు. ఇవన్నీ కాదు ప్రభాస్ ఇందులో అతిథి పాత్ర చేయడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త ఆసక్తి చూపించారు.(ఇదీ చదవండి: వరలక్ష్మి శరత్ కుమార్కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)ఇలా ఓ మాదిరి అంచనాలతో గత నెల 27న 'కన్నప్ప' థియేటర్లలో రిలీజైంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు వార్తలు రాగా.. కేవలం రూ.40-50 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్లు టాక్. ఇకపోతే రిలీజ్కి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణు.. ఓటీటీ హక్కుల్ని అమ్మలేదని చెప్పాడు. కానీ ఇప్పుడేమో మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని, ఈ వీకెండ్లో అంటే జూలై 27న స్ట్రీమింగ్ చేయబోతున్నారని అంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.'కన్నప్ప' విషయానికొస్తే.. గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు(విష్ణు).. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల నాస్తికుడిగా మారిపోతాడు. చుట్టుపక్కలా గూడేల్లో ఏ ఆపద వచ్చిన ముందుంటాడు. అలాంటి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి బహిష్కరణకు గురవుతాడు. ప్రేయసి నెమలి(ప్రీతి ముకుందన్) కూడా ఇతడి వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు.. గొప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు? ఇంతకీ రుద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
మేఘాలయ హనీమూన్ కేసుపై సినిమా ప్లాన్ చేస్తున్న హీరో!
పెళ్లంటే ఆషామాషీయా? బోలెడంత ఖర్చు, కట్నకానుకలు, విందుభోజనాలు.. అబ్బో ఇలా చాలానే ఉంటాయి. భాగస్వామితో భవిష్యత్తును ఊహించుకుంటూ గాల్లో తేలిపోతుంటారు వధూవరులు. కానీ ఈ మధ్య పెళ్లి పేరెత్తితే సంతోషం కన్నా భయం, అనుమానాలే ఎక్కువవుతున్నాయి. నిండు నూరేళ్లు కాదు కదా నెల తిరిగేలోపే జీవిత భాగస్వామి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ అందుకు నిలువెత్తు ఉదాహరణ! హత్యోదంతంపై సినిమాఈ హత్య ఉదంతంపై సినిమా రానుందని తెలుస్తోంది. బీటౌన్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆమిర్ ఖాన్ (Aamir Khan).. మేఘాలయ హనీమూన్ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాడట! ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడట! తన సన్నిహితులతో చర్చిస్తున్నాడట! తన ప్రొడక్షన్లోనే ఈ కేసుపై సినిమా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.మేఘాలయ హనీమూన్ మర్డర్ కథేంటి?రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. బలవంతంగా పెళ్లితమ వర్గానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. బలవంతంగా పెళ్లి చేస్తే తర్వాత దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోనమ్ బెదిరించినా పేరెంట్స్ లెక్కచేయలేదు. రాజా రఘువంశీతో ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహమైన మూడు రోజులకే సోనమ్.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. మేఘాలయలో దాన్ని ఆచరణలో పెట్టింది. కాంట్రాక్ట్ కిల్లర్స్ను మాట్లాడి భర్తను చంపించి, దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరించింది. అనుమానం రాకుండా ఉండటం కోసం.. ఏడు జన్మలవరకు మనం ఇలాగే కలిసుండాలి అంటూ రాజా ఫేస్బుక్ అకౌంట్లో తనే స్వయంగా పోస్ట్ పెట్టింది.భర్త అంత్యక్రియల్లో ప్రియుడుఅక్కడి నుంచి ఇండోర్కు పారిపోయింది. తనను కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడాలనుకుంది. కానీ పోలీసులు సోనమ్ను అనుమానించడంతో ఆమె లొంగిపోయింది. ఆమె చాట్స్ చూడగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని తేలిపోయింది. అయితే రాజ్ కుష్వాహ ఏమీ తెలియనట్లుగా రాజా రఘువంశీ అంత్యక్రియలకు వెళ్లి అతడి తండ్రిని ఓదార్చాడు. హత్యలో తన ప్రమేయం ఉందన్న విషయం బయటపడకుండా ఉండేందుకే అలా నటించాడు. పోలీసులు సోనమ్, రాజ్ కుష్వాహతో పాటు సుపారీ గ్యాంగ్ను సైతం అరెస్టు చేశారు.చదవండి: షాపింగ్మాల్లో ఈ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తోందంటే? -
'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?
రీసెంట్గా థియేటర్లలో పలు చిత్రాలు రిలీజ్ కాగా.. 'జూనియర్' చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి. కిరీటికి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు, ఫైట్స్, డైలాగ్స్ లాంటివి బాగా చెప్పడం.. దానికి తోడు 'వైరల్ వయ్యారి' పాట తెగ వైరల్ అయిపోయేసరికి జనాలు ఈ మూవీని చూసేందుకు ఓ మాదిరిగా థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త ఎక్కువగానే వచ్చాయి. ఇంతకీ రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఎంత?కిరీటి, శ్రీలీల, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు. అంతెందుకు గతంలో వచ్చిన తెలుగు చిత్రాల ఛాయలు కూడా చాలా కనిపిస్తాయి. అయితేనేం వేరే చిత్రాలేం లేకపోవడం దీనికి ఓ రకంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.1.45 కోట్లు వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.1.65 కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే రెండు రోజులకు కలిపి రూ.3.10 కోట్ల మేర నెట్ కలెక్షన్ అందుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హీరోయిన్తో ప్రేమ... పెళ్లి వాయిదా వేసిన విశాల్)హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వసూళ్లు అంటే కాస్త విశేషమనే చెప్పాలి. అయితే వచ్చేవారం థియేటర్లలోకి 'హరిహర వీరమల్లు' రానుంది. ఇంతలోనే 'జూనియర్' కలెక్షన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మూవీకి లాంగ్ రన్ అయ్యేసరికి ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి?జూనియర్ విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో సరదాగా గడుపుతూనే చదువులో మంచి ప్రతిభ చూపిస్తాడు. తను ప్రేమించిన శ్రీలీల పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ(జెనీలియా)కు అభి అస్సలు నచ్చడు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు కూడా నచ్చదు. అలాంటిది అభితో కలిసి విజయ.. విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు) -
హన్సిక వైవాహిక బంధానికి బీటలు? ఒక్కమాటలో తేల్చేసిన భర్త!
నీకై నేను, నాకై నువ్వు ఉంటే చాలు కదా... అని పాటలు పాడుకునేవారు హన్సిక (Hansika Motwani)-సోహైల్ (Sohael Khaturiya). ఈ జోడీకి ఎవరి దిష్టి తగలకూడదు అనేలా ఒకరినొకరు అపురూపంగా చూసుకునేవారు. అలాంటిది.. వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం మొదలైంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. హన్సిక, సోహైల్ రెండేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారట! హన్సిక తన తల్లితో.. సోహైల్ అతడి పేరెంట్స్తో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. విడివిడిగా..అయితే విడాకుల రూమర్స్ గురించి సోహైల్ స్పందిస్తూ.. అందులో నిజం లేదని తేల్చిపారేశాడు. కానీ, వేర్వేరుగా జీవిస్తున్నారన్న అంశంపై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా హన్సిక- సోహైల్ 2022లో పెళ్లి చేసుకున్నారు. ప్రతి ఏడాది పెళ్లిరోజున స్పెషల్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుందీ హీరోయిన్. గతేడాది డిసెంబర్లో కూడా సెకండ్ యానివర్సరీ అంటూ ఓ పోస్ట్ పెట్టింది హన్సిక. దీన్ని బట్టి చూస్తే వీరు కలిసే ఉన్నారని తెలుస్తోంది. మరి తర్వాతేమైనా జరిగిందా? లేదా లేనిపోని రూమర్లు సృష్టిస్తున్నారా? అనే విషయంపై హన్సిక స్పందించాల్సి ఉంది.సోహైల్కు రెండో పెళ్లిఇదిలా ఉంటే సోహైల్.. గతంలో హన్సిక చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. కానీ ఆ బంధం ఎంతోకాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహైల్తో కనెక్ట్ అయిన హన్సిక అతడిని వివాహం చేసుకుంది. జైపూర్లో జరిగిన ఈ పెళ్లి విశేషాలను లవ్ షాదీ డ్రామా వీడియో పేరిట ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. అందులో హన్సిక.. సోహైల్ గతం గురించి చెప్తూ ఎమోషనలైంది. సోహైల్ గతం గురించి తెలుసు, కానీ.. అతడి విడాకులతో తనకు సంబంధం లేదని ఏడ్చేసింది.చదవండి: గర్భంతో ఉన్నా యాక్షన్ సీన్స్.. మొదటిసారే మిస్క్యారేజ్ -
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
నిన్న అనగా శుక్రవారం రిలీజైన సినిమాల్లో కాస్తోకూస్తో 'జూనియర్' మంచి బజ్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ రావడంతో టికెట్స్ బాగానే సేల్ అయ్యాయి. కలెక్షన్ కూడా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇంతకీ ఈ మూవీ తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం.కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ 'జూనియర్' అనే సినిమాని దాదాపు రెండు మూడేళ్ల క్రితం ప్రకటించారు. షూటింగ్ పూర్తయినా సరే చాలా ఆలస్యమైన ఈ చిత్రం.. ఎట్టకేలకు తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఈ వీకెండ్ చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేకపోవడంతో 'జూనియర్'కి ప్లస్ అయింది. అందుకు తగ్గట్లే తొలిరోజు రూ.1.4 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కన్నడ కంటే తెలుగులోనే ఎక్కువ మొత్తం వసూలు కావడం విశేషం.(ఇదీ చదవండి: 'మెగా' లీకులు.. నిర్మాతలు గట్టి వార్నింగ్)కిరీటి స్వతహాగా కన్నడ అయినప్పటికీ.. తెలుగులో 'జూనియర్' చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి శ్రీలీల ఓ కారణం కాగా, 'వైరల్ వయ్యారి' పాట తెగ వైరల్ కావడం మరో కారణం అని చెప్పొచ్చు. తొలిరోజు తెలుగులో రూ.1.25 కోట్లు రాగా.. కన్నడలో కేవలం రూ.15 లక్షలే వచ్చినట్లు తెలుస్తోంది తొలి సినిమానే అయినప్పటికీ కిరీటి డ్యాన్సులు, ఫైట్స్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మూవీ కోసం బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టారు. అయితేనే తొలిరోజు మంచి వసూళ్లే వచ్చాయి. లాంగ్ రన్లో కాస్త చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రావడం గ్యారంటీ అనిపిస్తోంది.'జూనియర్' విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో సరదాగా గడుపుతూనే చదువులో మంచి ప్రతిభ చూపిస్తాడు. తను ప్రేమించిన శ్రీలీల పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ(జెనీలియా)కు అభి అస్సలు నచ్చడు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు కూడా నచ్చదు. అలాంటిది అభితో కలిసి విజయ.. విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ) -
మళ్లీ వచ్చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి'.. అమితాబ్ పారితోషికం ఎంతంటే?
ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతి 17వ సీజన్తో అలరించనున్నాడు. ఈ షో ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సోనీ టీవీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో ఈసారి కూడా అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు.25 ఏళ్ల క్రితం మొదలు..ఈ క్రమంలో బిగ్బీ పారితోషికం ఎంత ఉండొచ్చు? అని నెటిన్లు చర్చించుకుంటున్నారు. బీటౌన్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అమితాబ్.. ఒక్క ఎపిసోడ్కు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట! 25 ఏళ్ల క్రితం కౌన్ బనేగా కరోడ్పతి షో (Kaun Banega Crorepati Show) మొదలైంది. బిగ్బీ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినవారు రూ.1 కోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి సెలబ్రిటీలను కాకుండా సామాన్యులనే పార్టిసిపెంట్లుగా ఎంపిక చేసుకుంటారు. అందుకే ఈ షోకు ఎక్కువ క్రేజ్!తెలుగులోనూ..బిగ్బీ హోస్టింగ్, కోటి రూపాయల ప్రైజ్మనీతో.. రియాలిటీ షోలలోనే కేబీసీ సరికొత్త సంచలనంగా నిలిచింది. ఇదే షో తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరిట ప్రారంభమైంది. మొదటి మూడు సీజన్లు నాగార్జున, నాలుగో సీజన్ చిరంజీవి, ఐదో సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. తర్వాతేమైందో కానీ తెలుగులో ఈ షోను కొనసాగించలేదు. అమితాబ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం సెక్షన్ 84 మూవీ చేస్తున్నాడు. దీనితో పాటు బిగ్బీ చేతిలో.. బ్రహ్మాస్త్ర 2, కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) చదవండి: నా భార్య గర్భం దాల్చినా.. అందుకే పిల్లలు లేరు: అనుపమ్ ఖేర్ -
శూర్పణఖగా 10th క్లాస్ అమ్మాయి.. ఆమె ఎవరంటే?
సినిమాను విజువల్ వండర్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గడం లేదు నిర్మాతలు. మామూలు సినిమాకు కూడా రూ.100 కోట్ల బడ్జెట్ అనేది సాధారణమైపోయింది. ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ, ఆదిపురుష్.. ఇవన్నీ అయితే రూ.500 కోట్లపైనే పెట్టి తీశారు. అయితే భారతీయ సినీచరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ చిత్రం (Ramayana Movie) తెరకెక్కుతోంది. నితీశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. బాల శూర్పణఖగా..రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. శూర్పణఖ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించగా ఆమె బిజీగా ఉండటంతో అవకాశాన్ని వదిలేసుకుందట. దీంతో ఈ రోల్ రకుల్కు వెళ్లిందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. పదిహేనేళ్ల దిశిత సెగల్ను బాల శూర్పణఖగా వెండితెరపై చూపించాలని ప్రయత్నిస్తున్నారట! ఆడిషన్తో పాటు లుక్ టెస్ట్ కూడా అయిపోందని, తనపై కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారని బీటౌన్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.ఎవరీ దిశిత సెగల్?నాలుగేళ్లే వయసులోనే వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది దిశిత. బేబీ సినిమాలో అక్షయ్ కుమార్ కూతురిగా, డియర్ జిందగీలో చిన్నారి ఆలియా భట్లా యాక్ట్ చేసింది. వార్, హిందీ మీడియం చిత్రాల్లోనూ నటించింది. ఇటీవలే బెహాన్ డర్గయినా అనే ఓటీటీ షోలోనూ మెరిసింది. View this post on Instagram A post shared by Dishita Sehgal🧿 (@cutiepiedishita) చదవండి: జీవితంలో తొలిసారి పిడకలు చేశా.. ఆ మరునాడే..: నిత్యామీనన్ -
'రాజాసాబ్'పై కొత్త రూమర్స్.. మరోసారి తప్పదా?
కొన్నాళ్ల ముందు రిలీజైన 'రాజాసాబ్' టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబరు 5న మూవీ రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు సినిమా మరోసారి వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.లెక్క ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 10న 'రాజాసాబ్'ని థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం మిగిలిన సీన్స్ అన్ని పూర్తిచేసే పనిలో టీమ్ అంతా ఉంది. త్వరలో సాంగ్స్ చిత్రీకరణ కోసం ఫారిన్ కూడా వెళ్లనున్నారు. అలాంటిది ఇప్పుడు 'రాజాసాబ్' సంక్రాంతికి రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)'రాజాసాబ్' ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈ వాయిదా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థల డిసెంబర్ డీల్స్ అన్నీ పూర్తయ్యాయని, వచ్చే ఏడాది జనవరికి అయితే ఒకటి రెండింటివి ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే 'రాజాసాబ్' దెబ్బ పడే ప్రమాదముంది. ఎందుకంటే డిసెంబరులో సోలో తేదీని వదులుకుని.. సంక్రాంతికి వస్తే కలెక్షన్స్ తగ్గిపోతాయి. అలా కాదని డిసెంబరులోనే వస్తారా అనేది చూడాలి.మరోవైపు బాలకృష్ణ 'అఖండ 2'.. సెప్టెంబరు 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈ తేదీ కూడా మారి డిసెంబరుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ vs బాలయ్య అవుతుందేమో? మరోవైపు డిసెంబర్ 5నే బాలీవుడ్ నుంచి 'ధురంధర్' అనే మూవీ రిలీజ్ కానుంది. దీని వల్ల ప్రభాస్ మూవీకి ఇబ్బంది ఏం ఉండదు. సరే ఇవన్నీ పక్కనబెడితే ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ నిజమా కాదా అనేది కొన్నిరోజుల్లో క్లారిటీ వస్తుందేమో?(ఇదీ చదవండి: ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ) -
తెలుగు సినిమాలో వేశ్య పాత్రలో కాయదు?
ఒక్క సినిమా సక్సెస్తో ఓవర్ నైట్ అయిపోయిన హీరోయిన్లు చాలామంది ఉంటారు. రీసెంట్ టైంలో అలా 'డ్రాగన్' అనే తమిళ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాయదు లోహర్. ఈ చిత్ర విజయంతో ఈమెకు అటు తమిళం, ఇటు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వీటితో పాటు ఇప్పుడు మరో క్రేజీ పాత్ర ఈమెని వరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటది? ఎవరా హీరో?అసోంకి చెందిన కాయదు లోహర్.. తెలుగులో ఇదివరకే 'అల్లూరి' అనే సినిమా చేసింది. కానీ ఇది ఫ్లాప్ అయ్యేసరికి తమిళంలో ప్రయత్నించింది. అక్కడ ఫేమ్ తెచ్చుకుంది. అలా మళ్లీ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ 'ఫంకీ'లో ఈమె హీరోయిన్గా చేస్తోంది. ఇప్పుడు నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్యారడైజ్'లోనూ కాయదునే హీరోయిన్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్ని భయపెడుతున్న మెహర్ రమేష్)అనౌన్స్మెంట్ వీడియోతోనే అటెన్షన్ సొంతం చేసుకున్న 'ప్యారడైజ్'లో నాని.. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నాడు. రాఘవ్ జూయల్ అనే హిందీ నటుడు ఇందులో విలన్ అని రీసెంట్గానే ప్రకటించారు. మోహన్ బాబు, బాబు మోహన్ కూడా విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారని లీక్స్ వచ్చాయి. ఇప్పుడు నానికి జోడిగా వేశ్య పాత్రలో కాయదు లోహర్ కనిపించబోతుందని అంటున్నారు.సాధారణంగా వేశ్య పాత్రలు అనగానే హీరోయిన్లు కాస్త వెనకడుగు వేస్తారు. కానీ కాయదు లోహర్ మాత్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈమెకు నానికి మధ్య బోల్డ్ సీన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమై, కాయదు రోల్ ఆకట్టుకుంటే మాత్రం ఈమె దశ తిరిగిపోవడం గ్యారంటీ. మరి వీటిపై ఓ క్లారిటీ వస్తే తప్ప ఏం మాట్లాడలేం.(ఇదీ చదవండి: కారణం లేకుండా విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారు: నాగవంశీ) -
'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?
ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ పడలేదు గానీ శ్రీలీల ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయినే. ఈ ఏడాది మార్చిలో 'రాబిన్ హుడ్'తో వచ్చింది గానీ కలిసి రాలేదు. ఇప్పుడు కొత్త హీరో కిరీటితో కలిసి 'జూనియర్' అనే మూవీ చేసింది. రీసెంట్గా 'వైరల్ వయ్యారి' అనే పాట తెగ వైరల్ అవుతోంది కదా! అది ఈ సినిమాలోనిదే. ఓవైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తున్న ఈ బ్యూటీ.. కొత్త కుర్రాడితో చేసేందుకు రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.తెలుగు మూలాలు ఉన్నప్పటికీ శ్రీలీల.. బెంగళూరులోనే పెరిగింది. హీరోయిన్గా తొలి మూవీ కూడా కన్నడలోనే చేసింది. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత 'జూనియర్' మూవీతో రాబోతుంది. గాలి జనార్ధన కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న రిలీజ్ చేస్తున్నారు. కాస్తోకూస్తో హైప్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న శ్రీలీల.. సాధారణంగా రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. అయితే జూనియర్ కోసం మాత్రం ఈమెకు రూ.4 కోట్ల పారితోషికం ఇచ్చారనే టాక్ నడుస్తోంది. అంటే డబుల్ బొనాంజా. ఈ మూవీలో శ్రీలీల మాత్రం కాస్త చెప్పుకోదగ్గ ఫేస్. కిరీటి కొత్తవాడు. జెనీలియా చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతోనే దక్షిణాదిలోకి రీఎంట్రీ ఇస్తోంది. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?'జూనియర్' సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా.. రాజమౌళి చిత్రాలకు పనిచేసే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. రాధాకృష్ణ రెడ్డి దర్శకుడు. తెలుగులో 'ఈగ' తదితర సినిమాలు తీసిన వారాహి నిర్మాణ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్తో ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించినట్లు విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ క్రమంలోనే శ్రీలీల జాక్ పాట్ కొట్టినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: పాకిస్థాన్లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు వైరల్) -
అల్లు అర్జున్.. ఆ నలుగురు!
'పుష్ప 2' సినిమా రిలీజై దాదాపు ఆరేడు నెలలు అయిపోయింది. దీని తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా అన్న సస్పెన్స్కి కొన్నాళ్ల ముందు తెరదించాడు. తమిళ దర్శకుడు అట్లీతో కలిసి భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నారని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్గా దీపికా పదుకొణె నటిస్తుందని కూడా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్తో పాటు షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ఇప్పుడు క్రేజీ అప్డేట్ ఒకటి వినబడుతోంది.(ఇదీ చదవండి: ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ)అల్లు అర్జున్ ఇప్పటివరకు 21 సినిమాలు చేశాడు. కానీ ఎందులోనూ ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ అట్లీ సినిమా కోసం మాత్రం ఏకంగా నాలుగు పాత్రలు పోషించనున్నాడట. అవి కూడా తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా బన్నీనే కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్ కావొచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బన్నీ ఎలా కనిపిస్తాడా అని ఎగ్జైట్మెంట్ గ్యారంటీ.అట్లీ-బన్నీ సినిమాలో దీపికతోపాటు మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్, రష్మిక కూడా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అలానే హాలీవుడ్ నటుడు విలన్గా కనిపించే అవకాశముందని కొన్ని రోజుల క్రితం గట్టిగా వినిపించింది. ఇలా ఎప్పటికప్పుడు ఏదో గాసిప్ వినిపిస్తూనే ఉంది. అలా ట్రెండ్ అవుతూనే ఉంది. మరి వీటిలో ఎన్ని నిజం ఎన్ని అబద్ధం అనేది కొన్నిరోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు. అప్పటివరకు బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.(ఇదీ చదవండి: భార్యకు సీమంతం చేసిన తెలుగు కమెడియన్) -
'బిగ్బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్ కూడా!
బిగ్బాస్ (Bigg Boss Reality Show) మొదలవడానికి రెండు నెలల ముందు నుంచే హంగామా మొదలైపోతుంది. తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇమ్మాన్యుయేల్, అలేఖ్య పికిల్స్ చెల్లెలు రమ్య, దెబ్జానీ, రీతూ చౌదరి, శివకుమార్, సాయికిరణ్, ముకేశ్ గౌడ సహా పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో ఇద్దరుముగ్గురిని హౌస్లోకి పంపించనున్నారు.బిగ్బాస్లో టాలీవుడ్ సెలబ్రిటీలుతాజాగా పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి, నువ్వునేను హీరోయిన్ అనిత హస్సానందని కూడా బిగ్బాస్ షోలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే వీరిద్దరితో సంప్రదింపులు జరుపుతోంది తెలుగు బిగ్బాస్ టీమ్ కాదట! హిందీ బిగ్బాస్ టీమ్! హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు నెలాఖరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి హౌస్లోకి వెళ్లేది వీరేనంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కంటెస్టెంట్లు వీళ్లేనా?ఆ జాబితా ఓసారి చూసేద్దాం.. నటి మున్మున్ దత్తా, ఆలిషా పన్వర్, కనిక మన్, అరిష్ఫా ఖాన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజ, మిస్టర్ ఫైజు, యూట్యూబర్ గౌరవ్ తనేజా, పురవ్ జా, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (హీరోయిన్ శిల్పా శెట్టి భర్త), నటుడు ధీరజ్ ధూపర్, పరాస్ కల్నవత్, కృష్ణ ష్రాఫ్ (జాకీ ష్రాఫ్ కూతురు), సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ, కవలలు చింకీ-మింకీ ఉన్నారట!సన్యాసం తీసుకున్న ఆమె కూడా!వీరే కాకుండా లతా సబర్వాల్ (ఈమె తెలుగులో కొంచెం కొత్తగా మూవీలో నటించింది), తనుశ్రీ దత్తా (వీరభద్ర సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది), ఆశిష్ విద్యార్థి (టాలీవుడ్ విలన్), హీరోయిన్ అనిత కూడా ఉన్నారంటూ ఈ జాబితా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణి సైతం బిగ్బాస్కు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె తెలుగులో ప్రేమ శిఖరం, దొంగాపోలీస్ సినిమాల్లో కథానాయికగా నటించింది. మరి ఫైనల్ జాబితాలో వీరిలో ఎంతమంది ఉంటారనేది చూడాలి!చదవండి: హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు -
బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?
హీరోయిన్లు సాధారణంగా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు సినిమాల విషయంలో సాహసాలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా తేడా కొడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు మాత్రం అది వర్కౌట్ అవ్వొచ్చు. రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీ రష్మిక కూడా అలాంటి ఓ డేరింగ్ స్టెప్ తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.ఈ మధ్య కాలంలో యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా వరస సినిమాలతో హిట్స్ కొట్టిన రష్మిక, పాన్ ఇండియా మార్కెట్లో వేలకోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన చిత్రాల్లో భాగమైంది. కొన్నిరోజుల ముందు రిలీజైన 'కుబేర'తోనూ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. వీటితో పాటు ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ భాగమైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రేణు దేశాయ్కు సర్జరీ.. అసలేమైంది?)'పుష్ప 2' తర్వాత బన్నీ, తమిళ దర్శకుడు అట్లీతో పనిచేస్తున్నాడు. ఇదివరకే షూటింగ్ మొదలైపోయింది. దీపికా పదుకొణెని హీరోయిన్గానూ అనౌన్స్ చేశారు. మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. రష్మిక కూడా ఇందులో కీ రోల్ చేస్తుందని రూమర్ వచ్చినప్పుడు ఇంకెంత మంది హీరోయిన్లకు చోటుందా అని అనుకున్నారు. అయితే రష్మికది హీరోయిన్ రోల్ కాదని టాక్.బన్నీతో తలపడే నెగిటివ్ రోల్లో రష్మిక కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం వేరే లెవల్ ఉండొచ్చు. గతంలో కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. మరి రష్మిక కూడా అలాంటి డెసిషన్ తీసుకుందా లేదా అనేది కొన్నిరోజుల్లో తేలుతుంది.(ఇదీ చదవండి: నాగచైతన్యపై ఆ రూమర్స్ నిజం కాదు) -
50 సెకన్ల ప్రకటన.. అదిరిపోయే రేంజ్లో 'నయనతార' రెమ్యునరేషన్
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది పాత సామెతే అయినా ఎవరైనా ఎప్పుడూ అమలు పరచేదే. ఇందుకు సంచలన తార నయనతార అతీతం కాదు. ఈమె చాలా కష్టపడి కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన నటి. కేరళలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి నటనపై ఆసక్తితో పలు అవమానాలు, అవరోధాలు ఎదుర్కొని కథానాయకిగా నిరూపించుకున్నారు. అయితే దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తానని బహుశ ఆమె కూడా ఊహించి ఉండరు. కోలీవుడ్లో అయ్యా చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సక్సెస్ను అందుకున్న నయనతార ఆ తరువాత రజనీకాంత్కు జంటగా చంద్రముఖి చిత్రంలో నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా వెలిగపోతున్నారు. ఈమె మొదటి నుంచి సంచనాలకు చిరునామా అని చెప్పవచ్చు. మొదట్లో ప్రేమ, ఆ తరువాత పెళ్లి, ఆపై సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లి, నిర్మాత ఇలా ఒక్కో ఘట్టంలోనూ వివాదాలు, విమర్శలను తొక్కుకుంటూ తన స్థాయిని నిలబెట్టుకుంటున్న నయన్ ఇప్పటికీ స్టార్ హీరోలతో జత కడుతూ బిజీగా ఉన్నారు. ఈ భామ చిత్రానికి రూ.10 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా 50 సెకన్ల నిడివి గల టాటా స్కై వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం సాయాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంటే ఈమె ఒక సెకన్ పారితోషకం అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. అయితే, ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగిందని సమాచారం. నయనతార సాధారణంగా యాడ్స్ చేయడం చాలా అరుదు. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినప్పుడు మాత్రమే యాడ్స్ చేస్తారు. ఇది చూసి ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్కు అంత రెమ్యునరేషన్ తీసుకోరు. నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్కు తగ్గట్టే దూసుకుపోతున్నారు. ఇకపోతే కోలీవుడ్లో ఇటీవల నయన చిత్రాలేమీ విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈమె క్రేజ్ ఏమాత్రం దగ్గలేదనడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది తెరపైకి రావడానికి ఆ చిత్రం సిద్ధం అవుతోంది. -
అల్లు అర్జున్ మూవీలో రష్మిక.. ప్రతినాయిక పాత్రలో..?
‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల తర్వాత హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలోని ఓ హీరోయిన్ పాత్రలో దీపికా పదుకోన్ నటించనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ... ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు మరో హీరోయిన్ మృణాల్ ఠాగూర్.మిగిలిన ముగ్గురు హీరోయిన్స్ పాత్రల్లో రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ భోర్సే, బాలీవుడ్ నటి ఆలియా. ఎఫ్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రంలో రష్మికా మందన్నా, జాన్వీ కపూర్ల పేర్లు దాదాపు ఖరారయ్యాయని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాలో రష్మికా మందన్నాది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదట. ఆమె పాత్రకు ప్రతినాయిక ఛాయలు ఉంటాయని, కొన్ని యాక్షన్ సీక్వెన్స్లలో కూడా రష్మిక కనిపిస్తారని, ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె ప్రత్యేకమైన శిక్షణ తీసుకోనున్నారని టాక్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
మాజీ డిప్యూటీ కలెక్టర్ను సీక్రెట్గా పెళ్లి చేసుకున్న నటి
నటి, దర్శకురాలు ఆయేషా సుల్తానా (Aisha Sultana) సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. మాజీ డిప్యూటీ కలెక్టర్ హర్షిత్ సైనిని వివాహమాడింది. జూన్ 20న ఢిల్లీలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తాజాగా వెల్లడించింది. హర్షిత్ గతంలో లక్షద్వీప్లోని అండ్రొట్ అండ్ అగట్టి జిల్లాకు డిప్యూటీ కలెక్టర్గా పని చేశారు. తన పెళ్లి గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడుతూ.. మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. డిసెంబర్లో అమ్మ ఉమ్రా యాత్రకు వెళ్లొస్తానంది. ఆమె తిరిగొచ్చాక అదే నెలలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం.వాట్సాప్లో లీకైందిఅప్పటివరకు మా పెళ్లి విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాం.. కానీ వాట్సాప్ గ్రూప్లో లీకైపోయింది. హర్షిత్తో నా స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలా అని మేమెన్నడూ ఐ లవ్యూ చెప్పుకోలేదు. మా ఇద్దరి ఆలోచనలు ఒకటే కావడంతో మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయామంతే! మా పెళ్లి కూడా హడావుడిగా జరిగిపోయింది. ఆయన ఓ పని మీద వచ్చినప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. సంతకాలు పెట్టగానే నేను ఇంటికి వెళ్లిపోయాను. తను తన డ్యూటీకి వెళ్లిపోయాడు అని చెప్పుకొచ్చింది.అయితే ఈ పెళ్లిపై విమర్శలు వస్తున్నాయి. కారణం.. ఆయేషా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. లక్షద్వీప్కు చెందిన ఈమె తన ప్రాంతంలోని సమస్యల పట్ల గొంతెత్తి ప్రశ్నిస్తుంటుంది. లక్షద్వీప్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉందని, దీన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇప్పుడామె మరో వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో నెట్టింట తనను ట్రోల్స్ చేస్తున్నారు.సినీ కెరీర్మలయాళ మూవీ ఫ్లష్తో దర్శకురాలిగా వెండితెరకు పరిచయమైంది ఆయేషా. కెట్టియోలను ఎంటె మలాఖా చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పని చేసింది. ప్రస్తుతం 124 ఏ అనే సినిమాను డైరెక్ట్ చేస్తోంది. అయితే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాకు ఎదురవుతున్న ఆటంకాలను చూసి ప్రస్తుతానికి తన ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపేసింది.చదవండి: కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?! -
అల్లు అర్జున్- అట్లీ సినిమాకు విలన్గా 'ఆస్కార్' నటుడు
అల్లు అర్జున్ (Allu Arjun), అట్లీ (Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలోకి (AA22xA6) హాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్మీడియాలో హ్యాష్ట్యాగ్స్తో పాటు ఫోటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. తెలుగు సినిమా ఇప్పుడు బాలీవుడ్ను దాటి అంతర్జాతీయ రేంజ్కు చేరిపోయింది. దీంతో హాలీవుడ్ టాప్ నటులను కూడా మన సినిమాల్లో భాగం చేసుకుంటున్నారు. తాజాగా AA22 ప్రాజెక్ట్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది.సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్తో అల్లు అర్జున్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం ప్రముఖ హాలీవుడ్ సంస్థ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో విలన్గా హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే వార్త నిజమైతే ఈ సినిమా పాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వరకు రీచ్ కావడం ఖాయం అని చెప్పవచ్చు. భారతీయ సినీ అభిమానులకు సుపరిచితుడైన విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా అస్కార్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఆయన గతంలో భారతీయ చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' (హిందీ)లో అతిథిగా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు సినిమాలో ఏకంగా విలన్గా నటించబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. త్వరలో షూటింగ్కు యూనిట్ సన్నద్ధం కానుంది. ఈ క్రమంలో తొలి షెడ్యూల్ను ముంబయిలో ప్లాన్ చేశారని టాక్ ఉంది. సుమారు మూడు నెలల పాటు అక్కడే షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ తర్వాత వీఎఫ్ఎక్స్ పనులను ప్రారంభిస్తారని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్గా నటిస్తుంది. పునర్జన్మల కాన్సెప్ట్తో సైన్స్ఫిక్షన్ సినిమాగా నిర్మించనున్నారని ప్రచారం జరుగుతోంది. -
బిగ్బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కి ఉన్న క్రేజే వేరు. గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, స్నేహాలు, ఆటలు, పాటలు, సరదా స్కిట్టులు.. ఇలా చాలానే ఉంటాయి. వినోదమంతా ఒక్కచోటే దొరికితే ప్రేక్షకులకు ఇంకేం కావాలి. అందుకే ప్రతి ఏడాది బిగ్బాస్ ఎప్పుడు మొదలవుతుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అటు బిగ్బాస్ టీమ్ కూడా.. జనాలను నిరాశపర్చకుండా ఉండేందుకు కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. బిగ్బాస్ హౌస్లో AI రోబోసింగర్, డ్యాన్సర్, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యాంకర్, యాక్టర్, కొరియోగ్రాఫర్.. ఇలా వేర్వేరు ప్రొఫెషన్స్కు చెందినవారిని పార్టిసిపెంట్లుగా సెలక్ట్ చేస్తారు. ఆ మధ్య హిందీ బిగ్బాస్లో గాడిదను, శునకాన్ని తీసుకొచ్చారు. ఈసారి ఏకంగా ఏఐ రోబోను బిగ్బాస్ హౌస్కు తీసుకొస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. హిందీ బిగ్బాస్ 19వ సీజన్ కోసం ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారట! ఈ విషయం తెలుసుకున్న జనాలు.. మరమనిషి హౌస్లోకి రావడమేంటని నోరెళ్లబెడుతున్నారు.రోబో విశేషాలుయూఏఈకి చెందిన ఈ రోబో పేరు హబుబు. దీనికి ఏడు భాషలు వచ్చు. అందులో హిందీ కూడా ఉంది. తను పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులన్నీ చకచకా చేయగలదు. మనిషిలా భావోద్వేగాలు కూడా పలికించగలదు. ముఖానికి గోల్డెన్ కలర్ మాస్క్తో లెహంగాలో క్యూట్గా కనిపిస్తుంది. తను నిజంగా బిగ్బాస్ షోలో అడుగుపెడితే గేమ్ ఛేంజర్గా మారడం ఖాయం. తన స్పీడును కంటెస్టెంట్లు అందుకోవడం కష్టమే! మరి నిజంగా హబుబు రియాలిటీ షోలో భాగమవుతుందా? లేదా? అన్నది చూడాలి!చదవండి: పాచిపని కూడా ఇవ్వట్లేదు.. ఈ బతుకొద్దనుకున్నా.. పాకీజా కన్నీళ్లు -
ప్రభాస్కు కథ చెప్పిన 'అమరన్' డైరెక్టర్!
హీరో ప్రభాస్ (Prabhas), ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ను కలిసి రాజ్కుమార్ ఓ కథ వినిపించారని, అది నచ్చి ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని భోగట్టా. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు రాజ్కుమార్ కూడా ధనుష్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ తమ కమిట్మెంట్స్ పూర్తి చేశాకే ఈ హీరో–దర్శకుడి కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ చిత్రాలున్నాయి. ఇందులో ది రాజాసాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది.చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్?
'పుష్ప'తో అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆచితూచి సినిమాలు ప్లాన్ చేసే పనిలో ఉన్నాడు. అప్పటికే ఓకే చేసిన త్రివిక్రమ్ ప్రాజెక్ట్ని పక్కనబెట్టేశాడు. తమిళ దర్శకుడు అట్లీకి అవకాశమిచ్చాడు. త్వరలో షూటింగ్ మొదలయ్యే ఈ మూవీ ఓ రేంజులో ఉండబోతుందని ప్రమోషనల్ వీడియోల బట్టి అర్థమవుతోంది. దీని తర్వాత ఎవరితో చేస్తాడా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు దానికి ఓ సమాధానం దొరికినట్లు అనిపిస్తోంది.మొన్నీమధ్యే 'తమ్ముడు' మూవీ ప్రమోషన్లో భాగంగా దిల్ రాజు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో ఒకదానిలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది అల్లు అర్జున్తో ఓ సినిమా మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు. దర్శకుడు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్తోనే అని సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. అది కూడా నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'రావణం' అని అంటున్నారు.(ఇదీ చదవండి: అఖిల్కి హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల?)లెక్క ప్రకారం 'రావణం' సినిమాని ప్రభాస్తో తీయాలని నీల్ అనుకున్నాడట. కానీ ప్రస్తుతం ప్రభాస్కి ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా అది సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్తో 'డ్రాగన్' చేస్తున్న నీల్.. ఇది పూర్తయిన తర్వాత బన్నీతో కలిసి పనిచేస్తాడనిపిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ.ఎందుకంటే కేజీఎఫ్, సలార్ సినిమాలతో తన స్టాండర్డ్ పెంచేసుకున్న ప్రశాంత్ నీల్.. ఇప్పుడు తారక్తో మూవీ చేస్తున్నాడు. కేజీఎఫ్ 3, సలార్ 2 కూడా తీయాల్సి ఉంది కానీ అవి ఇప్పట్లో సాధ్యమవుతాయా? లేదంటే 'రావణం' తీసిన తర్వాత ఈ రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయా అనిపిస్తుంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో క్రేజీ కాంబినేషన్ల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉంది. మరి వాటిలో ఎన్ని నిజమవుతాయో చూడాలి?(ఇదీ చదవండి: జపనీస్ వీడియో గేమ్లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్) -
చిరంజీవి తల్లికి తీవ్ర అస్వస్థత!
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి.. తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ మీటింగ్లో ఉన్న పవన్ కల్యాణ్.. హుటాహుటిన అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ విషయం వినిపిస్తుంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అస్వస్థత గురించి క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: చిరు పక్కన అనామక హీరోయిన్?)ఈ ఏడాది జనవరిలో అంజనా దేవి.. 75వ పుట్టినరోజు సెలబ్రేట్ పూర్తి చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నిరోజులకే అంటే ఫిబ్రవరిలో.. ఈమె అనారోగ్యానికి గురయ్యారనే రూమర్స్ వచ్చాయి. కానీ వెంటనే కోలుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని మెగా ఫ్యామిలీ నుంచి స్పష్టత వచ్చింది. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారనే తెలిసి మెగా అభిమానులు కంగారు పడుతున్నారు.అంజనా దేవికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల విషయానికొస్తే చిరంజీవి హీరోగా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మనవడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్. మిగిలిన ఇద్దరు కొడుకులు నాగబాబు, పవన్ కల్యాణ్. కూతుళ్ల పిల్లలు కూడా ప్రస్తుతం నటులుగా రాణిస్తున్నారు. కుటుంబం అంతా హైదరాబాద్లోనే ఉంటున్నారు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు) -
చిరు పక్కన అనామక హీరోయిన్?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ జోరుగా సాగుతోంది. మరోవైపు చిరు 'విశ్వంభర' నుంచి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా రావట్లేదు. అసలు ఈ మూవీని ఇప్పట్లో రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఏమైనా ఉన్నారా అనేది తెలియట్లేదు. ఫైనల్గా ఇప్పుడు ఓ ముగింపు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారట. ఉన్న ఒక్క సమస్య కూడా తీరిపోయిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'పంచాయత్' కొత్త సీజన్)'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన సినిమా 'విశ్వంభర'. దీన్ని కూడా ఫాంటసీ జానర్ కథతోనే తీశారు. అయితే చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీంతో టీమ్ పునరాలోచనలో పడిపోయింది. గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం 'రామరామ' అంటూ సాగే ఓ పాట రిలీజ్ చేశారు. ఇది కూడా జనాల్లోకి పెద్దగా రీచ్ కాలేదు.అయితే చిరంజీవి లాంటి హీరోకు.. స్పెషల్ సాంగ్ చేసేందుకు హీరోయిన్ దొరకట్లేదని మొన్నటివరకు రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికేసినట్లు తెలుస్తోంది. కన్నడ నటి నిష్విక నాయుడు.. చిరు పక్కన డ్యాన్స్ చేయనుందని, ఈ పాటతో షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. ఒకవేళ అంతా పూర్తి చేసినా సరే ఈ ఏడాదిలో సినిమా రిలీజ్ చేస్తారా అనేది అనుమానంగా ఉంది.(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)ఎందుకంటే జూలైకి ఎన్నిరోజులు లేదు. ఆగస్టులో తారక్, రజినీకాంత్ సినిమాలు ఉన్నాయి. సెప్టెంబరులో మిరాయ్, ఓజీ లాంటి చిత్రాలు రెడీగా ఉన్నాయి. పోనీ అక్టోబరులో ప్లాన్ చేద్దామా అంటే అక్కడ కూడా అఖండ 2, కాంతార 2 లాంటి పాన్ ఇండియా సినిమాలున్నాయి. డిసెంబరులో 'రాజాసాబ్' ఉండనే ఉన్నాడు. ఇలా రాబోయే ఆరు నెలలు ఫుల్ ప్యాక్డ్గా రిలీజులు ఉన్నాయి. మరి వీటన్నింటి మధ్యలో 'విశ్వంభర'ని రిలీజ్ చేస్తారా? లేదంటే ఏం చేస్తారనేది చూడాలి?ఇక నిష్విక నాయుడు విషయానికొస్తే.. 'బిచ్చగాడు' కన్నడ రీమేక్ అమ్మ ఐ లవ్ యూ అనే సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత చిన్న చిన్న మూవీస్ చేసింది. మరి ఇలాంటి అనామక హీరోయిన్ని చిరు సరనస తీసుకోవాలనే ఆలోచన ఎవరిది? దీనికి కారణమేంటి అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు) -
హీరోయిన్ సమంతకు కష్టకాలం!
హీరోయిన్గా సమంత స్టార్ హోదా చూసింది. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు చేతిలో పెద్గగా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కొన్నిరోజుల క్రితం 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ ఓకే అనిపించుకుంది కానీ పెట్టిన డబ్బులు అయితే వచ్చేశాయి. అలా నిర్మాతగా తొలి అడుగు పర్లేదనిపించుకుంది. కానీ నటిగానే ఈమెకు కష్టకాలం నడుస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!నాగచైతన్యకు 2021లో విడాకులు ఇచ్చిన సామ్.. తర్వాత కొన్నాళ్లకు తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమా చేసింది. ఇది పర్లేదనిపించుకోగా.. తర్వాత 'సిటాడెల్' ఇండియన్ వెబ్ సిరీస్లో నటించింది. ఇది కూడా సమంతకు పెద్దగా ప్లస్ కాలేకపోయింది. ప్రస్తుతానికైతే 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇప్పుడు ఇది కూడా మొత్తానికే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తుంది.(ఇదీ చదవండి: మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?)కొన్నాళ్ల క్రితం ఈ సిరీస్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పనిచేస్తున్న ఓ వ్యక్తి.. బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్ చేశాడని, 25 రోజులే షూటింగ్ జరిగినప్పటికీ.. సగానికి బడ్జెట్ ఖర్చయిపోయిందని టాక్ వచ్చింది. ఇదంతా కూడా ఓ ఆడిట్ ద్వారా బయటపడింది. అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్ను ఆపేశారని టాక్ నడిచింది. ఇప్పుడు మిగిలిన బడ్జెట్ పెట్టి సిరీస్ పూర్తి చేసేందుకు నెట్ఫ్లిక్స్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. దీంతో సిరీస్ మధ్యలోనే ఆపేశారని తెలుస్తోంది.అయితే చిత్ర నిర్మాతలైన రాజ్-డీకే మాత్రం అలాంటిదేం లేదని సన్నిహితుల దగ్గర అంటున్నారు. ఒకవేళ గనుక ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే మాత్రం సమంతకు కష్టకాలమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. అలా అని ప్రస్తుత దర్శకులు ఈమెకు హీరోయిన్ అవకాశాలు ఇస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు) -
మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్, పెళ్లి.. ఇలాంటివన్నీ చాలా సాధారణమైన విషయాలు. టాలీవుడ్లో తక్కువ గానీ బాలీవుడ్లో మాత్రం ఫలానా హీరో.. ఫలానా హీరోయిన్తో డేటింగ్లో ఉన్నాడనే రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇవి నిజమనేటట్లు సదరు హీరోహీరోయిన్ జంటగా కనిపించడం, బయట కూడా కెమిస్ట్రీ పండించడం లాంటివి చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం వరకు తమన్నా-విజయ్ వర్మ గురించి ఇలానే మాట్లాడుకున్నారు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు)దాదాపు రెండు మూడేళ్ల పాటు తమన్నా.. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేసిందనే ప్రచారం అయితే గట్టిగానే నడించింది. అందుకు తగ్గట్లు జంట పక్షుల్లా ఎక్కడపడితే అక్కడ వీళ్లిద్దరూ కనిపించేవారు. ప్రేమ, పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్గా మాట్లాడేవారు కూడా. మరి ఏమైందో ఏమోగానీ ఈ జంట బ్రేకప్ చెప్పేసుకుంది. కలిసి కనిపించడమే మానేశారు. ప్రస్తుతం తమన్నా.. సినిమాలు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. విజయ్ ఏం ప్రాజెక్టులు చేస్తున్నాడో తెలీదు.అలాంటిది ఇప్పుడు విజయ్ వర్మ.. మరోసారి వార్తల్లో నిలిచాడు. 'దంగల్' బ్యూటీ, హీరోయిన్ ఫాతిమా సనా షేక్తో కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి. వీటిలో ఎంత నిజముందో తెలీదు. రూమర్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్-ఫాతిమా ప్రస్తుతం జంటగా 'గుస్తాఖ్ ఇష్క్' అనే మూవీ చేస్తున్నారు. మరి ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏమైనా ప్రేమలో పడ్డారా? లేదంటే ఇవి కేవలం రూమర్సేనా అనేది క్లారిటీ రావాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?
ఈ వారం ఓ మాదిరి అంచనాలతో రిలీజైంది 'కుబేర'. రిలీజ్కి ముందు బుకింగ్స్ కూడా అలా అలా అన్నట్లే ఉన్నాయి. ఎప్పుడైతే మార్నింగ్ షో పూర్తయి పాజిటివ్ టాక్ వచ్చిందో మిగతా షోలన్నీ హౌస్ఫుల్స్ కావడం మొదలుపెట్టాయి. అలా తొలిరోజు యావరేజ్ వసూళ్లు రాగా.. రెండో రోజు వచ్చేసరికి ఆ నంబర్స్ కాస్త పెరిగాయి. ఇంతకీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంత? ఓవర్సీస్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?ధనుష్ నటించిన 'కుబేర'.. ఓ బిచ్చగాడు ఓ మల్టీ మిలియనీర్ మధ్య సాగే థ్రిల్లింగ్ డ్రామా కథతో తీశారు. బిచ్చగాడిగా ధనుష్ విశ్వరూపం చూపిస్తే.. సీబీఐ అధికారిగా నాగ్ ఆకట్టుకున్నాడు. రష్మిక కూడా తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. దేవిశ్రీ ప్రసాద్ కూడా తనదైన మ్యూజిక్తో మార్కులు కొట్టేశాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా తన రూట్ మార్చి హిట్ కొట్టేశాడు.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ఇలా అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'కుబేర'కు తొలిరోజు మన దేశంలో రూ.14 కోట్ల మేర నెట్ వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.16 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండు రోజులకు రూ.31.25 నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. గ్రాస్ రూ.36 కోట్ల మేర ఉండొచ్చని తెలుస్తోంది. ఓవర్సీస్లోనూ ప్రస్తుతం 1.4 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేశాయి. అంటే రూ.15 కోట్ల మేర వచ్చేసినట్లే. మొత్తంగా చూస్తే రూ.50 కోట్ల మార్క్ అయితే దాటేసిందని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్లో ఈ సినిమాకు ఎంత డబ్బులు వస్తాయో చూడాలి?'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?) -
దృశ్యం నటితో విడాకులు.. త్వరలోనే డైరెక్టర్ రెండో పెళ్లి
దర్శకుడు, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అనీశ్ ఉపాసన (Aniesh Upaasana) రెండో పెళ్లికి సిద్ధమయ్యా. కారణం.. ఉపాసన బుల్లితెర నటి తుషారా కమలాక్షితో ఉన్న ఫోటోను షేర్ చేయడమే! ఈ పోస్ట్ కింద తుషారాను లైఫ్ పార్ట్నర్ (జీవిత భాగస్వామి)గా అభివర్ణిస్తూనే హార్ట్ సింబల్ జత చేశాడు. ఇది చూసిన అభిమానులు ఈ లవ్ బర్డ్స్కు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. దృశ్యం నటితో పెళ్లి- విడాకులుఅనీశ్ గతంలో నటి అంజలి నాయర్ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె నెడునల్వాడై, తానక్కరణ్, కలింగళిల్ ఆవల్ వాసంతం, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాస్, దృశ్యం 2 వంటి చిత్రాల్లో నటించింది. అనీశ్.. మ్యాట్నీ, సెకండ్స్, పాప్కార్న్, జానకి జానే సినిమాలకు దర్శకత్వం వహించాడు. రెండు దశాబ్దాలుగా మోహన్లాల్ దగ్గర ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. త్వరలోనే రెండో పెళ్లిఅనీశ్ దర్శకుడిగా పరిచయమైన మ్యాట్నీ సినిమాలో అంజలి హీరోయిన్గా నటించింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. 2011లో పెళ్లిచేసుకోగా.. ఈ జంట ప్రేమకు గుర్తుగా ఓ కూతురు జన్మించింది. తర్వాతేమైందో కానీ 2016లో అంజలి, అనీశ్ విడిపోయారు. 2022లో అంజలి అజిత రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ పాప పుట్టింది. View this post on Instagram A post shared by ANIESH UPAASANA (@director_aniesh_upaasana) చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్ -
'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలారోజుల తర్వాత మళ్లీ జోష్ కనిపిస్తోంది. వేసవిలో స్టార్ హీరోల సినిమాలేవి రాకపోవడంతో చాలా డల్గా ఉంది. నాని 'హిట్ 3' కూడా మే నెలలోనే రిలీజైనప్పటికీ కొన్నిరోజులు మాత్రమే థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. ఇప్పుడు 'కుబేర' విషయంలో రిలీజ్కి ముందు పెద్ద హడావుడి గానీ హైప్ గానీ లేదు. తొలిఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే తొలిరోజు వసూళ్లలో మంచి నంబర్స్ కనిపించాయి.తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు గానీ తమిళనాడులో మాత్రం సాంకేతిక కారణాలతో విడుదలకు ముందురోజు బుకింగ్స్ తెరిచారు. అయినా సరే మౌత్ టాక్ ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్గానే వస్తోంది. అలా తొలిరోజు తెలుగు, తమిళంలో కలిపి రూ.13 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నంబర్స్ ఇంకా పెరగొచ్చు అనిపిస్తుంది. చూడాలి మరి ఎంత కలెక్షన్స్ వస్తాయో?(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకు తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకుడు. తొలిరోజు వసూళ్ల బట్టి చూస్తే ధనుష్కి కెరీర్ పరంగా ఇది రెండో బిగ్గెస్ట్ కలెక్షన్ కాగా.. నాగార్జున, శేఖర్ కమ్ములకు మాత్రం ఇదే అత్యధికం. ఎందుకంటే నాగ్ సినిమాలన్నీ తెలుగు వరకు పరిమితం. అందువల్ల ఓ మాదిరి వసూళ్లు వచ్చేవి. ఇక దర్శకుడు కమ్ముల ఇప్పటివరకు సింపుల్ బడ్జెట్ మూవీస్ తీస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వసూళ్లు వీళ్లకు ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కుబేర' మేకింగ్ వీడియో.. చెత్తకుప్పని కూడా) -
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
'కుబేర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కాస్త కళకళలాడుతున్నాయి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన స్టైల్ కంటే ఈ మూవీని కాస్త డిఫరెంట్గా తీశాడు. నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ఓవరాల్ టాక్ మాత్రం బాగుంది. చూస్తుంటే ఈ వీకెండ్ విన్నర్ ఈ మూవీనే అవుతుందేమో అనిపిస్తుంది. మరి ఈ సినిమాలో కనిపించిన స్టార్స్కి ఎవరికెంత రెమ్యునరేషన్ ఇచ్చారు?తమిళ నటుడు ధనుష్.. 'కుబేర'లో హీరోగా నటించాడు. ఇందులో ఇతడిది బిచ్చగాడి పాత్ర. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇతడి నటనకు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే అంత సహజంగా నటించాడని అంటున్నారు. ఈ చిత్రంలో నటించినందుకుగానూ రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇదే మూవీలో మరో కీలక పాత్ర పోషించిన నాగార్జున.. రూ.14 కోట్ల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన)ఇదే సినిమాలో హీరోయిన్గా చేసిన రష్మిక రూ.4 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుందని, మ్యూజిక్తో ఆకట్టుకున్న దేవిశ్రీ ప్రసాద్ రూ.3 కోట్ల పారితోషికం తీసుకున్నాడని అంటున్నారు. ఇక కెప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ కమ్ముల అయితే రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా స్టార్ కాస్ట్ ఎక్కువ కావడంతో రూ.100 కోట్ల కంటే ఎక్కువగానే బడ్జెట్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న టాక్ బట్టి చూస్తే నిర్మాతలు పెట్టిన మొత్తం రిటర్న్ రావొచ్చు అనిపిస్తుంది.'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా) -
'రాజాసాబ్' మారుతి.. ఏకంగా ఆరు కథలు!
'రాజాసాబ్' టీజర్కి అన్నివైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కొన్నాళ్ల ముందు వరకు డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఎందుకు సినిమా చేస్తున్నాడా అని తిట్టుకున్న ఫ్యాన్స్.. ఇప్పుడు టీజర్ చూసి మెచ్చుకుంటున్నారు. పర్లేదు మూవీ డీసెంట్గానే ఉండొచ్చు, హిట్ కొట్టబోతున్నాం అని మురిసిపోతున్నారు. అయితే డైరెక్టర్ మారుతి గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది.స్వతహాగా ఆర్టిస్ట్ అయిన మారుతి.. 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' సినిమాలతో దర్శకుడిగా మారాడు. ఈ రెండింటిలోనే బూతు డైలాగ్స్ ఉండేసరికి ఇతడిపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. దీని నుంచి బయటపడేందుకు నానితో 'భలే భలే మగాడివోయ్' సినిమా తీశాడు. తనపై ఉన్న బూతు ముద్రని చెరిపేసుకున్నాడు. తర్వాత నుంచి కామెడీ ఎంటర్టైనర్స్ తీస్తున్నాడు. గతంలో 'ప్రేమకథా చిత్రమ్'తో హారర్ కామెడీ ట్రెండ్ సెట్ చేసిన మారుతి.. ఇప్పుడు 'రాజాసాబ్'తో హారర్ ఫాంటసీ స్టోరీతో రాబోతున్నాడు.(ఇదీ చదవండి: 'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ)సరే అసలు విషయానికొస్తే.. మారుతిలో దర్శకుడితో పాటు మంచి రైటర్ కూడా ఉన్నాడు. గతంలో తన కథలతో పలువురు దర్శకుల్ని పరిచయం కూడా చేశాడు. ఇప్పుడు 'రాజాసాబ్' తర్వాత కూడా అలానే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ తర్వాత మరో కొత్త మూవీ చేయడానికి చాలా టైమ్ పట్టొచ్చు. కానీ అంతలో తన దగ్గరున్న ఆరు స్టోరీల్ని టాలీవుడ్లోనూ పలువురు యంగ్ డైరెక్టర్స్కి ఇవ్వాలని ఫిక్సయ్యాడట. త్వరలో ఇవి కార్యరూపం దాల్చనున్నాయి.ఇక 'రాజాసాబ్' సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన మారుతి.. చూచాయిగా ఉండకపోవచ్చని అన్నాడు. డిసెంబరులో రాబోయే సినిమా హిట్ అయిన దానిబట్టి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పుకొచ్చాడు. మారుతి కామెంట్స్ బట్టి చూస్తే సెకండ్ పార్ట్ ఉండదు. డిసెంబరు 5న 'రాజాసాబ్' థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికీ ఇంకాస్త వర్క్ బ్యాలెన్స్ ఉంది. రిలీజ్కి ఇంకా చాలా సమయముంది కాబట్టి అంతలో పూర్తి చేసి చెప్పిన టైంకి రావొచ్చు. లేదంటే మాత్రం మళ్లీ డేట్ మారడం పక్కా.(ఇదీ చదవండి: సమంత.. ఆ జ్ఞాపకం ఇంకా అలానే) -
హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక పెళ్లి రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు నమ్మాలనిపించదు. మరికొన్నిసార్లు మాత్రం నిజంగా ప్రేమించుకుంటున్నారా? పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అలాంటి ఓ గాసిప్ పుల్గా వైరల్ అవుతోంది. అదే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి?తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్.. గతంలో ఆండ్రియా, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లతో డేటింగ్ చేశాడనే వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. కానీ కాలక్రమేణా వాటి గురించి జనాలు మర్చిపోయారు. సడన్గా ఇప్పుడు సరికొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ని అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, కానీ ఈ విషయం బయటపడకుండా సైలెన్స్ మెంటైన్ చేశారని.. త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ తమిళవాళ్లు కావడంతో ఇది నిజమేనేమోనని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇరువైపుల నుంచి ఎలాంటి ఖండన లేదు. అలా అని అంగీకారం కూడా లేదు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఇది రూమర్ మాత్రమే.అనిరుధ్ విషయానికొస్తే టీనేజీలోనే సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కావ్య మారన్ విషయానికొస్తే.. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు. ఇప్పటికే తండ్రితోపాటు పలు వ్యాపారాల్లో కీలకంగా ఉంది. వీటితో పాటు ఐపీఎల్లోనూ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తోంది.(ఇదీ చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?) -
అల్లు అర్జున్.. 'శక్తిమాన్'
90స్ జనరేషన్కి సూపర్ హీరోలు అనగానే స్పైడర్ మ్యాన్, 'శక్తిమాన్' గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్ సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే 'శక్తిమాన్' స్టోరీతో అటు సీరియల్ గానీ మూవీస్ గానీ రాలేదు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో ఈ ప్రాజెక్ట్ తీస్తారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఫైనల్గా అది అల్లు అర్జున్ చేతిలోకి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం బన్నీ.. త్రివిక్రమ్తో సినిమా చేయాలి. భారీ బడ్జెట్తో మైథలాజికల్ మూవీ ఒకటి అనుకున్నారు. కానీ అది ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో తమిళ దర్శకుడు అట్లీతో.. బన్నీ కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఇదో హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో తరహా సినిమా అని అనౌన్స్మెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) రీసెంట్గా బన్నీ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. దీంతో నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అనే టైంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. గతంలో ఇతడు 'మిన్నల్ మురళి' అని లోకల్ సూపర్ హీరో మూవీ ఒకటి తీశాడు. ఈ క్రమంలోనే బన్నీ-బాసిల్ కలిసి 'శక్తిమాన్' చేస్తారనే రూమర్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు ఓ రెండు కలిసి.. గీతా ఆర్ట్స్తో భారీ ఎత్తున నిర్మించబోతున్నారని అంటున్నారు. త్వరలో ప్రకటన రావొచ్చని మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు వినిపిస్తున్నవన్నీ నిజమేనా? లేదంటే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేస్తున్నారా అనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే నిజమేంటనేది క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే కఠిన చర్యలు) -
శూర్పణఖగా ప్రియాంక అవుట్.. రకుల్తో డీల్?
ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో రామాయణ్ (Ramayan Movie) ఒకటి. రణ్బీర్ కపూర్ రాముడిగా, సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇదివరకే మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని, 2027లో రెండో భాగాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.ప్రియాంక అవుట్తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర కోసం స్టార్ హీరోయిన్లను సంప్రదించారట! మొదట ఈ అవకాశం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను వరించిందట. కానీ, తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా ఉందట. దీంతో రామాయణ్ చిత్రయూనిట్.. ప్రియాంకను వదిలేసి రకుల్ ప్రీత్ సింగ్ను శూర్పణఖ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం కంటే సంతోషం ఇంకేముంటుందని రకుల్ వెంటనే రామాయణ్కు ఓకే చెప్పినట్లు భోగట్టా!రామాయణ్..ఈ క్రమంలో ఆమెకు లుక్ టెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. రామాయణ్ విషయానికి వస్తే సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. ఇక ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్బాబు (SSMB29) సినిమాతో బిజీగా ఉంది. అటు రకుల్.. చివరగా మేరే హజ్బెండ్ కీ బీవీ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: కూతురి బర్త్డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా? -
అల్లు అర్జున్ అంటే అంతే.. కొత్త దర్శకుడికి బిగ్ ఛాన్స్
పుష్ప(Pushpa) తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాల గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా రేంజ్లో ఆదరణ ఉండటంతో ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. త్రివిక్రమ్(Trivikram) సినిమాను దాదాపు పక్కన పెట్టేసినట్లే అని చెప్పవచ్చు. అయితే, ఇప్పటికే బన్నీ లిస్ట్లో ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఆయనతో ఒక ప్రాజెక్ట్ తప్పకుండా చేస్తారని టాక్ ఉంది. ఇంతలో ఎవరూ ఊహించలేని ఒక దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అట్లీ సినిమా తర్వాత తన దర్శకత్వంలోనే బన్నీ సినిమా అంటూ పెద్ద ఎత్తున్న వైరల్ అవుతుంది.అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరూ ఊహించలేని దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా బన్నీ ఓకే చేశారట. మలయాళ హిట్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph)తో బన్నీ సినిమా దాదాపు ఖరారు అయిపోయిందట. మలయాళంలో డైరెక్టర్గానే కాకుండా నటుడిగా కూడా ఆయన సంచలన విజయాలను అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మిన్నల్ మురళీ' (2021) చిత్రానికి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, దర్శకుడిగా ఆయన మూడు చిత్రాలకే పనిచేశారు. స్టోరీ రచయితగా పలు సినిమాలకు పనిచేశారు. జయ జయ జయ జయహే, సూక్ష్మ దర్శిని, పోన్ మాన్ వంటి సినిమాలతో ఆయన తెలుగు వారికి నటుడిగా బాగా దగ్గరయ్యాడు. కేవలం మూడు సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన బాసిల్ జోసెఫ్తో బన్నీ సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది.ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాస్ ఒక సినిమా గురించి మాట్లాడారు. మరో నాలుగు నెలలో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ను ప్రకటిస్తామన్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ మూవీ కాదని కూడా తెలిపాడు. ఎవరూ ఊహించలేని కాంబినేషన్ అని ఆయన అన్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. మలయాళంలో అల్లు అర్జున్కు భారీ ఇమేజ్ ఉంది. దీంతో ఆయన మీద అభిమానంతో దాదాపు నాలుగేళ్లు కష్టపడి ఒక కథను బాసిల్ రెడీ చేశారట. త్వరలో అధికారికంగా ప్రకటన ఉంటుందని సమాచారం. -
బిగ్బాస్ 9: అప్పుడే ప్రారంభం కానుందా?
ఒకప్పుడు బిగ్బాస్ (Bigg Boss Reality Show) మ్యూజిక్ వినబడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి టీవీల ముందు కూర్చునేవారు. కానీ, రానురానూ ఆ క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. పేరుకే రియాలిటీ షో కానీ, అంతా స్క్రిప్టెడ్లా అనిపిస్తోందని జనం పెదవి విరుస్తున్నారు. పైగా కష్టపడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి ఊహించనివారికి టైటిల్ కట్టబెడుతున్నారన్న కామెంట్లు కూడా వినివిస్తున్నాయి.ఆ నెలలో షురూ..ఏమాటకామాట.. ఆ పోట్లాటలు, ఆటలు, సరదాలు, ప్రేమలు.. ఇవన్నీ చూడ్డానికి భలే ఉంటాయని ఈ షో కోసం ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉంటారు. అలాగే తిట్టుకుంటూనే బిగ్బాస్ చూసేవాళ్లు కూడా బోలెడుమంది. ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్లు వచ్చాయి. ఈసారి తొమ్మిదో సీజన్కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి బిగ్బాస్ కాస్త ముందుగా ప్రారంభం కానుందని ప్రచారం జరిగింది. సంప్రదింపులు- చర్చ దశల్లోనే..కానీ, సెట్ వర్క్ ఈమధ్యే మొదలైంది. సెట్ రెడీ అయి కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చేసరికి చాలా సమయమే పడుతుంది. ఈ లెక్కన ఎప్పటిలాగే బిగ్బాస్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఆగస్టు చివర్లో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బిగ్బాస్ 9లోకి రారమ్మని నిర్వాహకులు చాలామందిని సంప్రదిస్తున్నారు. పార్టిసిపెంట్లు వీళ్లేనా?అందులో.. తేజస్విని, అలేఖ్య (అలేఖ్య చిట్టి పికిల్స్) సిస్టర్స్), బర్రెలక్క, కల్పికా గణేశ్.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కిర్రాక్ బాయ్స్ వర్సెస్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొన్న దెబ్జానీ, శివకుమార్, ఇమ్మాన్యుయేల్ కూడా షోలో ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఇందులో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే! హోస్ట్గా పలువురి పేర్లు వినిపించినప్పటికీ నాగార్జునే ఈసారి కూడా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్ -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!
సినిమాటిక్ యూనివర్స్ అనగానే గుర్తొచ్చే పేరు లోకేశ్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సినిమాలని ఒకదానికొకటి లింక్ చేసిన ఇతడు.. ఎల్సీయూ సృష్టించాడు. ప్రస్తుతం రజనీకాంత్తో 'కూలీ' తీస్తున్నాడు. ఇది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఓవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటే 'బెంజ్'. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు క్రేజీ రూమర్ ఒకటి వినిపిస్తోంది.సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. లోకేశ్ ఇప్పటివరకు తీసిన చిత్రాల్లోనూ హీరోయిన్లు కనిపించేది కూడా తక్కువే అని చెప్పొచ్చు. కానీ 'బెంజ్'లో మాత్రం ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకున్నారట. వాళ్లలో సంయుక్త, ప్రియాంక మోహన్ ఇప్పటికే ఖరారు కాగా.. మడోన్నా సెబాస్టియన్ని కూడా తీసుకోవాలని చూస్తున్నారట.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?)సంయుక్త, ప్రియాంక హీరో సరసన నటిస్తారని.. మడోన్నా మాత్రం విలన్ వాల్టర్గా చేస్తున్న నివీన్ పౌలీ పక్కన కనిపించబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. రీసెంట్గా 'బెంజ్' విలన్కి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేసి నివీన్ పౌలీ పాత్రని పరిచయం చేశారు. లోకేష్ యూనివర్స్లో ఈ మూవీ కూడా భాగమేనని చెప్పుకొచ్చారు. మరి ఎలా ఏ సినిమాతో లింక్ చేస్తారనేది ఇంకా సస్పెన్స్. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.లోకేశ్ ప్రస్తుతం 'కూలీ' తీస్తున్నాడు. దీని తర్వాత 'ఖైదీ 2' ఉంటుంది. అలానే రోలెక్స్, విక్రమ్ 2 చిత్రాల్ని కూడా తీస్తానని ఇదివరకే చెప్పాడు. అయితే కొన్నిరోజులుగా ఆమిర్ ఖాన్తో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. చూడాలి మరి వీటిలో ఏది ముందు మొదలవుతుందో?(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) -
బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?
'గుంటూరు కారం' తర్వాత ఏడాదిన్నర నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నారు. ఇంతలో అల్లు అర్జున్ కోసం భారీ మైథలాజికల్ స్టోరీ ఒకటి సిద్ధం చేశారు. త్వరలో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అనుకునే టైంలో బన్నీ లైనప్ మారింది. 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ని కాదని అట్లీతో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో మాటల మాంత్రికుడు ఎదురు చూడక తప్పని పరిస్థితి. అలానే ఎవరితో సినిమా చేయాలా అని త్రివిక్రమ్ పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయారు. అయితే ఇప్పుడు ఈయన గురించి కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.త్రివిక్రమ్, అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన కథని ఇప్పుడు ఎన్టీఆర్తో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారట. అలా అని ఇది ఇప్పుడు మొదలు కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. రామ్ చరణ్, వెంకటేశ్తో వరసగా మూవీస్ చేస్తారని, ఇవి పూర్తయిన తర్వాత తారక్తో మూవీ ఉండొచ్చని తెలుస్తోంది. అంతలో ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్తో ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని వస్తాడని టాక్.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)'అరవింద సమేత' తర్వాతే త్రివిక్రమ్-ఎన్టీఆర్తో మరోసారి పనిచేస్తారని కొన్నేళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఏమైందో ఏమో గానీ ఆ ప్రాజెక్ట్ అలానే ఉండిపోయింది. అదే కథతో త్రివిక్రమ్.. 'గుంటూరు కారం' తీశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరి ఇది నిజమో కాదో సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరోసారి ఒకరు చేయాల్సిన స్టోరీతో మరో స్టార్ హీరో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బన్నీ కూడా ప్రస్తుతం అట్లీతో చేస్తున్నాడు. ఒకవేళ కుదిరితే త్రివిక్రమ్తో ప్రాజెక్ట్ ఉంటుంది. లేదంటే మాత్రం సందీప్ రెడ్డి వంగా, పుష్ప 3 మూవీస్ ఉండనే ఉన్నాయి. మరి త్రివిక్రమ్ సినిమా మిస్ అంటున్న వార్తలు నిజమేనా? లేదంటే పుకార్లా అనేది తెలియాల్సి ఉంది. త్వరలో త్రివిక్రమ్-రామ్ చరణ్ మూవీ గురించి ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) -
డిజాస్టర్ 'థగ్ లైఫ్'.. ఓటీటీ లెక్క మారుతోంది!
రీసెంట్ టైంలో ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి ఘోరమైన డిజాస్టర్ అయిన సినిమా 'థగ్ లైఫ్'. తొలిరోజు తొలి ఆటకే ఫలితం ఏంటో తెలిసిపోయింది. రిలీజ్కి కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత తేలిపోయింది. ఇప్పుడు వీకెండ్ కూడా పూర్తి కావడంతో చాలాచోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో టీమ్ పునరాలోచనలో పడిపోయింది. దీంతో ఓటీటీ లెక్క మారే సూచనలు కనిపిస్తున్నాయి.సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత సదరు సినిమా.. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కావాలనేది ముందే మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుంటారు. కమల్ హాసన్ 'థగ్ లైఫ్' చిత్రానికి కూడా నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎనిమిది వారాల తర్వాతే స్ట్రీమింగ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఉత్తరాదిలోనూ మల్లీప్లెక్స్ రిలీజ్ దక్కింది. తీరా చూస్తే తొలి వీకెండ్కే సినిమా ఫలితం ఏంటో తెలిసిపోయింది. దీంతో నిర్మాతలు.. ఓటీటీ సంస్థతో బేరాసారాలు మొదలుపెట్టారట.ఒప్పందం చేసుకున్నట్లు ఎనిమిది వారాలు కాకుండా నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అడుగుతున్నారట. తద్వారా కొంత మొత్తం ఎక్కువ రాబట్టుకోవాలని నిర్మాతల ఆలోచన. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు నడుస్తున్నాయి. రీసెంట్ టైంలో థియేటర్లలో ఆడని సినిమాలు కూడా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. కంగువ, విడామయూర్చి, రెట్రో ఈ కోవలోకే వస్తాయి. బహుశా 'థగ్ లైఫ్' కూడా అలానే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ట్రెండ్ అవుతుందేమో చూడాలి? ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ఓటీటీ రిలీజ్ విషయంలో క్లారిటీ రావొచ్చు.'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్స్టర్. అనుకోకుండా తండ్రిని కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని శక్తిరాజు పెంచుకుంటాడు. తన తర్వాత తన ముఠాకు అమర్ని నాయకుడిగా చేస్తాడు. దీన్ని అదే ముఠాలోని ఇతర సభ్యులు తీసుకోలేకపోతారు. ఇంతలోనే శక్తిరాజుపై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఇంతకీ శక్తిరాజుని చంపాలనుకున్నది ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో ఇంద్రాణి, లక్ష్మీ పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
దిల్ రాజు చేతికి 'వార్ 2'.. కూలీ ఎఫెక్ట్తో పక్కా ప్లాన్
బాలీవుడ్ స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘వార్ 2’ ఆగష్టు 14న విడుదల కానుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. మరో రెండు నెలల్లో ఈ చిత్రం విడుదల సందడి మొదలు కానుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్కు సంబంధించిన వ్యవహారాలు అప్పుడే ఊపందుకున్నాయి. ఇక్కడ యష్ రాజ్ ఫిలింస్ సొంతంగానే వార్2 ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట.వార్2 సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం దాదాపు 120 కోట్లకు పైగానే యష్ రాజ్ ఫిలింస్ కోట్ చేసింది. అయితే, చాలా పక్కా ప్లాన్తో ఆ సంస్థ అడుగులేస్తుంది. రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనకరాజ్ల సినిమా కూలీ కూడా అదే సమయంలో వస్తుండటంతో సౌత్ ఇండియాలో వార్2కు పోటీ తప్పదు. అందుకే వార్2 చిత్ర యూనిట్ ముందుగా జాగ్రత్త పడుతుందని టాక్. డిస్ట్రిబ్యూషన్ విషయంలో వార్ 2 సరికొత్త ప్లాన్తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముంబై నుంచే థియేటర్ల యజమానులతో వారు డీల్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అగ్రిమెంట్లు కూడా స్టార్ట్ చేసేశారు. కానీ, ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం నిర్మాత దిల్ రాజు సంస్థకు ఇచ్చారని తెలుస్తోంది. వార్2 చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలా లేదా తామే పంపిణీ చేద్దామా అనే అంశాన్ని ప్రస్తుతానికి ఆ టీమ్ పక్కన పెట్టేసింది. -
మహేశ్-రాజమౌళి సినిమా.. నో చెప్పిన స్టార్ హీరో?
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. వివిధ భాషల్లోనూ హీరోలు తెలుగు సినిమాల్లో, మన దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్స్ చాలామంది తమిళ, మలయాళ హీరోలని కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు. అయితే రాజమౌళి, మహేశ్ బాబుతో చేస్తున్న ప్రాజెక్ట్ కోసం ఓ స్టార్ హీరోని అడగ్గా నో చెప్పాడట. ఇంతకీ ఎవరతడు? ఏంటి సంగతి?'ఆర్ఆర్ఆర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రాజమౌళి మహేశ్తో సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలవగా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఎస్ఎస్ఎమ్బీ 29 వర్కింగ్ టైటిల్తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా మూవీ మొదలుపెట్టగానే ప్రెస్ మీట్ పెట్టే రాజమౌళి.. ఈసారి మాత్రం ఒక్క మాట చెప్పకుండా సైలెన్స్ మెంటైన్ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తున్నారనే విషయం లీకైంది. కానీ రాజమౌళి అస్సలు రెస్పాండ్ కాలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)ఇప్పుడు కూడా సడన్గా తమిళ హీరో విక్రమ్.. రాజమౌళి ఇచ్చిన ఆఫర్ చేశాడంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్ని సంప్రదించగా, తనకు ప్రతినాయకుడి రోల్స్ చేయడం ఇష్టం లేదని జక్కన్నతో ఇతడు చెప్పాడట. దీంతో మరో ఆప్షన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ని ఎంపిక చేశాడని అంటున్నారు. గతంలో ప్రభాస్ 'సలార్'లో పృథ్వీరాజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాడు. ఇప్పుడు మహేశ్ బాబుకి విలనీగా చేస్తున్నాడనమాట.ఇదే సినిమాలో మాధవన్ కూడా కీలక పాత్ర చేయనున్నాడనే టాక్ రెండు మూడు రోజుల క్రితం వినిపించింది. త్వరలో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో ఇతడు జాయిన్ అవుతాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజ్ టార్గెట్గా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అటవీ నేపథ్యంతో ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఇది సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?) -
అఖిల్ రిసెప్షన్లో సింపుల్గా మహేశ్.. ఆ టీ షర్ట్ ధర లక్షల్లో..!
అందరికీ వయసు పెరుగుతుంది. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu)కు మాత్రం వయసు తగ్గిపోతూ వస్తుంది. అన్నం తింటాడా? అందం తింటాడా? అన్నంత హ్యాండ్సమ్గా కనిపిస్తుంటాడు. కుమారుడు గౌతమ్ పక్కన నిలబడితే అతడికి తండ్రిలా కాదు, అన్నలా ఉంటాడు. మహేశ్ అందం గురించి చెప్తే మాటలు సరిపోవు. అతడి ఫోటో కనిపిస్తే చాలు సోషల్ మీడియా షేకైపోతుంది.సింపుల్గా టీ షర్ట్లో మహేశ్తాజాగా మహేశ్.. అక్కినేని ఇంట శుభకార్యానికి హాజరయ్యాడు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని- జైనబ్ రవ్జీలు జూన్ 6న పెళ్లి చేసుకున్నారు. ఆదివారం (జూన్ 8న) అన్నపూర్ణ స్టూడియోలో వీరి రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్.. భార్య నమ్రత, కూతురు సితారను తీసుకుని హాజరయ్యాడు. అయితే మహేశ్.. సింపుల్గా టీ షర్ట్ వేసుకుని వెళ్లాడు. లక్ష పైచిలుకు..చూడటానికి సింపుల్గా కనిపిస్తున్న ఈ టీ షర్ట్ ధర వేలల్లో కాదు లక్షల్లోనే ఉంది. ఫ్లవర్ ప్రింటింగ్ ఉన్న ఈ టీషర్ట్.. హెర్మ్స్ అనే లగ్జరీ బ్రాండ్కు చెందినది. దీని ధర దాదాపు రూ.1.37 లక్షలని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే మహేశ్ చివరగా గుంటూరు కారం అనే సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం రాజమౌళితో #SSMB 29 చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా? -
టాలీవుడ్పై సూర్య ఫోకస్.. స్టార్ డైరెక్టర్తో సినిమా క్యాన్సిల్?
హీరో సూర్యకు గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ అనేదే లేదు. 'విక్రమ్' మూవీలో రోలెక్స్ అనే అతిథి పాత్ర తప్పితే చెప్పుకోదగ్గ మూవీస్ రావట్లేదు. గత రెండు చిత్రాల్లో 'కంగువ' అట్టర్ ఫ్లాప్ కాగా, గత నెలలో వచ్చిన 'రెట్రో'.. తమిళంలో మాత్రం కలెక్షన్ సాధించింది. ఇది తప్పితే హిట్ కాదు. ఇలా కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న సూర్య.. ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి మూవీపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. అలానే టాలీవుడ్పైనే గట్టిగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ప్రభాస్కి నో-బన్నీతో ఫిక్స్.. దీపిక ప్లాన్ ఏంటి?)ప్రస్తుతం తెలుగు దర్శకులతో పనిచేసేందుకు సూర్య ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ క్రమంలో గతంలో కమిట్ అయిన 'వడివాసల్' అనే చిత్రాన్ని పక్కనబెట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. తమిళంలో స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్.. సూర్యతో ఈ సినిమా తీయాలని అనుకున్నాడు. మూడేళ్ల క్రితం ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగాయి. ఏమైందో ఏమో గానీ ఈ ప్రాజెక్ట్ అలా సైడ్ అయిపోయింది. స్క్రిప్ట్ ఇంకా పూర్తిస్థాయిలో సెట్ కాకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది.మరోవైపు పాన్ ఇండియా ట్రెండ్లో పలువురు టాలీవుడ్ దర్శకులు ముందు వరసలో ఉన్నారు. దీంతో సూర్య ఇప్పుడు ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీపై పెట్టాడని తెలుస్తోంది. ఈ రూమర్స్ బట్టి చూస్తుంటే త్వరలో సూర్య.. స్ట్రెయిట్ తెలుగు మూవీస్ మరిన్ని చేస్తాడేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. కానీ అందుకు తగ్గ సినిమాలు సెట్ కావట్లేదు. సూర్యని ప్రస్తుత తరం తమిళ దర్శకులు సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ కారణంతోనే ఇకపై యువ దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలని సూర్య అనుకుంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
ప్రభాస్కి నో-బన్నీతో ఫిక్స్.. దీపిక ప్లాన్ ఏంటి?
అల్లు అర్జున్ కొత్త సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెని ఎంపిక చేశారు. గ్రాండ్ ఇంట్రడక్షన్ వీడియోతో అధికారికంగా ప్రకటించారు. ఇందులో సూపర్ ఉమన్ వారియర్ తరహా పాత్రలో దీపిక కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం ప్రభాస్ చిత్రానికి నో చెప్పిన ఈమె.. ఇప్పుడు బన్నీ సినిమాకు ఓకే చెప్పింది. ఈ మధ్యలో ఏం జరిగింది? సోషల్ మీడియాలో అసలేం వినిపిస్తోంది.'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్తో 'స్పిరిట్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కాగా హీరోయిన్ పాత్ర కోసం దీపికని సంప్రదించాడు. దాదాపు ఓకే అనుకున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే దీపిక పీఆర్ టీమ్.. ఈ విషయాన్ని పలు వెబ్సైట్లకు లీక్ చేసింది. దీపిక పాత్ర ఆహా ఓహో అనే రేంజులో ఉండబోతుందని హైప్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత దీపిక తన కండీషన్స్ గురించి సందీప్తో చెప్పిందని వార్తలొచ్చాయి. రోజుకి 8 గంటల మాత్రమే పనిచేస్తానని, రూ.40 కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా కావాలని దీపిక డిమాండ్ చేసినట్లు టాక్ వినిపించింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)అలా దీపిక పెట్టిన కండీషన్స్తో పాటు ఆమె పీఆర్ టీమ్ చేసే హడావుడి వల్ల సందీప్కి చిరాకొచ్చింది. దీంతో దీపికకు నో చెప్పేశాడు. ఇది జరిగిన వెంటనే బాలీవుడ్లో 'స్పిరిట్' గురించి నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. స్టోరీని కూడా లీక్ చేశారు. ఇదో 'ఏ' రేటెడ్ సినిమా అని, హీరోహీరోయిన్ మధ్య రొమాన్స్ గట్టిగానే ఉందని పలు సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో సందీప్ రెడ్డి వంగాకు మండింది. వెంటనే తృప్తి దిమ్రిని హీరోయిన్గా ప్రకటించాడు. దీపిక పేరు ప్రస్తావించకుండా పెద్ద ట్వీట్ పెట్టాడు. ఆమెకు ఇచ్చిపడేశాడు. ఏం చేసుకుంటావో చేస్కో అని అనేశాడు.ఇది జరిగి కొన్నిరోజుల కూడా కాలేదు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో దీపికని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీనిపై కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. లెక్క ప్రకారం మృణాల్ ఠాకుర్ని హీరోయిన్గా తొలుత అనౌన్స్ చేయాలనుకున్నారట. కానీ దీపిక నుంచి ఒత్తిడి రావడంతో ఈమెని హీరోయిన్గా అనౌన్స్ చేశారని వినిపిస్తోంది. మరి దీపిక చెప్పిన కండీషన్స్కి దర్శకుడు అట్లీ ఒప్పేసుకున్నట్లే కనిపిస్తుంది. ఈ సినిమాలో బన్నీ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రతి పాత్రకు ఓ హీరోయిన్ ఉంటుంది. దీపిక కాకుండా మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్ని హీరోయిన్లుగా తీసుకోవాలని ఫిక్సయ్యారట.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?) -
క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్న 'సూర్య'
కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్, సూర్య కథానాయకుడిగా వాడివాసల్ చిత్రం చేయడానికి చాలా కాలం నుంచి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి సూర్య తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లోనే సూర్య బిజీగా ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. అయితే, వెట్రిమారన్ తన తర్వాతి సినిమాను హీరో శింబుతో తెరకెక్కించాలనే ప్లాన్లో ఉన్నారట.కోలీవుడ్ హీరో శింబు గత రెండేళ్లకు పైగా ఎలాంటి చిత్రంలో నటించలేదు. తాజాగా కమలహాసన్తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో థగ్లైఫ్ చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు వరుసగా చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దేశింగు పెరియస్వామి దర్శకత్వంలో ఒక చిత్రం, పార్కింగ్ చిత్రం రాంకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం, అశ్వద్ మారి ముత్తు దర్శకత్వంలో ఇంకో చిత్రం, అంతేకాకుండా ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నిర్మించే చిత్రంలోనూ నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో చిత్రాన్ని శింబు కమిట్ అయినట్లు తెలిసింది. వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీన్ని వి.క్రియేషన్న్స్ సంస్థ నిర్మించనుందని టాక్.. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. -
తొలిరోజే నెగిటివ్ టాక్.. 'థగ్ లైఫ్' కలెక్షన్స్ ఎంత?
కమల్ హాసన్ దిగ్గజ నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 'విక్రమ్' తప్పితే ఆయన కెరీర్లో గత కొన్నేళ్లలో సరైన హిట్ అన్నది లేదు. దీంతో 'థగ్ లైఫ్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. భాష వివాదం వల్ల కర్ణాటకలో పూర్తిగా ఈ మూవీని రిలీజ్ చేయనని తెగేసి చెప్పాడు. దీంతో తెలుగు-తమిళ భాషల్లో నిన్న(జూన్ 5) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ దీనికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్? సోషల్ మీడియాలో టాక్ ఏం నడుస్తోంది?కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో మూడు దశాబ్దాల క్రితం 'నాయకుడు' అనే సినిమా వచ్చింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్లాసిక్గా నిలిచిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే హీరో-దర్శకుడు కలిసి ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారనేసరికి హైప్ ఏర్పడింది. 'థగ్ లైఫ్' ట్రైలర్ కూడా బాగుండేసరికి కమల్ హిట్ కొట్టడం గ్యారంటీ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా టాక్ మారిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)తెలుగు, తమిళంలో ఎక్కడా కూడా కమల్ 'థగ్ లైఫ్' చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అయినా సరే తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.17 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.కోటి షేర్ కూడా రాలేదని అంటున్నారు. కమల్-మణిరత్నం కాంబోకి ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఘోరమైన ఫ్లాప్. కానీ ఈ చిత్రానికి తొలిరోజు రూ.25 కోట్ల వరకు వచ్చాయి. 'థగ్ లైఫ్'కి మాత్రం వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు.'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్స్టర్. తల్లిదండ్రులు కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని పెంచుకుంటాడు. తన నేర సామ్రాజ్యానికి కీలకంగా మారుస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల శక్తిరాజు-అమర్ మధ్య గొడవలు వస్తాయి. ఒకరిని ఒకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతకీ ఇలా జరగడానికి కారణాలేంటి? ఈ కథలో త్రిష పాత్రేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు) -
మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా?
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు కొన్నాళ్లుగా మార్మోగిపోతోంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో అడ్డంగా వాదించడంతో ఆమెను ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తీసేశారు. అత్యధిక రెమ్యునరేషన్ వంటి డిమాండ్లకు తలొగ్గినప్పటికీ వరుస డిమాండ్లు చేస్తుండటంతో సందీప్రెడ్డికి విసుగొచ్చింది. పైగా ఈ మధ్యే తల్లయ్యాను కాబట్టి.. రోజులో ఎనిమిది గంటలే షూటింగ్లో పాల్గొంటానని, సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని అనడంతో డైరెక్టర్కు కోపమొచ్చి ఆమెను తీసేశాడు. డిమాండ్లపై వెనక్కు తగ్గని దీపిక?దీపికా స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నాడు. ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి డిమాండ్ చేసిందట! దీంతో ఆమె పాత్ర నిడివి తగ్గించాలని లేదా తనను తీసేసి ఆమె స్థానంలో త్రిప్తిని తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.బ్లాక్బస్టర్ కల్కిస్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్.. ఇవి రెండూ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే! ఈ రెండిట్లోనూ త్రిప్తికి నటించే ఛాన్స్ వచ్చిందంటే మాత్రం తన క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం. కాగా కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినిదత్ నిర్మించాడు. గతేడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు -
'జాక్' ఫ్లాప్.. సగం డబ్బు వెనక్కిచ్చేసిన హీరో!
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda ).. వరుస హిట్లతో స్పీడు మీదున్న ఈ హీరోకు జాక్ మూవీ (Jack Movie)తో సడన్ బ్రేక్ పడింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్ కాలేకపోయారు. దీంతో జాక్.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.మంచి పని చేసిన సిద్ధుదీంతో నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రాన్ని సుమారు రూ.36 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. నిర్మాతలు తీవ్రంగా నష్టపోవడంతో సిద్ధు ఓ నిర్ణయం తీసుకున్నాడట. జాక్ కోసం తొమ్మిదిన్నర కోట్ల పారితోషికం తీసుకున్న సిద్ధు అందులో సగాన్ని నిర్మాతలకు వెనక్కు ఇచ్చేశాడట! దాదాపు రూ.4.75 కోట్లను బీవీఎస్ఎన్ ప్రసాద్కు తిరిగిచ్చేశాడని తెలుస్తోంది.చూసి నేర్చుకోండిసిద్ధు చేసిన మంచిపనికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాతల నష్టాల్ని పూడ్చేందుకు సగం రెమ్యునరేషన్ వదులుకున్న టిల్లు మనసు బంగారం అని కొనియాడుతున్నారు. చాలామంది హీరోలు సిద్ధును చూసి నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధు.. తెలుసుకదా సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా చేస్తున్నారు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.చదవండి: కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మరోసారి స్పందించిన విష్ణు! -
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన 'విశ్వంభర' బ్యూటీ!
టాలీవుడ్లో హీరోయిన్లకు కొదవలేదు. ముంబై నుంచే కాకుండా కన్నడ, మలయాళ నుంచి ఎప్పటికప్పుడు యంగ్ హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలానే కొన్నాళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ ఆషికా.. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో చేస్తోంది. ఇప్పుడు మరో స్టార్ హీరో చిత్రంలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా)కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆషికా.. నాగార్జున 'నా సామి రంగ'లోనూ హీరోయిన్గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. అలా చిరంజీవి 'విశ్వంభర'లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మరికొన్ని నెలల్లో రిలీజ్ కావొచ్చు. ఇప్పుడు రవితేజ కొత్త సినిమాలోనూ ఆషికాని తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం 'మాస్ జాతర' చేస్తున్న రవితేజ.. దీని తర్వాత దర్శకుడు కిశోర్ తిరుమల తీసే సినిమాలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి 'అనార్కలి' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. తొలుత ఈ మూవీ కోసం కాయదు లోహర్, మమిత బైజు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ... ఇప్పుడు ఆ స్థానాల్లో కేతిక శర్మ, ఆషిక రంగనాథ్ ఉండబోతున్నారని తెలుస్తోంది. కిశోర్ తిరుమల సినిమాలంటే హీరోయిన్ల పాత్రకు కాస్త గుర్తింపు ఉంటుంది. మరి ఈసారి ఆషికాని ఎలా చూపిస్తాడో? త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి.. వచ్చే సంక్రాంతికి లేదా వేసవికి రిలీజ్ చేయాలని ప్లాన్లో టీమ్ ఉంది.(ఇదీ చదవండి: కురచ దుస్తులపై కామెంట్స్.. సురేఖావాణి ఏమందంటే?) -
'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనుందా? ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇదే చర్చ నడుస్తోంది. వచ్చే వారం రిలీజ్ పెట్టుకుని ఇలా చేస్తున్నారేంటా అని అభిమానులు మళ్లీ తల పట్టుకుంటున్నారు. ఇంతకీ వాయిదా అని వస్తున్న రూమర్స్ నిజమేనా? వినిపిస్తున్న కారణాలేంటి?సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో అంటే 2019లో అలా పవన్ ఒప్పుకొన్న సినిమా ఇది. 2020 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. అప్పటినుంచి ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు గత నెలలో పూర్తి చేశారు. తొలుత క్రిష్ దర్శకుడు కాగా.. కారణాలేంటో తెలీదు గానీ మధ్యలోనే ఇతడు తప్పుకొన్నాడు. దీంతో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు జ్యోతికృష్ణ.. క్రిష్ స్థానంలోకి వచ్చారు. ఎలాగోలా షూటింగ్ కంప్లీట్ చేశారు.(ఇదీ చదవండి: కమల్ హాసన్కి చివాట్లు పెట్టిన హైకోర్ట్)తొలుత ఈ ఏడాది మార్చిలో వస్తుందని అన్నారు. వాయిదా పడింది. మే 30న రావడం పక్కా అన్నారు. అప్పుడు కూడా వాయిదా పడింది. ఎట్టకేలకు జూన్ 12న వస్తుందని పక్కా ఫిక్సయ్యారు. ఇందుకు తగ్గట్లు మరో వారంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కూడా ఉందని డేట్స్ ప్రకటించారు. ప్రస్తుతం సెన్సార్ ముందుకు ఈ చిత్రం వెళ్లింది. కానీ ఇప్పుడు సడన్గా వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది.జూలైలో 'హరిహర వీరమల్లు' రిలీజ్ ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బయ్యర్లు ఇంకా దొరకలేదని, అందుకే వాయిదా వేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ సంగతేంటి అనేది నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే సినిమా మీద పెద్దగా హైప్ లేదు. ఇలాంటి టైంలో మరోసారి గనక వాయిదా పడితే మాత్రం ఉన్న కాస్త హైప్ కూడా పోయే అవకాశముంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?) -
హీరోతో ప్రేమ? క్లారిటీ ఇచ్చేసిన నిధి అగర్వాల్
సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమలో ఉన్నారని రూమర్స్ రావడం సహజం. కలిసి సినిమా చేస్తున్న టైంలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో అయితే శ్రీలీల.. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో డేటింగ్ చేస్తుందని టాక్ వినిపించింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరో హీరోయిన్.. తనపై వస్తున్న గాసిప్స్ గురించి క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)'ఇస్మార్ట్ శంకర్'తో పాటు తెలుగులో పలు సినిమాలు చేసిన నిధి అగర్వాల్.. ప్రభాస్తో 'రాజాసాబ్', పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రాల్లో నటించింది. పవన్ మూవీ.. ఈ నెల 12న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న నిధికి.. తమిళ హీరో శింబుతో రిలేషన్ అంటూ వచ్చిన రూమర్స్పై ప్రశ్న ఎదురైంది. దీనికి సవివరంగా క్లారిటీ ఇచ్చేసింది.'సినిమాల్లో నటించిన హీరోయిన్ల గురించి చాలా పుకార్లు వస్తాయి. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారు. ఇదంతా చాలా కామన్. ఎందుకంటే జనాలకు నిజాల కంటే రూమర్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే నేను వాటిని పెద్దగా పట్టించుకోను. నా గురించి ఎప్పుడూ ఏదో ఒకటి ఇలాంటివి వినిపిస్తూనే ఉంటాయి' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది) -
ముగ్గురు హీరోల 'భైరవం' తొలిరోజు కలెక్షన్స్
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'భైరవం'. నిన్న థియేటర్లలోకి వచ్చింది. చాలావరకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ జనాలు మాత్రం కొంతమేర బాగానే థియేటర్లలోకి వచ్చారు. మరి ఈ చిత్రానికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్?(ఇదీ చదవండి: రీ రిలీజ్లో మహేశ్ 'ఖలేజా' కలెక్షన్స్ రికార్డ్)ముగ్గురు హీరోలు నటించిన ఈ మినీ మల్టీస్టారర్ మూవీ.. తమిళ హిట్ 'గరుడన్'కి రీమేక్. అయినా సరే తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు చిన్న చిన్న మార్పులు చేశారు. తొలిరోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.2.75 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. 'ఖలేజా' రీ రిలీజ్ కావడం ఓ రకంగా దీనికి మైనస్ అయిందని చెప్పొచ్చేమో. ఎందుకంటే మహేశ్ ఫ్యాన్స్తో పాటు పలువురు ప్రేక్షకులు మహేశ్ మూవీకి ఓటేశారు.భైరవం చిత్రానికి ఓవర్సీస్లోనూ పర్వాలేదనిపించే ప్రారంభం దక్కింది. తొలిరోజు 50 వేల డాలర్లు వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్ కలెక్షన్ పోస్టర్ ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. కథ విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఊరు. గజపతి (మనోజ్), వరద (నారా రోహిత్), శీను ఫ్రెండ్స్. అయితే గజపతి కుటుంబం.. ఓ అమ్మవారి ఆలయానికి ట్రస్టీగా ఉంటారు. ఆలయానికి చెందిన వెయ్యి కోట్ల విలువైన భూమిపై ఓ మంత్రి కన్నేస్తాడు. దీని వల్ల ముగ్గురు హీరోల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
ఊహించని కాంబో.. ఆ దర్శకుడితో చరణ్?
'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా క్రేజ్ పెరిగిపోయిందనుకుంటే 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్కి పెద్ద దెబ్బ పడింది. దీంతో ఫ్యాన్స్ బాగా డీలాపడిపోయారు. అలాంటి టైంలో 'పెద్ది' గ్లింప్స్ రావడంతో ఒక్కసారిగా జోష్ వచ్చింది. ప్రస్తుతానికైతే మెగా అభిమానుల ఆశలన్నీ బుచ్చిబాబు తీస్తున్న ఈ చిత్రంపైనే ఉన్నాయి. మరి దీని తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్లోనే ఉంది.లెక్క ప్రకారం 'పెద్ది' తర్వాత.. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేయాలి. కానీ స్క్రిప్ట్ పరంగా ఇంకా ఆలస్యమయ్యేలా ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు వార్తల్లోకి వచ్చింది. 'గుంటూరు కారం' తర్వాత అల్లు అర్జున్తో భారీ మైథలాజికల్ మూవీ చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు. కానీ అట్లీ రావడంతో ఈ దర్శకుడి ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లింది.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)ప్రస్తుతం ఖాళీ దొరకడంతో త్రివిక్రమ్.. వెంకటేశ్తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు. ఒకవేళ ఇదే సెట్ అయితే వచ్చే వేసవిలో రిలీజ్ ఉండొచ్చు. ఆ తర్వాత చరణ్తో త్రివిక్రమ్ ఉండొచ్చని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబో గురించి టాక్ నడిచింది గానీ తర్వాత తర్వాత సైడ్ అయిపోయింది.మళ్లీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ పేరు చరణ్ కోసం తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇది నిజమైతే ఎలాంటి స్టోరీతో వస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడంతా పాన్ ఇండియా, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. త్రివిక్రమ్ చిత్రాలన్నీ ఫ్యామిలీ తరహాలో ఉంటాయి. మరి ఎవరి దారిలోకి ఎవరు వెళ్తారు? వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆ పాట తర్వాత.. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకుంటారనుకోలేదు!) -
అల్లరి నరేశ్.. ఈసారి 'ఆల్కహాల్'?
టాలీవుడ్లో కామెడీ తరహా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేశ్.. ఇప్పుడు చాలా స్లో అయిపోయాడు. ఒకటి అరా సీరియస్ లేదా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పటికీ అనుకున్న ఫలితం దక్కట్లేదు. అయినా సరే మూవీస్ చేస్తూనే ఉన్నాడు. గతేడాది డిసెంబరులో చివరగా 'బచ్చలమల్లి' అనే రస్టిక్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఓ హారర్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్)ఇప్పుడు అల్లరి నరేశ్ చేయబోయే సినిమా కోసం ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడంతా మాస్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో 'ఆల్కహాల్' అని ఓ పేరుని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. రీసెంట్ టైంలో హిట్ సినిమాలతో ఆకట్టుకుంటున్న సితార ఎంటర్టైన్మెంట్స్.. అల్లరోడితో ఈ మూవీని నిర్మించనుందని సమాచారం.'సుడిగాడు' తర్వాత తర్వాత అల్లరి నరేశ్.. కెరీర్ పరంగా కాస్త టర్న్ తీసుకున్నాడు. 'ఉగ్రం' మూవీతో డిఫరెంట్ ప్రయత్నం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మళ్లీ అదే దర్శకుడితో కలిసి 'నాంది' చేశాడు. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. 'బచ్చలమల్లి'పై నరేశ్ కాస్త ఎక్కువ అంచనాలు పెట్టుకున్నాడు గానీ పూర్తిగా ఇది నిరాశపరిచింది. అయినా సరే తగ్గకుండా ఆ తరహా కథతోనే 'ఆల్కహాల్' చేయబోతున్నాడని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుపై క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
'ఓజీ'లో నారా రోహిత్ కాబోయే సతీమణి
పవన్కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'లో నారా ఫ్యామిలీకి కాబోయే కోడలు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు నారా రోహిత్కు కాబోయే సతీమణి శిరీషా (శిరీష లేళ్ల) ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో నటించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఏడడుగుల బంధంతో ఒకటి కానున్నారు. భైరవం సినిమాతో నారా రోహిత్, ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. సినిమాలపై మక్కువతో ఆమె హైదరబాద్లోని తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమా ఛాన్స్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా నారా రోహిత్తో ప్రతినిధి2లో అవకాశం దక్కింది. అలా వారి పరిచయం కాస్త పెళ్లి వైపు అడుగులు పడ్డాయి. వివాహానికి ఇంకా సమయం ఉండటంతో ఆమె పలు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓజీలో ఛాన్స్ దక్కడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. -
ప్రియురాలితో అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడా?
అక్కినేని హీరో అఖిల్.. హీరోగా ఐదు సినిమాలు చేశాడు. కానీ వీటిలో ఒక్కటి యావరేజ్, మిగతావన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. గతంలో ఓసారి నిశ్చితార్థం జరగ్గా.. అది రద్దయింది. దీంతో చాన్నాళ్ల పాటు అఖిల్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఉన్నఫలంగా గతేడాది నవంబరులో తనకు నిశ్చితార్థం జరిగిందని చెప్పి అందరికీ షాకిచ్చాడు.జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ గతేడాది నవంబరులో జరిగింది. దీని తర్వాత పలుమార్లు ఎయిర్పోర్ట్లో జంటగా కనిపించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలో సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 6నే ఈ శుభకార్యం జరగనుందని సోషల్ మీడియాలో చిన్నగా టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది అఖిల్ చెప్పాలి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ) ఇకపోతే గతేడాది నవంబరులో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. తర్వాత కొన్నిరోజులకే అక్కినేని ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. అదే నాగచైతన్య పెళ్లి. గతంలో సమంతతో ఏడడుగులు వేసిన చైతూ.. నాలుగేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న ఇతడు.. హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబరులో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు అఖిల్ కూడా జూన్ తొలివారంలో పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈపాటికే ఏర్పాట్లు జరుగుతూ ఉండాలి. లేదంటే శుభలేఖల్లాంటివి ఏమైనా ఫొటోలు లీక్ కావాలి. కానీ అలాంటి సూచనలేం కనిపించట్లేదు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లు నిజమేనా? కాదా అనే దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: విజయ్ ఆంటోనీ... మరో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ) -
అనిల్ రావిపూడి స్పీడ్కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?
సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమా ప్రకటన నుంచే అదిరిపోయే ప్రమోషన్స్లతో ప్రేక్షకుల అభిరుచిని పట్టేస్తాడు. ఈ క్రమంలో నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్స్లో పాల్గొని, నవ్వులు పంచుతూ ఆయా చిత్రాలపై ఆసక్తి రేకెత్తిస్తుంటారు. అలాంటి మ్యాజిక్ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మారుమూల ప్రాంతం వారికి కూడా కనెక్ట్ అయ్యేలా చేశాడు. అయితే, తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో (MEGA157) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో అనిల్ దూకుడుతో అదరగొడుతున్నాడు. అయితే, దానికి కాస్త బ్రేక్ ఇవ్వాలని చిరు కోరారట. కావాలంటే కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టమని సూచించారట.అనిల్ రావిపూడి స్పీడ్కు చిరు బ్రేకులు వేయడం వెనుక కూడా కారణం ఉందని తెలుస్తోంది. చిరు కొత్త సినిమా విశ్వంభర( Vishwambhara) త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ పట్ల మొదట్లో భారీ అంచనాలే ఉండేవి. కానీ, ప్రస్తుతం చిరు అభిమానుల్లో కూడా సినిమాపై అంతగా ఆసక్తి లేదని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి తన సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ వల్ల విశ్వంభర మీద ప్రభావం పడుతుంది. అందరూ మెగా157 ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. నయనతారతో ప్రమోషన్స్ ఆపై సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో చిరు కళ్ళమీద క్లాప్ కొట్టి దాని చిన్న క్లిప్ రూపంలో వదలడం.. ఇలాంటివి అన్నీ మెగా ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నాయి. కానీ, విశ్వంభరపై అలాంటి జోష్ కనిపించడం లేదు. అందుకే అనిల్ను కాస్త బ్రేక్ తీసుకోవాలని చిరు సూచించారట.విశ్వంభర టీజర్ తర్వాత ఎలాంటి పబ్లిసిటీని ఆ మూవీ మేకర్స్ చయలేదు. అయితే, ఈ సినిమా దర్శకుడు వశిష్ఠపై ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా హిట్ అవుతుందని సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచితేనే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఒక బుక్ లాంచ్ చేసి ఫోటోలు విడుదల చేశారు. కానీ, అందులో ఉన్న సారాంశం ఎంటి..? దాని ప్రత్యేకత ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇలా అయితే ఎలా అంటూ విశ్వంభర ప్రమోషన్స్లో వేగం పెరగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. సినిమా విడుదల విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జులైలో విడుదల కావచ్చు అనే టాక్ అయితే వస్తుంది. -
అల్లు అర్జున్, అట్లీ సినిమా టైటిల్ ఇదేనా..?
‘పుష్ప 2’తో అల్లు అర్జున్, జవాన్తో దర్శకుడు అట్లీ పాన్ ఇండియా రేంజ్లో అదరగొట్టేశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్కు సిద్ధం అవుతున్నారు. ఈమేరకు తాజాగా దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని, అల్లు అర్జున్తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు కొనసాగిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.అల్లు అర్జున్- అట్లీ (AA22) సినిమాకు రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఐకాన్, సూపర్హీరో వంటి వాటిని ఎంపికచేశారని తెలుస్తోంది. గతంలో దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్తో ఒక సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. అందుకు ‘ఐకాన్’ టైటిల్ను ఆయన అనుకున్నారు. అయితే, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అట్లీ సినిమాకు ‘ఐకాన్’ టైటిల్ అయితే ఎలా ఉంటుందని బన్నీ ఆలోచిస్తున్నారట. అట్లీ కూడా బాగానే ఉందని చెప్పారట. దాదాపు ఇదే టైటిల్ను ఫిక్స్ చేస్తారని సమాచారం.ప్రతి సినిమాకీ ఓ కొత్త లుక్తో అభిమానులను అలరిస్తారు అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో మాస్ లుక్లో కనిపించిన బన్నీ ఇప్పుడు అట్లీ సినిమా కోసం సరికొత్తగా తన లుక్ను మార్చుకోనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్లుగానే అల్లు అర్జున్ పలు లుక్స్ను ప్రయత్నించినట్లు సమాచారం. పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ఫిక్షన్ సినిమాగా ఇది రానున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది. -
ఓటీటీలోకి 'హిట్ 3'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హిట్ 3'. ఈనెల మొదట్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మంచి టాక్ తెచ్చుకుంది కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం వసూళ్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ ప్రదర్శితమవుతోంది. ఇకపోతే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డేట్ లాక్ అయిందని అంటున్నారు. ఇంతకీ దీని సంగతేంటి?హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో సినిమా ఇది. తొలి రెండు పార్ట్స్ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోగా.. ఇందులో మాత్రం సస్పెన్స్ తో పాటు యాక్షన్, రక్తపాతాన్ని కాస్త గట్టిగానే దట్టించారు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి కాస్త దూరం జరిగారు. రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే వారం చివర్లో లేదంటే జూన్ 5న ఓటీటీలోకి ఈ సినిమా రావొచ్చని తెలుస్తోంది. దీనితో పాటు సూర్య 'రెట్రో' కూడా కాస్త అటుఇటుగా ఇదే తేదీల్లో స్ట్రీమింగ్ అవ్వొచ్చు.హిట్ 3 విషయానికొస్తే.. అర్జున్ సర్కార్ (నాని) స్ట్రిక్ట్ పోలీస్. విచిత్రమైన మర్డర్ జరిగితే దాన్ని దర్యాప్తు చేస్తుంటాడు. అయితే ఇలాంటి హత్యలు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయని తెలుస్తుంది. దీంతో ఆ టాస్క్ మీద అర్జున్ పూర్తిగా దృష్టిపెడతాడు. ఇంతకీ ఈ మర్డర్స్ వెనక ఉన్నది ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తెరపైకి తెలంగాణ అమర జవాన్ బయోపిక్!) -
తెరపైకి తెలంగాణ అమర జవాన్ బయోపిక్!
దేశభక్తి ప్రధానంగా ఉండే సినిమాలు కొన్ని ఇదివరకే తెరపై సందడి చేశాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ కూడా దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి తెలంగాణకు చెందిన అమర జవాన్ బయోపిక్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకీ ఎవరా జవాన్? ఏంటి సంగతి?తెలంగాణ సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు.. 2020లో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన యుద్ధంలో వీరమరణం చెందారు. అప్పట్లో ఈయన ధైర్య సాహసాల గురించి మన ప్రజలు చాలా మాట్లాడుకున్నారు. అనంతరం ఈయన జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3' అనే నవల కూడా రాశారు.(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం)ఇప్పుడు ఈ నవల ఆధారంగానే సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్ హీరోగా నటించనున్నారట. ఈ ఏడాది జూలైలో షూటింగ్ మొదలుకానుండగా.. ముంబై, లద్దాఖ్ లో దాదాపు 70 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ చేయనున్నారని సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.గతంలో హీరోస్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ తదితర దేశభక్తి ప్రధానంగా నడిచే సినిమాల్లో సల్మాన్ నటించాడు. కాకపోతే గత కొన్నాళ్లుగా ఇతడు మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. గతేడాది 'సికిందర్' చిత్రంతో వచ్చి ఘోరమైన ఫలితం అందుకున్నాడు. మరి ఈసారి జవాన్ బయోపిక్ మూవీతో సల్మాన్ ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
స్టార్ డైరెక్టర్ సినిమాలో శోభితకు ఛాన్స్
నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే పలు కొత్త సినిమాలకు నటి శోభిత ధూళిపాళ ఓకే చెబుతుంది. పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె టాప్ మోడల్గా గుర్తింపు పొందారు. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన శోభిత 2016లో రామన్ రాఘవన్ 2.0 అనే హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో మేజర్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు. అలా హిందీ, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన శోభిత 2022లో మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో వానతి అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా హాలీవుడ్లో మంకీ మాన్ చిత్రంలో నటించి పాన్ వరల్డ్ నటిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి తమిళ ప్రేక్షకులను ఆలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్ చిత్రంలో హీరోయిన్గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందు అట్టకత్తి, కబాలి, సార్పట్టా పరంపరై వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన పా.రంజిత్ ఇటీవల విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రం చేశారు. తాజాగా వట్టువన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోల్డెన్ రేష్మియా ఫిలిమ్స్తో కలిసి నీలం స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో అట్టకత్తి దినేష్ కథానాయకుడుగా, ఆర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్స్ ఇతివృత్తంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం కారైక్కుడి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ నటిస్తున్న పాత్ర ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. -
నవీన్ పోలిశెట్టికి లక్కీచాన్స్ వరించనుందా..?
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి జాక్పాట్ కొట్టబోతున్నారా? ఈ యువ నటుడికి డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ వరించనుందా..? ఈ క్రేజీ చిత్రంలో ఆ స్టార్ కథానాయకి నటించి ఉన్నారా..? దీనికి సంబంధించిన వార్తనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమా బుక్లో దర్శకుడు మణిరత్నం పేరు ఎప్పటికీ ప్రముఖంగానే ఉంటుంది. రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో చిత్రాలు చేసి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం కమలహాసన్, శింబు, త్రిష, అభిరామి వంటి ప్రముఖ నటీనటులు నటించిన థగ్ లైఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నలకు పలు రకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ చేస్తున్నాయి. తాజాగా నవీన్ పోలిశెట్టి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి మణిరత్నం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవీన్ పోలిశెట్టి ఇంతకుముందు తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సక్సెస్ చిత్రాల్లో నటించారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించే ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సాయిపల్లవి కథానాయకిగా నటింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అధికారిక పర్యటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. -
నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?
ఒకప్పటితో పోలీస్తే సీనియర్ హీరోలు.. ప్రస్తుతం యువ దర్శకులతో పనిచేసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రెండ్ కి తగ్గ స్టోరీలతో మూవీస్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అలా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఓ తెలుగు యువ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చేస్తున్న రజినీకాంత్.. మరోవైపు నెల్సన్ తీస్తున్న 'జైలర్ 2' కూడా చేస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అలానే తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర రజినీ డేట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా వివేక్ ఆత్రేయ వెళ్లి ఆయనకు కథ చెప్పాడని తెలుస్తోంది.2017లో 'మెంటల్ మదిలో' అనే సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత 'బ్రోచేవారెవరురా' తీశాడు. నానితో అంటే సుందరానికీ, సరిపోదా శనివారం చిత్రాల్ని తెరకెక్కించాడు. కేవలం నాలుగే సినిమాలు తీసిన అనుభవమున్న వివేక్.. ఒకవేళ రజినీతో మూవీ చేస్తే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే.(ఇదీ చదవండి: కోలుకున్న హీరో విశాల్.. విజయ్ సేతుపతితో కలిసి) -
రెమ్యునరేషన్ పెంచేసిన 'డ్రాగన్' బ్యూటీ.. ఎంతో తెలుసా..?
రంగుల ప్రపంచం, కలల ప్రపంచం, మాయాజాలం అంతా సినిమానే. ఇక్కడ ప్రయత్నాలు ఫలిస్తే వారి స్థాయి ఉన్నతంగా ఉంటుంది. అయితే అలాంటి విజయం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నటి కయ్యదు లోహర్(Kayadu Lohar)ది ఇదే పరిస్థితి. ఇండస్ట్రీలో సరైన ఛాన్స్ కోసం ఈ బ్యూటీ కూడా మూడు, నాలుగేళ్లు పోరాడిందనే చెప్పాలి. 2021లో కన్నడంలో ముకిల్ పేట్ అనే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత మలయాళంలో పత్తొంబదామ్ నూట్రాండు చిత్రంతో అదృష్టాన్ని పరిక్షించుకుంది. ఆ తరువాత తెలుగులో అల్లూరి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. అలా మరాఠి భాషలోనూ నటించింది. వీటిలో ఏ ఒక్కటీ ఆశించిన విజయం సాధించకపోయినా, వరుసగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వరించడం ఈ అమ్మడి లక్కే అని చెప్పక తప్పదు. అలా ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఈమెకు డ్రాగన్ చిత్రం రూపంలో అదృష్టం పట్టుకుంది. ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక నాయకిగా నటించింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. డ్రాగన్ చిత్రం సూపర్హిట్ కావడంతో నటి కయ్యదు లోహర్ వెంటే దర్శక నిర్మాతలు, కథానాయకులు పరిగెడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ ఈమె నటించిన డ్రాగన్ చిత్రం ఒక్కటే విడుదలైంది. అయితే కయ్యదు లోహర్ రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందనే ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ చిత్రానికి తను కేవలం రూ. 30 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. అయితే, సినిమాకు భారీ లాభాలు రావడంతో ఆమెకు మరో రూ. 70 లక్షలు ఇచ్చారని ప్రచారం ఉంది.అయితే, తన కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం సంచలన నటుడు శింబు, ధనుష్ వంటి వారు ఈ అమ్మడిని హీరోయిన్గా కోరుకోవడమే అంటున్నారు. ప్రస్తుతం నటుడు అధర్వకు జంటగా ఇదయం మురళి చిత్రంలో నటిస్తున్న కయ్యదు లోహర్ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా ఇమ్మార్టల్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా శింబు 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్తో జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న చిత్రంలో కయ్యదు లోహర్ను హీరోయిన్గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా లబ్బర్ బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న చిత్రంలోనూ కయ్యదు లోహర్నే నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ధనుష్తో సినిమా ఛాన్స్ పూర్తి అయితే.. తన రెమ్యునరేషన్ మరో రూ. 3 కోట్లు పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తుంది. అదే సమయంలో టాలీవుడ్లోనూ మరో చిత్రం చేస్తోంది. ఇలా డ్రాగన్ అనే ఒక్క చిత్రం సక్సెస్తో ఇప్పుడు కోలీవుడ్లో కయ్యదు లోహర్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇది కదా లక్కు అంటే. -
'రామాయణ్'లో కాజల్ అగర్వాల్.. అలాంటి పాత్రలోనా?
రామాయణం ఆధారంగా మన దేశంలో చాలా సినిమాలు ఇదివరకే తీశారు. తీస్తూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ 'ఆదిపురుష్' ఇలానే తీశారు. కానీ గ్రాఫిక్స్, పాత్రల తీరుతెన్నులు దారుణంగా ఉండేసరికి విపరీతమైన విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు 'రామాయణ్' పేరుతో హిందీలో మళ్లీ సినిమా తీస్తున్నారు.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో 'యానిమల్' ఫేమ్ రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీత పాత్ర చేస్తోంది. 'కేజీఎఫ్' యష్ రావణుడిగా నటిస్తున్నాడు. మిగిలిన పాత్రల కోసం పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరిని ఫైనల్ చేశారనేది ఇంకా బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ )) ప్రస్తుతానికైతే మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. రావణుడి భార్య పేరు మండోదరి. రామాయణ్ మూవీలో ఈమె పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు. మరి కాజల్ నిజంగా ఒప్పుకొందా? లేదంటే ఇవి రూమర్స్ మాత్రమేనా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు.నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. 2026 దీపావళికి తొలి భాగం, 2027లో రెండో భాగం రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీతో దర్శకనిర్మాతలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి?(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
మహేశ్ - రాజమౌళి సినిమాలో మరో పాన్ ఇండియా హీరో!
సూపర్స్టార్ మహేశ్బాబు- దర్శకుడు రాజమౌళి కలయికలో మొదలైన సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. భారీ బడ్జెట్తో కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, తాజాగా కోలీవుడ్ నుంచి స్టార్ యాక్టర్ కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన సెట్స్ పైకి కూడా వస్తాడనేది నెట్టింట వైరల్ అవుతుంది.‘ఎస్ఎస్ఎంబీ29’ వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్లోకి తమిళ స్టార్ హీరో విక్రమ్ జాయిన్ కాబోతున్నాడని సమాచారం. ఈమేరకు ఆయనతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయట. గతంలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ గురించి మొదట రూమర్స్తోనే ప్రారంభమయిన విషయం తెలిసిందే. కొంతకాలానికి అదే నిజమైంది. ఇప్పుడు విక్రమ్ విషయంలో కూడా ఇదే జరగబోతుందని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మే నుంచి జూన్ వరకు ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. దీనికోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో బిగ్ యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ సీన్ నుంచే విక్రమ్ ఎంట్రీ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.‘ఎస్ఎస్ఎంబీ29’లో విక్రమ్ నటించబోతున్నట్లు గతేడాదిలోనే ఈ రూమర్స్ వచ్చాయి. అప్పుడు స్వయంగా విక్రమ్ ఇలా స్పందించాడు. 'రాజమౌళి, నేను రెగ్యూలర్గానే టచ్లో ఉంటాం. రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా తప్పకుండా ఉంటుంది. కానీ, మహేష్ మూవీ గురించి మా మధ్య ప్రస్తుతానికి చర్చలు జరగలేదు' అని ఆయన తెలిపారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తనపై రూమర్స్ వచ్చినప్పుడు ఇలానే రియాక్ట్ అయ్యాడు. కొంత కాలానికి మహేష్ సినిమాలో తాను భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. కాబట్టి విక్రమ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. -
'ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా' బయోపిక్లో ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్- దర్శకుడు రాజమౌళి మళ్లీ ఒక సినిమా కోసం కలవబోతున్నారు. వీరిద్దరూ కలిసి ఒక బయోపిక్ను తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు చర్చలు జరిపారని సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పితామహుడిగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో తారక్ నటించనున్నారట. ఈమేరకు బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. దాదాసాహెబ్ జీవితం అందరినీ ప్రభావితం చేసేలా ఉండటంతో దానిని ఒక సినిమాగా తెరకెక్కించి ప్రపంచానికి చూపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.భారతీయ సినిమా పితామహుడి బయోపిక్ నిర్మించేందుకు 'మేడ్ ఇన్ ఇండియా' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం. సుమారు రెండేళ్ల క్రితమే రాజమౌళి ఈ టైటిల్ను ప్రకటించారు. అయితే, నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి.దాదాసాహెబ్ ఫాల్కే (Dhundiraj Govind Phalke), ఆయనను భారతీయ సినిమా పితామహుడిగా పిలుస్తారు. భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ప్లే రచయితగా పేరుపొందారు. 1870 లో జన్మించిన ఆయన 1944 లో కన్నుమూశారు. 1913లో భారతదేశ మొదటి సినిమా "రాజా హరిశ్చంద్ర"ను ఆయనే తెరకెక్కించారు. అక్కడి నుంచి మొదలైన మన ప్రయాణం నేడు ప్రపంచస్థాయి గుర్తించే దిశగా అడుగులేస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే భారత చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేశారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏర్పాటు చేసింది. భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. -
ఏపీ పోలీస్ ఆఫీసర్గా బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ఏపీ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఎప్పుడూ ఫుల్ లెన్త్ సినిమాలు చేసే బాలయ్య తొలిసారి రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనువిందు చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. సన్పిక్చర్స్ సంస్థ కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. 2023లో విడుదలైన జైలర్లో అతిథి పాత్రలు పోషించిన శివరాజ్కుమార్, మోహన్లాల్, జాకీ ష్రాఫ్ల పర్ఫామెన్స్కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఇందులో కూడా వారందరూ నటించనున్నారు. ప్రస్తుతం వారి సరసన టాలీవుడ్ నుంచి బాలకృష్ణ చేరనున్నట్లు సమాచారం.రజనీకాంత్ కోసం జైలర్2లో నటించేందుకు బాలకృష్ణ ఒప్పుకున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా చేసిందని సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారని సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పోలీస్ ఆఫీసర్గా రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహా వంటి సినిమాల్లో ఆయన మెప్పించారు. ఇప్పుడు చాలారోజుల తర్వాత జైలర్2 కోసం పోలీస్ యూనిఫామ్ ధరించనున్నారు. రజనీకాంత్, బాలయ్య మధ్య భారీ ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉందని, అదికూడా సుమారు 5నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది.జైలర్2తో తాను నటించబోతున్నట్లు రీసెంట్గా శివరాజ్కుమార్ ఫైనల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మేనన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సీక్వెల్లో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్లో జైలర్2 విడుదల చేసే ప్లాన్లో మేకర్స్ ఉన్నారు. -
'ప్రేమలు' బ్యూటీ రెమ్యునరేషన్.. రేటు పెంచేసిందా?
హీరోయిన్లు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. కొందరు ఏళ్లకు ఏళ్లు కష్టపడినా గుర్తింపు రాదు. మరికొందరు ఒక్క మూవీకే ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు. 'ప్రేమలు' బ్యూటీ మమిత ఈ కోవలోకే వస్తుంది. తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ఈమె ఇప్పుడు రెమ్యునరేషన్ గట్టిగానే పెంచేసినట్లు తెలుస్తోంది.మలయాళంలో తొలుత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన మమితకు 'ప్రేమలు' మూవీతో హీరోయిన్ గా బ్రేక్ దొరికింది. అటు సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న 'డ్యూడ్', దళపతి విజయ్ లేటెస్ట్ చిత్రాల్లో నటిస్తోంది. (ఇదీ చదవండి: మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్) ఇదివరకు హీరోయిన్ గా ఒక్కో సినిమాకు రూ.50 లక్షల్లోపే రెమ్యునరేషన్ అందుకున్న మమిత.. ఇప్పుడు 'డ్యూడ్' కోసం రూ.70 లక్షలకు పైనే అందుకుంటోందట. దళపతి విజయ్ తో చేస్తున్న జన నాయగణ్ కోసమైతే ఏకంగా రూ.కోటి పారితోషికం అందుకుందట.ఒకవేళ ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజ్ రావడం గ్యారంటీ. అప్పుడు ఇంకాస్త రెమ్యునరేషన్ పెంచినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ రెండు కాకుండా మరో తమిళ మూవీ కూడా మమిత చేతిలో ఉంది. (ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా
కొన్ని సినిమాలు ఊహించిన దానికంటే సూపర్ హిట్ అవుతుంటాయి. అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంటాయి. రీసెంట్ టైంలో అలా ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ 'తుడరమ్'. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.మార్చి చివర్లో ఎల్ 2:ఎంపురాన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన మోహన్ లాల్ కాస్త నిరాశపరిచాడు. ఇది వచ్చిన నెలరోజులకే 'తుడరమ్' చిత్రంతో వచ్చారు. ఊహించని విధంగా ఇది సక్సెస్ అయింది. ప్రస్తుతం రూ.200 కోట్లకు పైగా వసూళ్లుతో ఇంకా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో)అసలు ప్రచారమే లేకుండా తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.2 కోట్ల మేర వసూళ్లు వచ్చాయట. దీంతో ఓటీటీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారిందట. లెక్క ప్రకారం గత వారం స్ట్రీమింగ్ కావాలి. కానీ థియేటర్లలో ఇంకా ఆదరణ వస్తున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ మరికొన్నాళ్లు ఆలస్యం కానుందట. అంటే జూన్ లో స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది.తుడరమ్ విషయానికొస్తే.. బెంజ్ అనే ట్యాక్సీ డ్రైవర్. అతడి భార్య లలిత. రన్ని అనే ఓ చిన్న ఊళ్లో వీళ్లు తమ ఇద్దరు పిల్లలో హాయిగా జీవిస్తుంటారు. బెంజ్ కు ఓ బ్లాక్ అంబాసిడర్ కారు ఉంటుంది. అదంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకరోజు బెంజ్ కొడుకు ఫ్రెండ్స్ ఆ కారును చెన్నైకి తీసుకెళ్తారు. అదే కథని మలుపు తిప్పుతుంది. ఆ కారులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులు సీజ్ చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాంగ్ రూట్ లో తెలుగు హీరో.. నిలదీసిన కానిస్టేబుల్) -
ఇన్ స్టా బ్యూటీకి పూరీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్?
పూరీ జగన్నాథ్ కు వరస డిజాస్టర్లు పడ్డాయి. దీంతో టైం తీసుకుని విజయ్ సేతుపతిని ఓ సినిమా చేసేందుకు ఒప్పించాడు. ఇదంతా కొన్నిరోజుల క్రితం సంగతి. అప్పటినుంచి ఈ ప్రాజెక్టులోకి ఒక్కో యాక్టర్ వస్తున్నారు. ఇదివరకే టబు, దునియా విజయ్ ని కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు హీరోయిన్ గా ఇన్ స్టా బ్యూటీని తీసుకున్నట్లు తెలుస్తోంది.లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి దెబ్బ మీద దెబ్బ పడింది. దీంతో పూరీ ఇకపై మూవీస్ చేయడం సందేహమే అని అందరూ ఫిక్సయ్యారు. మరి ఏం స్టోరీ చెప్పాడో ఏమో గానీ విజయ్ సేతుపతి.. పూరీతో కలిసి పనిచేసేందుకు ఓకే చెప్పాడు. కొన్నిరోజుల క్రితం ఈ కాంబోని అధికారికంగా ప్రకటించారు కూడా.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్) బెగ్గర్ అనే టైటిల్ అనుకున్నారని, అందుకు తగ్గట్లే కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందనే ప్రచారం జరిగింది. టబు, దునియా విజయ్ లాంటి స్టార్స్ ని తీసుకునే సరికి అంచనాలు కాస్త ఏర్పడ్డాయి. ఇన్ స్టా వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న నిహారికని ఇప్పుడు హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని టాక్.తొలుత విజయ్ సరసన రాధిక ఆప్టే నటిస్తుందని రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఫైనల్ గా నిహారిక ఆ పాత్రలో నటించనుందని సమాచారం. ఇన్ స్టాలో ఈమెకు 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మేజర్ సినిమాని నిర్మించిన మహేశ్ బాబు తో కలిసి ప్రమోషన్ చేయడంతో ఈమె ఫేమస్ అయింది. తర్వాత తమిళంలో ఇదయం మురళి, పెరుసు చిత్రాల్లో నటించింది. అలా ఇప్పుడు పూరీ కొత్త మూవీలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం నిహారిక లక్ తోక తొక్కినట్లే.(ఇదీ చదవండి: అభిమానులకు షాకిచ్చిన ఛార్మి.. ఇలా మారిపోయిందేంటి?) -
మంచు మనోజ్.. 'అత్తరు సాయిబు'?
గత కొన్నిరోజుల నుంచి మంచు కుటుంబం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎందుకంటే మనోజ్-విష్ణు మధ్య మొదలైన పంచాయితీ.. కొన్నిరోజుల ముందు వరకు కూడా సాగింది. మరీ ముఖ్యంగా 'కన్నప్ప'కు పోటీగా తన 'భైరవం' సినిమాని రిలీజ్ చేస్తానని మనోజ్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. కన్నప్ప వాయిదా పడటంతో మనోజ్ కూడా సైలెంట్ అయిపోయాడు.(ఇదీ చదవండి: ఆ దర్శకుడు నన్ను కొట్టలేదు.. బాగా చూసుకున్నాడు: హీరోయిన్ ఇవానా) సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే మంచు మనోజ్ నుంచి మరో క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. 'అత్తరు సాయిబు' పేరుతో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. గతంలో '90 ఎమ్ఎల్' తీసిన దర్శకుడు శేఖర్ రెడ్డి.. మనోజ్ తో మూవీ చేయబోతున్నాడని తెలుస్తోంది.టైటిల్ చూస్తేనే సమ్ థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. మరి ఈ మూవీలో మనోజ్ ఎలా కనిపిస్తాడో ఏమో? ప్రస్తుతానికి ఇదంతా ఇంకా అనధికారికమే. త్వరలో ప్రకటిస్తారేమో? మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. చాన్నాళ్లుగా సినిమాలకు దూరమైన ఇతడు.. 'మిరాయ్', 'భైరవం' సినిమాల్లో నటించాడు. ఈ రెండు ఈ ఏడాదే థియేటర్లలోకి రానున్నాయి.(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్) -
'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత
గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. ఇది జరిగి దాదాపు నాలుగేళ్లు గడిచిపోయాయి. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. కానీ గత కొన్నిరోజుల క్రితం సమంత పెళ్లి గురించి రూమర్స్ వినిపించాయి. ఇప్పుడదే దర్శకుడితో మళ్లీ కనిపించడం, ఆ ఫొటోలని పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.విడాకుల తర్వాత సమంత.. తాను మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాననే విషయాన్ని బయటపెట్టింది. మధ్యలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేసింది. ఇది తప్పితే మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ వెబ్ సిరీసులో నటించిందంతే.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) సరే అసలు విషయానికొస్తే.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రెండో సీజన్ లో సమంత నటించింది. ఈ సిరీస్ చేసిన దర్శకుల్లో ఒకరైన రాజ్ తో రీసెంట్ టైంలో సమంత ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూనే ఉంది. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతి కూడా వెళ్లొచ్చారు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వినిపించాయి. సామ్ నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇది రూమర్ గానే మిగిలిపోయింది.తాజాగా న్యూ బిగినింగ్స్ అని ఓ పోస్ పెట్టింది. ఇందులో తన త్రలాలా నిర్మాణ సంస్థ గురించి, తాను నిర్మించిన శుభం మూవీ గురించి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులోనూ రాజ్ తో సమంత దిగిన కొన్ని ఫొటోలు కనిపించాయి. దీంతో బయట వినిపిస్తున్న రూమర్స్ ని ఏమైనా నిజం చేస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!
పవన్ కల్యాణ్.. 'హరిహర వీరమల్లు' షూటింగ్ ఎట్టకేలకు ముగించారు. అప్పుడెప్పుడో 2020 జనవరిలో మొదలైతే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తాజాగా మంగళవారంతో తొలి భాగం చిత్రీకరణ పూర్తయింది. దీంతో ఇప్పుడు రిలీజ్ డేట్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ విడుదల ఎప్పుడు ఉండొచ్చు?(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' షూటింగ్ 2020 జనవరిలో మొదలైంది. తర్వాత కొన్నిరోజులకే లాక్ డౌన్ రావడం, తర్వాత ఎన్నికలు, పవన్ ఎమ్మెల్యేగా గెలవడం.. ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అలా అలా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు మమా అనిపించారు.లెక్క ప్రకారం ఈ మే 9న థియేటర్లలోకి సినిమా వస్తుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు రావట్లేదని క్లారిటీ వచ్చేసింది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దగ్గర మే 30 తేదీ వినిపించింది. కానీ ఈ తేదీకి కూడా రావడం కష్టమేనేమో అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఓటీటీ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ సంస్థ.. మే 30 తేదీపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. జూన్ రెండో వారం అని అంటోంది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)ప్రస్తుతానికైతే విడుదల తేదీపై చర్చలు జరుగుతున్నాయి. ఏదనేది ఓటీటీ సంస్థ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చాలా తెలుగు సినిమాలు.. ఇలా ఓటీటీ సంస్థ చెప్పినదానిబట్టి రిలీజ్ చేస్తుండటమే దీనికి కారణం అని చెప్పొచ్చు.మరోవైపు పవన్ సినిమా వచ్చే దానిబట్టి విజయ్ 'కింగ్డమ్' రిలీజ్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయాలని ఫిక్సయ్యారు. కానీ పవన్ వస్తే మాత్రం తప్పుకోవడం గ్యారంటీ. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: మంచం పట్టిన 'బలగం' నటుడు.. ప్రస్తుతం దీనస్థితిలో) -
మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!
మహేశ్ బాబు తన ఇంట్లో నుంచి కొత్త హీరోని లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాడట. ఏంటి మహేశ్ కొడుకు గౌతమ్ ని అప్పుడే హీరోగా పరిచయం చేస్తున్నారా? ఇదంతా ఎప్పుడు జరిగింది? అని అనుకుంటున్నారా? ఇంతకీ సంగతి ఏంటంటే?సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు హీరో అయ్యాడు. ఒక్కో సినిమా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకు ముందు కృష్ణ పెద్ద కొడుకు, మహేశ్ కి అన్నయ్య అయిన రమేశ్ బాబు కూడా హీరోగా పలు చిత్రాలు చేశారు గానీ పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. తర్వాత వ్యాపారాలు చూసుకున్నారు. కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) రమేశ్ బాబుకి జయకృష్ణ అని ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయినే హీరోగా లాంచ్ చేసే ప్లాన్ లో మహేశ్ ఉన్నాడని తెలుస్తోంది. ఇందుకోసం 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాల ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతిని తీసుకున్నారని సమాచారం.మహేశ్ బాబుని లాంచ్ చేసిన నిర్మాత అశ్వనీదత్.. జయకృష్ణని కూడా హీరోగా పరిచయం చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం అంతా ఫిక్స్ అయినప్పటికీ, త్వరలో ఈ విషయమై క్లారిటీ ఇస్తారు. ఇకపోతే మహేశ్.. రాజమౌళి సినిమా బిజీలో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ కి విరామం ప్రకటించడంతో జయకృష్ణ లాంచింగ్ పనులు చూస్తున్నారట.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!) -
చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!
మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ దొరికేసిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తుంది. చిరు ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. దీనిపై కంటే డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోయే మూవీపై అందరి కళ్లున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఓ యంగ్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఈ ఏడాదికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. చిరంజీవి కోసం ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అని చాలా పేర్లు వినిపించాయి. ఫైనల్ గా ఇప్పుడు ఓ పేరు ఫిక్సయ్యారు. ఆమెనే కేథరిన్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 2013 నుంచి తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న కేథరిన్.. అల్లు అర్జున్ సరసన రెండు మూవీస్ చేసింది. వీటిలో 'సరైనోడు' ఒకటి. ఇందులో ఎమ్మెల్యే పాత్రలో నటించింది. రీసెంట్ టైంలో బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్య తదితర సినిమాల్లో నటించింది.ఇప్పుడు చిరంజీవి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ అంటే కేథరిన్ ని అదృష్టం వరించినట్లే. ప్రస్తుతానికి ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో మిగతా హీరోయిన్లతో పాటు ఈమె గురించి టీమ్ ప్రకటిస్తారేమో? వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ఈ మూవీ థియేటర్లలో రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా) -
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కోసం చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం గురించి పలు పాత విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయింది..? చిరు, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఎంత..? బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది..? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సోషల్మీడియాలో కనిపిస్తున్నాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. 35 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న 2డీతో పాటు 3డీ వెర్షన్లోనూ విడుదల కానుంది.‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్ వండర్ వెనక చాలామంది ఛాంపియన్స్ ఉన్నారు. ఇళయరాజా అందించి ట్యూన్స్, దర్శకుడు రాఘవేంద్ర రావు విజన్, డీఓపీ విన్సెంట్, అద్భుతమైన సెట్స్తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం.. పాటలు, మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు ఇలా ఎందరో ఈ సినిమాకు పనిచేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్ , ఓ హిస్టారికల్ ల్యాండ్ మార్క్గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కోసం రూ. 2 కోట్లు ఖర్చు అయిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి.మే 9న రీ-రిలీజ కానున్న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను మీరు చూస్తే రూ. 2 కోట్లతో ఇంతటి రిచ్ సినిమాను నిర్మించారా అంటూ ఆశ్చర్యపోతారు. ఇప్పట్లో అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం కనీసం రూ. 200 కోట్లు పైగానే ఖర్చు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదల సమయంలో భారీ వర్షాల వల్ల మొదటి వారం కలెక్షన్స్ పెద్దగా లేవు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ప్రింట్స్ పెరిగాయి. ఎక్కడ చూసిన కూడా థియేటర్స్ నిండిపోయాయి. అలా ఏకంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 15 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు గాను చిరంజీవి రూ. 25 లక్షలు, శ్రీదేవి రూ. 20 లక్షలు రెమ్యునరేషన్గా తీసుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి. -
తెలుగు హీరోతో మృణాల్ ప్రేమ? నిజమేంటి?
మృణాల్ ఠాకుర్(Mrunal Thakur).. ఈ పేరు చెప్పగానే 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాలే గుర్తొస్తాయి. చేసింది కొన్ని చిత్రాలే అయినా తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతానికైతే హిందీలో బిజీగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని అంటున్నారు. ఇంతకీ నిజమేంటి? మృణాల్ తొలి తెలుగు సినిమా 'సీతారామం'లో అక్కినేని హీరో సుమంత్(Sumanth) కూడా నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేశాడు. మరి ఈ మూవీ తర్వాత వీళ్లిద్దరి పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్లిందని అంటున్నారు. అందుకు తగ్గట్లే గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి ఫొటో కూడా ఒకటి వైరల్ అవుతుంది.(ఇదీ చదవండి: భార్య, సవతి కలిసి భర్తని మాయం చేస్తే.. ఓటీటీ రివ్యూ) మరి అంతటా వినిపిస్తున్నట్లు నిజంగా మృణాల్, సుమంత ప్రేమలో ఉన్నారా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్క ఫొటోలో కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన అదే ప్రేమ అని చెప్పలేం. మరోవైపు కెరీర్ పరంగా బిజీ ఉన్న మృణాల్.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందా అనేది సందేహమే. కాబట్టి ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అనిపిస్తుంది.గతంలో సుమంత్.. హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. కానీ రెండేళ్లకే వీళ్లిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సుమంత్ సింగిల్ గానే ఉంటున్నారు. ప్రస్తుతం అప్పుడప్పుడు ఒకటి అరా సినిమాలు చేస్తున్నాడు. అయితే మృణాల్ ఠాకుర్ తో ప్రేమ, పెళ్లి అంటూ వస్తున్న పుకార్లకు ఇతడి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) -
నాని 'హిట్ 3' వచ్చేది ఆ ఓటీటీలోనే..
హీరో నాని (Nani) స్పీడుమీదున్నాడు. హీరోగా, నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హిట్లు అందుకుంటున్న ఈ హీరో.. నిర్మాతగా కోర్ట్ చిత్రంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్: ద థర్డ్ కేస్ మూవీ (HIT: The Third Case) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హిట్ 3కి పాజిటివ్ టాక్మే1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హిట్ 1, 2 కంటే కూడా ఈ మూవీలో వయొలెన్స్ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి హిట్ 3 బాగా ఎక్కేసిందట! ఈ టాక్ చూస్తుంటే నాని బ్లాక్బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. హిట్ 3 సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏ ఓటీటీలో అంటే?ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఏకంగా రూ.54 కోట్లు పెట్టి ఈ హక్కుల్ని సొంతం చేసుకుందని టాక్. థియేటర్లో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన మే చివరి వారం, లేదా జూన్ మొదటివారంలో హిట్ 3 ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రవాహం వారాల తరబడి కొనసాగితే మాత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది.హిట్ 3 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అని ఫ్యాన్స్ చూస్తున్న టైంలో తమిళ దర్శకుడు అట్లీ పేరు తెరపైకి వచ్చింది. అంతకు ముందు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లాక్ అవడంతో.. గురూజీతోనే మూవీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అట్లీతో సినిమాను అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్-అట్లీ సినిమాను నిర్మించబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఈ విషయం అర్థమైపోయింది. హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులతో హీరో-దర్శకుడు చర్చలు జరపడం అవి చూస్తుంటే ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా అనిపించింది.అట్లీ సినిమా అంటే హీరోకు ఎన్ని ఎలివేషన్లు ఉంటాయనే సంగతి పక్కనబెడితే హీరోయిన్లు ఒకరు కంటే ఎక్కువ మందే ఉంటారు. ఇక బన్నీతో చేయబోయే మూవీలోనూ ఏకంగా ముగ్గురు భామలు ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్లందరూ బాలీవుడ్ బ్యూటీలా లేదంటే దక్షిణాది హీరోయిన్లు ఉంటారా అనే దగ్గర కన్ఫ్యూజన్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో) మొన్నటివరకు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్ పేర్లు వినిపించాయి. తాజాగా అనన్య పాండే పేరు వినిపించేసరికి బన్నీ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే అనన్య ఇప్పటివరకు హిందీలో సినిమాలైతే చేస్తోంది గానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. దానికి తోడు ఈమె యాక్టింగ్ పై బోలెడన్ని విమర్శలు.దీంతో హీరోయిన్ గా అనన్య పాండే వద్దు బాబోయ్ అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే హీరోయిన్లు ఎవరనే సస్పెన్స్.. షూటింగ్ మొదలయ్యే వరకు కొనసాగే అవకాశముంది. మొన్నటివరకు సమంత, దిశా పటానీ పేర్లు కూడా వినిపించాయి కానీ బన్నీ-అట్లీ ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!) -
శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?
అక్కినేని హీరో నాగచైతన్య.. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ ఉండడు. సినిమాల రిలీజ్ టైంలో తప్పితే పోస్టులు కూడా పెద్దగా పెట్టడు. కానీ రీసెంట్ గా ఆదివారం ఇలా గడిచింది అని ఓ రెండు మూడు ఫొటోలు పోస్ట్ చేశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తర్వాతే అకస్మాత్తుగా ఓ రూమర్ బయటకొచ్చింది.గతంలో హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. కొన్నాళ్ల పాటు సింగిల్ గానే ఉన్నాడు. కానీ గతేడాది డిసెంబరులో తెలుగమ్మాయి, హీరోయిన్ శోభితని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతానికైతే వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) అయితే సడన్ గా శోభిత ప్రెగ్నెంట్ అయ్యిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు ఈ పుకారు ఎవరు ఎందుకు సృష్టించారో గానీ సడన్ గా అంతటా వైరల్ అవుతోంది.శోభిత విషయానికొస్తే గతేడాది మంకీ మ్యాన్, లవ్ సితార అనే సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ గానీ వెబ్ సిరీసులు గానీ చేయట్లేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ వస్తే తప్ప ఈ రూమర్స్ ఆగవేమో!(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) -
మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?
శ్రీలీల(Sreeleela) పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. అప్పట్లో పల్సర్ బండి పాటకు.. రీసెంట్ గా పుష్ప 2లో(Pushpa 2 Movie) కిస్సిక్ అంటూ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె గురించి ఇప్పుడో విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?తెలుగు మూలాలున్న అమ్మాయి శ్రీలీల. పుట్టి పెరిగింది అమెరికాలో గానీ ప్రస్తుతానికైతే బెంగళూరులో తల్లితో కలిసి ఉంటుంది. షూటింగ్ లేనప్పుడు తన ఇంట్లో చేసే అల్లరిని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. యాక్టింగ్ పరంగా శ్రీలీలపై చిన్న చిన్న విమర్శలు వస్తుంటాయి. ఓ విషయంలో మాత్రం ఈమె అందరి మనసులు దోచేసింది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల.. ఓవైపు హీరోయిన్ గా చేస్తోంది. ఇది అందరికీ తెలుసు. కానీ 2022లో ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు.. దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. వాళ్లని దత్తత తీసుకుంది(Adopted). వాళ్ల ఆలనపాలన చూసుకుంటోంది.తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందని శ్రీలీల తాజాగా పోస్ట్ పెట్టింది. ఇందులో ఓ చిన్న పాపకు ముద్దులు పెడుతూ కనిపించింది. నెటిజన్ల అయితే ఈ పాప ఎవరా అని మాట్లాడుకుంటున్నారు. కొందరు మాత్రం మరో బిడ్డని దత్తత తీసుకుంది అని అంటున్నారు. లేదంటే బంధువులమ్మాయి అనేది శ్రీలీల చెబితే గానీ క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన కియారా అడ్వాణీ(Kiara Advani) ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. చివరగా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో కనిపించింది. ఈమె చేసిన రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే ఈమెకు ఇప్పుడు భర్త ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. 2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్న కియారా.. బాలీవుడ్ కే చెందిన సిద్ధార్థ్ మల్హోత్రాని(Sidharth Malhotra) ప్రేమించింది. కలిసి సినిమాలు కూడా చేసిన వీళ్లిద్దరూ 2023లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో శుభవార్త చెప్పింది. తాను గర్భంతో(Pregnancy) ఉన్నానని బయటపెట్టింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టింది.(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) తాజాగా నెలవారీ చెకప్స్ కోసం భర్త సిద్దార్థ్ తో కలిసి ముంబైలోని ఓ ఆస్పత్రికి కియారా వెళ్లింది. వీళ్లిద్దరూ కూడా ఓ లగ్జరీ కారులో వచ్చారు. టొయాటో కంపెనీకి చెందిన వెల్ ఫైర్(Toyota Vellfire) అనే మోడల్ కారు ఇది. దీని ధర మార్కెట్ లో రూ.1.22 కోట్లకు పైనే ఉందని తెలుస్తోంది.కియారా ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఈమెకు ఈ కారుని బహుమతిగా ఇచ్చాడట. మిగతా వాటితో పోలిస్తే లోపల స్పేస్, కూర్చోవడానికి చాలా సౌకర్యంగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ విషయం గురించి బాలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..!
అనుష్క శెట్టి (Anushka Shetty).. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన 'సూపర్' చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. 'విక్రమార్కుడు' మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసింది. ఈ క్రమంలో వచ్చిన అరుంధతి ఆమెను స్టార్ హీరోయిన్గా మార్చింది.ఆ సినిమా కోసం లావైపోయిన అనుష్కబిల్లా, వేదం, పంచాక్షరి, ఖలేజా, మిర్చి, బాహుబలి, భాగమతి.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగింది కూడా! ఆ తర్వాత పెరిగిన బరువును తగ్గించుకునేందుకు అనుష్క నానా తిప్పలు పడింది. 2023లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. రెండేళ్లుగా మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ఏడు సినిమాలు?ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఘాటి అనే లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఉంది. అలాగే మలయాళంలో కథనార్ మూవీ చేస్తోంది. ఇవి రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అయితే ఈ రెండింటిని కలుపుకుని అనుష్క చేతిలో మొత్తం ఏడు సినిమాలున్నాయంటూ ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. అనుష్క చేతిలో ఏడు సినిమాలున్నాయని.. కాకపోతే వాటి గురించి దర్శకనిర్మాతలెవరూ బయటకు చెప్పొద్దని కోరిందట! అందుకే సైలెన్స్సినిమా రిలీజ్కు ముందు జరిగే ప్రమోషన్స్లో మాత్రమే తన పాత్ర గురించి వెల్లడించాలని.. అప్పటిదాకా ఈ విషయాలేవీ బయటకు రాకూడదని నిర్మాతలను ఆదేశించినట్లు సమాచారం. ఆమె సైన్ చేసిన ఏడు ప్రాజెక్టుల్లో తెలుగులో 3, తమిళంలో 2, మలయాళంలో 2 సినిమాలున్నాయని తెలుస్తోంది. అందులో ఒక మూవీలో ప్రభాస్ (Prabhas)తో కలిసి నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!చదవండి: లేడీ ఓరియంటెడ్ సినిమాకు సాయిపల్లవి గ్రీన్సిగ్నల్? -
లేడీ ఓరియంటెడ్ సినిమాకు సాయిపల్లవి గ్రీన్సిగ్నల్?
నయనతార, కీర్తీ సురేష్ వంటి వారు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లుగా నటిస్తూనే, వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కానీ కథానాయిక సాయిపల్లవి (Sai Pallavi) మాత్రం ఈ ట్రాక్లో కాస్త స్లోగా ఉన్నారనుకోవాలి. హీరోయిన్గా బిజీగా ఉంటున్న సాయి పల్లవి ‘గార్గి’ అనే డిఫరెంట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేశారు. 2022లో విడుదలైన ఈ సినిమా తర్వాత మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్కి సాయి పల్లవి గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని తెలుస్తోంది. ఓ సీనియర్ రచయిత ఓ పవర్పుల్ స్టోరీ రెడీ చేశారని, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్కు ఈ కథ నచ్చిందని, ఈ సినిమాలోని మెయిన్ లీడ్ కోసం సాయిపల్లవిని సంప్రదించారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరి... సాయిపల్లవి మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ చిత్రంతో బిజీగా ఉన్నారు సాయిపల్లవి. అలాగే ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) విడుదలకు సిద్ధమవుతోంది. చదవండి: పాక్ నటుడికి బాలీవుడ్ బ్యూటీ సపోర్ట్.. వారిపై బ్యాన్ -
ఎన్టీఆర్తో శృతీ హాసన్ స్పెషల్ డ్యాన్స్?
ఎన్టీఆర్తో స్పెషల్ డ్యాన్స్ చేయనున్నారట శ్రుతీహాసన్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా, మలయాళ నటుడు టొవినో థామస్ విలన్గా నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఈ పాటకు శ్రుతీహాసన్ అయితే బాగుంటారని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నారట. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ‘సలార్’ మూవీలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో ఓ హీరోయిన్గా నటించారు శ్రుతీహాసన్. మరి... ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీలోని శ్రుతి స్పెషల్ సాంగ్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘డ్రాగన్’ చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారని తెలిసింది. మూడు రోజుల క్రితం మొదలైన ఈ షెడ్యూల్ మే రెండో వారం వరకు జరుగుతుందని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గతంలో వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్. -
ట...ట...ట... నిజమౌనా?
ఫలానా హీరో–హీరోయిన్ కాంబినేషన్ కుదిరింద‘ట’... ఓ పాట సెట్ కోసం ఐదువందల మందికి పైగా పని చేస్తున్నార‘ట’... ఆ డైరెక్టర్ 60 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడ‘ట’... ఆ స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో విలన్గా ఫిక్స్ అయ్యాడ‘ట’... ఇలా సినిమా పరిశ్రమ గురించి రోజుకో ‘ట...ట...ట...’ అంటూ వార్తలు ప్రచారంలో ఉంటాయి. మరి... ఈ ప్రచారంలో ఉన్న ఈ ‘ట’లు నిజమౌనా? అనేది తెలియాలంటే మాత్రం యూనిట్ చెప్పాల్సిందే. ఇక ప్రస్తుతం ఆ నోటా ఈ నోటా విహారం చేస్తున్న కొన్ని ‘ట’ల గురించి ఓ లుక్కేద్దాం.హీరో మహేశ్బాబు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పంథాకి భిన్నంగా ఈ చిత్రాన్ని అతి వేగంగా పూర్తి చేసేం దుకు రాజమౌళి షూటింగ్ ప్లాన్ చేశారని టాక్. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే హై ఓల్టేజ్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ఉన్న మహేశ్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్గా మారాయి. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలోని కోరాపుట్లో రెండు షెడ్యూల్స్ని మెరుపు వేగంతో పూర్తి చేసిన రాజమౌళి మూడవ షెడ్యూల్కి సిద్ధం అయ్యారు. ఇందుకోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు 550 మంది పని చేస్తున్నారని టాక్. ఈ సెట్లో త్వరలోనే ఓ భారీ సాంగ్ని చిత్రీకరించనున్నారట రాజమౌళి. ఈ పాట సినిమాలో హైలైట్ అవుతుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు కూడా గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రజనీకాంత్కి విలన్గా... రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ చిత్రంలో ఫాహద్ది పాజిటివ్ క్యారెక్టర్. ఒక రకంగా చెప్పాలంటే రజనీ పాత్రకు హెల్ప్ఫుల్గా ఉండే పాత్ర. అయితే ఇప్పుడు రజనీకాంత్కి విలన్గా మారారట ఫాహద్. ఏ సినిమాలో అంటే ‘జైలర్ 2’లో అని సమాచారం. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా ఇదే కాంబినేషన్లో ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఫాహద్ని విలన్గా ఎంపిక చేశారని టాక్. ఇటీవల కేరళలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. తదుపరి షెడ్యూల్లో ఫాహద్ పాల్గొంటారట. అప్పుడు ఈ చిత్రంలో ఫాహద్ విలన్గా నటిస్తున్న విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించాలని అనుకుంటోందని సమాచారం. సూర్య–కీర్తి మళ్లీ కుదిరేనా? సూర్య–కీర్తీ సురేష్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటోంది తమిళ పరిశ్రమ. ఈ ఇద్దరూ జంటగా ‘తానా సేంద కూట్టమ్’ (2018) అనే చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో సినిమా రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యకి జోడీగా కీర్తీ సురేష్ నటించనున్నారని ఫిల్మ్నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘796 సీసీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రీ ్రపొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా కీర్తీ సురేష్ను ఎంపిక చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి... ఈ వార్తలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. తమిళ దర్శకుడితో... హీరో కల్యాణ్ రామ్ జోరు మీదున్నారు. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఈ నెల 18న విడుదలై, హిట్గా నిలిచింది. తన తర్వాతి చిత్రాన్ని తమిళ దర్శకుడు గిరీశాయతో చేయనున్నారట కల్యాణ్ రామ్. తెలుగులో బ్లాక్బస్టర్గా నిలిచిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేశారు గిరీశాయ. ఈ సినిమా కోలీవుడ్లోనూ హిట్గా నిలిచింది. కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ (2022) సినిమాతో టాలీవుడ్కి పరిచయమయ్యారు గిరీశాయ. తాజాగా కల్యాణ్ రామ్ కోసం ఓ కథని సిద్ధం చేశారట ఆయన. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సాగే ఈ కథ కల్యాణ్ రామ్కి కూడా నచ్చిందట. దీంతో తన తర్వాతి మూవీని గిరీశాయ దర్శకత్వంలో చేయనున్నారని ఫిల్మ్నగర్ టాక్. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తర్వాత ‘బింబిసార 2’ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే డైరెక్టర్ వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతో ‘బింబిసార 2’ మొదలయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈలోపు గిరీశాయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కల్యాణ్ రామ్ ఆసక్తిగా ఉన్నారని టాక్. ఇక కల్యాణ్ రామ్, గిరీశాయ కాంబినేషన్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అరవై రోజుల్లో... డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైలే వేరు. సినిమాలను జెట్ స్పీడ్లో తెరకెక్కిస్తారనే పేరుంది ఆయనకి. ఎంత పెద్ద సినిమా అయినా మూడు నాలుగు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేస్తుంటారు. అయితే తన తాజా చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట పూరి. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారట. అందుకే ‘బెగ్గర్’ అనే టైటిల్ను లాక్ చేశారని టాక్. మే లేదా జూన్లో సెట్స్పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లో పూర్తి చేయాలన్నది పూరి జగన్నాథ్ ఆలోచన అట. ఎందుకంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ‘బెగ్గర్’ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పూరీని కోరారట. అందుకు తగ్గట్టు జెట్ స్పీడ్లో షూటింగ్ పూర్తి చేసేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట పూరి జగన్నాథ్. రీమేక్ చిత్రంతో... వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు రాజశేఖర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన తర్వాతి సినిమా ఏంటి? అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘శేఖర్’. ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 మే 20న విడుదలైంది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ (2023) సినిమాలో కీలక పాత్రలో కనిపించారు రాజశేఖర్. ఆ చిత్రం విడుదలై ఏడాదిన్నర దాటినా రాజశేఖర్ తర్వాతి సినిమాపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే... తమిళంలో ఘన విజయం సాధించిన ‘లబ్బర్ పందు’ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రాజశేఖర్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ‘లబ్బర్ పందు’ చిత్రం గత ఏడాది సెప్టెంబరు 20న తమిళంలో రిలీజై, సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు హక్కులు కొనుగోలు చేశారట రాజశేఖర్. పెళ్లీడుకి వచ్చిన కూతురు ఉన్న ఒక వ్యక్తికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిని ప్రేమించే అబ్బాయికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్, ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్లో హిట్గా నిలిచింది. ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథ, కథనంలో మార్పులు చేసి, రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజశేఖర్. మరి... ఈ వార్తల్లో వాస్తవం ఏంటన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.– డేరంగుల జగన్ మోహన్ -
పెద్దితో స్పెషల్ సాంగ్?
‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్.. పక్కా లోకలే...’ అంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వేసిన డ్యాన్సుల్ని ప్రేక్షకులు అంత సులువుగా మరచి పోలేరు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’(2016) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో సందడి చేశారీ బ్యూటీ. ఎన్టీఆర్కి సమానంగా డ్యాన్సులతో అదరగొట్టారామె. ఆ చిత్రం తర్వాత మరో ప్రత్యేక పాట చేయలేదు కాజల్. అయితే ఆమె తెలుగులో రెండోసారి స్పెషల్ సాంగ్ చేయనున్నారని టాక్. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ పాటకి కాజల్ని తీసుకోవాలన్నది బుచ్చిబాబు ఆలోచనట. సినిమాకి ఓ హైలెట్గా నిలవనున్న ఈ పాటలో రామ్ చరణ్తో కలిసి ఆమె డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్చరణ్ –కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన తొలి చిత్రం ‘మగధీర’ (2009) బ్లాక్బస్టర్గా నిలిచింది.ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ద్వితీయ చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే’ (2014) కూడా విజయం అందుకుంది. ఇప్పుడు ‘పెద్ది’లో కాజల్ ఐటమ్ సాంగ్ చేస్తే... దాదాపు పదకొండేళ్ల తర్వాత వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. మరి.. ‘పెద్ది’లో ఐటమ్ సాంగ్ ఉందా? ఉంటే కాజల్ అగర్వాల్ నటిస్తారా? అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాలంటే వేచి చూడాలి. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు కెమేరామేన్గా చేస్తున్నారు. ఈ చిత్రం రామ్చరణ్ బర్త్ డేకి 2026 మార్చి 27న విడుదల కానుంది. -
'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ డేట్ ఫిక్సయిందా?
రీసెంట్ టైంలో ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. నెలలోపే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా గత నెలలో రిలీజై హిట్ కొట్టిన 'కోర్ట్'(Court Movie) కూడా 28 రోజులకే డిజిటల్ వీక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో మరో హిట్ మూవీ స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?)2023లో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా మ్యాడ్. జస్ట్ ముగ్గురు కుర్రాళ్లు.. ఇంజినీరింగ్ కాలేజీలో చేసే అల్లరి నేపథ్యంగా ఫుల్ కామెడీతో తీశారు. ప్రేక్షకులకు అది నచ్చేసింది. దీనికి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) పేరుతో మూవీ తీశారు. ఈ ఉగాదికి థియేటర్లలోకి తీసుకొచ్చారు.తొలి పార్ట్ అంతా కాకపోయినా సరే ప్రేక్షకులని పర్వాలేదనిపించేలా ఆకట్టుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 25 నుంచి 'మ్యాడ్ స్క్వేర్' స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే 28న రావొచ్చని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
ఓటీటీలోకి 'రాబిన్ హుడ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రీసెంట్ టైంలో ఓటీటీల్లోకి(Ott Movies) కొత్త సినిమాలు చాలావరకు నెలలోపే వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే తేడాలు ఉండట్లేదు. మరీ బ్లాక్ బస్టర్ అనుకుంటే నెలన్నర నుంచి రెండు నెలలకు స్ట్రీమింగ్ చేస్తున్నారు.మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం'తో జీ5 ఓటీటీ సంస్థ.. సరికొత్త పంథాలో వెళ్తోందని చెప్పాలి. ఒకేసారి అటు టీవీ, ఇటు ఓటీటీల్లో సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. వెంకీ మూవీతో పాటు రీసెంట్ గా 'కింగ్ స్టన్' చిత్రాన్ని ఇలానే రిలీజ్ చేశారు. ఇప్పుడీ లిస్టులోకి 'రాబిన్ హుడ్'(Robinhood Movie) కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) నితిన్, శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన ఈ సినిమా.. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే ఘోరంగా ఫ్లాప్ అయింది. కనీస వసూళ్లు రాక చతికిలపడిందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడీ మూవీని మే 4న టీవీ, ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథశ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?) -
తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?
ఈ వారం థియేటర్లలో తెలుగులో పలు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో తమన్నా 'ఓదెల 2'(Odela 2 Movie) ఒకటి. హారర్ ఫాంటసీగా తీసిన ఈ మూవీని విడుదలకు ముందు బాగానే ప్రమోట్ చేశారు. తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేశారు. కానీ కలెక్షన్సే(Odela 2 Collection) మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా రావట్లేదు. పరిస్థితి ఘోరంగా ఉంది.రెగ్యులర్ గా రిలీజయ్యే శుక్రవారం కాకుండా గురువారం (ఏప్రిల్ 17న) ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. కానీ తొలిరోజు చాలాచోట్ల థియేటర్లు సరిగా ఫుల్ కాలేదు. దీంతో రూ.85 లక్షలే వచ్చాయని, రెండో రోజుకి ఇది మరింత తగ్గి రూ.59 లక్షలే వచ్చాయని సమాచారం. మొత్తంగా రూ.1.44 కోట్లు మాత్రమే ఇప్పటివరకు వసూలైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్)దాదాపు రూ.24 కోట్ల మేర బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు రావడం చూస్తుంటే వీకెండ్ తర్వాత థియేటర్లలో నిలబడుతుందా అనే సందేహం వస్తోంది. మరి లాంగ్ రన్ లో 'ఓదెల 2'కి ఎన్ని కోట్ల వస్తాయనేది చూడాలి?కథ పరంగా యావరేజ్ టాక్ వచ్చింది. మిక్స్ డ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఈ తరహా వసూళ్లు ఎందుకొస్తున్నాయనేది నిర్మాతలకు అర్థం కావట్లేదు. 'అరుంధతి' సినిమాతో పోలిక రావడం ఏమైనా మైనస్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. తమన్నా(Tamannaah Bhatia) శివశక్తిగా డిఫరెంట్ గెటప్ వేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బీభత్సం సృష్టించిన తెలుగు నటుడి కారు) -
నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా!
బాలీవుడ్ ‘నో ఎంట్రీ’ సీక్వెల్లో తమన్నా (Tamannaah Bhatia)కు ఎంట్రీ లభించిందని సమాచారం. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న హిందీ చిత్రం ‘నో ఎంట్రీ 2’. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్, బిపాసా బసు, ఈషా డియోల్ ప్రధాన పాత్రధారులుగా అనీస్ బాజ్మి దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన హిందీ బడ్డీ రొమాంటిక్ కామెడీ మూవీ ‘నో ఎంట్రీ’. కాగా ఈ సినిమాకు సీక్వెల్గా ‘నో ఎంట్రీ 2’ సినిమా తీస్తున్నారు అనీస్ బాజ్మీ, బోనీ కపూర్. నలుగురికి పైగా హీరోయిన్లు..ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలకు పైగా నటిస్తారని టాక్. వీరిలో ఇప్పటికి తమన్నా, అదితీ రావ్ హైదరీలను సంప్రదించారని, కథ నచ్చడంతో ఈ కథానాయికలు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వీలైతే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని బీటౌన్ టాక్. ఈ విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.చదవండి: నేనే అమ్మాయినైతే.. శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు -
57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?
లేటు వయసులో పిల్లల్ని కనడం సెలబ్రిటీల విషయంలో సాధారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే కెరీర్ లో బిజీగా ఉండి లేటుగా పెళ్లి చేసుకుంటారు. తర్వాత కొన్నాళ్లకు పిల్లల్ని కంటూ ఉంటారు. ఇలానే ఇప్పుడు ఓ నటుడు ఏకంగా 57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నాడనే మాట వినిపిస్తోంది. ఎవరా నటుడు?(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్(Arbaaz Khan). తెలుగు, హిందీ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలోనే నటి మలైకా అరోరాని(Malaika Arora) పెళ్లి చేసుకున్న ఇతడు.. కొన్నేళ్ల క్రితం విడాకులు కూడా ఇచ్చేశాడు. వీళ్లకు 22 ఏళ్ల అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు.మలైకాకు విడాకులు ఇచ్చిన తర్వాత మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్(Sshura Khan)ని 2023 డిసెంబరులో అర్బాజ్ ఖాన్ పెళ్లిచేసుకున్నాడు. తాజాగా ఈ జంట.. ముంబైలోని ఓ మెటర్నిటీ క్లినిక్ దగ్గర కనిపించారు. దీంతో అర్భాజ్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే రూమర్స్ వచ్చాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో ఇతడు జై చిరంజీవ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాల్లో నటించాడు.(ఇదీ చదవండి: సీరియల్ నటి వైష్ణవి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్) -
బన్నీ కోసం ముగ్గురు బ్యూటీస్.. కాకపోతే!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) ఎవరితో సినిమా చేస్తాడా అనుకుంటే తమిళ దర్శకుడు అట్లీకే ఓటేశాడు. త్రివిక్రమ్ పేరు కూడా వినిపించింది కానీ అట్లీతో(Atlee) ప్రాజెక్ట్ ఉంటుందని ఈ మధ్య అధికారికంగానూ ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కాకపోతే హీరోయిన్లు ఎవరనే దగ్గర డిస్కషన్స్ జరుగుతున్నాయి.(ఇదీ చదవండి: సీరియల్ నటి వైష్ణవి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్)బన్నీ-అట్లీ సినిమాని ఇంటర్నేషనల్ లెవల్లో తీయబోతున్నారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ వీడియోలో దీని గురించి హింట్ ఇచ్చేశారు. కాబట్టి బన్నీకి సరిపోయే హీరోయిన్లని తీసుకోవాలి. ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా ఆప్షన్స్ కనిపించట్లేదు. అందుకే బాలీవుడ్ వైపు చూస్తున్నారట.ఇప్పుడైతే జాన్వీ కపూర్(Janhvi Kapoor), దిశా పటానీ పేర్లు వినిపిస్తున్నారు. వీళ్లు కన్ఫర్మా కాదా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. కాకపోతే ఎవరి డేట్స్ అందుబాటులో ఉన్నాయనే దానిబట్టి హీరోయిన్లని తీసుకోవాలని అనుకుంటున్నారట. మొత్తంగా అల్లు అర్జున్ సరసన ముగ్గురు భామలు కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!) -
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. నిన్న(ఏప్రిల్ 14) ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ 24 గంటలు గడిచేసరికి మాత్రం రాజమౌళి మూవీస్ రికార్డ్స్ దాటిపోయింది. ఇది మాత్రం ఓ రకంగా షాకింగ్ అని చెప్పొచ్చు.హిట్ సిరీస్ లో తొలి రెండు సినిమాల్ని థ్రిల్లర్స్ గా మలిచారు. కానీ మూడో భాగాన్ని మాత్రం నరుక్కోవడం, రక్తం ఏరులై పారడం అనేలా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమైంది. చిన్నపిల్లలు, సున్నిత మనస్కులు తమ సినిమాని చూడొద్దని నాని చెప్పడం కూడా సినిమాపై ఓ రకంగా బజ్ పెంచింది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!)అలా రిలీజైన 24 గంటల్లో హిట్ 3 ట్రైలర్ కి 23.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తద్వారా బాహుబలి 2 (21.81 మిలియన్), ఆర్ఆర్ఆర్ (20.45 మిలియన్), కేజీఎఫ్ 2 (19.38 మిలియన్) రికార్డ్స్ దాటేసినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా తెలుగు వెర్షన్ వరకు మాత్రమే.మే 1న థియేటర్లలోకి రాబోతున్న హిట్ 3 సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. మరి బ్లడ్ బాత్ అనేలా ఉన్న ఈ మూవీ ఫలితం ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) -
ఖరీదైన సినిమా.. సూపర్ స్టార్-ఐకాన్ స్టార్ వార్!
ఈ ఏడాది అత్యంత ఖరీదైన చిత్రాల రూపకల్పనలో భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త శిఖరాలను అధిరోహించనుంది. ఈ నేపధ్యంలోనే ఆల్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ దర్శకుడు అట్లీ కలయికలో తమ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఇద్దరు టాలీవుడ్ అగ్రగామి నటుల మధ్య సరికొత్త వార్ మొదలైందనొచ్చు. దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా నాదే అనే కిరీటాన్ని అందుకోవడానికి ఈ ఇద్దరు స్టార్స్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ మాత్రమే కాదు నేను కూడా ఉన్నానంటూ బాలీవుడ్ టాప్ స్టార్ కూడా అదే వరుసలో నిలవడంతో.. పోటీ రసకందాయకంగా మారింది.రూ.2 వేల కోట్ల కలెక్షన్స్ నిన్న.. రూ1,000 కోట్ల పెట్టుబడి నేడు.. అన్నట్టుగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్బాబుతో ఆయన తీస్తున్న చిత్రం ఎస్ఎస్ఎస్బి29 బడ్జెట్ రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చునంటున్నారు. మరోవైపు బాలీవుడ్ అగ్ర కధానాయకుల్లో ఒకరైన రణబీర్ కపూర్తో రామాయణం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బడ్జెట్ కూడా రూ.900 కోట్లకు దగ్గరగా ఉండొచ్చునని చెబతున్నారు. ఈ రెండు సినిమాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నప్పటికీ... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమ తమ చిత్రాలతో భారీ బ్లాక్బస్టర్లు సాధించిన అల్లు అర్జున్, అట్లీలు సన్ పిక్చర్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో ఓ సినిమా రూపొందిస్తున్నట్టు వచ్చిన ప్రకటన పలు ఆశ్చర్యకరమైన అంకెల్ని సినీ అభిమానుల కళ్ల ముందుకు తెచ్చింది. ప్రస్తుతం ఏఏ22xఏ6 అని పేర్కొంటున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన భారతీయ చలనచిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 800 కోట్లు కాగా ఇందులో నిర్మాణ వ్యయంగా రూ. 200 కోట్లు, విఎఫ్ఎక్స్ (స్పెషల్ ఎఫెక్ట్స్) కోసం రూ.250 కోట్లు, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ. 175 కోట్లు, దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ రూ. 100 కోట్లుగా లెక్కిస్తున్నారు.ఇదే కాకుండా అల్లు అర్జున్కూ సినిమా లాభంలో 15 శాతం ఉంటుందని, అలాగే అట్లీకి కూడా బ్యాకెండ్ డీల్ ఉంటుందని సమాచారం. అవతార్, ఐరన్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన నిపుణులు ఇందులో భాగం పంచుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా ఇండియన్ స్క్రీన్పై విజువల్ ట్రీట్గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఒక ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లవచ్చునని.. అట్లీ తరచుగా ఆలోచించినట్టే ఆలోచిస్తే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కానుంది.ప్రస్తుత బడ్జెట్ల ప్రకారం రాజమౌళి, మహేష్ బాబుల సినిమాయే అత్యంత ఖరీదైన చిత్రం కావడం ఖాయంగా తెలుస్తున్నప్పటికీ..మరెన్నో నెలల పాటు.షూటింగ్ సాగే క్రమంలో బడ్జెట్లో కూడికలు, తీసివేతలు.. మార్పు చేర్పులు అంతిమంగా ఈ విషయాన్ని ఖరారు చేస్తాయని అనుకోవచ్చు. -
తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?
ప్రస్తుతం చాలామంది హీరోయిన్ల కెరీర్ మహా అయితే రెండు మూడేళ్లు అన్నట్లే సాగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) మాత్రం దాదాపు 20 ఏళ్లకు పైనే ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పటికీ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చేస్తూ ట్రెండ్ ఫాలో అవుతోంది.కొన్నాళ్ల ముందు వరకు తమన్నా అంటే హీరోయిన్ మాత్రమే. కానీ రీసెంట్ టైంలో అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. దానికి తోడు ఈమె చేస్తున్న పాటలు యూట్యాబ్ లో తెగ వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ) గతేడాది 'స్త్రీ 2' మూవీలో 'ఆజ్ కీ రాత్' పాట అయితే ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు 'నషా'(Nasha Song) అనే మరో సాంగ్ తో వచ్చేసింది. రైడ్ 2 సినిమాలోనిది ఈ గీతం. హీరోయిన్ గా చేస్తే రూ.4-5 కోట్లు తీసుకునే తమన్నా.. ఐటమ్ సాంగ్ కి కూడా రూ.1 కోటికి పైనే పారితోషికం(Remuneration) అందుకుంటోందట. నషా పాటకు కూడా అలానే తీసుకుందని టాక్.ఏదేమైనా హీరోయిన్ గా చేస్తూ మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూ 35 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. ఇకపోతే ఈమె ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 అనే తెలుగు సినిమా.. ఈ నెల 18న థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో శివశక్తిగా కనిపించనుండటం విశేషం.(ఇదీ చదవండి: కోట్ల రూపాయలు వదులుకున్న సమంత.. ఎందుకంటే?) -
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
మొన్నటిదాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తమన్నా (Tamannaah Bhatia)- విజయ్ వర్మ (Vijay Varma) కొంతకాలం క్రితమే బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులు షాకయ్యారు. అయితే ఈ బ్రేకప్ను బాహాటంగా ప్రకటించమని మెగాస్టార్ చిరంజీవి సలహా ఇచ్చారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.చిరంజీవి సలహారిపబ్లిక్ వరల్డ్ కథనం ప్రకారం.. ఈ ఏడాది తమన్నా- విజయ్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి ఏర్పాట్ల గురించి తండ్రి ఆరా తీయగా తమన్నా నిరాసక్తత చూపించింది. తనకు ఇష్టం లేదని తెలిపింది. విజయ్ తనకు కట్టుబడి ఉన్నట్లు అనిపించడం లేదని పేర్కొంది. అతడి ఒత్తిడి వల్లే మీడియా ముందు పలుమార్లు జంటగా కలిసి కనిపించామని బాధపడింది. మరి.. ఈ బ్రేకప్ వార్తను జనాలకు ఎలా చెప్పగలవు? అని పేరెంట్స్ అడగ్గా.. చెప్పాల్సిన అవసరం లేదని తమన్నా అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) జోక్యం చేసుకుని బ్రేకప్ న్యూస్ను మీడియాకు వెల్లడిస్తేనే బాగుంటుందని సలహా ఇచ్చారు.చిరంజీవి జోక్యం నిజమా?ఇది చూసిన నెటిజన్లు.. వాళ్లిద్దరి మధ్యలో చిరంజీవి ఎందుకు జోక్యం చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా నమ్మేట్లుగా లేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో బ్రేకప్ను దాచడం వల్ల ఒరిగేదేముంది.. ఉన్న విషయం బయటకు చెప్పమని చిరు సలహా ఇచ్చినట్లున్నాడు.. అందులో తప్పేముంది అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: మనోజ్ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి -
జాన్వీ కపూర్కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
నచ్చినవారికి గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. ఎవరికి తోచిన రీతిలో వారు ఆయా బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం ఏకంగా కోట్లు విలువ చేసే లగ్జరీ కారును తన స్నేహితురాలికి గిఫ్ట్గా ఇచ్చింది. ఇంతకీ ఆ కారును అందుకుంది ఎవరో కాదు హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సింగర్, ఎంటర్ప్రెన్యూర్ అనన్య బిర్లా (Ananya Birla).. పర్పుల్ కలర్ లంబోర్గినిని జాన్వీకి శుక్రవారం నాడు గిఫ్ట్గా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఓ వ్యక్తి ఆ లంబోర్గిని కారును జాన్వీ ఇంటికి డ్రైవ్ చేసుకుని వెళ్లి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ కారులో ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది. ఇక లంబోర్గిని కారు విలువ దాదాపు రూ.5 కోట్లు.ఎవరీ అనన్య బిర్లా?బిజినెస్ టైకూన్ కుమార్ మంగళం- నీరజ బిర్లాల కూతురే అనన్య. ఈమె సింగర్ మాత్రమే కాదు ఎంటర్ప్రెన్యూర్ కూడా! తాజాగా ఆమె మేకప్ బ్రాండ్ను కూడా లాంచ్ చేసింది. దీనికి జాన్వీ ప్రచారకర్తగా ఉండనుందని, అందుకు కృతజ్ఞతగా ఈ బహుమతిని పంపించిందని తెలుస్తోంది.జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ధడక్ చిత్రంతో సినీప్రయాణం ఆరంభించింది. గుంజన్ సక్సేనా, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి వంటి సినిమాలు చేసింది. దేవర: పార్ట్ 1 చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్చరణ్తో పెద్ది మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే ఆమె చేతిలో పరమ సుందరి, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి చిత్రాలున్నాయి. View this post on Instagram A post shared by Hashtag Magazine (@hashtagmagazine.in) View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)చదవండి: థియేటర్లలో ఆల్కహాల్ అమ్మకాలు.. తూలుతూ సినిమా చూడొచ్చు! -
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
సినిమా రెమ్యునరేషన్ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది కానీ దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం... ఇప్పుడు రెమ్యునరేషన్స్ విషయంలో సినిమా దర్శకులు హీరోలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కొందరు దర్శకులైతే టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకుల పారితోషికాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.నెం.1 ప్లేస్లో జక్కన్నప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీపరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది.. డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్ అని నిరూపించుకుంటోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్ మెగా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) నెం1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి 1, 2లతో పాటు RRRల ద్వారా వందలు, వేల కోట్ల కలెక్షన్లతో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్... దాదాపుగా రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. దశాబ్ధానికిపైగా హిట్స్ ఇస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే... మిగిలిన టాప్ 5లో కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాకడం గమనార్హం.రెండో ప్లేస్ కూడా మనదే..అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగుదర్శకుడైన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఉండడం విశేషం. తెలుగు అర్జున్రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్కి ఎదిగిపోయిన సందీప్... అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్ సినిమాలతో రూ.100 నుంచి రూ.150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లాడు. ఏకంగా నెం. 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. కేవలం మూడే సినిమాలతో ఆయన ఈ ఘనత సాధించడం చెప్పుకోదగ్గది. అదే రకంగా దేశం అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ది సైతం అనూహ్యమైన విజయయాత్రే. 100% సక్సెస్ రేటుఈ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ (Atlee Kumar) కేవలం ఆరు చిత్రాలతో 100 శాతం సక్సెస్ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. తమిళ చిత్రాలైన మెర్సల్, బిగిల్లతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వంటి బ్లాక్ బస్టర్లతో అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం తాత్కాలిక టైటిల్ ఎఎ22ఎక్స్ఎ6 పేరుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అట్లీని అమాంతం 3వస్థానంలోకి చేర్చింది. 233% రెమ్యునరేషన్ పెంచిన డైరెక్టర్జవాన్ కోసం రూ. 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి రూ. 100 కోట్లకు అంటే.. దాదాపుగా 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్గా అట్లీని మూడవ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత రూ.80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్కుమార్ హిరానీ, రూ.75 కోట్లతో 5వస్థానంలో సుకుమార్, రూ. 55–65 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు.చదవండి: ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్ -
అల్లు అర్జున్తో సమంత వన్స్మోర్!
అల్లు అర్జున్, సమంత మరోసారి సిల్వర్ స్క్రీన్పై జంటగా కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో తెరపైకి వచ్చింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్, సమంత తొలిసారిగా జోడీ కట్టారు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలోని ప్రత్యేక గీతం ‘ఊ అంటావా...’లో అల్లు అర్జున్, సమంత కలిసి కొన్ని డ్యాన్స్ స్టెప్పులేశారు. తాజాగా ఈ జోడీ మరోసారి రిపీట్ కానుందట.అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు మెయిన్ హీరోయిన్స్, మరో ముగ్గురు అమ్మాయిలు కీలక పాత్రల్లో నటించనున్నారట. ఈ మెయిన్ హీరోయిన్స్లోని ఒక రోల్ కోసం సమంతను తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. మరి... అల్లు అర్జున్, సమంతల జోడీ మరోసారి స్క్రీన్పై రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘తేరీ’ (తెలుగులో ‘పోలీసోడు’), ‘మెర్సెల్’ (అదిరింది) చిత్రాల్లో సమంత ఓ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?
'టిల్లు' సినిమాలతో ఆకట్టుకున్న సిద్ధు.. తాజాగా థియేటర్లలోకి 'జాక్'గా వచ్చాడు. ట్రైలర్ రిలీజైన దగ్గర నుంచి దీనిపై పెద్దగా అంచనాలేం లేవు. అయినా సరే ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు. తొలిరోజు మిక్స్ డ్ రివ్యూస్ రాగా.. రెండో రోజుకి నెగిటివ్ టాక్ వచ్చేసింది. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) హైప్ లేకపోవడంతో తొలిరోజే పెద్దగా ఎవరూ థియేటర్లలోకి రాలేదు. సిద్ధు, 'బేబీ' వైష్ణవి చైతన్య ఉన్న ఉపయోగం లేకుండా పోయింది. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటిరోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.సిద్ధు గత సినిమా 'టిల్లు స్క్వేర్'కి రూ.23 కోట్ల వరకు తొలిరోజు వసూళ్లు రాగా.. 'జాక్' చిత్రానికి మాత్రం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయని అంటున్నారు. టాక్ ఇలానే ఉంటే గనక వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మూవీ నిలబడటం కష్టమే!(ఇదీ చదవండి: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి) -
బిగ్ ప్లాన్తో రవితేజ కూతురు 'మోక్షద' .. ఎంట్రీకి లైన్ క్లియర్
చిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల వారసులు రాణిస్తున్నారు. కొందరు నటీనటులుగా మెప్పిస్తే.. మరికొందరు నిర్మాణ బాధ్యతల్లో ఉన్నారు. అయితే, ఇప్పుడు మాస్మహారాజ్ రవితేజ( Ravi Teja) ముద్దుల కూతురు మోక్షద(Mokshadha) ఎంట్రీకి లైన్ క్లియర్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి కొద్దిరోజుల క్రితమే సోషల్మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. ఆమె హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆమె తెరమీద నటించేందుకు రావడం లేదని, తెర వెనుక కీలకంగా పోషించే పాత్రలో ఉండనున్నారని వారి సన్నిహితులు చెబుతున్న మాట.సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు ఇప్పుడు నిర్మాణ బాధ్యతలు నేర్చుకుంటోందని ఇండస్ట్రీలోని కొందరు చెబుతున్నారు. వినోద్ అనంతోజు దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండతో(Anand Deverakonda) ఒక సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్(Sithara Entertainments) ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకు రవితేజ కూతురు మోక్షద ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తోందట. అయితే, ఈ ప్రాజెక్ట్కు ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదు. ఒక ప్రత్యేకమైన కథాంశంతో కూడిన యాక్షన్-థ్రిల్లర్గా ఈ చిత్రం రానుంది. మొదట అందరూ మోక్షద గురించి మాట్లాడుతూ.. హీరోయిన్ లేదా డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తుందనుకున్నారు. కానీ, ఆమె నిర్మాతగా భవిష్యత్లో కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంది.నిర్మాతలుగా సత్తా చాటుతున్న హీరోల కూమార్తెలుసితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య మ్యాడ్ వంటి చిత్రాలను నిర్మించి రాణిస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు వంటి సినిమాతో నిర్మాతగా నిహారిక కొణిదెల సత్తా చాటింది. సుస్మిత కొణిదెల నిర్మాతగా చిరంజీవి- అనిల్ రావిపూడితో ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఆపై బాలకృష్ణ- బోయపాటి శ్రీను కొత్త సినిమా BB4కు నందమూరి తేజస్విని నిర్మాతగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వీరందరి సరసన రవితేజ ముద్దులు కూతురు మోక్షిద కూడా చేరనుంది. -
స్టార్ హీరో కూతురికి తల్లిగా నటించనున్న దీపికా పదుకోన్
స్క్రీన్పై షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్కు తల్లిగా నటించనున్నారట దీపికా పదుకోన్. షారుక్ ఖాన్ హీరోగా ఆయన కుమార్తె సుహానా మరో లీడ్ రోల్లో నటించనున్న చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్ టాక్. అభిషేక్ బచ్చన్ విలన్గా నటించనున్నారు. తాజాగా ఈ మూవీలో దీపికా పదుకోన్ ఓ లీడ్ చేయనున్నారనే టాక్ తెర పైకి వచ్చింది. సుహానా ఖాన్కు తల్లిగా కనిపిస్తారట దీపికా పదుకోన్. ఈ పాత్ర కథకు చాలా కీలకంగా ఉంటుందట. మే లేదా జూన్లో ‘కింగ్’ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘ఎక్స్’ వేదికగా ‘ఫాల్స్’ అని పేర్కొన్నారు. మరి... ‘అవాస్తవం’ అని ఆయన పేర్కొన్నది దీపికా పదుకోన్ తల్లి పాత్ర గురించా? లేదా వేరే ఏదైనా సినిమా గురించా లేక వేరే ఏ విషయం గురించా అనేది తెలియాల్సి ఉంది. -
బర్త్ డే పార్టీకి రష్మిక-విజయ్ కలిసి వెళ్లారా?
రష్మిక పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాన్నాళ్లుగా టాక్. రష్మిక ఒకటి రెండుసార్లు పరోక్షంగా తన ప్రేమ గురించి బయటపెట్టింది గానీ విజయ్ పేరు మాత్రం చెప్పలేదు. మళ్లీ ఇప్పుడు వీళ్ల గురించి ఈ డిస్కషన్ ఎందుకంటే దానికి ఓ కారణముంది.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. వరస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఒమన్ దేశానికి వెళ్లింది. అక్కడే బీచ్ ఒడ్డున సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని ఇన్ స్టాలో కూడా పోస్ట్ చేసింది.కట్ చేస్తే విజయ్ దేవరకొండ.. బీచ్ ఒడ్డున తీసుకున్న కొన్ని ఫొటోల్ని ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇవి చూసిన కొందరు నెటిజన్లు.. రష్మికతో కలిసి విజయ్ బర్త్ డే పార్టీలో పాల్గొనే ఉంటాడుగా అని కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరూ జంటగా ఎప్పుడూ పోస్ట్ పెడతారా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓవైపు వివాదాలు.. మరోవైపు వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డ్) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
ఖైదీ సీక్వెల్లో అమలాపాల్
కోలీవుడ్ నటుడు కార్తీ కథానాయకుడుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ఖైదీ. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రకాష్ బాబు, ఎస్సార్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. కాగా త్వరలో ఈ చిత్రానికి సీక్వల్ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఖైదీ చిత్రాన్ని హిందీలో నటుడు అజయ్ దేవగన్ 'భోలా' పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, అక్కడ కూడా ఫర్వాలేదనిపించింది. తమిళం కార్తీ కథానాయకుడిగా నటించిన పాత్రను హిందీలో అజయ్ దేవగన్ పోషించారు. నరేన్ పాత్రలో నటి టబు కనిపించారు.అజయ్ దేవగన్ ఫిలిమ్స్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నటి అమలాపాల్ కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ను బాలీవుడ్లో కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను యూనిట్ వర్గాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా 2009లో మలయాళంలో నీలతామర అనే చిత్రంలో కథానాయకిగా పరిచయమైన అమలాపాల్ తమిళంలో వీరశేఖరన్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అలా మలయాళం ,తమిళం, తెలుగు భాషల్లోనూ ప్రముఖ హీరోల సరసన కథానాయకగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా కథానాయకిగా మంచి ఫామ్లో ఉండగానే దర్శకుడు విజయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు మనస్పర్ధల కారణంగా రెండేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలో నటించడం మొదలెట్టిన అమలాపాల్ అదేవిధంగా జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఒక పాప కూడా పుట్టింది. కాగా అమలాపాల్ నటించిన మలయాళ చిత్రం గోట్ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆమె తమిళంలో నటించి చాలా కాలమే అయ్యింది. కాగా తాజాగా బాలీవుడ్లోకి ఖైదీ2తో మరోసారి సందడి చేయనున్నారు. -
వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?
తెలుగులో ఇప్పటివరకు చాలా సీరియల్స్ వచ్చాయి. కానీ గత కొన్నేళ్లలో మాత్రం 'కార్తీకదీపం' హిట్ అయినట్లు మరేది క్లిక్ అవ్వలేదని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇందులో హీరోయిన్ వంటలక్కగా చేసిన ప్రేమి విశ్వనాథ్.. తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా మారిపోయింది.స్వతహాగా మలయాళ నటి అయిన ప్రేమి విశ్వనాథ్.. 2014 నుంచి సీరియల్స్ చేస్తోంది. తొలుత సొంత భాషలో చేసింది. 2017 నుంచి మాత్రం తెలుగులో కార్తీకదీపం చేస్తోంది. 2023 వరకు కొనసాగిన ఈ సీరియల్.. అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఫేమ్ నటుడు దర్శన్ అరెస్ట్!)ప్రస్తుతం రెండో సీజన్ అని నడిపిస్తున్నారు. 300కి పైగా ఎపిసోడ్లు ప్రసారం చేశారు గానీ తొలి పార్ట్ అంత బజ్ సొంతం చేసుకోలేకపోయింది. సీరియల్ గురించి పక్కనబెడితే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈమె రోజుకి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తోందట. నెలలో దాదాపు 20-25 రోజుల పాటు ప్రేమి విశ్వనాథ్ షూటింగ్ లో పాల్గొంటుంది. తద్వారా లక్షల్లోనే పారితోషికం అందుకుంటోంది. రెమ్యునరేషన్ విషయంలో వంటలక్క తర్వాత సుజిత, కస్తూరి లాంటి ఆర్టిస్టులు ఉన్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఏళ్లు గడుస్తున్నా వంటలక్క క్రేజ్ మాత్రం తగ్గట్లేదుగా!(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) 'జాక్' సినిమా ఏప్రిల్ 10న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సోషల్మీడియాలో సిద్ధూ డైలాగ్స్ బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే, సినిమా థియేటర్స్లో చూద్దామని ఆశగా ఉన్న ప్రేక్షకులకు నిరాశ ఎదురుకానుంది అంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వం వహించారు. ఇందులో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.జాక్కు 'గాండీవధారి అర్జున' చిక్కులు2023లో విడుదలైన వరుణ్ తేజ్'గాండీవధారి అర్జున'(Gandeevadhari Arjuna) చిత్రాన్ని నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్నే ఇప్పుడు జాక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పుడు ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ కావడంతో చాలామంది నష్టపోయారు. ముఖ్యంగా గోదావరి ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారట. గాండీవధారి అర్జున సినిమా విడుదల సమయంలో రికవరబుల్ అడ్వాన్స్ కింద సినిమాను కొన్నామని, అందుకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేశారట. ఆ సినిమాతో తాము పూర్తిగా మునిగిపోయినట్లు చెప్పుకొచ్చారని సమాచారం. డీల్ ప్రకారం తమకు డబ్బులు వెనక్కివ్వలేదని తెలిపిన వారు.. ఆ సెటిల్మెంట్ జరిగే వరకు ‘జాక్’ సినిమాను విడుదల కానివ్వమని పెద్ద పంచాయితీ పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గాండీవధారి నష్టాలు జాక్ను అడ్డుకుంటున్నాయిని నెటిజన్లు తెలుపుతున్నారు.వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా 'గాండీవధారి అర్జున' చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్లో సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అయితే, ప్రీరిలీజ్ బిజినెస్ కేవలం రూ. 17 కోట్లు మాత్రమే చేసింది. ఆపై బాక్సాఫీస్ వద్ద రూ. 4 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. దీంతో చాలామంది పంపిణీదారులు ఈ సినిమాతో నష్టపోయారని తెలుస్తోంది. -
ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?
2025లో మూడు నెలలు పూర్తయిపోయాయి. గత నెల మార్చిలో బోలెడన్ని మూవీస్ వచ్చాయి. కాకపోతే కోర్ట్ (Court A State Vs Nobody) అనే ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని (Nani) నిర్మించిన ఈ మూవీ.. మంచి లాభాలని అందుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?)రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన 'కోర్ట్'లో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు జనాలు నుంచి మంచి ఆదరణ దక్కింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.ఇక విషయానికొస్తే మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ.. ఏప్రిల్ 11న ఓటీటీలోకి (Court OTT) వచ్చే అవకాశముందని టాక్. దీని డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో పలు కొత్త సినిమాలు ఈ ఓటీటీలో 28 రోజులకే వస్తున్నాయి. దీంతో కోర్ట్ కూడా అలానే రావొచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతనేది చూడాలి?(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?) -
అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?
సినిమా సెలబ్రిటీలపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలానే అల్లు అర్జున్ (Allu Arjun) గురించి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలో పేరు మార్చుకోబోతున్నాడని పలు ఇంగ్లీష్ వెబ్ సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత?పుష్ప 2 (Pushpa 2 Movie) మూవీతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ కి ఊహించని స్టార్ డమ్ వచ్చింది. దీంతో ఆచితూచి మూవీస్ చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా కన్ఫర్మ్, అట్లీతో కూడా ఖరారైందని అంటున్నారు. పుట్టినరోజున (ఏప్రిల్ 8న) అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?)ఇలా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్న ఈ టైంలో బన్నీ (Bunny) పేరు మార్చుకోబోతున్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు జాతకాలు, న్యుమరాలజీ లాంటివి ఎక్కువగా నమ్ముతుంటారు. అలానే న్యూమరాలజీ ప్రకారం.. తన పేరులో అదనంగా ఇంగ్లీష్ అక్షరం U,N గానీ బన్నీ జోడించుకుంటాడని.. ఇలా చేస్తే గుర్తింపు మరింత పెరుగుతుందని నమ్మకమట. మరి బన్నీ పేరు మార్పుపై వస్తున్న రూమర్స్ నిజమా కాదా కొత్త సినిమా ప్రకటిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పటిలానే పేరు ఉంటే ఓకే. లేదంటే మార్పు వార్తలు నిజమేనని తేలుతుంది.(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!) -
లంక మాజీ క్రికెటర్ తో 51 ఏళ్ల మలైకా డేటింగ్?
మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్స్ గుర్తొస్తాయి. తర్వాత డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చేసింది. కొన్నాళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)మూడు నాలుగేళ్ల పాటు అర్జున్-మలైకా తెగ తిరిగారు. టూర్లకు కూడా కలిసి వెళ్లారు. పెళ్లి ఏమైనా చేసుకుంటారేమో అని అందరూ అనుకుంటున్న టైంలో విడిపోయి షాకిచ్చారు. ప్రస్తుతానికైతే మలైకా ఒంటరిగానే ఉంటోంది. అలాంటిది ఇప్పుడు ఈమె మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.చెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి గౌహతిలో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. దీనికి హాజరైన మలైకా.. లంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పక్కన కూర్చుని కనిపించింది. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా అంటూ బాలీవుడ్ మీడియా ఉదయం నుంచి తెగ ఉదరగొట్టేస్తుంది. మరోవైపు మలైకా సన్నిహితులు మాత్రం.. అనుకోకుండా పక్కన కూర్చున్నంత మాత్రం డేటింగ్ అనేస్తారా అని అంటున్నారు. అంటే డేటింగ్ కామెంట్స్ అన్ని గాసిప్స్ అనమాట.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?) -
'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?
సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ సికిందర్. రష్మిక హీరోయిన్. ఈద్ సందర్భంగా ఆదివారం (మార్చి 30) థియేటర్లలో రిలీజైంది. మొదటి ఆట నుంచి దీనికి నెగిటివ్ టాక్ బయటకొచ్చింది. రొట్టకొట్టుడు స్టోరీకి తోడు సల్మాన్ యాక్టింగ్ నీరసంగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు వచ్చాయి?(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూడు రోజుల కలెక్షన్లు)చాలా ఏళ్లుగా సల్మాన్ సినిమాలు చేస్తున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్కటీ హిట్ అవ్వట్లేదు. దీంతో ఈ సారి తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తో కలిసి సికిందర్ తీశాడు. హిట్ బ్యూటీ రష్మిక ఉండటంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టీజర్, ట్రైలర్ దెబ్బకు మూవీపై ఉన్న హైప్ అంతా పోయింది. సినిమా కూడా అలానే ఉందని, చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఇకపోతే రిలీజ్ కి ముందు రోజు అంటే శనివారం రాత్రి.. సికిందర్ పైరసీ హెచ్ డీ ప్రింట్ పలు వెబ్ సైట్లలో దర్శనమిచ్చింది. అలా ప్రతికూల అంశాలతో రిలీజైన ఈ మూవీకి తొలిరోజు కేవలం రూ.26 కోట్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సల్మాన్ లాంటి స్టార్ హీరో.. తొలిరోజు ఈ వసూళ్లు అంటే చాలా తక్కువనే చెప్పాలి. మరి ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?) -
మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మలయాళ స్టార్ మోహన్లాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ లూసిఫర్ (Lucifer Movie) ఒకటి. 2019లో వచ్చిన ఈ మలయాళ చిత్రం ఘనవిజయం సాధించింది. రూ.30 కోట్లతో తీస్తే రూ.125 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan Movie) తెరకెక్కించారు. తొలి భాగాన్ని రూపొందించిన పృథ్వీరాజ్ ఈ సినిమాకు సైతం దర్శకుడిగా పని చేశాడు. అలాగే కథలోనూ కీలక పాత్రలో కనిపించాడు. లూసిఫర్ అంటే దైవదూత అని అర్థం కాగా ఎంపురాన్ అంటే రాజు కంటే ఎక్కువ.. దేవుడి కంటే తక్కువ అని అర్థం.తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?L2: ఎంపురాన్ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. కేవలం భారత్లోనే రూ.22 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మలయాళంలో ఈ రేంజ్ వసూళ్లు అందుకున్న తొలి చిత్రంగా ఎంపురాన్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు 'ద గోట్ లైఫ్' పేరిట ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమా దేశంలో రూ.8.95 కోట్ల (నెట్) వసూలు చేసింది. ఇకపోతే ఎంపురాన్ సినిమా విదేశాల్లోనూ అదరగొడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చినట్లు భోగట్టా!ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా?2019 వరకు మలయాళంలో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలే లేవు. లూసిఫర్ సినిమా ఈ సంకెళ్లను తెంచుకుని రూ.100 కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ రూ.200 కోట్లు రాబట్టిన ఏకైక మలయాళ మూవీగా రికార్డుకెక్కింది. మరి ఈ రికార్డును ఎంపురాన్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి! We made history! Biggest opening ever for a Malayalam movie. Our heartfelt gratitude to each of you for making this happen.#L2E #Empuraan in theatres now! pic.twitter.com/iN2bdhZz1E— Mohanlal (@Mohanlal) March 28, 2025 #Empuraan sets sail to New Zealand, claiming the Biggest Indian Opener!#L2E #Empuraan in theatres near you!@mohanlal @PrithviOfficial #MuraliGopy @antonypbvr @aashirvadcine @GokulamGopalan @GokulamMovies #VCPraveen #BaijuGopalan #Krishnamoorthy @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/3NtUzx17DV— Aashirvad Cinemas (@aashirvadcine) March 28, 2025చదవండి: Robinhood: ‘రాబిన్హుడ్’ మూవీ ట్విటర్ రివ్యూ -
వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి
హీరో ప్రభాస్ (Prabhas) వివాహం కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ప్రభాస్ ఉండటంతో ఆయన పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫలానా అమ్మాయిని ప్రభాస్ చేసుకోబోతున్నారంటూ.. ఇప్పటికే డార్లింగ్ వివాహంపై ఎన్నో రూమర్స్ సోషల్మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు వచ్చిన పలు సందర్భాల్లో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి వివరణ ఇస్తూనే ఉన్నారు.రెబల్స్టార్ కృష్ణం రాజుకు నట వారసుడిగా పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఆయన పెళ్లి ఏర్పాట్ల పనుల్లో పెద్దమ్మ శ్యామలా దేవి ఉన్నారని పలు ఇంగ్లీష్ వెబ్సైట్స్ ప్రచురించాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ చేసినట్లు న్యూస్ 18, హిందూస్థాన్ టైమ్స్లో కథనాలు వచ్చాయి. అమ్మాయి కుటుంబం ఏపీకి చెందినప్పటికీ వారు హైదరాబాద్లో స్థిరపడ్డారని అందులో పేర్కొన్నారు. పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభాస్ పెద్దమ్మ రహస్యంగా చూసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి రీసెంట్గా జరిగిన అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రశ్నించగా రామ్చరణ్ కాస్త క్లూ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్లోని గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు (ప్రభాస్) పెళ్లి చేసుకోనున్నారని చరణ్ చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -ప్రభాస్ సిస్టర్స్రీసెంట్గా ప్రభాస్ బంధువుల పెళ్లిలో ఆయన ముగ్గురు చెల్లెల్లు (ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి)తో పాటు కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి సందడిగా కనిపించారు. పెళ్లిలో వారంతా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.. ఆ వేడుకలోనే ప్రభాస్ వివాహం గురించి వార్తలు బయటకు వచ్చాయట. డార్లింగ్ పెళ్లి గురించి పలువురి బంధువులతో కొన్ని విషయాలను కూడా శ్యామల దేవి పంచుకున్నారని సమాచారం. అందుకే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి వార్తలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయిని కొందరు అంటున్నారు. ఈ అంశం గురించి శ్యామల దేవి వివరణ ఇస్తే కానీ ఫుల్స్టాప్ పడకపోవచ్చు.(ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో ప్రభాస్ చెల్లెళ్లు.. అన్నకు మ్యారేజ్ చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!) -
రష్మిక ఆస్తి ఎన్ని కోట్లు? ఏమేం ఉన్నాయి?
అప్పుడప్పడు కొందరు సెలబ్రిటీలకు దశ తిరిగేస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి ఫేజ్ లో రష్మిక ఉంది. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటోంది. తాజాగా ఈమె ఆస్తుల గురించి ఫోర్బ్స్ నివేదిక బయటపెట్టింది.కర్ణాటకకు చెందిన రష్మిక ప్రస్తుత వయసు 28. కానీ ఆస్తి మాత్రం రూ.66 కోట్ల వరకు సంపాదించిందని ఫోర్బ్స్ చెప్పుకొచ్చింది. ఒక్కో సినిమాకు రూ.4-8 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటుందని పేర్కొంది. రీసెంట్ గా 'ఛావా'తో సూపర్ సక్సెస్ అందుకుంది. త్వరలో ఈమె ఆస్తి రూ.100 కోట్లకు చేరొచ్చని అంచనా.(ఇదీ చదవండి: ఐసీయూలో తల్లి.. IPLకు నో చెప్పిన హీరోయిన్)యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా వరసగా రూ.500 కోట్ల వసూళ్ల సినిమాలు చేసిన రష్మిక మరోవైపు యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గోవా, కూర్గ్ లో ఈమెకు సొంత ఫ్లాట్స్ ఉన్నాయి.ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న రష్మిక.. అప్పుడప్పడు వెకేషన్స్ కి వెళ్తుంటుంది. మరోవైపు ఈమె దగ్గర బెంజ్, ఆడీ, రేంజ్ రోవర్ లాంటి ఖరీదైన కార్స్ ఉన్నాయి. ఇలా అన్నింటా రష్మిక తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతోంది.(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని) -
ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా
బుట్టబొమ్మ పూజా హెగ్డేకి (Pooja Hegde) టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. రెండు మూడేళ్ల ముందు వరకు తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేసింది. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ లాంటి వరస డిజాస్టర్స్ దెబ్బకు పూర్తిగా సౌత్ కి దూరమైపోయింది. హిందీలో ప్రయత్నిస్తే ఒకటి రెండు ఛాన్సులు వచ్చాయి గానీ ఆయా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్స్ గా మిగిలాయి. ఈ ఏడాది జనవరి 31న రిలీజైన 'దేవా' (Deva OTT) సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది గానీ ఇదేమో ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య)2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో కాస్త కొత్తగా అనిపించడంతో హిట్ అయింది. దీన్ని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. కానీ ఫ్లాప్ అయింది. దీన్నే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తీస్తే ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది.ఇప్పుడు 'దేవా' సినిమా ఓటీటీలోకి రానుంది. మార్చి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య థియేటర్లలో ఫ్లాప్ అయిన 'ఎమర్జెన్సీ' లాంటి మూవీస్ ఓటీటీలో హిట్ అవుతున్నాయి. మరి 'దేవా' కూడా అలా ఏమైనా ట్రెండింగ్ అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
పవన్ కొత్త సినిమాలు క్యాన్సిల్?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుగులో స్టార్ హీరో. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చేతిలో ఉన్న సినిమాలే పూర్తి చేయలని పరిస్థితి. అలాంటి కొత్త చిత్రాలంటే అస్సలు అయ్యే పనికాదు. ఈ క్రమంలోనే కొత్త సినిమాలు రెండు క్యాన్సిల్ అయ్యాయనే మాట వినిపిస్తోంది.పవన్ చేతిలో ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'ఓజీ' (OG Movie) సినిమాలున్నాయి. వీటిలో 'హరిహర..' లెక్క ప్రకారం ఈ మార్చి 27న రిలీజ్ కావాలి. కానీ మే 9కి వాయిదా వేశారు. పవన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. మరి మేలో అయినా సరే సినిమా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?)పవన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్న 'ఓజీ'కి దాదాపు 20 రోజుల డేట్స్ పవన్ ఇవ్వాల్సి ఉందట. అది ఎప్పుడు జరిగితే దానిబట్టి రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉంది. ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లి చాలా ఏళ్లు అయిపోయాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి.ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaab Bhagath Singh) షూటింగ్ కొన్నిరోజులు చేశారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని హోల్డ్ లో పెట్టేశారనే టాక్ ఉంది. అలానే సురేందర్ రెడ్డితో కమిట్ అయిన ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేసేశారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే పవన్ చివరి చిత్రం 'ఓజీ'నే!(ఇదీ చదవండి: రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే!) -
రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే!
ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun).. పాన్ ఇండియా హీరోలుగా పుల్ క్రేజ్ సంపాదించారు. చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నాడు. మరో మూవీ లైనులో ఉంది. బన్నీ కూడా రెండు సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ బ్యాడ్ న్యూస్ అభిమానుల మధ్య చర్చకు కారణమవుతోంది.హీరోలన్నాక సినిమాలు చేస్తుంటారు. మంచి రోజులు చూసుకుని అప్డేట్స్ ఇస్తుంటారు. ఇక పుట్టినరోజున గ్లింప్స్, పోస్టర్స్ లాంటివి రిలీజ్ చేస్తుంటారు. త్వరలో చరణ్ (మార్చి 27), బన్నీ (ఏప్రిల్ 8) బర్త్ డేలు రాబోతున్నాయి. దీంతో కొత్త మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఈసారి అలాంటివేం ఉండవని తెలుస్తోంది.(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)చరణ్-బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ (Ar Rahman) సంగీత దర్శకుడు. కొన్నిరోజుల క్రితం ఈయన గుండెల్లో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జ్ కూడా అయిపోయి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే గ్లింప్స్ విజువల్స్ రెడీ అయిపోయినా సరే మ్యూజిక్ బాకీ ఉండటంతో చరణ్ పుట్టినరోజు దీన్ని రిలీజ్ చేయడం కష్టమేనని మాట్లాడుకుంటున్నారు.మరోవైపు అల్లు అర్జున్ కొత్త మూవీస్ కి సంబంధించి పుట్టినరోజున అనౌన్స్ మెంట్స్ ఉండొచ్చని అనుకున్నారు. కానీ బన్నీ నానమ్మ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సినిమాల ప్రకటన సరికాదని, వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ రూమర్స్ బట్టి చూస్తే త్వరలో మంచి రోజు చూసుకుని చరణ్, బన్నీ మూవీస్ అప్డేట్స్ రిలీజ్ చేస్తారనిపిస్తుంది.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?) -
అల్లు అర్జున్.. హీరో కమ్ విలన్!?
అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో చేయడం దాదాపు ఖరారైపోయింది. ఎప్పుడు అధికారికంగా ప్రకటించనున్నారనేది కూడా రూమర్స్ వచ్చేస్తున్నాయి. అలానే స్టోరీ గురించి చిన్న హింట్ తో పాటు రెమ్యునరేషన్ డీటైల్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేయాలి. కానీ ఇది భారీ బడ్జెట్ తో తీసే మైథలాజికల్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్ లో మరో మూవీ చేయాలని బన్నీ అనుకున్నాడట. ఈ క్రమంలోనే అట్లీ లైనులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టుని బన్నీ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించనున్నారట.మరోవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్.. హీరో కమ్ విలన్ గా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. అంటే అటు హీరోయిక్ ఎలివేషన్లతో పాటు విలన్ గానూ రచ్చ చేస్తాడేమో. ఇకపోతే ఈ మూవీ చేస్తున్నందుకు గానూ రూ.175 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 20 శాతం వాటా కూడా తీసుకోబోతున్నాడని అంటున్నారు. మరి వీటిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!) -
రెమ్యునరేషన్ మోడల్ను మార్చేసిన ఫస్ట్ హీరో 'మహేష్బాబు'
స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనేది ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కానీ, సినిమా హిట్ అయితే నిర్మాతకు భారీగానే లాభాలు వస్తాయి. ఒకవేళ నష్టం వస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ప్రస్తుతం హీరోల అధిక రెమ్యునరేషన్లు చిత్ర పరిశ్రమ మనుగడకు ఇబ్బందిగా మారుతోందని పలువురు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. అధిక నష్టాల ఎఫెక్ట్ వల్ల కొత్తగా నిర్మాతలు ఎవరూ కూడా సినీ పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. రీసెంట్గా తీరని నష్టాల వల్ల లైకా ప్రొడక్షన్స్ సంస్థను షట్డౌన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనంతటికీ కారణం సినిమా బడ్జెట్ పెరగడమే అని చెప్పవచ్చు. అందులో అధిక భాగం హీరో రెమ్యునరేషన్ అనే ఎక్కువమంది చెబుతున్న మాట. అయితే, ఈ రెమ్యూనరేషన్ మోడల్ మొత్తంగా మహేష్బాబు మార్చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే, అది నిర్మాతలకు భారీ ఊరటను కల్పించేలా ఉండటంతో ప్రిన్స్ మహేష్ బాబును అభినందిస్తున్నారు.నష్టం వస్తే జీరో రెమ్యునరేషన్దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రూ. 300 కోట్లతో (పుష్ప2) టాప్లో ఉన్నారు. అయితే, పుష్ప2 మూవీకి భారీ లాభాలు వచ్చాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ రిజల్ట్లో తేడా వచ్చింటే ఎవరూ ఊహించలేని నష్టాలను ఆ చిత్ర నిర్మాణ సంస్థ భరించాల్సి వచ్చిండేది. ఇప్పుడు మహేష్బాబు- రాజమౌళి (SSMB29) ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ మూవీ కోసం మహేష్బాబు తన రెమ్యునరేషన్గా సినిమాకు ఫైనల్గా వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా లాభాల్లో 35 శాతం వరకు ఉండోచ్చని సమాచారం. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వైరల్ అవుతుంది. సినిమాకు నష్టాలు వస్తే జీరో రెమ్యనరేషన్ అని ముందే డీల్ సెట్ చేసుకున్నారట.. ఇదే ప్లాన్ను దర్శకులు రాజమౌళి కూడా అనుసరిస్తున్నారట. అసలు రెమ్యూనరేషన్ అంటూ తీసుకోకుండా కేవలం వచ్చే ప్రాఫిట్లో షేర్ తీసుకోవడం నిర్మాతలకు భారీ ఊరట కల్పించే అంశమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్లో ఇదే దారిలో చాలామంది హీరోలు వెళ్లే అవకాశం ఉంది. రెమ్యునరేషన్ విషయంలో ట్రెండ్ సెట్ చేసిన హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు. -
సగం బాలీవుడ్ 'ఐపీఎల్' కోసం.. ఒక్క రాత్రి ఖర్చు ఎంతంటే?
మన దేశంలో జనాలు ఏది ఎక్కువ ఇష్టపడతారో అంటే టక్కున చెప్పే మాట సినిమాలు, క్రికెట్. మరీ ముఖ్యంగా ఐపీఎల్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ సెలబ్రిటీల ఆటపాట ఉండాల్సిందే. స్టార్ హీరోహీరోయిన్లు వస్తారు, తమదైన డ్యాన్సులతో ఫుల్లుగా ఎంటర్ టైన్ చేస్తారు. మిగతా సీజన్ల మాటేమో గానీ ఈ సీజన్ (IPL 2025) ప్రారంభోత్సవానికి సగం బాలీవుడ్ వచ్చే ప్లాన్ చేశారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)ప్రతి సీజన్ లోనూ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో 2-3 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది. ఈసారి తొలి మ్యాచ్ కోల్ కతా vs బెంగళూరు (KKR vs RCB) మధ్య జరగనుంది. కోల్ కతా జట్టు ఓనర్ షారుక్ ఎలానూ ఉంటాడు. మరోవైపు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.హీరోయిన్లలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, 'యానిమల్' తృప్తి, శ్రద్దా కపూర్, తమన్నా, ఊర్వశి రౌతేలా, కరీనా కపూర్, పూజా హెగ్డే.. ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉన్నట్లు సమాచారం. వీళ్లతో పాటు స్టార్ సింగర్స్ అర్జిత్ సింగ్, శ్రేయా ఘెషల్, అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ కూడా ఫెర్ఫార్మ్ చేయనుంది.అయితే వీళ్లేం ఊరికే రారుగా. ఐపీఎల్ మేనేజ్ మెంట్ లేదా ఆయా ఫ్రాంఛెజీలు కోట్ల రూపాయల పారితోషికం చెల్లిస్తాయట. మొత్తంగా రెండు మూడు గంటల పాటు జరిగే ప్రోగ్రామ్ కోసం రూ.40-50 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని టాక్. వీటిలో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?) -
రూ.120 కోట్లతో అమితాబ్ టాప్!
మన దేశంలో పలువురు సెలబ్రిటీలు సినిమాలు, యాడ్స్, షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తారు. అదే టైంలో ప్రభుత్వానికి ట్యాక్స్ (పన్ను) కూడా కడుతుంటారు. అదీ కోట్లలోనే ఉంటుంది. తాజాగా ఈ లిస్టులో అగ్రస్థానానికి బిగ్ బీ అమితాబ్ (Amitabh Bachchan) వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ గత ఏడాది కాలంలో ఎంత సంపాదించారంటే?(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?)82 ఏళ్ల వయసులోనే ఫుల్ ఎనర్జీతో పనిచేస్తున్న అమితాబ్ బచ్చన్.. గతేడాది 'కల్కి'లో (Kalki 2898AD) ప్రభాస్ కి ధీటుగా నటించి ఆకట్టుకున్నారు. మరోవైపు 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోతోనూ అలరిస్తున్నారు. కొన్ని యాడ్స్ కూడా చేస్తున్నారు. అలా 2024-25 సంవత్సరానికి గానూ దాదాపు రూ.350 కోట్ల వరకు సంపాదించారట. ఇందులోనూ రూ.120 కోట్ల ట్యాక్స్ ఈ మధ్యే కట్టారట.మన దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టే సెలబ్రిటీల్లో గతేడాది షారుక్ ఖాన్ (రూ.92 కోట్లు) అగ్రస్థానంలో నిలిచినట్లు వార్తలొచ్చాయి. ఇతడి తర్వాత తమిళ హీరో దళపతి విజయ్ (రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు) ఉండగా.. నాలుగో స్థానంలో అమితాబ్ ఉన్నాడు. ఈసారికి వచ్చేసరికి ఎక్కువ పన్ను కట్టి టాప్ లోకి వచ్చేశాడని సమాచారం.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?) -
'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?
మంచు బ్రదర్స్, వీళ్ల కుటుంబంలో ఏమేం జరిగిందో తెలుగు ప్రేక్షకులకు తెలియందేమీ కాదు. దాదాపు కొన్నివారాల పాటు నడిచిన హంగామా ప్రస్తుతానికైతే సైలెంట్ అయినట్లే ఉంది. కానీ ఇప్పుడు మరోసారి విష్ణు vs మనోజ్ ఉండబోతుందా అనే సందేహం వస్తోంది. సోషల్ మీడియాలో ఇందుకు తగ్గట్లే కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.మంచు విష్ణు దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టి, చాన్నాళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రలు పోషించారు. తొలుత వచ్చిన టీజర్ పై ట్రోల్స్ వచ్చాయి కానీ ఈ మధ్య రిలీజైన టీజర్, పాటలపై మాత్రం కాస్తంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 25న రిలీజ్ కి తగ్గట్లే ప్రమోషన్స్ సాగుతున్నాయి.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్)అసలు విషయానికొస్తే.. మంచు మనోజ్ కూడా సినిమాలు చేయక చాన్నాళ్లయింది. రెండో పెళ్లి, ఫ్యామిలీలో గొడవలు వల్ల కెరీర్ మీద సరిగా దృష్టి పెట్టలేకపోయాడేమో! ఇకపోతే ఇతడు నటించిన 'భైరవం' అనే మూవీ లెక్క ప్రకారం గత డిసెంబరులోనే రిలీజైపోవాలి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు దీన్ని కూడా ఏప్రిల్ 25నే థియేటర్లలో విడుదల చేయాలని అనుకుంటున్నారట.ఒకవేళ ఇదే జరిగితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచు బ్రదర్స్ పోటీ అన్నట్లు ఉంటుంది. తాజాగా ఓ ఉగాది ఈవెంట్ లో పాల్గొన్న మనోజ్ కూడా.. 'భైరవం' సరైన తేదీకే వస్తుందని చెప్పాడు. మరి ఈ రూమర్స్ లో నిజమెంతో చూడాలి?(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
బిగ్ డీల్ ప్లాన్తో సుకుమార్.. విలన్గా షారుక్ఖాన్
అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఈ మూవీ తర్వాత సుకుమార్కు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. దీంతో ఆయన తర్వాత డైరెక్ట్ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సుకుమార్ గురించి బాలీవుడ్ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. పుష్ప2 విజయం తర్వాత రామ్చరణ్తో (Ram Charan) చేయనున్న సినిమా కోసం స్క్రిప్ట్ పనిలో సుకుమార్ బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే.. అయితే, సుకుమార్- షారుక్ఖాన్(Shah Rukh Khan) కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఈమేరకు షారుక్ టీమ్తో చర్చలు కూడా జరిగిపోయాయని తెలుస్తోంది. రాజకీయం నేపథ్యం ఉన్న ఒక గ్రామీణ కథను షారుక్ఖాన్కు సుక్కు వినిపించారట.. అది ఆయనకు కూడా బాగా నచ్చేసిందని టాక్. కానీ, ఈ కథలో షారుక్ వ్యతిరేక (విలన్) పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.'పుష్ప 1, 2'లకు సీక్వెల్గా పార్ట్ -3 ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆపై చరణ్ ప్రాజెక్ట్ కూడా సుకుమార్ చేతిలో ఉంది. మరి షారుక్ఖాన్ కూడా రీసెంట్గా తన సొంత బ్యానర్ నుంచి ఒక సినిమాను ప్రకటించారు. ఇలా ఇద్దరూ ఫుల్ బిజీగా తమ వర్క్లో ఉన్నారు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే, వారిద్దరి నుంచి కూడా ఈ వార్త గురించి ఎలాంటి రియాక్షన్ రాలేదు. -
బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?
'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) సినిమాని మీలో చాలామంది చూసే ఉంటారు. అందులో బుల్లిరాజు (Bulliraju) పాత్ర కాస్త ఎక్కువగానే ఫేమస్ అయింది. ఇంతకు ముందు ఏ సినిమాల్లో నటించనప్పటికీ.. సూపర్ కామెడీ టైమింగ్ తో ఈ పిల్లాడు అదరగొట్టేశాడు. తాజాగా ఇతడి రెమ్యునరేషన్ కి సంబంధించిన రూమర్స్ కొన్ని వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. ఫోటోలు వైరల్)ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. 5వ తరగతి చదువుతున్నాడు. ఓ వీడియో వల్ల వైరల్ అయిన ఇతడిని చూసిన అనిల్ రావిపూడి సినిమాలోకి తీసుకున్నాడు. సినిమా రిలీజ్ తర్వాత బుల్లిరాజుగా హీరో వెంకటేశ్ కంటే ఎక్కువ వైరల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్టు డిమాండ్ మామూలుగా లేదు.'సంక్రాంతి వస్తున్నాం' రిలీజైన దగ్గర నుంచి చాలా కథలు వింటున్నాడట. అదే టైంలో రోజుకి రూ.లక్ష రూపాయల రెమ్యునరేషన్(Remuneration) కూడా డిమాండ్ చేస్తున్నాడట. ఇంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఓకే అంటున్నారని సమాచారం. మరోవైపు అనిల్ రావిపూడి.. త్వరలో చిరంజీవితో తీయబోయే మూవీలోనూ బుల్లిరాజ్ అలియాస్ రేవంత్ ఉంటాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: స్కూటర్ కి దెయ్యం పడితే.. ఫన్నీగా 'టుక్ టుక్' ట్రైలర్) -
రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్?
హీరోయిన్ నయనతార (Nayanthara) ప్రస్తుతం సినిమాలు చాలావరకు తగ్గించేసింది. అడపాదడపా మాత్రమే చేస్తోంది. రీసెంట్ గానే తమిళంలో ఒకటి కమిటైంది. కానీ ఇప్పటికే నటిగా బోలెడంత పేరు, లెక్కలేనంత ఆస్తి సంపాదించుకుంది. ఇప్పుడు అలా తాను సంపాదించుకున్న డబ్బుతో కోట్ల ఖరీదు ఇల్లు కమ్ స్టూడియోని (Nayan New House)కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)దక్షిణాదిలో దాదాపు 15 ఏళ్లకు పైగా సినిమాలు చేస్తున్న నయన్.. రీసెంట్ టైంలో ఏదో ఒకలా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ అమ్మిన తన పెళ్లి వీడియో కోసం ఏకంగా హీరో ధనుష్(Dhanush)తోనే గొడవ పెట్టుకుంది. ఇదేమో రూ.10 కోట్ల పరువు నష్టం దావా వరకు వెళ్లింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చెన్నైలోని రజనీకాంత్, ధనుష్ తదితర సెలబ్రిటీలు నివసించే ఖరీదైన పోయెస్ గార్డెన్ ఏరియాలో ఇప్పుడు నయన్.. భర్తతో కలిసి కొత్తగా ఇల్లు కొనుగోలు చేసింది.మూడు అంతస్తులు ఉన్న ఈ ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టూడియో సెటప్, పైన ఇల్లుకు తగ్గట్లు డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్వయంగా నయన్ ఇన్ స్టాలోనే కనిపించాయి. చూస్తుంటేనే రాజసం ఉట్టిపడేలా 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు ఖరీదు రూ.100 కోట్లు ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. సాధారణంగా అక్కడ సాధారణమైన ఇల్లు రూ.2 కోట్ల ఖరీదు పలుకుతుంది. అలాంటి ఇంతలా సెటప్, ఇంటీరియర్ డిజైన్ చూస్తుంటే రూమర్స్ నిజమే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు) -
గత సినిమాలు డిజాస్టర్స్.. అయినా పూరీకి మరో ఛాన్స్?
ఇప్పుడంటే రాజమౌళి, సుకుమార్ అంటున్నారు. కానీ ఒకప్పుడు వీళ్లకంటే ఎక్కువగా కల్ట్ సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తనదైన మాస్ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్ అయిన ఇతడు.. ట్రెండ్ ని పట్టుకోలేక లైన్ తప్పేశాడు. పాన్ ఇండియా ట్రెండ్ వెనకాల పడ్డాడు గానీ భారీ డిజాస్టర్స్ మూటగట్టుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇతడికి ఓ తమిళ హీరో అవకాశమిచ్చాడట.(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)పూరీ జగన్నాథ్ అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అభిమానమే. కానీ అవే రొట్టకొట్టుడు మూవీస్ తీస్తూ తనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాడు. 2019లో 'ఇస్మార్ట్ శంకర్' హిట్ కావడంతో పూరీ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడేమో అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండతో 'లైగర్', రామ్ తో 'డబుల్ ఇస్మార్ట్' అని భారీ డిజాస్టర్స్ అందుకున్నాడు.దీంతో పూరీ పనైపోయింది, ఇక సినిమాలు తీస్తాడా లేదా అని చాలామంది అనుకున్నారు. మరోవైపు ఛార్మితోనూ కటిఫ్ చెప్పేశాడని రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ వినిపిస్తున్న టైంలో తమిళ హీరో విజయ్ సేతుపతికి పూరీ ఓ కథ చెప్పి ఒప్పించాడని, మిగతా విషయాలు ఫైనల్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో చూడాలి?(ఇదీ చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు) -
రాబిన్హుడ్లో డేవిడ్ వార్నర్.. లక్షల్లో కాదు కోట్లల్లో పారితోషికం!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner).. మైదానంలో ఎంత ఫేమస్సో, సోషల్ మీడియాలోనూ అంతే ఫేమస్.. టాలీవుడ్ చిత్రాల డైలాగులతో రీల్స్ చేస్తూ తెలుగువారి మనసు గెలుచుకున్నాడు. ఈసారి ఏకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. నితిన్ హీరోగా నటించిన రాబిన్హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించాడు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.కోట్ల పారితోషికం?అందులో వార్నర్.. షార్ట్ హెయిర్, కూల్ ఎక్స్ప్రెషన్స్తో వావ్ అనిపించాడు. ఇక పోస్టర్ రిలీజైనప్పటినుంచి ఈ దిగ్గజ క్రికెటర్ రాబిన్హుడ్ (Robinhood Movie)కు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. సినిమాలో నటించినందుకుగానూ రూ.3 కోట్లు తీసుకున్నాడట. ప్రమోషన్స్లో పాల్గొనేందుకు మరో రూ.1 కోటి అదనంగా అడిగాడట! ఇది విన్న అభిమానులు.. స్టార్ క్రికెటర్ అంటే ఆమాత్రం ఇచ్చుకోవాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: రైతు అంటేనే ఛీ అనేలా చేసిన వెధవ.. ఈ దొంగ రైతుబిడ్డ: అన్వేష్ ఫైర్)అప్పుడలా.. ఇప్పుడిలా.. గతంలోనూ వార్నర్ పారితోషికం (David Warner Remuneration for Robinhood) గురించి కొన్ని వార్తలు వెలువడ్డాయి. కేవలం సరదా కోసమే ఆయన ఈ పాత్ర ఎంచుకున్నారని, డబ్బు గురించి ఆలోచించలేదని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాతలు రూ.50 లక్షలను అతడికి అందించినట్లుగా ప్రస్తావించారు. ఇప్పుడేమో ఏకంగా రూ.4 కోట్లు తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. వార్నర్ స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు!సినిమారాబిన్హుడ్ సినిమా విషయానికి వస్తే.. భీష్మ వంటి హిట్ మూవీ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. శ్రీలీల కథానాయికగా నటించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు -
రామ్ చరణ్.. ఓ 'అద్దె ఆటగాడు'?
'గేమ్ ఛేంజర్' రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. వెంటనే దాన్నుంచి బయటకొచ్చిన మెగా ఫ్యాన్స్.. చరణ్ (Ram Charan) కొత్త మూవీ కోసం చాలా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా RC16 కథ ఇదేనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. 'ఉప్పెన' తర్వాత దర్శకుడు బుచ్చిబాబు చేస్తున్న సినిమా ఇది. 'పెద్ది' అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే వేగంగా షూటింగ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)స్పోర్ట్స్ డ్రామా స్టోరీ అని ఇదివరకే లీకైంది. ఇప్పుడు ఈ మూవీలో చరణ్.. అద్దె ఆటగాడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. అంటే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్.. ఇలా ఏ గేమ్ అయినా సరే ఎంతో కొంత డబ్బులిస్తే, వాళ్ల టీమ్ తరఫున ఆడతాడు. మరి నిజమా కాదా అనేది చూడాలి.కొన్నాళ్ల క్రితం మైసూరులో షూటింగ్ ప్రారంభం కాగా.. ఎక్కువగా రాత్రుళ్లు జరిగే సీన్స్ తీస్తున్నారు. రీసెంట్ గా క్రికెట్ సీన్స్ తెరకెక్కించారట. పెద్దగా గ్రాఫిక్స్ లాంటివి లేవని, దీంత వీలైనంత త్వరగా పనిపూర్తి చేసుకుని ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'కి వెళ్లకుండా ఉండాల్సింది.. ఏడేళ్లుగా బాధ: శిల్పా చక్రవర్తి) -
నాని టైమ్ నడుస్తోంది.. ఈసారి రూ.54 కోట్ల డీల్!
ఇండస్ట్రీలో ఏ హీరోకి అయినా హిట్ ఫ్లాప్స్ సాధారణం. కానీ గత కొన్నేళ్లుగా వరస సినిమాలతో విజయాల్ని అందుకుంటున్న హీరోల్లో నాని ఒకడు. ఓవైపు హీరోగా హిట్స్ కొడుతూనే మరోవైపు నిర్మాతగానూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నాడు. రీసెంట్ హిట్ 'కోర్ట్'.. నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిందే.(ఇదీ చదవండి: హీరోయిన్ అమలాపాల్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?)ప్రస్తుతం తెలుగులో చాలా సినిమాలకు ఓటీటీ డీల్స్ జరగట్లేదు. దీంతో ఫైనల్ కాపీ సిద్ధమైన విడుదలకు నోచుకోవట్లేదు. అదే టైంలో నాని సినిమాలకు మాత్రం రిలీజ్ కి చాలారోజుల ముందే ఓటీటీ డీల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. 'కోర్ట్'ని ఏకంగా రూ.8 కోట్లకు నెట్ ఫ్లిక్స్ తీసుకుందని టాక్.రీసెంట్ గా నాని హీరోగా 'ద ప్యారడైజ్' మూవీని ప్రకటించారు. దీని షూటింగ్ అసలు మొదలు కాలేదు కానీ ఓటీటీ డీల్ మాత్రం రూ.65 కోట్లకు జరిగిపోయిందట. నాని ఇప్పటికే పూర్తి చేసిన 'హిట్ 3' చిత్ర ఓటీటీ హక్కుల్ని ఇదివరకే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ప్రకటించారు. ఇకపోతే ఈ డీల్ రూ.54 కోట్ల జరిగిందని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో నాని టైమ్ నడుస్తోంది. పట్టిందల్లా బంగారమవుతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: హీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ) -
కోర్ట్, దిల్రూబా సినిమాలు వచ్చేవి ఆ ఓటీటీలోనే!
హోలి పండగ (మార్చి 14) రోజు తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. అదే కోర్ట్ (Court: State Vs a Nobody), దిల్రూబా (Dilruba Movie). కోర్ట్ చిత్రంలో రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, హర్షవర్ధన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. నాని సోదరి దీప్తి గంటా సహనిర్మాతగా వ్యవహరించారు. కోర్ట్ ఓటీటీ పార్ట్నర్ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దంటూ కోర్ట్ మూవీపై బలమైన నమ్మకం వ్యక్తపరిచాడు నాని. అతడి నమ్మకమే నిజమైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగైదు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.(కోర్ట్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)దిల్రూబా ఓటీటీ పార్ట్నర్క బ్లాక్బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దిల్రూబా. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ రన్ను బట్టి నెల రోజుల్లోనే దిల్రూబా ఆహాలోకి వచ్చే అవకాశం ఉంది.(దిల్రూబా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అయోధ్యలో మళ్లీ భూమి కొన్న బిగ్బీ.. ఈసారి పెద్ద మొత్తంలో..!
బిగ్బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అయోధ్యలో మరోసారి భూమి కొన్నారు. అయితే ఈసారి తను నిర్వహిస్తున్న హరివంశ్ రాయ్ బచ్చన్ ట్రస్ట్ కోసం ఈ భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. 54,454 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ల్యాండ్ను ఎంపిక చేసుకున్నారట. రామమందిరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి ఉంది. దీనికోసం ఆయన రూ.86 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తండ్రి హరివంశ్ రాయ్ గౌరవార్థం అక్కడ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.గతంలో కొన్న ప్లాట్ విలువ ఎంతంటే?అమితాబ్ గతేడాది జనవరిలో అయోధ్యలోని హవేలి అవధ్లో ప్లాట్ కొన్నారు. ఇందుకోసం దాదాపు రూ.4.54 కోట్లు వెచ్చించారు. ఈ ప్లాట్ కొనుగోలు చేసిన ప్రదేశానికి 10 నిమిషాల ప్రయాణ దూరంలో రామాలయం, 20 నిమిషాల దూరంలో అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది రిలీజైన కల్కి 2898 ఏడీ, వేట్టైయాన్ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. నెక్స్ట్ 'కౌన్ బనేగా కరోడ్ పతి 17'వ సీజన్కు వ్యాఖ్యాతగా వ్యహరించేందుకు రెడీ అవుతున్నారు.చదవండి: వద్దంటున్నా క్రికెటర్ చాహల్తో లింక్.. అసలెవరీ ఆర్జే మహ్వశ్? -
యంగ్ హీరోతో శ్రీలీల.. నిజమేనా?
ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. 2023-24లో వరస తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కాస్త గ్యాప్ తీసుకుంది. త్వరలో 'రాబిన్ హుడ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇది కాకుండా మరో హిందీ మూవీలోనూ నటిస్తోంది. ఇదంతా పక్కనబెడితే శ్రీలీలపై ఇప్పుడు డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి.తెలుగమ్మాయి అయిన శ్రీలీల.. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేస్తోంది. అయితే బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఈమె డేటింగ్ లో ఉందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత)ప్రస్తుతం శ్రీలీల-కార్తిక్ ఆర్యన్.. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సరే ఈ విషయం పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం కార్తిక్ ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ చేసుకుంటే శ్రీలీల అక్కడ కనిపించింది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకల్లో కార్తిక్ తల్లి కూడా వచ్చింది. ఎలాంటి కోడలు మీకు కావాలి అనే ప్రశ్నకు.. డాక్టర్ కోడలు అని చెప్పారు. ఈ క్రమంలోనే కార్తిక్ ఆర్యన్ తల్లి చెప్పిన కామెంట్, శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఉండటాన్ని లింక్ చేసి శ్రీలీల-కార్తిక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారని అనేస్తున్నారు. ఇది నిజమా అంటే చెప్పలేం. ఎందుకంటే బాలీవుడ్ ఇలాంటి గాసిప్స్ కావాలనే పుట్టిస్తారేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. శ్రీలీలది కూడా బహుశా ఇలాంటి రూమరే అయ్యిండొచ్చేమో?(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
సంతాన ప్రాప్తి కోసం కత్రినా కైఫ్ భక్తి మార్గం!
దేవుడు, పూజలు అనేవి చాలా పవిత్రమైనవి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎప్పుడో ఓసారి భక్తి మార్గంలోకి వెళ్తారు. అలా కొన్నాళ్లపాటు దేవాలయాలు, పూజలు అని చాలా బిజీ అయిపోతారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా అలానే చేస్తోంది.'ఛావా'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్కీ కౌశల్ ని.. కత్రినా కైఫ్ 2021లో పెళ్లి చేసుకుంది. వయసులో తన కంటే చిన్నవాడైనప్పటికీ కత్రినా అతడితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లి తర్వాత ఒకటి రెండు మూవీస్ చేసింది గానీ ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)కొన్నాళ్ల క్రితం కుంభమేళాలో పాల్గొన్న కత్రినా కైఫ్.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించింది. భక్తులకు ప్రసాదం కూడా పంచిపెట్టింది. ఇది జరిగిన ఎన్నిరోజులు కాలేదు ఇప్పుడు కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయంలో దర్శనమిచ్చింది. కుటుంబంతో కలిసి సర్ప సంస్కార పూజలో పాల్గొంది.అయితే కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతలు త్వరలో ఓ ఇంటివారవుతారని, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయించడం లాంటివి చూస్తుంటే పిల్లల కోసం గుళ్లు, గోపురాలు తిరిగేస్తూ భక్తి మార్గంలోకి వెళ్లిపోయిందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?) -
'కన్నప్ప'తో మంచు విష్ణు అంత రిస్క్ చేస్తారా?
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువొచ్చాయి. కానీ కొన్నాళ్ల ముందు విడుదల చేసిన మరో టీజర్ కి మాత్రం పర్లేదు బాగుందనే టాక్ వచ్చింది. దీనికి తోడు రెండు పాటలు కూడా వినసొంపుగా అనిపించాయి. ఇలా ఓ మాదిరి బజ్ ఏర్పడింది. ఇలా 'కన్నప్ప' గురించి కాస్తోకూస్తో అంచనాలు పెరుగుతున్న టైంలో మంచు విష్ణు రిస్క్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చాలా వాటి ఓటీటీ డీల్స్ ముందే పూర్తవుతున్నాయి. తద్వారా పెట్టిన బడ్జెట్ కొంతమేర రికవర్ చేయొచ్చనేది నిర్మాతల ప్లాన్.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)కానీ 'కన్నప్ప' విషయంలో మాత్రం మంచు విష్ణు రిస్క్ తీసుకోవాలని ఫిక్సయ్యాడట. మూవీ రిలీజ్ కి ముందు డీల్ కుదుర్చుకుంటే ఓటీటీలు ఇచ్చినంత తీసుకోవాలి. అదే రిలీజ్ తర్వాత మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే మనం డిమాండ్ చేయొచ్చని విష్ణు ప్లాన్ అట. మరి ఇందులో నిజమెంతో?కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారని టాక్. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?
గత కొన్నిరోజులుగా ప్రేక్షకుల మధ్య డిస్కషన్ కి కారణమైన మూవీ 'ఛావా'. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ పీరియాడికల్ సినిమాన ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీశారు. ఫిబ్రవరిలో హిందీ వెర్షన్, మార్చి తొలివారంలో తెలుగు వెర్షన్ రిలీజైంది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)హిందీలో ఎలా అయితే హిట్ టాక్ వచ్చిందో తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలి మూడు రోజులకే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శుక్రవారం వరకు కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి?సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే 'ఛావా' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి అంటే 11వ తేదీన అలా నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని సమాచారం. మరి దక్షిణాది భాషల్లోనూ డబ్ చేస్తారా లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్) -
SSMB29.. ఒక్క వీడియోకే కథ అల్లేస్తున్నారు!
రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా తీస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో జరుగుతోంది. అయితే చిత్రీకరణ జరుగుతున్న టైంలో రహస్యంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. దీన్ని చూసిన చాలామంది ఏకంగా కథ ఇదే అని కొన్ని చెప్పేస్తున్నారు.లీకైన వీడియోలో మహేశ్ బాబు నడుచుకుంటూ వస్తుండగా.. డిఫరెంట్ గా ఉండే వీల్ ఛైర్ లో పృథ్వీరాజ్ కూర్చుని ఉంటాడు. కాసేపటికి మహేశ్ ని మోకాళ్లపై కూర్చోబెడతారు. వీడియో ఇంతవరకే ఉంది. కానీ పలువురు నెటిజన్స్ మాత్రం కథ ఏమై ఉంటుందా అని చెప్పి అల్లేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?)పృథ్వీరాజ్ ఏదో నిధి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే నడవలేని స్థితికి వెళ్తాడని.. దీంతో మహేశ్ బాబుని ఆ నిధి వెతికేందుకు ఒప్పిస్తాడని.. ఇలా నోటికొచ్చినదంతా మాట్లాడుతూ సోషల్ మీడియాలో డిస్కషన్లు పెట్టేస్తున్నారు. ఇది నిజమా కాదా అనే సంగతి పక్కనబెడితే సినిమా మాత్రం జంగిల్ అడ్వెంచర్ అని మాత్రం తెలుసు.రూ.1000 కోట్ల వరకు బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నారని.. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుగుతోందని.. త్వరలో వైజాగ్, శ్రీలంక, కెన్యా తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుందని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?
ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలున్నాయి. ప్రస్తుతానికైతే రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులు చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చేస్తాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2.. ఇలా చాలానే ఉన్నాయి.ఇవి సరిపోవంటూ ఈ మధ్యే 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మతోనూ ప్రభాస్ సినిమా ఒకటి ఓకే అయింది. దీని లుక్ టెస్ట్ కూడా అయిపోయిందని టాక్. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది. 'బక' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు)టైటిల్ చూడగానే మీకు కూడా విచిత్రంగా ధ్వనించి ఉంటుంది. అయితే మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడుగా. అతడి కథనే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు ప్రశాంత్ వర్మ రాశాడని, అందుకే సింపుల్ గా 'బక' అని పెట్టినట్లు తెలుస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.ఇప్పటివరకు వచ్చిన పౌరాణిక, మైథలాజికల్ సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భిన్నంగా ఉంటుందని, పూర్తిగా విజువల్ ఎఫెక్ట్ బేస్డ్ చిత్రమని అంటున్నారు. అలానే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా అని టాక్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
కష్టాల 'రాజాసాబ్'.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ (Prabhas) చేస్తున్న వాటిలో కాస్త తక్కువ బజ్ ఉన్న సినిమా అంటే 'రాజాసాబ్'.(The Rajasaab Movie) ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు తొలుత డార్లింగ్ ఫ్యాన్స్ వద్దన్నారు. కానీ తర్వాత వచ్చిన కొంత కంటెంట్ చూసి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు.దర్శకుడు మారుతి.. హారర్ కామెడీ కథతో తీస్తున్న మూవీ 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈ ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో, ఇదిగో వచ్చేస్తుందని అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పట్లేదు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)మరోవైపు ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యమవుతూనే ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే 'రాజాసాబ్' లేట్ అవుతుందని అనుకుంటున్నారు.ఇవన్నీ పక్కనబెడితే ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్దపనే ఉందని అంటున్నారు. అలానే ఈ ఏడాది రాబోయే పండగల కోసం కొత్త మూవీస్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాయి. ఇలా ఇన్ని కష్టాలు పడుతున్న 'రాజాసాబ్'.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదంటే వచ్చే ఏడాది పడుతుందా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్
మిల్కీ బ్యూటీ, హీరోయిన్ తమన్నాకి బ్రేకప్ అయిందట. గత కొన్నేళ్లుగా సహనటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని రహస్యంగా ఏం ఉంచలేదు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కలిసి సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోయారని తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.ముంబై ముద్దుగుమ్మ తమన్నా.. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. హ్యాపీడేస్, ఆవారా, 100% లవ్, బాహుబలి తదితర చిత్రాల్లో నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా హిందీలోనూ మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)అలా 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ చేస్తున్న టైంలో తమన్నా-విజయ్ వర్మ మధ్య ఏదో ఉందనే రూమర్స్ వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా గోవాలో ఓ న్యూఇయర్ పార్టీలో వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ సిరీస్ లో కెమిస్ట్రీ కూడా తెగ వర్కౌట్ అయింది.ఆ తర్వాత నుంచి గత రెండు మూడేళ్లుగా జంట పక్షుల్లా తమన్నా-విజయ్ వర్మ ఎక్కడపడితే అక్కడ కనిపించారు. అలాంటిది కొన్నివారాల క్రితం వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడేమో బ్రేకప్ అని షాకిచ్చారు. రీసెంట్ టైంలో తమన్నా బయట ఒంటరిగానే కనిపిస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ బ్రేకప్ వార్త నిజమేనేమో అనే సందేహం వస్తోంది. అలానే విడిపోవడానికి కారణం కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు) -
కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ప్రభాస్ సరసన 'సాహో'లో హీరోయిన్ గా చేసింది. అయితే శ్రద్ధా ఎంతో ప్రేమతో బహుమతిగా ఇచ్చిన ఇంటి ఈమె తండ్రి ఏకంగా కోట్ల రూపాయలకు అమ్మేశాడు. బాలీవుడ్ సర్కిల్ లో ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: దిగ్గజ హీరో శివాజీ గణేశన్ ఇల్లు జప్తు.. హైకోర్ట్ సంచలన ఆదేశం)బాలీవుడ్ సెలబ్రిటీలు ఓవైపు నటిస్తూనే రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. అంటే ఓ బంగ్లా లేదంటే అపార్ట్ మెంట్ కొనడం, కొన్నిరోజుల తర్వాత దాన్ని లక్షలు లేదంటే కోట్ల రూపాయల లాభానికి అమ్మడం లాంటివి చేస్తుంటారు. అమితాబ్ ఈ విషయంలో ముందుంటాడు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడేమో?ఎందుకంటే కొన్నాళ్ల క్రితం శ్రద్ధా కపూర్.. ముంబైలోని జుహూ ప్రాంతంలో సిల్వర్ బీచ్ హెవెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓ అపార్ట్ మెంట్ ని బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు దీన్నే రూ.6.11 కోట్లకు శక్తి కపూర్ విక్రయించారట. మూడు నెలల క్రితమే అంటే డిసెంబరులోనే ఈ డీల్ జరిగిపోయింది. ఇది జరిగిన కొన్నిరోజులకే పిరమాల్ మహాలక్ష్మి సౌత్ టవర్ లో మరో అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. మరి ఇదెప్పుడో అమ్మేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)